maa
-
జేసీ ప్రభాకర్రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు'జేసీ ప్రభాకర్రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది. -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
ఆ యూట్యూబర్పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
భవిష్యత్తులోనూ 'మా' పోరాటం కొనసాగిస్తాం: మంచు విష్ణు
టాలీవుడ్ నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసింది. ఇచ్చిన గడువులోగా అలాంటి వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దాదాపు 20కి పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు.తాజాగా ఈ అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య సమాచారాన్ని నియంత్రించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సూచనలు తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సోషల్ మీడియాలో నటీనటులపై అసత్యాలు, అగౌరవ పరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాడేందుకు సభ్యుల నిబద్ధత చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. On behalf of the MAA, we are honored to support our actors. #MAA President @iVishnuManchu has addressed key issues, particularly addressing disinformation & disrespect from some content creators. We are proud of our dedicated team and their innovative ideas for the future. pic.twitter.com/xohPmWT5WD— MAA Telugu (@itsmaatelugu) July 30, 2024 -
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మంచు విష్ణుపై పెరుగుతున్న ఒత్తిడి!
ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, ట్విస్టులతో మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ అంశంలో రాజ్ తరుణ్పై మా అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై షోకాజ్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మా సభ్యులతో మంచు విష్ణు చర్చించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అతన్ని మా నుంచి సస్పెండ్ చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.హేమ, ప్రణీత్ హనుమంతు విషయంలో వేగంగా స్పందించిన మంచు విష్ణు.. రాజ్ తరుణ్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి కొంత మంది మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈడో రకం.. ఆడో రకం సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించారు. -
ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్ ఫాంహౌస్లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి పంపారు.'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్పై చేసిన కామెంట్స్పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మా ప్రిసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. 'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఈ అభిజాత్యం సబబేనా?
‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో... ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ప్రకాష్ రాజ్ని న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు ఉండకూడదు! ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి, ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! కనీసం ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. ప్రకాష్రాజ్ నోట... చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’ తెలుసుకోవాలి. ‘అంటరానితనంబునట్టి భారతజాతి ప్రపంచ సభ్యతనే కోల్పోయింద’ ని భావిం చిన మహాకవి జాషువా. అలా తామె పుట్టరాని చోట పుట్టామన్న అనంతమైన బాధను ఎందుకు గుండె బరువుతో మరింత కొంత ముందుకు సాగి ఇలా వ్యక్తం చేయవలసి వచ్చిందో గమనించండి. ‘ఎంత కోయిలపాట వృ«థయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు / ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా/ కటిక కొండల మీద మిటకరించి/ ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా/ మురికి తిన్నెల మీద పరిమళించి/ ఎన్ని ముత్తెపురాలు ఖిన్నమయ్యెనో కదా/ పండిన వెదురు జొంపములలోన / ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను / యెంత రత్నకాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు! భగ్నమై పోయెనో / – పుట్టరాని చోట పుట్టుకతన’’! ఎందుకంతగా జాషువా భగ్నహృదయుడు కావలసి వచ్చింది? మనుషులు ఎదిగారు గానీ మనసులు ఎదగలేదని ‘పొట్టిబావ’ లాంటి ఒక బొటనవేలంత ఎత్తుకు మించని ఒకానొక ‘మా’ సంస్థ తన స్థాయిని మించి యావదాంధ్ర ప్రేక్షక లోకాన్ని కల్లోల పరచడానికి ఎందుకు ప్రయత్నించింది! ఈ కల్లోలంలో భాగంగానే సుప్రసిద్ధ కళాకారుడు, కన్నడ అభ్యుదయ కథా రచయిత, ప్రగతిశీల ఉద్యమా లకు వెన్నుదన్నుగా ఉన్న ప్రకాష్రాజ్ ‘ఓహో నేను తెలుగువాణ్ణి కాను, ఇప్పుడు గుర్తించాల్సి వచ్చింద’న్న బరువైన ప్రకటన ఎందుకు విడుదల చేయవలసివచ్చింది? ‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ఆయనను న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు, మిగతా ‘మా’ సభ్యులకు ఉండకూడదు! పరస్పరం ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి మరుగున పడిన ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! యావత్తు దక్షిణాపధాన్నే తెలుగు (16వ శతాబ్దం దాకా) ఏలుతూ వచ్చిన కాలం మరుగున పడిపోయింది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, వర్గ, వర్ణ వివక్ష రంగులు పులిమి ఏలుతున్న కాలంలో ఆ వివక్షలకు దూరంగా ఉండి కన్నడ ప్రపంచంలో కళా, సాంస్కృతిక రంగాలలో, భావ విప్లవంలో భాగంగా అత్యంత అభినవ భావాలతో సంస్కృతీ పరులకు, ఉద్యమకారులకు ప్రకటనలలోనే కాదు, ఆచరణలో స్ఫూర్తిగా నిలబడుతున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే ‘పొట్టిబావల’ సంస్థగా మారిన ‘మా’లో ఫలానావారు స్థానికులు, మిగతావారు బయటివారనీ, కళాకారుల మధ్య వివక్షకు తావిచ్చారో, ఆ క్షణంలోనే ప్రకాష్రాజ్కు తాను ‘కన్నడవాడినే కానీ, తెలుగువాడిని కాను కాబోలు’ నని అంతవరకూ లేని భావన, బాధ కలుగజొచ్చాయి. ఈ పరిణామమే ప్రకాష్రాజ్ ‘మా’ నుంచి తప్పు కోవడానికి కారణమై ఉండాలి! గత వైభవ చరిత్రతో సంబంధాలు తెగిపోయిన దరిమిలా కనీసం ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. రాయల తెలుగుదేశమే ప్రకాష్రాజ్దీ. ఆంధ్ర– కన్నడల మధ్య అభేదాన్ని గుర్తు చేస్తూ రెండూ ఒకేదేశం, అదే తెలుగు సువిశాల దేశం అని ప్రకటించాడు రాయలు! 16వ శతాబ్దంలో రాయల యుగం ముగిసేదాకా ఆంధ్ర– కర్ణాటకలు ఒక తల్లి బిడ్డలే. ఏక రక్త సంబంధీకులు. ఆనాటి రాయలకు అమరావతి (కర్ణాటక) నగరంతోపాటు, రాయలసీమలోని పెనుగొండ కూడా రాజధాని, రెండవ రాజధానిగా ఉండేవని మరచిపోరాదు! అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆర్ద్రతతో... ఆంధ్ర– కన్నడ రాజ్యలక్ష్ముల అరతి నీలపుదండ పెనుగొండ కొండ’’ అని చాటవలసి వచ్చింది! పెనుగొండ రెండవ రాజధానిగా ఏలిన రాయలు రాయలసీమ నలుమూలలా అనేక చెరువులు తవ్వించి కరువుసీమను పంటసీమగా రూపొందించినవాడు. ఈ విషయంలో కూడా కాకతీయులు నిర్మించుకున్న చెరువులను రాయలు రాయల సీమకు ఆదర్శంగా తీసుకున్నాడని మరువరాదు. అంతేకాదు, ఆంధ్ర –కన్నడ ప్రాంతాలు ఉమ్మడిగా ఒక గొడుగు నీడనే ఎదిగినంత కాలం రాయలయుగ పరివ్యాప్తి ఉత్తరాన గజపతుల దిశవరకూ వ్యాప్తి చెందింది. బహమనీ సుల్తానుల చెరనుంచి తెలంగాణలోని వరం గల్ను విముక్తి గావించిన చారిత్రక సత్యాన్నీ మరువరాదు! ఇంతటి సంయుక్త ఉమ్మడి వైభవోజ్వల చరిత్రను మరిచినప్పుడు మాత్రమే ఈనాటివారిలో పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతీయ తగాదాలు ముదిరిపోతున్నాయి. దారీతెన్నులేక ఎక్కడి కక్కడ ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలుగా ఏర్పడి మానవతా వైఖరికి చెల్లుచీటి ఇచ్చుకుంటున్నారు. బహుశా అందుకే ఒక సంద ర్భంగా ప్రకాష్రాజ్ ఈ ప్రపంచంలో బతకలేని మనుషులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా, మోసపోయినా ఆ లిస్టులో నేనూ, మీరూ, ఎవరైనా చేరుకోవచ్చునని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, ద్రోహం అనేది ఇతరులకు చేయనక్కర్లేదు, మనకు మనమే చేసుకోవచ్చునని కూడా ప్రకటించాడు! ఇలా అనేక సామాజిక అంశాలపైన పరిణామాలపైన ప్రకాష్ రాజ్ ఒక చేయి తిరిగిన ప్రసిద్ధ రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడు. రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, పెట్టుబడిదారీ, ఫ్యూడల్ వ్యవస్థను, దోపిడీ సమాజంలోని పెక్కు పరి ణామాల పట్ల, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కులు, వాటిపై ఎక్కుపెట్టిన ప్రజాతంత్ర శక్తుల పోరాటాలపైన, ఆ హక్కుల సాధనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులపైన పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే ధైర్యసాహసాలతో ఒక ప్రజాకళాకారునిగా బాహా టంగా నిరసన తెలుపుతూ వచ్చినవాడు ప్రకాష్రాజ్. కర్ణాటక ఉద్యమకారిణి, ప్రసిద్ధ పత్రికా సంపాదకురాలైన గౌరి లంకేష్ హత్యను, ప్రొఫెసర్ కల్బుర్గి, తదితర పౌరహక్కుల నాయకుల హత్యల్ని, రాజ్యహింసను, బాహటంగా నిరసించి, ఉద్యమించిన కళానిధి ప్రకాష్రాజ్ అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకనాడు శ్రీశ్రీ... కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తూ ‘పొట్టిబావ కాంగిరేసు మేజరయ్యేదె ప్పుడు’ అని వేసిన ప్రశ్నే ‘మా’లోని పొట్టిబావ’లకూ ఎదురయింది. అందుకే ప్రకాష్రాజ్ ‘భాష అనేది ఒక అభివ్యాప్తి రూపం. సుఖ దుఃఖాల్ని వ్యక్తపరచుకునే ఒక మాధ్యమం. బసవన్న 12వ శతాబ్దపు గొప్ప వచనకారుడు, దార్శనికుడు. బింద్రే, కువెంపు, తేజస్వి, లంకేష్, కె.ఎస్.ఎన్ వంటి ప్రముఖ కన్నడ కవులూ, రచయితలూ ఇలాంటి ఆలోచనా సరళికి, జీవితాన్ని ధారపోసిన రచయితల్ని తెలుసు కోకుండానే, కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే భాషను నేర్చుకొనే మనఃస్థితి ఉన్నందువల్ల, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుని అనామకులుగా నిలబడిపోయాం’ అన్నాడు. అంతేకాదు ‘జీవితంలో కొన్నింటిని ఏ కారణం వల్లనూ మార్చలేం. నేను పుట్టిన కులానికీ, నాకూ ఏ సంబంధం లేదు. అది నామీద వృ«థాగా మోపబడింది అని దాన్ని మార్చవచ్చు. నా మతం నాకు నచ్చలేదని మరో మతాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎవరికీ తన మాతృభాషను మార్చు కోవడానికి కుదరదు’ అన్నది ప్రకాష్రాజ్ భావన! అలాగే ప్రకృతి ఎంత కిలాడిదో వివరిస్తూ మనిషిలోని దురాశను ప్రకృతిపరంగా అందంగా చెప్పిన కళాకారుడు ప్రకాష్రాజ్. పూవు కాయగా మారటం, కాయ పండుగా మారే విధానం ఉందే... దీన్ని మనకు అర్థం చేయించేది ప్రకృతి. ప్రకృతి మీకు ఎంత కావాలో అంతే ఇస్తుంది. మీ ఆశకు మరికొంచెం ఇస్తుంది. కానీ దురాశను మాత్రం ఇవ్వదు. దీన్ని మనం తెలుసుకొని ఉండాల్సింది. నేర్చుకొని ఉండా ల్సింది అన్నాడు. ఇన్ని గుణపాఠాలు, స్వీయానుభవం నుంచి చెప్పిన ప్రకాష్రాజ్ నోట చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’లోని ‘పొట్టి బావ’లు తెలుసుకోవడం అందరికీ శ్రేయస్కరం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కృష్ణగారు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి!
‘‘డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ (దివంగత నటి–దర్శకురాలు విజయ నిర్మల) కోరిక. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు (బాలనటుడిగానూ చేశారు) అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉండటం నా అదృష్టం. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో నేను చేసిన పాత్ర గొప్పది.. ఇప్పుడు మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు వీకే నరేశ్. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వీకే నరేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను 200 సినిమాల్లో నటించాను. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన కృష్ణ (సూపర్ స్టార్ కృష్ణ)గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు కన్నీళ్లొచ్చాయి. కరుణ కుమార్ పెద్ద దర్శకుడు అవుతాడు. రామానాయుడుగారిలా మంచి అభిరుచి, ప్యాషన్ ఉన్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడి’’ అన్నారు. మా ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర! రానున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నేను కృష్ణుడి పాత్ర పోషిస్తా. ఎన్నికలు ప్రకటించిన తర్వాత రథం ఎక్కుతా.. అది ఎవరి రథం అన్నది తర్వాత చెబుతా. నేను ఒక్కసారి మాత్రమే అధ్యక్షునిగా పని చేస్తానని గతంలో చెప్పా.. రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయను.. నా విజన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసుణ్ణి మాత్రం ‘మా’ కు అందిస్తా. -
'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరీని ఉపేక్షించొద్దు: చిరంజీవి
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇటీవలె మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్పై నటి హేమ..ఫండ్ రైజ్ చేసిన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నరేష్ మాట్లాడుతూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై చిరంజీవి తొలిసారిగా స్పందించారు. ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
MAA: సెప్టెంబర్లో మా ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. ఈసారి అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు పోటీ పడనున్న విషయం తెలిసిందే. అలాగే జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నర్సింహారావు కూడా పోటీ పడనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ‘వర్చ్యువల్’ మీటింగ్ జరిగిందని సమాచారం. ఈ మీటింగ్లో క్రమశిక్షణా సంఘం సభ్యులు గిరిబాబు, మోహన్బాబు, మురళీమోహన్, శివకృష్ణ పాల్గొన్నారని భోగట్టా. తక్షణమే ఎన్నికలు జరపాలనే అంశంపై చర్చ జరిగిందని, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే కష్టమేనని చర్చించుకున్నారని, సెప్టెంబర్లో జరిపేలా నిర్ణయానికి వచ్చారని సమాచారం. సెప్టెంబర్ 12న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిపేవరకూ వారికి అధికారం ఉంటుందా? అనే విషయం కూడా చర్చకు వచ్చిందని సమాచారం. ఎన్నికలు జరిగే వరకూ ప్రస్తుత కార్యవర్గానికి అధికారం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. వచ్చే నెల 22న సర్వసభ్య సమావేశం జరుగుతుందని, ఆ మీటింగ్లో ఎన్నికల తేదీని వెల్లడించే అవకాశం ఉందని భోగట్టా. -
MAA Elections 2021: ‘మా’ఎన్నికల్లో మరో ట్విస్ట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన కృష్ణం రాజుకు లేఖలు రాశారు. 2019 లో ఎన్నిక అయిన 15 మంది సభ్యులు తమ పదవి కాలం ముగిసి పోయింది కనుక వెంటనే ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని నిర్వహించాలని కృష్ణంరాజును కోరారు. గతంలో రాసిన లేఖకు ఇప్పటి వరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వర్చువల్గా సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏకగ్రీవం అంశం కూడా తెరపైకి వచ్చింది. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్పై..
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్పై చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్, జయలక్ష్మి, మహ్మద్ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. గురువారం ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘మా’లో మారోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్బాబులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు రాజశేఖర్ మాట్లాడిన తీరు, అంశాలపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు. అంతేకాకుండా ‘మా’నియమనిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా జీవితరాజశేఖర్ సైతం తన భర్తది చిన్నపిల్లల మనస్తత్వంగా పేర్కొనడం విశేషం. చదవండి: ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్పై చిరంజీవి ఆగ్రహం -
దోస్త్.. మేరా దోస్త్..
-
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ (మా)లో మరోసారి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి, రాజశేఖర్ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్కు రాజశేఖర్ అడ్డుపడ్డటం, రాజశేఖర్ తీరును చిరంజీవి, మోహన్బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖర్ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్ వర్గంతో తమకున్న విభేదాలను తామలో తాము పరిష్కరించుకుంటామని ఆమె తెలిపారు. మాలో భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రతిచోట గొడవలు రావడం సహజమేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్కు చాలా టైమ్ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్బాబులాంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్తో తనకు కానీ, రాజశేఖర్కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్, జీవితారాజశేఖర్ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చరేపినా.. చివరకు పరిస్థితి చల్లబడింది. చదవండి: ‘మా’లో రచ్చ.. రాజశేఖర్పై చిరంజీవి ఆగ్రహం -
‘మా’ లో రచ్చ.. స్పందించిన జీవితారాజశేఖర్
-
‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ
-
‘మా’ డైరీని ఆవిష్కరించిన చిరంజీవి
-
నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ
-
నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు. ‘మా’ అధ్యక్షుడు నరేష్కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం జరిగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ లో ఈసీ మెంబర్గా ఉన్న ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పృథ్వీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్పై నిప్పులు చెరిగారు. తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈసీ మెంబర్గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. ‘ మా’ లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరని గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని విమర్శించారు. సభ్యుల తీరు నచ్చకనే సమావేశం నుంచి బయటకు వచ్చాననిమ గోపాలకృష్ణ పేర్కొన్నారు. -
‘మా’లో మరో కొత్త వివాదం..
-
‘మా’లో విభేదాలు లేవు
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్కి, రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ‘మా’తీవ్రంగా ఖండించింది. ‘ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి’ అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. -
మా సభ్యులకు అవకాశాలివ్వాలి
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులుగా ఉన్న చాలామంది వేషాలు లేక బాధపడుతున్నారు. వారికి అవకాశాలు కల్పించాలంటూ ‘మా’ తరఫున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర రచయితల సంఘాలకు విన్నవించాం’’ అని ‘మా’ అధ్యక్షుడు డా.వి.కె. నరేష్ అన్నారు. మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలని, ముఖ్యంగా ‘మా’ సభ్యులై ఉండి అవకాశాలు లేని నటీనటులను ప్రోత్సహించాలని కోరుతూ ‘మా’ అధ్యక్షుడు డా.వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ హేమ, ఇతర ‘మా’ సభ్యులు నినదించారు. ఈ మేరకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణలకు వినతి పత్రం సమర్పించారు. అలీ, రాజారవీంద్ర, ఉత్తేజ్, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కూమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలతోనూ మమేకం అవుతాం
‘‘ఐక్యత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముందుకు సాగుతుంది. కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా సాగింది’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్ అన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఇటీవల కొత్త కమిటీ ఏన్నికైన విషయం విదితమే. ఆదివారం తొలిసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ– ‘‘మా’ అసోసియేషన్కి గతంలో ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవిగార్లు ముఖ్య సలహాదారులుగా ఉండేవాళ్లు. ఈ సారి కృష్ణంరాజుగారిని ఎన్నుకున్నాం. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం. 30కాల్స్ వచ్చాయి. సలహాల బాక్స్కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ప్రస్తుతం ఇచ్చే పెన్షన్ను ఆరు వేలకు పెంచాం. ‘మా’ మెంబర్ షిప్ని కొత్తవాళ్లకి రూ.25వేలకు ఇవ్వాలని, రెండేండ్లు 25వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్ షిప్ వస్తుంది. అలాగే 90రోజుల్లో పూర్తి పేమెంట్ కడితే పదిశాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం. ‘మా’ బిల్డింగ్ కోసం చిరంజీవిగారు సపోర్ట్ చేస్తానన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్గారు స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో హీరోలతోపాటు ప్రజలతో మమేకమై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా’లో చిన్న చిన్న మనస్పర్థలు ఉండేవి. దీంతో ఎలా జరుగుతుందో అన్న భయం ఉండేది. కానీ బాగా జరిగింది’’ అని ‘మా’ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నటులు దేవదాస్ కనకాల, కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షురాలు హేమ, ట్రెజరర్ రాజీవ్ కనకాల, శివబాలాజీ, సురేష్ కొండేటి, సుదర్శన్, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాగబాబుకి ఓటు వేయకండి : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్ కల్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది, నర్సాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?. భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా?. నర్సాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నర్సాపురం వెళ్లి సేవ చేస్తావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు. -
‘మా’లో మేమే..
-
‘మా’ అధ్యక్ష బరిలో నరేష్
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల (మార్చి)10న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 2019-21 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైస్ ప్రెసిడెంట్గా ప్రముఖ నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఎన్నికలు వెళ్తున్నామని చెప్పారు. లక్షల రూపాయలు డొనేట్ చేసే తమ కుటుంబం నుంచి ఒక్కసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది అడగడంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో టర్మ్ అధ్యక్షుడుగా చేద్దామని శివాజీ రాజా అన్నారన్నారు. అందుకే ఈ సారి తాను పోటీకి దిగానని తెలిపారు.కోశాధికారిగా కోటా శంకర్ రావును పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ‘మా’ సరిగా పని చేయడం లేదు : రాజశేఖర్ ‘మా’ అసోసియేషన్ సరిగా పనిచేయడంలేదని ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆరోపించారు. నరేష్ నిజాయితీ మెచ్చే ఈ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నామని చెప్పారు. ప్రేమగా పని చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ‘మా’ లో ఆడవాళ్లకు కీలక పదవులు లేవని జీవిత రాజశేఖర్ విమర్శించారు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేద్దామనుకున్నానని, కానీ నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేయమని కోరడంతో అంగీకరించామన్నారు. పనిచేసే వాళ్లకే సభ్యులు ఓట్లు వెయ్యాలని కోరారు. -
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరెడ్డి విషయంలో వాళ్ల నిర్ణయం నచ్చలేదు
సాక్షి, హైదరాబాద్ : ఎవరో ఒకరి తప్పుడు నిర్ణయాల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నిందలు మోయాల్సి వస్తోందని.. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన నరేశ్.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాపై నమ్మకంతో పలు ఒప్పందాలపై సంతకం చేశానని పేర్కొన్నారు. కానీ శివాజీరాజా నిర్ణయాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. నటి శ్రీరెడ్డి విషయంలో ‘మా’ తీసుకున్న నిర్ణయం కూడా తనకు నచ్చలేదన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ‘మా’ కు చేటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ ఈవెంట్కు అడ్డుపడను.. ‘మా’ జనరల్ సెక్రటరీగా తనకు తగిన విలువ ఇవ్వకపోయినా మహేష్ బాబు ఈవెంట్కు అడ్డుపడని నరేశ్ స్పష్టం చేశారు. కళాకారుల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. చిరంజీవి రెండు కోట్ల రూపాయలు ఇస్తానన్నా.. కోటి రూపాయలకే ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నరేశ్ అన్నారు. అయినా చిరంజీవి, మహేష్, ప్రభాస్ ఈవెంట్లు లోకల్లో జరిగినా 5 కోట్ల రూపాయలు వస్తాయని.. మరి వారి ఈవెంట్లు అమెరికాలో ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేశారు. -
‘మా’ నిధుల గోల్మాల్పై నరేశ్ ఆగ్రహం
-
‘మా’ నిధుల గోల్మాల్పై నరేశ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మా జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదని.. కానీ ధర్మం కోసం పోరాడక తప్పదని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేశ్.. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీకి అంగీకరించడం లేదు.. ‘మా’ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ... ఆయనకు సంబంధించిన కాల్, మెసేజ్ డాటాను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. మూడు లక్షలు ఖర్చు చేసి... విదేశీ కార్యక్రమాల గురించి శివాజీరాజా తనకు ఎటువంటి వివరాలు చెప్పలేదని నరేశ్ ఆరోపించారు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేశారని.. ఆ డబ్బంతా ఎవరిదంటూ ప్రశ్నించారు. తప్పు జరిగినందువల్లే తాను ఫారిన్ టూర్లకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. మా తరపున క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సెక్రటరీగా ఉన్న తనకు అసలు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్రత నాకు కాల్ చేశారు.. మా మీటింగ్ లో జరిగే ప్రతి మాట రికార్డ్ అవుతుందని చెప్పారు.. కానీ సంవత్సరం నుంచి రికార్డులు అన్ని తీసివేశారని నరేశ్ ఆరోపించారు. మహేష్ బాబు ప్రోగ్రాం కోసం తానే శివాజీరాజాను నమ్రత దగ్గరకు తీసుకు వెళ్ళానని నరేశ్ అన్నారు. తాను అడిగినందువల్లే ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయిందని పేర్కొన్నారు. కానీ ఆ తరువాత నుంచి వేరే వాళ్ల నుంచి నమ్రతకు కాల్స్ వస్తోంటే.. నమ్రత తనకు కాల్ చేశారని నరేశ్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే తనను కావాలనే తప్పించడానికి చేసిన ప్రయత్నంగా అనిపించిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మనస్తాపం చెందానని... వచ్చే ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. -
మా నుంచి శాశ్వతంగా తప్పుకుంటా
-
నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం నెలకొంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో మా కార్యవర్గం స్పందించింది. సోమవారం సమావేశమైన సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా అసోసియేషన్ డబ్బులతో ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘నా పిల్లల మీద ఒట్టు..నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: హీరో శ్రీకాంత్ తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హీరో శ్రీకాంత్ అన్నారు. మా అసోసియేషన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నామని తెలిపారు. దీని కోసం మెగాస్టార్ చిరంజీవిని కలిసామని ఆయన రెండు కోట్ల డొనేషన్ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేసామని, చిరంజీవి ఛీప్ గెస్ట్గా వచ్చారని తెలిపారు. తరువాత స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్లు వస్తారని చెప్పారు. సైరా షూటింగ్ వల్ల ఒక్క ప్రొగ్రామ్కే చిరంజీవిగారు వచ్చారని, దీంతో కోటిరూపాయలు వచ్చాయన్నారు. అగ్రిమెంట్ ప్రకారం కోటి రూపాయలే ఇస్తామన్నారని, ఈవెంట్ మేనేజర్లకు ఎక్కువ వస్తే తమేం చేస్తామని ప్రశ్నించారు. చిరంజీవి స్టామినాను ఎవరు తక్కువ చేయలేరని, ఆయన అమెరికాలో ఈవెంట్స్కు రారని ప్రచారం చేశారన్నారు. మా అసోసియేషన్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేశారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీకాంత్ సవాల్ విసిరారు. మా అసోసియేషన్లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయని పరుచూరి వెంకటేశ్వరావు తెలిపారు. -
చికాగో సెక్స్ రాకెట్: స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి
హైదరాబాద్ : టాలీవుడ్లో సంచలనం రేకిత్తించిన చికాగో సెక్స్ రాకెట్ బాధితుల్లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సౌత్ స్టార్సేనని ప్రచారం జరుగుతోంది. అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. అయితే ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. మాట్లాడే తీరు నచ్చక తిరస్కరించాను: అనసూయ ఈ ఉదంతంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్లో ఓ ఈవెంట్కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు. పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సంప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. జూన్24 న సమావేశం : శివాజీ ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఆర్టిస్టులను హెచ్చరించినట్లు మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ కిషన్ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్, ప్రొడక్షన్ మెనేజర్గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. కొన్నేళ్ల కిత్రం నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలను కొన్ని గుర్తించాం. అమెరికా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియాలోని కార్యక్రమాలకు వెళ్లే ఆర్టిస్టులకు వీసా సమస్యల గురించి అవగాహన లేదు. ఈ ఉందంతంపై మా అసోసియేషన్ జూన్ 24న సమావేశం అవుతోంది. విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు అక్కడి కార్యక్రమాల వివరాలను మాకు అందజేయాలి. అప్పుడు ఆర్గనైజర్స్తో మాట్లాడి కార్యక్రమాల విషయాన్ని ధృవీకరిస్తామని’ ఆయన తెలిపారు. -
డల్లాస్లో మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
డల్లాస్ : మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు డల్లాస్లో జరిగాయి. ఈ ఫిల్మ్ స్టార్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓల్డేజ్ హోం నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి మా అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. షూటింగ్ సమయాల్లో అందరితో కలివిడిగా గడిపిన నటులు వృద్దాప్యంలో ఒంటరిగా ఉండకూడదని వారి కోసం ఓల్డేజ్ హోం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు మా సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, బెనర్జీ, ఏడిగ శ్రీరాం, హేమ, శివారెడ్డి, ప్రజ్ఞా జైస్వాల్, అలీ, శ్రీకాంత్, తరుణ్, సుధీర్, ప్రిన్స్, వరుణ్ తేజ్, రెజీనా, సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కేథరిన్, హంసా నందిని, తేజస్విని, అర్చన, నవీన్ చంద్ర, తమన్, మనీషా, ఆదిత్యాలు పాల్గొన్నారు. జాన్సీ, హరితేజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శివారెడ్డి కామెడీ అందరిని అలరించింది. కాగా, ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో లేదని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. ఆడిటోరియంలో చాలా వరకు సీట్లు ఖాళీగా కనిపించాయని, ఆర్గనైజర్లు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నారు. -
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి
-
ఇక వివాదానికి ఫుల్స్టాప్ పెట్టండి..
సాక్షి, హైదరాబాద్ :మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిర్యాదుల కోసం ఎఫ్డీసీ (ఫిల్మ్ డివిజన్ కార్పొరేషన్)లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో తెలుగు సినీ పెద్దలు శనివారం సమావేశం అయ్యారు. టాలీవుడ్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మంత్రితో చర్చించారు. సచివాలయంలోని మంత్రి తలసాని ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు శంకర్, నటి జీవితా రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సి కళ్యాణ్, మా అధ్యక్షుడు శివాజీ రాజా, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు, హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. టాలీవుడ్లో జరుగుతున్న వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 'మా' సభ్యత్వంపై వివాదాలు వెల్లువెత్తుతుండటంతో ఇక చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, అలాగే నటులకు నిర్మాతలే నేరుగా పారితోషికం ఇవ్వాలని, కోఆర్డినేటర్లు లేకుండా మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖతాలకు చెల్లింపులు జరిపేలా చూడాలని ఆయన సూచనలు చేశారు. ఇక మీడియాపై దాడి చేయడాన్ని మంత్రి తలసాని ఖండించారు. కాగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై 24 గంటల్లో స్పందించాలని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ సినీ పెద్దలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సినీ పరిశ్రమలోని 24 విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలు, ఇతర అంశాలపై కూలంకశంగా చర్చించారు. సినీ పరిశ్రమ అంతా యూనిటీగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ ఫిల్మ్చాంబర్ నియంత్రణలో పనిచేయనుంది. దాంతోపాటు ప్రస్తుత పరిణామాలపై, సినీ పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలపై మంత్రి తలసానితో చర్చించారు. -
సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ
-
వర్మ పరిశ్రమకు పట్టిన చీడపురుగు
-
ఇలా చేస్తే ‘మా’ చులకన అవుతుంది
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’)లో సభ్యత్వానికి ఎవరు అర్హులో ముందు ‘మా’ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించాలి. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ విభాగాలవారు కచ్చితమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది పాపులర్ యాక్టర్స్ ‘మా’లో సభ్యులు కారు. వారితో నటించడానికి నాకు అనుమతి ఉందా? ఆరోపణలు, విమర్శలతో ప్రస్తుతం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గ్రీవియన్స్ సెల్ను ఏర్పాటు చేయాలి. అంతేకానీ అది ఒక్క ‘మా’ మాత్రమే చేయాల్సింది కాదు’’ అని హీరో–ప్రొడ్యూసర్ మంచు విష్ణు అన్నారు. చిత్రపరిశ్రమ చుట్టూ అల్లుకున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటి శ్రీరెడ్డికి ముందు సభ్యత్వం నిరాకరించి, తర్వాత ఇస్తామంటూ ‘మా’ పేర్కొంది. అసలు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలంటే ఏ అర్హత ఉండాలి? అని విష్ణు ప్రశ్నించారు. తన మనోభావాలను ఒక లెటర్ ద్వారా వ్యక్తపరిచారు. విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇటీవల ‘మా’ అవలంభిస్తున్న చర్యలు నన్ను బాధించాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ను స్థాపించడం జరిగింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహాయపడే సపోర్టింగ్లా ‘మా’ సేవలను విస్తరించుకుంది. ఈ విధి విధానాల వల్లే ‘మా’లో చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. ‘మా’ మెంబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘మా’ మెంబర్ కాని ఒకరు రీసెంట్గా చేస్తున్న సంఘటలు నన్ను కలవరపరిచాయి. ఆమె చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా ‘మా’ విలేకర్ల సమావేశం నిర్వహించింది. ‘మా’లో సభ్యులుగా ఉన్న 900మంది ఆమెతో నటించకుండా బాయ్కాట్ చేస్తున్నట్లు నిర్ణయించింది. మంచిది.. కానీ ఆ 900మందిలో గౌరవనీయులైన మా నాన్నగారు, మా అక్కయ్య, మా తమ్ముడుతో పాటు నేనూ ఉన్నాను. ఒక నిర్మాతగా, ఒక నటుడిగా నాతో ఎవరు నటించాలన్న నిర్ణయం తీసుకునే హక్కు నాది. మీరు (‘మా’ను ఉద్దేశిస్తూ) చెప్పకూడదు. చిత్రపరిశ్రమలోని కొందరిపై విభిన్న ఆరోపణలను ఆమె మరిన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ‘మా’ వెంటనే విలేకర్ల సమావేశం పెట్టి, ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇటువంటి పరిణామాలు మా ‘పై’ వ్యతిరేక భావనను కలిగిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియా నెట్వర్క్స్లోనే కాకుండా, ప్రపంచవ్యాపంగా ‘మా’ను చులకనగా చూసే అవకాశం ఉంది’’ అన్నారు. -
కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందన
-
ఇంత నీచంగా మాట్లాడతారా?: తమ్మారెడ్డి
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, అయితే తెలుగు ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా ఉద్యమానికి తెలుగు చిత్రసీమ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు స్పందించదని తమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా హోదా ఇవ్వడంపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి నిధులు ఉత్తపుణ్యానికి ఇస్తున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అలాగే కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, తాజా పరిణామాలపై కూడా తమ్మారెడ్డి స్పందించారు. కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందన టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందించారు. సినిమా ఇండస్ట్రీ గురించి నీచంగా మాట్లాడుకోవడం బాధ కలుగుతుందన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తాము ఒప్పుకుంటామని అయితే అది కొందరి వల్లే జరుగుతోందని ఆయన అన్నారు. ’ కొంతమంది అన్నట్లు సినీ పరిశ్రమ అంత దరిద్రంగా లేదు. అలా ఉంటే ఎందుకు సినిరంగానికి చెందిన వారి పిల్లలను సినిమా రంగంలోకి దించుతాము. హీరోలు హీరోయిన్లను ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు. సినిమా వాళ్ళు అంటే అందరికి లోకువ అయిపోతున్నారు. మీడియా, సినిమా రంగం రెండు సమన్వయంతో పని చేయాలి. పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి వీళ్లు ఎవరు. సంధ్యా, దేవి లాంటి వారు కొంతమంది ట్రాప్లో పడ్డారని నేను అనుకుంటున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుతో కొడతామని ఎలా అంటారు.. ఎవరికైనా అన్యాయం జరిగితే సినీ ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పాలి. లేదంటే పోలీసులకు, లేదంటే షీ టీమ్స్ కు పిర్యాదు చేయాలి. ఎవరైనా సినిమా రంగంలో అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను ఇబ్బంది పెడితే అటువంటి వారిని కొట్టండి. ఎవరైనా వారి హక్కులను హరిస్తే వారిపై తిరుగుబాటు చేయండి. సినీ పరిశ్రమలో అసలు దేని గురించి మాట్లాడదలచుకున్నారు. బాధితులుంటే ఫిల్మ్ ఛాంబర్కు వచ్చి ఫిర్యాదు చేయమంటున్నాం. కానీ మీడియాలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు. సినీ పరిశ్రమ అంటే అందరికీ లోకువైపోయింది. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పవన్ కల్యాణ్పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం సరికాదు. సాక్ష్యాలు ఉంటే కేసు పెట్టాలి. త్వరలో ఏర్పాటు కాబోయే క్యాష్ కమిటీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు రోజుల్లో కమిటీ సభ్యుల పేర్లు వెల్లడిస్తాం. ఇక అమరావతికి సినీ ఇండస్ట్రీని రమ్మని ఎవరు పిలవలేదు. మాకు ఏమీ రాయితీలు ఇవ్వనక్కర్లేదు. మాకు సహాయ సహకారాలు అందిస్తే చాలు.’ అని తమ్మారెడ్డి తెలిపారు. ప్రధానికి తన పదవి గురించి మాత్రమే బాధ దేశంలో ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించరని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలు తన మనసును కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మాత్రం.. బీసీని అయిన నా మీద కుట్ర చేస్తున్నారు.. నన్ను పదవి నుంచి దించేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మోదీ కేవలం తన పదవిని గురించి మాత్రమే బాధపడ్డారని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు... కథువా, ఉన్నావ్ ఘటనలపై ఎందుకు స్పందించరని ఆయన డిమాండ్ చేశారు. పైపెచ్చు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మాట్లాడటం సరికాదని అన్నారు. -
మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఊరుకోం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం తీసుకున్న వారికి అవకాశాలిప్పిస్తామని ‘మా’ హామీ ఇవ్వదు. వృద్ధ కళాకారులకు పెన్షన్, సభ్యులందరికీ రూ.2 లక్షల బీమాతో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలకు మధ్య ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుంది. అంతేకానీ, ‘మా’ అవకాశాలు ఇప్పించాలనడం కరెక్ట్ కాదు’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పవన్ కల్యాణ్పై నటి శ్రీరెడ్డితో పాటు మరికొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటి గురించి బుధవారం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. టీవీ ఇండస్ట్రీలోనూ ఉంది. కాకపోతే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీలో 10 శాతం మంది అలాంటి వెధవలున్నారు. 90 శాతం మంది మంచివాళ్లు ఉన్నారు. వాళ్లను కూడా నిందించడం కరెక్ట్ కాదు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరైనా వేధిస్తే ‘చెప్పు తీసుకుని కొట్టండి. ఆ హక్కు మీకు ఉంటుంది’. బయట మాట్లాడుతున్నవారికంటే మాకూ మహిళలంటే చాలా గౌరవం ఉంది. ఇండస్ట్రీమీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతుర్ని ఇండస్ట్రీలో పెడతా? ‘క్యాష్’ కమిటీకి మేము రెడీ. లైంగిక వేధింపులకు పాల్పడే కోఆర్డినేటర్లపై నిర్మాతలకు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. షూటింగ్ స్పాట్లో జూనియర్ ఆర్టిస్టులకు కనీస సౌకర్యాలు కల్పించేలా నిర్మాతలందరితో మాట్లాడతాం. ఇండస్ట్రీలో ఇతర భాషలవారు పని చేయకూడదనడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే. ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. తెలుగమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వమని నిర్మాతలను, దర్శకుల్ని ‘మా’ కోరుతోంది. కానీ వారిపై ఒత్తిడి చేసే హక్కు లేదు. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది దర్శక–నిర్మాతల ఇష్టం. మీడియా కూడా టీఆర్పీల కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడాలి. అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయమని పవన్ అనడంలో తప్పేముంది? ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే కల్యాణ్ ఏం చేస్తాడు? ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మేం బలవంతులం. మాకు భరించే శక్తి ఉంది. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు. ఇకపై మెగా ఫ్యామిలీని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకునేదిలేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించడం మంచిది’’ అన్నారు. -
ప్రత్యేక హోదా కోసం సినీరంగం పోరాడాలి
‘‘ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది ప్రజలు మన సినిమాలు చూస్తున్నారు. వారు లేకుంటే మనకు (చిత్రసీమ) ఈ పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. హోదా సాధనకు తెలుగు చిత్రపరిశ్రమ ఏకతాటిపైకి రావాలి’’ అని నిర్మాత నట్టికుమార్ అన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రత్యేక హోదా సాధన ప్రక్రియలో భాగంగా సినీ పరిశ్రమ ఒక్క రోజు బంద్ పాటించి, దీక్షకు కూర్చునేందుకు ముందుకు రావాలి. మన నిరసనలను ఏపీతో పాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లోనూ తెలియజేయవచ్చు. ఓ రోజు షూటింగ్ బంద్ చేయడంతో పాటు ఏపీలో థియేటర్లు కూడా మూసివేయాలి. ఆరుగురు సినీ పెద్దలు సినీరంగాన్ని అంతా కలుపుకుని వెళ్లకుండా కేవలం వారు మాత్రమే అమరావతికి వెళ్లి తమ మద్దతు, సినీరంగం మద్దతు చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడం వెనక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, పవన్కల్యాణ్కు, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలకు మద్దతు తెలపకుండా చంద్రబాబుకి తెలపడంపై అనుమానాలున్నాయి. హోదా కోసం నిరసన తెలిపేందుకు వారంలోగా ఓ తేదీ నిర్ణయించాలి. లేకుంటే సినీరంగంలోని వారిని కలుపుకుని నేనే ఒక రోజు నిరసన చేపడతా’’ అన్నారు. ఆ హక్కు ‘మా’కు లేదు ‘‘చిత్రపరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ అమ్మాయి నిరసన తెలియజేస్తే వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ప్రత్యేక హోదాపై నిరసన తెలిపే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నట్టికుమార్ ప్రశ్నించారు. హోదా అంశం ఆ అమ్మాయి విషయం కంటే చిన్నదా? ఓ అమ్మాయిని ఫిల్మ్నగర్ నుంచి బహిష్కరించే హక్కు ‘మా’కు లేదు. ఇలాంటి నిర్ణయాలు రాచరికపు వ్యవస్థలో ఉండేవి’’ అన్నారు. -
పవన్ను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డిపై వర్మ ట్వీట్
ముంబై: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిన్న(శనివారం) హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట శ్రీరెడ్డి చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్ సెలబ్రిటీ. ముంబైలో పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని జనాలు సైతం శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. ఇటు శ్రీరెడ్డి నిరసనపై మా అసోషియేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని, మా సభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఈ విషయంలో లీగల్ చర్యలకు సైతం వెనుకాడబోమని మా అధ్యక్షుడు శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. తన డిమాండ్ నెరవేరే వరకూ నిరసన విరమించబోనని నటి శ్రీరెడ్డి ఇదివరకే ప్రకటించారు. Sri Reddy has become a national celebrity..People in Mumbai,who don’t even know Pawan Kalyan are talking about Sri Reddy — Ram Gopal Varma (@RGVzoomin) 8 April 2018 -
హోదా ఉద్యమానికి ‘మా’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే వివిధ పద్ధతుల్లో నిరసనలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా సినీ పరిశ్రమ మద్దతు కోరింది. ఆదివారం మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సభ్యులను హోదా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని వారికి వివరించారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం తెలిపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. -
నాటకాలను బతికిద్దాం – రాఘవేంద్రరావు
‘‘మనకు తెలిసి రాజులెందరో ఉంటారు. ఆ రాజుల్లో రారాజు రామానాయుడుగారు. నార్త్ ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంతో ౖÐð భవం తీసుకొచ్చారా యన’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రజతోత్సవ వేడుకల్లో భాగంగా డా. డి. రామానాయుడు 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ‘మా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నాటక రంగం నుంచి సినిమారంగానికి వచ్చిన నటుడు జయప్రకాశ్రెడ్డిని సన్మానించారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మరుగున పడిపోతున్న నాటకాలను బయటకి తీసుకురావాలి. నాటకాలను బతికించి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త కళాకారులు బయటికొస్తారు’’ అన్నారు. ‘‘నా కల్యాణ మండపం కార్ల షెడ్లా అయిపోతోంది. అందులో నాటకాలు వేయించండి’ అని రామానాయుడుగారు చనిపోయే ముందు నాతో అన్నారు. ‘రామానాయుడు కళా సమితి’ ఏర్పాటు చేసి నాటకాలను ప్రోత్సహించ నున్నాం. ఈ సమితిలో సభ్యత్వం తీసుకొని నాటకరంగ అభివృద్ధికి తోడ్పడాలి’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘భారతదేశ చలనచిత్ర రంగానికి రామానాయుడుగారు ఓ మోనార్క్. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ అయిన ఆయన ఓ మహాసముద్రం’’ అన్నారు నటుడు ఆర్. నారాయణ మూర్తి. ‘‘మా నాన్నగారు స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులే కారణం’’ అన్నారు నిర్మాత డి.సురేశ్బాబు. ‘‘నలుగురు సన్మాన గ్రహీతలకు ఒక్కొక్కరికి 11వేల నగదును దర్శకుడు హరీష్శంకర్ అందించారు’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. నటులు కోటా శ్రీనివాసరావు, విద్యాసాగర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్, ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బెనర్జీ, కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ, ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. -
అమెరికాలో మా వేడుకలు
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 28న అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్– తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తగా అమెరికాలో ఈ వేడుక నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మే నెలలో జరిగే ఓ ఈవెంట్కు మహేశ్బాబు వస్తానన్నారు. హీరోయిన్లు కచ్చితంగా ‘మా’లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ‘మా’ ముందుకు వస్తున్నారు. ఒక చేతితో ‘మా’ మెంబర్ షిప్ ఫారమ్, మరో చేతితో ఫిర్యాదు ఫారమ్ తీసుకొస్తున్నారు. ‘మా’ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అన్నారు. ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నరేష్, కార్యవర్గ సభ్యుడు సురేష్, అమెరికా ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైన రాధాకృష్ణ రాజా, స్టీఫెన్ పల్లామ్ (అమెరికా), రాంబాబు కల్లూరి (అమెరికా), నిఖిల్ నాంచారి (అమెరికా), ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
ఐయామ్ విత్ ‘మా’
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ‘మా’ నూతన కార్యవర్గం ప్లాన్ చేసింది. ఈ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘24 ఏళ్ల కిందట చిరంజీవిగారు స్థాపించిన ‘మా’ 25 సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘ఐయామ్ విత్ మా’ నినాదంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు శుభ సూచికంగా ‘ఓల్డేజ్ హోమ్’ ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఓల్డేజ్ హోం, ‘మా’కు సొంత భవనం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ఈ వేదికపై సీనియర్ నటుడు రాళ్లపల్లి, సీనియర్ పాత్రికేయలు గుడిపూడి శ్రీహరి, నటుడు శివ బాలాజీలను ‘మా’ తరఫున సన్మానించారు. -
30 అశ్లీల వెబ్సైట్లు.. దాసరి ప్రదీప్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సినిమా హీరోయిన్లు, ఇతర నటీమణుల ఫొటోలు, వీడియోలకు అసభ్యపదజాలాన్ని జోడించి అశ్లీలతను ఎగజిమ్ముతోన్న దాసరి ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు కేంద్రంగా నాలుగు అశ్లీల వెబ్సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆదివారం హైదరాబాద్కు తరలించారు. నిందితుడిని రేపు(సోమవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. 30 వెబ్సైట్లపై ఫిర్యాదు : ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర రాతలు రాస్తూ, హిట్ల ద్వారా సొమ్ములు చేసుకుంటోన్న వెబ్సైట్లపై సినిమా నటుల సంగం ‘మా’ ప్రభుత్వానికి ఫిర్యాదుచేసింది. ప్రధానంగా తాము గుర్తించిన 30 వెబ్సైట్లు, యూట్యూబ్ చానెళ్లను వెంటనే నిషేధించాల్సిందిగా కోరింది. కేసు నమోదుచేసుకుని రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర క్రైమ్ పోలీసులు.. అందరికంటే ముందు బెంగళూరు కేంద్రంగా సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్ను పట్టుకున్నారు. మిగిలిన వెబ్సైట్ల అడ్మిన్లను కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. -
‘ఆ వెబ్సైట్ల’పై మా ఫిర్యాదు
-
‘ఆ వెబ్సైట్ల’పై 'మా' ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రయివేట్ వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ఎస్పీ రాంమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు వందల వెబ్సైట్లఫై ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని తెలిపారు. సినీ సెలబ్రిటీలే కాకుండా, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ప్రచురించినట్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరిని అశ్లీలంగా చూపెట్టినా నిందితులు శిక్షార్హులని పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ 66 ప్రకారం ఇటువంటి బూతు కథనాలు, అవాస్తవాలు రాయడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు అప్ లోడ్ చేసేవారితో పాటు ఆ వెబ్ సైట్ల నిర్వాహకులఫై కేసులు నమోదు చేసి చర్య తీసుకుంటామన్నామని చెప్పారు. విదేశాల్లో ఉండి వెబ్సైట్లను నిర్వహిస్తున్న వారిని సైతం విడిచిపెట్టేది లేదన్నారు. -
'మా' కార్యవర్గ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీ రాజా ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 'మా' తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 'మా' కార్యవర్గ సభ్యులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. మా కార్యదర్శిగా నరేశ్ కూడా ప్రమాణం చేశారు. -
ఆశలపై నీళ్లు.. హామీలకు కాళ్లు
ముగిసిన నాలుగో విడత జన్మభూమి ప్రచారం ఎక్కువ.. ప్రయోజనం తక్కువ ప్రజలకు సక్రమంగా అందని సంక్షేమ ఫలాలు పలుచోట్ల ఎమ్మెల్యేలను ప్రతిఘటించిన జనం సాక్షిప్రతినిధి, కాకినాడ : అట్టహాసంగా 10 రోజులపాటు నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి బుధవారంతో ముగిసింది. మూడు విడతల్లో జరిగిన జన్మభూమిలో అందని ఫలాలు నాలుగో విడతలో దరిచేరతాయని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు పెట్టుకున్న ఆశలపై సర్కార్ నీళ్లు చల్లింది. ప్రజల నిరసనలు, బహిష్కరణలు, ఆగ్రహ జ్వాలల మధ్య జన్మభూమి సభలు ముగిశాయి. సభల విజయవంతమవ్వాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలు జన్మభూమిలో పంపిణీ చేస్తారని నమ్మించి జన్మభూమి కమిటీల సభ్యులు ప్రతి నియోజకవర్గంలోను గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాన్ని తరలించారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నాలుగో విడత జన్మభూమి ఈ నెల 2న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ రూరల్లో ప్రారంభించగా, సీఎం చంద్రబాబునాయుడు రామచంద్రపురం జన్మభూమి సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలపై జనాగ్రహం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్కార్డులు, అన్ని రకాల పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు జన్మభూమిలో అందజేస్తామని అధికార పార్టీ ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పటి వరకు ముచ్చటగా మూడు విడతలు జన్మభూమి సభలు జరుగగా, గురువారం నాలుగో విడత కూడా అదే పంథాలో మమ అనిపించేశారు. జనం మాత్రం నాలుగో విడతలో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూశారు. జన్మభూమిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పరిష్కరిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఆచరణలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసినా అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్టు అయినా లేదు. చివరకు డిమాండ్లు పరిష్కరించండి అని అడిగినవారి గొంతు నొక్కేందుకు సైతం వెనుకాడలేదు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ‘సాక్షి’పై అక్కసు కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులైతే అత్తమీద కోపం దుత్త మీద చూపిన చందాన జన్మభూమిలో లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో వాస్తవాలకు అద్దం పట్టిన ‘సాక్షి’ దినపత్రికపై అక్కసు వెళ్లగక్కారు. ఇందుకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అ«ధికార పార్టీలో రెండు వర్గాలు ఒక పోస్టు కోసం గొడవ పడిన విషయానికి అక్షర రూపమిచ్చిన సాక్షి పత్రికపై ఎమ్మెల్యే అక్కసు వెళ్లగక్కారు. ప్రజలు తిరగబడతారనే భయంతో పలువురు ఎమ్మెల్యేలు పోలీసు బందోబస్తుతో వెళ్లాల్సి వచ్చింది. ఆ జాబితాలో ప్రత్తిపాడు, అమలాపురం, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, రాజానగరంæ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, అయితాబత్తుల ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్లున్నారు. వీరంతా పోలీసు బందోబస్తు లేకుండా పలు ప్రాంతాల్లో జన్మభూమికి వెళ్లలేకపోయారు. ప్రజల సమస్యలకు సమాధానాలు చెప్పలేక మధ్యలోనే జారుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు జన్మభూమికి ముందు ఊదరగొట్టేశారు. తీరా ఆచరణకు వచ్చేసరికి జన్మభూమి సభల్లో పింఛన్లు పంపిణీ చేసిన దాఖలాలు కన్పించలేదు. కొన్నిచోట్ల టీడీపీ కార్యక్రమంలా జన్మభూమి సభల్లో ప్రజల నుంచి వస్తోన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతాయని ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యేలు ఆ సభలకు వెళ్లకుండా అధికారులను పంపించి మమ అనిపించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి పరిష్కారం కాని సమస్యలపై నిలదీసే సందర్భాల్లో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీల ద్వారా గొడవలు చేయించి అడ్డుతగిలారు. కొత్తపేట, ముమ్మిడివరం తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద వంటి వారు జన్మభూమి సభలకు ఆధ్వర్యం వహించడం ద్వారా జన్మభూమిని పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. -
అమ్మ జయలలితకు 'మా' సంతాపం
అమ్మ జయలలిత నిష్కృమణం .. సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా `మా` అధ్యక్షులు డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ `అమ్మ జయలలిత మహానాయకురాలు .. అంతకుమించి గొప్ప నటి. వృత్తి ఏదైనా ప్రవృత్తిలో వీరోచితంగా పోరాడే ధీశాలి. తమిళనాడులో దిగువ తరగతి ప్రజలకు అమ్మ.. మధ్య తరగతి ప్రజలకు పురచ్చితలైవి. గొప్ప విప్లవనాయకురాలు.. తన జీవితమంతా .. స్కూలు రోజుల నుండి పోరాటమయమే! అయినా అంచెలంచెలుగా ఒక మహాశక్తిగా ఎదిగిన తీరు అందరికి ఇన్స్పిరేషన్. ఈ పయనంలో గెలుపోటముల్ని సమానంగా తీసుకున్న గొప్ప ధీశాలి. మహానటులు ఎంజీఆర్, నటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు. ఏఎన్నార్ వంటి దిగ్గజం సరసన నటించారు. సినీ నాయికగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్నారు. ఆరుసార్లు ఓ మహిళ ముఖ్యమంత్రి అవ్వడం అన్నది ఓ చరిత్ర. అది అమ్మకే చెల్లింది. అందుకే అమ్మ వెళుతున్నారు.. అంటే మనసు తట్టుకోలేకపోయింది. ఈ మరణం తీరని లోటు. అమ్మ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను`` అన్నారు. `మా` ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా మాట్లాడుతూ -``అమ్మ జయలలిత మహిళా శక్తి. పేద, మధ్యతరగతి ప్రజల పెన్నిధి. రాజకీయాల్లో ఓ ప్రభంజనం. అంతకుమించి గొప్ప నటిగానూ వెలిగిపోయారు. మహామహుల సరసన నాయికగా నటించారు. సినీ, రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మైలురాళ్లు అధిగమించారు. మనసున్న గొప్ప నాయకురాలిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. తెలుగు, తమిళ సినీరంగంతో గొప్ప అనుబంధం ఉన్న అమ్మ నేడు లేరు అన్నది జీర్ణించుకోలేనిది. సినీ,రాజకీయ రంగాలకు ఇది తీరనిలోటు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను`` అన్నారు. -
గాడి తఫ్పిన "జన్మభూమి -మా ఊరు"!!
-
‘మా’ అభివృద్ధికి కృషి: జయసుధ
పిఠాపురం (తూర్పుగోదావరి): మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను ఎప్పుడూ కృషి చేస్తానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. ఆమె శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలో ప్రఖ్యాతి గాంచిన జాంధానీ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. నటీనటులందరూ సహకరించినా టెక్నీషియన్లు కొందరు సహకరించకపోవడం వల్ల తాను ఓటమి పాలయ్యామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయినప్పటి కీ ‘మా’ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానన్నారు. ఉప్పాడ జాంధానీ చీరలు చాలా అందంగా ఉన్నాయని, మంచి నాణ్యతతో ఉండడం వల్లే వీటికి ఇంత పేరు వచ్చిందని అన్నారు. -
రేపు 'మా' ఓట్ల లెక్కింపు
-
మా ఎన్నికలపై తీర్పు ఎల్లుండికి వాయిదా
-
మా ఎన్నికలపై తీర్పు ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్: మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలకు సంబంధించి సిటీ సివిల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారం ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మా అధ్యక్ష ఎన్నికలు ఈనెల 29న జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. మాఎన్నికలు ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టులో నటుడు, నిర్మాత ఓ. కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే.. తదుపరి తీర్పు వచ్చేవరకు కౌంటింగ్ నిర్వహించవొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో తీర్పు వచ్చే వరకూ మా ఎన్నికల ఫలితాలుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ
-
జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ
హైదరాబాద్: హైకోర్టులో సోమవారం పలు పిటిషన్లపై కీలక విచారణ జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోపక్క, శేషాచలం కొండల్లో ఎర్రచందనం కూలీలపై కూడా కోర్టు విచారిస్తుండగా.. గత ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ దీనిపై హైకోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇక, టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్స్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారంపై సిటీ సివిల్ కోర్టులో విచారణ కూడా సోమవారమే జరగనుంది. దీనిపై తీర్పు కూడా వెల్లడించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడంలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలని గతంలో హైకోర్టు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. -
'మా' ఎన్నికల కేసు విచారణ 13కి వాయిదా
హైదరాబాద్ : సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న 'మా' ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్స్ టాలీవుడ్ లో కొనసాగుతోంది. -
'మా' ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 9కి వాయిదా
హైదరాబాద్: మా ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటులు మురళీమోహన్, అలీలు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. 'మా' ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు గత నెల 31న కోర్టుకు సమర్పించారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగిన విషయం విదితమే. మా అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టుకు చేరింది. దాంతో అధ్యక్ష ఎన్నికలు ఫలితాలపై ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తు సిటీ కోర్టు మార్చి 31న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘మా’లో విభేదాలు లేవు
మాచవరం (రాయవరం) : సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిరావాలన్నది తన కోరిక అని సినీ నటి హేమ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాలో స్టూడియో నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నానని ఆమె తెలిపారు. శుక్రవారం రాయవరం మండలం మాచవరంలోని ద్వారంపూడి చౌదరారెడ్డి ఇంటికి వచ్చిన హేమ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. స్థల సేకరణ పనిలో.. రాజమండ్రి- రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణానికి అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నాను. జిల్లాలో సినిమా షూటింగ్స్కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సినీపరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలంటే స్థానికులు సినీపరిశ్రమలోని వ్యక్తుల విషయంలో మరింత గౌరవప్రదంగా ప్రవర్తించాలి. సినిమా పరిశ్రమ అభివృద్ధితో చాలామందికి ఉపాధి దొరుకుతుంది. 25 సంవత్సరాలు పూర్తయింది.. సినీ రంగంలో ప్రవేశించి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఏడో తరగతి చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. భలేదొంగలు సినిమాలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను. 465 చిత్రాల్లో నటించా.. ఇంతవరకూ 465 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం పది సినిమాలతో బిజీగా ఉన్నాను. శ్రీను దర్శకత్వంలో రాజోలులో చిత్రీకరణ జరుగుతున్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాను. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాలో కామెడీ పాత్రలో, కరెంట్ చిత్ర దర్శకుడు ప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో సెంటిమెంట్ టచ్ ఉన్న ‘అమ్మ’ పాత్రలోనూ నటిస్తున్నాను. పోలీసాఫీసర్గా నటించాలని ఉంది నాకు చిన్నప్పటి నుంచి పోలీసాఫీసర్ అవ్వాలని ఉండేది. చదువు ఆపేసి మధ్యలో నటనలోకి వచ్చేశాను. కనీసం పోలీసాఫీసర్ పాత్రలో నటించి ఆ ముచ్చట తీర్చుకోవాలని ఉంది. ఏడాది క్రితం వరకు హాస్య పాత్రల్లోనే నటించాను. ఆ తర్వాత విభిన్న తరహా అవకాశాలు వస్తున్నాయి. అతడు, అష్టాచమ్మా, మల్లీశ్వరి, నువ్వునాకునచ్చావ్ చిత్రాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ‘మా’లో విభేదాలు లేవు ‘మా’ ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం నెలకొన్న విషయం వాస్తవమే. కానీ అది ఎన్నికల వరకే. ఇతర విషయాల్లో అందరం ఒకటిగానే ఉంటున్నాం. -
మా' కేసు విచారణ ఏప్రిల్ 7కి వాయిదా