Judiciary
-
ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు: హైకోర్టు
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమపై బాధ్యత లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంది. అందుకు తాము ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో తెలియదని, అందువల్ల కమిటీ నివేదిక కోసం వేచి చూడటం మంచిదని పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు విషయంలో అభిప్రాయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి గత ఏడాది నవంబర్ 20న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ కర్నూలులో భవనాలను పరిశీలించనుందని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుంది విచారణ మొదలు కాగానే ధర్మాసనం స్పందిస్తూ, బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా? లేదా? దేశంలో పలు చోట్ల హైకోర్టు బెంచ్ల ఏర్పాటు ఎలా జరిగింది? అందుకు అనుసరించిన విధి విధానాలు ఏమిటి? వంటి అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంది. క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక ఆ నివేదికపై న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్కోర్టులో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవేళ కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే, దానిని సవాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ దృష్ట్యా పిల్ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కమిటీ నివేదిక తర్వాత సవాలు చేసుకోవాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆప్షన్ ఇచ్చింది. అయితే యోగేష్ తమ పిల్ను పెండింగ్లో ఉంచాలని పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి దాఖలు చేసిన పిల్ను కూడా యోగేష్ తదితరుల పిల్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అమరావతి రాజధాని విషయంలో ఇదే హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని, ఆ తీర్పును పరిశీలించాలని యోగేష్ కోరగా, తాము ఇప్పుడు పరిశీలించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
రెడ్బుక్పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్ను రాజస్థాన్కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశ్వబంధు భారత్కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్సభ స్పీకర్ సూచించారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్లు అను కున్నంత కాలం లాకప్లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
అపవాదు వేస్తారా?
న్యూఢిల్లీ: బెంగాల్ న్యాయవ్యవస్థ మీద అపవాదులు మోపడం సరికాదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని మందలించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులను బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ గత డిసెంబరులో కోరింది. ‘‘లేదంటే సాక్షులను భయపెట్టే అవకాశముంది. బెంగాల్ కోర్టులలో శత్రుత్వభావంతో కూడిన వాతావరణం నెలకొంది’’ అని పేర్కొంది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసుల బదిలీకి ఇదేం ప్రాతిపదిక? మొత్తం న్యాయవ్యవస్థపైనే అపవాదు వేస్తారా? బెంగాల్ కోర్టులన్నింటిలోనూ విరో«ధభావం నెలకొందన్నట్లుగా చూపుతున్నారు. ఒక రాష్ట్రంలోని న్యాయమూర్తులను సీబీఐ అధికారులు ఇష్టపడనంత మాత్రాన మొత్తం న్యాయవ్యవస్థే పనిచేయడం లేదనకండి. జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు, సెషన్స్ జడ్జిలు తమను తాము సమరి్థంచుకోవడానికి సుప్రీంకోర్టు దాకా రాలేరు’’ అని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొంది. పిటిషన్లో వాడిన పదజాలాన్ని ఆయన సమరి్థంచుకోనే ప్రయత్నం చేశారు. కోర్టులపై అపవాదు వేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొంటూ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. -
మన సమస్యకు మనమే పరిష్కర్తలం!
అరుదుగానైనా సరే, తలలు కూలుతున్న శబ్దం మధురంగా వినిపిస్తుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలపై ప్రబలంగా జరుగుతున్న లైంగిక, ఇతర వేధింపులపై సంచలన నివేదిక విస్ఫోటనం తర్వాత మొదటి వేటు నటుడు సిద్ధిక్, నిర్మాత రంజిత్లపై పడింది. సిద్ధిక్పై లైంగికదాడి అభియోగాలు మోపారు. ఇకపోతే సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.కొందరు దీనిని మలయాళ చిత్రపరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమంగా అభి వర్ణిస్తున్నారు. కచ్చితంగా, మాలీవుడ్లో మహిళల పని పరిస్థితులపై జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత నెలకొన్న సంఘటనలు పరిశ్రమ నియంత్రణను దాటిపోయాయి. 2019 డిసెంబరు నుండి నివేదికను తొక్కిపట్టి ఉంచిన పినరయి విజయన్ ప్రభుత్వం కూడా ఈ నివేదిక పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.కోల్కతాలో ట్రెయినీ డాక్టర్ ఘోర హత్యాచారంపై చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలకు ప్రతిస్పందనగా కొచ్చిలో రణగొణధ్వనులు వినిపిస్తున్నప్పుడు మనం ఒక పెను మార్పు మలుపులో ఉన్నాము. బద్లాపూర్(మహారాష్ట్ర)లో ప్రజల ఆగ్రహం బాంబే హైకోర్టు విచారణకు దారితీసినప్పుడు, అబ్బాయిల లింగపరమైన సున్నితత్వంతో సహా కొన్ని సూచనలు చేయమని హైకోర్టు ఒక కమిటీని కోరింది.ఇదంతా స్వాగతించదగినదే. అయితే ఇదంతా మనం ఇంతకు ముందే విన్నాం. 2018లో, భారత దేశంలో మీ టూ ఉద్యమం సమయంలో, లైంగిక దాడి ఆరోపణలు తగ్గుముఖం పట్టడంతో మనం ఒక అవకాశాన్ని కోల్పోయాము అని ఉద్యమకారులు అంటారు. ఎందుకంటే ఆరోపణలకు సంబంధించి పెద్ద్ద పేర్లు ఎన్నడూ బయటపడలేదు. దానికి తోడుగా,లైంగిక దాడి గురించి మాట్లాడిన వారిపై క్రిమినల్ పరువు నష్టం దావాలు తీవ్ర ప్రభావం చూపాయి.2013లో, మగవారి మనస్తత్వాలను మార్చే పనిపై గట్టిగా కృషి చేయకుండా, కఠినమైన చట్టాన్ని ఆమోదించడం ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందని భావించిన ప్పుడు మనం మళ్లీ పోరాటాన్ని కోల్పోయాము. ఇప్పుడు మనకు మరో అవకాశం వచ్చింది. కానీ తరువాత ఏమి జరుగుతుందనేది ‘మన’పైనే ఆధార పడి ఉంటుంది. లైంగిక ఆరోపణలకు గురైన వారి సినిమాలను ప్రేక్షకుల్లోని ‘మన’వారే విమర్శనారహి తంగా ఆబగా చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి నోరెత్తే వారిని ట్రోల్ చేసి బెదిరించేవారు కూడా సోషల్ మీడియాలోని ’మన’వారే. శక్తిమంతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే మహిళలను చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉన్న ‘మన’వారు కష్టపెడుతున్నారు. చలనచిత్ర విడుదలకు సంబంధించి సమయానుకూలంగా పీఆర్–ఆధారిత సమాచారాన్ని అందజేసే మీడియాలోని ‘మన’వారు జర్నలిజానికి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలు వేటినీ అడగరు.మాట్లాడేవారు ఒంటరిగా లేరని తెలిసేలా, నిజం చెప్పే భారం మహిళలపై మాత్రమే పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ‘మన’పైనే ఉంది. అలాగే మహిళ లను లైంగికంగా వేటాడేవారిని జాతీయ చర్చల నుండి, బాక్సాఫీస్ నుండి, సాహిత్య వేడుకల నుండి మాత్రమే కాకుండా మన డ్రాయింగ్ రూముల్లో చర్చల నుండి కూడా దూరంగా ఉంచాలి. కోల్కతాలోని వైద్యులకు ఆగ్రహించే హక్కు ఉంది. అయితే నిరసనలు రాజకీయ రంగు పులు ముకున్నాయి. లైంగికదాడి చేసిన వారిని నెలాఖరులోగా ఉరిశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన ప్రకటనలు పరిష్కా రాన్ని కనుగొనే లక్ష్యంతో కాకుండా, ప్రజల ఆగ్రహాన్ని చల్లబర్చడం కోసమే చేసినట్లున్నాయి.తెగులు లేదా కుళ్లు అనేది వ్యవస్థాగతంగా ఉన్నప్పుడు, దానికి పరిష్కారం అనేది ‘ఇక్కడో రాజీనామా’, ‘అక్కడో కమిటీ ఏర్పాటు’ వంటి రూపాల్లో పాక్షికంగా, అవ్యవస్థీకృతంగా ఉండకూడదు. లైంగిక వేధింపులకు మనం ప్రత్యేకమైన, భిన్నమైన నేరాలుగా ప్రతిస్పందించడం మానేయాలి. మహిళలకు వ్యతిరేకంగా అసమానమైన శక్తి కొనసాగిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా వీటిని చూడాలి.మనకు అసమానతలపై పోరాడే ఉద్యమం అవసరం: బహిరంగ ప్రదేశాల్లో, పార్లమెంటులో, పోలీసు స్టేషన్లలో, పని ప్రదేశాల్లో, న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు భాగం కావలసి ఉంది. సోదరీమణులు, కుమార్తెలుగా మాత్రమే ఉండిపోకుండా, మనం సమాన పౌరులం అనే ఆలోచనను సాధారణీకరించాల్సి ఉంది. మనకు ప్రస్తుతం ఒక అవకాశం ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం మనపైనే ఉంది. వ్యాసకర్త జెండర్ అంశాల రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
నాగ్పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది. ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్పూర్లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇదీచదవండి.. అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరి బలి -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
నేర విచారణ ప్రక్రియ ఇలా...
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్ అఫెన్స్లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్–కాగ్నిజబుల్ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్ కంప్లైట్ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది. ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్ఐ ఆర్లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి. అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్ బాండ్స్ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్లోని (సీఆర్పీసీ) సెక్షన్ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపిస్తారు. కేవలం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్ రిమాండ్ను మేజిస్ట్రేట్ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్ రిమాండ్ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు. కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్ సర్టిఫికెట్ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు. అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు. ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్ న్యాయమూర్తి ట్రయల్ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్ ఇచ్చి ఫైల్ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్షీట్ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్షీట్తో పాటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్ను ఉచితంగా అందిస్తారు. ఈ తర్వాత హియరింగ్ డేట్ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్షీట్లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్ ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్ ఫ్రేమింగ్ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్ నిర్వహిస్తారు. కేసు ట్రయల్ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్ 313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్ ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు. – జస్టిస్ జి. కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు. -
కింది కోర్టుల లాయర్లనూ హైకోర్టు జడ్జిలుగా నియమించాలి
సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు. దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్పుత్ వర్గానికి చెందిన ఆనంద్లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్పూర్లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్హర్ లోక్సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?!
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?! -
న్యాయ వ్యవస్థకు బాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: కోర్టులను కూడా మేనేజ్ చెయ్యొచ్చంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేత చుండూరు సుందర రామశర్మ డిమాండు చేశారు. టీడీపీ అధినేతకు శవ రాజకీయాలు చేయడం బాగా ఆలవాటని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థలో గౌరవప్రదమైన వ్యక్తి నిరంజన్రెడ్డి అని.. అలాంటి ఆయనపైనా చంద్రబాబు హేయంగా విమర్శలు చేశారన్నారు. కోర్టులను కూడా ప్రభావితం చేస్తారని చంద్రబాబు అంటున్నారంటే అది బాబుకు ఎంత అలవాటో తెలుస్తోందన్నారు. రామశర్మ ఇంకా ఏమన్నారంటే.. తీవ్ర నిరాశ, నిస్పృహలో బాబు మతితప్పి మాట్లాడుతున్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులపైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యవస్థపైనా చంద్రబాబుకు గౌరవంలేదు. ఎంపీలపై చేసిన విమర్శలను వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఎంపీలు బ్రోకర్లా? ఏమిటా మాటలు? నిజానికి.. ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు ఆ రోజు ఏ విధంగా వ్యవహరించాడో అందరూ చూశారు. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు చూశాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా దిగజారి వ్యవహరించాడు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేసి పబ్బం గడుపుకోవడమే ఆయనకు బాగా తెలుసు. పార్లమెంటు, అసెంబ్లీ దేవాలయాలు లాంటివి. వాటికి ఎన్నికయ్యే వారిని గౌరవించాలి. కానీ, రాజ్యసభకు ఎన్నికైన వారిని చంద్రబాబు బ్రోకర్లు అంటున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటివరకు చేసిన పనులు చూస్తే అసలు బ్రోకర్ ఎవరో తెలుస్తుంది. పాదయాత్ర ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు ఇక లోకేశ్ది పాదయాత్ర కాదు.. అది ఒక బూతుమాటల యాత్ర. తన తండ్రిపైనా, ఎల్లో మీడియాపైనా ఆక్రోశంగా ఉన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్పై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ అడుగులు వేయలేకపోతున్నారు. త్వరగా ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబూ అందుకు ఎదురుచూస్తున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ అదే అభిప్రాయం ఉంది. మరోవైపు.. ఎంపీల ఎంపికలో సామాజిక న్యాయం పాటించిన పార్టీ వైఎస్సార్సీపీనే. పరిమళ్ నత్వానీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం జగన్ భావించి ఆయనను రాజ్యసభకు పంపించారు. కానీ, చంద్రబాబు మాదిరిగా డబ్బులు తీసుకోలేదు. అలాగే, మా పార్టీ నుంచి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే, వారిలో నలుగురు బీసీలు. మరి నువ్వెప్పుడైనా అలా బీసీలకు పదవులు ఇచ్చావా చంద్రబాబూ? వర్ల రామయ్యకు మొండిచెయ్యి చూపించావు. అదే నీకు, వైఎస్ జగన్కు ఉన్న తేడా? అన్ని కులాల వారు బాబు నైజం తెలుసుకున్నారు. -
'దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. ఆయన చెప్పిందే వేదం..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. 'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
కేంద్రం తీరు ఆందోళనకరం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు జరిగాయి. కొలీజియం సిఫార్సుల ఆమోదంలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్ను కేంద్రం పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఆర్.ఎల్.ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కూడా కేంద్రం తిప్పి పంపుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా ఇది ఆందోళనకరమని పేర్కొంది. ‘‘ఇటీవల ఇలా పలు సిఫార్సులను రెండోసారీ తిప్పి పంపారు. పెండింగ్లో ఉన్న 22 పేర్లను కూడా వెనక్కు పంపారు. ఇంకా చాలా పేర్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ సిఫార్సులపై కేంద్రానికి సొంత అభిప్రాయాలేవైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఎటూ తేల్చకుండా అట్టిపెట్టుకోజాలదు. తప్పుగానో, ఒప్పుగానో ఈ అంశాన్ని తేల్చాల్సిందే. కేంద్రం కావాలంటే కొలీజియం సిఫార్సులపై తన అభిప్రాయాలను మాకు పంపొచ్చు. వాటిని మేం పరిశీలిస్తాం. ఆ మీదట వాటిని పక్కన పెట్టడమో, తిరిగి సిఫార్సు చేయడమో చేస్తాం. కానీ ఒక పేరును కొలీజియం రెండోసారి కేంద్రానికి సిఫార్సు చేసిందంటే ప్రస్తుత నిబంధనల మేరకు సదరు నియామకాన్ని ఆపడానికి వీల్లేదు’’ అని గుర్తు చేసింది. కొలీజియం సిఫార్సులను సుదీర్ఘ కాలం పెండింగులో పెడుతుండటం వల్ల ప్రతిభావంతులైన పలువురు తమకు జడ్జి పదవే వద్దంటూ తప్పుకుంటున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను మూడు నాలుగు వారాల్లోపు కేంద్రం ఆమోదించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 20న పొందుపరిచిన టైం లైన్లో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను కూడా కేంద్రం దీర్ఘకాలం పాటు పెండింగ్లో పెట్టడం చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘కొంతకాలం క్రితం 10 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. అయినా మా సిఫార్సుల్లో రెండింటిని గత సెప్టెంబర్లో, మిగతా వాటిని నవంబర్ చివర్లో ఆమోదించింది! ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపుతోంది. న్యాయ వ్యవస్థ, కేంద్రం కాకుండా ఎవరో మూడో శక్తి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగిస్తోంది’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘ప్రతి వ్యవస్థలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక న్యాయమూర్తి బదిలీకి సిఫార్సు చేసేముందు కొలీజియం నిర్దిష్ట ప్రక్రియను తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అవసరమైన వారినుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఆ తర్వాతే సిఫార్సు చేస్తుంది’’ అని చెప్పారు. కొన్నిసార్లు కేంద్రం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కొలీజియమే తాను సిఫార్సు చేసిన పలు పేర్లను వెనక్కు తీసుకుందని గుర్తు చేశారు. ముగ్గురిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, ఐదుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం చేసిన సిఫార్సుల విషయం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిని కేంద్రం పరిశీలిస్తోందని, స్పందించేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి బదులిచ్చారు. ‘‘దీనిపై నిర్ణయానికి సమయమెందుకు? వారిప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీనియర్ న్యాయమూర్తులు’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘పలు హైకోర్టుల్లో సీజే పదవులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మేం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గానీ వీటిపై మేం నిర్ణయం తీసుకోలేం’’ అంటూ విచారం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సుల పరిశీలనలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్కు కట్టుబడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఏజీ పేర్కొన్నారు. హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో 44 పేర్ల పరిశీలన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలై, పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపేసి, విచారణ నిమిత్తం తమకే బదిలీ చేసుకుంది. ఈ పిటిషన్లపై స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఫిబ్రవరి 15లోగా ఉమ్మడి వివరణ ఇవ్వాలని సూచించింది. మార్చి 13న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. -
ఆ వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. న్యాయ వ్యవస్థపై సోనియా ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీంతో సభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ తివాయ్, సహచర సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. "లోక్సభ సభ్యురాలు సోనియా గాంధీ బయట మాట్లాడిన అంశాన్ని రాజ్యసభలో చర్చించకూడదు. ఒకవేళ వ్యాఖ్యానిస్తే దురదృష్టకరం ఇలా ఎప్పుడూ జరగలేదు. దయచేసి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి లేదా వెనక్కి తీసుకోండి లేదంటే ఒక చెడ్డ ఉదాహరణగా నిలుస్తుందంటూ కాంగ్రెస్ నేతలు రాజ్యసభ చైర్మన్ని అభ్యర్థించారు తాను సోనియా వ్యాఖ్యలకు ప్రతిస్పందించకపోతే తాను చేసిన ప్రమాణాన్ని ఒమ్ము చేసి రాజ్యంగా బాధ్యతలో విఫలమైనట్లేనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయన్నారు. తాను సరైన విధంగా స్పందించనట్లయితే పాలక పక్ష పార్టీని కించపరిచేలా తప్పుడూ పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. అంతేగాదు న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధంగా మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడనట్లేనని నొక్కి చెప్పారు. ఈ పక్షపాత పోరును అంతర్లీనంగంగా పరిష్కరించుకోవాలని అన్నారు. (చదవండి: పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్సభ ఐదుసార్లు వాయిదా) -
సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచి
వరంగల్ లీగల్: దేశ ఆర్థిక, సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచిగా నిలుస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జ్యూడీషియరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస కేసుల్లో బాధితులకు ఆర్థిక, శారీరక ఉపశమన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధితులను భవిష్యత్ పౌరులుగా సమాజంలో భాగస్వాములను చేసే దిశగా బాలల హక్కుల పరి రక్షణ కోసం పని చేసే అన్ని వర్గాలు దృష్టి సారించా లని పిలుపు నిచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గ్ర హీత కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులు, బంధువులు, పరిచ య స్తుల ద్వారానే అత్యధిక శాతం జరుగుతున్నా య న్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విస్తరించడం ద్వా రా బాధితులకు సత్వర న్యాయం అందించగలు గుతామని చెప్పారు. వరంగల్ పోక్సో కోర్టు ఈ దిశ గా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్ర మంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కు మార్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణ మూర్తి, వ రంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీ వ్గాంధీ హన్మంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన య్భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనంద్మోహన్, శ్రీనివాస్గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు జనార్దన్, జయాకర్, ఇతర న్యా యమూర్తులు, లాయర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సామాన్యులకు వెలుగు రేఖ పద్మనాభరెడ్డి
విశాఖ లీగల్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, దివంగత సి.పద్మనాభరెడ్డి సామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖగా నిలిచారని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా తన తండ్రి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల గురించి వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించే తీరు చాలా ముఖ్యమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన అంశాలు, చట్టాల గురించి వివరించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. చట్టం అందరికీ సమానమేనన్నారు. మహిళల చట్టాలు సమర్థవంతంగా అమలు జరగాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్.. ఎన్నికల నేరాలు, తప్పుడు హామీలు తదితరాల గురించి వివరించారు. పద్మనాభరెడ్డి భారత న్యాయవ్యవస్థకు కరదీపిక అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మథరావు మాట్లాడుతూ.. పద్మనాభరెడ్డి 60 వేలకు పైగా కేసులను వాదించారని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ బి.శ్యామ్సుందర్ మాట్లాడుతూ.. సత్వర న్యాయం పొందాలంటే.. కేసు దాఖలు చేసే సమయంలో సీనియర్ల సలహాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.నగేష్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షుడు సురేశ్కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి ప్రభాకర్, ముప్పాళ్ల సుబ్బారావు, చెలసాని అజయ్కుమార్, వి.చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించడం చిన్న విషయమేమీ కాదని.. ఇలాంటి పద్ధతులు కొనసాగితే దేశంలో ఉద్రిక్తతలు, హింస తలెత్తి.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గాలను అడ్డుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు చావాల్సి వస్తే.. అందుకు సిద్ధమని, ప్రాణాలు ఇచ్చి పోరాడుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని సింగిల్ కేసుగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం సహా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, సంస్థలకు ఆధారాలు పంపిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ఘటనపై సీఎం కేసీఆర్ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రగతిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజానికి రెండు రోజుల క్రితమే మీడియా ముందుకు రావాలనుకున్నానని.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లాభం కోసం చేశారనే చిల్లర ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతో పోలింగ్ ముగిసే వరకు వేచి చూశానని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మొదటిసారి భారమైన మనసుతో, దుఃఖంతో చెప్తున్నా.. పదవులున్నా లేకున్నా 40, 50 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఈ దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దేశంలో దుర్మార్గంగా, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం దేశ పునాదులకే ప్రమాదకరం. ఊహకు కూడా అందే పరిస్థితి లేనందునే షాక్తో మాట్లాడుతున్నా. న్యాయవ్యవస్థకు చేతులు జోడిస్తున్నా.. గతంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినపుడు న్యాయవ్యవస్థ గొప్ప పాత్ర పోషించింది. ఇప్పుడు దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లను చేతులు జోడించి కోరుతున్నాను. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలను దేశంలోని సీబీఐ, ఈడీ, సీవీసీతోపాటు అన్ని ప్రముఖ జాతీయ, మీడియా సంస్థలకు శుక్రవారం మధ్యాహ్నంలోగా చేరవేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులకు కూడా పంపిస్తున్నాం. రాజ్యాంగేతర శక్తుల చేతిలో దేశం కర్ణాటక ఎమ్మెల్యేలకు మారువేషాలు వేసి తీసుకెళ్లిన తీరును నిందితులు పూసగుచ్చినట్టు చెప్పారు. ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదని చెప్పారు. భారతదేశం రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ఉన్నట్టు వీరి మాటల ద్వారా వెల్లడవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఉన్న దొంగల ముఠా వీర విహారాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చెదలను నిర్మూలించాల్సి ఉంది. మన రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా. నెల రోజుల ముందు నుంచే రామచంద్రభారతి అనే వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో మొదట ఫోన్లో, తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంతో వాళ్ల ప్రణాళిక అర్థమైంది. విచారణ జరపాలని హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఠాలోని వారికి రెండు మూడు ఆధార్లు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఈడీ, ఐటీ సంస్థలతోపాటు వై ప్లస్ భద్రత కల్పిస్తామని రాజ్యాంగేతర శక్తులు చెప్పడం చూస్తే దేశంలో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. ఈ ముఠాలో 24 మంది ఉండగా వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరు వివరాలు ఉన్నాయి. కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ మీద బీజేపీ టికెట్తో పోటీ చేసిన తుషార్ అనే వ్యక్తితో బ్రోకర్లు మాట్లాడారు. తుషార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే. ఈ దురాఘాతాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి ఎనిమిదేళ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. దేశాన్ని విభజించేలా క్రూర పద్ధతుల్లో ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూసి బాధపడుతున్నా. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చి బలహీనపర్చే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ దేశంలో జరుగుతున్న ఈ దురాఘాతాలను తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత నాటి ప్రధాని ఇందిరకు ఎదురేలేదని భావిస్తున్న తరుణంలో ఎమర్జెన్సీ విధింపు, ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమంలో ప్రజలు ఎలా స్పందించారో తెలుసు. ఏళ్లపాటు నిర్బంధం ఎదుర్కొన్న మాలవ్యా, పాశ్వాన్, దండావతే వంటి నేతలు లక్షల మెజారిటీతో గెలిచారు. తద్వారా ప్రజాస్వామ్యానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమని ప్రజలు నిరూపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం మేం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే విలీనం చేసుకున్నాం. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. కానీ కొందరు మునుగోడు ఉప ఎన్నికలో వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నన్ను కలిశారనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవించాలి. ఎన్నికల సంఘం, సీఈవో ఫెయిల్ అంటూ కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో మేం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఇంత హేయంగా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రజాస్వామ్య మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పట్ల కూడా వారికి గౌరవం లేదు.’’ చూస్తూ ఊరుకోబోం మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని చెప్పి మా రాజధానిలో వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకుని కూర్చుని, అరాచకాలను భరించాలా? చూస్తూ ఊరుకోబోం.. పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం. ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడాం. నాలుగింట మూడింతల మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూల్చేయాలనే కుటిల రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మోదీ.. ఈ దుర్మార్గాలను ఆపండి ప్రధాని మోదీ గారూ.. నేను మీ రాజకీయ సహచరుడిని. మీరు ప్రధానమంత్రి అయినప్పుడే నేను ముఖ్యమంత్రిని. ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకేం కావాలి? మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోండి. చరిత్రలో గుర్తింపు పొందండి. స్వయంగా అడుగు ముందుకేసి ఈ దుర్మార్గంలో పాత్ర కలిగిన వారందరినీ అరెస్టు చేయించండి. దర్యాప్తు చేయించండి. అలాకాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ద్వారా, ప్రభుత్వాలను కూల్చడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గాలను ఆపండి. ఇలా చేయడం దేశానికి, మీకు మంచిది కాదు. దేశచరిత్రలో మీ స్థానం దిగజారిపోతుంది. ఎంత శక్తివంతుడైనా వందేళ్లకు మించి బతకరు. ఎందుకు చెడ్డ పనులు చేయాలి? దీనికి ఫుల్స్టాప్ పడాలి. పట్టపగలు మీ పేరు, మీ హోంమంత్రి పేరు చెప్పి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి కళ్లెం వేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి కళంకం తీసుకురాకండి. అమిత్షా పేరు 20సార్లు చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దాగిన భయంకరమైన దగా, కుట్రలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది. వారు 20సార్లు అమిత్షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టానని పసుపు పచ్చ బట్టలాయన (సింహయాజీ) చెప్పారు. ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, మరో నాలుగు కూల్చే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ, ఢిల్లీలలో బేరాలు అయిపోయాయి. తర్వాత ఆంధ్ర, రాజస్థాన్లలో ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పారు. వెంటనే ఢిల్లీ సీఎంను అప్రమత్తం చేశాం. ఇది రాజకీయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వాలు కూలిన చోట మౌనం పాటించారు కాబట్టే ఈ దుర్మార్గ ముఠా ఆగడాలు చెల్లుబాటయ్యాయి. కానీ చైతన్యవంతమైన తెలంగాణ ఈ ముఠా ఆట కట్టించి వారి చర్యలను బయటకు తెచ్చింది. మేధావులు, యువత మౌనం వీడాలి బీజేపీ ఒళ్లు మరిచి చేస్తున్న అరాచక కాండ జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని స్వయంగా దేశ ప్రధాని చెప్పడం దేనికి సంకేతం? నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దేశ హోంమంత్రి చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్త కంఠంతో ఖండించకపోతే దేశం ఉనికి, ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతుంది. ఒకసారి దేశం దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతుంది. మఠాధిపతులు వేషాలు, రూపాలు మార్చి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఆ పరిస్థితులు మారాలి. రాబోయే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ్ తరహాలో జరిగే ఉద్యమాలకు యువత, విద్యార్థులు, మేధావులు మౌనం వీడి మద్దతునివ్వాలి. 2015 నుంచి వారి కాల్డేటా తీశారు బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభపర్చే కుట్రలో పాల్గొన్న మధ్యవర్తుల ఫోన్లను పోలీసులు సీజ్ చేసిన తర్వాత వారి కుట్ర కోణమంతా బయటపడింది. 2015 నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం జరిగిందో వీళ్ల చరిత్ర ఏందో మొత్తం బయటపడింది. పోలీసులు కాల్డేటాను, ల్యాప్టాప్లలోని డేటాను తీశారు. మూడు గంటల వీడియోలో కుట్ర బహిర్గతమైంది. మొత్తం డేటాను ఉన్నదున్నట్టు హైకోర్టుకు సమర్పించారు. 70వేల నుంచి 80 వేల పేజీలు అయింది. హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్లింది. సీఎం పక్కనే ‘ఆ నలుగురు’ఎమ్మెల్యేలు ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలకమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, బి.హర్షవర్ధన్రెడ్డి నలుగురూ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పక్కనే కూర్చోవడం గమనార్హం. ఇక ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్లతో పాటు పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్ -
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
సాక్షి, న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో: భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ ప్రతి చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని భావిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ అవసరాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాయన్నారు. కానీ, భారత న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి.. కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతలను, వాటి పాత్రను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటూ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై సరైన అవగాహన లేకుంటే ప్రజలు సరైన దిశగా ఆలోచించలేరని చెప్పారు. ప్రజల్లోని ఈ అజ్ఞానమే న్యాయవ్యవస్థ స్వతంత్రను నాశనం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కొన్ని శక్తులకు సహాయకారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ శుక్రవారం రాత్రి శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో తమ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఇందులో చురుగ్గా వ్యవహరించారు’అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయని, కానీ పరిణతి గల ఏ ప్రభుత్వమూ తన సొంత దేశం పురోగతిని దెబ్బతీసేలా విధానాలను మార్చబోదని సీజేఐ తెలిపారు. దురదృష్టవశాత్తూ భారత్లో మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి సున్నితత్వం, పరిపక్వత కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతీ ఒక్కరు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. -
న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం ఎక్కడ?
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన న్యాయవాదుల విషయంలో సామాజిక న్యాయం నేతిబీర చందంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 1,104 మంది జడ్జిలు ఉంటే, అందులో కేవలం 92 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు. అలాగే 16 మంది ఎస్సీ, ఎనిమిది మంది ఎస్టీ జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 16 హైకోర్టుల్లో అసలు ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమే లేదన్నారు. ఈ గణాంకాలు సామాజిక న్యాయం అమలు తీరుకు ప్రతిబింబమని చెప్పారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. అపర మేధావి, అభ్యుదయవాది, రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. అంబేడ్కర్ తన జీవితాన్ని సామాజికన్యాయం కోసం ధారపోశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో సామాజికన్యాయం అమలు కావడం లేదని చెప్పారు. మనదేశం కులవ్యవస్థకు ప్రాధాన్యతనిస్తోందని, అందుకే అంబేడ్కర్ను ఓ కులానికి నాయకుడిగా చూపుతున్నారని తెలిపారు. అంతకుముందు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ అంబేడ్కర్ది మహోన్నత వ్యక్తిత్వమని చెప్పారు. అంబేడ్కర్ మార్గాన్ని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనంటూ, అందరి హక్కుల పరిరక్షణకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేత!
వాషింగ్టన్: ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో అమెరికా గ్రీన్ కార్డుల(పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ) జారీపై దేశాల వారీగా అమల్లో ఉన్న పరిమితిని(క్యాప్స్) ఎత్తివేస్తూ కీలకమైన బిల్లుకు హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల జారీలోనూ దేశాల వారీగా పరిమితిని 7 నుంచి 15 శాతం పెంచారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే అమెరికాలోని భారత్, చైనా ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గ్రీన్కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. హెచ్ఆర్3648 లేదా ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈగల్)–యాక్ట్ అని పిలుస్తున్న ఈ బిల్లుపై బుధవారం రాత్రి హౌస్ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. బిల్లును తదుపరి హౌస్ ఫర్ డిబేట్కు వెళ్తుంది. అక్కడ ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం యూఎస్ సెనేట్ సైతం ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. సమాన అర్హతలు కలిగినవారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ అర్హతలు ఉన్నవారు ఫలానా దేశంలో పుట్టారన్న కారణంతో గ్రీన్కార్డు పొందలేకపోతున్నారని, ఈ విధానాన్ని మార్చాల్సి ఉందని అమెరికా పార్లమెంట్ సభ్యురాలు జోయ్ లాఫ్గ్రెప్ అన్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే.. ► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు రాలేదని తెలిపాం. ► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. -
న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదు
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివని జై భీమ్ రియల్ హీరో జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు – పరిష్కార మార్గాలు’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అప్పట్లో బ్రిటీష్ పాలకులకు నేరాలు జరిగిన సమయంలో నేరస్థులను పట్టుకోవడం చేతకాలేదని, సులభంగా కేసులను మూసేందుకు వీలుగా కొన్ని సామాజిక తెగలను నేరస్థ తెగలుగా గుర్తిస్తూ వచ్చారని వెల్లడించారు. ఆ మేరకు చట్టం చేశారని, స్వాతంత్య్రం వచ్చాక కూడా అది కొనసాగిందని, కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగా ఆ చట్టం రద్దయిందని పేర్కొన్నారు. ఆ తెగలను డీ నోటిఫైడ్ చేసినా.. ఇప్పటికీ వారికి ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదని తెలిపారు. కమ్యూనిస్టులు చూపించే విముక్తి మార్గమే శాశ్వతమైందన్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్క ర్ చెప్పినట్లుగా ‘నేర్చుకో.. బోధించు.. పోరాడు’ను గుర్తుంచుకోవాలన్నారు. తాము యూనియన్లతో సంప్రదింపులు జరపమంటూ ముఖ్యమంత్రులు భీష్మించుకు కూర్చోడానికి వీల్లేదని జస్టిస్ చంద్రు చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిన నాటి తమిళనాడు సీఎం జయలలిత, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మొండికేసిన సందర్భాలను ఉటంకించారు. సెన్సార్ బోర్డులన్నీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులతో నిండిపోయాయన్నారు. జైభీమ్ సినిమాలో చూపించిన హింస వాస్తవంగా జరిగిన దాంట్లో 10 శాతం మాత్రమేనన్నారు. చదువుతోపాటు ధైర్యముండాలి... వ్యవస్థలో మార్పు కోసం పోరాడేందుకు చదువుకుంటేనే సరిపోదని, ధైర్యం కూడా ఉండాలని జస్టిస్ చంద్రు సూచించారు. సమ్మె చేశారనే కారణంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తే, వారంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందుకు రాలేదని తెలిపారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లు రాజుకన్న భార్య పోలీసుల ప్రలోభాలకు లొంగకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి న్యాయవ్యవస్థను కదిలించిందని గుర్తుచేశారు. జైభీమ్ సినిమా లోని జస్టిస్ మిశ్రా న్యాయవ్యవస్థ పనితీరును మానవీయంగా కొత్తమార్గం పట్టించారని కొనియాడారు. 1990లో చిదంబరంలో లైంగిక దాడికి గురైన మహిళ వామపక్ష పార్టీల సహకారంతో న్యాయంకోసం పోరాడగలిగిందనీ, అది మొదలు మిశ్రా అనేక కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడ్డారని తెలిపారు. పరిహారం ఇచ్చే ప్రొవిజన్ లేకపోయినా... గౌరవనీయ పరిహారం ఇప్పించారన్నారు. భారత్లో మూడు గ్రామాలవ్యవస్థ ఉందని.. ఒకటి కాలనీ అని, మరొకటి షెడ్యూల్డ్ కులాల నివసించే ప్రాంతమని, మూడో నివాస ప్రాంతం ఆదివాసీలు ఉండేదని పేర్కొన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకం జనవరిలో విడుదల చేయనున్నట్లు జస్టిస్ చంద్రు వివరించారు. -
ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం 9 శాతం అంటే నలుగురు, హైకోర్టుల్లో 11 శాతం అంటే 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు న్యాయవ్యవస్థలోనూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. న్యాయవ్యవస్థలో 1950 నుంచి 1990 వరకు ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్య 10 శాతం దాటలేదన్నారు. సుప్రీంకోర్టు ఏర్పడిన నాటినుంచి కేవలం ఐదుగురు ఎస్సీలు, ఒక్క ఎస్టీ న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని చెప్పారు. హైకోర్టుల్లోనూ 850 మందికిగాను కేవలం 24 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయన్నారు. సరైన రిజర్వేషన్ విధానం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘న్యాయవ్యవస్థ నియామకాలపై కొందరిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం, సుప్రీంకోర్టులో 33 శాతం న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థాయిల్లోని వారి కుటుంబ సభ్యులని సూచించే నివేదికలున్నాయి. ఈ దృష్ట్యా కొలీజియం వ్యవస్థను నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ వంటి వ్యవస్థతో భర్తీచేయాల్సిన అవసరం ఉంది. దీనిద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. దీంతోపాటే దేశం నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు శాశ్వత ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఆమె పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికత రెండంచుల కత్తిలాంటిది!
న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్ను లైవ్ స్ట్రీమింగ్ (ప్రత్యక్ష ప్రసారం) ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థలో అనవసరపు గోప్యత తొలగిపోతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అయితే లైవ్స్ట్రీమ్ అనేది కొన్ని సందర్భాల్లో రెండంచులున్న కత్తిలాగా మారుతుందని, అలాంటప్పుడు న్యాయమూర్తులు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తులు పాపులర్ ఒపీనియన్ (జనాకర్షక అభిప్రాయాలు)కు లొంగకూడదన్నారు. గుజరాత్ హైకోర్టులో ఆన్లైన్ లైవ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఆరంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయన్న విషయం తెలుసుకునే హక్కుందని, ప్రజలకు సంపూర్ణ సమాచారం అందితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానంలో జాగరూకత అవసరమని, లైవ్స్ట్రీమింగ్తో జడ్జిలపై రకరకాల ఒత్తిడులు పడతాయని, దీంతో తీరైన న్యాయాన్ని అందించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఒక్కోమారు ప్రజలు మెచ్చిన అభిప్రాయం న్యాయానికి వ్యతిరేకంగా ఉండొచ్చని, అయినా రాజ్యాంగానికి లోబడి న్యాయాన్నే అనుసరించాలని ఉద్భోదించారు. ప్రైవసీ సమస్యను గుర్తించాలి లైవ్స్ట్రీమింగ్తో క్లయింట్ల ప్రైవసీకి సంబంధించి ఇబ్బందులు ఎదురుకావచ్చని, అలాగే కీలక సాక్షులు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడం ఆందోళనకరమైన అంశమని జస్టిస్ రమణ గుర్తు చేశారు. వీరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష ప్రసార నిబంధనలు రూపొందించుకోవాలన్నారు. న్యాయవాదులు సైతం జాగ్రత్తగా వ్యవహరించాలని, పబ్లిసిటీ కోసం పాకులాడకూడదని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో కొన్నిచోట్ల లైవ్స్ట్రీమింగ్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తామని చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా కొన్ని విషయాల గురించి ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందని, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పనితీరుపై సరైన అవగాహన లేదని చెప్పారు. జనాల్లో న్యాయవ్యవస్థ గోప్యత, గూఢతపై నెలకొన్న సంశయాలను తీర్చే సమయం ఆసన్నమైందని, లైవ్స్ట్రీమింగ్ ఇందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. కోర్టుల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ చేస్తున్న కృషిని సీజేఐ కొనియాడారు. కేసుల భారం.. పనితీరుకు సూచిక కాదు సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ న్యాయస్థానాలలో ‘పెండెన్సీ’4.5 కోట్ల కేసులకు చేరుకుందని తరచుగా కోట్ చేసే గణాంకం.. ఇది కేసుల భారాన్ని ఎదుర్కోవడంలో భారత న్యాయవ్యవస్థ యొక్క అసమర్థతగా చిత్రించినట్టుగా ఉంటుందని, దీనిని ‘అతిగా అంచనా వేయడం’గా, ‘అనాలోచిత విశ్లేషణ‘గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. పెండెన్సీ కేసుల భారం పనితీరు కొలిచేందుకు ఉపయోగపడే సూచిక కాదని ఆయన పేర్కొన్నారు. అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో వేసే ‘విలాసవంతమైన వ్యాజ్యాలు’న్యాయ విచారణ జాప్యానికి దోహదపడే కారకాల్లో ఒకటన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతం సహా వివిధ కారణాల వల్ల ఏ సమాజంలోనూ విభేదాలు తప్పవని, వీటి పరిష్కారానికి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి చాలా ముందస్తుగా ఉపయోగించిన సాధనమని చెప్పారు. మధ్యవర్తిత్వం భారతీయ నైతికతలో లోతుగా ఇమిడి ఉందని, దేశంలో బ్రిటిష్ విచారణ వ్యవస్థకు ముందు ఇది ప్రబలంగా ఉందని, వివాద పరిష్కార పద్ధతిగా వివిధ రకాల మధ్యవర్తిత్వాలను ఉపయోగించేవారని చెప్పారు. ఇండియా–సింగపూర్ మధ్యవర్తిత్వ సదస్సులో ప్రధాన వక్తగా ఉపన్యాసం ఇచ్చారు. అనేక ఆసియా దేశాలు సహకార, స్నేహపూర్వక పరిష్కారం అందించడంలో సుదీర్ఘమైన, గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయని జస్టిస్ రమణ అన్నారు. ‘గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతం.. వాస్తవానికి సంఘర్షణ పరిష్కార సాధనంగా మధ్యవర్తిత్వం కోసం ప్రారంభ ప్రయత్నానికి ఒక ఉదాహరణను అందిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవులు, కౌరవుల మధ్య వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు. మధ్యవర్తిత్వ వైఫల్యం ఘోరమైన పరిణామాలకు దారితీసింది..’అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ కూడా ఈ కార్యక్రమంలో తన ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. -
ధర్మోరక్షతి రక్షితః
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. కోటానుకోట్ల యేళ్లు గడిచినా అది నిర్దేశిత కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నది. కించిత్ గర్వమో, క్రోధమో, మోహమో ఆవహించి తన కక్ష్యను మార్చుకుంటే ఏమవుతుంది? రాశి చక్రం గతి తప్పుతుంది. దివారాత్రములు అంతర్ధానమవుతాయి. అండపిండ బ్రహ్మాండం అల్లకల్లోలమవుతుంది. మానవ పిపీలికం మటుమాయమవుతుంది. ఎన్ని యుగాలు గడిచినా, మరెన్ని మన్వంతరాలు కరిగిపోయినా అఖిలాండం మారలేదు. అంతరిక్షం మారలేదు. నక్షత్రాలు వాటి లక్ష్మణ రేఖల్ని దాటడం లేదు. గ్రహాలు వాటి ధర్మాన్ని మీరడం లేదు. భూలోకాన్ని ఆశ్ర యించిన ప్రకృతిశక్తులూ వాటి ధర్మాన్ని తప్పడం లేదు. నదులు పల్లానికే పారుతున్నాయి. గిరులు తరుల్ని మోస్తూనే ఉన్నాయి. ఎండావానా గాలీ వెన్నెల వాటి నియమం ప్రకారమే వచ్చి పోతున్నాయి. పులి శాకాహారం ముట్టలేదు. ఏనుగు మాంసా హారిగా మారితే రోజుకు ఎన్ని పీనుగులు కావాలో? మానవుని సాంఘిక జీవితాన్ని కట్టుబాట్లలో ఉంచడానికి రకరకాల రాజ్యవ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నింటిలోకి అత్యున్నతమైనది, మానవీయమైనది, తాత్విక భూమిక కలిగినది ప్రజాస్వామ్యవ్యవస్థ. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజల నుంచే అధికారం ప్రభవిస్తుంది. అందులోనూ లిఖిత రాజ్యాంగం, చెక్స్ అండ్ బ్యాలెన్స్లతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ మరింత శ్రేష్టమైనదని మేధావుల నిశ్చితాభిప్రాయం. అటువంటి సర్వశ్రేష్టతమ రాజ్యాంగ వ్యవస్థను మనకు ప్రసాదించిన అంబేడ్కర్ తదాది జాతియోధులు మనకు ప్రాతఃస్మరణీయులు. ప్రజలే రాజ్యాంగ నిర్మాతలని స్వయాన మన రాజ్యాంగమే ఘంటాపథంగా ప్రకటించింది. రాజ్యాంగ పీఠిక (preamble) మొట్టమొదటి వాక్యం ఈ దేశా ధికారం ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుని చేతిలో ఉన్నదని సందేహాతీతంగా చాటి చెప్పింది. ‘భారత ప్రజలమైన మేము, మా దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటున్నామని’ మొదటి వాక్యం ప్రకటించింది. ఎందుకు ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలు రాసు కోవలసి వచ్చిందో కూడా తర్వాతి పంక్తుల్లో పీఠిక చెప్పింది. ‘ఈ దేశంలోని పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని, అంతస్తులోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడం కోసం; వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నామని పీఠిక ప్రకటించింది. భారత రాజ్యాంగానికి ఈ పీఠిక ఆత్మ వంటిదని పలువురు న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు వివిధ సందర్భాల్లో ఉద్ఘాటించారు. చట్టసభలు చేసే శాసన నిర్మాణాలు కానీ, చేపట్టే రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (basic structure) దెబ్బ తీయకూడదని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దాని లక్ష్యాలకు నాలుగు వాక్యాల పీఠిక సూక్ష్మదర్శిని వంటిది. ఈ పీఠికలో పేర్కొన్నట్టు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని చేకూర్చడానికి, ఆలోచనా భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్య్రాన్ని సమకూర్చ డానికి, వారి వ్యక్తిత్వ గౌరవాన్ని (Dignity) ఇనుమడింప జేయ డానికి చేపట్టే ప్రతి చర్యా రాజ్యాంగ విహితమే. ఇందుకు విరు ద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ విద్రోహమవుతుంది. ఇటు చట్టసభలకూ, కార్యనిర్వాహక వర్గానికైనా, అటు న్యాయస్థానా లకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మన రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికారాలను పంపిణీ చేసింది. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభలతో (రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీ, కౌన్సిల్) కూడిన శాసన వ్యవస్థ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ (రాష్ట్రాల్లో గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అసెంబ్లీ)తో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులతో కూడిన న్యాయవ్యవస్థ కలిసి భారత రాజ్యాధికార వ్యవస్థ తయా రైంది. ఇందులో ఎవరి విధులూ, అధికారాలు వాళ్లకు న్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తున్నంతవరకూ మన ప్రజా స్వామ్యం ఆదర్శవంతంగా ఉన్నట్టు లెక్క. పరిధులు మీరి ప్రవ ర్తిస్తే మనుగడ ఉండదని ప్రకృతి సూత్రాలు మనకు బోధిస్తు న్నాయి. ఈ మూడు వ్యవస్థల్లో దేని ప్రత్యేకత దానిదే. రాజ్యాంగం తనకు తానే చెప్పుకున్నట్టు అది జనేచ్ఛ (general will))లోంచి జనించింది. ఐదేళ్లకోమారు జరిగే జనేచ్ఛ వెల్లడి ద్వారా పార్లమెంట్, శాసనసభలు ఏర్పడుతున్నాయి. కనుక రాజ్యాంగంతో చట్టసభలది రక్తసంబంధం. కార్యనిర్వాహక వర్గం చట్టసభల్లో భాగంగా ఉంటూ, వీటికి బాధ్యత వహిస్తూ అధికార చక్రాన్ని తిప్పుతుంది. కనుక రాజ్యాంగంతో దానిదీ రక్తసంబంధమే. న్యాయవ్యవస్థ మాత్రం జనేచ్ఛ ద్వారా ఏర్పడేది కాదు. కానీ, ప్రాథమిక జనేచ్ఛకు ప్రతిరూపమైన రాజ్యాం గానికి కాపలాదారుగా నిలబడినందు వలన దీనిది రక్షణ బంధం. జనేచ్ఛ అనే మాటను 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త రూసో ప్రయోగించాడు. పౌరుల స్వాతంత్య్రానికి, రాజ్యాధికారానికి మధ్యన వైరుధ్యం ఏమీ లేదని రూసో వాదన. ఎందుకంటే జనేచ్ఛలోంచి ఏర్పడేవే చట్టాలు. ఆ చట్టాలను అమ లుచేయడం స్వాతంత్య్రానికి భంగమెట్లా అవుతుందనేది రూసో ప్రశ్న. ఈ పద్దెనిమిదో శతాబ్దపు వ్యవహారం మనకు అప్రస్తుతమే అయినప్పటికీ, ఇందులో మనకో ముక్తాయింపు దొరుకుతుంది. అదేమిటంటే, మనకున్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు సూత్ర ప్రాయంగా సమానమే అయినప్పటికీ చట్టసభలకు బాధ్యత వహించే కార్యనిర్వాహక వర్గం కొంచెం ఎక్కువ సమానం. కార్యనిర్వాహక వర్గానికి ఉన్న విస్తృతాధికారాల దృష్ట్యా భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి కనుక, అలా జరగకుండా ఉండేందుకని న్యాయ వ్యవస్థకు కొన్ని అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగం నిబంధనలకు భిన్నంగా చేసే చట్టాలను కొట్టివేసే అధికారం, రాజ్యాంగానికి భాష్యం చెప్పే విశేషాధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ అధికారాలను ఉపయోగించుకొని ఎన్నో ప్రజోపయోగకర తీర్పులను ఇచ్చిన ఘనత ఈ దేశ న్యాయ వ్యవస్థకు ఉన్నది. నల్లచట్టాల నుంచి ప్రజలను రక్షించడంలో, పౌరహక్కులను నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ఎన్నదగిన పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ కాలం నుంచి రెండున్నర మూడు దశాబ్దాల పాటు ప్రజానుకూల ప్రగతిశీల దృక్పథంతో న్యాయవ్యవస్థ క్రియాశీల (Judicial activism) పాత్రను పోషించింది. ఇప్పుడు కూడా న్యాయవ్యవస్థలో క్రియాశీలత కని పిస్తూనే ఉన్నది. కాకపోతే, అందులో ప్రజానుకూలత, ప్రగతి శీలత ఏమేరకు ఉన్నాయనేదానిపై భిన్నాభిప్రాయాలు వెలువ డుతున్నాయి. జేఏజీ గ్రిఫిత్ అనే బ్రిటీష్ న్యాయశాస్త్ర కోవి దుడు 1977లో ‘పాలిటిక్స్ ఆఫ్ జ్యుడీషియరీ’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా న్యాయశాస్త్ర వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. బ్రిటన్లో న్యాయవ్యవస్థ తటస్థత అనేది ఒక బ్రహ్మపదార్థమనీ, కేవలం భ్రమ మాత్రమేనని ఆయన ఆ పుస్తకంలో నిరూపించారు. అదే కాలంలో ఇండి యాలో న్యాయవ్యవస్థను క్రియాశీలం చేసిన ఆద్యుల్లో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ ఇదేరకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. మనదేశ న్యాయవ్యవస్థలో అత్యధికులు ధనికవర్గ పక్షపాతులని ఆయన ఆక్షేపించారు. రాజకీయ అభిప్రాయాలను కలిగి వుండటం తప్పుకాదు కానీ, వాటిని దాచిపెట్టి తాము తట స్థులమని చెప్పుకోవడమే పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడే వారు. ఇదంతా ఈ దేశంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై రాజకీ యాలు నడిపిన కాలం సంగతి. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే న్యాయవ్యవస్థలో కూడా రాజకీయాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే వ్యవస్థ క్షీరనీర న్యాయాన్ని పాటించినంతవరకూ ప్రమాదం లేదు. వర్తమాన న్యాయవ్యవస్థ క్రియాశీలత (Judicial activism) గతంకంటే భిన్నమైనది. కార్యనిర్వాహక వ్యవస్థ పౌరహక్కుల మీద, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద దాడి చేయకుండా నిరోధించడం నాటి క్రియాశీలత లక్ష్యం. అదొక రక్షణాత్మక వైఖరి. ప్రస్తుత క్రియాశీలత కార్యనిర్వాహక వర్గం అధికార పరిధిల్లోకి ప్రవేశిస్తున్నదని పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను కూడా తామే తీసు కుంటామని ఇటీవల న్యాయవ్యవస్థ పలుమార్లు ప్రకటించడం జరిగింది. కార్యనిర్వాహకవర్గం పాత్రను కూడా న్యాయవ్యవస్థ పోషించడం మొదలుపెడితే ప్రజాభిప్రాయానికి ఇక విలువే ముంటుందో, ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. న్యాయంగా ఉండటం మాత్రమే కాదు న్యాయంగా ఉన్నట్టు కనిపించాలి కూడా అంటారు. వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోగూడదనే అర్థంలో అలా అంటారు. ఒకే రకమైన కేసులో రెండు భిన్నమైన తీర్పులు చూడండి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. పరీక్షల ద్వారా వారి మెరిట్ను నిర్ధా రించి చూపకపోతే భవిష్యత్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థు లకు సీట్లు లభించవన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నది. కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబిం చింది. రెండు రాష్ట్రాల మీద సుప్రీంకోర్టులోనే పిటీషన్లు పడ్డాయి. ఏపీ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పరుష వ్యాఖ్యలు చేసింది. పిల్లలెవరైనా కోవిడ్ వల్ల చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించింది. కేరళ కేసులో అదే బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలే మని అంతక్రితం చెప్పింది. విషయం ఒక్కటే. భిన్నమైన వ్యాఖ్యానాలు. ఇందులో సామాన్యులకు అర్థం కాని ధర్మ సూక్ష్మాలు, సాంకేతిక అంశాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. కానీ జనంలోకి ఏ సందేశం వెళ్లిందో గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలనే తీసుకుందాము. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గత యేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారం పదిరోజులు గడిస్తే ఎన్నికలు పూర్తయ్యేవి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. ఆయన ఎందుకలా చేశారనేది మరో పిట్టకథ. ఎన్నికల వ్యవ హారం అనేక న్యాయ మలుపులు తిరిగి ఎట్టకేలకు మొన్న ఏప్రి ల్లో జరిగాయి. ఫలితాలు ప్రకటించవలసి ఉన్నది. మళ్లీ కథ కోర్టుకెక్కింది. జరిగిన ఎన్నికలను రద్దుచేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పనిలో పనిగా ఈ తీర్పుతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. వాటిపై ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్లో ఆమె అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. పౌరులకు దక్కవలసిన రాజకీయన్యాయం ఏడాదిన్నర కాలంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా బలహీనవర్గాల ప్రజలకు 30 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఆ ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నది. రాజ కీయ ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏడాది పైగా ఒక గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోగలిగారు. ఇప్పటికీ 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయే వుంది. మహిళా సాధికారతను మరో అంతస్తుపైకి చేర్చే మహత్తర కార్యక్రమం ఇది. రాజ్యాంగ పీఠిక అభిలషించినట్టు వ్యక్తిగత గౌరవాన్ని (dignity ఇనుమడిం పజేసే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్న రఘురామరాజు అనే ఆర్థిక నేరస్తుడు కేసు వేస్తే ప్రజోపయోగకరమైన అమూల్ కార్యక్రమం ఆగిపోవలసిన అవ సరం ఉన్నదా?. సదరు రఘురామరాజుకు సరస్వతి పవర్పై పిటిషన్ వేయడానికి ఉన్న అర్హతలేమిటి?. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ పాలనను జనానికి చేరువ చేయడం నేరమా?. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆ హక్కు లేదా?. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రిపై గత ప్రభుత్వం వివిధ పోలీస్ స్టేషన్లలో రాజకీయ కేసులు పెట్టింది. ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోవడంతో మేజిస్ట్రేట్లు కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటువంటి కేసులు దేశంలోని రాజకీయ నాయ కులందరిపైనా దాఖలవుతాయి. తర్వాత వాటిని ఉపసంహరిం చుకోడమూ రివాజే. గత ప్రభుత్వ పెద్దలు అనేకమందిపై ఇటు వంటి కేసులు నమోదయ్యాయి. వాటి ఉపసంహరణ కూడా జరిగింది. కానీ ప్రస్తుత సీఎంపై ఉపసంహరించిన కేసులన్నిం టినీ క్రోడీకరించి విచారణ జరుపుతామని హైకోర్టు సుమోటో ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇవి కొన్ని ఉదా హరణలు మాత్రమే. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం సాఫీగా పని చేయకుండా రాజకీయ ప్రత్యర్థులు న్యాయవ్యవస్థ భుజాలపై తుపాకీని మోపి కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం?. అదనులో వానలు కురవాలనీ, శీతాకాలం కోత పెడుతున్న ప్పుడు ఎండలు కాయాలనీ కోరుకుంటాము. ప్రకృతి మనల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించాలని కోరుకోవడం తప్పు కాదు. ధర్మాన్ని మనం కాపాడితేనే కదా... ధర్మం మనల్ని కాపాడేది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రూ.70,983.11కోట్లతో ఓటాన్ అకౌంట్
సాక్షి, అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్ – జూన్) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.70,983.11 కోట్లను కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించడం సాధ్యం కాలేదు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా మిగిలిపోయి ఉండటం, కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీకి శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపగా ఆదివారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయశాఖ ఆర్డినెన్స్ గెజిట్ పబ్లికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జూన్ వరకు అన్ని రంగాల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ కేటాయింపులతో ఆదివారం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు రూ.70,983.11 కోట్ల వ్యయం అవుతుందని కానుందని ఓటాన్ అకౌంట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నవరత్నాలకు సంబంధించి వివిధ పథకాలకు ఓటాన్ అకౌంట్లో వ్యయాలను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల కోసం అదనంగా రూ.7,955.66 కోట్లను మంజూరు చేస్తూ ఆర్డినెన్స్కు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. -
న్యాయవ్యవస్థ విమర్శలు ఎదుర్కొంటోంది
సాక్షి, అమరావతి: సమర్థవంతమైన న్యాయం అందించే విషయంలో న్యాయవ్యవస్థ ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కొంటోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి అన్నారు. ఏపీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జస్టిస్ గోస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇలాంటి విమర్శలను ఆధిగమించడం సాధ్యమవుతుందని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని విమర్శలకు సమాధానం ఇద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, విధి నిర్వహణలో రాజీ లేకుండా పనిచేద్దామన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది లేమి, పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడం వంటివి న్యాయవ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థపై లేనంత భారం మనదేశ న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఏపీ హైకోర్టు మంచి సంప్రదాయాలను పాటిస్తోందని, ఇప్పుడు జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కేసుల విచారణ తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ ప్రసంగించారు. లోకాయుక్తలో గణతంత్ర వేడుకలు లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి జెండా ఎగుర వేసి∙పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, రిజి్రస్టార్ విజయలక్ష్మి, లోకాయుక్త డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) కె.నర్సింహారెడ్డి, డైరెక్టర్ (లీగల్) టి.వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
న్యాయమూర్తులు పరిధులు దాటొచ్చా?
న్యాయమూర్తులు కూడా సమాజం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ మీద కూడా ప్రభావాలు ఉంటాయి. అన్ని ప్రభావాలు చెడ్డవి అని అనడానికి వీల్లేదు. వాళ్ళు తమమీద ఉన్న ఒత్తిడి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. న్యాయమూర్తి సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుంచి మరికొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. ఇవే కాకుండా వర్గపరమైన పక్షపాత ధోరణులు కూడా ఉంటాయి. ఇంటి యజమాని వల్ల బాధితుడైన న్యాయమూర్తి కిరాయిదారుల పక్షం ఉండి యజమానులకి వ్యతిరేకంగా ఉంటాడు. వరకట్నం కేసు వల్ల బాధను అనుభవించిన వ్యక్తి, ఆ కేసుల్లో పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. వీటికి మంచి ఉదాహరణ భన్వారీ దేవి ఉదంతం. భన్వారీ దేవి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. బాల్య వివాహాలు జరిగితే ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం ఆమె ఉద్యోగంలోని ఒక విధి. అలాంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉందని ఆమె ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. ఆ వివాహాన్ని పోలీసులు నిరోధించటానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ వివాహం రహస్యంగా జరిగింది. ఆ వివాహం జరిగే విషయంలో ఆమె జోక్యం చేసుకున్న కారణంగా వివాహం అయిన కొద్ది నెలలకి ఆమె మీద దాడి జరిగింది. ఆమె భర్త సమక్షంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముద్దాయిలను ఆ కేసుని విచారించిన సెషన్స్ జడ్జి విడుదల చేశాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన వివరణ చాలా విచిత్రంగా ఉంది. అత్యాచారాన్ని టీనేజీలో ఉన్న యువకులు చేస్తారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలు మధ్య వయ స్కులు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్లు ఈ నేరం చేయడానికి అవకాశం లేదు. అందులోనూ ఆధిపత్యæ కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తితో అపవిత్రం కారు. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి. కాబట్టే ఇలాంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పుమీద అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతమంది న్యాయ మూర్తులు ‘ఆమోద యోగ్యం కాని వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్) తీర్పులని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ క్రిమినల్ అప్పీలు నెం. 1025 ఆఫ్ 2008 కేసులో 17.08.2012 నాడు ప్రకటించింది. ఈ తీర్పు పర్వర్స్ తీర్పు అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి 2017 ఫిబ్రవరి 9న ప్రకటించింది. కానీ ఈవిధంగా హైకోర్టు తీర్పుని పర్వర్స్ తీర్పు అని ప్రకటించడం సంతోషకరమైన వ్యక్తీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు సి. ఏక్నాథ్ వర్సెస్ వై. అమరనాథ రెడ్డి కేసులో అభిప్రాయపడింది. ప్రభుత్వ భూముల వేలం కేసు నుంచి వైదొలగాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించాల్సిన జస్టిస్ రాకేశ్ కుమార్ తన పరిధిలో లేని అంశాలపై వ్యాఖ్యానించారు. ఇది ఆందోళనకరం. దేశానికి జస్టిస్ మురళీధర్, జస్టిస్ చంద్రూ వంటి న్యాయమూర్తులు అవసరం. దేశం ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటోంది. ఏపీ హైకోర్టులో జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ రమేష్ నేతృత్వం లోని డివిజన్ బెంచ్ 2020 డిసెంబర్ 30న ఇచ్చిన తీర్పుని గమనిం చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది ఊహించని ఉత్తర్వు. ఎందుకంటే తన విచారణ పరిధిలో లేని చాలా అంశాలని కోర్టు స్పృశించి తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఈ అసంతృప్తికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడం. అంతేకాదు. వై.యస్. జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టుని తక్కువ చేస్తోందని కూడా ఈ తీర్పు అక్కసుని వెళ్లగక్కింది. కోర్టు కేసు నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవాలన్న దరఖాస్తుని పరిష్కరిస్తూ డివిజన్ బెంచ్ ఈ కటువైన పరిశీలనలని చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ హైకోర్టు నిర్వహణ మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డేకి రాసిన లేఖల పర్యవసానంవల్లే ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని డివిజన్ బెంచి అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి కావాల్సింది సుప్రీంకోర్టు కొలీజియం చేసిందన్న భావన కలిగేవిధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనమీద ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడానికి అలా ఆరోపణలు చేశారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే ఆ కేసు విచారణని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆ కేసులని విచారిస్తు న్నారు. ఈ బదిలీల వల్ల ఆ కేసుల విచారణ ఏ విధంగా కుంటు పడుతుందో అర్థం కాని విషయం. కోర్టు ఎన్ని రోజుల్లో పరిష్కరిం చాలో హైకోర్టులు చెబుతాయి తప్ప ఏ విధంగా పరిష్కరించాలో చెప్పజాలవు. అలా చెబితే అది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వ భూముల వేలం కేసునుంచి న్యాయమూర్తి రాకేశ్ కుమార్ వైదొలగాలని ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించా ల్సిన కోర్టు తన పరిధిలో లేని అంశాల గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కాదు ఆందోళనని కల్గిస్తుంది. పైగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ప్రభుత్వం దాడి చేసింది. ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని కోర్టు తన ఆందోళనని వ్యక్తం చేసింది. అక్కడితో ఊరుకోలేదు. 2011 నుంచి విచారణలో ఉన్న కేసుల్లో ఇంతవరకు విచారణాంశాలను నిర్ధారించకపోవడం అపహాస్యం కాదా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. కోర్టుల్లో జాప్యానికి కారణాలు అనేకం. దానికి సమాధానాన్ని సంబం ధిత కోర్టు వివరిస్తుంది. మరొకరు వివరించలేరు. సీబీఐ ఏర్పాటు న్యాయబద్ధం కాదని అస్సాం హైకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు ఎని మిదేళ్లుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. న్యాయమూర్తి రాకేశ్ కుమార్ విచారణ అంశం కానీ చాలా విష యాలను తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అందులో ముఖ్యమైంది గూగుల్లో ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన. కోర్టు విచారణలో ఉన్న అంశం ఏమిటి? న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు ఏమిటి? విచిత్రమైన అంశం ఏమంటే మనదేశ జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణిం చాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించ కూడదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత అవసరమో, అమాయ కులకి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంటుంది. అంతేకాని కోర్టు విచారణలో లేని అంశాల మీద మాట్లా డటం పరిశీలనలు చేయడంలోని ఔచిత్యం బోధపడటం లేదు. కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే కోర్టులు జారీచేసే ఉత్త ర్వులు, తీర్పులు తగు కోణాలతో ఉండాలి. అంతేకాదు అవి వెంటనే పార్టీలకు అందుబాటులో ఉండాలి. తీర్పులు నిష్పక్షపాతంగా ఉండా లంటే అవి తగు కారణాలతో ఉండాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీదే చర్చ జరగాలి. వాటి గురించి విశ్లేషణ ఉండాలి. అదేవిధంగా కోర్టు ఒక నిర్ణయానికి రావడానికి కారణాలనేవి ఎలాంటి పూర్వ భావ నలు, పక్షపాతం లేకుండా ఉండాలి. విచారించాల్సిన దరఖాస్తులో కానీ కేసులో గానీ లేని విషయాలని ప్రస్తావిస్తే అది తగు కారణాలతో చెప్పిన ఉత్తర్వుగా గానీ తీర్పుగా కానీ పరిగణించ బడదు. పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటిపైనా సమాధానాలు కోర్టు ఉత్తర్వుల్లో ఉండాలి. అలా లేనప్పుడు ఆ కోర్టు మీద విశ్వసనీయత ఏర్పడదు. అనవసర కామెంట్స్, తగు కారణాలు లేనప్పుడు ఆ వ్యాఖ్యానాలని తొలగించుకోవడానికి, సరైన కోణాలలో తీర్పు కోసం పార్టీలు పై కోర్టులకి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కోర్టులమీద అనవసర భారం పడుతుంది. తగు కారణాలతో తీర్పులు ప్రకటించడంవల్ల కోర్టుల మీద భారం తగ్గుతుంది. న్యాయమూర్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతను స్వేచ్ఛగా, స్వతంత్రంగా తీర్పులను ప్రకటించాలి. తన మనఃసాక్షిగా, చట్టానికి అనుగుణంగా తీర్పులను ఇవ్వాలి తప్ప, కోర్టు విచారణలో లేని అంశాలను ప్రస్తావించకూడదు. నిష్పక్షపాతం గురించి సుప్రీంకోర్టు ఎస్.పి గుప్తా కేసులో వివరించింది. అది ఇప్పటికీ ఓ గీటురాయి. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పుని ప్రకటించినప్పటికీ అది అన్ని ఉత్తర్వులకి, తీర్పులకి వర్తిస్తుంది. ఓ న్యాయమూర్తి నిష్పక్ష పాతాన్ని, అతని ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంలో లేవని అనుకోవ డానికి రెండు పరీక్షలు ఉన్నాయి. అవి– వ్యక్తిగత పరీక్ష: న్యాయమూర్తికి కేసులో ఎలాంటి వ్యక్తిగత ఆసక్తి ఉండకూడదు. తన విశ్వాసాల వల్ల ఎదుటి వ్యక్తికి హాని జరుగకూడదు. తటస్థ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్): తన నిష్పక్షపాతం మీద ఎలాంటి సంశయం రాకుండా ఉండే విధంగా విచారణ జరపాలి. చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీలకు విశ్వాసం లేనప్పుడు న్యాయమూర్తి ఆ కేసుని నిష్పక్ష పాతంగా పరిష్కరించినా అలాంటి భావన పార్టీలకు కలగదు. అలాం టప్పుడు ఆ కేసులని పరిష్కరించడం ఎందుకు? అనవసర విషయాల ప్రస్తావన మరెందుకు? ఇలాంటి వాటివల్ల కోర్టులపై గౌరవం తగ్గే అవకాశం లేదా? చివరగా ఇద్దరు న్యాయమూర్తులు గుర్తుకొస్తున్నారు. ఒకరు జస్టిస్ మురళీధర్. రెండవవారు జస్టిస్ చంద్రూ. మొదటి న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్/హరియాణాకి బదిలీ అయినప్పుడు చండీగఢ్లో న్యాయమూర్తులు దారి పొడవునా నిల్చొని ఆహ్వానం పలికారు. అదే విధంగా జస్టిస్ చంద్రూ నిరాడంబరంగా తన పదవీ విరమణ చేశారు. ప్రజల న్యాయమూర్తిగా ఆయనను కొని యాడారు. దేశం ఇలాంటి న్యాయ మూర్తులనే కోరుకుంటుంది. మంగారి రాజేందర్ (వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
‘రాజ్యాంగం వైఫల్యం’పై విచారణ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అన్న అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. రాజ్యాంగ వైఫల్యంపై హైకోర్టు జరుపుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద తెలియచేయడంతో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం దీన్ని రికార్డు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి అనంతరం బెంచ్ దిగి వెళ్లిపోయింది. అంతకు ముందు ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని, అది కొద్దిసేపట్లో విచారణకు రానుందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద నివేదించారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరగా అందుకు జస్టిస్ రాకేశ్ ధర్మాసనం నిరాకరిస్తూ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొంది. వాయిదా సమస్యే లేదు.. మధ్యాహ్నమే విచారణ శుక్రవారం మధ్యాహ్నం బదులు విచారణను సోమవారం చేపట్టాలని ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరపున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి కూడా అభ్యర్థించారు. రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే నిమిత్తం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వుల కాపీ తమకు అందలేదని తెలిపారు. రిజిస్ట్రీ సర్టిఫైడ్ కాపీ బదులు ఈ-మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీని పంపిందని, ఇది కోర్టు ఆదేశాలను అమలు చేయడం కిందకు రాదన్నారు. ఈ-మెయిల్ కాపీని తాము తదుపరి (పై కోర్టుల్లో సవాలు చేసేందుకు) వినియోగించడం సాధ్యం కాదని, అందువల్ల సర్టిఫైడ్ కాపీని ఇప్పించాల్సిన అవసరం ఉందని, విచారణ సోమవారం చేపట్టాలని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అయితే జస్టిస్ రాకేశ్ కుమార్ ఇందుకు నిరాకరిస్తూ మధ్యాహ్నమే విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే మిన్ను విరిగి మీద పడదు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి స్పందిస్తూ మధ్యాహ్నం కాకుండా విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. తనకు వ్యక్తిగతమైన ఇబ్బంది ఉందని, అందుకే వాయిదా అడుగుతున్నానని తెలిపారు. వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని, మిన్ను విరిగి మీద పడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బంది ఉందని అభ్యర్థించినప్పుడు విచారణను వాయిదా వేయడం ఏపీ హైకోర్టు సంప్రదాయమని గుర్తు చేశారు. అయితే వాయిదా వేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి... ఈ సమయంలో మోహన్రెడ్డి, జస్టిస్ రాకేశ్ కుమార్ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నం విచారించి తీరుతామని జస్టిస్ రాకేశ్ స్పష్టం చేయగా ఇది అన్యాయమని, న్యాయస్థానానికి ఎంతమాత్రం తగదని మోహన్రెడ్డి నివేదించారు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నింటినీ కోర్టు రికార్డింగ్ (బ్లూజీన్స్ యాప్ ద్వారా వీడియో రికార్డింగ్) చేస్తోందన్న విషయం తెలుసని, తన వాదన రికార్డు కావాలన్న ఉద్దేశంతోనే కోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోందని చెబుతున్నానని మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తనను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా ప్రతి దానిని విచారించాల్సిన బాధ్యత మీపై (ధర్మాసనం) ఉందని మోహన్రెడ్డి గుర్తు చేశారు. అలాగే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించాలన్నారు. కోర్టుగా తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా ఎలాంటి పక్షపాతం లేకుండా, ముందస్తుగానే నిర్ణయానికి రాకుండా విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్రెడ్డి సమాధానమిచ్చారు. తాము తమ ప్రమాణం మేరకు నడుచుకుంటున్నామని, దాని నుంచి పక్కకు వెళ్లబోమని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా మధ్యాహ్నం విచారణకు తాను హాజరుకాబోవడం లేదని, సోమవారం వాదనలు వినిపిస్తానని మోహన్రెడ్డి బదులిచ్చారు. వాయిదా కోరడం దుర్వినియోగం చేసినట్లా? ‘మీరు ఏం కావాలో అది చేసుకోండి... రాష్ట్ర ప్రభుత్వం రోజుకో న్యాయవాదిని నియమిస్తోంది’ అని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా.. ఎవరిని న్యాయవాదిగా నియమించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇదే రీతిలో కేసును వాయిదా వేయాలా? వద్దా? అన్నది తమ ఇష్టమని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించారు. మీరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయాలనుకుంటే చేయవచ్చని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా మోహన్రెడ్డి ఘాటుగా స్పందిస్తూ వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణ వాయిదా వేయాలని కోరడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు ఇలా భావిస్తుంటే తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టులో ఏం జరిగిందని జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రశ్నించారు. రాజ్యాంగ వైఫల్యంపై ఈ ధర్మాసనం జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద తెలిపారు. దీంతో దీన్ని రికార్డు చేసుకున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి బెంచ్ దిగి వెళ్లిపోయింది. 31న పదవీ విరమణ.. ఈలోపే నిర్ణయం వెలువరించేలా! తమవారిని పోలీసులు అక్రమంగా నిర్భంధించారంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతూ వచ్చిన జస్టిస్ రాకేశ్, జస్టిస్ ఉమాదేవిల ధర్మాసనం అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అనే అంశాన్ని తేలుస్తామంటూ అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలన్న ఉద్దేశంతో ధర్మాసనం రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందని ఏ పిటిషనర్ పేర్కొనలేదని, పిటిషనర్లు కోరకుండా ఆ అంశంపై విచారణ జరపడం సరికాదని, అసలు ఆ అంశంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఒక్క నిమిషంలో కొట్టివేసిన జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ను వాదనలు వినిపించేందుకు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు అనుమతించలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు సైతం అనుమతినివ్వలేదు. జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ వ్యాజ్యంలో ఏ నిర్ణయం వెలువరించాలో ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చి విచారణ జరుపుతున్నారని, దీనివల్ల తమకు న్యాయం లభించదని భావిస్తూ విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ తప్పుకోవాలంటూ (రెక్యూజల్) రాష్ట్ర ప్రభుత్వం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం జారీ చేసిన అక్టోబర్ 1 నాటి ఉత్తర్వులను, రీకాల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. -
న్యాయవ్యవస్థలో అసమానతలు
చాలా ఆలస్యంగానే కావొచ్చు... ఒక అర్థవంతమైన చర్చకు తెరలేచింది. న్యాయవ్యవస్థలో మహిళ లకు అతి తక్కువ ప్రాతినిధ్యం వున్నదని స్వయానా అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టులో ఎత్తిచూపారు. ఈ పరిస్థితిని మార్చాలని సూచించారు. ఆయన చెప్పిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. సుప్రీంకోర్టులోనూ, వివిధ హైకోర్టుల్లోనూ మొత్తం న్యాయమూర్తుల పదవులు 1,113 వుంటే అందులో కేవలం 80 మంది మాత్రమే మహిళలు. సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల పదవులుంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. ట్రిబ్యునల్స్కి సంబంధించిన లెక్కలు లేనేలేవు. వాటిల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి వుంటుందని అనుకోనవసరం లేదు. ఇది దాటి సీనియర్ న్యాయవాదుల విషయానికొస్తే అందులోనూ మహిళలు అతి తక్కువ. ఈ దుస్థితిని గురించి ఇంతవరకూ అసలు చర్చే జరగలేదని అనడం సరికాదు. ఎందరో సామాజిక కార్యకర్తలు లోగడ పలు సందర్భాల్లో చెప్పారు. మొన్న సెప్టెంబర్లో లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా దేశంలో మహిళా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేకపోవడాన్ని వివరంగానే చెప్పారు. రాజ్యాంగానికి సంబంధించిన మూడు మూలస్తంభాల్లో మిగిలిన రెండూ... కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థల్లో పరిస్థితి ఎంతో కొంత నయమే. 2007లో రాష్ట్రపతి పీఠాన్ని ప్రతిభాపాటిల్ అధిరోహించారు. అంతకు చాన్నాళ్లముందే... అంటే 60వ దశకంలోనే ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఎన్నో రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులు వచ్చారు. గవర్నర్ లుగా కూడా పనిచేస్తున్నారు. కానీ మహిళలకు అవకాశం ఇవ్వడంలో న్యాయవ్యవస్థ వెనకబడింది. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ చూస్తే ఒక మహిళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి. రెండేళ్లక్రితం న్యాయవాద వృత్తినుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ ఇందూ మల్హోత్రా సంగతే తీసుకుంటే 68 ఏళ్లలో అలా ఎంపికైన తొలి మహిళా న్యాయమూర్తి ఆమెనే! మొన్న జూలైలో జస్టిస్ భానుమతి రిటైర్కాగా ప్రస్తుతం జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు మరో మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ మాత్రమే వున్నారు. ఈ ఇద్దరూ ప్రధాన న్యాయమూర్తి పదవి అధిష్టించకుండానే రిటైరవుతారు. అంటే ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు లేనేలేరు. సమీప భవిష్యత్తులో కూడా వుండే అవకాశం లేదు. ఇంత కన్నా అన్యాయం మరొకటుందా? కెకె వేణుగోపాల్ మహిళా న్యాయమూర్తుల గురించి చర్చ లేవనెత్తిన సందర్భాన్ని చూడాలి. మధ్యప్రదేశ్లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయిన వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విచిత్రమైన ఉత్తర్వులిచ్చారు. అతగాడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆ న్యాయమూర్తి ఒక షరతు పెట్టారు. నిందితుడు బాధిత మహిళ ఇంటికెళ్లి ఆమెకు రాఖీ కట్టాలన్నది దాని సారాంశం. అంతేకాదు... పోతూ పోతూ ఆమెకు, ఆమె కుమారుడికి స్వీట్లు తీసుకెళ్లాలట! ఈ ఉత్తర్వులపై అక్కడున్న న్యాయవాదులు స్పందించినట్టు లేదు. కానీ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు 8మంది మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సర్వో న్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ మహిళ పడిన మానసిక హింసనూ, క్షోభనూ న్యాయ స్థానం చాలా చిన్న అంశంగా పరిగణించడం సరికాదని విన్నవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి తోడ్పడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచనకు స్పందిస్తూ మహిళా న్యాయమూర్తుల సంఖ్య సరిగా లేకపోవడాన్ని వేణుగోపాల్ ప్రస్తావించారు. ఆయన చెప్పిన అంశాన్ని చాలా విస్తృతార్థంలో చూడాలి. భిన్న వర్గాలుగా వుండే సమాజంలో నిత్యం ఏవో సమ స్యలు, సంక్షోభాలూ తప్పవు. వాటికి ఎప్పటికప్పుడు మెరుగైన పరిష్కారాలు సాధించాలంటే, సమాజం ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగాలంటే అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యవస్థలపై విశ్వాసం ఏర్పడాలి. ఆ వ్యవస్థల్లో తమకూ భాగస్వామ్యం వున్నదని, తామెదుర్కొంటున్న సమస్యలకు వాటి పరిధిలో పరిష్కారం లభిస్తుందని అందరిలోనూ నమ్మకం కలిగినప్పుడే ఏ సమాజమైనా సజావుగా మనుగడ సాగిస్తుంది. అందుకు భిన్నమైన స్థితి వుంటే ఒకరకమైన అనిశ్చితి, భయాందోళనలు నెలకొంటాయి. కులం, మతం, ప్రాంతం, జెండర్ వంటి వివక్షలు ఏ వ్యవస్థలోనైనా కొనసాగు తున్నాయన్న అభిప్రాయం పౌరుల్లో ఏర్పడితే అది ఆ వ్యవస్థకే చేటు తెస్తుంది. కనుకనే వేణుగోపాల్ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవాల్సిన అవసరం వుంది. తీర్పులు వెలువరించే ముందు బాధితుల స్థానంలో వుండి ఆలోచించేలా న్యాయమూర్తులకు అవగాహన పెంచాలన్న ఆయన సూచన మెచ్చదగ్గది. దాదాపు దశాబ్దంక్రితం సైన్యంలో పురుషులతో సమానంగా తమకు బాధ్యతలు అప్పగించడం లేదని కొందరు మహిళలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమధ్యే లైన్మన్ పోస్టులకు తమనెం దుకు పరిగణించరంటూ ఇద్దరు మహిళలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పిటి షన్లు విషయంలో న్యాయవ్యవస్థ బాగానే స్పందిస్తోంది. మంచి తీర్పులు వెలువడుతున్నాయి. కానీ తమదగ్గర వేళ్లూనుకున్న జెండర్ వివక్షను మాత్రం ఇన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సమాజం ఏమేరకు ప్రగతి సాధించిందన్నది ఆ సమాజంలో మహిళలు సాధించిన ప్రగతినిబట్టే అంచనా వేస్తానని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఒక సందర్భంలో అన్నారు. ఆ కోణంలో చూస్తే మన సమాజం చాలా చాలా వెనకబడివున్నట్టు లెక్క. కేంద్రం, సుప్రీంకోర్టు కూడా న్యాయవ్యవస్థలో వున్న ఈ అసమానతను సాధ్యమైనంత త్వరగా పట్టించుకుని సరిచేసే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం. -
న్యాయవ్యవస్థపై ఆరోపణలు దాచేయాలా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవ్యవస్థలోని కొందరు ప్రముఖులపై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ, దానిని పారదర్శకంగా ప్రజ లకు వెల్లడించిన వైనంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. జగన్ అలా ఫిర్యాదు చేయవచ్చా? ఆ ఫిర్యాదును బహిరంగం చేయవచ్చా అన్న మీమాంసను కొందరు లేవనెత్తుతున్నారు. అలాగే ఎక్కడో ఒక చిరుద్యోగి వంద రూపాయల లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడితే గంటల కొద్దీ టీవీలలో వార్తలను మీడియా ప్రచారం చేస్తుం టుంది. అలాంటిది ఏకంగా న్యాయ వ్యవస్థలోనే ఒక సంచలనం అయిన విషయాన్ని జగన్ బయటపెడితే ఒక వర్గం మీడియా మాత్రం మౌనం దాల్చడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒకప్పుడు ఎక్కడ అవినీతి ఉందన్న ఆరోపణలు వచ్చినా అంకుశంతో పొడవాలని సుద్దులు చెప్పిన ఈనాడు మీడియా ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏపీ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశం పెట్టి సుప్రీంకోర్టు జడ్జిపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైన నిర్దిష్ట ఫిర్యాదు చేసినట్లు వెల్లడిస్తే, ఒక వర్గం మీడియా చానళ్లలో ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. అలాగే వారి పత్రికలో కూడా అసలు వార్తే కనిపించలేదు. ఇది చరిత్ర నమోదు చేసుకున్న ఘట్టం అని చెప్పాలి. ఆ తర్వాత రెండు రోజులకు ఆ మీడియాతో పాటు టీడీపీకి మద్దతు ఇచ్చే కొన్ని మీడియా సంస్థలు ఏ మాత్రం భేషజం లేకుండా ఫలానావాళ్లపై ఆరోపణలు వస్తే మాత్రం వారిపై ఫిర్యాదు చేస్తారా? వారిపై చర్యలు తీసుకుంటారా అన్నట్లు ప్రశ్నిస్తూ కథనాలు ఇస్తున్నాయి. చర్చలు నడుపుతున్నాయి. రెండు వాదనలకూ చోటిస్తే తప్పు కాదు. కానీ ఏపీ ప్రభుత్వ వాదనను పూర్తిగా విస్మరించి, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తూ కొందరి ఇంటర్వ్యూలను కూడా ప్రముఖంగా ప్రజలలోకి తీసుకువెళ్లే యత్నం చేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ న్యాయవ్యవస్థలోని వారిపై తీవ్ర ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, ఆయన అధికారికంగా ఏదైనా ఫిర్యాదు చేస్తే, దానిని విస్మరించడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత ముఖ్యమని స్పష్టం చేశారు. హైకోర్టు వ్యవహారాలలో ఒక సుప్రీంకోర్టు జడ్జి జోక్యం చేసుకుంటున్నారని, తన రాజకీయ విరోధుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే యత్నాలు న్యాయవ్యవస్థలో కొందరు చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి ఆరోపిస్తే దానిని ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. సాధారణ ప్రజలకు వచ్చిన సందేహాలనే ఆయన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం, నిజాయితీగా నడుస్తున్నట్లు కనిపించడం అవసరమన్న ప్రజల భావనకు దగ్గరగా ఆయన అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాక న్యాయ వ్యవస్థలోని వారిపై కానీ, వారి కుటుంబ సభ్యులపై కానీ ఆరోపణలు వస్తే వాటి జోలికి వెళ్లకూడదని, అసలు ప్రచారమే జరగరాదని హైకోర్టు చెప్పడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. అదే సామాన్యుడి అభిప్రాయం కూడా. పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయమా అన్న ప్రశ్న వస్తున్న సందర్భంలో గంగూలీ కూడా అదేరీతిలో మాట్లాడినట్లు కనిపిస్తుంది. మరో వైపు ఈనాడు పత్రిక గత కొద్ది రోజులుగా ఇస్తున్న ఇంట ర్వ్యూలు, వార్తలు చూస్తే ఏమిటీ ఈ పత్రిక ఇలా తయారైందన్న బాధ కలుగుతుంది. అసలు మొదటి వార్తను ఇవ్వలేదు కానీ దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందేమిటి? అంటే న్యాయవ్యవస్థలో అవినీతి జరిగిందన్న ఆరోపణ వస్తే దానిని రహస్యంగా ఉంచాలన్నట్లుగా ఆ పత్రిక కథనాలు ఉండడం జర్నలిజం చరిత్రలో ఒక విషాదం అని చెప్పాలి. సామాన్యుడి అభిప్రాయాలతో సంబంధం లేకుండా కథనాలు ఇవ్వడం ద్వారా ఆ పత్రిక ప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈనాడు పత్రిక ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్.ఎస్.సోధీని ఇంటర్వ్యూ చేసి ప్రముఖంగా ప్రచారం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం ద్వారా జగన్ లక్ష్మణ రేఖ దాటారని ఆయన అన్నారు. సీఎం లేఖ రాయడమే సమంజసం కాదని ఆయన అన్నారు. కోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు జరిగితే, కోర్టులపై ప్రజలలో విశ్వాసం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏ సీఎం ఇలా ఆరోపణలు చేయలేదని ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు, జవాబులు చది విన తర్వాత ఎవరికైనా కలిగే అభిప్రాయం ఏమిటంటే, పాలనా వ్యవస్థ కన్నా న్యాయ వ్యవస్థ గొప్పదని, వారు ఏమి చేసినా ప్రశ్నించజాలరని ఆ రిటైర్డ్ న్యాయమూర్తి చెప్పినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలు ఏమిటి? వాటిలో వాస్తవాలు ఉన్నాయా? లేవా అన్న దాని గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అసలు ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలా? వద్దా అన్నదాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదో తెలియదు. బహుశా ఆ మీడియాకు ఆయా వ్యవస్థలలో ఉన్నవారితో అనుబంధం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారికి వారే బహిర్గతం చేసినట్లయిందా అన్న సందేహం వస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలో అవాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. వాటిని రిటైర్డ్ జడ్జీలు ముగ్గురితో విచారణ చేయించి నిగ్గుతేల్చి ప్రభుత్వ చర్యను తప్పుపట్టవచ్చు కదా? అప్పుడు న్యాయవ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని అంతా భావిస్తారు కదా.. మరి ఈ విషయాలపై సోది ఎందుకు సలహాలు ఇవ్వలేకపోయారు. ఒక రిటైర్డ్ న్యాయమూర్తి పారదర్శకత కోరుకుంటుంటే, మరో రిటైర్డ్ న్యాయమూర్తి అంతా గప్చుప్ అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంటుంది. మరో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అయితే నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెబుతూ చక్రవర్తుల కాలంలో న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారని, న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయమూర్తుల విశ్వసనీయతను కాపాడలేం అని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోని అవినీతి, లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ అన్నిటికీ అతీతం అని సుప్రీంకోర్టు కూడా భావిస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతమే అవుతుంది. న్యాయవ్యవస్థలో కొందరిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభియోగాలు మోపితే, అదేదో మొత్తం న్యాయ వ్యవస్థపై చేసినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని విజ్ఞులైన ప్రజలంతా గమనిస్తున్నారు. కనుక పాలు తాగే పిల్లి మాదిరి ఒక వర్గం మీడియా తమకు అనుకూలమైన వారిపై అవినీతి అభియోగాలు వచ్చినా వాటిని దాచివేయాలని ప్రయత్నం చేసే కొద్ది న్యాయ వ్యవస్థలోని ఆయా వ్యక్తులపై అనుమానాలు మరింత బలపడతాయి. ఆ మీడియా విశ్వసనీయత పూర్తిగా పోతుందన్న సంగతిని వారు విస్మరిస్తున్నారు.అది అత్యంత దురదృష్టం. ఎక్కువమంది న్యాయకోవిదులు న్యాయవ్యవస్థలోని వారిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేసి నిగ్గు తేల్చాలని సూచిస్తున్నారు. గతంలో జడ్జీలుగా పనిచేసినవారిపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయని ఉదాహరణలతో సహా ఉటంకిస్తున్నారు. అంతేకాదు.. గతంలో కూడా ప్రభుత్వంపై కొందరు జడ్జీలు ఇష్టం వచ్చినట్లు వాఖ్యానాలు చేస్తే, ఆ ప్రభుత్వాలు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసిన ఘట్టాలు కూడా ఉన్నాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీకి చెందిన కొందరు జడ్జీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, కేంద్రం విచారణ చేసి వారిని బదిలీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉన్నవి రెండు ఆప్షన్లు అనీ, వాటి ప్రకారం ఫుల్ కోర్టు పెట్టి దీనిపై విచారణకు అనుసరించవలసిన పద్ధతి నిర్ణయించడం, లేదా అంతర్గతంగా ఒక కమిటీని నియమించడానికి చర్య తీసుకోవడం అనీ అంటున్నారు. అంతే తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రాసిన లేఖను విస్మరించడం సాధ్యం కాని విషయమని విశ్లేషణలు వస్తున్నాయి. పలు జాతీయ ఆంగ్ల పత్రికలలో ఈ విషయమై పెద్ద ఎత్తున వ్యాసాలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వంలో ఒక చిన్న ఉద్యోగి నియామకానికి పరీక్షలు ఉంటాయి కాని, జడ్జి పదవికి పరీక్షలు ఉండవా? ఎవరినైనా నియమించడం సరైనదేనా? అన్న ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు చేయాలని చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఇప్పుడు ప్రజలలో వ్యక్తం అవుతున్న సందేహం కూడా అదే. అంత దాకా ఎందుకు? ఒక కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదు అయితే దానిని నిలిపివేయడమే కాకుండా, ప్రచారం కూడా చేయరాదని ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ను ఏపీ హైకోర్టు వారు ఎందుకు సవరించుకోవడానికి ఇష్టపడడం లేదో తెలియదు. అలాగే చిన్న, చితకా విషయాలకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు వారు, ఇంత పెద్ద స్కామ్పై విచారణకు ఎందుకు అంగీకరించడం లేదన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ న్యాయవ్యవస్థలోని కొన్ని అవలక్షణాలను బయటపెట్టడం ద్వారా ఆ వ్యవస్థను ఒక కుదుపునకు గురి చేశారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఉపయోగపడాలని ఆశించడం తప్పుకాదు. పాలనా వ్యవస్థపై ఎన్నో వ్యాఖ్యలు చేసే న్యాయ వ్యవస్థ తనవరకు వచ్చేసరికి ఎందుకు నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉండలేకపోతోందన్న దానికి జవాబు దొరికితే ఆటోమేటిక్గా పరిష్కారం కూడా వస్తుంది. అలా జరుగుతుందా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నా సూచనలు సీజేఐకి మెయిల్ చేశా: ఉండవల్లి
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు. -
న్యాయ వ్యవస్థను మూసేయాలన్న ఉద్ధేశంతోనే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.' న్యాయవ్యవస్థపై యుద్ధమా? ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది? అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. కావాలంటే తీర్పులపై అప్పీలుకు వెళ్లండని జడ్జిలు వ్యాఖ్యానించినట్టుగా కూడా పేర్కొన్నాయి. కాకపోతే ఈ వ్యాఖ్యలు వారిచ్చే తీర్పుల్లో ఉంటే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమా? కాదో తేల్చమని పైకోర్టును కోరడానికి అవకాశం ఉంటుంది. (చదవండి : చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి) న్యాయమూర్తులు విచారణ సందర్భంలో అన్నట్టుగా చెప్తున్న ఈ మాటలేవీ కూడా తీర్పుల్లో లేకపోవడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించేవారిని ఆందోళన పరుస్తోంది. న్యాయప్రక్రియలో ఇలాంటి కామెంట్లకు చోటు లేనప్పటికీ జడ్జిలు మౌఖికంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పత్రికలు ప్రభుత్వ వ్యవస్థల ప్రతిష్టలను దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్నాయి. అందుకనే అభిప్రాయాలను మౌఖికంగా కాదు, తీర్పుల ద్వారా చెప్పమని వ్యవస్థలపై గౌరవం ఉన్నవారు చెప్పేమాట.' అంటూ తెలిపారు.(చదవండి : ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తా) -
న్యాయమూర్తులపై పోస్టులను తొలగించండి
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చట్ట ప్రకారం తొలగించాలని హైకోర్టు మంగళవారం ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను ఆయా కంపెనీలకు అందచేయాలని సీఐడీకి సూచించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన సవరణ పిటిషన్కు బుధవారానికల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీ శ్రీరాంను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చిన తరువాత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, పోస్టులు వచ్చాయి. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో పురోగతి లేదని, సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ రాకేశ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ మాట్లాడుతూ ప్రధాన పిటిషన్లో అదనంగా కొన్ని అంశాలను చేరుస్తూ సవరణ పిటిషన్ వేశామని చెప్పారు. అడ్వొకేట్ జనరల్ శ్రీరాం స్పందిస్తూ కౌంటర్ దాఖలుకు గడువివ్వాలని కోరారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి.. దర్యాప్తు వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని, రిమాండ్ రిపోర్ట్తో పాటు ఇతర వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచామని చెప్పారు. సోషల్ మీడియా కంపెనీల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం.. సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టులను తొలగించేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీలను ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన తెలుగుదేశం నేత శివానందరెడ్డి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు మాట్లాడుతూ.. న్యాయమూర్తులపై కుట్ర జరుగుతోందని, ఆ వివరాలను తెలిపేందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఈ ఇంప్లీడ్ పిటిషన్పై తదుపరి విచారణలో చూస్తామని పేర్కొంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
న్యాయస్థానం మూడో సభ కాకూడదు
ఇటీవల దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, ఆశ్చర్యకరమైన ఆదేశాలు, కటువైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ప్రపంచ న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2018 జనవరి 12వ తేదీన నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్మీట్ పెట్టి మరీ దేశ న్యాయవ్యవస్థ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. రెండేళ్ళ తర్వాత దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ పరిణామాలను పరిశీలిస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కొంతకాలం క్రితం సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతిపరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టులోని ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఆరోపిస్తూ, వారి పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసి, ధైర్యం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. 2006 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమాపాల్, ‘‘ఉన్నత న్యాయస్థానాల్లోని వారు ఏడు రకాల పాపాలకు పాల్పడుతున్నారు. అవి సహచరుల అనైతిక ప్రవర్తనను పట్టించుకోకపోవడం, జడ్జీల నియామకంలో పారదర్శకత పాటించకపోవడం, గత తీర్పులను య«థాతథంగా కాపీ కొట్టడం, వ్యక్తిగతమైన అహంభావం, వృత్తిపరమైన అహంభావం, హిపోక్రసీ, ఆశ్రిత పక్షపాతం’’ అని వివరించారు. 1950 జనవరి 28వ తేదీన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ‘‘దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్ విధులకు న్యాయస్థానాల తీర్పులు ఆటంకం కాకూడదు. న్యాయవ్యవస్థ పార్లమెంట్ ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు’’ అని స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మన దేశంలో భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వివాదాలు ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కోర్టుల తీర్పులు, ఆదేశాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘పరిపాలనా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం అలా చేయాలి... ఇలా చేయకూడదు... అంటుంటే ఇక ఓట ర్లెందుకు? శాసన వ్యవస్థ ఎందుకు? ప్రభుత్వాలెందుకు?’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జూలై రెండో తేదీన మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారంటే న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఏదో లోపం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అరుణ్జైట్లీ ‘శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిధిలోకి న్యాయస్థానాలు రాకుండా లక్ష్మణరేఖ గీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే న్యాయం కోసం న్యాయవ్యవస్థపైనే ప్రజాప్రతి నిధులు పోరాటం చేస్తున్నారనిపిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు. 2010 మట్టూ ప్రియదర్శిని కేసులో సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూ తీర్పునిస్తూ, ‘‘న్యాయ వ్యవస్థ స్వీయ నియంత్రణ పాటించాలి, సూపర్ లెజిస్లేచర్గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు’’ అన్నారు. అమెరికన్ చరిత్రకారుడు ఆర్థర్ షెల్సింజర్ జూనియర్ 1947లో న్యాయమూర్తులు అత్యుత్సాహపరులు, ఆత్మనిగ్రహం పాటించి చట్టానికి లోబడి తీర్పులిచ్చేవారు, మధ్యేవాదులనే మూడు రకాలుగా ఉంటారని పేర్కొన్నారు. అయితే రెండో వర్గమైన అత్యుత్సాహపరుల కారణంగానే భవిష్యత్లో రాజ్యాంగ సంక్షోభాలు, న్యాయశాఖ, శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని రాజ్యాంగ నిపుణులు గతంలోనే హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిలో న్యాయవ్యవస్థ పాత్ర 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన తీర్పు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడానికి పరోక్ష కారణమైందన్న విమర్శలు వచ్చాయి. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 518 సీట్లకు గానూ 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో రాయ్బరేలి నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేస్తూ గత ఎన్నికల్లో ఇందిర అనేక అవకతవకలకు పాల్పడినందున అమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. చేసిన అనేక ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోయారు. కోర్టు రెండు ఆరోపణల ఆధారంగా ఆమె ఎన్నిక చెల్లదని, ఆమె మరో ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చింది. ఈ ఆరోపణల్లో ఒకటి అప్పటికే ప్రధానిగా ఉన్న ఇందిర తన ఎన్నికల ప్రచార సభకు వేదిక ఏర్పాటు చేయడానికి పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగిం చడం. యశ్పాల్ అనే ప్రభుత్వ ఉద్యోగిని తన ఎన్నికల అవసరాల కోసం వాడుకున్నారన్నది ఆమెపై మరో అభియోగం. అయితే 1975 జూన్ 24న జస్టిస్ కృçష్ణ అయ్యర్ ఆమె కొన్ని షరతులతో ప్రధానిగా కొనసాగవచ్చని తీర్పు ఇవ్వగా, 1975 నవంబర్ ఏడో తేదీన సుప్రీంకోర్టు బెంచ్ అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, ఇందిర నిర్దోషని పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పునే ఎగువ కోర్టు కూడా సమర్థించే ప్రమాదం ఉందనే భయంతో ఆమె 1975 జూన్ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశప్రతిష్టను దెబ్బతీశారు. న్యాయ వ్యవస్థ అత్యుత్సాహం (జ్యుడీషియల్ యాక్టివిజం) అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. నాయమూర్తులు రాగద్వేషాలకు, బంధు, మిత్ర ప్రీతికి, అహంకారాలకు అతీతంగా పూర్తి అవగాహనలతో తీర్పులు ఇస్తుం టారు. అయితే శాసన, కార్యనిర్వాహక విభాగాలతో న్యాయ విభాగం కూడా రాజ్యాంగానికి లోబడి చట్టాలు, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలి. అవి తమతమ పరిధిలో ఉంటూ ఇతర వ్యవస్థలను తక్కువగా చూడకుండా ఉండాలి. లేకపోతే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వి.వి.ఆర్.కృష్ణంరాజు వ్యాసకర్త ప్రెసిడెంట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మొబైల్ : 95052 92299 -
సమీక్షించకపోతే 2జీ స్కాం బయటకు వచ్చేదా?
తాడేపల్లి: ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. న్యాయ వ్యవస్థ పై మాకు సంపూర్ణ గౌరవం ఉందని చెప్పారు. కోర్టు తీర్పుల్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో హైకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ పేర్లు బయట పెటొద్దని వారిని కాపాడుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు ఎక్కడా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రాకూడదని ఆదేశించారు. గతంలో ఎక్కడా కూడా ఇలాంటి కోర్టు ఆర్డర్ రాలేదు. కోర్టు తీర్పుపై చర్చ జరుగుతున్న సమయంలో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. జడ్జి కూతుళ్ల పేర్లు ఉంటే బయట పెట్టకూడదా? రేపు వేరే కేసుల్లో కూడా ఇలాంటి తీర్పు ఇస్తారా అని చర్చ జరుగుతోంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి చర్చ మంచిదేనని భావిస్తున్నా. మీడియాపై ఆంక్షలు విధిస్తారా అని కోర్టులు గతంలో ప్రశ్నించాయి. దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ పట్ల చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని శాసన సభ నిర్ణయిస్తుంది. శాసన సభకి కొన్ని హక్కులుంటాయి. మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేయకూడదన్న కోర్టుల జోక్యం పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాలా? (చదవండి: పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన ఉండడానికి అనర్హులా..?) సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎవరైనా అభినందించాలి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత స్టైరిన్ను అక్కడ నుంచి తరలించాలని సీఎం ఆదేశించారు. అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కొందరు మాత్రం. ఎందుకు తరలించారు అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లోనూ మా నాయకులు ఈ అంశం పై మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరిట కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డు పడితే ఎలా? ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా? గత ప్రభుత్వాల నిర్ణయాలు సమీక్షించకపోతే 2జీ స్కాం బయటకు వచ్చేదా? రమేష్ హాస్పిటల్ లో మనుషులు చనిపోతే కేసులు పెట్టి విచారణ చేయొద్దా. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మద్య ఏదో జరిగిపోతుందని చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్స్ రాలేదు. సీఎం జగన్ నిర్ణయాలను విమర్శించడమే కొన్ని పత్రికల పనైపోయింది. గతంలో చంద్రబాబు అనేక సార్లు పెట్రోల్పై భారం వేశారు. లాక్ డౌన్ సమయంలో కూడా ముఖ్యమంతి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ సమయంలో రాష్ట్రానికి ఇన్ని నిధులు ఎలా తెస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇసుకపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా విష ప్రచారం చేస్తున్నారు. 16 శాతం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ పడిపోయిందని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబుకు సర్వే చేసిన అవే సంస్థలూ.. ఇప్పుడూ సర్వే చేసి ఉంటాయి. ఆ ఓటు బ్యాంక్ అంతా తన వైపునకు మారి ఇప్పుడే సీఎం అయ్యేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు’అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (చదవండి: డిక్లరేషన్పై వివాదం: వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ) -
హైకోర్టుల్లో కేసుల పరిష్కారం సగమే!
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ పరిస్థితుల్లోనే పెండింగ్ కేసులు ఎక్కువ, సిబ్బంది తక్కువ కారణంగా న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారం అంతంత మాత్రంగా కొనసాగుతుండగా, కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ‘నేషనల్ జుడీషియల్ డాటా గ్రిడ్’ లెక్కల ప్రకారం హైకోర్టుల్లో కేసుల పరిష్కారం 50 శాతం పడిపోగా, వాటి దిగువ కోర్టుల్లో 70 శాతం పడి పోయాయి. గ్రిడ్లో సుప్రీం కోర్టు డాటా అందుబాటులో లేదు. అయితే లీగల్ ఆర్కివ్స్ వెబ్సైట్ ‘సుప్రీం కోర్టు అబ్జర్వర్’ కథనం ప్రకారం 2018, ఏప్రిల్ నెల నాటికి సుప్రీం కోర్టు 10,586 కేసులను, 2019లో ఏప్రిల్ నెలనాటికి, 12,084 కేసులను పరిష్కరించగా, 2020, ఏప్రిల్ నెల నాటికి కేవలం 355 కేసులను మాత్రమే పరిష్కరించగలిగింది. మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో హఠాత్తుగా కోర్టుల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు అత్యవసర కేసుల విచారణ చేపట్టి, మిగితా కేసుల విచారణ పెండింగ్లో పడేసింది.. ఆ తర్వాత కేసుల్లో భౌతిక విచారణను పక్కకు పెట్టి వీడియో కాన్ఫరెన్స్ విచారణను చేపట్టింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా సుప్రీం కోర్టునే అనుసరించాయి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్ప్ విచారణలను పక్కకుపెట్టి భౌతిక విచారణను ప్రారంభించాలని హైకోర్టులు నిర్ణయించాయి. అయితే అస్సాం హైకోర్టు సిబ్బంది అందుకు సమ్మెతించడం లేదు. దేశంలో జిల్లా కోర్టులు మార్చి 28 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య 12 లక్షల కేసులకుపైగా పరిష్కరించాయని, ఇదో మైలురాయని ‘సుప్రీం కోర్టు ఈ కమిటీ’ వెబ్సైట్ ప్రారంభోత్సవంలో డీవై చంద్రచూడ్ తెలిపారు. -
హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిసి కోరారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా ఈ చర్య తోడ్పడుతుందని వివరించారు. తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 14 మందే ఉన్నారని తెలిపారు. పెండింగ్ కేసులు భారీగా ఉన్నాయని, కొత్తగా పెద్ద సంఖ్యలో కేసులు వస్తుండడంతో న్యాయవ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్
-
ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అమరావతి: ‘న్యాయమూర్తులపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వార్తా సంస్థల్లో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ రెండు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుకు సన్నద్ధమైంది. పరువునష్టం దావా సహా, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతోనే ఈ కథనం అల్లారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఇది బీసీలపై దాడే...) -
బజారులో వ్యవస్థల ‘బండారం’
‘ఓడిన పార్టీలు కోర్టుల ద్వారా రాజకీయా లను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వైపుగా ఇవి పదే పదే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి’ – కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ(ఎన్డీఏ) కేంద్రమంత్రి ఈ ప్రకటన చేసే ముందు కాంగ్రెస్ హయాంలోనూ, బీజేపీ హయాంలోనూ పరస్పరం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటూ నిన్నమొన్నటిదాకా కోర్టుల ద్వారా కూడా రాజకీయాల్ని నియంత్రించడానికి శాయశక్తులా ప్రయత్నించి పబ్బం గడుపుకుంటూ వచ్చినవేనని ప్రజలు మరచిపోరు. ఎందుకంటే, అసలు దేశ ప్రజలు అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న ఈ మాత్రపు సెక్యులర్ రాజ్యాంగాన్ని కూడా నిలవనివ్వకుండా తూట్లు పొడుస్తూ వచ్చిన రాజకీయ పక్షాలు కూడా ఇవేనని మరవరాదు. నేటికి 44 ఏళ్లనాడు సుప్రీంకోర్టును అధివసించిన విశిష్ట న్యాయమూర్తుల్లో ఒక రైన వీఆర్ కృష్ణయ్యర్ దేశంలో రాజ్యాంగమూ, దానికి లోబడి పని చేయాల్సిన మూడు వ్యవస్థలకు (ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయ వ్యవస్థ) తమ పరిధులు దాటకుండా వ్యవహరించాలని ఎందుకు సూచించవలసి వచ్చిందో ఒక సందర్భంగా వివరించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన కంప్యూటర్పై వచ్చిన ఒక ‘ఈ–మెయిల్’ సందే శాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ఉదహరించారు. ఆ ఈ–మెయిల్ సందేశం 1996 నాటిది. అది చెప్పిన వివరాల ప్రకారం... పార్లమెంటు సభ్యుల్లో 29 మందిపై భార్యల్ని హింసించిన ఆరోపణలున్నాయి. ఇక ఏడుగురు మోసాలు చేసి అరెస్టయినవారు, 19 మంది క్రిమినల్ కేసుల్లో నిందితులు, 117 మంది హత్యా నేరాలు, అత్యాచారాలు, దాడులు, దొమ్మీలు, దొంగతనాల కేసుల్లో నింది తులు, 71 మంది అప్పులు తీసుకుని జవాబుదారీ లేకుండా అయిపూ పత్తాలేని కేసుల్లో ఉన్నవారు, 21మంది అనేకానేక చట్టవిరుద్ధ లావా దేవీల్లో ఉన్నవారు, 84 మంది వివిధ దాడుల్లో పాల్గొని, జరిమానాలు చెల్లించాల్సి వచ్చిన బాపతు. పార్లమెంటులో బిలియనీర్లదే ఆధిపత్యం పార్లమెంటు దిగువసభ 545 మంది సభ్యులున్న సభ. మనందర్నీ క్రమశిక్షణలో ఉంచాల్సిన, వందలాది చట్టాల్ని రూపొందించాల్సిన ప్రతినిధుల సభ. వీరి ఈ భాగోతాన్ని సరిదిద్దడానికి మనమేమైనా చేయగలమా? అంటూ ఆనాడు జస్టిస్ కృష్ణయ్యర్కు ఈ–మెయిల్ పంపిన వ్యక్తి అడిగారు (‘ఫ్రమ్ ది బెంచ్ టు ది బార్’, పే.88). దాదాపు ఈ అజ్ఞాత సందేశానికి రుజువుగా బడా కోటీశ్వరుడు బిర్లా ‘మా చేతుల్లో 70 మందికి పైగా పార్లమెంట్ సభ్యులున్నార’ని ప్రకటించాడు. ఇప్పుడు 44 ఏళ్లనాటి పరిస్థితి కూడా చేయి దాటిపోయింది. దఫదఫాలుగా ‘ప్రజాస్వామ్యం’ విలసిల్లుతున్న తీరుపైన సాధికార నివేదికలు వెలువరిస్తూ వస్తున్న జాతీయ ప్రజాస్వామ్య వేదిక (ఏడీఆర్) సైతం.. నేటి పార్లమెంట్ సభ్యులలో కనీసం 150 మందికి పైగా వివిధ రకాల అవినీతిపరులతో, నేరాలతో, అత్యాచారాలతో, ఏదో రూపంలో సంబంధాలున్న సభ్యులేనని అభిప్రాయపడింది. ఇప్పుడు టాటా, బిర్లాలకు తోడు అదానీలు, అంబానీలు, విజయ్ మాల్యాలు, నీరవ్మోదీలు ఇత్యాది బిలియనీర్ల సంఖ్య పెరిగి సుమారు 200 మంది దాకా తేలుతున్నారని మరికొన్ని అంచనాలు. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు మూడే కాదు, ప్రజాస్వామ్యానికి ‘నాల్గవ’ స్తంభంగా కేవలం ‘పేరు’కే భావిస్తున్న మీడియా కూడా రాజ్యాంగమూ, దాని వ్యవస్థల సరసనే ‘బతుకు జీవుడా’ అనే దశకు చేరుకుంది. చివరికి న్యాయ వ్యవస్థ చేతులు ఎలా మెలిపెట్టవచ్చునో కూడా పాలకులు ‘మతలబు’ కనిపెట్టారు. న్యాయమూర్తుల ప్రమోషన్ల ‘ఎర’తో, సరుకు లేకపోయినా తమ వృత్తిలో ఎలాంటి ప్రావీణ్యతను స్థాపించుకోలేని కొందరు న్యాయ మూర్తుల్ని పాలకవర్గాలు, అనుకూల తీర్పుల కోసం కోర్టులలో నియ మింపజేసుకోవడమూ మన దేశంలో ఇటీవల కాలంలో మరింత తెంపరితనంతో జరుగుతున్నది. కేంద్రస్థాయిలో సీబీఐ ప్రత్యేక న్యాయ మూర్తి జస్టిస్ లోయా హత్యపై విచారణను తాత్సారం చేయడంలోనే కాక ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ గొగోయ్ ఇత్యాదులను పరిరక్షించడం లోనూ పాలకవర్గాల రాజకీయ వ్యాపార ప్రయోజనాలు చాలా బాహాటంగానే బయటపడ్డాయి. ఏడాదిలోపు 57 కేసులా? ఇక ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు చూద్దామా... రాష్ట్ర శాసనసభలో అస్తుబిస్తు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు కాళ్లు తెగిపోయిన ‘ఒంటరి ఒంటె’ బతుకులా గడుపుతున్నారు. అయినా, అధికారంలో ఉన్నప్పటిలాగే అన్ని వ్యవస్థలనూ పాత పద్ధతుల్లోనే వాడుకోవాలన్న కండూతి ఆయనలో ఇంకా తొలగలేదు. దీనికి తిరుగులేని తాజా ఉదాహరణ– రాష్ట్రంలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీని చికాకుపర్చడానికి చంద్రబాబు ‘దింపుడు కళ్లం’ ఆశ కొద్దీ చేయని ప్రయత్నమంటూ లేదు. దీని ఫలితమే జగన్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి కావడానికి ముందే జగన్ పాలనపై దాదాపు 50–57 కేసులు బనాయిస్తే న్యాయస్థానం ప్రశ్నించి, రుజు వుల కోసం నిలదీసినట్టు కన్పించదు. పైగా మీడియా చర్చల్లో, విశ్లేషణల్లో సహజమూ, సర్వసామాన్యమూ అయిన ఎదురు బొదురు ప్రశ్నలు–సమాధానాలూ ఆధారంగా కోర్టులు ప్రశ్నించడం వక్రమార్గం పట్టిన మన ప్రజాస్వామ్యంలో మరొక తంతు. ఆ మేరకు నోటీసులు ఇవ్వడం అనే ఈ పద్ధతులపై, నలభై రెండేళ్ల క్రితమే త్రిసభ్య అత్యున్నత ధర్మాసనం (సుప్రీం).. పత్రికాధిపతి ఎడిటర్ ముల్గావ్కర్ కేసులో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అది ఆ రోజుకీ, ఈ రోజుకీ పత్రికా రంగంపై పరువు నష్టం, కోర్టుధిక్కార కేసులన్నిటా శిలా శాసనంగానే అమలులోనే ఉంది (1978 సుప్రీంకోర్టు కేసులు పే.339). ఈ కేసుకు ముందు కోర్టు ధిక్కార, పరువు నష్టం తాలూకు వచ్చిన పలు కేసులను తూర్పారబడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత న్యాయమూర్తుల బెంచ్లో అమెరికా, ఇంగ్లండ్లలో తిరుగులేని తీర్పులు వెలువరించి పత్రికా స్వేచ్ఛకు, మీడియా వ్యాఖ్యాతల స్వేచ్ఛకు స్వాగత తివాసీలు పరిచారు. అదే సమయంలో కనీస పరిమితులనూ ప్రతిపాదించారు. 1978 నాటి సుప్రీం తీర్పులో జస్టిస్ బేగ్, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ కైలాసంలతో కూడిన ఉన్నత ధర్మాసనం ఇలా స్పష్టం చేసింది. మీడియా (పత్రికలు, మాధ్యమాలు) రంగం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనివార్యమైన మధ్యంతర శక్తి. ప్రజా స్వామ్య శక్తులకు ఊతమిచ్చి బలోపేతం చేయడానికి మీడియా బలమైన సాధనం. బాధ్యతాయుతమైన పరిమితుల్లో స్వేచ్ఛగా వ్యవ హరించగల శక్తిగలది మీడియా. అత్యున్నత న్యాయస్థానం సహా అన్ని కోర్టులకు ఇది వర్తిస్తుంది. స్వేచ్ఛ తన పరిధుల్లో తాను వ్యవహరిం చడం అనివార్యం. అలాగే న్యాయమూర్తులు న్యాయం చేయడానికి జంకిపోతే ఆ న్యాయం కాస్తా ఓడిపోయినట్టేనని కోర్టు ధిక్కార నేరా రోపణల్ని సుప్రీం ఆనాడే కొట్టిపారేసింది. న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా ఉండాలి ఇంగ్లండ్ క్వీన్ కౌన్సిల్ గౌరవ సభ్యుడు సుప్రసిద్ధ న్యాయ శాస్త్ర వేత్త డేవిడ్ పానిక్, ఇంగ్లండ్లో మహా గొప్ప న్యాయమూర్తి అయిన జస్టిస్ ఆలివ్ వెండెల్ హోమ్స్ చరిత్రాత్మక సందేశాన్ని ఇలా ఉదహరించారు: ‘సమాజాల నిర్వహణలో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర, కేంద్రీయ స్థానం. ప్రజా జీవితానికి సంబంధించిన ఈ కీలకమైన అంశాన్ని యాసిడ్ లాంటి అత్యంత పదునైన క్షార పదార్థంతో ప్రక్షాళనం చేసి కడిగిన ముత్యంలా సిద్ధం చేయాలి. న్యాయమూర్తుల్ని నిర్దుష్టమైన మచ్చలేని మానవులుగా మనం చూడగలగాలి. అప్పుడు ప్రభుత్వం లోని ఇతర శాఖల అధికారిక ప్రవర్తనపట్ల ఎంత నిశితంగా వ్యవ హరిస్తామో అంత నిశితంగానూ న్యాయమూర్తులపట్ల వ్యవహరిం చాల్సిందే. అలా చేయనంత కాలం న్యాయమూర్తులు కూడా సమా జంలోని మిగతా సభ్యుల జీవితాల్ని శాసించే మతాధిపతుల్లో ఒకరుగా మిగిలిపోతారు. దాంతో న్యాయమూర్తులు ప్రజలనుంచి దూరమవు తారు, వారిని జనం వేరే విధంగా భావిస్తారని జడ్జీలు గుర్తించాలి. కనుక న్యాయమూర్తులు, మీడియా ఎన్నడూ స్వార్థపర వర్గాల ప్రయో జనాలకు వత్తాసు పలకరాదు, గొడుగు పట్టరాదు. ఎందుకంటే, అలాంటి వారు సామాజిక న్యాయానికి నిలబడలేరు, మానసికంగా వికలాంగులవుతారు’. అంతేగాదు సుప్రసిద్ధ బ్రిటిష్ న్యాయమూర్తులలో లబ్దప్రతిష్టుడైన లార్డ్డెన్నింగ్ ‘ఈ మా అధికారాన్ని మా సొంత పరువును, బిరుద బీరాల్ని కాపాడుకునే సాధనంగా ఎన్నడూ వినియోగించుకోజాలం’ అని కోర్టులోనే ఎలుగెత్తి చాటాడు. అంతేగాదు, ‘మాకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని అణచివేయడానికి మా పద్ధతుల్ని ఉపయోగించబోము. విమర్శ అంటే మేం భయపడం, విమర్శను నిరసించం. ఎందుకంటే, ఇంతకన్నా అత్యంత ముఖ్యమైన సత్యం బలి కాకూడదు. అదే– భావ ప్రకటనా స్వేచ్ఛ. పార్లమెంటులోగానీ, పత్రికల ద్వారాగానీ– ఈ స్వేచ్ఛ ప్రతి మానవుని హక్కు’ అని లార్డ్ డెన్నింగ్ ప్రపంచ న్యాయ మూర్తులందరికీ పాఠం చెప్పాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో 90 మందికిపైగా నేతలకు, పాత్రికేయులకు, ఇతరులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులిచ్చిందన్న వార్త డెన్నింగ్కే కాదు, భారత న్యాయ వ్యవస్థకూ, సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకూ కూడా అవమానంగానే భావించాలి. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలూ బజారులో చివరికి ‘చాకి రేవు’కు చేరినట్టు ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఈ చాకిరేవు వెనకాల కానరాని బహిరంగ రహస్యం పేదవర్గాల ప్రయోజనాల్ని అణగదొక్క బోవడం..! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
కోర్టుల ద్వారా రాజకీయాలు నియంత్రించరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రామాణికమైన ప్రజాప్రయోజన వ్యాజ్యమైతే దానిని సమర్థిస్తామని, తాను కూడా అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశానని గుర్తుచేశారు. ఏ సందర్భంలోనైనా సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందని, కానీ, కొందరు కోర్టులను మాధ్యమంగా చేసుకుని తమ రాజకీయాలు నడపాలనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆజ్తక్ ఛానల్ నిర్వహించిన ఈ–ఎజెండా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేవాళ్లు..న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు ప్రయత్నించిన వారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. వలస కార్మికులకు సంబంధించి ఓ కేసులో సొలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కోర్టుకు వచ్చిన వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఏం చేశారని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారని, ఈ ప్రశ్న ఎందుకు వేయరాదని, కేవలం రాజకీయపరమైన ఒత్తిళ్లు తెచ్చేం దుకు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యా నించారు. తాము న్యాయవ్యవస్థను విశ్వసిస్తామని, ఆ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుండాలని పేర్కొన్నారు. -
హక్కుల రక్షణలో అలసత్వం
దళిత వర్గాల హక్కుల పరిరక్షణకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల పరువు తీసే నిజాలివి. దేశంలో అత్యధిక ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును పర్యవేక్షించడంలో, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని మంగళవారం లోక్సభలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్చంద్ గెహ్లోత్ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజ్యాంగంలోని వివిధ అధికరణలు షెడ్యూల్ కులాలు, తెగల రక్షణకు పూచీపడు తున్నాయి. ముఖ్యంగా 17వ అధికరణ అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినవారైనా శిక్షార్హు లని చెబుతోంది. ఆ అధికరణకు అనుగుణంగా 1955లో అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి మరింత పదునుపెడుతూ 1976లో పౌరహక్కుల రక్షణ చట్టాన్ని చేశారు. అయితే అందులోని లోపాలను పరిహరిస్తూ 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. ఆ చట్టం కింద అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలు ఏర్పడాలి. రాష్ట్ర స్థాయి కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు, జిల్లా స్థాయి కమిటీలు కనీసం మూడు నెలలకోసారి సమావేశం కావాలి. అయితే దేశంలోని 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఈ కమిటీల గురించి పట్టించుకోవడం లేదని గెహ్లోత్ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016 మొదలుకొని 2018 వరకూ చూస్తే ఆ కమిటీలు ఒక్కసారైనా సమావేశం కాలేదని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో 25 మందితో ఏర్పడే కమిటీలో హోంమంత్రి, ఆర్థికమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి తదితరులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మంది ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఉన్నతాధికారులుండాలి. జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్, ఎస్పీలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరుపై నిఘా వుండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనడం వెనక ముఖ్య కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది. దళితులపై అమలవుతున్న అత్యాచారాలను, హత్యాకాండను నిలువరించడంలో పౌర హక్కుల రక్షణ చట్టం దారుణంగా విఫలమవుతున్నదని పలు దళిత, ప్రజా సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. మరింత సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులో సైతం అన్ని పార్టీలూ ముక్తకంఠంతో కోరడంతో పౌర హక్కుల రక్షణ చట్టం స్థానంలో మరో చట్టాన్ని తీసుకు రావాలని నిర్ణయించారు. చివరకు 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. కానీ విషాద మేమంటే ఆ తర్వాత మరో మూడేళ్లు గడిచాకగానీ ఆ చట్టానికి సంబంధించిన మార్గ దర్శక సూత్రాలు రూపొందలేదు. ఈలోగా 1991 ఆగస్టులో చుండూరు మారణకాండ చోటు చేసుకుంది. 2014లో ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలుండాలని భావించడంలో కీలకమైన ఉద్దేశం వుంది. ఆ చట్టం సరిగా అమలు కావడంలేదని, తమను వేధిస్తున్న వారిపై కేసు పెట్టడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని దళితులు ఆరోపిస్తుంటారు. దళితులను వేధించేవారిలో పెత్తందారీ కులాలకు చెందినవారు, స్థాని కంగా డబ్బు, పలుకుబడి ఉన్నవారే అధికం. అందువల్ల సహజంగానే పోలీసులు చూసీ చూడనట్టు ఉండిపోతారు. అవతలివారి నుంచి డబ్బు తీసుకుని రాజీకి రావాలని ఒత్తిళ్లు తెస్తారు, బెదిరిస్తారు. కమిటీలు చురుగ్గా పని చేస్తుంటే కిందిస్థాయి అధికారులు అప్రమత్తంగా వుంటారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలకు సిద్ధపడకపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందన్న భయం వారిని వెన్నాడు తుంది. అటు పోలీ సుల వద్దా, ఇటు న్యాయస్థానాల్లోనూ కేసులు పెండింగ్ పడినప్పుడు ఏ దశలో, ఎందుకు నిలిచి పోయాయో కమిటీలు పరిశీలించి... ఆ అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటులో జాప్యంవల్ల లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడంవల్ల కేసుల విచారణ నత్త నడకన సాగుతున్నదని తేలితే అందుకు అవసరమైన చర్యకు సిఫార్సు చేస్తాయి. నిర్ణీత కాల వ్యవధిలో కమిటీలు సమావేశమవుతుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కానీ మూడేళ్లపాటు 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎంతగా అలసత్వం ప్రద ర్శిస్తున్నాయో సులభంగానే తెలుస్తుంది. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. దేశంలో ఒక్క హరియాణా మాత్రమే 2016, 2017 సంవత్సరాల్లో నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించింది. 2018లో ఒకసారి మాత్రమే సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వరసగా మూడేళ్లూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు సమావేశమే కాలేదని మంత్రి ఇచ్చిన జవాబు చూస్తే అర్థమవుతుంది. దళితుల విషయంలో చంద్రబాబుకున్న చిన్న చూపేమిటో వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. దేశ జనాభాలో ఎస్సీ కులాలు 16.6 శాతమైతే, ఎస్టీ వర్గాలవారు 8.6 శాతం. ఈ వర్గాలవారు సామాజికంగా ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వివక్ష, వేధింపులు, దాడులు అవరోధంగా ఉంటున్నాయి. ఆ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేయడం ఎంత అవసరమో... ఆ వర్గాలు నిర్భయంగా, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కూడా అంతే ప్రధానం. అయితే ఏటా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని నిఘా, పర్యవేక్షణ కమిటీల పనితీరుపై ఇస్తున్న సమాచారం నిరాశాజనకంగానే వుంటోంది. ఈ విషయంలో రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి. చట్ట నిబంధనల్ని ప్రభుత్వాలే పాటించకపోతే ఇక సాధారణ పౌరుల నుంచి ఏం ఆశించగలం? -
'న్యాయ వ్యవస్థతోనే అన్ని సమస్యలు పరిష్కారం'
సాక్షి, ఢిల్లీ : రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. న్యాయవ్యవస్థ ద్వారానే సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని వెల్లడించారు. ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా తలాక్, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు,దివ్యాంగ హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అందరూ ప్రశంసించారన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ సముచిత న్యాయం కల్పించిదని కొనియాడారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్ ఠాక్రే) ప్రస్తుతం డేటా భద్రత, సైబర్ క్రైమ్ వంటి నేరాలు పెరిగిపోతూ న్యాయవ్యవస్థకు సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉగ్రవాదం, సైబర్ క్రైహ్ అనేవి ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో న్యాయ వ్యవస్థ ముందుకు రావాలని, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పని చేస్తే బాగుంటుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, ఇతర కేంద్ర మంత్రులు,పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, వివిధ దేశాల న్యాయనిపుణులు హాజరయ్యారు. -
జడ్జీలు నిర్భీతి ప్రబోధకులుగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడానికి జడ్జీలు నిర్భయులైన ప్రబోధకులుగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2012లో ఓ న్యాయవాది యూపీలోని అలహాబాద్ చీఫ్ మెజిస్ట్రేట్పై దాడికి ప్రయత్నించాడు. ఈ కేసును శుక్రవారం విచారించిన ధర్మాసనం..‘జడ్జీలు నిర్భీతితో, నిష్పాక్షికంగా తమ తీర్పులను ఇవ్వాల్సి ఉంటుంది. వారిని అవమానించడం, దూషించడం ద్వారా తీర్పులను ప్రభావితం చేయరాదు’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువకోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానాను సమర్థించిన సుప్రీంకోర్టు.. శిక్ష అమలును మూడేళ్ల పాటు వాయిదా వేసింది. 2022, జూన్ 30 వరకూ సదరు న్యాయవాది అలహాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోకి రాకుండా, సత్ప్రవర్తనతో మెలిగితే ఈ శిక్షను కొట్టివేస్తామని స్పష్టం చేసింది. -
తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: న్యాయం కోసం ఎదురుచూసే వారికి న్యాయస్థానం ఒక దేవాలయం లాంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం సడలిపోకుండా ఉండాలంటే న్యాయవాదులు తమ విధులను నిష్టతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం ప్రారంభించారు. శాశ్వత హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది జస్టిస్ పి.వెంకటరామారెడ్డి, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జస్టిస్ రంజన్ గొగోయ్ అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీఏ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మినియేచర్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు మాయని మచ్చ కింది కోర్టుల్లో 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇందులో 81 లక్షల కేసులు ఒక ఏడాదిలోనే దాఖలయ్యాయని, 50 లక్షల కేసులు చిల్లర కేసులని, 25 లక్షల కేసులు పదేళ్ల పాతవని చెప్పారు. 50 లక్షల చిల్లర కేసులను పరిష్కరించడానికి ఏం చేయాలనే దానిపై ప్రధాన న్యాయమూర్తులు ఆలోచన చేయాలని తెలిపారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థకు ఈ పెండింగ్ కేసులో ఓ మాయని మచ్చగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కింది కోర్టుల్లో భారీ స్థాయిలో ఖాళీలున్నాయని, వీటి భర్తీకి ఆయా హైకోర్టులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఖాళీల భర్తీకి తాము తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 75 శాతం ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేస్తామని తెలిపారు. హైకోర్టులో 392 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇందులో 272 ఖాళీలకు సంబంధించి ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎలాంటి సిఫార్సులు రాలేదన్నారు. 130 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, మరో 100 ఖాళీల భర్తీ విషయం కొలీజియం పరిశీలనలో ఉందని, 14 ఖాళీలకు సంబంధించి తాము చేసిన సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఈ తాత్కాలిక హైకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. రైతులే అసలైన రాజధాని నిర్మాతలు అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించడం, శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన చేయడం ఓ చరిత్రక ఘట్టమని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆశావహ దృక్పథంతో ఈ హైకోర్టు ప్రతిష్టను మరింత పెంచాలని న్యాయమూర్తులు, న్యాయవాదులను కోరారు. రాజధాని కోసం తల్లిలాంటి భూములిచ్చిన రైతులే అసలైన రాజధాని నిర్మాతలని అన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో, ఆశలతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారని, న్యాయవ్యవస్థపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జస్టిస్ సుభాష్రెడ్డి మాట్లాడుతూ... విభజన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో 1.70 లక్షల చొప్పున కేసులున్నాయన్నారు. జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ... ఈ హైకోర్టు భవనాన్ని ఓ వ్యవస్థగా మార్చాల్సిన బాధ్యత న్యాయవాదులు, కక్షిదారులతో పాటు ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు విభజన ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సాఫీగా పూర్తయిందని తెలిపారు. చరిత్రను పునరావృతం చేస్తాం... రాష్ట్ర విభజన వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాతోపాటు పలు హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు సదా రుణపడి ఉంటానని చెప్పారు. శాతవాహనుల కాలంలో అమరావతి ఓ వెలుగు వెలిగిందని, ఇప్పుడు మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తామని తెలిపారు. అమరావతిలో నల్సార్ వంటి న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భూమి ఇచ్చేందుకు, యూనివర్సిటీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. -
స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకుంటే బలవంతుడిదే రాజ్యం
సాక్షి, అమరావతిబ్యూరో: దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ చాలా అవసరమని, లేకపోతే బలవంతుడిదే రాజ్యం అవుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) 44వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన చలమేశ్వర్ మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగిందని, తాను చెప్పిందే సరైందన్న వితండ వాదంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆ వితండవాదంతో తాను విభేదించడం వల్లే తన మాటలు వివాదాస్పదమయ్యాయన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లలకు జవాబుదారీతనం నేర్పాలని సూచించారు. మంచి, చెడులను ధైర్యంగా చెప్పగలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. తెలంగాణలో సీపీఎస్ రద్దు చేస్తానన్న బాబు ఏపీలో చేయరెందుకు..? మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సీపీఎస్ అంశంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే సీపీఎస్ రద్దు చేస్తామంటూ వాగ్దానాలు ఇచ్చారని, మరి నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఉద్యోగులను మోసం చేయడానికి ఓ టక్కర్ కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వం కాలయాపన నెపంతో కమిషన్ వేస్తే అది ఎప్పటికీ తేలదని, పరిశీలిస్తూ పర్యటిస్తూ దాటవేస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కమిషన్ వేసి, నివేదిక తెప్పించి రద్దు చేయాల్సిందని వ్యాఖ్యానించారు. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయ మూర్తుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉందని, దీంతో పౌరులకు సత్వర న్యాయం అందే పరిస్థితులు కనిపించటం లేవంటూ న్యాయవాది ఎస్.రాజ్కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించగా.. అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని వ్యాజ్యంలో పిటిషనర్ వివరించారు. -
హక్కులకు భంగం కలిగితే ఊరుకోం
న్యూఢిల్లీ: ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను రద్దు చేసే విషయంలో పార్లమెంటు చర్యలు తీసుకునేంతవరకు న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377 చట్టబద్ధతపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు అభిప్రాయ పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం దాదాపు 90 నిమిషాల పాటు విచారణ జరిపింది. సెక్షన్ 377పై అనుకూల, వ్యతిరేక వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ నెల 20లోపు అనుకూల, వ్యతిరేక వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని కోరింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన రిటైరవుతున్న నేపథ్యంలో ఆ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమానత్వపు హక్కు వారికెలా వర్తిస్తుంది? విచారణ సందర్భంగా అపోస్టలిక్ అలయెన్స్ ఆఫ్ చర్చెస్, ఉత్కళ్ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున న్యాయవాది శ్యామ్ జార్జ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 377 సెక్షన్ను సవరించడమా, కొనసాగించడమా అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటేనని అన్నారు. దీనికి స్పందనగానే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకునేవరకూ తాము నిరీక్షిస్తూ కూర్చోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం శ్యామ్ జార్జ్ వాదన కొనసాగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15 ప్రకారం సమానత్వపు హక్కు స్త్రీ, పురుషులైన పౌరులందరికీ వర్తిస్తుంది కానీ ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్)లతో పాటు ప్రత్యేక సెక్సువల్ ఓరియంటేషన్ (లైంగిక ధోరణి) ఉన్న వ్యక్తులకు వర్తించదన్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకే వదిలేసింది. ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని.. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికి పోవొద్దని కోరింది. దీనికి సుప్రీం ధర్మాసనం కూడా అంగీకరించింది. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయని పేర్కొంది. మూక హత్యల నిరోధానికి చట్టం! న్యూఢిల్లీ: అల్లరి మూకలు చేసే దాడులు, హత్యలను సమర్థంగా నిరోధించేందుకు కొత్త చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు మంగళవారం పార్లమెంటుకు సూచించింది. ప్రజలే సొంతంగా పాలనను, చట్టాలను చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే భయానక పద్ధతిని అనుమతించకూడదంది. మూకదాడులు, గో రక్షణ దాడులకు సంబంధించిన నేరాలను నియంత్రించడం, దోషులకు శిక్ష విధించడం తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం పలు సూచనలు చేసింది. శాంతి భద్రతలను కాపాడటంతోపాటు, చట్టాలు అమలయ్యేలా చూడటం రాష్ట్రాల బాధ్యతేనంది. మూక దాడుల వంటి హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ, తెహ్సీన్ పూనావాలా తదితరులు వేసిన పిటిషన్లపై విచారణను కోర్టు మంగళవారం కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రానికి పలు సూచనలు జారీ చేసింది. కోర్టు సూచించిన కొన్ని చర్యలు... ♦ మూక దాడులను నిరోధించేందుకు ప్రతి జిల్లాలోనూ ఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. ♦ దాడులు చేసే అవకాశం ఉన్న వ్యక్తులను ముందే పసిగట్టేందుకు ఓ నిఘా బృందాన్ని డీఎస్పీ సహాయంతో నోడల్ అధికారి ఏర్పాటు చేయాలి. ♦ గతంలో మూక దాడులు జరిగిన జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలను గుర్తించే పనిని రాష్ట్రాలు తక్షణం ప్రారంభించి మూడు వారాలు ముగిసేలోపు ఆయా ప్రాంతాలను గుర్తించాలి. ♦డీజీపీలు లేదా హోం శాఖ కార్యదర్శులు నోడల్ అధికారులతోనూ, పోలీసుల నిఘా విభాగం తోనూ నిత్యం సమీక్షలు నిర్వహించాలి. ♦ మూక దాడులు జరిగేందుకు అవకాశం ఉండేలా ఎక్కడైనా గుంపు కనిపిస్తే వారిని చెదరగొట్టాల్సిన బాధ్యత ప్రతి పోలీసుకూ ఉంటుంది. ♦ మూక దాడులకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వా లు ప్రకటనల రూపంలో హెచ్చరించాలి. -
మార్పు కోసం న్యాయస్థానాలే ప్రయత్నించడం లేదు
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో మార్పునకు ఉన్నత న్యాయస్థానాలు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించడం లేదని విశ్రాంత న్యాయమూర్తి, అఖిల భారత న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్ అన్నారు. న్యాయవ్యవస్థలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థే కొనసాగుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. సామాన్యుడికి సత్వర న్యాయం అందడం లేదంటే, వ్యవస్థలోని లోపాలే అందుకు కారణమని చెప్పారు. వ్యవస్థలో మార్పు రాకుండా సత్వర న్యాయం సాధ్యం కాదన్నారు. క్రిమినల్ కేసుల్లో 40 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సివిల్, క్రిమినల్ కేసుల విచారణకు నిర్ధిష్ట కాలపరిమితి విధిం చాల్సిన అవసరముందన్నారు. నియామకాలు, పదోన్నతులు సకాలంలో జరగడం లేదని, న్యాయాధికారులు ఉద్యోగం లో చేరిన హోదాతోనే పదవీ విరమణ చేస్తున్నారని అన్నారు. అందరికీ సత్వర, సమాన న్యాయం అందినప్పుడే న్యాయస్థానాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. కింది కోర్టుల్లో న్యాయాధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు హైకోర్టు అంతర్గత విచారణ చేపట్టడం మంచిదన్నారు. సమావేశం అనంతరం న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వేతనాలు పెంపు, ఇతర సమస్యలపై జాతీయ జ్యుడీషియల్ పే కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.వెంకటరామారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. -
ఏకకాల ఎన్నికలకు 24 లక్షల ఈవీఎంలు
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 24 లక్షల ఈవీఎంలు అవసరమని న్యాయకమిషన్కు ఎన్నికల సంఘం తెలిపింది. అంతే సంఖ్యలో ఓటరు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలు కావాలని వెల్లడించింది. ఏకకాల ఎన్నికలపై చర్చించేందుకు ఈసీ ఈ నెల 16న న్యాయ కమిషన్తో భేటీ అయ్యింది. కాగా రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి రావంటూ ఈసీ చెప్పడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. ఆర్టీఐ దరఖాస్తు మేరకు పార్టీల విరాళాల వివరాలు చెప్పేందుకు ఈసీ నిరాకరించింది. -
ఇందిరా హయాంలో జరిగిన ఘటనలు మరిచిపోయారా?
-
మూడో వ్యవస్థ జోక్యం రానివ్వొద్దు!
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థకు సమస్యలు కొత్త కాదని, గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని స్వతంత్రంగా నిలిచిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. భేదాభిప్రాయాలు, వాదోపవాదాలు సమస్య పరిష్కారదిశగా ఉండాలని, లేనిపక్షంలో మూడో వ్యవస్థ పెత్తనం చేసేందుకు సిద్ధంగా ఉందని.. అదే జరిగితే న్యాయవ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు (మూడో వ్యవస్థ ఏదో ఆయన పేర్కొనలేదు). శుక్రవారం రాత్రి ఉమ్మడి హైకోర్టు ఆవరణలో తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాద సం ఘాల వార్షికోత్సవ సభలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయవ్యవస్థ సంధి కాలంలో ఉందని, మా ర్పులను ఆహ్వానించాలని.. రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తూనే పరీక్షలను నెగ్గుకురావాల్సిన సమయమిదని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి ప్రయత్నిద్దాం.. ఉమ్మడి హైకోర్టులో చాలా రోజులుగా ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉందని.. ఎప్పుడు భర్తీ అవుతుందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే తెలియదని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రధాన న్యాయమూర్తి పోస్టు భర్తీ కాకపోతే... కనీసం ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టులను భర్తీ చేయాలని సీజేఐని కోరాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి సూచించారు. కొలీజియంతో మాట్లాడి ఖాళీల భర్తీకి ప్రయత్నిస్తానన్నారు. ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో పదేళ్ల సర్వీసు ఉన్న న్యాయవాదులకు కోర్టు ఆవరణలో చాంబర్లు ఉంటాయని.. అదే తరహాలో తెలంగాణ, ఏపీల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలోలా సివిల్, క్రిమినల్ కేసులు మాత్రమే చేస్తే సరిపోదని.. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్, టెక్నాలజీ, విభిన్న ట్రిబ్యునల్ల కేసులు వాదించే పరిజ్ఞానం పెంచుకోవాలని యువ న్యాయవాదులకు సూచించారు. సీజే భర్తీ చిదంబర రహస్యం: ఏసీజే ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, అదో చిదంబర రహస్యంగా మారిందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యాఖ్యానించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణను న్యాయవాదులు సన్మా నించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ న్యాయవాదుల సంఘాల పూర్వపు అధ్యక్షులు చల్లా ధనంజయ, జల్లి కనకయ్య, కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన కె.బి.రామన్నదొర, సి.దామోదర్రెడ్డి తదితరులు ప్రసంగించారు. పారదర్శకంగా లేదనేది అపోహ.. న్యాయవ్యవస్థ పారదర్శకంగా లేదనేది అపోహ అని.. ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాకు కూడా అదే అభిప్రాయముందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టులో కేసు దాఖలు చేయడం దగ్గరి నుంచి వాదనల వరకు అన్నీ బహిరంగంగానే జరుగుతాయన్నారు. కేసుల విచారణలో జాప్యం, పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థే కారణమనే విమర్శలు ఉన్నాయని.. చివరికి చిన్నపిల్లల మాదిరిగా జడ్జీలకు సెలవులు ఎందుకనే విమర్శలూ చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టుల్లో కనీస వసతులు లేకపోవడంపై.. ఏళ్ల తరబడి సగం సగం సిబ్బంది, సగం మంది జడ్జీలతోనే కోర్టులు పనిచేయడంపై ఎవరూ అడగడం లేదేమని ప్రశ్నించారు. కోర్టుల్లో పారదర్శక లేదనేది అపోహేనని నిరూపించాలంటే.. దిగువ స్థాయి కోర్టులన్నింటిలో మాతృభాషలో వాద ప్రతివాదనలు, తీర్పులు వెలువరించాల్సిన అవసరముందని చెప్పారు. -
మరింత పారదర్శకత అవసరం
న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. హైకోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేసే సమయంలో పనితీరు సరిగా అంచనావేయడం అరుదుగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ అత్యున్నత న్యాయవ్యవస్థ: వివాదాంశాలు, భవిష్యత్తు అంచనాలు’ అంశంపై నిపుణుల బృందంతో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎంపిక ప్రక్రియలో పాల్గొనేవారు.. వారి అభిప్రాయాల్ని అధికారికంగా నమోదు చేయాలి’ అని సూచించారు. సుప్రీంకోర్టులో అవసరమైన సంస్కరణలపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 31. ఆ సంఖ్య ప్రకారం చూస్తే.. సుప్రీంలో తమకు ప్రాతినిధ్యం ఉండడాన్ని ప్రతి రాష్ట్రం హక్కుగా భావిస్తోంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టులో శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఉండాల్సిన అవసరంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై మళ్లీ దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. -
భిన్న రూపాల్లో హిందూ ఫాసిజం
హైదరాబాద్: దేశంలో సంక్లిష్టమైన పరిస్థితి ఉందని, హిందూ ఫాసిజం విస్తృతంగా ముందుకు సాగుతోందని ప్రముఖ రచయిత, సామాజికవేత్త అరుంధతీరాయ్ అన్నారు. హిందూ ఫాసిజం భిన్నమైన రూపాల్లో అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. గోరక్షణ పేరుతో దళితులను చంపుతున్నారని విమర్శించారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్షా పాత్ర ఉందని సీబీఐ విచారణ చేసిందని, ఈ కేసును జస్టిస్ లోయాకు విచారణకు అప్పగించగా అత ను అనుమానాస్పద రీతిలో మృతి చెందా రన్నారు. అమిత్షాను కాపాడటానికే లోయా ను హత్య చేశారనే ఆరోపణలున్నాయన్నారు. న్యాయవ్యవస్థను కూడా వదలట్లేదు.. భూమి, పర్యావరణం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో హిందుత్వాన్ని జోడిస్తున్నారని, చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదల్లేదన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ, ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల చదువుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థి రాజకీయాలు లేకపోవటం వల్ల ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉందని, కలిసి పంచుకునే భావజాలం లేదన్నారు. విలువల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.నారాయణరావు, ప్రొఫెసర్ నందిని సుందర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శేషయ్య, వి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నేనే పీఎం అయితే, వాళ్లను ఉరితీసేవాణ్ణి!
సాక్షి, ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సల్మాన్ భాయ్కి విధించిన శిక్ష చాలా కఠినమైనదని, ఇప్పటికే ఆయన జీవితంలో ఎన్నో అనుభవించాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ చేసిన ఎన్నో మానవతా సేవా కార్యక్రమాలను గుర్తించాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్శర్మ కూడా సల్మాన్ మద్దతుగా ముందుకొచ్చాడు. సల్మాన్ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించకుండా అతనికి న్యాయవ్యవస్థ తీవ్ర విధించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లు. వాళ్లను నేను కలిశాను. సల్మాన్ మంచి వ్యక్తి. ఆయన ప్రజలకు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆ తప్పు చేశారో లేదా తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే నకిలీ, వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తుందంటూ మరో ట్వీట్లో మీడియాపై మండిపడ్డారు. ‘మీ పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్ కథనాలు రాయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడారు. నెగిటివ్ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారు’ అంటూ ఓ వెబ్సైట్ను ఉద్దేశించి దుర్భాషలాడారు. ‘చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేస్న్యూస్ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్లపై విమర్శలు రావడంతో ఆయన వాటిని డిలీట్ చేశారు. ఆ ట్వీట్లను పట్టించుకోవద్దని, తన అకౌంట్ను హ్యాక్ చేశారని మరో ట్వీట్లో కపిల్ శర్మ తెలిపాడు. ఈ ట్వీట్ల వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ ట్వీట్ను కూడా కపిల్ శర్మ తొలగించడం గమనార్హం. Bhai @KapilSharmaK9 tere tweets tere naye show se jyada funny hain. 😂😂 pic.twitter.com/XiClPvhBXn — PhD in Bakchodi (@Atheist_Krishna) April 6, 2018 -
అభిప్రాయాలు చెప్పనివారికి మాట్లాడే అర్హత ఉండదు
సాక్షి, విశాఖపట్నం: సమకాలీన వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయాలు చెప్పలేని వారికి సమాజం గురించి మాట్లాడే అర్హత ఉండదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ‘ఆరేడు నెలలుగా భారత న్యాయవ్యవస్థలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కానీ వాటిపై కచ్చితమైన అభిప్రాయాలు చెప్పిన వారు చాలా తక్కువ. నన్ను సమర్థించమని చెప్పను. నేను లేవనెత్తిన లోపాలు కరెక్టా? కాదా? అని చెప్పడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్ధం కావడం లేదు.. ఏమీ మాట్లాడక పోవడం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాద’న్నారు. పత్రికా రంగంలో అక్షరబ్రహ్మగా పేరొందిన సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ జర్నలిజంలోకి అడుగుపెట్టి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో ఆయనను ఘనంగా సన్మానించారు. అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్ చలమేశ్వర్ వివిధ అంశాలపై ప్రసంగించారు. ‘పద్మావతి సినిమా రిలీజ్ అవ్వాలా? వద్దా అని ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడారు. కానీ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం అభిప్రాయాలు చెప్పేందుకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని చలమేశ్వర్ అన్నారు. జడ్జి అయిన కొత్తలో తొలి సన్మానం ఏబీకే ప్రసాద్ చేతుల మీదుగానే జరిగింది. పేదవాడ్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులివ్వాలని ఆనాడు ఆయన చెప్పిన మాటలు నేటికీ గుర్తున్నాయి. అదే బాటలో ప్రస్థానం కొనసాగిస్తున్నానన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏ ఒక్క పార్టీ కూడా కేవలం 3034 శాతం ఓట్లతోనే మెజార్టీ సీట్లు సాధించి గద్దెనెక్కాయి. ఈ దేశంలో మేం ఏం చెబితే అదే వేదం, మేం ఏ కావాలంటే అదే జరుగుతుంది అన్న ధోరణిలో పాలక పక్షాలు పాలన సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వారు అరాచకులు, దుర్మార్గులు, ప్రజా కంఠకులు. కొత్తగా అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా న్యాయ వ్యవస్థకు 2 శాతానికి మించి కేటాయింపులుండవని చెప్పారు. పత్రికా రంగానికే తలమానికమైన ఏబీకే ప్రసాద్ను సత్కరించడం అభినందనీయమన్నారు. ప్రశ్నించేతత్వం లేని సమాజానికి మనుగడ లేదు ప్రశ్నించేతత్వం కోల్పోయిన సమాజానికి మనుగడ ఉండదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని ఇష్టమొచ్చిన రీతిలో ఖర్చు చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. ఇటీవలే తెలంగాణా ప్రభుత్వం దుర్వినియోగం చేసిన తీరును కాగ్ ఎండగట్టింది.. నేడో రేపో ఏపీ ప్రభుత్వ తీరును కూడా కాగ్ బట్టబయలు చేయనుందన్నారు. ముగ్గురు సహ న్యాయమూర్తులతో కలిసి చరిత్రలో తొలిసారిగా సుప్రీం చీఫ్ జస్టిస్, న్యాయ వ్యవస్థ లోపాలపై ప్రశ్నించడం ద్వారా జస్టిస్ చలమేశ్వర్ నిజంగా చరిత్ర సృష్టించారన్నారు. పత్రికా రంగంలో నిబద్ధత, నిజాయతీకి నిర్వచనం ఏబీకే అని, 62 ఏళ్లుగా ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారన్నారు. ఆయన వారసత్వాన్ని, విలువలన్ని, పాత్రికేయాన్ని కొనసాగించే అదృష్టం నాకు లభించింది. ఏబీకే గారు ఎప్పుడూ ప్రభుత్వాన్ని పొగుడుతూనో, ముఖ్యమంత్రికి భజన చేస్తూనో ఒక్క వాక్యం రాయలేదని చెప్పారు. పౌర సమాజం పోరుబాటపట్టాలి తనకు జరిగిన సన్మానంపై ఏబీకే ప్రసాద్ స్పందిస్తూ ఉదయం సహా ఐదారు ప్రముఖ పత్రికలకు సంపాదకత్వం వహించే అవకాశం తనకు లభించిందని, 23 జిల్లాల్లో ఆరేడువేల మంది జర్నలిస్టులను తయారు చేయగలిగానన్నారు. 62 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు ఈ రంగంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేడు పత్రికా వ్యవస్థ గొంతు నులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పత్రికలతో పాటు పౌర సమాజం కూడా క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వాలపై పౌరసమాజం పోరాటం చేసే దిశగా పత్రికలు వారిలో చైతన్యం నింపాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగించారు. -
న్యాయ వ్యవస్థపై చర్చ జరగాలి : సురవరం
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థపై న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మఖ్దూంభవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై దళిత, వామపక్ష సంఘాలు ఆందోళనగా ఉన్నాయన్నారు. దీనిపై ఏప్రిల్ 2న దళిత సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయన్నారు. ఈ నిరసనలకు దేశవ్యాప్తంగా సీపీఐ మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానంటున్న ఫ్రంట్ గురించి తమతో చర్చించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదంపై కేసీఆర్ వైఖరి ఏమిటో చెప్పకుండా ఫ్రంట్లో చేరే విషయంపై ఏమీ చెప్పలేమన్నారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. -
న్యాయవ్యవస్థపై ప్రజలకు అచంచల విశ్వాసం
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థపై ఈ దేశ ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని వమ్ము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయమూర్తులు తెల్ల చొక్కాలాంటి వారని, ఆ చొక్కాపై చిన్న మరక పడినా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుంటారన్నారు. మరకలు అంటించే వ్యక్తులు కూడా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. హైకోర్టు ప్రాంగణంలో సోమవారం హైకోర్టు న్యాయవాదులు వెంకయ్యనాయుడిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమ్మ ఓకే. ఇందిర నో.. ‘నేను కూడా న్యాయవాదినే. నా తల్లి కోరిక మేరకు న్యాయవాదినయ్యాను. అయితే ఇందిరా గాంధీ వల్ల న్యాయవాద వృత్తికి దూరమయ్యాను. ఇందుకు ఇందిరకు ధన్యవాదాలు చెప్పుకోవాలి (వ్యంగ్యంగా). ఎమర్జెన్సీ సమయంలో నన్ను జైలులో పెట్టకుండా ఉంటే బహుశా నేను న్యాయవాద వృత్తిలో కొనసాగి ఉండే వాడిని. అయితే అప్పటి ప్రభుత్వం జైల్లో వేయడం వల్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఆంధ్రా వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ్ను ఆహ్వానించాను. అది నేరమంటూ నన్ను జైల్లో వేశారు. అది నన్ను రాజకీయాల దిశగా నడిపించింది. జస్టిస్ పీఏ చౌదరి వంటి న్యాయ ఉద్దండుడితో అత్యంత సన్నిహితంగా తిరిగాను. న్యాయవాదిగా నేను నా నిర్బంధానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించుకున్నా. జడ్జీలు నన్ను ఎందుకు వదిలేయకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రశ్నించారు. వదిలేయడానికి ఇబ్బంది లేదని, వదిలేస్తే వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వెళతారని ఆ పీపీ చెప్పారు. చివరకు అదే నిజమైంది’అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ, కార్యదర్శులు పాశం సుజాత, బాచిన హనుమంతరావు, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ పీపీ సి.ప్రతాప్రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఉద్వేగానికి గురైన వెంకయ్య... అంతకు ముందు వెంకయ్యనాయుడు తన తల్లి గురించి మాట్లాడుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ‘మా అమ్మ నేను పుట్టక ముందే నన్ను లాయర్ని చేయాలనుకుంది. అయితే దురదృష్టవశాత్తూ నేను పుట్టిన ఏడాదికే ఆమెను కోల్పోయాను. వెనక నుంచి ఆమెను గేదె పొడవడంతో చనిపోయారు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నేను తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంటాను’అని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చొరవ తీసుకోవాలని వెంకయ్యనాయుడిని కోరారు. -
రెండు హైకోర్టులు ఉంటే పరిస్థితి ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయాధికారులను రెండు నూతన రాష్ట్రాల మధ్య విభజించే అధికారం హైకోర్టుకే ఉందని ఏపీ న్యాయాధికారుల సంఘం వాదించగా.. ఒకవేళ రెండు కొత్త రాష్ట్రాల్లో విడిగా హైకోర్టులు ఉండి ఉంటే అప్పుడు ఎవరి బాధ్యత అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయాధికారుల విభజన జరగకుండా నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం వారంరోజులుగా విచారిస్తోంది. బుధవారంనాటి విచారణలో ఏపీ న్యాయాధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘‘న్యాయాధికారుల నియామకాలను ఇతర సివిల్ అధికారుల నియామకాలతో పోల్చరాదు. న్యాయవ్యవస్థలోని సిబ్బంది స్వతంత్రతకు ఇబ్బంది రాకుండా చూడడమే ఇందులోని తార్కిక ఆలోచనగా గమనించాలి.. అందువల్ల న్యాయాధికారుల విభజనకు హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను గమనంలోకి తీసుకోవాలి’’ అని నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ ‘‘ఒకవేళ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రెండు హైకోర్టులు ఏర్పడి.. ఈ అంశంలో రెండు హైకోర్టుల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో విభజన ప్రక్రియ ఎవరు చేపట్టాలి?’’ అని ప్రశ్నించారు. అలాంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తిరిగి సుప్రీంకోర్టునే ఆశ్రయించాల్సి వస్తుందని ఆదినారాయణరావు సమాధానం ఇచ్చారు. హైకోర్టు సూచించిన మార్గదర్శకాలను ఆమోదించాలని నివేదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది. -
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది
టీఆర్ఎస్పై రాష్ట్రపతికి అఖిల పక్షం ఫిర్యాదు ► దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు ► బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అఖిల పక్ష, టీజేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై పోలీసులను ప్రయోగించి చిత్రహింసలకు గురిచేస్తోందని రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే సంపత్కుమార్ తదితరులు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయవిచారణ జరిపేలా ఆదేశించండి.. ఇసుక దందాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తన బంధువులతో కలసి నడుపుతున్న ఇసుక దందాను ప్రశ్నించిన నేరెళ్లకు చెందిన 8 మంది దళితులను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించారు. నేరెళ్లలో ఎస్పీ దగ్గరుండి మరీ దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా స్వతంత్ర కమిషన్తో విచారణ జరిపేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు నష్టపరిహారమందేలా చూడాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, వ్యవసాయంలో చేయూత కోసం రైతులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వారిని అణగదొక్కుతోందన్నారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఎలా కాలరాస్తోందో రాష్ట్రపతికి సమర్పించినట్లు చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించార న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఎంపీటీసీ ఉపట్ల శ్రీనివాస్పై జరిగిన దాడిని కోదండరాం ఖండించారు. -
న్యాయవ్యవస్థా కట్టుబడి ఉండాల్సిందే
♦ అధికారాల విభజనపై లోక్సభలో న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ♦ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం కష్టమని వ్యాఖ్య న్యూఢిల్లీ: అధికారాల విభజనకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఇతర ప్రజాస్వామిక మూల స్తంభాలకు నిర్దేశించిన విధంగానే న్యాయవ్యవస్థకు అధికారాలు నిర్దేశించారని కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్సభలో పేర్కొన్నారు. పలు తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు, శాసనవ్యవస్థ పరిధిలోకి అడుగుపెడు తోందని పలువురు సభ్యులు పేర్కొనడంపై ఆయన పైవిధంగా స్పందించారు. జడ్జీల నియామకాలపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... అణ్వస్త్రాలను ప్రయోగించే విషయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సీవీసీ నియామకాల్లోనూ ప్రధానిపై విశ్వాసం ఉన్నప్పుడు న్యాయమూ ర్తులను నియమించే విషయంలో ఎందుకు ఉండదని మంత్రి ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు. క్రికెట్ నిర్వహణ నుంచి మెడికల్ ప్రవేశ పరీక్షల వరకూ వివిధ అంశాల్లో సుప్రీంకోర్టు, శాసన వ్యవస్థ పరిధిలోకి జోక్యం చేసుకుంటోందని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ పేర్కొన్నారు. నీట్ ఎంట్రన్స్, క్రికెట్ నిర్వహణ అంశాల్లో కోర్టు తీర్పులపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. ప్రత్యక్ష ప్రసారాలు కష్టం: కోర్టు ప్రొసీడిం గ్స్ను లైవ్ టెలికాస్ట్ చేసే అంశంపై స్పందిస్తూ.. రెండు సభలే ఉన్నందున లోక్సభ, రాజ్యసభ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలు అందించడం సులభమమని, అయితే దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాల్లో ఇది కష్టమన్నారు. అయితే సభ్యుల సూచన పరిశీలించదగినదని పేర్కొ న్నారు. హైక్టోరుల్లో పెండెన్సీ కమిటీలపై సభ్యులు ప్రశ్నించగా.. కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని సమాధాన మిచ్చారు. తన దృష్టిలో పార్లమెంటు సుప్రీం అని, అయితే చట్టాలను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపిందని, అయితే దీన్ని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. పూర్తయిన బడ్జెట్ ప్రక్రియ: లోక్సభలో ఆర్థిక బిల్లు ఆమోదం పొందడంతో 2017 – 18 ఏడాది బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. ప్రతి పక్షాలు కాంగ్రెస్, బీజేడీ వాకౌట్ చేయడంతో 40సవరణలు చేసిన ఈ బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆర్థిక బిల్లుకు చేసిన సవరణల్లో...ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీలను రూ.2 లక్షలకు పరిమితం చేయడం, పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ను తప్పనిసరి చేయడం లాంటివి ఉన్నాయి. -
నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరం
- జస్టిస్ నాగార్జునరెడ్డి స్వచ్ఛంద నిర్ణయం! - సీజేఐ, ఏసీజే,రాష్ట్ర గవర్నర్కు లేఖ! - ఏసీజే నేతృత్వంలో ఫుల్ కోర్ట్ సమావేశం సాక్షి, హైదరాబాద్: తనపై రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని స్వచ్ఛందంగా నిర్ణరుుంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి టి.ఎస్.ఠాకూర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, గవర్నర్ నరసింహన్లకు తెలియజేసినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాసినట్లు హైకోర్టు వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏసీజే నేతృత్వంలో న్యాయమూర్తులందరూ (ఫుల్ కోర్ట్) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అభిశంసన తీర్మానంలో తనపై చేసిన ఆరోపణలు తనను ఎంతగానో వేదనకు గురి చేశాయని జస్టిస్ నాగార్జునరెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తాను సంపాదించుకున్న ప్రతిష్టను కాలరాసేందుకు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజల విశ్వాసం పైనే న్యాయవ్యవస్థ పనిచేస్తుంది. న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించేటప్పుడు నాపై ప్రజలకు విశ్వాసం ఉందనే భావిస్తూ ఉంటాను. నాపై మోపిన ఆరోపణలను చూసి ప్రజల్లో కొందరైనా నా నిబద్ధత, నిజారుుతీపై సందేహం లేవనెత్తే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి న్యాయవ్యవస్థకు క్షేమకరం కాదు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. విధులకు హాజరు కాకూడదన్న నిర్ణయంలో భాగంగానే ఆయన మంగళవారం కోర్టుకు రాలేదు. -
‘జడ్జీలు సిక్సర్లు కొట్టాలనుకోవద్దు’
న్యూఢిల్లీ: మితిమీరిన జోక్యం వల్లే న్యాయశాఖకు కార్యనిర్వహఖ శాఖకు మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీ కృష్ణ అన్నారు. న్యాయమూర్తులు క్రికెట్లోని అంపైర్ల మాదిరిగా ఉండాలే తప్ప బ్యాట్స్మెన్ల్లా మారకూడదని అన్నారు. ‘పార్లమెంటు-న్యాయవ్యవస్థ’ అనే అంశంపై పీఆర్ఎస్ సదస్సులో ఆయన పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘ఆయా కోర్టుల్లోని న్యాయమూర్తులు పాత్ర క్రికెట్ అంపైర్ల మాదిరిగా ఉండాలి. అంపైర్ నిబంధనల ప్రకారం క్రీడాకారులను, క్రీడను మాత్రమే చూడగలరు. అంతేగానీ, అతడు బ్యాట్ ను తీసుకొని సిక్స్లు కొట్టాలని చూడకూడదు. అది బ్యాట్స్మెన్ పని.. అతడు కొట్టనంత మాత్రానా బ్యాట్ తీసుకుని తానే కొడతానంటే కుదరదు’ అంటూ న్యాయమూర్తిని అంపైర్ తో పోల్చారు. -
ఇది ధర్మాగ్రహం!
త్రికాలమ్ ‘ప్రజలు న్యాయవ్యవస్థపైనే ఆశలు పెట్టుకున్నారు’. ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించాలనీ, అందులో ప్రభుత్వానికి లేశమాత్రమైనా ప్రమేయం ఉండరాదనే వాదనతో విభేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్కి లేఖ రాసిన అనంతరం సాగుతున్న మేధోమథనంలో భాగంగా జస్టిస్ లోధా తన అభిప్రాయం వెలి బుచ్చారు. ఆయన మనోగతం ఏమంటే ప్రభుత్వాలూ, చట్టసభలూ భ్రష్టు పట్టిపోయాయనీ, ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా సైతం విఫలమైందనీ, ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఇంకా ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టి ఉంచిందనీ. ఈ అంశంపైన జనాభిప్రాయం సేకరిస్తే లోధా నమ్మకం నిరాధారమని తేలవచ్చు. మూడు దశాబ్దాల కిందట ప్రజలకు అచంచల విశ్వాసం ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా పదేళ్ళుగా సంభవించిన పరిణామాలు న్యాయవ్యవస్థను సైతం తక్కిన వ్యవస్థల స్థాయికి దిగజార్చాయి. ఈ దుస్థితి మారాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి. బహిరంగ చర్చ జరగాలి. ఇందుకు తెరలేపే సాహసం చేసినందుకు జస్టిస్ చలమేశ్వర్ను అభినందించాలి. ఈ సమస్యను దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చేసినందుకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ ఆయనకు కృత జ్ఞతలు చెప్పాలి. సాగిలపడిన వ్యవస్థ పాలనా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ డీలా పడిన సందర్భాలు చూశాం. పాలనా వ్యవస్థ బలహీనమైనప్పుడు న్యాయవ్యవస్థ ఆధిక్యం ప్రద ర్శించడమూ కనిపించింది. ఆత్యయిక పరిస్థితిలో వొంగమంటే నేలమీద డేకారంటూ పాత్రికేయులను బీజేపీ నేత అడ్వాణీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్య న్యాయవ్యవస్థకూ చక్కగా సరిపోతుంది. ఆత్యయిక పరిస్థితి ప్రకటనకు ముందే 1973లోనే ముగ్గురు న్యాయమూర్తులను పక్కన పెట్టి వారికంటే తక్కువ అనుభవం (సీనియారిటీ) ఉన్న న్యాయమూర్తికి ప్రధాన న్యాయ మూర్తిగా పట్టం కట్టినప్పుడే ఇందిరాగాంధీ న్యాయవ్యవస్థపైన ప్రభుత్వం ఆధిక్యాన్ని చాటారు. కమిటెడ్ జుడిషియరీ (నిబద్ధత కలిగిన న్యాయవ్యవస్థ) అంటూ ప్రభుత్వ సైద్ధాంతిక ధోరణితో ఏకీభవించే న్యాయవ్యవస్థ కావాలంటూ సామ్యవాదం (సోషలిజం)వైపు మొగ్గే న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇవ్వా లన్న విధానం అమలులోకి వచ్చిన తర్వాత దానికి నిరసనగా పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన న్యాయమూర్తులను ఒక చేతి వేళ్ళపైన లెక్క పెట్టవచ్చు. కనుక ప్రజాస్వామ్య పరిరక్షణ తమకు మాత్రమే సాధ్యమని కానీ, అందుకు అవసరమైన అంకితభావం, తెగువ తమకు మాత్రమే ఉన్నాయని కానీ న్యాయనిర్ణేతలు ఎవరైనా భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. ఆ తర్వాతైనా న్యాయవ్యవస్థ నిటారుగా నిలబడలేదు. 1980ల వరకూ బిక్కుబిక్కుమంటూనే ఉంది. 1991లో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం, అనంతరం బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంలో న్యాయ వ్యవస్థది పైచేయి అయింది. సెకెండ్ జడ్జెస్ కేసును 1993లో పరిష్కరించిన న్యాయమూర్తులే ప్రభుత్వం చేతుల్లో న్యాయమూర్తులను నియమించే అధి కారం కొనసాగితే ప్రమాదమని తీర్మానించారు. న్యాయమూర్తుల నియామ కంపైన సీనియర్ న్యాయమూర్తులే నిర్ణయాలు చేయాలనీ, అందుకు ప్రధాన న్యాయ మూర్తి, మరి ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాజపేయి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (ఎన్డీఏ-1) అంత బలహీనమైనది కాకపోయినా అత్యంత ఉదార మైనది. ఆ మెతకదనాన్ని ఆసరాగా తీసుకొని 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం కొలీజియం వ్యవస్థను విస్తరించి బలోపేతం చేసింది. సభ్యుల సంఖ్యను అయిదుకు పెంచింది-ప్రధాన న్యాయమూర్తికి తోడు నలుగురు అత్యంత అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు. ప్రధాన న్యాయ మూర్తి ప్రథముడు. తక్కిన నలుగురూ సమానులే. ఇప్పటి కొలీజియంలో జస్టిస్ చలమేశ్వర్ అయిదో న్యాయమూర్తి అనడం సరి కాదు. నలుగురిదీ సమాన హోదా. కొలీజియం నిర్ణయాలపై విమర్శలు వెలువెత్తిన సందర్భాలు అనేకం. న్యాయమూర్తులు తమ బంధువులనూ, స్నేహితులనూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నారంటూ న్యాయవాద వర్గాలు గగ్గోలు పెట్టాయి. సమర్థత, నిజాయితీ, ధర్మాభినివేశం కలిగిన వారిని పక్కన పెట్టి ఇతరేతర కారణాల వల్ల అనర్హులను గద్దె(బెంచి)నెక్కించిన విషయం అందరికీ తెలుసు. న్యాయ మూర్తులుగా నియమితులైన వారంతా అనర్హులని కాదు. అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలో నిజం ఉన్నదనే అభిప్రాయం జనసామాన్యంలో బలంగా నాటుకున్నది. న్యాయవ్యవస్థ పెత్తనం అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం పాలనా వ్యవస్థపైన తన ఆధిక్యాన్నీ, ఆధిపత్యాన్నీ యూపీఏ పదేళ్ళ పరిపాలనలో అప్రతిహతంగా కొనసాగించింది. యూపీఏ నాయకత్వం సీబీఐని రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగిస్తే సీబీఐని నియంత్రించే బాధ్యత సుప్రీంకోర్టు స్వీకరించడం ఒక ముఖ్యమైన మలుపు. డోలాయమాన స్థితిలో నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు పూర్తిగా లొంగిపోయిన సన్నివేశమది. ప్రభుత్వం తీసు కోవలసిన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకున్న సందర్భం. పాలన వ్యవస్థ బలహీనపడిన మాట వాస్తవం. బాధ్యత లేని అధికారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల్లో ఉండటం, ప్రధాని మన్మోహన్సింగ్కు అధికారం లేకపోవడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని న్యాయవ్యవస్థ వినియోగించుకు న్నది. వాస్తవానికి రాజకీయ వ్యవస్థలో విలువలు పతనమైన సమయం లోనే న్యాయ వ్యవస్థలోనూ ప్రమాణాలు పడిపోయాయి. న్యాయమూర్తులపైన అవినీతి ఆరోపణలు ఆత్యయిక పరిస్థితిలోనే-1976లో- నాటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ వీరాస్వామిపైన అవినీతి అరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతించారు. న్యాయ మూర్తిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించవచ్చునా, కూడదా అనే ప్రశ్నపైన న్యాయవ్యవస్థలో వాదోపవాదాలు జరిగాయి కానీ కేసు ముందుకు సాగలేదు. అనంతరం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో జస్టిస్ రామస్వామిని అభిశంసించే తీర్మానంపైన పార్లమెంటు చర్చించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు నేర ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉన్నారనే అరోపణలు వచ్చిన కారణంగా వారు పదవుల నుంచి వైదొలగవలసి వచ్చింది. ఒక న్యాయమూర్తి తాను రాయబోయే పుస్తకానికి పారితోషికం కింద ముందస్తుగా 70 లక్షలు స్వీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయనకు అడ్వాన్స్ చె ల్లించిన ప్రచురణ సంస్థకు నేరస్థ ప్రపంచంతో బంధాలు ఉన్నాయని తేలింది. 1996 నుంచి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులపైనే అవినీతి ఆరోపణలు వినిపించసాగాయి. 2003లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు బంటుగా తేలి పదవికి రాజీనామా సమర్పించారు. ఇటువంటివి అనేకం ఉన్నా న్యాయవ్యవస్థ పరువును యమునా నదిలో కలిపిన ఘటన 2009లో జరిగింది. ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత ప్రశాంత్ భూషణ్ ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన 16 మందిలో సగం మంది అవినీతిపరులేనంటూ ఆరోపించారు. ప్రశాంత్ భూషణ్పైన కోర్టు ధిక్కార నేరంపైన కేసు నమోదు చేశారు. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అల్తమస్ కబీర్ నాయకత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ప్రశాంత్ భూషణ్కి నోటీసు జారీ చేసింది. సరిగ్గా ఏడాదికి 2010లో ఆయన తండ్రి, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంతవరకూ ప్రధాన న్యాయ మూర్తులుగా పని చేసినవారిలో ఎనిమిదిమంది మంది కచ్చితంగా అవినీతి పరులనీ, ఆరుగురు నిశ్చయంగా నీతిమంతులనీ, తక్కిన ఇద్దరి విషయంలో కరాఖండిగా చెప్పడానికి తన వద్ద సమాచారం లేదనీ వివరించారు. నీతి మంతులైన, అవినీతిపరులైన న్యాయమూర్తుల పేర్లు కూడా శాంతిభూషణ్ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రశాంత్పై కేసు ఎటుపోయిందో, శాంతి భూషణ్పై ఏ చర్య తీసుకున్నారో తెలియదు. అసలు న్యాయమూర్తి పరిశీలన లోకి ప్రశాంత్ భూషణ్ కేసు వెళ్ళలేదని ప్రముఖ రచయిత ఎస్ గురుమూర్తి అంటున్నారు. నరేంద్రమోదీ ఘనవిజయం పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ పరువు బజారుపాలైన సందర్భంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ విరాట్ స్వరూపం ప్రదర్శించి, వందలాది సభలలో అద్భుతంగా ప్రసంగించి, ఘన విజయం సాధించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. న్యాయవ్యవస్థ జోక్యందారీ వైఖరిని కట్టడి చేసే ఉద్దేశంతో నేషనల్ జుడీషియల్ అప్పాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) బిల్లును 2014 డిసెంబర్లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించి కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎన్జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ, కేంద్ర న్యాయవ్యవహారాల శాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వం జోక్యంతో న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటి ల్లుతుందనీ, ఇది రాజ్యాంగ స్వభావానికి విరుద్ధమనీ అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పింది. రాజ్యాంగసమ్మతం కాదంటూ ఈ చట్టాన్ని కొట్టివేయాలని నలుగురు న్యాయమూర్తులు తీర్పు చెబితే, అయిదో న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మెజారిటీ అభి ప్రాయంతో విభేదించారు. న్యాయమూర్తుల నియామకాలతో ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రమేయం ఉండరాదనే వాదనతో చలమేశ్వర్ ఏకీభవించలేదు. ఏ ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా న్యాయవ్యవస్థ లేదని వాదించారు. ఒక వ్యవస్థపైన మరో వ్యవస్థ నిఘా ఉంచే విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధానం ద్వారా సమతౌల్యాన్ని పరిరక్షించాలనే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యానికి కొలీజియం వ్యవస్థ గండి కొట్టిందనీ, ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లేవని, నియామకాలలో బంధుప్రీతి కనిపి స్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయనీ జస్టిస్ చలమేశ్వర్ కుండ బద్దలు కొట్టారు. రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తుల నియామకాలను శాసిస్తున్న కొలీజియం వ్యవస్థపైన సూటిగా, బలంగా, ధర్మాగ్రహంతో దాడి చేసిన ఘనత జస్టిస్ చలమేశ్వర్కు దక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన దోహదాన్ని భావి తరాలు కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుపెట్టుకుంటాయి. రట్టయిన గుట్టు కొలీజియం సమావేశాలు రహస్యంగా జరుగుతాయనీ, అయిదుగురు సభ్యు లలో ముగ్గురు ఎవరికి అనుకుంటే వారికే అవకాశం వస్తుందనీ, తక్కిన ఇద్దరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరిగినట్టు ప్రక టిస్తున్నారనీ, సమావేశ వివరాల నమోదు, విభేదించిన సభ్యుల అభి ప్రాయాలు, ఇతర ప్రముఖుల అభిప్రాయాలు సేకరించడం, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరగడం లేదని వెల్లడించి జాతి యావత్తునూ జస్టిస్ చలమేశ్వర్ దిగ్భ్రాంతికి గురి చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో జాప్యంపై ప్రధానిని అడుగుతూ కంట తడిపెట్టిన జస్టిస్ ఠాకుర్ మొన్న స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో న్యాయమూర్తుల నియామకాల గురించి ఆయన ప్రస్తావించనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఆవేశంగా స్పందించే గుణం కలిగిన జస్టిస్ ఠాకుర్ సైతం జస్టిస్ చలమేశ్వర్ తనకు రాసిన లేఖ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ‘త్వరలోనే మేము పరి ష్కరించుకుంటాం’ అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఇది ఇద్దరి మధ్యనో, లేక కొలీజియం సభ్యుల మధ్యనో పరిష్కరించుకోవలసిన వివాదం కాదు. నిజానికి ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య రగులుతున్న చిచ్చు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. అందుకే జస్టిస్ చలమేశ్వర్ ఉద్దేశిం చినట్టు ఈ వివాదంపై బహిరంగ చర్చ జరగాలి. దాపరికాన్ని అంతం చేయాలి. సంస్కరణలకు బాట వేయాలి. చట్టపాలనకు పట్టం కట్టాలి. అమెరికా, బ్రిటన్లో.... ప్రభుత్వ ప్రమేయంలేని న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడా లేవు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబం ధించిన ప్రతిపాదన అధ్యక్ష భవనం నుంచి వెడుతుంది. అధ్యక్షుడు సూచించిన పేర్లను సెనేట్ కమిటీ పరిశీలించి ఆమోదించాకే న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. అధ్యక్షుడు ప్రతిపాదించినా సెనేట్ తిరస్కరించినట్లయితే ఆ నిర్ణయానికి తిరుగులేదు. అమెరికా రాజ్యాంగం రెండవ అధికరణలో రెండవ సెక్షన్ కింది సెనేట్కు ఈ అధికారాలు సంక్రమించాయి. అధ్యక్షుడు సెనేట్ సలహా, ఆమోదం కోరాలని ఈ సెక్షన్ స్పష్టం చేసింది. అంటే పాలన వ్యవస్థకూ, చట్ట వ్యవస్థకూ న్యాయమూర్తుల నియామకంలో ప్రమేయం ఉండేవిధంగా అమె రికా రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. అధ్యక్షుడు ప్రతిపాదించిన తర్వాత సెనేట్ తిరస్కరించిన మొట్టమొదటి అభ్యర్థి జాన్ రూట్లేజ్. 1795లో రూట్లేజ్ను ప్రతిపాదించిన అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్. అమెరికా ఆవిర్భావం తర్వాత 2005 వరకూ అధ్యక్షులు ప్రతిపాదించిన 149 మంది అభ్యర్థులలో 27 మందిని సెనేట్ తిరస్కరించింది. బ్రిటన్లోనూ జూడీషియల్ అప్పాయింట్మెంట్స్ కమిషన్ (జేఏసీ) ఉంది. న్యాయమూర్తి పదవికి ఏవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీ ప్రతిపాదించే అభ్యర్థుల పేర్ల జాబితాను లార్డ్ చాన్సలర్ (న్యాయ మంత్రి)కి పంపుతారు. ఆయన, ప్రధాని ఖరారు చేసిన జాబితాను రాజ్యాధినేత రాణికి పంపుతారు. కనుక ప్రభుత్వ ప్రమేయం బొత్తిగా ఉండరాదనే వాదనలో అర్థం లేదు. పైగా సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించిన పేర్లను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రపతికి పంపించాలి. ఆ జాబితాను రాష్ట్రపతికి గుడ్డిగా నివేదిం చడమే కేంద్ర న్యాయశాఖ మంత్రి పరిమితం కావాలని కోరుకోవడం న్యాయమా? వాస్తవానికి థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియంను విస్తరిస్తూ రాజ్యాంగపీఠం చెప్పిన తీర్పులోని కీలకమైన అంశాలను కొలీజియం పాటిం చడం లేదని జస్టిస్ చలమేశ్వర్ ధ్వజమెత్తిన తర్వాత వెల్లడి అవుతోంది. థర్డ్ జడ్జెస్ కేసుపై 1998 అక్టోబర్ 28 రాజ్యాంగ పీఠం ఇచ్చిన ఉత్తర్వు పాఠంలో 22వ పేరా కొలీజియం విధివిధానాలను స్పష్టంగా పేర్కొంది. సభ్యులందరి అభి ప్రాయాలనూ నమోదు చేయాలనీ, అభ్యర్థులు ఏ హైకోర్టు నుంచి వచ్చారో ఆ హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాదుల అభి ప్రాయాలను సైతం సేకరించాలనీ, వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సులతో సవివరంగా ప్రభుత్వానికి పంపాలనీ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. కొలీజియం సమావేశం తాలూకు వివరాలనూ, సభ్యుల, అసమ్మతి తెలియజేసిన సభ్యుల అభిప్రాయాలనూ వివరంగా రాసి పంపించాలన్నది అందులో ప్రధానమైన అంశం. ఇంత వివరంగా థర్డ్ జడ్జెస్ కేసులో తీర్పు వెలువడిన తర్వాత పదహారేళ్ళపాటు ఈ అంశాలను ప్రధాన న్యాయ మూర్తులు తుంగలో తొక్కారు. సమావేశ వివరాలను నమోదు చేయనేలేదు. ఫలానా కొలీజియం, ఫలానా న్యాయవాదిని ఎందుకు సిఫార్సు చేసిందో తెలుసుకోవాలంటే న్యాయ మూర్తులకు కూడా సాధ్యం కాదు. రికార్డు లేదు. అసమ్మతి తెలిపిన వైనం కానీ, అసమ్మతిని తెలిపింది ఎవరనే వివరం కానీ ఎక్కడా లేదు. ముగ్గురో, నలుగురో కూడబలుక్కొని తీసుకున్న నిర్ణయాలను దేశం మీద రుద్దే ప్రక్రియే అమల వుతోంది. ఇది రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం తప్ప వేరొకటి కాదు. ఈ దాపరికాన్నే, ఈ జవాబుదారీతనం లేని బేపర్వా వైఖరినే జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు. దీనివల్ల అర్హులైనవారికీ, ప్రతిభావంతులైన వారికీ అవకాశాలు రావడంలే దనీ, కొలీజియం సభ్యులతో సామీప్యం ఉన్నవారికీ, వారి దృష్టిలో పడిన వారికీ, వారిని మెప్పించినవారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయనీ అర్థం. దీని వల్ల న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయనీ, కొంత కాలానికి ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన. తనకి ఒకరి పట్ల వ్యతిరేకత కానీ, ఎవరినైనా మెప్పించవలసిన అవసరం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేను రెండేళ్ళలోపే(2018 జూన్)పదవీ విరమణ చేయ బోతున్నాను. ఆ తర్వాత నేను ఎటువంటి పదవినీ ఆశించడం లేదు. ఏదో ఒక కమిషన్కు అధ్యక్షుడుగా పనిచేసే ఆలోచన లేనే లేదు’ అంటూ సూటిగా చెప్పారు. జస్టిస్ చలమేశ్వర్కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదించడం వల్ల ప్రయో జనం లేదు. ఆయన అభ్యంతరంలో అర్థం లేకపోలేదని జస్టిస్ లోధా కూడా అన్నారు. న్యాయవ్యవస్థ పరువుప్రతిష్ఠలు పునరుద్ధరించాలంటే సంస్కరణలు అనివార్యం. రాష్ట్రపతి మరో సారి సుప్రీంకోర్టు సలహా కోరవలసిన సందర్భం ఆసన్నమైంది. ఇది వరకటి తొమ్మిది మంది న్యాయమూర్తుల పీఠం కంటే విస్తారమైన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని సాకల్యంగా పరిశీలిం చాలి. ప్రభుత్వ పెత్తనం లేకుండా, న్యాయమూర్తుల చేతుల్లోనే సర్వాధికారాలు పెట్టుకోకుండా చూడాలి. పారదర్శకతను పాటించాలి. ప్రతిభావంతులనే న్యాయమూర్తులుగా నియమించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. ఒక వ్యవస్థ బలహీనమైనప్పుడు మరో వ్యవస్థది పైచేయి కావడం మంచిది కాదు. అన్ని వ్యవస్థలూ బలంగా ఉన్నప్పుడే ప్రజా స్వామ్యానికి చేవ. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన ప్రధానమైన అంశాలపైన సర్వత్రా చర్చ జరగాలి. సముచితమైన సంస్కరణలు అమలు కావాలి. సమర్థులైన న్యాయమూర్తులు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో నియుక్తులు కావాలి. అప్పుడే చట్టపాలన, ప్రజాస్వామ్యం సార్థకం అవుతాయి. -
స్తంభించిన న్యాయవ్యవస్థ
రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులుగా పనిచేయని కోర్టులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల విధులు బహిష్కరణతో న్యాయవ్యవస్థ స్తంభించింది. జైళ్లలో ఉన్న నిందితుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం మినహా ఎటువంటి ఇతర కేసులకు న్యాయవాదులు హాజరుకావడం లేదు. ఈనెల 11న దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ను సైతం కొన్ని జిల్లాల్లో న్యాయవాదులు పూర్తిగా బహిష్కరించగా మరికొన్ని జిల్లాల్లో పాక్షికంగా పనిచేశాయి. మరో 12 రోజుల పాటు విధులు బహిష్కరించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని న్యాయవాదుల సంఘాలు నిర్ణయించిన నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరో పక్క న్యాయశాఖ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తే న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది. ఆందోళన ఉధృతం: ఇప్పటికే విధులు బహిష్కరించి పలురూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ఉద్యమాన్ని మరిం త తీవ్రం చేయాలని నిర్ణయించారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రీకాల్ చేయాలంటూ రిలేనిరాహార దీక్షలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా నిరసన వంటి కార్యక్రమాలను చేపట్టారు. 2 వరకు విధుల బహిష్కరణ: ఈ ఆందోళన జూలై 2 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్రెడ్డి తెలిపారు. శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, న్యాయవాదుల జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామ ని జితేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 24న చలో హైదరాబాద్లో భాగంగా ఇందిరాపార్కు వద్ద మహాధర్నా ఉంటుందన్నారు. న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్రమోహన్రావు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1 నుంచి సమ్మె ప్రత్యేక హైకోర్టుతోపాటు హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రీకా ల్ చేయాలని కోరుతూ జూలై 1 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాం. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులతో మరో 20ఏళ్ల వరకు తెలంగాణకు చెందిన వారు హైకోర్టు జడ్జీలు కాలేరు. కొత్త నియామకాలూ ఉండవు. దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. వీటిని రద్దు చేసే వరకూ ఆందోళన చేస్తాం. - బి.లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి,న్యాయశాఖ ఉద్యోగుల సంఘం -
ప్రాణహాని ఉంటే చంపొచ్చు!
హర్యానా: తన ప్రాణాలకు ముప్పొస్తే దాడికి పాల్పడుతున్న వ్యక్తిని మట్టుపెట్టొచ్చా? అంటే అవుననే చెప్తున్నారూ.. హర్యానా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కేపీ సింగ్. కామన్ మ్యాన్ కు క్రిమినల్ లేదా ఈవ్ టీజర్ ను చంపే అర్హత ఉందని అన్నారు. ప్రాణహాని కలిగినపుడు లేదా శారీరక వేధింపులు లేదా ఆస్థికి నష్టం కలిగించే విషయాల్లో చట్టం ప్రతి మనిషికి దుర్మార్గులను చంపే అర్హత కల్సించిందని తెలిపారు. ఆత్మరక్షణ కోసం క్రిమినల్ చంపొచ్చని చాలా మందికి తెలియదని అన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం కాదని చెప్పారు. చట్టమేం చెప్తోందీ.. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)100 ప్రకారం ఆరు కేసుల్లో ప్రత్యర్ధిని చంపొచ్చని ఇందులో ఉంది. 1. ప్రాణహాని ఉందని తప్ప మరే కారణం లేకుండా క్రిమినల్ ను చంపరాదు 2. తీవ్ర బాధకరంగా వేధిస్తుంటే ఎదుటి వ్యక్తిని చంపొచ్చు. 3. శారీరక వేధింపులకు పాల్పడటానికి ప్రయత్నిస్తే చంపొచ్చు. 4. కిడ్నాప్ చేస్తారని భావిస్తే చంపొచ్చు. 5. అసహజ పద్ధతిలో శృంగారానికి ప్రేరేపిస్తే చంపొచ్చు. 6. తప్పుడు ఉద్దేశంతో ఒక వ్యక్తిని నిర్భందించడం, అధికారులను చేరకుండా అడ్డుకోవడం వంటివి చేసినప్పుడు చంపొచ్చు.