kona venkat
-
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్కు శివమణి, అవినాష్కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్రూమ్కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్ను హౌస్మేట్స్కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ, సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు. ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సత్యార్థ్ బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్ సెట్తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్ క్లినిక్లో ల్యాబ్ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్ క్లినిక్స్ని డిజైన్ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం. -
నేను గర్వంగా చెప్తున్నాను..సీఎం జగన్ పాలనపై కోన వెంకట్...
-
మిక్స్డ్ టాక్.. రూ.50 కోట్లు కావాలంటున్న డైరెక్టర్
ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ఆ దేవుడిని ఒకటే అడిగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్ కావాలి సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్ను ఎన్టీఆర్లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్ను ఎన్టీఆర్లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
ఎంతమంది అడ్డుపడినా ఆ రోజే సినిమా విడుదల చేస్తాం: కోన వెంకట్
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్కు నట్టి కుమార్ రాసిన లేఖపై కోన వెంకట్ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు. ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్కు ఎప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. -
గీతాంజలి మళ్లీ వచ్చింది ఎవరు ఆపినా ఆగేది కాదు ఏప్రిల్ 11 నే రిలీజ్
-
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
పాఠశాలల్ని గొప్పగా తీర్చిదిద్దిన ఏపీ ప్రభుత్వంపై కోన వెంకట్ ప్రశంసలు
-
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్ఫోన్తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
దటీజ్ జగన్: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem — KONA VENKAT (@konavenkat99) January 29, 2024 -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. తొలి సీన్కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
గంజాయి స్మగ్లింగ్ చేశాను.. పోలీసులకు దొరక్కుండా బోర్డర్ దాటించా: కోన వెంకట్
ప్రముఖ రచయిత కోన వెంకట్కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ రివీల్ చేశారు. ''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అమ్మేందుకు గోవా వెళ్లాం. మహబూబ్నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్ లైఫ్లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. -
జిన్నాగా వస్తోన్న మంచు విష్ణు, ఫస్ట్ లుక్ చూశారా?
విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అలాగే చోటా కే నాయుడు కనిపించడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో హీరో అని పిలిస్తే పలకని మంచు విష్ణు జిన్నా అనగానే మాత్రం చటుక్కున లేచి నిలబడి దేనికైనా రెడీ అంటుండటం విశేషం. ఇక ఈ సినిమాకు ఇంతకుముందు విష్ణు నటించిన రెండు చిత్రాలకు స్క్రిప్ట్లు అందించిన కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే రాస్తున్నారు. Mass Comedy Action!! It's the #Ginna Style@starlingpayal @SunnyLeone @anuprubens #PremRakshith@avaentofficial @24FramesFactory#Ginna #GinnaBhai Teluguhttps://t.co/1nmoFTUkVT Hindihttps://t.co/5TllK3y72q Malayalamhttps://t.co/MYoyBXgX4H — Vishnu Manchu (@iVishnuManchu) July 11, 2022 చదవండి: వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు -
మంచు విష్ణు మూవీకి సరికొత్త టైటిల్, ప్రకటించిన టీం
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘జిన్నా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విష్ణు కెరీర్లో ఇది 19వ చిత్రం. డా. మంచు మోహన్బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత టైటిల్ని కూడా వెరైటీగా రివీల్ చేశారు. సునీల్, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఈషాన్ సూర్యతో కలిసి విష్ణు సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్గా ‘జిన్నా’ అనే టైటిల్ని ప్రకటించారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండగా సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. -
స్టార్ రైటర్తో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక.. త్వరలో సర్ప్రైజ్ అంటూ
తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో టాప్ 7 వరకు కొనసాగిన ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం లేని పేరు. అయితే బిగ్బాస్ ఎలిమినేషన్ తర్వాత ప్రియాంకకు భారీగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ను ప్రియాంక సింగ్ కలిసింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ప్రియాంక. ఈ పోస్ట్కు 'ఒక సర్ప్రైజింగ్ వార్త రాబోతోంది. మీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రియాంక. ఇది చూస్తుంటే కోన వెంకట్తో ప్రియాంక సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరీ అది ఏ సినిమా గురించో, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించి.. ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్గా మారింది. బిగ్బాస్ ఐదో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక టాప్ 7 వరకు కొనసాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందం, ఆట తీరుతో అభిమానులను మూటగట్టుకున్న ప్రియాంక తర్వాత మానస్పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంపై ట్రోలింగ్ బారిన కూడా పడింది. ఏదైమైనా బిగ్బాస్ అనంతరం ప్రియాంకకు ఆఫర్లు రావడం ఆమె కెరీర్కు మంచి శుభపరిణామం. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్రాజ్
సునీల్, ధన్రాజ్ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్రాజ్. ‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి. -
గల్లీ రౌడీ మూవీ టీంతో ముచ్చట్లు
-
‘పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు. ఇక శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్ అన్నాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేదే కథ. -
కపటనాటక సూత్రధారి పోస్టర్: కొత్తగా ఉంది కదూ!
భిన్నమైన కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. "ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది.. చూస్తుంటే ఎంతో డిఫరెంట్ సినిమా అని తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది.. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్" అన్నారు. ఈ సినిమాలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైనా దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్లు సహనిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్ ఎఫెక్ట్.. బన్నీ సినిమా ఆగిపోయిందా? బాలీవుడ్ హాట్ఫేవరెట్ కియారా -
పండుగ వేళ కోనంత కుటుంబంతో స్పెషల్ చిట్ చాట్
-
అందుకు కారణం సీఎం వైఎస్ జగన్: కోన వెంకట్
‘‘ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకోవడంలో కోన వెంకట్ స్పెషలిస్ట్. కామెడీ సినిమాలు తీయడంలో నాగేశ్వర రెడ్డిది ప్రత్యేక శైలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీవీ వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ని విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సందీప్ కిషన్ నాకు మేనల్లుడితో సమానం. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే నటుడు రాజేంద్రప్రసాద్. ‘గల్లీ రౌడీ’ హిట్ అయ్యి కోన, ఎంవీవీలకు బాగా డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే నాగేశ్వర రెడ్డిగారి సినిమాలు చూడాలి’’ అని నందినీ రెడ్డి అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఇంత త్వరగా పూర్తయిందంటే కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు. ఏపీలో షూటింగ్లకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారాయన. ఈ విధానంలో పూర్తయిన తొలి చిత్రం మాదే. ఇందుకు జగన్గారికి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘లేడీస్ టైలర్’కు ఎంత మంచి అభినందన వచ్చిందో ‘గల్లీ రౌడీ’కి కూడా మంచి అభినందన వస్తుంది’’ అన్నారు నటుడు డా. రాజేంద్ర ప్రసాద్. ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను, కోన వెంకట్ చేసిన ‘గీతాంజలి’ కంటే ‘గల్లీ రౌడీ’ పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ కాకపోతే నా జడ్జ్మెంట్లో రాంగ్ ఉన్నట్లే. ఆ తర్వాత నేను సినిమాలు చేయలేనేమో? అనేంత నమ్మకంతో సినిమా సక్సెస్ అవుతుందని చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నేను కథ వినేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో వింటాను. అందరి సహకారం వల్లే మా సినిమాను 60 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘అందరూ నవ్వుకునే సినిమా ‘గల్లీ రౌడీ’’ అన్నారు సందీప్ కిషన్. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రచయితలు భాను, నందు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలపై కేటీఆర్కు కోన వెంకట్ ట్వీట్
నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్లోని అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల కార్పోరేషన్ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సయ్యద్ నగర్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ను ట్యాగ్ చేశారు. Lot of Illegal constructions are coming up in Sayyed Nagar, Road no 12, Banjarahills... No sewerage, No sanitation, No roads.. but multi storied constructions in these slums will lead to major problems in future.. Please look into this 🙏 @CommissionrGHMC @KTRTRS @GHMCOnline pic.twitter.com/rHN7uNFySC — kona venkat (@konavenkat99) February 26, 2021 -
మల్లేశ్వరి బయోపిక్ షురూ
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్కు కోన వెంకట్ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్ను ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్
‘‘సినిమాలను థియేటర్స్లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్. థియేటర్స్లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు. -
మహమ్మారి బారినపడ్డ వుహాన్లో అడుగుపెట్టి..
హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టిన వుహాన్కు వెళ్లడమంటేనే డేంజర్ జోన్లోకి అడుగుపెట్టినట్టుగా అందరూ భావిస్తుంటే ఆ డాక్టర్ అక్కడి బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు చైనాలోని వుహాన్కు వెళ్లి వైరస్ రోగులకు వైద్య సేవలందించి తన ఔదార్యం చాటుకున్నారు. వాషింగ్టన్ డీసీలో నివసించే తెలుగు వ్యక్తి డాక్టర్ నాగరాజు చైనాలోని వుహాన్కు వెళ్లి కరోనా రోగులకు వైద్య సేవలందించారని, ఆయన తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన అనంతరం చైనీయులు ఆయనను ప్రత్యేక విమానంలో సాగనంపారని ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు నిబ్బరంగా నిలిచే ఇలాంటి వారికి మనం శాల్యూట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ నాగరాజు చూపిన చొరవను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. చదవండి : హనీమూన్కు కొత్తజంట: కరోనా ఎఫెక్ట్తో.. -
మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ
కలెక్షన్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ! లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్(ఎదుటి వ్యక్తిపై గల ఎనలేని ప్రేమను తెలియజేయటం కోసం ‘ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ ’ ను వాడతారు)’ అని అన్నారు. 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆయనకు పలువరు సీని, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ( అందరూ బాగుండాలని... ) My nanas birthhhhhdayyyyyyy! Every year today is a celebration! You truly are one man army! Love you to the moon and back! pic.twitter.com/T83BwBCKq0 — Lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2020 ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!’ అని అన్నారు. వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు @themohanbabu గారికి జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/cGWGaP9tGT — kona venkat (@konavenkat99) March 19, 2020 కాగా, మోహన్ బాబు తన 70వ పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో కొద్ది రోజుల క్రితం ఓ లేఖను విడుదల చేశారాయన. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ( ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్బాబు ) -
‘మృగం’ స్క్రిప్ట్ రెడీ.. స్టార్ హీరోతో చేస్తా
‘‘రాహు’ సినిమాలో కథానాయికకు ఓ వ్యాధి ఉంటుంది. రక్తం చూసినప్పుడు కళ్లు కనిపించవు.. ఒత్తిడికి గురవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ప్రవేశిస్తే ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు సుబ్బు వేదుల. అభిరామ్ వర్మ, కృతీ గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా సుబ్బు వేదుల చెప్పిన విశేషాలు. ♦నాది వైజాగ్. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే రచయిత కోన వెంకట్గారితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కొన్ని కథలకు కలిసి పనిచేశాం. ఆయన బ్యానర్లో ‘గీతాంజలి 2’ సినిమా నేను చేయాల్సి ఉంది.. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాలేదు.. కానీ, ఆయన నాకు మంచి సహకారం అందించారు. ♦‘రాహు’సినిమాకి కథే హీరో. దాదాపు ఏడాది పాటు ఈ కథపై పనిచేశా. చిత్ర నిర్మాతలు కథ వినగానే సినిమా చేద్దామన్నారు. నా కథపైన నమ్మకంతో నేను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతల సహకారం మరువలేనిది. 52 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. ♦థ్రిల్లర్ జోనర్లో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్ని అందించడంతో పాటు తాజా అనుభూతి ఇస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్. నేను, నా కూతురు ఈ సినిమాలో నటించాం. ‘మధుర’ శ్రీధర్గారు మాకు మంచి సహకారం అందించారు. సురేష్ బాబుగారు మా సినిమాను విడుదల చేయడం, జీ చానల్ వాళ్లు డిజిటల్ రైట్స్ తీసుకోవడం విడుదలకు ముందే మేం సాధించిన విజయాలు. ♦డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలంటే ఇష్టం. ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రం నా ఫేవరెట్. ఇళయరాజాగారి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన కథానాయకుడు అల్లు అర్జున్.. ఆయన నటన సూపర్బ్. ♦పెద్ద స్టార్ట్స్తో సినిమా చెయ్యాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి. ‘రాహు’ తర్వాత స్టార్ హీరోలను సంప్రదిస్తా. ఒక స్టార్ హీరో కోసం ‘మృగం’ అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. -
గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన
మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం ‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు. ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. – నటుడు చిరంజీవి ‘హ్యాపీడేస్’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా గొల్లపూడి మారుతీరావుగారితో పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – నటుడు నిఖిల్ నన్ను హీరో అని పిలిచేవారు నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్ చేశాం. ఆ ఫంక్షన్లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – నటుడు శివాజీరాజా అది ఆయనకే సాధ్యం గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది. టైమింగ్ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – రచయిత, నిర్మాత కోన వెంకట్ -
‘సైలెన్స్’లో అనుష్క ఉండేది కాదట
తమిళసినిమా: సైలెన్స్ చిత్ర ప్రచారం మొదలయ్యింది. ఇది ఐదు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో నిశ్శబ్దం పేరుతోనూ , తమిళం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో సైలెన్స్ పేరుతోనూ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటి అనుష్క. దాదాపు రెండేళ్ల తరువాత ఆమె ముఖానికి రంగేసుకుని నటించిన చిత్రం సైలెన్స్. మాధవన్, నటి అంజలి. శాలినిపాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. దీనికి టీజీ.విశ్వప్రసాద్, రచయిత కోన వెంకట్ నిర్మాతలు. భాగమతి వంటి సంచలన చిత్రం తరువాత నటి అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సైలెన్స్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించిందని సమాచారం. అసలు ఆ చిత్రంలో అనుష్క నటించి ఉండేదే కాదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ అన్నారు. చిత్ర ప్రచారంలో ముమ్మరంగా ఉన్న ఈయన ఒక భేటీలో పేర్కొంటూ సైలెన్స్ చిత్ర కథను అసలు అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని చెప్పారు. పలువురు నటీమనులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇదని చెప్పారు. అలా అనుష్కకు కూడా కథను చెప్పినట్లు తెలిపారు. ఆమె ఇందులో నటించడానికి ముందు అంగీకరించలేదని, ఆలోచించి చెబుతానని అన్నారన్నారు. ఆ తరువాత చాలా రోజుల వరకూ అనుష్క నుంచి బదులు రాకపోవడంతో వేరే నటిని నటింపజేయడానికి సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. అలాంటి సమయంలో అనుష్క నుంచి ఫోన్ వచ్చిందని, సైలెన్స్ చిత్రంలో తాను నటిస్తాను అని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఆమె మరికాస్త ఆలస్యంగా చెప్పి ఉంటే ఈ చిత్రంలో ఉండేదే కాదని అన్నారు. కాగా సైలెన్స్ చిత్ర విడుదలకు తేదీ ఖరారు చేశారు. జనవరి 31న చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ నిశ్శబ్దం
‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నాం. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ ‘నిశ్శబ్దం’. అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘టెక్నికల్గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్. -
అందరూ..అనుమానితులే..
సాక్షి, హైదరాబాద్ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్ ఆర్టిస్ట్ ట్యాగ్లైన్) సినిమా టీజర్ను బుధవారం లాంచ్ చేసింది. మోషన్ టీజర్తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా టీజర్ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్లో అనుష్క 'సాక్షి' పాత్రలో దివ్యాంగురాలిగా స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు. గోపీ సుందర్ బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది. హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యూటసన్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ప్రమాదకరంగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే: కోన వెంకట్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించటంతో మెట్రో, ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన కోన వెంకట్.. కేటీఆర్, తో పాటు జీహెచ్ఎంసీలకు ట్యాగ్ చేశారు. మరి కోన ట్వీట్ అధికారులు ఎలా స్పదింస్తారో చూడాలి. Damaged condition of the PVNR expressway near Pillar No : 20 , please take care before it’s too late @GHMCOnline @KTRTRS Source: Facebook friend pic.twitter.com/1Disn6bMRy — kona venkat (@konavenkat99) September 26, 2019 -
మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం
‘‘హాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాంబినేషన్లో వస్తున్న తొలి ‘క్రాస్ఓవర్’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్ ఓవర్ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్ టైమ్లో షూటింగ్ పూర్తి చేశాం. సెప్టెంబర్లో టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ హిట్ చిత్రం ‘కిల్బిల్’ సినిమాలో విలన్గా నటించిన మైఖేల్ మ్యాడిసన్తో పాటు 7–8 మంది హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్ బ్యాక్డ్రాప్లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్కి అమెరికన్ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్కి స్కోప్ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
జగన్ నిజం..బాబు మోసం.. పవన్ విద్వేషం..
ఆయన కలం... హీరోతో డ్రామా పండించింది... హీరోయిన్ను దెయ్యంగా చూపించింది... విలన్తో కామెడీ కితకితలు పెట్టించింది...! ‘ఢీ’, రెడీలతో తెలుగు సినిమా దూకుడును పెంచిన ఆయనలో కథా రచయిత, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత, పాటల రచయిత, నటుడు ఉన్నారు. ఆయనే... స్టార్ రైటర్ కోన వెంకట్. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన వెంకట్... రాజకీయ దిగ్గజం, మహారాష్ట్ర మాజీ గవర్నర్ కోన ప్రభాకర్రావుకు స్వయానా మనుమడు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చి రెండున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై విశాఖపట్నంలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పరిస్థితిని ఆయన ఒక్క మాటలో చెబుతూ.. ‘వైఎస్ జగన్ నిజం... చంద్రబాబు మోసం.. పవన్ కల్యాణ్ గందరగోళం’ అని విశ్లేషించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... పవన్ కల్యాణ్ సినీ రంగంలో నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంతటి అనుబంధం ఉంది. కత్తి మహేష్ వివాద విషయంలో పవన్కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ తప్పటడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశంగా స్పందిస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయ్. ఈ ఐదేళ్లలో తెలంగాణలోని హైదరాబాద్లోనే కాదు. మారుమూల పల్లెల్లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పవన్ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. పవన్... జగన్పై నీవు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించు...నేను జనసేన జెండా పట్టుకు తిరుగుతా... మాయావతి వంటివారితో పొత్తు పెట్టుకున్న పవన్... ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం విషం చిమ్మడం అన్యాయం. ఎందుకు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని పవన్ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం వైఎస్ జగన్ది. అటువంటి జగన్పై అకారణంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు చెబుతున్నా... పవన్ కల్యాణ్... వైఎస్ జగన్పై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం ఒక్కదానికైనా ఆధారం చూపించండి. అలా చేస్తే నేను జనసేన జెండా పట్టుకుని మీ వెంటే తిరుగుతా. మాయావతి మదర్ థెరిసాలా కనిపించిందా? పవన్కు సరిగ్గా ఎన్నికల ముందు, అర్ధాంతరంగా మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాయావతి మీకు మదర్ థెరిసాలా కనిపించిందా? నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిన మాయావతి వద్దకు వెళ్లి పొత్తు పెట్టుకోవడం ఏమిటో? దళితుల ఓట్లే కావాలనుకుంటే అంతకంటే నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతలు మీకు దొరకలేదా? మీ గందరగోళ రాజకీయం, తప్పటడుగులు ఇక్కడే తెలిసిపోతున్నాయి. జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి 2014లోనే వైఎస్ జగన్ సీఎం అయితే ప్రస్తుతం రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేది. ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు. అందుకు ఆయన ఎవ్వరినీ నమ్ముకోలేదు. కేవలం తన కష్టాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన తండ్రి డా.వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చేసిన ఓదార్పు యాత్రకు, ప్రజల కోసం చేసిన పాదయాత్రకు చాలా తేడా ఉంది. పాదయాత్ర జగన్లో చాలా మార్పు తెచ్చింది. ‘నాన్న నాకు అన్నీ ఇచ్చాడు.. ఇక నేను కేవలం ప్రజల కోసమే బతకాలి’ అనే లక్ష్యం వైఎస్ జగన్లో కనిపిస్తోంది. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తేనే నవ్యాంధ్ర ఇప్పటినుంచైనా బాగుపడుతుంది. అందుకే నేను జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి అంటాను. బాబు వంటి విలన్ను సినిమాల్లోనూ సృష్టించలేను సినీ పరిశ్రమలో నాది సుమారు రెండున్నర దశాబ్దాల ప్రస్థానం. 54 సినిమాలకు రచయితగా పనిచేశాను. అందులో 90 శాతం విజయవవంతమైనవే. సినిమాల్లో ఎన్నో విలన్ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం నీచత్వం, భ్రష్టత్వమే. మొత్తం జీవితమంతా వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ మొదలు... 2014 ఎన్నికల్లో సీనియర్ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన వెన్నుపోటే పొడిచారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువెత్తు రూపం. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడు ఏమిటి? ఆయన బతికున్నారా లేదా? అని తెలియని పరిస్థితికి తెచ్చాడు. రక్త సంబంధీకులను కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. జూ.ఎన్టీఆర్ను ఎలా తొక్కొలని చూశాడో అందరికీ తెలుసు. కుమారుడు లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేసిన విషయం బహిరంగ రహస్యమే. చంద్రబాబుపై విమర్శలు ఎందుకు తగ్గాయో? చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయం అని గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్కల్యాణ్ చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు కూడా హర్షించారు. పవన్ ఇన్నాళ్లకు రాజకీయంగా సరైన దారిలోకి వచ్చారని అనుకున్నారు. మరి ఏమైందో తెలియదు? యూ టర్న్ అని చెప్పను గాని అకస్మాత్తుగా విమర్శల దాడి తగ్గించారు. అధికారపక్షాన్ని కాకుండా నిత్యం ప్రజలతో ఉండే వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. పవన్ కూడా పాదయాత్ర చేసుంటే... పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలపై మరింత అవగాహన వచ్చేది. అప్పుడు వాళ్లు చెప్పేది, వీళ్లు చెప్పేది విని మాట్లాడకుండా స్వయంగా ప్రజలతో మాట్లాడి అసలు సమస్యలేమిటో తెలుసుకునేవారు. సినీ గ్లామర్తో వెల్లువెత్తే అభిమానుల సమస్య మొదట్లో ఉన్నా, పాదయాత్ర చేసుకుంటూ పోతే అది తగ్గేది. స్టార్ హీరోల కంటే ఎక్కువ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న వైఎస్ జగన్ వేలాదిమంది పోటెత్తుతున్నా పాదయాత్ర చేశారు కదా? పవన్ కూడా అదే మాదిరి చేసుంటే ఆయనకు వర్తమాన రాజకీయాలపై స్పష్టత వచ్చేది. బ్రాహ్మణుడు చంద్రబాబుకు ఓటెయ్యకూడదు నేను సనాతన బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను. కానీ నేను సామాజిక బాధ్యత ఉన్న రచయితను. రచయితలకు కలం తప్ప కులం ఉండదు. నాది కులాంతర వివాహం. నా పెద్ద కుమార్తెది వర్ణాంతర వివాహం. కానీ బ్రాహ్మణులకు అనాదిగా చంద్రబాబు చేస్తున్న వంచనపై కడుపుమండి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్రాహ్మణులు పనికిరారని చంద్రబాబు భావిస్తుంటారు. అందుకే ఏ ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వరు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 294 నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కూడా ఒక్క టికెట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి. జంధ్యం వేసుకుని గాయత్రీమంత్రం చదివే ఒక్క బ్రాహ్మణుడు కూడా టీడీపీకి ఓటెయ్యకూడదని నేను బహిరంగంగా పిలుపునిస్తున్నా. సిగ్గు, శరం ఉంటే టీడీపీలో ఉన్న బ్రాహ్మణ నేతలు పునరాలోచన చేసుకోవాలి. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైఎస్ జగన్ బ్రాహ్మణ పక్షపాతి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు బాపట్లలో బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లిచ్చారు. ఈ ఒక్క విషయం చాలదా? బ్రాహ్మణులను వైఎస్ జగన్ ఎంత గౌరవిస్తున్నారో. అందుకే చెబుతున్నా... బ్రాహ్మణులారా, ఒక్క ఓటు కూడా బయటకి పోకూడదు. అన్ని ఓట్లూ వైఎస్ జగన్కే వేయండి. నవరత్నాలతో అందరి జీవితాలు బాగుపడతాయి మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా చిరస్థాయి పేరు సంపాదించారు. ఆరోగ్య శ్రీ. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్ ఇప్పటికీ పేదల గుండెల్లో కొలువై ఉన్నారు. మళ్లీ అంతటి పాలన ఒక్క వైఎస్ జగన్ మోహన్రెడ్డితోనే చూడగలం. ఆయన ప్రకటించిన నవరత్నాల గురించి నేను క్షుణ్నంగా తెలుసుకున్నా. ఆయన ఇంట్లో కూర్చునో, ఆఫీసులో కూర్చునో, పార్టీ నేతలతో మాట్లాడో నవరత్నాలు ప్రకటించలేదు. ఎండనక, వాననక రోడ్లపై ప్రజలతో తిరిగి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ తర్వాతే ప్రకటించారు. ఈ పథకాలతో బీదాబిక్కి జనమే కాదు అందరి జీవితాలు బాగుపడతాయి. సినీ పరిశ్రమలో జగన్ మద్దతుదార్లే ఎక్కువ సినీ పరిశ్రమలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుదార్లే ఎక్కువమంది ఉన్నారు. పవన్ కల్యాణ్ను మా సినీ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్కు మద్దతిచ్చేవారే అధికంగా ఉన్నారు. ఇక చంద్రబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విభజన తర్వాత సినీ పరిశ్రమ బాగోగులను ఆయన కనీసం పట్టించుకోలేదు. చివరగా ఒక్కమాట... నాకు రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. నేను వైఎస్సార్సీపీ నేతను కాదు. కనీసం కార్యకర్తను కూడా కాదు. కానీ వర్తమాన రాజకీయాలపై బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక రచయితగా ప్రజలు ఏ పక్షాన నిలవాలో సూచించాల్సిన కనీస కర్తవ్యం నాపై ఉంది. చంద్రబాబు అండ్ కో గిమ్మిక్కులతో కొందరు ప్రజలు, తటస్థులు గందరగోళానికి గురవుతుంటారు. అందుకే నా వంటి వాళ్లు బహిరంగంగా మాట్లాడాల్సిన సమయమిది. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ఈ రాష్ట్ర గతి మారుతుంది. ప్రజల జీవనవిధానం మారుతుంది. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్ జగన్ను సీఎం చేయాలి. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
అనుష్క న్యూ లుక్.. ఇది జస్ట్ ఝలక్
జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి స్లిమ్ లుక్లోకి వచ్చేందుకు చాలా కాలంగా కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో అనుష్క లుక్ పైగా విమర్శలు వినిపించటంతో ఇక స్వీటీ కెరీర్ ముగిసినట్టే అని భావించారు. తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కాస్త తగ్గినట్టుగా కనిపించినా గతంలో కనిపించినంత గ్లామరస్గా మాత్రం కనిపించలేదు. దీంతో మరోసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్ మీద దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్ ఇచ్చాయి. వైట్ డ్రెస్లో స్లిమ్ లుక్లో కనిపిస్తున్న అనుష్క లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్ స్పందించారు. ‘ఇది జస్ట్ ఝలక్ అంతే.. సినిమాలోతన ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
అనుష్క కొత్త లుక్ చూశారా?
సౌత్లో లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్ను మళ్లీ సృష్టించారు మన స్వీటి అనుష్క. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ తరువాత అనుష్క భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే మళ్లీ ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్ను పట్టాలెక్కించలేకపోయారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు స్వీటి ఆసక్తి చూపింస్తుండగా.. కోన వెంకట్ చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పారు. ఈ మూవీలోని అనుష్క లుక్ను కోన వెంకట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి క్రేజ్ను తీసుకువస్తుందో చూడాలి. We are super excited with the look of Anushka in our film. This would be her best look till date. I like this look too 👍 pic.twitter.com/7aDxK0xk0D — kona venkat (@konavenkat99) 25 December 2018 -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
‘సైలెంట్’ సినిమాలో అనుష్క
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్ ఇటీవల నిర్మాతగానూ మంచి విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణ సారధ్యంలో మరో సినిమాను ప్రకటించారు. బహు భాషా నటుడు మాధవన్, సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్కల కాంబినేషన్లో కోన వెంకట్ సహ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. సైలెంట్ పేరుతో సైలెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మించనున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో నటించిన మాధవన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సైలెంట్ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నారు. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్లో అలరించనున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్గా అనిపించింది. హోమ్వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్ని, దశరథ్ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
ఈ ఫీల్డ్లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్మెంట్తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
‘నీవెవరో’ ఆడియో రిలీజ్
-
ఇంట్రస్టింగ్గా ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను ఈ రోజు (ఆదివారం) చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘నీవెవరో’ ఫస్ట్లుక్
విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
‘నీవెవరో’ రీమేకా..?
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ప్రధాన పాత్రల్లో నీవెవరో పేరుతో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది.. అంధుడిగా కనిపించనున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మళయాల సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. రొమాంటిక్ యాక్షన్థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ధృవీకరించలేదు. -
నాని చేతుల మీదుగా టైటిల్ అనౌన్స్మెంట్!
కోన ఫిల్మ్ కార్పొరేషన్పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు చిత్రయూనిట్. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్ నటించనున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. -
ఈవీఎంకు సరికొత్త అర్థం
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు భిన్నంగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా సహా రాజకీయ అంశాలపై స్పందించే టాలీవుడ్ రైటర్ కమ్ మేకర్ కోన వెంకట్ తన ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ గెలవటానికి ఈవీఎంలే కారణమంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)ను ఓపెన్ చేశారో.. అప్పుడే ఫలితం ఈవీఎం అని తేలింది. ఇంతకీ ఈవీఎం అంటే మరేమిటో కాదు.. ‘ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ’(ప్రతీ ఒక్కరూ మోదీకి ఓటేశారు) అంటూ కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా.. నో కామెంట్ అంటూ తెలివిగా వ్యాఖ్యానించారు. ‘చేయాల్సిన కామెంట్ అల్రెడీ చేసేశారు కదా! మీ టైమింగ్ సూపర్’ అంటూ అని కొందరు రీట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అది సెటైర్ అంటూ కోనపై మండిపడుతున్నారు. When they opened EVMs today in Karnataka (Electronic voting machines) ... The results are... EVM (Everybody Voted for Modi) ... No comments!! — kona venkat (@konavenkat99) 15 May 2018 -
కాలజ్ఞానమే యు
వైవైవీ క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వన్నెంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యు’. వివేక్ విశాల్, తరుణికా సింగ్, యామిని నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ‘‘గతంలో నేను కొన్ని డెమోస్ తీశాను. అందులో ఒక దాని పేరు ‘కాలజ్ఞానం’. ఆ డెమో న్యూయార్క్, బాంబే తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుపుకుంది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీస్తున్నాను. మనిషి సృష్టించుకున్న అభివృద్ధే వినాశకానికి కారణమని చెప్పబోతున్నా’’ అన్నారు. ‘‘25ఏళ్లుగా రామానాయుడు స్టూడియో, శబ్దాలయా స్టూడియోల్లో పనిచేశాను. నిర్మాతగా నాకిది తొలి సినిమా’’ అన్నారు మారుతి. ∙తరుణికా సింగ్, వివేక్ విశాల్, యామిని -
సినీ నటులపై కోన కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. రాజకీయనాయకులపై విమర్శలు చేస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘సినీరంగానికి చెందిన కొందరు నటులు సినిమాటిక్గా, స్టుపిడ్గా అనిపించే రాజకీయ సిద్ధాంతాలను చెపుతున్నారు. వారి ఆలోచన ఆచరణాత్మకగా ఉంటే అభినందించేవాన్ని.. కానీ అలా లేదు. వారు నిజాయితీ గత నాయకులను విమర్శించటం మానేసి, ప్రజా సమస్యలపైన దృష్టి పెడితే బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ వాఖ్యలు నటుడు శివాజీని ఉద్దేశించి చేసినవే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. Some actors from r film industry, started speculating some political theories which are sounding very cinematic and stupid... I appreciate them if they r more practical in their thinking... Instead of attacking geniune leaders, Pl focus on people and their problems brother !! — kona venkat (@konavenkat99) 24 March 2018 -
భావోద్వేగానికి లోనైన మంచులక్ష్మీ, కోన
సాక్షి, సినిమా : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రచయిత కోన వెంకట్, మంచులక్ష్మీలు భావోద్వేగంతో కూడిన సందేశాలను విడుదల చేశారు. ‘భారతీయ చలనచిత్ర రంగం ఒక దేవతను కోల్పోయింది’ అని ప్రముఖ రచయిత కొన వెంకట్ పేర్కొన్నారు. శ్రీదేవి మరణవార్త విని యావత్ ప్రపంచంతో తాను షాక్కి గురయ్యానని.. ఆమెతో కలిసి మామ్ చిత్రానికి తాను పని చేశానని ఆయన చెప్పారు. తాను ఆమెతో కలిసి పని చేసిన మొదటి చిత్రం అదేనని.. దురదృష్టవశాత్తూ అదే ఆమె కెరీర్ లో చివరి చిత్రం అవుతుందని ఊహించలేదని కోన తెలిపారు. ఆమె లేని లోటు ఎవరూ, ఎప్పటికీ పూడ్చలేరని, ఎన్ని యుగాలైన ఆ లోటు భర్తీ కాలేదని చెప్పారు. సౌమ్యురాలు.. సున్నితమైన వ్యక్తి, అందరినీ ప్రేమించే గుణం.. ఇలా ఎన్నో గొప్పలక్షణాలు ఆమెకున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కోన వీడియో సందేశంలో చెప్పారు. She loved cinema.. Cinema loved her more... Never thought that I was writing her last film.. MOM 🙏 pic.twitter.com/g9m1wIt3lA — kona venkat (@konavenkat99) 25 February 2018 ‘ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు’ శ్రీదేవి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదని నటి మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ‘ఆమె నటన నుంచి ప్రేరణ పొందని నటీనటులు లేరంటే అతిశయోక్తి కాదేమో. తెర వెనుకాల హుందాగా ఉండే శ్రీదేవి కెమెరా ముందుకు వస్తే నటనతో విజృంభించేవారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా పోషించే ఆమె ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు చాలా తీసుకునేవారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం శోచనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మంచులక్ష్మీ తెలిపారు. -
తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్
శ్రీదేవి మృతి పట్ల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. పలు సందర్భాల్లో శ్రీదేవి మీద తన అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ అవకాశం వస్తే ఆమెతో కలిసి నటించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ‘ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె గెలుచుకుంది. తిరిగి తను ఏ స్వర్గం నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నా. ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు’ అంటూ ట్వీట్ చేశాడు. హీరోయిన్ హన్సిక ‘నేను నమ్మలేకపోతున్నా. ఇది నిజం కాకూడదు. ఇంకా షాక్లోనే ఉన్నా. ఇది భారతీయ సినీ చరిత్రలోనే చీకటి రోజు. ఆమె లేని లోటును తెలియజేసేందుకు మాటలు సరిపోవటం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. యంగ్ హీరో నిఖిల్ ‘ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా.. అందం అంటే ఎప్పటికీ శ్రీదేవిగారే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్ నటి ఖుష్బూ, మెహరీన్, కోన వెంకట్, హరీష్ శంకర్, సుమంత్, ప్రియమణి, హన్సిక, అనీల్ రావిపూడి,ఈషారెబ్బా తదితరులు తమ సంతాపం తెలియజేశారు. She came. She saw. She conquered. And went back to the heavens from where she came. RIP Sridevi garu.IRREPLACEABLE pic.twitter.com/NB4GozzWYi — Jr NTR (@tarak9999) 25 February 2018 Shocked ! I can’t even believe this ... this can’t be true . Still in shock . This is the darkest day in Indian cinema . A legend , A true star , an act par excellence , any amount of words will fall flat to express the demise of #sridevi ji , gone to soon . — Hansika (@ihansika) 25 February 2018 At a loss for words! RIP #Sridevi garu!💔 pic.twitter.com/Ftk3n3rSms — Sumanth (@iSumanth) 25 February 2018 Shocked and feeling so sad that one of my idols whom I have always maintained was one of my inspirations to join the film industry is no more!!! RIP my idol! Forever you will remain in all our hearts!! #Sridevi 💔 — Priyamani Raj (@priyamani6) 25 February 2018 As a mark of respect for the late legendary actor #Sridevi, i change my DP for today.. Will miss your giggle and that laughter ma. — khushbusundar (@khushsundar) 25 February 2018 Unbelievable, deeply saddened to wake up to saddest news of legendary #Sridevi ji passing away, 🙏RIP,nothing can fill void of her loss to film industry,will always be someone to look up to #NaturalActress #SuperDancer #LovelyHumanBeing pic.twitter.com/lw2wTo7eX4 — Mehreen Pirzada (@Mehreenpirzada) 25 February 2018 Shocked😥.....Goddess #Sridevi Garu no more......... — Anil Ravipudi (@AnilRavipudi) 25 February 2018 Shocked beyond words. Grew up in awe of your talent. You gave us joy love and so many movies. Gone too soon. Rest in peace #Sridevi ma’am 💔 pic.twitter.com/QSGDbqWIcG — Eesha Rebba (@YoursEesha) 25 February 2018 -
సమంత మాయ కొద్దిసేపేనా?
సాక్షి, సినిమా : టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీ సమంత-నాగ చైతన్య వివాహం తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారు కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఇందులో సమంత కేవలం అతిథి పాత్రలోనే నటించబోతోందంట. ఈ చిత్రంలో కాసేపు కనిపించే ఓ పాత్ర కోసం దర్శకుడు నటీమణుల కోసం వెతుకుతుండగా.. సామ్ పేరును చైతూ సూచించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న హీరోయిన్ రోల్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ట్రాక్తో శివ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడంట. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్న చైతూ అవి పూర్తికాగానే శివ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సమంత రంగస్థలం, మహానటిలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. -
ఎంత సక్కగున్నావె లచ్చిమి.. ఎంతెంత బాగుందో!
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ.. ఎంతసక్కగున్నావె లచిమి.. ఎంత సక్కగున్నావె.. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే సేతికి అందిన సందమామలాగ.. ఎంత సక్కగున్నావే లచిమి.. ఎంత సక్కగున్నావె.. మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ.. ఎంత సక్కగున్నావె.. ముత్తెదువ మెళ్లో పసుపుకొమ్ములాగ.. ఎంత సక్కగున్నావె.. సుక్కల సీర కట్టిన ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావె.. అంటూ చిట్టిబాబు తన రామలక్ష్మీ కోసం పాడిన పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. పల్లె నేపథ్యాన్ని కళ్లకు కట్టెలా చంద్రబోస్ అందించిన సాహిత్యం, జానపద రీతిలో చెవులకు ఇంపుగా దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం, గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. శ్రోతలను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాటపై తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ రచయిత కోన వెంకట్ ప్రశంసల జల్లు కురిపించారు. సుకుమార్ ‘రంగస్థలం’ ట్రైలర్ ఎంతగానో నచ్చింది. కానీ ఈ పాట రంగస్థలంను మరో లెవల్కు తీసుకెళ్లేలా ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్కు, సంగీంత అందించిన డీఎస్పీకి మిలియన్ చీర్స్ అంటూ వర్మ ప్రశంసించారు. ‘చాలా అరుదుగా కొన్ని పాటలు మన గుండెల్ని తాకి, మన మనసుల్ని మీటి, మన జ్ఞపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంటాయి. ఇది అచ్చం అలాంటి పాటే’ అంటూ కోన వెంటక్ ట్వీట్ చేశారు. ఈ పాటకుగాను సమంత ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఈ పాటలో రాంచరణ్ కనబర్చిన హావభావాలు అద్వితీయమని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ లో చిట్టిబాబుగా రామ్చరణ్, రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. ఎంతసక్కగున్నావె.. లచిమి పాట రెండు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’ అంటూ రామ్చరణ్ వాయిస్తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది. -
కోన ట్వీట్పై కేటీఆర్ స్పందన ఏది?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ట్వీటర్ ద్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తూ సదరు శాఖలను అప్రమత్తం చేస్తుంటారు. సినీరంగంతోనూ కేటీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వేడుకలకు అతిథిగా హాజరవ్వటమే కాదు, తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కేటీఆర్. అయితే సినీరంగంతో ఇంత సన్నిహితంగా ఉండే కేటీఆర్.. సినీ రచయిత కోన వెంకట్ చేసిన ఓ ట్వీట్పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్ (movierulz) వెబ్సైట్పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కోరారు. తన మెసేజ్తోపాటు గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్స్ సైట్లో ఉన్న స్క్రీన్ షాట్ను కూడా పోస్ట్ చేశారు. కానీ ఈ విషయంపై కేటీఆర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఈ సైట్లో తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల పైరసీ లింక్లు కూడా రిలీజ్ అయిన 24 గంటలలోపే దర్శనమిస్తున్నాయి. @KTRTRS .. we request ur immediate intervention in taking severe action against this particular website called “movierulz” which is a major threat to TFI.. Please instruct concerned authorities to lock these people up for good and save us 🙏 Here’s is the evidence sir.. pic.twitter.com/r1tG5rDPKd — kona venkat (@konavenkat99) 12 February 2018 -
దుర్గమ్మ సేవలో హీరోయిన్ తాప్సీ
ప్రముఖ నటి తాప్సీ శుక్రవారం దుర్గగుడిపై సందడి చేశారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ కోన వెంకట్ శుక్రవారం దర్శించుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన తాప్సీ, కోన వెంకట్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ప్రత్యేక పూజలు జరిపించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం తాప్సీ మీడియాతో మాట్లాడారు. గతంలో పలుమార్లు అమ్మవారి గురించి తెలుసుకున్నానని, ఈసారి దర్శనం చేసుకోవడం తన అదృష్టమన్నారు. తాప్సీతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. -
మౌనమంటే ఇదేనా.. కత్తికి కోన ఘాటు కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఎడతెగని టీవీచర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. అటు పవన్ అభిమానులు మౌనంగా ఉండాలని కోన సూచించారు. దీంతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో భావించారు. కానీ, జనవరి 15వ తేదీ వెళ్లిపోయింది. ఇటు వివాదమూ సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం కత్తి మహేశ్ ట్వీట్.. కోన వెంకట్ను ఉద్దేశించి ‘ఎక్కడ ఉన్నారు సార్? నేను మౌనంగా ఉన్నా.. పవన్ కల్యాణ్, అతని అభిమానుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నా నుంచి నా కుటుంబానికి ఈ దాడులు విస్తరించాయి. నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కోన ఘాటుగా స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్లో పాల్గొన్నావు. పీకే, అతని అభిమానుల మీద దాడి చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలను కలిశావు. మౌనం అంటే నీ నిఘంటువులో వేరే అర్థం ఉందా’ అని ప్రశ్నించారు. దీనినిబట్టి పవన్ అభిమానులు, కత్తి మహేశ్ మధ్య గొడవకు ఫుల్స్టాప్ పెట్టేందుకు తెరవెనుక ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదా? కేవలం పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల సందర్భంగా రభస లేకుండా తాత్కాలికంగా వాయిదా వేసేందుకే కోన ఈ ట్వీట్ చేశారా? ఇకముందు కూడా ఈ వివాదం కొనసాగబోతుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Unfortunately, after my tweet on 7th, u continued ur debates on the same issue in few channels and also involved some student organisations in attacking PK & his fans.. Does “SILENCE” has different meaning in ur dictionary?? https://t.co/wXETH2BpbM — kona venkat (@konavenkat99) January 17, 2018 -
15న ఏం జరగబోతోంది?
టాలీవుడ్ విశ్లేషకుడు మహేష్ కత్తి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన భావిస్తున్న ఆయన ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ‘‘ మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అసలు ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పడితే అంత మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. “SILENCE IS A TRUE FRIEND WHO NEVER BETRAYS”.... I request everyone to maintain Silence till 15th January.. I request even Mahesh Kathi to maintain silence.. going to any media house or using any platform to speak against fans or PK will spoil the attempt to bring peace 🙏 — kona venkat (@konavenkat99) 7 January 2018 పూనమ్ కూల్ రియాక్షన్ ఇక తనపై మహేష్ కత్తి చేసిన విమర్శలపై నటి పూనమ్ కౌర్ నేరుగా స్పందించలేదు. కాకపోతే ట్విట్టర్లో మహేష్పై అనుచిత ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ఆమె రీ ట్వీట్తో సున్నితంగా మందలించారు. Who ever this is you are not going to degrade any ones mother ! I sincerely request ! Plz https://t.co/apmWDhSeu0 — Poonam Kaur Lal (@poonamkaurlal) January 7, 2018 -
రెండోసారి
‘గుండెల్లో గోదారి’ చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి–తాప్సీ మరోసారి జోడీ కడుతున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో ‘గీతాంజలి‘ చిత్రనిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రారంభం కానుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు మరో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ‘సరైనోడు, నిన్ను కోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆది ప్రస్తుతం ‘రంగస్థలం, అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు మంచి పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగానూ నటిస్తున్నారాయన. ‘వెన్నెల’ కిశోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (‘అర్జున్రెడ్డి’ ఫేమ్), సంగీతం: గోపీసుందర్. -
రామ్ని కోరి
సేమ్ బ్యానర్.. సేమ్ డైరెక్టర్.. సేమ్ రైటర్... కానీ హీరో చేంజ్ అయ్యాడట. ఏ బ్యానర్? ఏ డైరెక్టర్? ఏ రైటర్ అంటే.. డీవీవీ బేనర్, శివా నిర్వాణ, కోన వెంకట్. నాని హీరోగా శివా నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘నిన్ను కోరి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ప్లే అందించారు. ఇప్పుడు దానయ్య, శివా నిర్వాణ, కోన వెంకట్... రామ్ని కోరారు. రామ్ హీరోగా ఈ ముగ్గురూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. శివ చెప్పిన లవ్స్టోరీకి ఇంప్రెస్ అయ్యారట రామ్. అంతేకాదు.. ఈ సినిమాకి కూడా కోన వెంకట్నే స్క్రీన్ప్లే అందించనున్నారని సమాచారం. -
ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్ డైరెక్టర్లే ఎన్టీఆర్ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేయడంతో కోన వెంకట్ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్కు సన్నిహితుడు. ఎస్ఎస్ రాజమౌళి, వీ వినాయక్లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్ ప్లేస్లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్కు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. S.S.R & Koratala Shiva https://t.co/mxenAEjDs6 — kona venkat (@konavenkat99) 28 October 2017 -
కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్
నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్కు స్టైలిస్ట్గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. తిక్క సినిమాలో గేయ రచయితగా ఆకట్టుకున్న నీరజ, త్వరలో ఓ సినిమాకు రచన చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రైటర్స్ అసోషియేషన్ లో పేరు కూడా రిజిస్టర్ చేయించుకున్న నీరజ, ఓ పెద్ద నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతుందట. త్వరలోనే నీరజ కథ అందించబోయే సినిమా ఎనౌన్స్మెంట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరి నీరజ కూడా అన్న కోన వెంకట తరహాలో కమర్షియల్ రైటర్ అనిపించుకుంటుందో లేక తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి. -
కోన వెంకట్తో సరదాగా కాసేపు
-
బాలీవుడ్ సినిమా అయినా.. గాడిలో పెడుతుందా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన వెంకట్ చేయి పడిందంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేంది. అయితే రాను రాను ఈ స్టార్ రైటర్ ఆ ఫాంను కోల్పోయాడు. పండగచేస్కో, అఖిల్, బ్రూస్ లీ, త్రిపుర, సౌఖ్యం ఇలా వరుస ఫ్లాప్లు కోక కెరీర్ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక తానే నిర్మాతగా మారి దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తూ తెరకెక్కించిన శంకరాభరణం కోన టాలెంట్ మీద అనుమానాలు కలిగేలా చేసింది. అయితే తరువాత డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోన కాస్త పరవాలేదనిపించాడు. టాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోవటంతో పరభాష ఇండస్ట్రీల మీద దృష్టిపెడుతున్నాడు కోన వెంకట్. ప్రస్తుతం ప్రభుదేవా తో కలిసి కోలీవుడ్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాకు ఓ కథ వినిపించిన కోన, ఆ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ హీరోగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్కు కథ వినిపించిన కోన, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ లో అయిన కోనకు సక్సెస్ ట్రాక్ దొరుకుతుందేమో చూడాలి. -
కోలీవుడ్ లో 'గీతాంజలి'
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
కోలీవుడ్ గీతాంజలిలో జీవి
ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
ఆ ఇద్దరు విడిపోయినట్టేనా..?
కోన వెంకట్, గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ భారీ విజయాలతో ఇండస్ట్రీ ఫేట్ మార్చేసింది. ఒకే కథను మళ్లీ మళ్లీ రాస్తారన్న పేరున్నా, అదే కథను అన్నిసార్లు ఒప్పించటంలోనూ సక్సెస్ అయ్యారు కోన వెంకట్, గోపి మోహన్. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ మ్యాజిక్ పెద్దగా వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. షాడో, అల్లుడు శీను, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ రావటమే కాదు.. ఈ ఇద్దరి పెన్ను పవర్ తగ్గిపోయిందన్న అపవాదు కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ రచన మీద కన్న నిర్మాణ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో గోపి మోహన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు స్టార్ రైటర్లు పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోవటంతో ఇక మీదట వీరి కాంబినేషన్ కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలను వేదిస్తుంది. ఒక్కసారి దర్శకుడిగా మారిన తర్వాత తిరిగి రచయితలుగా పనిచేసే ప్రయత్నం చేయరు కనుక.. ఇక కోన వెంకట్, గోపి మెహన్ల జోడీ విడిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. -
నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!
- నిఖిల్ ‘‘ ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంటర్టైనింగ్ పార్ట్ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు ఉదయ్ పన్నెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’’ అని కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్లో జరిగింది. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రథ మార్థంలో సప్తగిరి, సెకండాఫ్లో పృథ్విరాజ్ల కామెడీ ఈ చిత్రానికి హైలైట్గా నిలిచాయి. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అన్నారు.‘‘ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా రీచ్ అవ్వాలని ‘శంకరాభరణం’ చేశాను. అది నెరవేరింది. 600 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తే అసలు చూస్తారా అని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి థియేటర్స్ హౌస్ఫుల్. నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే’’ అని నిఖిల్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు నిలబెట్టిన సినిమా ఇది. అందుకే మేం మీ ముందు ధైర్యంగా నిలబడి ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. వెంకటేశ్ అనే అంధ విద్యార్థి మాట్లాడుతూ - ‘‘నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లా. స్టార్టింగ్ టు ఎండింగ్ కడుపుబ్బా న వ్వుతూనే ఉన్నాం. చాలా కాలం తర్వాత బాగా నవ్వానన్న ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, నైజాం పంపిణీదారు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?
రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్తో సినిమాలను నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే. -
టైటిలాభరణం
కొత్త సినిమా గురూ! ‘శంకరాభరణం’ కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ-స్క్రీన్ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్, శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది. తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్తో మరో సినిమా చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్తో క్రైమ్ కామెడీ తీయడం మరీ సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’. టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు. అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే ముప్పులో పడతాడు హీరో తండ్రి. పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా వచ్చేశాననీ, బీహార్లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్కు తానే వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు. ఇక్కడ బీహార్లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్ ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్లో ఉంటున్న మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు. ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా) హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్కి కోట్లకు అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో కిడ్నా పర్కు హీరో, హీరోయిన్లు ట్రాన్సఫరవుతుంటారు. ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా. కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి. వెరైటీ స్క్రిప్ట్లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు. అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది కమెడియన్లున్నారు. కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్కి! అయితే, లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం. ‘లాజిక్లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ సిల్వర్స్క్రీన్ వార్నింగ్తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, బీహార్లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్ నందనవనమ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్దే. ఎవరి భాగమెంతో తెరపై చూసి చెప్పడం కష్టమే. కథనంలో బిగింపు, ఎడిటింగ్లో తెగింపు అవసరమని గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్లో కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం. సెకండాఫ్లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ, హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్కీ తోడ్పడే సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది. ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్లో ఆఖరి టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే, స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం, బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు. - రెంటాల జయదేవ * హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు. * బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్ ప్రధానంగా మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల రిలీజ్కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి.