marriages
-
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్స్ట్రక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్లో షూట్స్ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..!
"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్ సెట్ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు. ఎందుకిలా అంటే..పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్ స్థితి చూస్తే బాగుండు. కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. Salary expectations of groom during wedding matches is insane … <1L / month are not even being considered if person is in IT Mindset of parents requires RESET. How can 28 year old earn 1-2L, have own car and a house ??Your generation had all these for retirement#Life— Vineeth K (@DealsDhamaka) January 6, 2025 (చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!) -
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
వివాహాల గూఢచారి...భావనా పాలివాల్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.నమ్మకం కోసం:‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.పెళ్లికి ముందు జాగ్రత్త‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే. ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్గా మారానని అంటోంది.ఆధునిక పరికరాలుప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.పెళ్లికి సిద్ధమయ్యి...అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్మెంట్, సహనం, అడ్జస్ట్మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది. -
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
వివాహ సంప్రదాయంలో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. మాంగల్య ధారణ తర్వాత జరిగే తంతు ఇది. తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటుంది. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.మొదట తలంబ్రాలను కొబ్బరి చిప్పలో పోసి, రాలతో ్రపోక్షించి వధూవరులకు అందిస్తూ దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, తారలు, చంద్రుని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.మొదటగా వరుడు వధువు శిరస్సున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన మృద్ధి జరుగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పిడిపంటలు వృద్ధియగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగునుగాక‘ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళతో పోసుకుంటారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంధి అంటారు. -
ఏటా జరిగే వివాహాలు 2.5 లక్షలు..
సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం. ఏ డాక్యుమెంట్లు కావాలంటే...! వివాహ రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్రిజి్రస్టార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజి్రస్టేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి. -
ఛేజ్ చేసి పట్టుకుంటే.. చాల్లే ఊరుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024కు అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ ప్యానల్ స్పీకర్గా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) క్యాడర్కు రావడానికి ముందు ఆయన కొన్నాళ్లు మణిపూర్లో పని చేశారు. వివాహాలకు సంబంధించి అక్కడ, భద్రత కోణంలో న్యూయార్క్లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. అక్కడ ఎస్పీ కూడా అలానే వివాహం చేసుకున్నారట...నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లో ట్రైనీ ఏఎస్పీ హోదాలో మణిపూర్లోని ఓ పోలీసుస్టేషన్కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పని చేశా. ఓ రోజు ఠాణాలో ఉండగా నలుగురు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్లు వెళ్లిన వాహనం నెంబర్ కూడా చెప్పారు. వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి రంగంలోకి దిగా. నాలుగు కిలోమీటర్లు ఛేజ్ చేసి కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకుని యువతిని రెస్క్యూ చేశాం. వాళ్లను ఠాణాకు తీసుకువచి్చన తర్వాత మా ఎస్పీకి ఫోన్ చేసి పెద్ద ఆపరేషన్ చేశానని చెప్పాం.దీనికి ఆయన ఫక్కున నవ్వుతూ తానూ అలాంటి గాంధర్వ వివాహమే చేసుకున్నానని అన్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు, కేసు ఎందుకని ప్రశ్నించా. ‘‘అది అక్కడ ప్రొసీజర్ అని, కేసు పెట్టి ఇరుపక్షాలను ఠాణాకు పిలవాల్సిందేనని’’అన్నారు. ‘‘ఆపై యువతీయువకులు తమ సర్టిఫికెెట్లు చూపించి మేజర్లుగా నిరూపించుకుంటారు. వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తే మూడునాలుగు రోజులకు మరోసారి ఘనంగా వివాహం చేస్తారు ’’అని ఎస్పీ చెప్పడంతో నాకు ఆశ్చర్యమేసింది. అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగితే అనుమానించారు...అమెరికాలో వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 2001లో జరిగిన 9/11 ఎటాక్స్ తర్వాత ఇది చాలా పెరిగింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిజం శిక్షణ కోసం ఓ పోలీసు బృందాన్ని అమెరికా పంపింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నా. అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువగా ఉండటంతో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేవాళ్లం. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగా. విక్రయించనంటూ నిర్మొహమాటంగా చెప్పేసిన దాని యజమాని బయటకు వచ్చి నేను వినియోగించిన వాహనం నెంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి ఓ దుకాణానికి వెళ్లి అడిగితే.. వారి వద్ద లేకపోయినా పది నిమిషాలు కూర్చోమంటూ ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి ఇస్తామంటారు. ఈ ధోరణి మారి వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి పెరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయడమే సవాల్... ఇక్కడ నివసిస్తున్న ప్రజలను నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడేలా మోటివేట్ చేయడమే పెద్ద సవాల్. నగరంలో ఉన్న హుస్సేన్సాగర్లో సరాసరిన రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించడానికి పోలీసు విభాగం తరఫున సుశిక్షితులైన సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఆ ఉదంతం జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు మాత్రం స్పందించరు. తొలి ప్రాధాన్యం వీడియో చిత్రీకరించడానికే ఇస్తారు. తాము ఫస్ట్ సేవర్ కావాలని ఆశించడం కన్నా సోషల్మీడియాలో పెట్టడానికి ఫస్ట్ రికార్డర్ కావాలని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రజలను మోటివేట్ చేయడమే ప్రస్తుతం సమాజంలో ఉన్న పెద్ద సవాల్. -
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్లో పోస్ట్ చేసిన వివరాలు.సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు. -
Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
దెయ్యాల వివాహ సంప్రదాయం గురించి విన్నారా!. ఏంటిదీ ఈ రోజుల్లోనా అనుకోకుండా కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా ఆ వివాహతంతు గురించి మ్యాట్రిమోనియల్ సైటల్లోనే ప్రకటన ఇచ్చింది ఓ కుటుంబం. అది విని అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ ప్రకటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడు 2022లో ఈ ట్వీట్ గురించి ఎక్స్లో రాసుకొచ్చాడు. తాను అలాంటి వివాహానికి హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది మీకు పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? ఇలాంటి సంప్రదాయల్ని పాటిస్తున్నారా అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఇది షేర్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి సంప్రదాయాలు భారత్లో ఎక్కువగా కేరళ, కర్ణాటకలో నిర్వహిస్తుంటారు. అలానే ఓ కేరళ కుటుంబం ఏకంగా 30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు తగిన వరుడు కావాలంటూ ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత చనిపోయిన వరుడు కుటుంబం ఆచూకి లభించగానే..చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వధువరులిద్దరికి వివాహతంతు జరిపి ఇరుకుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. ముఖ్యంగా ఇలా కడుపులో శిశువుతో చనిపోయిన మహిళకి, యుక్త వయసు రాకుండానే చనిపోయిన పిల్లలకు ఇలాంటి తంతు జరిపిస్తారట. ఇలా చేస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో వృద్ధిలో ఉంటుందనేది పెద్దల నమ్మకం. వాళ్ల దృష్టిలో పిల్లల తమను విడిచిపెట్టిపోలేదని ఆత్మల రూపంలో తమ వెంటే ఉన్నారని భావించి ఇలా చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ దీన్ని పాటించడం విశేషం.(చదవండి: రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా) -
17మందికి ఒకేసారి పెళ్లి..ఒకే శుభలేఖ.. హాట్ టాపిక్గా తాతగారు
ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెద్దాయన పేరు రాజస్థాన్లోని నోఖా మండలం లాల్మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే. అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. -
చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు!
భారతదేశంలో అనే వివాహ ఆచారాలు,సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకునే రిజిస్టర్ పెళ్లిళ్లు, వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అనేది ప్రధానంగా చూస్తాం. అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను అత్తారింటికి పంపించే సన్నివేశం ఆమె కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు అక్కడనుంచి వారందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా గుజరాత్లోని ఒక వివాహ ఆచారం కూడా ఇదే కోవలో నిలిచింది. గుజరాత్లోని కచ్ పటేల్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం కుమార్తె వివాహ సమయంలో,కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కుతారట. ఆమె పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించమని అందరూ అడుగుతారట. అలా ఆమె పాదాలను తాకి మన్నించమని వేడుకొని ఆమె పట్ల సంస్కారాన్ని గౌరవాన్ని చాటుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్లో షేర్ అవుతోంది. రాము జీఎస్వీ ట్విటర్ హ్యాండిల్లో ఇది షేర్ అయింది. WILL BRING YOU TEARS: This is the custom of the Kutch Patel community of Gujarat. At the time of marriage, all the members of the family touch the feet of the DAUGHTER and ask for forgiveness if there was any mistake in behaving towards her. What a culture & respect to the Girl. pic.twitter.com/Klp4ocxgMr — Ramu GSV (Modi Family) (@gsv_ramu) March 12, 2024 -
పండంటి కాపురానికి ఏడడుగులు!
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం? వారి అతిపెద్ద భయం ఏమిటి? భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి? వారు దేనికి ఒత్తిడి చెందుతారు? వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. కలసి గడపడానికి ప్లాన్ చేయలి ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి భాగస్వామిని అభినందించాలి అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి 3. కలసి మెలసి నడవండి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 4. భాగస్వామి మాటకు విలువనివ్వండి దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి ఒకరి తప్పులను ఒకరు సహించాలి 6. పీటముడిని అధిగమించండి నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి · చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..) -
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో?
పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి.. పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది.. అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .... అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి.. మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక. -గాంధీ, విజయనగరం -
వెడ్ ఇన్ ఇండియా: 'ప్లీజ్ ఇక్కడే పెళ్లి చేసుకోండి'!
భారతదేశంలో ప్రజలు పెళ్లిళ్లకు ఎంతెంత రేంజ్లో డబ్బుల ఖర్చు పెడతారో తెలిసిందే. నిజం చెప్పాలంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే భారత్లో అదొక వ్యాపారంలా సాగుతుంది. అయితే ఇటీవల ఆ పెళ్లిళ్లలో ట్రెండ్ మారుతోంది కూడా. ఏకంగా కోట్లు ఖర్చే చేసి మరీ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ఓ స్టేస్ సింబల్లా మారిపోయింది. ఇక రానురాను ఆ ట్రెండ్ ఓ రేంజ్లో కొనసాగేలా ఉంది. అయితే మన ప్రధాన మోదీ మాత్రం "ప్లీజ్ మన మాతృభూమిలోనే పెళ్లి చేసుకోండి" అని పిలుపునిస్తున్నారు. ఎందుకని ఆయన ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు? కారణమేంటీ..? నిజానికి భారతీయుల్లో పెళ్లిళ్ల కోసం విదేశీయులకు వెళ్లే వాళ్లు కేవలం అత్యధిక ధనవంతులే. సాధారణ మానవుడు పెళ్లి చేసుకుంటే చాలనుకుంటాడు. అంత రేంజ్లకు వెళ్లడు. మన దేశంలో బడా బాబులకు కొదవలేదు కూడా. అయితే ఇంతకుమునుపు శ్రీమంతులు విభిన్నంగా కళ్లు చెదిరే ఆర్భాటాలతో చేసుకునేవారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారంటా! అని కథలుగా చెపుకునేవారు. కానీ ఈ 20 ఏళ్లలో పరిస్థితుల చాలా మారిపోయాయి. అంతెందుకు పెళ్లిళ్ల సీజన్కి రాజకీయనాయకుల సైతం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంతలా అంటే? ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 23న ఖరారు చేయగా ఆ టైంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయని ఏకంగా తేదీనే మార్చారు. వెడ్డింగ్ అతిపెద్ద వ్యాపార ఇండస్ట్రీ.. పెళ్లిళ్ల టైంలో కళ్యాణ మండపాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వాటి ధరలు హడలెత్తించేలా ఉంటాయి. ఆఖరికి పూల దగ్గర నుంచి నగలు, బట్టలు అన్నింటికి మంచి గిరాకీ టైం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ ధర చెప్పినా ప్రజలు కూడా లెక్కచేయకుండా కొనే సమయం కావడంతో వ్యాపారులు కూడా ఈ సీజన్ని భలే క్యాష్ చేసుకుంటారు. ఈ దృష్ణ్యా చూస్తే పెళ్లిళ్లు ఓ పెద్ద మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ పెళ్లి పేరుతో అన్ని రకాల వృత్తుల వారికి చేతినిండా పని, ఆదాయానికి ఆదాయం. పెళ్లిళ్ల కార్యక్రమాలను నిర్వహించే ఈవెంట్ మేనజర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. గతేడాది 2023లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగాయని, దాదాపు 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) స్వయంగా పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఎందుకింత ఆధరణ.. అందుకు ప్రధాన కారణం..జీవితంలో ఒక్కసారే చేసుకునేది కావడం, గుర్తుండిపోయేలా గ్రాండ్గా చేసుకోవాలన్న కోరికలే ఇంతలా ఖర్చు చేసేలా చేస్తోంది. దీంతోపాటు అరచేతిలోనే ప్రపంచంలా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఈ మేరకు ప్రముఖ మ్యారేజ్ ప్లానర్ అగ్నిశక్తి మాట్లాడుతూ..తాము సుమారు 8లక్షలు నుంచి 3 కోట్ల బడ్జెట్ వరకు వివాహాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాన భాగం వేదికపైనే ఖర్చు అవుతుందని, మిగిలిన బడ్జెట్ని ఆహారం, పానీయాలు, డెకరేషన్ సెటప్, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకు ఖర్చే చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా వధువు, వరుడు కుటుంబాలకు ప్రత్యేక డిజైనర్లను పెట్టుకుని మరీ బట్టలను కొనుగోలు చేయడం ఓ ట్రెండ్గా మారిందని అన్నారు. సెలబ్రెటీలైతే ఈ విషయంలో ఏకంగా సినిమాలో పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది ఈ లగ్జరీ పెళ్లిళ్లను తమ స్టేటస్కి కేరాఫ్ అడ్రస్గా భావించడం కూడా కొంత కారణం. ఈ నేపథ్యంలోనే బహుశా డిస్టినేపన్ వెడ్డింగ్లకు బాగా ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగో లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి అదేదో అందరూ గుర్తు పెట్టుకునేలా విదేశాల్లో చేసుకుంటే..ఎంజాయ్మెంట్కి ఎంజాయ్, అందరూ గొప్పగా కూడా చెప్పకునేలా ఉంటుందన్న ధోరణి ప్రజల్లో బాగా పెరిగిందని మరో వెడ్డింగ్ ప్లానర్ సక్షమ్ శర్మ చెబుత్నునారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు అయ్యే ఖర్చు.. ఇది వారు వెళ్లే ప్రదేశం, వచ్చే అతిథుల బట్టి ఖర్చు ఉంటుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లకు బడ్జెట సుమారు 80 నుంచి 90 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. అదే థాయిలాండ్, బాలి అయితే ఏకంగా కోట్లలోనే బడ్జెట్ మొదలవుతుందని తెలిపారు. ఇంతలా లగ్జరీయస్గా పెళ్లి చేసుకోవాడానికి కొన్ని హోటళ్లు క్రెడిట్ లోన్లు కూడా ఇస్తాయట. మోదీ వద్దు అనడానికి రీజన్.. నవంబర్లో మన్కి బాత్ రేడియో ప్రసంగంలో ప్రధాన మోదీ విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో ఖర్చే చేసేటప్పుడూ..మన భారత్లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాదు మేక్ ఇన్ ఇండియా మాదిరిగా వెడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని అన్నారు. అంతగా కావాలనుకుంటే ఉత్తరాఖండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు జరుపుకోమని అన్నారు. మోదీ ఇలా అనడానకి ప్రధాన కారణం భారతదేశం డబ్బు విదేశాలకు తరలిపోవడం ఇష్టం లేక ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా భారతీయ ఆర్థికవ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు ఉపకరించే చొరవ. ఇది చాలామంచి ప్రయత్నమే కానీ భారతీయులను ఇక్కడే పెళ్లిళ్లు చేసుకునేలా మంచి వెడ్డింగ్ సెట్టింగ్ మైదానాలతో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వెడ్డింగ్ టైంలో భారీ డిమాండ్ పలికే ఫంగ్షన్ హాల్స్ చార్జీల్లో కూడా మార్పులు వస్తే ఇదంతా సాధ్యమని అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు. దీంతో ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గడ్డలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. అలాగే తమ పెళ్లి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకునే వాళ్లకు.. మన భారత్లో ఉన్న గోవా, రాజస్థాన్, హిమచల్ప్రదేశ్, అండమాన్ తదితర ప్రసిద్ద ప్రదేశాలను హైలెట్ చూస్తూ.. అక్కడి ఫంక్షన్ హాల్లో భారీ మార్పులు తీసుకొచ్చేలా తీర్చిదిద్ధడమే గాక అందుబాటు ధరలో ఉండేలా చేస్తే ప్రధాని మోదీ చెబుత్ను నినాదం సాకారం అవుతుందన్ని అంటున్నారు మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్లు. ఈ నినాదానికి మద్దతు పలుకుతూ ప్రముఖ సెలబ్రెటీ రియా కపూర్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా. భారతదేశం వివిధ ఐకానిక్ ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ చొరవ నిజంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు మంచి బూస్టప్. (చదవండి: ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!అతనేమి ఐఐఎం, ఐఐటీ.. !) -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్తో పాటు యాంకరింగ్లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్లోనూ నటించాడు. కేఎల్ రాహుల్ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్శెట్టి ఫాంహౌస్లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
LGBTQ కమ్యూనిటీకి కలిసి జీవించే హక్కు ఉంది : సుప్రీం
-
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
పూర్వీకుల ఆస్తిలో వాళ్లకు కూడా హక్కు ఉంది : సుప్రీంకోర్టు
పెళ్లికి ముందు లేక వివాహేతర సంబంధంలో జన్మించిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉందా? అనే అంశంపై దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటుకాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల్లో జన్మించిన పిల్లలు కూడా చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉమ్మడి కుటుంబంలో((Hindu Joint Family) తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలకు కూడా హక్కు ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాంటి సంబంధంలో జన్మించిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుగా చూడాలని, ఆ బిడ్డ అన్యం పుణ్యం ఎరుగనదని తెలిపింది. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు ఇతర పిల్లల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. రేవణ సిద్దప్ప వర్సెస్ మల్లికార్జున్ (2011) కేసులో ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఐతే అప్పటి జస్టిస్ (రిటైర్డ్) జిఎస్ సింఘ్వి, ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం సెక్షన్ 16(3)లోని సవరణ ప్రధానాంశాన్ని ప్రస్తావిస్తూ.. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, వారికి చెల్లుబాటయ్యే వివాహంలో జన్మించిన పిల్లల మాదిరి హక్కులు ఉంటాయని అప్పట్లో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. అయితే పూర్వికుల ఆస్తిలో వాటా ఉండదని అభియప్రాయపడింది. ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉండిపోయింది. దీనిపై ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి గతంలో బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించింది. ఆయా వివాహేతర సంబంధంలో పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించింది. అలాగే తల్లిదండ్రులకు వారి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో కూడా ఈ పిల్లలకు వాటా పొందే హక్కు ఉందని పేర్కొంది. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
కాసింత కపటం
‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు. వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే! అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం! ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు. గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు. మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు. మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు. ‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు. గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు. దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా? -
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదు అని ఎందుకు అంటారు?
శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు. ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. ఎప్పటివరకు శ్రావణమాసం? సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం ముట్టరు.. కారణాలు అవేనా? ► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి. ► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. ► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్వెజ్కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం. -
పెళ్లి సందడికి వేళాయె!
శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14 వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు. ఏప్రిల్లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది. రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైంది గనుక డిమాండ్ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
పాక్లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
గిన్నిస్ పెళ్లిళ్లు
జైపూర్: రాజస్తాన్ పెళ్లిళ్లలో రికార్డు సాధించింది. కేవలం 12 గంటల్లో 2 వేలకు పైగా జంటలకు ముడిపెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. బారన్లో ఈ సామూహిక వివాహ కార్యక్రమం మే 26న జరిగినట్టుగా గిన్నిస్ వరల్డ్ బుక్ అధికారులు వెల్లడించారు. శ్రీ మహవీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో హిందువులు, ముస్లిం జంటలు కూడా ఒక్కటయ్యారు. 2013లో 24 గంటల్లో 963 పెళ్లిళ్లు జరిపి యెమన్ పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొడుతూ కేవలం 12 గంటల్లోనే 2,413 మంది జంటలకి వివాహం జరిపించారు. అప్పటికప్పుడు ఈ పెళ్లిళ్లను అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించారు. -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వివాహ వేడుకలు
-
నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే!
అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట! లేదంటే.. రోజూ ఒక తంటా! మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. ఈ మూడు అంశాల వల్లే.. వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం. ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వయసు మీరుతున్నా... ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్వీడన్ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల్లో హెచ్చు తగ్గులు ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్ కింగ్డమ్లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం. అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి. కారణాలివే.. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అంతే.. ఒక్కసారి కమిట్ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు. పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్పెంట్ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం). అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్’ ఆఫ్ అఫెక్షన్ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు. అల్యూటియాన్ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు! కెనడాకు పశ్చిమంగా... జపాన్కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 99 ఏళ్ల వయసులో విడాకులు! 99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
కీలక నిర్ణయం.. ఇకపై ఖరీదైన పెళ్లిళ్లు, వేడుకలు వద్దు!
జైపూర్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడిచి జీవితాంతం ఒక్కటిగా ఉండాలని తెలిపే వేడుక వివాహం. అందుకే యువత వివాహం అనగానే, ఫోటో షూట్, సంగీత్, అంటూ బోలెడు ప్లాన్లు చేసుకుంటారు. దీని కోసం వాళ్లు ఎంతటి ఖర్చైన చేయడానికి వెనుకాడరు. ఇంకొందరైతే తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా జరుపుకుంటారు. వివాహం అనంతరం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో భిల్వారా జిల్లాకు చెందిన జాట్ కమ్యూనిటీ పెళ్లి వేడుకల నిర్వహణపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం.. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు. అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహాతులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది. -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా బ్యాచ్.. కన్యాశుల్కం
ఇది సీరియస్ విషయమో... సరదా అంశమో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా సరదాగా మొదలుపెడదాం. నిజానికి చైనా బ్యాచ్లర్స్ గురించి మాట్లాడుకోవాలి.. ఇండియాలోని బ్యాచ్లర్ తన యాంగిల్లో చెబుతున్న ‘భోజరాజు కథ’ ముందుగా విందాం. ఇందులో కాస్త కడుపుమంట కనిపిస్తుంది. భోజరాజీయం కథ ఇదీ.. ఓ పేద బ్రాహ్మణుడు. చదువు సంధ్యాలేదు. ఇల్లూవాకిలీ లేవు. ఏమీ లేని వారికి పిల్లనెవరిస్తారు. అందుకే సత్రాల్లో కాలక్షేపం చేస్తూ, ఊరూరూ తిరుగుతూ కాశీ చేరాడు. అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు మోదీ పీఎం అయ్యాక బాగా డెవలప్ చేసినట్టున్నారు కానీ, అప్పుడంత సీన్ లేనట్లుంది. భోజనానికి ఢోకాలేకుండా కొంతకాలం నడుస్తోంది. విభూది పూసుకుని శివావతారంలో దేశ సంచారం చేసే బృందమొకటి కనిపించింది. వారితోపాటు కలిసి తిరుగుతూ, వారు ప్రయాగ యాత్రకు వెళుతుంటే వారితో పాటు ప్రయాగకు చేరాడు. ఏమీ పాలుపోక, చేసేదేమీ లేక అక్కడ పుష్కరిణి నది వద్ద కూచున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు అమ్మాయిలు వచ్చారు. చాలా అందగత్తెలు. నలుగురు మాట్లాడుకుంటూ నదిలోకి దూకారు. ఇదంతా మనవాడు గమనిస్తున్నాడు. ఒకమ్మాయి.. నాకు నవ మన్మథాకారుడు, చక్రవర్తి భర్తగా కావాలి..అని చెప్పుకుంటూ దూకింది. మరొకామె.. నాకు కండల వీరుడు కావాలి.. అన్నది. ఇంకొకామె.. నాకు కవీశ్వరుడు భర్తగా రావాలి అని కోరుకున్నది. చివరి అమ్మాయి.. వచ్చే జన్మలో నాకు సంగీత లలిత కళా వల్లభుడు భర్తగా కావాలి అనుకుంటూ దూకేసింది. ‘ఈ జన్మలో ఇలాంటివి సాధ్యం కాదు..వచ్చే జన్మలోనైనా సాధ్యపడేలా చెయ్యి దేవుడా..’ అంటూ ప్రార్థిస్తూ, ఇలా అయితే వచ్చే జన్మలో తప్పక సిద్ధిస్తుంది అనుకుంటూ ఆనందంగా దూకేశారు. ఇదంతా వింటున్న మన హీరో బుర్ర పాదరసంలా పని చేసింది. వచ్చే జన్మలో ఆ నలుగురు నాకు భార్యలు కావాలి అంటూ తానూ దూకేశాడు. ఆ తర్వాత జన్మలో మనవాడు భోజరాజుగా జన్మించాడు. వారందరూ అన్ని లక్షణాలు, ఐశ్వర్యం, రాజ్యం ఉన్న భోజరాజుకు భార్యలయ్యారు ఇదీ కథ. కడుపు మంట ఇదీ.. ‘...ఇప్పుడు యూత్ అంతా భోజరాజులయితే కానీ పెళ్లి అయ్యేట్లు లేదు. కనీసం ఆ కాలంలో ఒక్కొక్క వరుడిలో ఒక్కో క్వాలిటీ అడిగారు. కానీ, ఈ తరం అమ్మాయిలు అన్ని లక్షణాలూ ఒక్కడిలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందగాళ్లు, ఎన్ఆర్ఐ సంబంధాలు, హై ఎడ్యుకేషన్లు, లక్షల్లో ప్యాకేజీలు, కార్లు, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు.. ఒక్కటేమిటి అన్నీ..’ ‘..ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు వచ్చాయి.. ఎన్నో సంబంధాలు పోయాయి.. నెత్తి మీద అరెకరం మిగిలింది.. క్యాంపస్ సెలెక్షన్లు, సంపన్న సంబంధాలు పోను మా లాంటి థర్టీ ప్లస్ గాళ్లం ‘లెఫ్ట్ ఓవర్’లాగా మిగిలిపోయాం,. ఏ మ్యాట్రిమోనీకి పోయినా.. ఎంత ఏజీ, ఎంత ప్యాకేజీ, వెనుక ఎంత బ్యాగేజీ అని అడుగుతున్నారు. ఇక ఈ జీవితానికి ఇంతే..’ – సోషల్ మీడియాలో ఓ బ్యాచ్లర్ సోదరుడి బాధ. మరి చైనా కథేంటీ అంటారా... ఇండియాలోని పెళ్లికాని ప్రసాదులకే ఇన్ని బాధలుంటే మనకు మించిన జనాభా ఉన్న.. చైనాలో బ్యాచ్లర్స్ బాధ ఇంత కన్నా ఎక్కువ. అక్కడో వరుడు అచ్చంగా కోటి రూపాయలకు పైగా వధువుకు ‘కన్యాశుల్కం’ సమర్పించుకున్నాడు. కన్యాశుల్కం అంటే తెల్సుగా.. మన దగ్గర వరకట్నానికి రివర్స్. అక్కడ కన్యాశుల్కం బాగా పెరుగుతోంది. మార్కెట్లో లక్షలు పలుకుతోందట! కరోనా వైరస్లాగా చైనా నుంచి కన్యాశుల్కం మనదేశానికి పాకుతుందేమోనని మన యూత్, పెళ్లి కాని ప్రసాద్ల బ్యాచ్.. చైనా బ్యాచ్ను చూసి బెంబేలెత్తుతున్నారని సోషల్ మీడియా భోగట్టా. చైనా బ్యాచ్.. ‘కన్యాశుల్కం’ చైనాలో చాలా కాలంగా కన్యాశుల్కం ఆచారం ఉంది. కానీ అది నామ్కేవాస్తే లాగా ఉండేది. కమ్యూనిస్టు పాలనలో కూడా అది విజృంభిస్తూనే ఉంది. ఈ కన్యాశుల్కం 60–70వ దశకంలో మంచాలు, పరుపులు లాంటి చిన్న గిఫ్టుల నుంచి, 80వ దశకంలో టీవీలు, ఫ్రిజ్ల దాకా చేరింది, 1990లలో అక్కడ ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక, కన్సూమరిజం పెరగడం, ఆర్థిక అంతరాలు పెరగడంతోపాటు లైంగిక వివక్ష పెరగడంతో కన్యాశుల్కం రాకెట్ వేగం అందుకుంది. కార్లు, రియల్ ఎస్టేట్ దాకా పోయింది. ఇప్పుడు పురుషులు వధువుకు, వధువు కుటుంబానికి కానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తోందట. కార్లు లాంటి వాహన రూపంలో, ఆస్తుల రూపంలో సమర్పించుకుంటున్నారు. దీన్నే ‘బ్రైడ్ ప్రైస్’ అంటున్నారు. ఈ సంప్రదాయం ఎక్కువగా చైనా గ్రామీణ ప్రాంతంలో కనిపించేది. ఇప్పుడు సిటీలకు కూడా బాగా పాకుతోంది. ఇటీవల ఓ వధువు కుటుంబం కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేయడం, అది మీడియాలో బాగా చర్చ కావడంతో అందరి దృష్టి చైనా బ్యాచ్లర్ల కష్టాలపై పడింది. చివరికి చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా దీనిపై దృష్టి పెట్టడం దీని సీరియస్నెస్కు అద్దం పడుతోంది. చైనా ‘వన్’ వే.. చైనా ఏది చేసినా కరోనా స్థాయిలోనే చేస్తుంది. జనాభా పెరిగిపోతోందన్న ఆందోళనతో దశాబ్దాల పాటు ఒకే బిడ్డను కనాలన్న ‘వన్ చైల్డ్’ పద్ధతిని చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసింది. ఇండియాలో లాగానే.. మగబిడ్డ కావాలనే సెంటిమెంట్ చైనా సమాజంలో కూడా ఉంది. దానితో వారు కనే ఒక్క బిడ్డను మగబిడ్డను కనడానికే ఆసక్తి చూపారు. ఇది తీవ్ర లింగ వివక్షకు దారితీసి లింగ నిష్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. మగబిడ్డ కావాలనే ఆకాంక్ష వల్ల అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017లో చేసిన ఒక సర్వేలో 100 మంది పెళ్లికాని పురుషులకు 66 మంది పెళ్లి కానీ స్త్రీలే ఉన్నట్లు తేలింది. చైనాలో 1986 నుంచి ప్రతి మ్యారేజ్ను రిజిస్టర్ చేయాలన్న రూల్ తెచ్చారు. ఈ లెక్కల ప్రకారం 2021లో 76 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన వచ్చాక అతి తక్కువ పెళ్లిళ్లు అయిన ఏడాది ఇదే. యువత లేట్గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఏజ్ పెరిగింది. ఒంటరిగా ఉండిపోతున్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. తద్వారా కన్యాశుల్కం పెరుగుతోంది. అక్కడ అన్నీ ఆర్థిక హంగులున్న భోజరాజులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడా వస్తుందేమోనని చైనా బ్యాచ్ను చూసి మన ఇండియా బ్యాచ్ బ్యాచ్లర్ల భయం. ఎంకరేజ్ ‘వ్యాక్సిన్’.. పైన చెప్పిన కారణాలు, వన్చైల్డ్ సిస్టమ్తో జనాభా తగ్గిపోవడంతో వన్చైల్డ్ పద్ధతికి చైనా స్వస్తి పలికింది. అయినా 2022లో చైనా జనాభా తగ్గింది. ప్రపంచానికి భిన్న పోకడ ఇది. ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందేమోనన్న కంగారు పడుతున్న చైనా సర్కారు ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని ఎంకరేజ్ చేస్తోంది. మ్యారేజ్ చేసుకున్న కొత్త దంపతులకు ఇప్పటిదాకా మూడు రోజులు పెయిడ్ లీవ్లు ఉండేవి. ఇప్పుడు వాటిని 30 రోజులకు పెంచారు. ప్రపంచంలోనే రెండు అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టం అవుతోంది. పెళ్లి.. ఆర్థిక, సామాజిక సమస్యగా మారింది. పెళ్లి ‘మార్కెట్’ కావడంతో ..మార్కెట్లో నిలబడలేని ఎంతోమంది పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. ప్యాకేజీల కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. చైనాలో పెరుగుతున్న కన్యాశుల్కం ఓ రకంగా అమ్మాయిలను మార్కెట్లో పెట్టడమే.. అంగడి సరుకుగా మార్చడమే! ఈ పరిస్థితి.. ఆడపిల్ల అమ్మ కడుపులో ఉండగానే సమాజం మూకుమ్మడిగా కత్తులు దూసినందుకు తగిలిన ఉసురు కాదా..?.. ఇదీ సీరియస్ అంశం! -సరికొండ చలపతి -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
పద్దెనిమిదికి ముందే పెళ్లి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోవిడ్... ప్రతి మనిషిని ఆరోగ్యపరంగా, ఆర్థికం గా కుంగదీసింది. ఉపాధినీ దెబ్బతీసింది. ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గినా... దాని ప్రభావం మాత్రం సమాజంపై వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మనుషుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ చేసిన గాయం కారణంగా అభద్రతాభావానికి గురవుతున్న తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే పెళ్లిళ్లు చేయాలనే భావనలోకి వచ్చారని యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్లే దేశవ్యాప్తంగా 2022లో జరిగిన పెళ్లిళ్లలో 25.3శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిండనివారే ఉన్నారని వెల్లడించింది. ఇందుకు కొన్ని కారణాలను ఈ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్ పద్దెనిమిదేళ్ల వయసు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేస్తున్న రాష్ట్రాల్లో పశి్చమ బెంగాల్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 41.6 శాతం బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్ (40.8 శాతం), త్రిపుర (40.1శాతం), జార్ఖండ్ (32.2 శాతం), అస్సాం(31.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (29.3 శాతం) ఉన్నాయి. జమ్మూ–కశీ్మర్లో అత్యంత తక్కువగా 4.5 శాతం, కేరళలో 6.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ గుర్తించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బాల్యవివాహాల పరిస్థితి మన రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి కర్నూలు (36.9 శాతం), గుంటూరు (35.4 శాతం), విజయనగరం (33.7 శాతం), చిత్తూరు (28.1 శాతం), తూర్పుగోదావరి (26.0 శాతం), వైఎస్సార్ కడప (25.6 శాతం), శ్రీకాకుళం (25.4 శాతం), విశాఖపట్నం (25.4 శాతం), కృష్ణా (25.3 శాతం), నెల్లూరు (23.8 శాతం), పశి్చమగోదావరి (22.1 శాతం) చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు 2022లో వివాహాలు చేసినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ప్రధాన కారణాలు ఇవీ... ► కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పది, ఇంటర్ చదువుతున్నవారు ఆన్లైన్ తరగతుల కారణంగా చదువులో రాణించలేకపోయారు. ఫలితంగా డ్రాపవుట్స్ పెరిగాయి. ► చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. ► కరోనా రాకముందు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంత గ్రామాలకు వచ్చేశాయి. నిరుద్యోగిత పెరగడంవల్ల ఆరి్థకంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ► అందువల్ల అభద్రతాభావంతో పెళ్లీడు రాకపోయినా ఆడపిల్లలకు వివాహాలు చేస్తే బాధ్యత తీరిపోతుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సర్వేలో గుర్తించినట్లు యూనిసెఫ్ ప్రకటించింది. -
‘వెడ్డింగ్’ ఈవెంట్ ట్రెండింగ్.. ఈవెంట్ మేనేజ్మెంట్పై స్పెషల్ ఇంట్రెస్ట్
కర్నూలు (టౌన్): పెళ్లంటే పందిళ్లు.. తాళాలు..తలంబ్రాలే కాదు..సరికొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా వీటికి జత కలిసింది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లి చేయాలంటే హైరానా పడేవారు. సమయానికి ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాన్ని సులువు చేసింది. పెళ్లి ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు అంతా వారే చూసుకుంటున్నారు. జీవన శైలిలో మార్పుతో.. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధువులంతా తలా ఒక చేయి వేసి పెళ్లి తంతును నడిపించేవారు. వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలవుతుంది. నిశ్చితార్థం, మూహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, హోమం, అరుంధతీ నక్షత్ర దర్శనం ఇలా వివాహ వేడుకలో కీలక ఘట్టాలు ఉంటాయి. కుటుంబసభ్యులు, బంధువులు కలిస్తే తప్ప ఈ తంతు సజావుగా సాగదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. మారిన జీవన శైలితో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. వివాహ వేడుకల్లో పనిచేసే బంధువులు కరువయ్యారు. దీంతో చాలా మంది ఈవెంట్ మేనేజ్మెంట్పై ఆధారపడ్డారు. ( ఫైల్ ఫోటో ) సినిమాటిక్ ఈవెంట్లా.. భారీ సెట్టింగ్లు.. ఎల్ఈడీ స్క్రీన్లు..అర్కెస్ట్రా..తదితర హంగులతో సినిమాటిక్ ఈవెంట్లా వివాహాలు జరు గుతున్నాయి. మేకప్ ఆర్టిస్టులు, క్యాటరింగ్ సర్వీసెస్, వెల్కమ్ గర్ల్స్... ఇలా సరికొత్తగా వేడుక సాగుతోంది. గతంలో ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు వివాహ తంతును పర్యవేక్షణ చేసేవారు. నేడు యువతీయువకుల అభీష్టాల మేరకు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. క్యాటరింగ్లో వినూత్న మార్పులు పెళ్లి వేడుకలో షడ్రుచులతో భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీ. ఇప్పుడు క్యాటరింగ్లో మార్పులు వచ్చాయి. పనస పండు బిర్యానీ నుంచి రాయలసీమ రుచులు, కోనసీమ రుచులు, హైదరబాద్ బిర్యానీ వరకు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. వెడ్డింగ్, కార్పొరేట్, సోషల్ ఈవెంట్ క్యాటరింగ్లకు డిమాండ్ ఉంటోంది. కర్నూలు నగరంలో 10 వరకు పెద్ద స్థాయి క్యాటరింగ్లు ఉన్నాయి. వంట మనుషులను హైదరాబాద్ నుంచి కర్నూలు రప్పిస్తున్నారు. అతిథులకు ప్రత్యేక వంటకాలు అందించేందుకు కొంత మంది ఖర్చుకు వెనుకాడడం లేదు. సొంతంగా పెళ్లి మంటపాలు ఒకరు వాడిన మంటపాలు, షామియానాలు, సైడ్వాల్స్ కాకుండా ఉన్నస్థాయి వర్గాల వారు సొంతంగా పెళ్లి మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ఈవెంట్ మేనేజర్లు జర్మన్ హ్యాంగర్లు తెప్పిస్తున్నారు. బెస్ట్ ఫాక్ట్ వెడ్డింగ్ పేరుతో 3 వేల మంది నుంచి 10 వేల మందితో పెళ్లి తంతును ఘనంగా జరిపిస్తున్నారు. కర్నూలు నగరంలో 3 వేల మందితో ఎన్నో వివాహ కార్యక్రమాలు జరిగాయి. పెళ్లి మంటపాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిర్మిస్తారు. డెకరేషన్ కోసం బెంగళూరు నుంచి పూలను తెప్పిస్తున్నారు. కాక్టెయిల్ పారీ్టలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్ లైటింగ్.. ఇలా వివాహ తంతులో అధునికత కనిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సంప్రదాయాలను కొనసాగిస్తూ ఘనంగా వివాహం చేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ మార్కెట్లోకి వచ్చింది. సినిమా ఈవెంట్స్ తరహాలో వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – సందీప్, ఈవెంట్ మేనేజర్, కర్నూలు కోరిన భోజనం అందిస్తున్నాం పెళ్లిళ్లలో క్యాటరింగ్ సంస్కృతి పెరిగింది. నిర్వాహకులు కోరిన విధంగా వంటకాలు తయారు చేస్తున్నాం. రైస్, పలావ్, 24 రకాల టిఫిన్స్, 53 రకాల స్వీట్. 25 రకాల నార్త్ ఇండియన్ ఐటమ్స్, నాన్వెజ్లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, నాటుకోడి..ఇలా 30 రకాల వంటకాలు అందిస్తున్నాం. హైదరాబాద్ నుంచి వంటవారిని రప్పిస్తున్నాం. – ఆవుల లింగన్న, క్యాటరింగ్ నిర్వాహకుడు. -
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా?
‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ ‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ ఇలాంటి... డైలాగ్లు టీన్స్ నుంచి ట్వంటీస్ వరకు చెప్పేవే. అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి. అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? అయితే... ఇది మంచి పరిణామమే. అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా? అధ్యక్షుడిగా ట్రంప్ పోయినా ట్రంప్ భయం ఇంకా ఉందా? ‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు. మరి ఇప్పుడు... కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది. ‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్లోని అవినాష్రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు, తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఇదీ నా స్టైల్ షీట్! ‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను. ► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్ నంబర్, శాలరీ సర్టిఫికేట్లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. ► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి. – వాకా మంజులారెడ్డి ట్రంప్ ప్రభావం నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు. – జొన్నలగడ్డ జ్యోతి మళ్లీ యూఎస్ క్రేజ్ పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్ సంబంధాలకు క్రేజ్ పెరిగింది. – శ్వేత పసుపులేటి నిర్ణయం వధూవరులదే! అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే. చాదస్తం తగ్గింది ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్డ్ మ్యారేజ్ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. – కరణం నరసింగరావు లేటెస్ట్ ఫొటోలుండాలి! మ్యారేజ్ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్ ఫొటో షూట్ చేయడం మంచిది. పేరెంట్స్ ఇచ్చే ఫైల్ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు. – కోటిరెడ్డి -
AP: సర్కారు వారి పెళ్లికానుక.. అర్హతలు ఇవే.. దరఖాస్తు చేయడం ఇలా..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నమోదైన కార్మికులకు లబ్ధి చేకూరుస్తారు. షాదీతోఫా పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు మేలు కలుగుతుంది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 1 తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 32 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ సమగ్ర పరిశీలన పూర్తయ్యాక అధికారిక ఆమోదం కోసం కలెక్టర్కు ఈ దరఖాస్తులు పంపుతారు. దరఖాస్తు చేయడం ఇలా.. వివాహం జరిగిన 60 రోజుల్లోగా ఆయా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. తొలుత సచివాలయాల ద్వారా వివాహ సర్టిఫికెట్ పొందాలి. అనంతరం నిబంధనల మేరకు వివాహ ధ్రువపత్రాలను దరఖాస్తులో పొందుపర్చాలి. ముఖ్యంగా పెళ్లిపత్రిక, పెళ్లి సమయంలో తీయించిన ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్ సమర్పించాలి. వధూవరుల చదువుకు సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణత సరి్టఫికెట్ల జిరాక్సు కూడా దరఖాస్తుకు జత చేయాలి. భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ పథకాలపై వైఎస్సార్ క్రాంతిపథం సిబ్బంది తమ పరిధిలోని సంఘాల సభ్యుల ద్వారా ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్హతలు ఇవే... ♦వివాహమయ్యేనాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి ♦భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే ♦వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ♦కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు ♦భూమి పల్లం 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు ♦కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారు అయ్యి ఉండకూడదు ♦పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది ♦కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది ♦కుటుంబం నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించరాదు ♦మున్సిపల్ ప్రాంతంలో 1000 ఎస్ఎఫ్టీకి మించి నివాస స్థలం ఉండరాదు -
ఈ ఏడాది దంపతులుగా, తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన స్టార్స్
ఈ ఏడాది ఇటు సౌత్.. అటు నార్త్లో పెళ్లి కళ కనిపించింది. అన్నీ కూడా దాదాపు ప్రేమ వివాహాలే. పెద్దల అనుమతితో వైభవంగా స్టార్స్ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో పెళ్లి చేసుకున్న కొందరు స్టార్స్ ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని, పేరెంట్స్ అయినవారూ ఉన్నారు. పెద్దల అక్షింతలతో పెళ్లి చేసుకున్న, పిల్లల కేరింతలతో మురిసిపోతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్తో జూన్ 9న ఏడడుగులు వేశారామె. విజయ్ సేతుపతి, నయన జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ (‘నేను రౌడీ’) చిత్రం వీరి ప్రేమకు పునాది అయింది. ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం అయిన విఘ్నేష్–నయన నిజ జీవితంలోనూ భాగస్వాములు కావడం విశేషం. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు వీరు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే విఘ్నేష్–నయన తల్లిదండ్రులు కావడం హాట్ టాపిక్ అయింది. కారణం సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. ఇక యువ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నవంబర్ 20న మూడు ముళ్లు వేశారాయన. అనూషతో కొంత కాలంగా ఉన్న స్నేహం ప్రేమగా మారడం.. ఆ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం జరిగింది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కారు. తన ప్రేయసి, హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ఏడడుగులు వేశారు. మే 18న వీరి వివాహం జరిగింది. అదే విధంగా ‘దేశముదురు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, ప్రియుడు అయిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ఆమె వివాహమాడారు. జైపూర్లో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరిగింది. అలాగే హీరోయిన్ పూర్ణ దుబాయ్లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 25న వీరి వివాహం దుబాయ్లో జరిగింది. కాగా సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తీక్, నటి మంజిమా మోహన్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘దేవరాట్టం’ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ గౌతమ్, మంజిమా నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా దక్షిణాదిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన జంటలు కొన్ని ఉన్నాయి. వచ్చే ఏడాది పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు రామ్చరణ్–ఉపాసన. కోడలు గర్భవతి అనే విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 2012 జూన్ 14న రామ్చరణ్, ఉపాసనల వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియా మోహన్ గర్భవతి అని ఇటీవల ప్రకటించారు. అగ్రనిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం 2020లో డిసెంబరు 10న తేజస్వినీతో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న తేజస్విని ఓ బాబుకు జన్మనిచ్చారు. తనయుడికి అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు. ఈ ఏడాది నుంచి కాజల్ అగర్వాల్ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే.. 2020 అక్టోబరు 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి నీల్ కిచ్లు అని నామాకరణం చేశారు. మరోవైపు గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. తమకు కుమార్తె పుట్టిన విషయాన్ని జూన్ 10న ప్రకటించారు. పాపకు అర్నా అని పేరు పెట్టుకున్నారు. మరోవైపు నమిత కూడా ఈ ఏడాదే పేరెంట్స్ క్లబ్లో చేరారు. వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో కలిసి 2017 నవంబరు 24న తిరుపతిలో ఏడడుగులు వేశారు నమిత. ఈ ఏడాది ఆగస్టులో మే 10న తాను గర్భవతిననే విషయాన్ని నమిత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కవలలకు (ఇద్దరు మగశిశువులు) జన్మనిచ్చినట్లు ఆగస్టులో ప్రకటించారు. కృష్ణ ఆదిత్య, కిరణ్ రాజ్ అనేవి వీరేంద్ర చౌదరి, నమిత దంపతుల కుమారుల పేర్లు. ఇక దర్శక–నటుడు రాహుల్ రావీంద్రన్, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్లో కవలలకు (మగశిశువు, ఆడశిశువు) జన్మనిచ్చారు చిన్మయి. శర్వస్, ద్రిప్త అనేవి వీరి పేర్లు. కాగా రాహుల్ రవీంద్రన్, చిన్మయిల వివాహం 2014 మేలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ౖ వెపు వెళితే ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ సరోగసీ ద్వారా మాల్టీ మారీ చోప్రా జోనస్ అనే పాపకు తల్లిదండ్రులైనట్లు జనవరిలో ప్రకటించారు. కాగా నిక్ జోనాస్, ప్రియాంకా చోప్రాల వివాహం 2018 డిసెంబరులో జరిగింది. మరోవైపు 2016 ఏప్రిల్ 30న నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లాడిన హీరోయిన్ బిపాసా ఈ ఏడాది నవంబరు 12న ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాప పేరు దేవి బసు సింగ్ గ్రోవర్. హిందీలో కూడా ఈ ఏడాది కొన్ని జంటలు షాదీ ముబారక్ (వివాహ శుభాకాంక్షలు) అందుకున్నాయి. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న ఏడడుగులు వేశారు. ఈ ఇద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, నిజజీవితంలోనూ జంట అయ్యారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదే తల్లిదండ్రులయ్యారు కూడా. నవంబర్ 6న ఆలియా ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రహా అని పేరు పెట్టారు. మరో జంట అలీ ఫజల్–రిచా చద్దా దాదాపు పదేళ్లు ప్రేమించుకున్నారు. ‘ఫక్రి’ చిత్రం షూటింగ్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అక్టోబర్ 4న వీరి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు సూరజ్ నంబియార్–మౌనీ రాయ్. జనవరి 27న వీరి వివాహం జరిగింది. మరోవైపు ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు ఫర్హాన్ అక్తర్–షిబానీ దండేకర్. ఫర్హాన్ హోస్ట్ చేసిన ‘ఐ కేన్ డూ దట్’ షోలో షిబానీ పాల్గొన్నారు. ఆ షోలోనే ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. 2015లో ఏర్పడిన వీరి పరిచయం ఈ ఏడాది పెళ్లి వరకూ వచ్చింది. ఇంకోవైపు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఏడడుగులు వేశారు విక్రాంత్ మస్సే–షీతల్ ఠాకూర్. ఈ ప్రేమికుల దినోత్సవానికి (ఫిబ్రవరి 14) మిస్టర్ అండ్ మిసెస్ అయ్యారు విక్రాంత్–షీతల్. ఇక దర్శకురాలు గునీత్–వ్యాపారవేత్త సన్నీల వివాహం ఈ నెల 12న జరిగింది. ఇలా ఈ ఏడాది హిందీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి బాగానే కనిపించింది. -
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్ రూ.2,750 -
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లో హర్దోయ్లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
కల్యాణం.. ప్రతి తంతూ కళాత్మకం
సాక్షి అమలాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇదో మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా! వివాహంలో నయనానందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం సుమధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే కాస్త వెలుగు జిలుగులు అద్దాల్సిందే. పెళ్లంటే తాళిబొట్లు.. తలంబ్రాలు.. పూలదండలు.. ఆభరణాలు.. వేదమంత్రాలు.. సన్నాయి మేళాలు.. షడ్రుచుల భోజనాలే కాదు.. ఇప్పుడా సందడి సరికొత్త శోభను అద్దుకుంటోంది. ప్రతి తంతూ కళాత్మకంగా మారిపోతోంది. మనోఫలకంపై బలమైన ముద్ర వేస్తోంది. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టంలో వాడే వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న శ్రామికుల పనితనం.. చేయి తిరిగి నైపుణ్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫొటో, వీడియో షూట్ల ప్రాధాన్యం పెరిగిన తరువాత పెళ్లిలో వాడే ప్రతి వస్తువునూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మూడు నెలల మూఢం కొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభ కాబోతోంది. ఈ తరుణాన వివాహ వస్తువులు తయారు చేసేవారు బిజీగా మారిపోయారు. ఎన్నో డెకరేషన్లు ► వధూవరుల మంగళ స్నానాలకు చేస్తున్న డెకరేషన్లే చిన్న సైజు పెళ్లిని తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ.. సప్తవర్ణ శోభితమైన బిందెలు.. మహారాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చే కంచు పాత్రలు.. వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగురంగుల పూలతో కొత్త వన్నెలు అద్దుతున్నారు. ► బాసికాలు.. పెళ్లి కుమారునికి అలంకరించే మహారాజా తలపాగాలు.. సంప్రదాయ టోపీలు.. కాళ్లకు తొడిగే పాముకోళ్లు.. రోళ్లు.. రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబులు.. పెళ్లి కుమార్తెకు కొత్తందాన్ని తెచ్చే అలంకరించే పూలజడలు.. ఖరీదైన జాకెట్లు.. చేతులకు కళాత్మక మెహందీలు.. ముఖానికి ఫేషియల్స్.. పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్లే బుట్ట.. గొడుగు.. ఇలా వివాహ వైభవంలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి. ► శాస్త్ర సమ్మతమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి మీద సీతారాములు, అలమేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామి వంటి దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతూ.. ఆ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు. ► వివాహ సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరి బొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు. ► సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. ► తలంబ్రాలకు వాడే కొబ్బరి చిప్పలను సైతం అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ► వధూవరులతో పాటు పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమానికీ వినియోగించే ప్రతి వస్తువునూ ఎంతో మంది అద్భుత ప్రతిభతో కళ్లు తిప్పుకోలేని రీతిలో ముస్తాబు చేస్తున్నారు. ఫొటో షూట్లు వచ్చాక ఆకర్షణకు ప్రాధాన్యం పెళ్లికూతుళ్ల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్ వరకూ ప్రతి దానికి అదనపు ఆకర్షణలు అద్దుతున్నారు. ఫొటోల కోసం ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల అలంకరణే చిన్న సైజు పెళ్లిని తలపిస్తుంది. – శ్రీపతి ప్రకాష్, కల్వకొలను వీధి, అమలాపురం -
రెండు నెలలు.. లక్ష వివాహాలు.. ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్
సాక్షి, ముంబై: కరోనా తరువాత ఏకంగా రెండేళ్లకు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో డెకోరేటర్లు, ఫుడ్ క్యాటరింగ్, ఫంక్షన్ హాలు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పని దొరికినట్లయింది. అంతేగాకుండా వీరిపై ఆధారపడిన వేలాది కార్మికులు, కూలీలకు కూడా ఉపాధి దొరికింది. వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. దీంతో కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల వాయిదా వేసుకున్న అనేక పెళ్లిళ్లకు ఇప్పుడు మంచి ముహూర్తాలు లభించాయి. కొందరు పెళ్లిల్లు చేసుకున్నప్పటికీ అనేక ఆంక్షలకు, షరతులకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. కానీ ఈసారి దీపావళి తర్వాత మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరిలో ఉన్నాయి. దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. దీంతో డెకొరేటర్లు, క్యాటరింగ్, హాలు, టూరిస్టు వాహనాలు, మెహందీ (గోరింటాకు) ఆర్టిస్టులను ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచారు. వీరితోపాటు మార్కెట్లో కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులకు కూడా మంచి రోజులు వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా బేరాలు లేక ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడు కొంత తేరుకుంటున్నారు. శుభకార్యాలపై మహమ్మారి ప్రభావం... కరోనా కాలంలో శుభ, అశుభ కార్యక్రమాలకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. గత్యంతరం లేక అనేక మంది వాయిదా వేసుకున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వధువు, వరుడి తరఫున 25 మంది చొప్పున బంధువులను అనుమతించారు. దీంతో సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలవల్ల కేటరింగ్, డెకోరేటర్లు, వీడియో, ఫోటో గ్రాఫర్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో పెళ్లిలో 500–700 మందికి ఫుడ్ సప్లయిచేసే క్యాటరింగ్ యజమానులు ఆంక్షలవల్ల కేవలం 50 మందికే సరఫరా చేయాల్సి వచ్చింది. చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) హాలులో కుర్చీలు, తివాచీలు, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలకు, ఇతర అలంకరణ సామాగ్రికి డిమాండ్ లేకపోవడంతో డెకొరెటర్లు కూడా నష్టపోయారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో వీడియో, ఫోటో గ్రాఫర్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెళ్లిలో బారాత్లు కూడా లేకపోవడంతో బ్యాండ్, ఇతర భాజాభజంత్రీలకు, మేళతాళాలకు, డప్పులు వాయించే వీరికి కూడా చేతినిండి పనిలేకుండా పోయింది. దీంతో గత రెండేళ్లుగా అరకొర ఆర్డర్లతో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ప్రవేశ ద్వారం, హాలు, స్టేజ్ను అలంకరించే డెకొరేటర్లు లేకపోవడంతో పూలకు కూడా డిమాండ్ పడిపోయింది. ఇప్పుడు కరోనా నియంత్రణలోకి రావడంతో ధైర్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. డెకొరేటర్లు, ఫుడ్ కేటరింగ్, హాలు, కెమరా మెన్లకు, బ్యాండ్ మేళతాళాలు వాయించే వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. పనిచేసే కూలీలు, కార్మికులను కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. బారాత్లకు అవసరమైన టూరిస్టు వాహనాలను, బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులు, టాటా సుమోలు, క్వాలీస్ తదితర వాహనాలను కూడా ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచుకున్నారు. ఇలా అన్ని రంగాల వారికి చేతినిండా ఉపాధి లభించడంతో రెండేళ్ల తరువాత ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. -
డిసెంబర్ 12 వరకు ఊరూరా పెళ్లి సందడి..
-
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
ముహూర్తం ముందరున్నది
సాక్షి, అమరావతి: ‘‘మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది.. మా అమ్మాయి జాతకానికి మీ అబ్బాయి జాతకం బాగా కుదిరింది.. మనం ఇప్పుడే ఒక మాట అనుకుని పెళ్లి ఖాయపర్చుకుంటే మూఢం వెళ్లగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం’’ రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మధ్య సాగుతున్న సంభాషణ ఇది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు. మూఢం ముగియడంతో నవంబర్ 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుంది ముహూర్తం అంటూ.. పెళ్లి ఏర్పాట్లలో వధూవరుల కుటుంబాలు బిజీ అవుతున్నాయి. మార్కెట్లకు పెళ్లి కళ.. ప్రస్తుత శుభకృత్ నామ తెలుగు సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు కూడా పెళ్లి కళ వచ్చింది. ఇప్పటికే ఇళ్ల మరమ్మతుల కోసం సిమెంట్ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి. సరికొత్త శ్రేణి ఆభరణాలతో బంగారం షాపులు రెడీ అవుతున్నాయి. మారిన ట్రెండ్కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల షాపులు సిద్ధమయ్యాయి. చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్ హాళ్ల అడ్వాన్సు బుకింగ్లు అవుతున్నాయి. మే వరకూ శుభ ముహూర్తాలు.. నాలుగు నెలల తర్వాత మంచి బలమైన ముహూర్తాలు వస్తున్నందున పెళ్లి బాజాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. మూఢం వెళ్లగానే మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేస్తారు. ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయి. 2023 ఉగాది అయ్యాక చైత్రం, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో మంచి ముహూర్తాల్లో వివాహాలు జరిపిస్తారు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 ముహూర్తాలు ఉన్నాయి. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు(లాలూ), పురోహితుడు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
88వ పెళ్లికి సిద్ధమవుతున్న వృద్ధుడు...మరోసారి మాజీ భార్యతో
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు. అతను 14 ఏళ్ల వయసులో తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే 87 పెళ్లళ్లు చేసుకున్న ఖాన్ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
ఒకే రోజు 95 జంటలకు పెళ్లి.. ఎక్కడంటే!
అన్నానగర్(చెన్నై): తిరువందిపురంలో ఆదివారం ఒకే రోజు 95 పెళ్లిలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలోని తిరువందిపురంలో ప్రసిద్ధి చెందిన దేవనాథస్వామి ఆలయం ఉంది. గుడి ముందున్న కొండపై శుభ ఘడియలు ఉన్న రోజుల్లో రోజుకు 50 నుంచి 200 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే తిరువందిపురం ప్రాంతంలోని ప్రైవేట్ మంటపాల్లో కూడా వివాహాలు జరుగుతాయి. ఆదివారం ముహుర్తాలు ఉండడంతో తిరువందిపురంలోని దేవనాథస్వామి ఆలయ కొండపై ఉన్న హాలులో తెల్లవారుజామున నుంచి వివాహ వేడుకలు జరిగాయి. కొండపైన 70 పెళ్లిళ్లు జరగ్గా ఆ గుడి చుట్టుపక్కల ప్రైవేట్ హాళ్లలో 25 పెళ్లిళ్లు మొత్తం 95 వివాహాలు జరిగాయి. అనంతరం భార్యాభర్తలు కుటుంబ సమేతంగా దేవనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శుభకార్యాలకు జనం అధిక సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో కడలూరు, బాలూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిళ్లు చోరీ చేస్తూ లాగించేస్తోంది! -
పవన్ మూడు పెళ్లిళ్ల కామెంట్స్ పై సీఎం జగన్ కౌంటర్
-
'గే' మ్యారేజెస్కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్
జెనీవా: ప్రపంచంలో 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలో లేదా బలవంతపు వివాహంలో చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇటీవలకాలంలో ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగినట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ 2030 నాటికి అన్నిరకాల ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే అనుహ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో సుమారు 10 మిలియన్ల మంది బలవంతపు కార్మికులుగా లేదా బలవంతపు వివాహాల్లో చిక్కుకున్నారని యూఎన్ నివేదికలో పేర్కొంది. వాక్ ఫ్రీ ఫౌండేషన్తో పాటు యూఎన్ లేబర్ అండ్ మైగ్రేషన్ ఏజెన్సీల అధ్యయనం ప్రకారం గతేడాది చివరి నాటికి సుమారు 28 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలోకి నెట్టివేయబడ్డారని, దాదాపు 22 మిలియన్ల మంది బలవంతంగా వివాహం చేసుకున్నారని తెలిపింది. దీనిని బట్టి ప్రపంచంలో ప్రతి 150 మందిలో దాదాపు ఒకరు ఆధునిక బానిసత్వంలో చిక్కుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆధునిక బానిసత్వం మెరుగవకపోవడం దిగ్బ్రాంతికరం అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) అధిపతి గైరైడర్ అని తెలిపారు. అదీగాక కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చింది. దీంతో చాలామంది కార్మికుల రుణాలను పెంచిందని అధ్యయనం గుర్తించింది. అంతేగాక వాతావరణ మార్పు, సాయుధ పోరాటాల ప్రభావాల కారణంగా ఉపాధి, విద్యకు అంతరాయం తోపాటు తీవ్రమైన పేదరికం తలెత్తి అసురక్షిత వలసలకు దారితీసిందని తెలిపింది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా యూఎన్ నివేదిక అభివర్ణించింది. పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు బలవంతపు శ్రమలోకి నెట్టబడటమే కాకుండా వారిలో సగానికి పైగా వాణిజ్యపరమైన లైంగిక దోపిడికి గురవుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే వలస కార్మకులు, వయోజన కార్మికులు బలవంతపు పనిలో ఉండే అవకాశం మూడురెట్లు ఉందని పేర్కొంది. ఈ నివేదిక అన్ని వలసలు సురక్షితంగా, క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధిపతి ఆంటోనియో విటోరినో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి) -
పెళ్లిళ్లకు బ్రేక్.. అప్పటి దాకా ఆగాల్సిందే.. నో ఛాన్స్
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): చిన వేంకన్న క్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రావణ మాస పెళ్లిసందడికి తెర పడింది. ఆదివారం ఉదయం 8.39 గంటలదే శ్రావణంలో చివరి ముహూర్తం. ఈ ముహూర్తంలో కొన్ని వివాహాలు జరిగినా.. శనివారం రాత్రి ముహూర్తం శ్రావణ మాసంలో అతి పెద్దది కావడంతో క్షేత్రంలో 300కు పైగా వివాహాలు జరిగాయి. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎటు చూసినా పెళ్లివారే కనిపించారు. కొండ పైన, దిగువన ఉన్న కల్యాణ మంటపాలు, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మంటపం, పాదుకా మంటపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మంటపంలో, చివరకు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో నేలపై సైతం వివాహాలు జోరుగా జరిగాయి. స్వామి సన్నిధిలో కాస్త జాగా దొరికితే చాలు.. ఏదోలా పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని పెళ్లి బృందాల వారు ఆతృత పడ్డారు. పెళ్లివారి వాహనాలతో ఘాట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్సై టి.సుదీర్ సిబ్బందితో కలసి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మొత్తంగా శ్రావణ మాసంలో శ్రీవారి క్షేత్రంలో సుమారు 2 వేల వివాహాలు జరిగాయి. దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. స్వామి సన్నిధిన వివాహాలు చేసుకున్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సత్రం గదుల్లో చాలావరకూ పెళ్లిబృందాల వారే రిజర్వ్ చేసుకున్నారు. పెళ్లిళ్లకు మూడు నెలలు బ్రేక్.. శ్రీవారి క్షేతంల్రో వివాహాలు జరగాలంటే మార్గశిర మాసం వరకూ అంటే డిసెంబర్ రెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఆదివారంతో శ్రావణ మాసంలోని వివాహ ముహూర్తాలు ముగిశాయి. 28 నుంచి భాద్రపదం శూన్యమాసం. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకూ వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనేక మంది తొందరపడ్డారు. దీంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. డిసెంబర్ 2 నుంచి 19వ తేదీ వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసంలో, తరువాత ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతున్న ఫాల్గుణంలో వివాహాలు జరగనున్నాయని పండితులు తెలిపారు. కొత్త జంటలతో క్షేత్రం కళకళ కొత్త జంటలతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి కొత్త జంటలు, వారి బంధువులతో కలసి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయం వద్ద ఎటు చూసినా నూతన వధువరులే కనిపించారు. దీనికితోడు ఆదివారం సెలవు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
నిత్య పెళ్లి కొడుకు పాస్పోర్టు రద్దు చేయించాలి
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్): నిత్య పెళ్లికొడుకు పాస్పోర్టుని వెంటనే రద్దు చేయించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్)లో జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ దృష్టికి తీసుకువచ్చారు. వరుస వివాహాలతో పలువురి మహిళలను మోసగించిన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన కె.సతీష్బాబు అలియాస్ సత్యకుమార్ను గత గురువారం (జూలై 28) గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్బాబుపై కోర్టులో కేసు జరుగుతుందని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే విదేశానికి పారిపోయేందుకు అవకాశం ఉందని గుంటూరు నగరంలోని పాతగుంటూరు, శ్యామలానగర్కు చెందిన బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని, అలాగే పాస్పోర్ట్ రద్దు చేయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అతని వద్ద ఉన్న మరో లాప్ట్యాప్ను సీజ్ చేయలేదని తెలిపారు. అందులో విమాన టికెట్ ఉందని, ఏమాత్రం అతనికి బెయిల్ మంజూరైన, వెంటనే ఇక్కడి నుంచి పారిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఓ పోలీస్ అధికారి తీరు విమర్శలకు తావిస్తోందని, బాధితుల పక్షాన తెలియజేసే అదనపు సమాచారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మాట్లాడారు. (క్లిక్: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!) -
నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిత్య పెళ్లికొడుకుగా మారి ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకుని మరికొంతమందిని మోసం చేసిన కర్నాటి సతీష్ బాబు టీడీపీ నేతేనని వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికాలోని వర్జీనియాలో జరిగిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సమావేశానికి సతీష్ హాజరవడమే కాకుండా కీలకంగా వ్యవహరించాడని చెబుతున్నారు. ఆ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొన్నారు. టీడీపీలో తనకు ఉన్న పరిచయాలతో ఇక్కడ చక్రం తిప్పాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి వీరభద్రరావు కుమారుడు కర్నాటి సతీష్ మోసం చేసి పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు ఒక మహిళ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఈ నెల 26న అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పసరు మందు ఇచ్చి అబార్షన్.. ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో నాలుగో భార్యకు పసరు మందు ఇచ్చి అసహజ పద్ధతుల్లో సతీష్ బాబు అబార్షన్ చేయించాడు. ఐదో భార్యను కూడా అబ్బాయిని కనడం కోసమే చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. శనివారం సతీష్ చేతిలో మోసపోయిన నాలుగో భార్య, ఐదో భార్య గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ, దిశ ఇన్చార్జ్ సుప్రజను కలిసి ఫిర్యాదు చేశారు. సతీష్కు ఉన్న ఐదు సెల్ఫోన్లు, ల్యాప్టాప్ను సీజ్ చేసి అందులో ఉన్న నీలిచిత్రాలను తొలగించాలని నాలుగో భార్య కోరారు. తనకు, తన తల్లికి ఆ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు విడాకులు ఇవ్వకుంటే తనతో పడకగదిలో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఐదో భార్య కూడా సతీష్ విదేశాలకు పారిపోకుండా అతడి పాస్పోర్టును సీజ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం కస్టడీ పిటీషన్ వేయనున్నట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఇంకా అతడి వల్ల మోసపోయిన మహిళలు ఉంటే నేరుగా అధికారులను కలిసి వివరాలు అందజేయాలన్నారు. -
పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, పట్నంబజార్: అమెరికాలోని వాషింగ్టన్లో పనిచేసే పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన కర్నాటి సతీష్బాబు అలియాస్ సత్యకుమార్ తనకు పెళ్లి కాలేదని చెబుతూ అనేక మంది మహిళలను మోసం చేశాడు. ఈ క్రమంలో అతనికి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ద్వారా గుంటూరు రవీంద్రనగర్కు చెందిన మహిళ పరిచయమైంది. ఈమె సతీష్ను ఇద్దరి కుటుంబ పెద్దల సమ్మతితో ఈ ఏడాది జూన్ 16న పెళ్లి చేసుకున్నారు. తరువాత హైదరాబాద్ వెళ్లి కేపీహెచ్బీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె సతీష్బాబు సెల్ఫోన్ పరిశీలించి, అందులో లావణ్య అనే మహిళతో పలుమార్లు చాటింగ్ చేసినట్టు గుర్తించి నిలదీసింది. చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి దీంతో లావణ్యను కూడా పెళ్లి చేసుకున్నానని అతను చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతని తల్లిదండ్రులను ప్రశ్నించగా అదే సమాధానం ఎదురైంది. దీంతో సతీష్బాబు పై అనుమానం వచ్చిన ఆమె అతడి గురించి ఆరా తీసింది. అప్పటికే అతనికి చాలా పెళ్లిళ్లయ్యాయని, 2019, 2021 సంవత్సరాల్లో సతీష్పై కేసులు కూడా నమోదయ్యాయని యూట్యూబ్లో ఉన్న వీడియోల ద్వారా తెలుసుకుంది. అప్పటినుంచి సతీష్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఇంటి కోసం రుణం తీసుకోవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. తన విషయాలు బయటపెడితే పడకగదిలో అశ్లీలంగా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతోపాటు ఆమె వద్ద రూ.పది లక్షల వరకు దఫదఫాలుగా తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. ఈ బాధలను భరించలేని బాధితురాలు ఎట్టకేలకు దిశ పోలీసులను ఆశ్రయించింది. వివాహాలు వాస్తవమే! మహిళ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా అతడికి ఆరు వివాహాలైన మాట వాస్తమేనని గుర్తించినట్లు సమాచారం. 2021లో ఓ మహిళ ఫిర్యాదుతో సతీష్పై కేసు నమోదైనట్టు గుర్తించారు. అప్పట్లో నమోదు చేసిన చార్జిషీటుపై, అప్పటి దర్యాప్తు తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారినందున విచారణ పక్కదారి పట్టిందని సమాచారం. అప్రమత్తమైన పోలీసులు ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నిందితుడి సెల్ఫోన్ సీజ్ చేసి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సతీష్బాబు ఆరు వివాహాలే చేసుకున్నాడా? లేదా ఇంకా మరికొంతమందిని కూడా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆయా పెళ్లిళ్లల్లో కీలకంగా వ్యవహరించిన కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. సతీష్బాబుకు గ్రీన్కార్డు ఉండటంతో పాస్పోర్టు రద్దుకు సిఫార్సులు చేస్తున్నట్టు సమాచారం. -
వీడు మామూలోడు కాదు? 11 పెళ్లిళ్లు 11మంది భార్యలు..
-
బయటపడిన నిత్య పెళ్లికూతురి బాగోతం.. ముగ్గురి దగ్గర మూడు పేర్లతో..
సాక్షి, చిత్తూరు(చెన్నై): విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ముగ్గురి భర్తల వద్ద మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకున్న కిలాడీ లేడి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్నగర్కు చెందిన హరి(44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకున్నారు. దీంతో హరి రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశారు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేదని చెప్పింది. దీంతో హరి, శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఆస్తి వివరాలను చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని కోరింది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపత్తూరు జిల్లా జోలార్పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్లోని క్యాంటిన్లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! -
మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..
వజ్రపుకొత్తూరు రూరల్(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం గురువారం సామూహిక వివాహాలతో కళకళలాడింది. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 47 జంటలు ఒకే ముహూర్తానికి ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి. వరుడు తలవంచితే.. వధువు మూడు ముళ్లు వేసింది. చదవండి: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్టైం రికార్డు -
భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఒకరికొకరికి తెలియకుండా రెండు వివాహాలు చేసుకున్న ఓ డాన్సర్పై ఇద్దరు భార్యలు శుక్రవారం మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం శెట్టిబలిజ వీధికి చెందిన సుమంత్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాన్సర్. స్టేజ్ ప్రోగ్రామ్లలో పాల్గొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరిలోవకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడంతో కొంత కాలం కిందట పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమంత్కు విజయవాడ ప్రాంతానికి చెందిన మరో యువతి పరిచయమైంది. ఆమెను పది రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికే సుమంత్కు పెళ్లయిన సంగతి విజయవాడ యువతికి తెలియదు. అలాగే విజయవాడ యువతితో ఇటీవల పెళ్లి జరిగిందన్న విషయం ఆరిలోవ బాలికకు తెలియదు. చివరకు ఈ విషయాన్ని ఇతర స్నేహితుల ద్వారా గురువారం తెలుసుకున్న మైనర్ బాలిక, విజయవాడ అమ్మాయి లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయింత్రం మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి వద్ద వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. (చదవండి: పోలీసు ఇంటికే కన్నం) -
ముందులా కాదు.. ట్రెండ్ మారింది, ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది
సాక్షి,రాజాం(శ్రీకాకుళం): ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది. ఐదేళ్ల కిందటకు ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటి వరకు అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దామనే ఆత్రుత జిల్లా ప్రజల్లో కనిపించేది. అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా గ్రామాల్లో గుట్టుగా బాల్య వివాహాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధి విధానాలు, బాలల సంరక్షణ విభాగం పటిష్ట చర్యలు, గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి, బాలికల విద్యావకాశాలు మెరుగుపడడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. బాలల సంరక్షణ విభాగం చొరవ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం చురుగ్గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ విభాగం సేవలు, నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లాయి. ప్రధానంగా భారతీయ వివాహ చట్టాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చేరవేయగలిగారు. మరో వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్లు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ద్వా రా చదువు మానేస్తున్న బాలికలను గుర్తించి వారి కి ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయడం, బాలికల సంరక్షణ వసతిగృహాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. గత పదేళ్లలో.. గత పదేళ్లుగా చూసుకుంటే బాల్య వివాహాలు 2011 కంటే ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. 2011–12లో ఏడాదికి సగటున బాల్య వివాహాల నమోదు 395గా ఉండేది. 2018–20 మధ్య కాలంలో ఏడాదికి 163 నుంచి 128కి తగ్గుముఖం పట్టాయి. 2021–22 ఏడాదిలో ఈ వివాహాలు 54కి నమోదు కాగా, ఈ ఏడాదిలో ఈ మొత్తం బాల్య వివాహాలను బాలల సంరక్షణ విభాగం అడ్డుకోగలిగింది. (చదవండి: Scolded Drinking Habit: తమ్ముడి నిర్వాకం...సొంత అక్కపైనే అఘాయిత్యం ) పెరిగిన విద్యావకాశాలు.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు గ్రామాల్లో విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైఎస్సార్ సీపీ వచ్చాక పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చెందాయి. గతంలో పదో తరగతి వరకూ మాత్రమే ఆడపిల్లల చదువులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో, బీ ఫార్మసీ వంటి కోర్సుల వైపు బాలికలు దృష్టి సారిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఉద్యోగ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాగా, ఆయా ఉద్యోగాలు పొందిన బాలికలు మిగిలినవారికి మార్గదర్శులుగా మారారు. చట్టం ఏం చెబుతోంది..? భారతీయ వివాహ చట్టం 1955 ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వివాహ వయస్సు ఉండాలని 2006లో భారతీయ వివాహ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ మార్పుచేసింది. ఫలితంగా ఇప్పుడు అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కాదని బాల్య వివాహాలు నిర్వహిస్తే రెండు కుటుంబాలపైన చట్టపరమైన చర్యలు తప్పవు. గత పదేళ్లలో జిల్లాలో 1120 బాల్య వివాహాల ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో 1112 పెళ్లిళ్లను అధికారులు నిలుపుదల చేసి, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొండికేసి బలవంతంగా పెళ్లి జరిపిన 8 కుటుంబాలపై కఠిన చర్యలు చేపట్టారు. అవగాహన పెరిగింది బాల్య వివాహాలు చేయకూడదనే విషయం ప్రజలకు తెలిసింది. ప్రతి రోజు మేం చేస్తున్న కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రధానంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. వీటిపై ప్రజల్లో అవగాహన రావడంతో బాల్య వివాహాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, విద్యావకాశాలు మెరుగుపర్చడం వంటి వాటి ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. – కేవీ రమణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, శ్రీకాకుళం -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్అండ్బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లి కొడుకు
పెద్దతిప్పసముద్రం: ఆయన తెలుగుదేశం పార్టీ నేత. పార్టీలో అత్యంత క్రియశీలకంగా వ్యవహరిస్తుంటాడు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే ఆయన నిత్య పెళ్లికొడుకన్న విషయం తాజాగా బయటపడింది. డబ్బున్న యువతులకు వల వేసి ప్రేమ పేరుతో వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ బాగోతాన్ని మూడో భార్య కనిపెట్టింది. రెండో భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటకు చెందిన దండుపల్లి వెంకటరమణ కుమారుడు మంజునాథ్. బెంగళూరులో కాంక్రీట్ మిల్లర్లు అద్దెకు ఇస్తుంటాడు. కొంత డబ్బు పోగేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం మదనపల్లి సమీపంలోని అంగళ్లులో రజనీ అనే యువతిని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక వదిలేశాడు. అనంతరం బెంగళూరు వెళ్లిపోయాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మ్యారేజ్ బ్యూరో ద్వారా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన ఆశా అనే యువతిని ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఐదేళ్ల పునీతశ్రీ అనే పాప కూడా ఉంది. అనంతరం అదనపు కట్నం పేరిట వేధించి ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలతో పరారయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ధావణగెరేకు చెందిన ప్రియాంక అనే యువతిని వల్లో వేసుకున్నాడు. వంద గ్రాముల బంగారం, రూ.5 లక్షలు కట్నంగా తీసుకుని ఇరు కుటుంబీకుల సమక్షంలో మూడేళ్ల కిందట ధర్మస్థలంలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి పంపగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. కట్నం కోసం వేధింపులు ఇదే అదనుగా భావించిన ఆ నిత్య పెళ్లి కొడుకు హుటాహుటిన బెంగళూరులో ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇల్లు ఎందుకు ఖాళీ చేశావని ఫోన్ ద్వారా భార్య ప్రియాంక ప్రశ్నించగా.. ఇక్కడే కాపురం చేద్దాం.. వచ్చేయ్ అని చెప్పడంతో ఆమె ఏడాది కిందట పాపతో సహా అత్తారింటికి చేరుకుంది. అయితే ఆరు నెలలుగా భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే ఈ ప్రబుద్ధుడి వ్యవహారం ప్రియాంక తెలుసుకుంది. ఆమెకు రెండో భార్య ఆశా కూడా తోడైంది. దీంతో వారు పెద్దతిప్పసముద్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మధురామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. అయితే వీరు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఆధార్, రేషన్ కార్డు తదితర ఎలాంటి ఆధారాలూ లేనందున కర్ణాటక రాష్ట్రంలో ఫిర్యాదు చేయాలంటూ వారిని వెనక్కి పంపినట్టు ఎస్ఐ చెప్పారు. -
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
పెళ్లి వేడుకలపై కరోనా మహమ్మారి ప్రభావం
-
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది
చెన్నై: ప్రస్తుతం సమాజంలో వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతోంది. భారతదేశ కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్ని ప్రశంసిస్తుంటే దానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా జంటలు విడిపోయి కుటుంబ వ్యవస్థకు అర్థం లేకుండా చేయడం అత్యంత బాధాకరం. ఒక వేళ వాళ్లకు పిల్లలు లేకపోతే సరే కానీ ఉంటే వారి పరిస్థితి గురించి ఇక చెప్పవల్సిన అవసరం లేదు. కానీ చెన్నైలోని ఒక జంట విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డనే విక్రయించిన ఒక ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. (చదవండి: హక్కుల భంగం.. ఇదా మీ తీరు?) వివరాల్లోకెళ్లితే చెన్నైలోని విరుధునగర్ జిల్లాకు చెందిన జెబమలార్(28) అనే ఆమెకు అదే జిల్లాకు చెందిన ఆర్ మణికందన్(38)తో 2019లో వివాహం జరిగింది. కొద్ది నెలలకు తమ వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఇద్దరు విడిపోయారు. పైగా వారికి తోమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో జెబమలార్ తన బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పునర్వివాహం చేయాలనకున్నారు, కానీ దీనికి ఆమె కొడుకు(9 నెలలు) అడ్డుగా ఉన్నాడని ఆ పసికందుని అమ్మేయాలని ఆమె, ఆమె తల్లిదండడ్రులు, సెల్వరాజ్, కురిబా, సోదరుడు ఆంటోని, మామా డానియెల్ భావించారు. దీంతో ఇద్దరూ బ్రోకర్లు కార్తికేయన్, జేసుదాసుని సంప్రదించారు. ఈ మేరకు ఆమె భర్త మణికందన్కి ఈ విషయాలు ఏమి తెలియదు. అయితే పిల్లలు లేని ఒక జంట సెల్వమణి, అతని భార్య శ్రీదేవి దంపతులకు ఆ బాబును రూ. 3 లక్షలకు అమ్మేశారు. ఈ మేరకు మణికందన్ తన బిడ్డ కోసం జెబమలార్ దగ్గరకు వెళ్తే బిడ్డ లేదు. దీంతో మణికందన్ అనుమానంతో పోలీసులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ పిల్లడిని కొనుగోలు చేసిన దంపతులను, మీడియేటర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ పసికందు తల్లి జెబమలార్ ఆమె సంబంధికులు పరారీలో ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఒక జంట తమ పెద్ద కూతురి(16) వైద్య చికిత్స నిమిత్తం తమ 12 ఏళ్ల చిన్న కూతురిని తమ పొరుగువారికి విక్రయించిన సంఘటన మరిచిపోకముందే ఈ ఘటన జరగడం బాధాకరం. (చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ) -
8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!
చండీగఢ్: పెళ్లి కావాల్సిన యువకులు.. విడాకులతో ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకుంటుంది. వారిని పెళ్లి చేసుకుంటుంది. పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయదు. ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుంటుంది. ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలుగా చేసుకుని మోసం చేసింది. ఇది ఇలా ఉండగా ఆ 8 మంది భర్తలకు మరో టెన్షన్ వచ్చి పడింది. ఆ మహిళకు ఎయిడ్స్ సోకింది. దీంతో తమకు కూడా సోకిందేమో ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హరియాణా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నాలుగేళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మోసాలకు పాల్పడడం ప్రారంభించింది. హరియాణతోపాటు పక్కనే ఉన్న పంజాబ్లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం భార్యలను కోల్పోయిన వారిని, బ్రహ్మచారులే. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. ఏ గుడిలోనూ.. లేదా మరోచోటను నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె తన డ్రామా మొదలుపెడుతుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. అనంతరం విడాకులు కోరుతుంది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఈ విధంగా రూ.లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని ఆమె వివాహం చేసుకుంది. ఈమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు. 9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవీ ఎయిడ్స్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని షాక్కు గురయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు. -
శ్రావణ మాసం: ఒకే రోజు 300 పెళ్లిళ్లు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది. గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు. -
వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..
ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్టాప్గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు. నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు. పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్(ఫైల్) కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా.. ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు. మా ఆచారాన్ని మర్చిపోం ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. – భాను ప్రసాద్, అనంతపల్లి సంప్రదాయాన్ని గౌరవించాలి భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. – డాక్టర్ మానస, పోతవరం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. – గన్నమని రాము, పోతవరం సంతానం నిలవడం కోసం.. గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు. – రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి -
Aamir Khan Divorce: తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!
శుభాకాంక్షలు ఆమిర్... ఫాతిమా... ఈ బంధం అయినా సుదీర్ఘంగా సాగాలి! తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!! మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కానీ.. ఏ మాత్రం పర్ఫెక్ట్ కాదు!! ‘సత్యమేవ జయతే’కి హోస్ట్ చేశాడు... కానీ ఫాతిమా కోసం కిరణ్ని వదిలేశాడు!! ఫస్ట్ రీనా.. సెకండ్ కిరణ్... ఫాతిమా నం. 3 !! ...గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే. ‘మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం’ అని ఆమిర్ ఖాన్, కిరణ్ రావు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఊహల్లో ఉన్న పేరు ‘ఫాతిమా సనా షేక్’. కిరణ్, ఆమిర్; ఫాతిమా, ఆమిర్ ‘దంగల్’ (2016)లో ఆమిర్కి కూతురిగా నటించింది ఫాతిమా. ఆ తర్వాత ఆమిర్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (2018) లోనూ నటించింది. ఈ సినిమాలు పూర్తయ్యాక కూడా ఆమిర్, ఫాతిమా టచ్లోనే ఉంటున్నారని బాలీవుడ్ కథనం. అవార్డు వేడుకలకు, పెద్దింటి ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆమిర్ ఇంటికి ఫాతిమా రాకపోకలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ‘కుఛ్ కుఛ్ హో రహా హై?’ (ఏదో ఏదో జరుగుతోంది) అనే వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో ఆ వార్తలను ఫాతిమా ఖండించింది కూడా. ‘‘ఇలాంటివి ఎదుర్కోవడం నాకస్సలు అలవాటు లేదు. నేను ఎప్పుడూ కలవని అపరిచితులు నా గురించి ఏదేదో రాస్తున్నారు. నిజమేంటో వాళ్లకు తెలియదు. అయితే ఆవి చదివినవాళ్లు మాత్రం నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా రాయాలంటే, నన్నే అడిగితే చెబుతాను కదా. నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించుకోవడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలను విస్మరించడం నేర్చుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. అప్పుడు అలా స్పందించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆమిర్కి రీల్ లైఫ్లో కూతురు... రియల్ లైఫ్లో భార్య’ అనే విమర్శలు వినిపిస్తున్నా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ‘మౌనంగా ఉందంటే అవుననే కదా’ అని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అయితే ఆమిర్–ఫాతిమా మధ్య ఏం ఉందో తెలియకుండా దారుణంగా విమర్శించడం సరి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ విమర్శిస్తున్నవారిలో కొందరు మాత్రం ‘భావప్రకటన స్వేచ్ఛ’ను తెరపైకి తెచ్చారు. దానికి ఆమిర్–కిరణ్లను కారణంగా చెబుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో ఆమిర్ మాట్లాడుతూ – ‘‘దేశంలో జరుగుతున్న అల్లర్లు సహించలేనివిగా ఉన్నాయి. అభద్రతా భావం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం పిల్లలకు క్షేమం కాదు.దేశం వదిలి వెళ్లిపోదామా అని నా భార్య కిరణ్ భయం వ్యక్తం చేసింది’’ అనడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమిర్–కిరణ్ విడాకుల వ్యవహారం నేపథ్యంలో.. దేశం పట్ల ఆమిర్కి ఏమాత్రం గౌరవం లేదని, అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాడని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. ‘‘మాకు కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మేం కూడా మా అభిప్రాయాలను చెబుతున్నాం. ఈ విషయంలో నువ్వు.. కిరణ్.. నీ ప్రియురాలు (ఫాతిమా) మమ్మల్ని ఏమీ చేయలేరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ ఆమిర్కి తెలియనిది కాదు. కానీ మౌనం వహించారు. మరి.. విమర్శలకు గురవుతున్న ఆమిర్–ఫాతిమా నోరు విప్పితేనే చాలామంది నోళ్లు మూతబడే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచి.. 56 ఏళ్ల ఆమిర్, 29 ఏళ్ల ఫాతిమా మధ్య నిజంగానే ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వీరిది మూడు ముడుల బంధం గా మారుతుందా? అనేది కాలమే చెప్పాలి. విఫలమైన వివాహబంధాలు హిందీ పరిశ్రమలో విఫలమైన వివాహ బంధాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు... ► బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి 1991లో సీమా కపూర్ను వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలకే వీరు విడాకులు తీసుకుని వేరయ్యారు. ఆ నెక్ట్స్ ‘అన్లైక్లీ హీరో: ద స్టోరీ ఆఫ్ ఓంపురి’ అంటూ తన బయోగ్రఫీ రాసిన జర్నలిస్టు నందితా పురిని 1993లో వివాహం చేసుకున్నారు ఓంపురి. అయితే పెళ్లి చేసుకున్న పదేళ్లకు ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు. ► నటి పూజా భట్, మనీష్ మఖీజా 2003లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ఓంపురి, నందిత; సైఫ్, అమృత ► అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్తో మలైకా ప్రేమలో ఉన్నారని టాక్. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోనున్నారట. ► కరిష్మా కపూర్, అజయ్ దేవగణ్ లవర్స్ అని గతంలో బాలీవుడ్ కోడై కూసింది. తర్వాత ఇద్దరి మనసుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్తో 2002లో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి జరగలేదు. 2003లో వ్యాపారవేత్త సంజయ్ని పెళ్లాడారు కరిష్మా. 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. 2016కి విడాకులు మంజూరయ్యాయి. ► నటుడు సైఫ్ అలీఖాన్ 1993లో నటి అమృతా సింగ్ను పెళ్లాడారు. 2004లో ఇద్దరూ విడిపోయారు. 2012లో హీరోయిన్ కరీనా కపూర్తో సైఫ్ ఏడడుగులు వేశారు. ఇంకా హిందీ పరిశ్రమలో ఏడడుగులు వేసి, ఆ తర్వాత విడిపోయిన వారిలో నటుడు యాక్టర్, డైరెక్టర్ ఫర్హాన్– హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీ, రణ్వీర్ షోరే–కొంకణా సేన్ శర్మ, అనురాగ్ కశ్యప్– కల్కీ కొచ్లిన్ తదితరులు ఉన్నారు. మలైకా, అర్బాజ్; హృతిక్, సుజానె; కరిష్మా, సంజయ్ హృతిక్ రోషన్కి 26 ఏళ్లకే పెళ్లయింది. 2000లో సుజానే ఖాన్ని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడివిడిగా ఉండటం ఆరంభించిన హృతిక్–సుజానేలకు 2014లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలిద్దరూ తల్లి, తండ్రి దగ్గర ఉంటుంటారు. భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లల బర్త్డేలు కలిసి చేస్తూ, కలిసి హాలిడే ట్రిప్లకు వెళుతూ తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
పడవలో మూడు ముళ్లు, ఏడు అడుగులు
వెబ్డెస్క్ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. న్యూ బిజినెస్ అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్కి డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి : Tesla: భారత్లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
వైరల్ వీడియో: 28మంది భార్యలముందు 37వ సారి పెళ్లి
-
28 మంది భార్యల ముందు 37వ సారి పెళ్లి
పూర్వం రాజులు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వారని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం. రాజులు, రాజ్యాలు పోయినా పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు నేటికీ అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నారు. సాటి మగాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్కి చెందిన ఓ పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో ఘనంగా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘జీవించి ఉన్న అత్యంత ధైర్య వంతుడు.. 28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో 37వ పెళ్లి’’ అనే శీర్షికను ఆయన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఒక్క భార్యతోనే వేగలేక చస్తుంటే నువ్వేంటి పెద్దాయన’’.. ‘‘నేనిప్పటి వరకు ఒక్క పెళ్లి చేసుకోవటానికే భయపడి చస్తున్నాను.. నువ్వు మాత్రం 37 పెళ్లిళ్లు చేసుకున్నావు’’... ‘‘ఇది చూస్తే సింగిల్స్ చచ్చిపోతారు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
Corona Tragedy: ఫొటో, వీడియోగ్రాఫర్ల బతుకులు ఆగం
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్ చీకట్లు నింపింది. పెళ్లిళ్ల సీజన్లో వీడియోగ్రాఫర్లు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుని మిగతా సమయాల్లో ఎలాగోలా కాలం వెల్లదీస్తారు. అలాంటిది కరోనా అడ్డంకులు, ఆంక్షలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లిళ్ల గిరాకీ రాకపోవడం, మామూలు ఫొటోలు ఎవరూ దిగకపోవడం, లాక్డౌన్తో షాపులు తెరుచుకోకపోవడంతో అటు ఉపాధి కరువై ఇటు షాపుల అద్దె చెల్లించలేక, పూటగడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్(కరీంనగర్): కరోనా ప్రభావం అన్ని వర్గాలవారిపై ప్రభావం చూపిస్తోంది. ఫొటోగ్రాఫర్ వృత్తిపై సైతం ఎక్కువగానే ఉంది. స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న వారికంటే పెద్ద కెమెరాలు కొనుగోలు చేసి పెళ్లిళ్ల సీజన్లో పని చేసే ఫొటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గతంలో వలె ఆర్భాటంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు పని తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది. తగ్గిన డిమాండ్.. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు సైతం మమ అన్నట్లుగా చేస్తుండటం, పెళ్లిళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో పెళ్లివారు ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో గతంలో కంటే ఒక్కో పెళ్లి ఆర్డర్లో 50 శాతం రేట్లు తగ్గించినా గిరాకీలు రావడం లేదని వాపోతున్నారు. సీజన్ ఫొటోగ్రఫీ చేసేవారు కొందరు కిస్తీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో స్టూడియో ఉన్నవారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటు ఆర్డర్లు లేక, అటు కిరాయిలు కట్టలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి పెళ్లిళ్ల సీజన్లో లాక్డౌన్ ఆంక్షలతో వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ సెషన్స్ లేదు. ఇరుపక్షాల నుంచి ఒక్కరితోనే ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక పెళ్లికి దాదాపు ఐదారుగురికి పని దొరికేది. ఇప్పుడు అన్ని ఒక్కడై ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండడంతో మిగతావారికి పని లేకుండా పో యింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. – ఆవుల నరేశ్, తారిక ఫొటో స్టూడియో, కరీంనగర్ ఫోన్లతో తీసుకుంటున్నారు కరోనా మహమ్మారితో ఎక్కువ మందిని పెళ్లిళ్లు, శుభాకార్యాలకు పిలవడం లేదు. 20, 30 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కొంత మంది సెల్ఫోన్లలోనే ఫొటోలు తీసుకుంటున్నారు. రిసెప్షన్ వంటివి లేకుండా పోయాయి. అన్ని ఒక్కరోజు, ఒక్క దగ్గరే జరిపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో పని లేకుండా పోయిందని వీడియో, ఫొటోగ్రాఫర్లు బాధపడుతుంటే మరోపక్క కరోనా మా బతుకులను వీధిన పడేసింది. – నకిరేకొమ్ముల శ్రీనాథ్, వీడియోగ్రాఫర్, కరీంనగర్ బతుకులు రోడ్డునపడ్డాయి.. కరోనాతో గతేడాదిగా ఉపాధి కరువైంది. ఈ పెళ్లిళ్ల సీజన్పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సీజన్లో కొన్ని పెళ్లిళ్లకు అడ్వాన్స్ తీసుకున్నాం. కరోనా సెకండ్వేవ్తో పెళ్లి ఊరేగింపులు లేవు, హంగామా లేదు. అంతా సాదాసీదాగా చేస్తున్నారు. దీంతో ఎవరికీ పని లేకకుండా పోయింది. మామూలు రోజుల్లో ఒక్క పెళ్లి ద్వారా 100 మందికి ఉపాధి దొరికేది. క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఇలా.. ప్రస్తుతం అందరి బతుకులు రోడ్డునపడ్డాయి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్ కరీంనగర్ పోషణ కష్టమవుతోంది కరోనాతో గిరాకీ లేక కుటుంబ పోషణ కష్టమవుతుంది. పెళ్లిళ్లు జరుగుతున్నా ఒక్కరికే అవకాశం ఇస్తున్నారు. తక్కువ మందితో కార్యాన్ని కానిస్తున్నారు. కరోనాకు ముందు ఒక పెళ్లికి దాదాపు ఫొటో, వీడియోకు లక్ష రూపాయల వరకు బడ్జెట్ కేటాయించే వారు. ఇప్పుడు కేవలం పెళ్లి ఫొటోలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో అందరికీ ఉపాధి లభించడం లేదు. – బద్దరి వంశీ, వీడియోగ్రాఫర్, కరీంనగర్ చదవండి: Telangana: లాక్డౌన్ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం
సిరిసిల్ల కల్చరల్: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్లు, శానిటైజర్లు చేరిపోయాయి. పెళ్లికి రాలేమండి.. కోవిడ్ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు.. మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్హాళ్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్ చేసుకున్నవారు అడ్వాన్స్లు వాపస్ ఇవ్వాలని ఫంక్షన్హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు. -
లాక్డౌన్ లగ్గం; అరే ప్రనీత్.. ఎవర్రా ఆ అమ్మాయి..!
సాక్షి, నిర్మల్: ‘అరే ప్రనీత్.. ఎవర్రా ఆ అమ్మాయి. పొద్దున బండిపైన ఎక్కించుకుని తీసుకెళ్తున్నవ్. కొత్త బట్టలున్నయ్. చేతులకు దారాలు కట్టుకున్నవ్. ఏందిరా సంగతి..!’ అసలు విషయం తెలియక వరుసకు మామ అడిగిన ప్రశ్నకు ఆ అల్లుడు తల దించుకున్నాడు. ‘ఏం లేదు మామా.. మొన్న నా పెళ్లయిందే. గీ కరోనా చేసుట్ల, లాక్డౌన్ పెట్టుట్ల ఎవళ్లకు చెప్పలేదే. మనకాడికెళ్లి పెద్దనాన్న, చిననాన్నలు, మేనమామలు, అత్తలు, పిల్లలు అంత కలిపి 25మందిమే పోయినం. మా అత్తగారింటి ముందటనే పెండ్లి చేసిండ్రు. పిల్లకాడికెళ్లి కూడా 30మందే ఉన్నరు. ఏమనుకోకు మామ. లాక్డౌన్ చేసుట్ల మస్తుమందికి చెప్పలేదే. కరోనా తగ్గినంక పెద్ద దావత్ ఇస్తనే..’ అని చెప్పాడు. దీంతో దగ్గరి బంధువైన తనకే చెప్పకుండా పెళ్లి జరగడంపై ఆ మామ అవాక్కయ్యాడు. ఈ మధ్య.. ఇలా.. చాలా పెళ్లిళ్లే జరుగుతున్నాయి. బంధుమిత్రుల మాట దేవుడెరుగు.. కనీసం పక్కింటోళ్లకు కూడా తెలియకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పెళ్లిళ్లు చిన్నపాటి గొడవలకు, అలకలకూ దారితీస్తున్నాయి. పెళ్లి గురించి వాళ్లకు చెప్పి.. తమకు చెప్పరా.. అంటూ దగ్గరి బంధువులు గొడవ పడుతున్నారు. అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సందడి మధ్య జరగాల్సిన వివాహాలు చడీచప్పుడు లేకుండానే ముగిసిపోతున్నాయి. ‘ఇదేం కరోనారా నాయన.. మా పెళ్లిని ఇట్ల చేసింది..’ అంటూ చాలామంది వధూవరులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో.. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న మూడుముళ్ల వేడుక కాస్త గుట్టుగా సాగడంతో నిట్టూరుస్తున్నారు. కరోనా కారణంగా.. జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కుమారుడి పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు కల్యాణం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు.. పెళ్లితో పాటు రిసెప్షన్ పార్టీ కూడా తామే ఇవ్వాలని, ఆ ప్రకారం ఫంక్షన్హాల్, గార్డెన్ రెండింటినీ మూణ్ణెళ్ల ముందే బుక్ చేశారు. పెళ్లి పత్రికలనూ హైదరాబాద్ నుంచి తెప్పించి ముద్రించారు. వధూవరులతో పాటు ఇంటిల్లిపాదికీ హైదరాబాద్లో షాపింగ్ చేశారు. విందులు, వంటకాల కోసం వంట సామగ్రి కూడా ముందే తెచ్చేసుకున్నారు. ఇక మరో పదిరోజుల్లో పెళ్లి ఉందనగా.. కరోనా తీవ్రత పెరుగుతూ పోయింది. తమ దగ్గరి బంధువులే కోవిడ్ బారిన పడ్డారు. చేసేది లేక.. వివాహాన్ని ఒక నెల వాయిదా వేసుకున్నారు. నెల గడిచిపోయింది. కానీ.. కరోనా తగ్గలేదు కదా.. పైనుంచి లాక్డౌన్ పడింది. దీంతో ఏంచేయాలో పాలుపోలేదు. మళ్లీ వాయిదా వేద్దామంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానం. దీంతో ఫంక్షన్హాల్, గార్డెన్, వంటలు, డెకరేషన్, బ్యాండ్, డీజే.. ఇలా అన్నీ క్యాన్సిల్ చేశారు. ఇంటి ముందే రోడ్డుపై చిన్న టెంటు వేసి దగ్గరి బంధుమిత్రులు అంతా కలిపి ఓ 50మందితో పెళ్లితంతు ముగించేశారు. ఇలా జిల్లాలో చాలా కల్యాణాలు ఇప్పుడు ఇలాగే మమ.. అన్నట్లుగా సాగుతున్నాయి. నిట్టూరుస్తూనే.. పెళ్లంటే.. జీవితంలో ఓ పెద్దఘట్టం. ప్రతీ మనిషి త న జీవిత భాగస్వామిని పొందే తరుణం. ఇలాంటి వేడుకను అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సాక్షిగా చేసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులూ తమ పిల్లల పెళ్లిళ్లను తమ స్థాయికి తగ్గట్లు చేయాలని ఆశి స్తారు. ఇక కొత్త జంట ఎన్నో ఆశలతో, కలలతో పెళ్లి కి సిద్ధమవుతుంది. కానీ.. కరోనా వీటన్నింటికి దెబ్బ కొట్టింది. అసలు ‘ఇప్పుడు పెళ్లి అవసరమా..’ అనే వరకూ తెచ్చింది. ‘సరే.. ఎలాగోలా చేసేద్దాం’ అనేలా తయారైంది. మెహందీ, సంగీత్, హల్దీ, పందిరి.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో నాలుగైదు రోజుల పా టు సాగాల్సిన సంబురాలన్నీ రద్దయిపోయాయి. నే రుగా మూడుముళ్ల కార్యక్రమమే కానిచ్చేస్తున్నారు. ఎంతో ఆశలు పెట్టుకున్న తమ పెళ్లి ఇలా ముగిసిపోవడంతో చాలా జంటలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్లోనే.. ‘అరె.. సునీల్గాడు పెళ్లి చేసుకున్నడురా.. ఇగో ఇటు చూడు స్టేటస్ పెట్టిండు..’ అని మిత్రులు కూడా అ వాక్కయ్యే పరిస్థితి. పెళ్లిపత్రికలను పంచడం కూడా చేయడం లేదు. ఆచారం ప్రకారం ఐదారు పత్రికలను ముద్రిస్తున్నారు. వాటినే ఫొటోలు తీసి, సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. ప్రస్తుత కరోనా, లాక్డౌన్ పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నామని, ఇందుకు మన్నించి వివాహ వేడుకకు హాజరు కావాలంటూ.. ఏదో మాటవరుసకు చెప్పిన ట్లు మెసేజ్ పెట్టేస్తున్నారు. ఇక కొంతమంది వివాహా వేడుకను ఆన్లైన్ ద్వారా తమ బంధుమిత్రులకు చూపుతున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలను సోష ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఆయా మాధ్యమాల్లోనే తమను ఆశీర్వదించండంటూ కొత్తజంటలు ఫొటోలు పెట్టడమూ కనిపిస్తోంది. పొట్ట కొడుతోంది... పెళ్లంటే.. రెండిళ్ల సంబురమే కాదు. ఎన్నో కుటుంబాలకూ ఉపాధినిచ్చే కార్యక్రమం. గత ఏడాది నుంచి శుభకార్యాల ద్వారా వచ్చే ఉపాధిపై కరోనా దెబ్బకొడుతోంది. ఫంక్షన్హాళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఫొటోగ్రాఫర్ల దాకా ఎంతోమంది పొట్టకొట్టింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్హాల్లలో చిన్నపాటి పనులు చేసి పొట్టపోసుకునే నిరుపేదలనూ పస్తులు ఉంచుతోంది. పెళ్లిళ్లు చేసేవారికి ఖర్చులు తగ్గిస్తున్నా.. వేడుకలనే నమ్ముకున్నవారికి చేతులు ఆడకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి కేవలం పెళ్లింట్లో కల్యాణ వైభవాన్నే కాదు.. ఆ వేడుకపై ఆధారపడ్డ ఫంక్షన్హాళ్లు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు, డీజే, లైటింగ్, డెకరేషన్, వంటవాళ్లు, వేడుకలు పనిచేసే కూలీలు.. ఇలా ఎన్నో కుటుంబాల్లో కళ తప్పేలా చేస్తోంది. చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ! -
కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ!
సాక్షి, శ్రీకాకుళం: కోవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలు, వివాహాలు చేసుకోవాలంటే కేవలం 20 మందితో మాత్రమే జరుపుకోవాలని, అంతకంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, వైద్య అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వేడుకలు జరిగే స్థలాలను తహసీల్దార్ తనిఖీ చేస్తారని తెలిపారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, హొటల్స్, రెస్టారెంట్లు తెరవాలని, 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూదని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఉన్నాయని తెలిపారు. వ్యవసా య పనులు, పంటల సేకరణకు కూడా మినహాయింపు ఉందన్నారు. జనం ఈ కర్ఫ్యూకు సహకరిస్తే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవ కాశం ఉందన్నారు. రెండు వారాల తర్వాత జిల్లాలో ఒక్క కేసు కూడా ఉండకుండా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇష్టానుసారంగా తిరిగేవారిని అరెస్టు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు ఉన్నారు. అత్యవసరమైతే.. ప్రభుత్వ అనుమతి సర్వీసులు, అత్యవసర సేవలకు కర్ఫ్యూ సమయంలో మినహాయింపు కోసం పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 94944 66406ను వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాదరావును నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అనంతపురం: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేస్తునట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. వివాహ వేడుకలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, వేడుకకు హాజరయ్యే వారి పేర్లను తహసీల్దారకు సమర్పించాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాలను తహసీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తారన్నారు. ఇక ఉదయం 6 నుంచి 12 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అవుతుందన్నారు. అంతర్ రాష్ట్ర, జిల్లా లోపల, వెలుపల వాహనాలు తిరగరాదన్నారు. అత్యవసర వైద్యసేవలు లేదా ఇతరాత్ర అత్యవసరాలకు మినహాయింపు ఉంటుందన్నారు. రైలు రవాణా వ్యవస్థ ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్ వద్ద అటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు. చదవండి: స్టాలిన్కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ -
కరోనా ఎఫెక్ట్ : లైవ్లో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంధువులు, స్నేహితులందరి మధ్య వైభవోపేతంగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు లైవ్ షోల ద్వారా జరుగుతుండటంతో బంధువులు కూడా ఆన్ లైన్ లోనే దీవెనలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బెక్కల్ గ్రామానికి చెందిన చౌదరి వెంకటమ్మ–కనకయ్య దంపతుల కూతురు ఆమనికి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీలా నిర్మల – మల్లేశం దంపతుల కుమారుడు జీలా అనిల్ (మై విలేజ్ ఫేం)తో వివాహం నిర్ణయించారు. మండల పరిధిలోని బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం కేవలం 30 మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ వివాహాన్ని ఆన్ లైన్ లో ద్వారా లైవ్ ఇవ్వగా... బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారానే కొత్తజంటను ఆశీర్వదించారు. కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్లు, శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ వివాహానికి హాజరయ్యారు. చదవండి: వైరల్గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక -
వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు
అగర్తల: దేశంలో కరోనా విజృంభిస్తూ వీర విహారం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలకు జరుపుకునే విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే ప్రజలు వేడుకలు జరుపుకోవాలని స్పష్టంగా చేప్తున్నాయి. అయితే ఎవరు ఎంత చెప్తున్నా కొందరు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా కేసులు పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే త్రిపురలోని రెండు కుటుంబాలు వారి పెళ్లి వేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహంతో జరపుకున్నారు. కోవిడ్ నిబంధనలు మరిచి పెళ్లి వేడుకలను చేసుకుంటున్న ఆ జంటలపై వెస్ట్ త్రిపుర కలెక్టర్ అడ్డుకుని వారిపై కేసులను నమోదు చేశారు. ఏ ముహూర్తాన పెళ్లి పెట్టుకున్నారో గానీ.. మండపంలోనే ఆ జంటలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర గేట్ ప్రాంతంలోని ప్యాలెస్ కాంపౌండ్లో గులాబ్ బాగన్, మాణిక్య కోర్టు అనే రెండు వివాహ మండపాల్లో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా అక్కడికి వెళ్లారు. అక్కడ నిబంధనలకు గాలికి వదిలేసినట్లు కనిపించడంతో సిబ్బంది సాయంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పెళ్లి నిర్వాహకులపైనే కాక వధూవరులు వారి కుటుంబ సభ్యులతో సహా అనేక మందిని అరెస్టు చేయాలని ఆ కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోరా అంటూ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కల్యాణ మండపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సంవత్సరానికి పైగా నిషేధం విధించారు. ప్రస్తుతం ఈ కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ( చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ ) -
కరోనా సెకండ్వేవ్ ప్రభావం; తగ్గిన పెళ్లిళ్లు
-
సెకండ్ వేవ్: లగ్గాలపై కరోనా పగ్గాలు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డా రు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. 29 నుంచి జూలై 4 వరకు ముహూర్తాలు.. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్డౌన్, అనంతరం అన్లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి.. ఎంత మందిని పిలవా లి.. ఎంత మందికి భోజనాలు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. వస్త్ర వ్యాపారులు ఖాళీగా కూర్చునే పరిస్థితి.. వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్నాయి. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియ డం లేదని వ్యాపారులు అంటున్నారు. రవాణా వ్యవస్థపై ప్రభావం.. శుభకార్యాల వల్ల ఆర్టీసీతోపాటు పలు ప్రైవేట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్టీసీ అద్దె బస్సుల చార్జీలను ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఆదాయం అంతగా రావడం లేదు. ప్రైవేటులో ఒక్కో వాహనానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సుమారు 5 వేల వరకు ఉంటాయి. వీటిపై ఆధారపడిన వాహన యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధికి సెకండ్ వేవ్తో గండి పడింది. మూగబోనున్న బ్యాండ్ మేళం.. గృహప్రవేశాలు, వివాహాల్లో బ్యాండ్ మేళం అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక్కో శుభకార్యానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో టీంలో నలుగురి నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాండ్ మేళం మూగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెకరేషన్ వారిదీ ఇదే పరిస్థితి.. శుభకార్యాల్లో డెకరేషన్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ఇందుకోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. కరోనాతో ఈ రంగంపై ఆధారపడి బతికేవా రు ఉపాధి కోల్పోనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేల మందిపై సెకండ్ వేవ్ ప్రభావం పడనుంది. వంటవాళ్లకు గడ్డు పరిస్థితులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద కల్యాణ మండపాలు 100, మధ్య తరహావి 150 వరకు, సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థలకు అనుబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది శుభకార్యాల సందర్భంగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, భోజనాలు తయారు చేయిస్తుంటారు. 1,000 మందికి భోజనం వడ్డించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో 15 నుంచి 20 శాతం నిర్వాహకులకు ఆదాయంగా మిగులుతుంది. కరో నా కారణంగా వంట చేసేవాళ్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. -
పెళ్లిళ్లకు మళ్లీ కరోనా సెగ
-
ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా!
రామచంద్రపురం: పెళ్లిళ్లపై మళ్లీ కరోనా ప్రభావం పడుతోంది. రానున్న రెండు నెలల్లో బాజాబజంత్రీలు వినిపించడంపై సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది చివరి నుంచి దాదాపు మూఢం వలన ముహూర్తాలు లేవు. మే 1న మూఢం నిష్క్రమిస్తుందని ఆశ పడుతుంటే కోవిడ్–19 అశనిపాతంలా ఎదురైంది. దీంతో శుభ కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం తలెత్తుతోంది. గృహ ప్రవేశాలు చేయాలనుకునేవారు.. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారి గుండెల్లో రాయి పడింది. వీరందరూ ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని కొంత సొమ్ము వెచ్చించేశారు. ఇప్పుడేం చేయాలో వారికి పాలు పోవడం లేదు. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఒకటి రెండు నెలలు అంతరాయం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే, జూన్ నెలల్లో దివ్యమైన ముహూర్తాలు ఏటా మే, జూన్ నెలలు పెళ్లిళ్ల సీజను. ఈ రెండు నెలల్లో దివ్యమైన ముహూర్తాలు కుదరటంతో చాలామంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. మే 2 నుంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. 3, 4, 6, 8 తేదీల్లో ఎక్కువగా పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. 12 నుంచి 30వ తేదీ వరకూ మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. 13, 31 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంటున్నారు. జూన్ 1 నుంచి 13 వరకూ కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే నిశ్చితార్థాలు పూర్తి చేసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. ♦గత ఏడాది మార్చి నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా అక్టోబర్ వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు జరగలేదు. ♦తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా ప్రభుత్వ అనుమతి పొంది, పరిమిత సంఖ్యలోనే హాజరై మొక్కుబడిగా నిర్వహించారు. ♦ఈ ఏడాది ఆరంభంలో చేయాలనుకున్నా మూఢం ఎదురైంది. దీంతో మే, జూన్ నెలల్లో వివాహాలు చేసేందుకు ఎక్కువమంది ఏర్పాట్లు చేసుకున్నారు. ♦సుమారు ఆరు వేల పెళ్లిళ్ల కోసం 2 వేల కల్యాణ మంటపాలకు అడ్వాన్సు చెల్లించి, బుక్ చేసుకున్నారని అంచనా. ♦విద్యుద్దీపాలంకరణకు, భారీ సెట్టింగులు, కేటరింగ్, పురోహితులకు, బ్యాండు మేళాలకు జనవరి నెలలోనే అడ్వాన్సులిచ్చేశారు. సుమారు ఆరు వేల పెళ్లిళ్లకు రూ.10 కోట్లు పైగానే ఖర్చవుతుందని భావిస్తున్నారు. ♦అన్నవరం, ద్రాక్షారామ, సామర్లకోట దేవస్థానాల్లో అత్యధికంగా పెళ్లిళ్లు చేసేందుకు కల్యాణ మంటపాలు, గదులు బుక్ అయ్యాయని ఆలయ వర్గాలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. కలవరపెడుతున్న కరోనా తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ తుపానులా విరుచుకుపడుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. జనం కూడా పది మంది ఉన్నచోటకు వెళ్లడం లేదు. దీంతో పెళ్లిళ్ల నిర్వహణ డోలాయమానంలో పడింది. కల్యాణ మంటపాల్లో చేసేందుకు అధికారులు అనుమతించే పరిస్థితి లేదు. తెగించి చేసినా బంధువులు, స్నేహితులు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో మళ్లీ ఎన్నాళ్లు ఎదురు చూడాలో అని వధూవరుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నారు ఈ ఏడాదైనా పెళ్లిళ్ల సీజన్లో కేటరింగ్ ఎక్కువగా ఉంటుందనుకున్నాం. మే, జూన్లలో కేటరింగ్ కుదుర్చుకున్న వారు ఆ సంఖ్యను రద్దు చేసుకుంటున్నారు. వెయ్యి మందికి వడ్డన పురమాయించుకున్నవారు వంద మందికి కుదించుకుంటున్నారు. – పెట్టా శంకరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా కుకింగ్, కేటరింగ్ అసోసియేషన్, ద్రాక్షారామ ఏం చేయాలో పాలుపోవటం లేదు మా అబ్బాయి పెళ్లి మే 21న నిర్ణయించుకున్నాం. కరోనా భయంతో ఏం చేయాలో పాలు పోవటం లేదు. బంధువులు ఎక్కువ. ప్రభుత్వం వంద మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేలా లేదు. చాలా బాధగా ఉంది. – నామాల పల్లాలమ్మ, పెంకులపాటి గరువు, రావులపాలెం మండలం మే నెలంతా బుక్ చేసుకున్నారు మే నెలంతా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. వంద మంది కన్నా ఎక్కువ ఉండరాదంటున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వారు ఏం చేయాలో తెలియక వచ్చి వెళుతున్నారు. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. ఈసారీ మా పరిస్థితి బాగాలేదు. – కొండ్రెడ్డి లక్ష్మణరావు, వినయ్ దుర్గ ఫంక్షన్ హాల్ అధినేత, రామచంద్రపురం చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే.. -
కరోనా ఎఫెక్ట్: పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, ముంబై: ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణీ ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణకు సంబంధించిన పోలీసులు మార్గదర్శకాలు సూచిస్తారిన ఆయన తెలిపారు. ఆ ప్రకారం పెళ్లి తంతు పూర్తిచేసుకోవాలని కాకాణీ సూచించారు. పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఒకవేళ నియమాలు ఉల్లంఘించినట్లు వారి దృష్టికి వస్తే పెళ్లి మండపంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా, కోవిడ్ నిబంధనలు, అనుమతుల చట్రంలో ముందుగా కుదుర్చుకున్న పెళ్లిలు ఎలా నిర్వహించేదని వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెలాఖరులో శుభ ముహూర్తాలు.. ముంబై నగరంలో సెమీ లాక్డౌన్ అమలు చేయడంతో ఇదివరకే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నవారు అయోమయంలో పడిపోయారు. ఫంక్షన్ హాళ్లు బుకింగ్, డెకొరేషన్, కేటరింగ్ సర్వీసులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చారు. పెళ్లికి ఇరువైపుల నుంచి 50 మంది బంధువులు మాత్రమే హాజరుండాలనే నియమాలున్నాయి. కానీ, రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో పగలు 144 సెక్షన్, రాత్రులందు నైట్ కర్ఫ్యూ అమలు చేయడంతో ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ ఆంక్షల మధ్య పెళ్లి తంతు ఏలా పూర్తి చేయాలని వధు, వరుల తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. ఇదివరకు బీఎంసీ నుంచి అనుమతి తీసుకుని పెళ్లి తంతు పూర్తి చేసేశారు. కరోనా నియమాలు ఉల్లంఘిస్తే బీఎంసీ సిబ్బంది చర్యలు తీసుకునేవారు. కానీ, కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకోవాలని సురేశ్ కాకాణీ నిర్ధేశించారు. పోలీసులు జారీచేసిన కరోనా నియమాలకు కట్టుబడి ఉండాలి. అందులో బంధువులు కచ్చితంగా మాస్క్ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలనే నియమాలున్నాయి. వీటన్నింటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు, మళ్లీ 30వ తేదీన పెళ్లిలకు శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఈ రోజుల్లో ఎక్కువ పెళ్లిలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ఇక్కడ నిఘా వేస్తారు. ఏ మాత్రం నియమాలు ఉల్లంఘన జరిగిన అక్కడే జరిమానా లేదా చర్యలు తీసుకుంటారని కాకాణీ హెచ్చరించారు. చదవండి: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న సెకండ్వేవ్ -
హర్ దిన్ శుభ్హై.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్ను ముంబైలోని అలీబాగ్లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. హర్దిన్శుభ్హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్లాక్లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్కు తెరదీశారు. హర్దిన్శుభ్హై కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు. -
నాలుగు నెలల దాకా పెళ్లిళ్లు లేనట్టే!
సాక్షి, కదిరి: కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంతో యువత కేరింతలు కొడుతుంటే.. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని పండితులు చెబుతుండటంతో పెళ్లీడుకొచ్చిన వారిని నిరుత్సాహ పరుస్తున్నాయి. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. ఈ నెల 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14న బలమైన ముహూర్తం ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి ఈ ఏడాది మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చక స్వాములు అంటున్నారు. 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఈ ఏడాది ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢం ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజలు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లూ కోవిడ్–19 ప్రభావంతో పెళ్లిళ్లు బ్రేక్ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. రెండు మూఢాలు రావడం అరుదు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. అయితే జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కాబట్టి మంచి ముహూర్తంలో చేసుకోవడం మంచిది. – ఏవీ నరసింహాచార్యులు, ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు
జైపూర్: ఒకవైపు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్-19, లాక్డౌన్ నిబంధనలు కారణంగా ఇన్నాళ్లూ వివాహ కార్యక్రమాలకు బ్రేక్ చెప్పిన తాజాగా కల్యాణ వైభోగమే అంటూ వేలాది జంటలు పెళ్లిపీటలెక్కేందుకు రడీ అయిపోతున్నారు. దీంతో నవంబరు చివరి వారంలో రికార్డు స్థాయిలో సందడి నెలకొంది. ప్రధానంగా రాజస్థాన్ రికార్డు పెళ్ళిళ్లకు వేదికగా మారిపోయింది. ఇక్కడ నవంబర్ 30 వరకు రికార్డు సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం ఒక్క జైపూర్లో రికార్డు స్థాయిలో 4,000 వివాహాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్లో ఈ మూడు రోజులు దివ్యమైన ముహూర్తాలు (నవంబర్ 25, 27, 30తేదీలు) అత్యంత పవిత్రమైనవిగా భావిస్తున్నారు. దీంతో వివాహ కార్యక్రమాల హడావిడి జోరందుకుంది. ఫలితంగా అధికారుల్లో అందోళన నెలకొంది. అతిధులతోపాటు, వివాహ వ్యాపారంలో కీలకమైన క్యాటరింగ్, బాజా భజంత్రీలు, పూజారులు, తదితర వర్గాల వారు అధికంగా కరోనా బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు మూడు వేలకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్న తరుణంలో తాజా పరిణామం అధికారులలో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్లకు హాజరయ్యే అతిధుల సంఖ్య 100 మందికి పరిమితం చేశారు. అలాగే కచ్చితంగా మాస్క్లను ధరించడం, శానిటైజర్ల వాడకం, వివాహ వేదికలలో సామాజిక దూరం లాంటి నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 144 సెక్షన్ను విధించడంతో పాటు బారాత్లను నిషేధించామని రాజస్థాన్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కేకే శర్మ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి 10 నుంచి 25 వేల రూపాయల జరిమానా కూడా విధించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే కరోనా నిబంధనల కారణంగా చాలామంది స్నేహితులు, దగ్గరి బంధువులు కూడా వివాహ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని కొంతమంది వాపోతున్నారు. తన స్నేహితులు చాలా మంది హాజరు కాకపోవడం బాధగా ఉన్నా..ఇదే మంచిదని భావిస్తున్నానని నూతన వధువు నిహారికా సింగ్ చెప్పారు. మరోవైపు ఈ జరిమానాల వల్ల కరోనా గ్రాఫ్ను తగ్గించలేమని నిపుణులటున్నారు. దీపావళి ఉత్సవాల తరువాత వైరస్ కేసులు పెరగడాన్ని ఉదహరిస్తూ, వివాహ షాపింగ్, వేడుకలతో కూడా కరోనా విస్తరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాజస్థాన్లో కోవిడ్ కేసులు గత నాలుగు రోజుల నుండి 1.34 శాతం పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా జైపూర్లో రోజులు 600కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జైపూర్లో రాత్రి కర్ఫ్యూ లాంటి చర్యలను అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు, రాజస్థాన్లోని ఉదయ్పూర్, జైపూర్ లాంటి ప్రఖ్యాత ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి కుమార్తె వివాహం రాజస్థాన్ ఉదయ్పూర్లోనే జరిగింది అలాగే టాలీవుడ్ నటుడు కొణిదెల నాగబాబు తనయ నిహారిక వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా రాజస్థాన్ కావడం గమనార్హం. -
కల్యాణ మండపాలు కళకళ
సాక్షి, అమరావతి : కరోనా ఎన్నో కల్యాణాలను వాయిదా వేసింది. మూడు ముళ్ల సరదా, సందళ్లు లేకుండా చేసింది. ఈ మహమ్మారి కారణంగా వివాహాలను రద్దు చేసుకున్న వారు కొందరైతే మూహూర్తాలు మార్చుకున్న వారు మరికొందరు. నిబంధనలు పాటిస్తూ తూతూమంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చిన వారు ఇంకొందరు. కోవిడ్ ప్రభావంతో చాలా వివాహాలు సందడి లేకుండానే జరిగాయి. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పడుతుండడం, లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. విజయదశమి నుంచి మొదలైన శుభ ముహూర్తాలు రెండు నెలలకు పైగా (ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో) కొనసాగనున్నాయి. జనవరి రెండో వారం నుంచి మూడున్నర నెలలు మూఢం (మౌఢ్యమి) వల్ల శుభ ముహూర్తాలు లేకపోవడంతో పలువురు ఈ సీజనులోనే పెళ్లిళ్లకు తొందర పడుతున్నారు. రానున్న మూడు నెలల పాటు విజయవాడలోని దాదాపు 500 చిన్న, పెద్ద కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఖాళీ లేకపోవడం గమనార్హం. ఈ సీజనులో నగరంలో రెండు వేలు, జిల్లాలో మరో వెయ్యి వరకు వివాహాలు జరుగుతాయని పురోహితులు అంచనా వేస్తున్నారు. మారిన పిలుపులు.. పెళ్లంటే ఎవరి స్థాయిలో వారు ఆడంబరంగా జరుపుకుంటారు. స్థితిమంతులు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటిలా ఘనంగా కాకపోయినా పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నామమాత్రంగానే శుభలేఖలు ముద్రిస్తున్నారు. ముఖ్యులను, ఆత్మీయులను మాత్రమే ఫోన్లు, వాట్సాప్ల ద్వారా ఆహ్వానిస్తున్నారు. ఇక వివాహ వేడుకల్లో అతిథులు మొదలు ఫంక్షన్ హాల్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, క్యాటరింగ్ బాయ్స్ వరకు అంతా మాస్క్లు, హ్యాండ్ గ్లౌజ్లు ధరిస్తున్నారు. పలుచోట్ల ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడంతోపాటు సామాజిక దూరం పాటించేలా కుర్చీలను అమరుస్తున్నారు. వంటకాల సంఖ్యను కుదించడంతో భోజనాల ఖర్చు కూడా తగ్గుతోంది. ఇవీ శుభ ముహూర్తాలు.. ఆశ్వయుజ మాసం: నవంబర్ 4, 11వ తేదీలు కార్తీక మాసం: నవంబర్ 17, 19, 20, 21, 22, 25, 26, డిసెంబర్ 1, 6, 8, 9వ తేదీలు మార్గశిర మాసం: డిసెంబర్ 17, 18, 20, 24, 27వ తేదీలు జనవరి: 1, 2, 4, 7 తేదీలు డబ్ల్యూహెచ్వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనలివీ.. - కరోనా జాగ్రత్తలు పాటించడం వీలు కాని పక్షంలో వేడుకలు రద్దు చేసుకోవాలి. - పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలి. - వేడుక ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతిథులకు అవగాహన కల్పించాలి. - ఎక్కువ సేపు లోపల గడపకుండా బయటే వేడుకలు నిర్వహించుకోవాలి. - వేడుకకు హాజరయ్యే వారికి శానిటైజర్తోపాటు సబ్బు, నీళ్లు, టిష్యూ పేపర్లు, మాస్క్లు సరఫరా చేయాలి. - విందు భోజనాల్లో తప్పనిసరిగా పరిశుభత్ర, భౌతిక దూరం పాటించాలి. వాడి పారవేసే ప్లేట్లు (డిస్పోజబుల్) వినియోగించాలి. - ఏమాత్రం అనారోగ్య లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలి. పురోహితులకు డిమాండ్.. ‘విజయదశమి నుంచి జనవరి మొదటి వారం వరకు శుభ ముహూర్తాలున్నాయి. కోవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించాలని సూచిస్తున్నాÆం. ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న పురోహితులకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. నేను ఈ సీజనులో 60 వరకు పెళ్లి ముహూర్తాలు నిర్ణయించా’ –పులిపాక రాఘవేంద్రాచార్యులు, వేదపండితుడు, విజయవాడ. -
పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది. శ్రావణం ముగిశాక మళ్లీ ఇప్పుడే మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహ వేడుకల హంగామా పెరిగింది. కరోనా భయం పూర్తిగా వీడకపోవడం.. జాగ్రత్తలు పాటించకుంటే చలికాలంలో దీని తీవ్రత అధికంగా ఉంటుందన్న ప్రభుత్వం, వైద్యుల హెచ్చరికలతో పూర్తి భద్రత చర్యల మధ్య పెళ్లిళ్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా దేశాల్లో సెకండ్ వేవ్ భయంతో పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నా, రాష్ట్రంలో మాత్రం వివాహ వేడుకల రద్దు తక్కువేనని సర్వేలు చెబుతున్నాయి. 76 శాతం జంటలు ఎంచుకున్న తేదీల్లో వివాహానికే ముందుకెళ్తున్నారని.. అయితే కరోనా భయంతో అతిథుల సంఖ్య తగ్గింపు మొదలు శానిటైజర్లు, మాస్క్లు, సామాజిక దూరం, కచ్చితమైన నిబంధనలు పాటించేలా చొరవ తీసుకుంటున్నారని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాయిదాపడ్డవన్నీ ఇప్పుడు ఫిక్స్.. రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలలో తెలుగునాట ఎక్కువ వివాహాలకు ముహూర్తాలు కుదిరాయి. దీనికి అనుగుణంగా కల్యాణ మండపాలు, ప్రముఖ దేవాలయాలు వేదికలుగా ఏర్పాట్లు జరిగినా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో వేలాది వివాహాలు వాయిదాపడ్డాయి. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల నుంచి 50 వేల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అనంతరం జూలై 22 తర్వాత శ్రావణం మొదలైనా కరోనా మహమ్మారి విస్తృతి దృష్ట్యా, పరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఇరు పక్షాల కుటుంబీకులతో కేవలం 20 నుంచి 50 మందితోనే వివాహ వేడుకను ముగించారు. ఆగస్టు 14 అనంతరం మళ్లీ ఇప్పుడు అక్టోబర్ 28 నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. 29న సైతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగ్గా, నవంబర్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. దీనికి అనుగుణంగా ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికల బుకింగ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో జనవరి 8 వరకు మంచి రోజులుండగా, సుమారు 50 వేల నుంచి 80 వేల జంటలు ఒక్కటయ్యే అవకాశముందని అంచనా. తగ్గిన అతిథులు.. పెరిగిన జాగ్రత్తలు రాష్ట్రంలో ప్రస్తుతం మొదలైన పెళ్లిళ్లలో అతిథుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. 2 వేల నుంచి 3 వేల సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్న ఫంక్షన్ హాళ్లలోనూ 500కు మించి అతిథులు కనిపించడం లేదు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా తమకు అత్యంత దగ్గరైన, ముఖ్యమైన బంధువులు, సన్నిహితులకు మాత్రమే ఆహా్వన పత్రికలు ఇస్తున్నారు. ఈ ఆహ్వానాలు సైతం పత్రిక ద్వారా కాకుండా వాట్సాప్లు, ఈ–మెయిల్స్, మెసేజ్ల ద్వారానే ఉంటున్నాయి. చాలా మంది జంటలు తమ అతిథుల జాబితాను 68 శాతం తగ్గించుకున్నట్లు వెడ్డింగ్ టెక్నాలజీ సంస్థ ది నాట్ వరల్డ్ వైడ్ నివేదిక వెల్లడించింది. 90 శాతం కుటుంబ సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని పేర్కొంది. కేవలం తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారినే ఆహా్వనిస్తున్న వారు 52 శాతం ఉండగా, దూర ప్రాంతాల వారికి ఆహా్వనాలు పంపుతున్న వారు 30 శాతంగా ఉంటున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా 23 శాతం మంది జంటలు వివాహ రిసెప్షన్లను రద్దు చేసుకుంటున్నాయి. ఇక వివాహ కార్యక్రమాల్లో 80 శాతం మంది సామాజిక దూరాన్ని ప్రోత్సహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 91 శాతం ఫంక్షన్ హాళ్లలో హ్యాండ్ శానిటైజర్లు వాడుతుండగా, 79 శాతం మంది మాస్కులు వినియోగిస్తున్నారని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి.. ఇక వివాహా వేడుకల్లో అతిథులు మొదలు ఫంక్షన్ హాల్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆరి్టస్టులు, క్యాటరింగ్ బాయ్స్ వరకు మాస్్కలు, హ్యాండ్ గ్లౌజ్లు అందిస్తున్నారు. పలుచోట్ల ఎంట్రీల వద్దే ఫీవర్ చెకింగ్, సామాజిక దూరం పాటించేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. భోజన ఖర్చులు భారీగా తగ్గింపు.. ఇక గతంలో పెళ్లిళ్లంటే భారీ ఆడంబరాలు, అందుకు తగ్గట్లే పసందైన వివిధ రకాల వంటకాలతో భోజనాలు ఉండేవి. అయితే ప్రస్తుతం వంటకాల సంఖ్యను పూర్తిగా తగ్గించేస్తున్నారు. భోజనాల ఖర్చు 25 నుంచి 40 శాతం వరకు తగ్గుతోంది. ఇక వంద నుంచి 500 మంది వ్యక్తులతో కలసి విందు ప్రాంగణంలో భోజనం చేయాలంటే ఇప్పుడు అతిథులూ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం అపరిశుభ్రతతో కూడిన ప్రాంగణమున్నా, ఒకరు తిన్న ప్లేట్లనే మళ్లీ శుభ్రం చేసి తెచ్చినా జనాలు భోజనం చేసేందుకు జంకుతున్నారు. దీనికి తోడు నాన్వెజ్ను ఎక్కువగా ప్రోత్సహించే వివాహ రిసెప్షన్లను ప్రస్తుతం చాలా జంటలు రద్దు చేసుకుంటుండటం సైతం భోజన ఖర్చులను భారీగా తగ్గిస్తోంది. రిసెప్షన్లను రద్దు చేసుకుంటున్న వారే ఎక్కువ.. ‘భారతీయ వివాహ సంప్రదాయంలో చాలా రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాదనలేని కార్యక్రమాలు కొనసాగిస్తూనే అవసరం లేని రిసెప్షన్ను రద్దు చేసుకుంటున్న జంటల సంఖ్య ఎక్కువగానే ఉంది..’అని జూబ్లీహిల్స్కు చెందిన మ్యారేజ్ ఈవెంట్స్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఇక కనీసంగా 20 రకాలు ఉండే వివాహ భోజనంలో ప్రస్తుతం 10 రకాలకు మించటం లేదని కూకట్పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ ఒకరు తెలిపారు. ముఖ్యంగా స్వీట్లు, ఐస్క్రీంలు, పానీయాలను మెనూ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారని వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ సూచనలిలా.. వివాహాది శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు వంటి సమూహ కార్యక్రమాల సమయంలో ప్రజల మధ్య కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి ప్రదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఎట్లా సురక్షితంగా మలచాలన్న దానిపై డబ్ల్యూహెచ్ఓ పలు సూచనలు చేసింది. కరోనా జాగ్రత్తలు పాటించడం వీలు కాదో అలాంటి వాటిని రద్దు చేసుకోవడమే ఉత్తమమని, సమూహ కార్యక్రమాలకు హాజరవ్వాలంటే మొదటగా స్థానిక నిబంధనలు ఏమున్నాయో చూసుకోవాలని తెలిపింది. ఏమాత్రం అనార్యోగమున్నా ఇంటికే పరిమితం కావాలని, ఇతరుల నుంచి కనీసం మీటర్ దూరం పాటించాలని సూచించింది. మాస్క్ తప్పనిసరని, తుమ్మినా, దగ్గినా మోచేతిని అడ్డుపెట్టుకోవాలంది. వేడుక ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతిథులకు అవగాహన కలి్పంచాలని, ఇండోర్ కంటే అవుట్డోర్లోనే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలని, కార్యక్రమాలకు వచ్చే వారికి సబ్బులు, నీళ్లు, టిష్యూ పేపర్లు, మాస్క్లు సరఫరా చేయాలని తెలిపింది. -
లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం
గువాహటి : అస్సోంలోని పాలిత బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్ బిశ్వాశర్మ గురువారం గువాహటిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా అస్సోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతుందని మంత్రి ప్రకటించారు. తమ బిడ్డలను మోసగాళ్ల వంచన నుంచి రక్షించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. (లవ్ జిహాద్కు నిర్వచనం లేదు) ఈ సందర్భంగా హేమంత్ బిశ్వా మట్లాడుతూ.. ‘సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారు. హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో హిందు వ్యక్తి మాదిరిగా ఫేక్ ఎకౌంట్ సృష్టించి దానికి ఓ దేవుడి ఫోటోను వాల్పేపర్గా పెడుతున్నారు. ఈ విధంగా హిందు వర్గానికి చెందిన యువతులను మోసం చేసి, ప్రేమ పేరుతో లోబర్చుకుంటున్నారు. అనంతరం పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువతులు వారి చేతిలో మోసపోతున్నారు. మరోవైపు లవ్ జిహాద్ పేరుతో తమ బిడ్డలను మరో వర్గం వారు బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. అన్నెంపున్నెం ఎరుగని యువతుల్ని మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేసి.. తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని ఇక సహించేది లేదు. అలాంటి వారిపై అస్సోం ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటిస్తోంది. తమ బిడ్డలను మోసం చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాల్సింది. బలవంతపు వివాహాలను నివారించడానికి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అస్సామీ ఆడపడచుల రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో మతమార్పిడి సంఘటలను తరచుగా వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు యువతులు చెబుతున్నా.. ఇది బలవంతపు వివాహమని తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేలుకున్న అస్సోం ప్రభుత్వం ఇకపై బలవంతపు వివాహాలను చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలకు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు, ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యువతీ యువకులు ఇష్టాలకు అనుగుణంగా చేసుకున్న వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది ముస్లిం సమాజంపై కక్షసాధించడంగా వారు భావిస్తున్నారు. -
కటకటాల వెనక్కి నిత్య పెళ్లి కూతురు
దొనకొండ( ప్రకాశం జిల్లా): యువకులు, విద్యావంతులను మోసం చేసి పెళ్లి చేసుకుని ఆనక డబ్బు డిమాండ్ చేసి రూ.లక్షలు స్వాహా చేసి చివరకు వారిపై కేసులు పెట్టి వేధించే నిత్య పెళ్లి కూతురును పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పొదిలి సీఐ వేలమూరి శ్రీరామ్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. స్వప్న అనే యువతి హరిణి, కావ్య పేర్లతో చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలో మండలంలోని వీరేపల్లికి చెంది విపర్ల వీరాంజనేయులు డెన్మార్క్లో ఉద్యోగం చేస్తుండగా మ్యాట్రిమోనిలో అతడిని పరిచయం చేసుకుని వివాహం చేసుకుంది. వీరాంజనేయులు ఆమె విషయాలు ఆలస్యంగా తెలుసుకుని స్వగ్రామం నుంచి డెన్మార్కు వెళ్లిపోయాడు. ఆమె గ్రామంలో ఉంటూ కొందరి ఆసరాతో పోలీసుస్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఇలా ఆమె ముగ్గురిని వివాహాలు చేసుకుని మోసం చేసింది. (నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ) మహారాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. నంద్యాలకు చెందిన సుధాకర్ బెల్జీయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి పేరుతో అతడిని కూడా మోసం చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది. అతను పోలీసులను ఆశ్రయించగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఓ మహిళ వద్ద రూ.5 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసింది. ముంబైలో పౌరోహిత్యం చేస్తూ తిరుపతిలో వేద విద్యాభ్యాసం చేస్తున్న దేవక్ శుక్లా పూజారిని పెళ్లి పేరుతో మోసం చేసి రూ.20 లక్షలు కొట్టేసింది. ఇలా ఆమె నిత్య పెళ్లి కూతురుగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో నిందితురాలు స్వప్నపై ఎస్ఐ ఫణిభూషణ్ కేసు నమోదు చేశారు. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేసి బెదిరించి ఇబ్బంది పెడుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను దర్శి సబ్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితురాలిని ఒంగోలు సబ్జైలుకు తీసుకెళ్లినట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు. (కిలాడీ లేడీ పెళ్లిళ్లు.. మూడో ‘సారీ’) -
ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం. కొందరు యువతుల జీవితాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. భార్యల కాళ్లపారాణి ఆరకముందే వారి భర్తలు కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇదేం చోద్యమని సాక్షాత్తు న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని జాతీయ మహి ళా కమిషన్ను ఆదేశించారు. యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్త కు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు ఎన్ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి కేసులు మరికొన్ని దాఖలయ్యాయి. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్కొనర్వ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్పై విడుదల చేయాల్సిందిగా కోరింది. పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేసి బదులు పిటిషన్ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. -
పెళ్లికెళ్లాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు ‘నెల’వు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహా సాలు, ఆడంబరాలు ఇక ‘గతం’ కానున్నాయి. ఆగస్టు 15 వరకు ఉన్న ముహూర్తాలలో ఏదో ఒకటి నిశ్చయం చేసుకుని.. గతంలో వాయిదాపడిన వివాహాలతో పాటు కొత్తవీ ‘ఏదో కానిచ్చేద్దా’మనే యోచనలో పలువురు ఉన్నారు. బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరుపుకునే పెళ్లిళ్లను భయం భయంగా కొద్దిమందితోనే కానిచ్చేస్తున్నారు. ఏదీ నాటి సందడి?: సాధారణంగా శ్రావణ మాసంలో వేలాది వివాహాలతో ఊరూవాడా పెళ్లిపందిళ్లను తలపిస్తాయి. అనుకున్న ముహూర్తానికి వంటల దగ్గరి నుంచి మూడు ముళ్లు వేయించే పురోహితుల వరకు అందరినీ సమన్వయం చేసుకోలేక.. ఫంక్షన్ హాళ్లు లభించక ఎంతో హైరానా.. ఇక, ఏకకాలంలో ఐదారు పెళ్లిళ్లకు హాజరయ్యే పరిస్థితి.. పెళ్లంటే నెల ముందే సందడి మొదలయ్యేది. ఆహ్వాన పత్రికలు పంచడం దగ్గరి నుంచి ఏడడుగులు వేయడం వరకు ఎంతో హడావుడి. అన్నిటికీ ముందస్తు బుకింగ్లు.. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. గ్రాండ్గా ఉండాలనే తలంపుతో ఎన్నెన్నో ప్లాన్లు.. ఇదంతా కరోనాకు ముందు పరిస్థితి.. ఇప్పుడీ కరోనా కాలంలో పెళ్లి చేయాలంటే సవాలక్ష ఆంక్షలు.. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.. ఫలితంగా పదులు, వందల సంఖ్యలోనే ఈ శ్రావణంలో చాలామంది తటపటాయిస్తూనే ముహూర్తాలను పెట్టుకుంటున్నారు. జూలై 29, 31, ఆగస్టు 2, 3, 4, 5, 6, 7, 8, 11, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. క్లిక్ లేదు – పిలుపు.. కుదింపు గతంలో పెళ్లికి తాహతుకు మించైనా ఎక్కువ మందిని ఆహ్వానించే వారు. పెండ్లి పత్రికలే వెయ్యి నుంచి 1,500 వరకు ఆర్డర్ ఇచ్చేవారు. ఇవిప్పుడు వంద నుంచి 200కే పరిమితమవుతున్నాయి. ఆంక్షల కారణంగా ఎక్కువ మందిని పిలిచే అవకాశం లేక.. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. దగ్గరి బంధువులు, ముఖ్యమైన వారికే పిలుపులు అందుతున్నాయి. పెళ్లి సంగతలా ఉంచితే, వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి అంతాఇంతా కాదు. సినిమా మాదిరి పెళ్లిని చిత్రీకరించేందుకు కనీసం ముగ్గురు నలుగురు వీడియో, ఫొటోగ్రాఫర్లు ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరితోనే సరిపెట్టేస్తున్నారు. ఫలితంగా చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు పెళ్లి కాంట్రాక్టులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. పెళ్లికెళ్లాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే.. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా పెళ్లికి వచ్చేవారు కరోనా టెస్టు చేయించుకుని ఆ రిపోర్టును తహసీల్దార్కు ఇవాల్సిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ ఓకే అంటేనే పెళ్లికి వెళ్లేది. ఇలా వచ్చే వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎలా అని అటు ఆహ్వానించే వారు, ఇటు ఆహ్వానితులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లికి వచ్చేవారు ఆధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్న నిబంధన కూడా కొన్నిచోట్ల ఇబ్బందిపెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లికి వచ్చిన బంధువులు అలా ముఖం చూపించి వెళ్లిపోతున్నారు. ఫంక్షన్ హాలు దొరకాలంటే నాడెంతో టెన్షన్ ఎంత పెద్ద ఫంక్షన్ హాలులో పెళ్లిచేస్తే అంత గొప్ప అన్నట్టుండేది. సినిమా సెట్టింగులను మించి ఫంక్షన్ హాళ్లు, వివాహ వేదికలు తళుక్కుమనేవి. ఇప్పుడంతా మినీ హాళ్లకే పరిమితవుతున్నారు. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్లో హాళ్లు దొరకాలంటే తల ప్రాణం తోకకొచ్చేది. ఇప్పుడు ఏ ఇంట పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారో తెలుసుకుని మరీ ఫంక్షన్ హాళ్ల యజమానులే ఎదురు ఫోన్ చేస్తున్నారు. తక్కువ మొత్తానికి ఫంక్షన్ హాళ్లను ఇస్తామంటున్నారు. ఏదైనా వివాహ కార్యక్రమం జరుగుతుందంటే ఫంక్షన్ హాలులో పనిచేసే వారు 20 నుంచి 50 మంది వరకు ఉండేవారు. ఇప్పుడు ఇటువంటి వారి ఉపాధికి గండిపడింది. మోగని బ్యాండ్ బాజా గతంలో పెళ్లిళ్లూ, విందుల్లో ఆర్కెస్ట్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. జిగేల్మనే దీపాలు, డీజే, బ్యాండుమేళాలతో పెళ్లి ప్రాంగణం మారుమోగేది. కరోనా ఆంక్షలతో వీటికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆర్కెస్ట్రాలకూ, బ్యాండ్బాజాలకు పనిలేకుండా పోయింది. అందులో పనిచేసే వారు ఇతర పనులు వెతుక్కుంటున్నారు. -
కాబోయే జంటలకు ఎంత కష్టం!
యశవంతపుర(కర్ణాటక): కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో పెళ్లిళ్లు చేయటం, పెద్దసంఖ్యలో బంధుమిత్రులు కలవటం, తరువాత అందరికీ కరోనా సోకడం వంటి సంఘటనలు అక్కడక్కడా సంభవిస్తున్నాయి. దీంతో వైరస్ను కట్టడి చేయడం ప్రభుత్వానికి దుర్లభమవుతోంది. కరోనా ప్రబలుతున్నందున బాగలకోట, కలబురిగి జిల్లా పరిధిలో వివాహలకు అనుమతులను ఇవ్వవద్దని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గోవింద కారజోళ ఆ కలెక్టర్లను ఆదేశించారు. డీసీఎం కారజోళ రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లకు లేఖలు రాశారు. అంత అవసరమైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. రెండు జిల్లాల పరిధిలో పెళ్లిళ్లలో పాల్గొన్నవారిలో ఎక్కువగా కరోనాకు గురైనట్లు మంత్రి తెలిపారు. ఇటీవల బాగలకోట, కలబురిగి జిల్లాలలో పెళ్లిళ్లలో పాల్గొన్న అతిథులకు కరోనా సోకటంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్లకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టంచేశారు. బాగలకోట జిల్లాలో కట్టుదిట్టం బాగలకోట జిల్లా పరిధిలో పెళ్లి, సీమంతం, అంత్యసంస్కారాలలో పాల్గొన్నవారిలో 70 మందికి పాజిటివ్ వచ్చినట్లు బాగలకోట జిల్లా కలెక్టర్ కే.రాజేంద్ర తెలిపారు. కలాగది అబ్కారి ఎస్ఐ పెళ్లి, ఇళకల్లో పెళ్లి, డాణక శిరూరలో సీమంతం, చిక్కమ్యాగేరిలో రైల్వే టికెట్ కలెక్టర్ అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో ఎక్కువగా కరోనా బయట పడినట్లు కలెక్టర్ తెలిపారు. వధూవరులు, నలుగురైదుగురు బంధువులు హాజరయ్యే రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. శవ సంస్కారాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమస్తామన్నారు. బాగల్కోట జిల్లాలో నలుగురు పోలీసులకు కరోనా సోకింది. జమఖండి తాలూకా ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు వైరస్కు గురయ్యారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కరోనా సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 4 తాలూకాలలో 36 ఫ్లయింగ్ స్క్వాడ్ని నియమించి ప్రజలు గుంపులుగా చేరటం నియంత్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాగా మంత్రి, కలెక్టర్ ఆదేశాలను ప్రజలు పాటిస్తారా, లేదా? అన్నది మునుముందు తెలియనుంది. -
పెళ్లిళ్లకు వేదికగా సరిహద్దు చెక్పోస్ట్
చెన్నై : తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యంలోని ఎక్సైజ్ చెక్పోస్ట్ బుధవారం పండగ శోభను సంతరించుకుంది. సాధారణంగా ఆ చెక్పోస్ట్ ద్వారా నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య సరకు రవాణా జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ చెక్పోస్ట్ మూడు పెళ్లిళ్లకు వేదికగా మారింది. ఇలా మూడు పెళ్లిళ్లు ఒకే రోజు కొంత విరామంతో జరగడం విశేషం. వేదక్కని-ముత్తప్పరాజ్ కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు, తమిళనాడుకు చెందిన ముగ్గురు అబ్బాయిలతో పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. అయితే అదే సమయంలో కరోనా లాక్డౌన్ విధించడంతో వారు తొలుత వివాహలను వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడంతో పెద్దలు తమ పిల్లలు ఎలాగైనా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. వారి వారి తల్లిదండ్రులు ఇరు రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇలా ముగ్గురు వధూవరులు.. అధికారులు అనుమతితో, పెద్దల ఆశీర్వాదంతో బోర్డర్ చెక్పోస్ట్ వద్ద ఏకమయ్యారు. ఇందుకు వారి కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కస్తూరి-నిర్మల్రాజ్ దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుకన్య-మణికందన్, వేదక్కని-ముత్తప్పరాజ్, కస్తూరి-నిర్మల్రాజ్ జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని వారు ముందుగానే శానిటైజ్ చేసుకుని అక్కడికి తీసుకువచ్చారు. పెళ్లి తర్వాత నూతన వధువులు.. తమిళనాడులోకి తమ తమ అత్తవారి ఇళ్లకు చేరిన తర్వాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇదే చెక్పోస్ట్ వద్ద జూన్ 7వ తేదీన కూడా ఓ పెళ్లి జరిగింది. -
పెళ్ళి పిల్లలని కనడం కోసమేనా?
మహిళలు సమాజంలో సగం ఐనప్పటికీ మహిళలు ఎలా వుండాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి, ఉద్యోగం చేయవచ్చా లేదా, ఎంతమంది పిల్లలని కనాలి, ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి వంటి విషయాలు పురుషులే నిర్ణయిస్తున్నారు. మన పురాణాలు పరిశీలించినా, ఆ పురాణాలు ప్రవచనాలు వుటంకించినా ఆ పురాణ పురుషులే స్త్రీల తలరాత రాస్తున్నారు. ఉదాహరణకి అమ్మాయిలు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అనే విషయంపై వ్యాఖ్యానిస్తూ ఎనిమిది సంవత్సరాల బాలికను కన్యగా పరిగణించాలన్నారు. పురుషాధిక్య పెద్దలు ఇంకా ఓ అడుగు ముందుకేసి గర్భాష్టకాలు అంటే తల్లి కడుపులో పడ్డప్పటినుంచే వయసు ఎనిమిదేళ్ళుగా లెక్కించి కన్యగా ఎంచమన్నారు. నలభై యేళ్ళ క్రితం వరకు ఏడు, ఎనిమిది యేళ్ళకు పెళ్ళిళ్ళు జరగడం సర్వసాధారణం. ఇలా ఉండగా 1927లో లార్డ్ ఇర్విన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాయివిలాస్ హరిబచన్ శారద ఓ ప్రతిపాదన చేస్తూ అమ్మాయికి పద్నాలుగు, అబ్బాయికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేదాక పెళ్ళిళ్ళు జరగకుండా చట్టం తేవాలని యోచించగా ఆ ప్రతిపాదన 1930లో చట్టరూపం దాల్చింది. కానీ ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రచారానికి నోచుకోలేదని ఫలితంగా ఆ చట్టం అమలు కాలేదనీ, పైగా కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసిందనీ భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ 1950లో పార్లమెంటులో ఈ చట్టంపై మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేసి చిన్న మార్పులు చేస్తూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పదహారుగా మార్చి ఆ చట్టాన్ని అలాగే కొనసాగించి కొంత ప్రచారం కల్పించడంతో 1978 వరకు దాన్ని శారదా చట్టంగానే సంబోధిస్తూ వచ్చారు. ఇక 1978లో బాలికల కనీస వివాహ వయస్సు పద్దెనిమిదేళ్లకు మారుస్తూ బాలురకు మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు ఈ పరిణామాలు చూస్తే ఎప్పుడూ బాలికల వయస్సు కంటే అబ్బాయిల వయస్సు ఎక్కువ వుండేలా చూశారు కానీ దాంట్లో శాస్త్రీయత ఎంత అన్నది కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. బాల్య వివాహాలు జరిగితే నష్టపోయేది బాలికలేననీ, అబ్బాయిలకు, అమ్మాయిలకు వయసులో తేడావుండాలన్నది.. పురుషాధిక్య సమాజం మహిళలపై పురుషులు పెత్తనం చేయడానికి చెబుతున్న కుయుక్తనీ, దానిలో ఏమాత్రం శాస్త్రీయత లేదని ఇప్పుడున్న పద్దెనిమిదేళ్ల షరతు బాలికలకు అన్యాయం చేసేదని ఆ వయసులో అమ్మాయిలు కనీసం పట్టభద్రులు కూడా కాలేరని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడుతోంది. పిల్లలను కనడానికి ఈ వయసు సరైనది కాదని, ఈ వయసులో పిల్లలను కంటున్నదునే దేశంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా వుందని బాలికకు పద్దెనిమిది,బాలురకు ఇరవైఒక్కయేళ్ళు అనే నిబంధన లింగ వివక్ష అనీ సమన్యాయం కాదని అనేక ర్యాలీలు ,సమావేశాలు, నివేదనలు బాలల హక్కుల సంఘం చేపట్టింది. పైగా కేంద్ర సర్కారు సమన్యాయం కోసం అబ్బాయిల వివాహ వయస్సు పద్దెనిమిదికి చేస్తామనడంతో ఇదెక్కడి నీతి అని పలువురు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గింది. కానీ ఇటీవల ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత పద్దెనిమిది, ఇరవై ఒకటి అనే విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పద్నాలుగు, పదిహేను,ఇరవై ఒకటికి విరుద్ధంగా వున్నాయని చెప్పటంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పరిశీలించడానికి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంచడానికి, అమ్మాయిలు గర్భధారణ చేయడానికి అనుకూల వయసుపై పరిశీలన జరపాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కి చెప్పడం మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్నే ప్రవచించినట్లు కాదా? అమ్మాయిలు కేవలం పిల్లల్ని కనడానికే వున్నట్లు, అమ్మాయిల పెళ్లి కూడ పిల్లల కనడానికే అన్నట్టు, పిల్లలని కనడం జీవితంలో ఓ భాగం కాకుండా అదే జీవితమన్నట్లుగా మళ్ళీ పురుషుడికే పట్టం కడుతున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలి. అచ్యుత రావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు,బాలల హక్కుల సంఘం 9391024242 -
గోల్డీ కల్యాణం
కరోనా కారణంగా వేలకొలదీ వివాహాలు వాయిదా పడ్డాయి. జూమ్ ఆప్లో చాలామంది జంటలు ఉంగరాలు మార్చుకుంటున్నారు. బంధువులు, స్నేహితులు సైతం జూమ్లోనే శుభాకాంక్షలు అందచేస్తున్నారు. పెళ్లయితే చేసుకోలేరు కదా... గోల్డీది అదే పరిస్థితి. వివాహం గురించి కలలు కన్న గోల్డీ వయసు 20 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంటుంది. కనౌజ్లో ఉండే వీరేంద్ర కుమార్తో వివాహం నిశ్చయమైంది. మే 4వ తేదీకి ముహూర్తం నిశ్చయించారు. లాక్డౌన్ కారణంగా అనివార్యంగా వివాహం వాయిదా పడింది. వివాహం నిశ్చయమైన నాటి నుంచి ఇద్దరి ఇళ్లకు రాకపోకలు సాగుతున్నాయి. లాక్డౌన్ తరవాత ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకసారి కాదు రెండుసార్లు వీరి వివాహం వాయిదా పడటంతో, వారికి నిరాశగా అనిపించింది. ఇప్పుడు లాక్డౌన్ సడలించిన తరవాత, తమ వివాహం జరిపించమని తల్లిదండ్రులను కోరింది. వారు అక్కరలేని అభ్యంతరాలు చెప్పడంతో మరోమారు వాయిదా పడింది. ఇక లాభం లేదనుకుని, తన వివాహం తానే చేసుకోవాలనుకుని సంకల్పించుకుంది. బుధవారం మధ్యాహ్నం గోల్డీ కాన్పూర్లోని లక్ష్మణ్పూర్ తాలూకాలోని గ్రామం నుంచి కనౌజ్కు నడక ప్రారంభించింది. 80 కి.మీ. నడిచింది. కనౌజ్ చేరింది. చెప్పాపెట్టకుండా గోల్డీ రావటంతో, వారి వివాహం వెంటనే చేయక తప్పలేదు వీరేంద్రకుమార్ తల్లిదండ్రులకు. ఒక పాత దేవాలయంలో వీరి వివాహానికి ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించారు. ఇద్దరూ మాస్కులు ధరించారు. పెళ్లికూతురు ఎరుపు రంగు చీర, పెళ్లికొడుకు తెల్లరంగు డెనిమ్ చొక్కా ధరించారు. ఈ వివాహానికి ఒక సోషల్ వర్కర్ కూడా హాజరయ్యారు. ఏది ఏమైతేనేం, గోల్డీ రుక్మిణి కంటె ఘనురాలే. ఆవిడ రథం మీద పారిపోతే, ఈ అమ్మాయి తన పాదాలనే నమ్ముకుంది. -
ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. !
బెంగళూరు : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారాల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్న వారు వాటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం అటువంటి వారికి గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెలలో మిగిలిన రెండు ఆదివారాలు మే 24, మే 31 తేదీల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్నవారు.. షెడ్యుల్ ప్రకారం వాటిని జరుపుకోవచ్చని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ పెళ్లిలను ప్రత్యేకంగా పరిగణించి మినహాయింపు ఇవ్వనున్నట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు టీకే అనిల్ కుమార్ తెలిపారు. ‘రాష్ట్ర వాప్యంగా మే 24, మే 31 తేదీల్లో ముందుగా నిశ్చియించిన పెళ్లిళ్లు జరుపుకోవచ్చు. అయితే మార్గదర్శకాలు పాటించాలి. కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి. భౌతిక దూరం నిబంధనను పాటించడం, మాస్క్లు ధరించడంతోపాటుగా శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి’ అని ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం డీసీపీల అనుమతి తీసుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లకు చెందినవారిని పెళ్లికి ఆహ్వానించకూడదని ఆదేశించారు. 65 ఏళ్లు పైబడినవారిని, 10 ఏళ్ల కంటే చిన్నవాళ్లను వివాహా వేడుకలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. పెళ్లిలో పాల్గొనేవారు మద్యం సేవించడంపై కూడా నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు. -
వివాహాలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
కల్యాణ ఘడియలకు కరోనా ‘వర్జ్యం’
సాక్షి, హైదరాబాద్: కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదని నానుడి. కానీ, కరోనా వస్తే వివాహమే కాదు.. సమస్తమూ ఆగిపోతాయనేది ప్రస్తుతం ఒరవడి. సాధారణంగా శ్రీరామనవమి వేళ రాములోరి పెళ్లి అనంతరం వివాహాలు ఊపందుకుంటాయి. పెళ్లంటే ఆ సందడే వేరు. ఈసారి కరోనా దెబ్బకు ఆ సందడి, సంతోషం మాయమయ్యాయి. పెళ్లంటే నూరే ళ్ల పంట అనే సంగతి దేవుడెరుగు.. పెళ్లి, విందుల పేరుతో పది మందీ గుమికూడితే కరోనాతో కొత్త తంటా అనే ఉద్దేశంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఏటా ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షల వివాహాలు జరుగుతుంటాయి. కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్కు ముందే కుదుర్చుకున్న పెళ్లిళ్లు సైతం అనేక ఆంక్ష లు, షరతుల మధ్య పదుల సంఖ్యలోనే జరిగాయి. ఆ తరువాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిళ్లు ఇప్పట్లో జరిగే అవకాశం లేక వాయిదా వేసుకుంటున్నారు. ఒక సందర్భంలో సీఎం కేసీఆర్..పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వారిని అభినందించారు. పెళ్లి.. ఫంక్షన్ వాయిదా.. కరోనా పంజా విసరడం, లాక్డౌన్ విధించడం పెళ్లిళ్లపై పెద్ద ప్రభావమే చూపింది. ఇప్పటికే జరిగిన పెళ్లిళ్లను చాలాచోట్ల నలుగురైదుగురితో మమ అనిపించగా, ఇకముందు జరగాల్సిన వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ఏప్రిల్ 15, 16, 26, 27, మే 2, 6, 8, 14, 17, 18, 24, జూన్ 10, 11, 14, 15, జూలై 24, 25, 26, 29, ఆగస్టు 2, 3, 5, 6 ,8, 13, 14 తేదీల్లో ముహూర్తాలు ఉండగా, ఈ తేదీల్లో లక్షల్లో వివాహాలు కుదిరి ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా నవంబర్ 19, 25, 30, డిసెంబర్ 2, 9, 10, 16, 17, 23, 27 తేదీల్లోనూ పెళ్లిళ్లకు పలువురు ప్లాన్ చేసుకున్నారు. వీరంతా లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో జూన్ వరకు వివాహాల వాయిదాకే మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే పరిస్థితులు కుదుటపడితే శ్రావణమాసంలో లేదా వచ్చే ఏడాది జరిపించే యోచనలో ఉ న్నారు. ఫలితంగా మార్చి నుంచి మే వరకు కిటకిటలాడే ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. తీసుకున్న అడ్వాన్సులు సైతం వెనక్కివ్వాల్సిన పరిస్థితి.. ఇక, వీటిలో పనిచేసే వందలాది కార్మికులు ఖాళీ అయిపోయారు. ఫొటోగ్రాఫర్లు, స్టూడియోలు, బ్యూటీషియన్లు, మ్యారేజ్బ్యూరోలు, బ్యాండ్ మేళాలు, టెంట్హోస్ నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు. పెళ్లిళ్లూ లేవు.. పూజలూ లేవు ఈ సీజన్లో పురోహితులకు మంచి డిమాండ్.. మార్చి నుంచి మధ్యలో కొన్ని రోజులు మినహా శ్రావణ మాసం వరకు వీరు దొరకడమే గగనమయ్యేది. ముందే కుదుర్చుకున్న ముహూర్తాలతో ఇతర ముహూర్తాలు పెట్టడానికి, శుభకార్యాలు నిర్వహించడానికి సమయం లేదని చెప్పేవారు. అలాంటిది ఇప్పు డు పెళ్లిళ్లే కాదు.. గుడిలో పూజలకూ దూరమై ఖాళీ అయిపోయారు. తమకు ఫోన్ చేసిన వారికి పెళ్లి వాయిదా వేసుకోవాలని, వీలుంటే వచ్చే ఏడాది చేసుకోవాలని చెబుతున్నారు. వాయిదా వేసుకున్నాం.. మా అబ్బాయి పెళ్లి మే నెలలో పెట్టుకున్నాం. కరోనాతో వాయిదా వేసుకున్నాం. ఇలాంటి సమయంలో పెళ్లి చేసి ఇబ్బంది పడేకంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం. లాక్డౌన్ మంచి నిర్ణయం. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. – గంగారాం మళ్లీ వచ్చే ఏడాదే.. ఏప్రిల్ చివరిలో మా అన్న కుమార్తె పెళ్లి ఉండె. పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులూ కొన్నాం. ఏ ఒక్కటీ తక్కువ కావద్దని అన్నీ ముందే సమకూర్చుకున్నాం. కరోనా దెబ్బకు పెళ్లి వాయిదా వేసుకున్నాం. సెప్టెంబర్ లేదా వచ్చే ఏడాది చేయాలని నిర్ణయించుకున్నాం. – రాజు -
షాదీ.. 'కరోనా'
విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణంధర్మశ్రీ తన కుమార్తె సుమకు ఏప్రిల్ 4న విశాఖ సాగర తీరంలో వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో కరోనా ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఆ పెళ్లిని నవంబర్కు మార్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఆలీ కుమారుడికి ఏప్రిల్ 14న పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నారు. లాక్డౌన్ ప్రభావంతో ఆయన తన కొడుకు పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కరోనా వైరస్ పెళ్లిళ్ల వాయిదాకు కారణమవుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జనం ఒకచోట గుమిగూడకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో వివాహాలు జరిపించటానికి వీలు లేకుండా పోయింది. సాధారణంగా హిందువులు ఫాల్గుణ, ఛైత్ర, వైశాఖ మాసాల్లో వివాహాలకు సుముహూర్తాలు నిశ్చయిస్తుంటారు. ఏడాది మొత్తమ్మీద ఈ మూడు నెలల్లో 50 వేల నుంచి 60 వేల వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. మార్చి 25 నుంచీ.. ► ఈ ఏడాది మార్చి 25 నుంచి ఛైత్రమాసం ప్రారంభమైంది. ఏప్రిల్ 4, 8, 9, 11, 14, 16, 17, 30 తేదీలు, మే 1న పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ► ఈ తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిపించడానికి రెండు, మూడు నెలల ముందే ముహూర్తాలు నిశ్చయించుకున్నారు. ► కొందరు ఇప్పటికే శుభలేఖలు పంపిణీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ► ఇంతలో మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ► ఏప్రిల్ 14 తర్వాత ఎలాంటి పరిస్థితులుంటాయో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ► దీంతో ఇప్పటికే నిశ్చయించిన ముహూర్తాల్లో 95 శాతానికి పైగా వివాహాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ► లాక్డౌన్ ఎత్తివేస్తే ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో వివాహాలు జరిపించాలనే ఆలోచనలో కొందరు ఉన్నారు. ► మే 22 నుంచి జ్యేష్ట మాసం, అనంతరం వచ్చే ఆషాఢ మాసం వివాహాలకు ముహూర్తాలుండవు. ► ఆగస్టు (శ్రావణం), నవంబర్ (కార్తీకం) నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో చాలామంది అప్పటికి వాయిదా వేసుకుంటున్నారని పురోహితులు అంటున్నారు. వీళ్లంతా ఖాళీనే.. ముందుగానే బుక్ చేసుకున్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలను కూడా రద్దు చేసుకుంటున్నారు. పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, సన్నాయి, బ్యాండ్ మేళం, మ్యారేజ్ ఈవెంట్ల నిర్వాహకులు.. ఇలా అందరూ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉంటున్నారు. కొద్దిగంటల్లో పెళ్లి.. మే నెలకు వాయిదా పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరులోని లావేటి వీధిలో సోమవారం జరగాల్సిన వివాహం లాక్డౌన్ ఆంక్షల కారణంగా నిలిచిపోయింది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అందటంతో తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణ అక్కడికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. కరోనా వైరస్ తీవ్రతపై వధూవరుల కుటుంబాల వారికి అవగాహన కల్పించడంతో వివాహాన్ని మే నెలకు వాయిదా వేసుకున్నారు. -
వివాహ బంధానికి.. కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమలాపురం: కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమమైపోయేంత సామాజిక భద్రతతోపాటు దూరం అనివార్యమైన పరిస్థితుల్లో ముందుగా కుదుర్చుకున్న వివాహాల్లో అయోమయం ఏర్పడింది. ఈ నెల 26,28,29 తేదీల్లో జరగాల్సిన పెళ్లిళ్లకు జిల్లాలోని పలు కుటుంబాలు శుభ లేఖలు కూడా పంచిపెట్టేశారు. అన్నింటికీ ఆర్డర్లు ఇచ్చేసి...అడ్వాన్సులు కూడా చెల్లించేసి పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. అయితే రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతోపాటు ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎక్కువ కావడంతో పునరాలోచనల్లో పడ్డారు. జనం అధిక సంఖ్యలో ఒకేచోట సమూహంగా ఉండకూడదన్న ఆంక్షలతో కల్యాణ మండపాల్లో వేడుకలను కూడా రద్దు చేయిస్తున్నారు. ముమ్మిడివరంలో నాలుగు రోజుల కిందట ఓ కల్యాణ మండపంలో భారీ ఏర్పాట్లతో జరుగుతున్న పెళ్లి వేడుకలను అధికారులు జరగకుండా అడ్డుకున్నారు. అమలాపురంలో ఈ నెల 28, 29 తేదీల్లో కూడా రెండు కుటుంబాలు నిరాడంబరంగా ఇరు కుటుంబాల నుంచి పది, పదిహేను మంది మధ్య జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా తగ్గిన తర్వాత వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరిని ఆహా్వనిస్తామని బంధువులు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ మెసేజ్లు ద్వారా పెళ్లి నిర్వాహకులు పంపించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క అమలాపురంలోనే కాదు జిల్లా అంతటా ఉంది. ఇప్పటికే ఖాయమైన పెళ్లిళ్లు నాలుగు నెలలపాటు వాయిదా.. నిశ్చితార్థాలు ముగించుకుని ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తాలు పెట్టించుకుందామనుకుంటున్న వారు కరోనా తీవ్రత, ఆంక్షలతో ఆగస్టు నెలకు అంటే దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేసుకుంటున్నారు. అమలాపురం, అంబాజీపేట, రాజోలు, రావులపాలెం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇలాగే నిశి్ఛతార్ధం చేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు. అడ్వాన్సుల రూపంలో రూ.1.50 కోట్ల నష్టం జిల్లాలో కరోనా వైరస్ అలజడి వచ్చిన తర్వాత జరగాల్సిన పెళ్లిళ్లు జిల్లాలో దాదాపు 230 వరకూ ఉన్నట్లు తెలిసింది. ఈ పెళ్లిళ్ల కుటుంబాల వారు తమ తమ ఆర్థిక తాహతును బట్టి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చులు చేసేవారున్నారు. ఇందులో 65 శాతం కల్యాణ మండపాలను రూ.లక్షలు వెచ్చించి బుక్ చేసుకున్నారు. ఇప్పటికే కల్యాణ మండపాలకే కాకుండా బ్యాండ్ మేళాలు, భోజనాలు, వంట పాత్రలు, షామియానాలు, విద్యుద్దీపాలు, వేదికల అలంకరణ, శుభ లేఖల ముద్రణ తదితర ఈవెంట్స్కు అడ్వాన్సుల పేరుతో జిల్లా వ్యాప్తంగా రూ.1.50 కోట్ల వరకూ వెచ్చించినట్టు సమాచారం. ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు ఇంట్లో పెళ్లికంటే ఇంటిల్లిపాదీ ఆరోగ్యం ముఖ్యం. కరోనాతో ఇప్పుడు పెళ్లిళ్లు బాగా చేసుకోలేకపోతున్నామని...వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఎవరూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే ఎలాగూ మే నెల తర్వాత మూడు నెలలు ముహూర్తాలు లేవు. ఆగస్టు నెల నుంచి మంచి మంచి ముహూర్తాలున్నాయి. ఆ ముహూర్తాల్లో ఇప్పటికే నిశి్చతార్ధాలతో కుదుర్చుకున్న పెళ్లిను బాగా చేసుకోవచ్చు. కరోనా వైరస్ను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు విధిస్తున్న ఆంక్షలకు మన ఆరోగ్యాం కోసం విలువ ఇద్దాం. ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాలను కాపాడుకుందాం. – ఉపద్రష్ట నాగాదిత్య, పంచాంగ కర్త, అమలాపురం -
ఒక టీచర్.. నాలుగు పెళ్లిళ్లు
సాక్షి, గుంటూరు: అతడో ఉపాధ్యాయుడు. మొదటి భార్య బతికుండగానే.. ఆమె చనిపోయినట్లు నమ్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను వరుస వివాహాలు చేసుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆ నిత్య పెళ్లి కొడుకుపై అతడి రెండో భార్య ‘పోలీస్ స్పందన’ కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావుకు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్ వల్లూరుకు చెందిన మహమ్మద్ బాజీ అలియాస్ షేక్ బాజీ అదే గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా బాధితురాలి తండ్రిని నమ్మించి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. చదవండి: ప్రేమించిన యువతితో నిశ్చితార్థం.. ఏమైందో కానీ..! మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత వేరు కాపురం పెడతామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకు తీసుకుని మకాం మార్చాడు. ప్రతి ఆదివారం ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. ఆ తరువాత మొహం చాటేయడంతో బాధితురాలు ఆరా తీయగా.. నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో వివాహం చేసుకుని రహస్య కాపురం చేస్తున్నాడని తెలిసింది. ఇదేమని నిలదీయగా దుర్భాషలాడి కొట్టడంతో ఆమెకు గర్భస్రావమై ప్రాణా పాయ స్థితికి చేరుకోగా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ నెలకోసారి వచ్చి వెళ్లడం ప్రారంభించాడు. పెద్దలు గట్టిగా నిలదీయడంతో తన ఆస్తుల్ని రెండో భార్య పేరిట రాస్తానని, ఇకనుంచి జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించాడు. ఇదిలావుండగా.. ఇటీవల దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులకు రూ.30 వేలు ఇచ్చి ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. కాగా, బాజీ మొదటి భార్య బతికే ఉందని, అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్టు బాధితురాలికి తెలిసింది. బాజీపై తక్షణమే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ విజయారావు తెనాలి డీఎస్పీకి ఆదేశాలిచ్చారు. చదవండి: ‘శాడిస్ట్ ’ వీడియో కాల్స్ వెనక ఉన్న అసలు స్టోరీ -
కాస్త.. చూసి వడ్డించండి
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అని భోజనాన్ని దైవంతో పోలుస్తాం. ఇలాంటి మన దేశంలో ఆహార పదార్ధాల వృథా పెరిగిపోతోంది. ఓ పక్క దేశంలో ఆహార భద్రత కరువై పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోపక్క పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, శుభకార్యాల పేరిట చేస్తున్న హం గామాతో వేల కోట్ల విలువైన ఆహారం చెత్తకుప్పల్లోకి వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరుగుతున్న శుభకార్యాల ద్వారా కనిష్టంగా 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతోందని, దాని విలువ కనిష్టంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అంచనా వేసింది. ఆర్థిక, సామాజిక పరపతిని చూపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో వంటకాలు పెట్టడం, భారీ సంఖ్యలో జనం హాజరైన సందర్భాల్లోనే వృథా ఎక్కువగా ఉంటోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. 75 రోజులు.. 838 కార్యక్రమాలు.. ఓ సర్వే దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో 21.4 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కరువైంది. మూడేళ్లలోపు చిన్నారుల్లో 46% మంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఆహార కొరత కారణంగా 23% మంది తక్కువ బరువు తో పుడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల పేరిట భారీగా ఆహార వృథా దేశాన్ని పట్టి పీడుస్తోందని కేంద్రం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు.. అసలు ఎక్కడెక్కడ వృథా ఎక్కువగా ఉంది.. ఆర్థిక ప్రభావం ఏయే సందర్భాల్లో వృథా పెరుగుతోంది.. వంటి అంశాలపై కేంద్ర ఆహార సంస్థ ప్రధాన పట్టణాల్లో సర్వే చేయించింది. దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు ఆతిథ్య రంగ సంస్థలు, వివిధ రకాల ప్రజలు, చెత్త నిర్వహణ సిబ్బందితో విడివిడిగా ఓ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసింది. 838 వివాహాది శుభకార్యాలను, సాంఘిక జన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. దీనిని విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ముఖ్య పరిశీలనలు ఇలా.. - వివాహాది కార్యక్రమాల సమయంలో వృథా ఎక్కువగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 89 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వార్షికోత్సవాలు, పుట్టిన రోజు వేడుకల్లో వృథా ఎక్కువని 32.5 శాతం ప్రజలు అభిప్రాయాలు చెప్పారు. - ఆతిథ్య రంగ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం వృథా ఉంటోందని 44.9 శాతం ప్రజలు తెలిపారు. - వృథా అవుతున్న దాంట్లో 67.9% ఎక్కువ వంటకాలు వడ్డించి నప్పుడు, 57.4% భారీగా జనాలు హాజరైనప్పుడు ఉంటోంది. ఇందులో కూరగాయల భోజనంలో వృ«థా ఎక్కువగా ఉండగా, బియ్యం, బిర్యానీ వంటకాలను ఎక్కువగా పారేస్తున్నారు. - కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించిన సమయంలో ఆహార వృథా 11.45 శాతమే ఉంటుండగా, క్యాటరింగ్ నిర్వాహకులు వడ్డిస్తే 14.45 శాతం ఉంటోంది. బఫేలో అయితే ఈ వృథా 74.95 శాతం ఉంటోంది. - వడ్డించకుండా వదిలేసిన, లేక మిగిలిన వంటకాలను చారిటీలకు లేక ఎన్జీవోలకు దానం చేసే విధానం 7.2 శాతం మాత్రమే ఉండగా, 15.6 శాతం వివిధ సందర్భాల్లో జరుగుతోంది. 77.2 శాతం మాత్రం పూర్తిగా వృథాగానే పారేస్తున్నారు. 10 వేల కోట్ల వృథా.. దేశంలో ఆర్థిక సంపద పెరుగుతున్న మాదిరే మధ్య, దిగువ తరగతి సంపద వృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగానే శుభకార్యాల నిర్వహణ, వాటిల్లో ఆహార వంటకాలపై ఖర్చు పెరిగిందని కేంద్రం అధ్యయనం తేల్చింది. సమాజంలో ఆర్ధిక పరపతిని చూపేందుకు, సామాజికంగా తన బలాన్ని తెలిపేందుకు కార్యక్రమాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడటం లేదని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏటా రూ.1.10 లక్షల కోట్లు శుభకార్యాలపై ఖర్చు చేస్తుండగా, ఇందులో రూ.40 వేల కోట్ల మేర అంటే దాదాపు 40 శాతం ఆహార వంటకాలపై వెచ్చిస్తున్నారు. ఇందులో 15 నుంచి 25 శాతం అంటే రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోంది. వంటకాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, భారీగా జనాలు హాజరైనప్పుడే వృథా ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇక హైదరాబాద్లో ఏటా పెళ్లిళ్లు, ఇతర సామూహిక సమ్మేళనాల పేరిట రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని అంచనా ఉంది. ఇందులో రూ.4 వేల కోట్ల మేర వంటకాలపై ఖర్చు చేస్తున్నా, ఆహార వృ«థా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని కేంద్ర నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనలు ఇలా.. - అతిథుల సంఖ్యను పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఆహార వృథాపై అవగాహన కల్పించడమే సరైన మార్గం. - కొన్ని స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసేలా చూడాలి. - ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రణాళిక లేకపోవడంతో ఆహార వృథా అవుతోంది. దీన్ని నివారించాలి. - ఆహ్వాన పత్రికల మీద ఆహార వృథాపై అవగాహన సందేశాలతో పాటు కార్యక్రమానికి హాజరయ్యేది, లేనిది ముందే సమాచారం ఇచ్చేలా ఆహ్వానితులకు అవగాహన కల్పించాలి. - ఆహారాన్ని గౌరవించేలా, వృథా వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పేలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఈ అంశంపై బోధన ఉండాలి. - అస్సాం, రాజస్థాన్, మిజోరం, జమ్మూకశ్మీర్లో గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆరు రకాలైన వంటకాలు మాత్రమే శుభకార్యాల్లో వడ్డించాలనే నిబంధన ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఫలితం ఉంటుంది. - (సోమన్నగారి రాజశేఖర్రెడ్డి) -
లైఫ్ ఇద్దరిదైనప్పుడు లాస్ ఒక్కరికేనా...
సాక్షి, రామగుండం : ఈ రోజుల్లో కట్నం అనే ప్రసక్తి లేకుండా ఒక్క వివాహం కూడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. పేద, మధ్యతరగతి కుటుంబాలను ‘కట్నకానుకలు’ సతమతం చేస్తున్నాయి. ‘పెళ్లీడొచ్చిన కొడుకులు కట్నాలు తెచ్చే బంగారు బాతులు.. ఎదిగిన ఆడపిల్లలైతే..? తల్లిదండ్రుల గుండెలపై కుంపట్లు..’ అనే భావనతో ఉంటున్నారు. తరాలు మారుతున్నాయి.. నేటి యువతలో కూడా కొంగొత్తగా స్వరాలు ధ్వనిస్తున్నాయి. ఆదర్శ భావాలున్న ఆధునిక యువతరంలో అక్కడక్కడా కొత్తగా తొంగిచూస్తున్నాయి. ఒక వైపు తల్లిదండ్రుల పేదరికాన్ని గౌరవిస్తూనే.. మరోవైపు కట్నం కోసం పరితపించే వారి ఆలోచనల్ని సున్నితంగా మార్చేందుకు నేటి యువతరం ప్రయత్నిస్తోంది. ఇరువర్గాలను ఒప్పించి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. నేడు ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. చట్టం చేసి పాతికేళ్లు దాటినా.. వరకట్నం నిషేధపు చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు దాటింది. చట్టం అమలు చేయడంలో అనేక లోపాలు చోటు చేసుకుంటుండడంతో మహిళలు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. కోరి చేసుకున్న వివాహాల్లో కూడా కట్నం ప్రభావం చూపుతుండటం మహిళల పట్ల శాపంగా మారింది. పెరిగిపోయిన ధనాకాంక్ష, మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అదనపు కట్నం కావాలంటూ అనేక రకాలుగా హింసిస్తున్న సంఘటనటున్నాయి. కొందరు ఇవన్నీ మౌనంగా భరిస్తున్నారు. ఇంకొందరైతే తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టంలేక లోకాన్ని వదులుతున్నారు. 498–ఏ చట్టంలో మార్పులు.. మహిళల కోసం ఏర్పాటు చేసిన వరకట్న నిషేధపు చట్టం ‘498–ఏ’ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు కట్నం సమస్య కాకపోయినా అవగాహన లోపంతో భర్తతో పాటు అత్తమామ, ఆడపడులు, ఇలా అందరిపై కేసులు పెట్టి మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. 90 శాతం ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 498–ఏ చట్టంలో పలు మార్పులు చేసింది. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అవగాహన కల్పిస్తున్న వెబ్సైట్.. మ్యారేజ్ బ్యూరోలు, మాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఉన్నప్పటికీ యువతీ, యువకుల మధ్యవర్తిత్వం నెరవడం వరకే వారి పనిగా మారింది. ‘కట్నం’ ఇత్యాది విషయాల్లో జోక్యం చేసుకునేందుకు సాహసం చేయలేక పోతున్నారు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ దేశంలోనే తొలిసారిగా కట్నం ప్రసక్తి లేకుండా వివాహం చేసుకునే యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు పదిహేనేళ్ల క్రితం ‘ఐ డోంట్ వాంట్ డౌరీ.కామ్’ అనే పేరుతో హైదరాబాద్లో కొందరు వెబ్సైట్ను ప్రారంభించారు. ‘స్వయంవరం’ పేరుతో శ్రీకారం చుట్టిన ఈ వెబ్సైట్ సంస్థ నేటి తరం యువతతోపాటు పెద్దలు కూడా మారేలా అవగాహన కల్పిస్తోంది. వరకట్న నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని యైటింక్లయిన్కాలనీకి చెందిన టి.శ్రవణ్కుమార్– కృష్ణకుమారి అనే మాజీ సింగరేణి ఉద్యోగి దంపతులు ‘సదాశయ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థతో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కట్నం తీసుకోకుండా వివాహాలు జరగాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ప్రచారం చేయడం వరకే పరిమితం కాకుండా కట్నం తీసుకోకుండా ఇంట్లో పిల్లలకు పెళ్లిల్లు చేసి ఆదర్శంగా నిలిచారు. 1982లో తన సోదరుడు శ్రీనివాస్కు గీత అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం జరిపించాడు. అలాగే 2011లో తమ పెద్ద కుమారుడు విక్రంకు, సౌమ్య అనే అమ్మాయితో కట్నం తీసుకోకుండా వివాహం జరిపించారు. 2013లో కూడా వారి చిన్నకుమారుడు అన్వేష్కు సైతం శ్రవంతి అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతీ ఏడాది ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులను ఆదర్శంగా తీసుకున్న మరో ఆరు కుటుంబాలు కూడా వారి పిల్లలకు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేయడం గమనార్హం. సిరిసిల్లకల్చరల్: పెళ్లి ఇద్దరి జీవితాలను కలిపి శాశ్వతంగా నడిపించేది. జీవితం ఇద్దరిదైనప్పుడు ఒకరు మాత్రమే ఆర్థిక నష్టానికి ఎందుకు లోను కావాలి. అందుకే కట్నం అవసరం లేదనుకోవడం జరిగింది. 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అప్పట్లో పెళ్లి కుదుర్చుకునే సందర్భంలో కట్నం విషయం అంతగా ప్రస్తావనకు రాలేదు. పైగా సమీప బంధువుల అమ్మాయి కావడం కూడా కారణం కావచ్చు. కట్నం అవసరం లేకుండానే పెళ్లి జరిగింది. – కనుకుంట్ల లక్ష్మీపతి– జ్యోత్న్న కట్నం వద్దన్నలింగమూర్తి దంపతులు గోదావరిఖనిలోని సింగరేణి సంస్థ ఓసీపీ–1లో సీనియర్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న చెవుడవరపు లింగమూర్తి–రాజరాజేశ్వరి దంపతులు కట్నం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సింగరేణిలో మెకానికల్ ఫోర్మెన్ చేస్తున్న తన పెద్ద కుమారుడు యోగేష్ప్రకాష్కు కట్నం తీసుకోకుండా రవళికతో 2017లో వివాహం జరిపించారు. కట్నం వద్దంటూ కుమారుడికి పెళ్లి జరిపించిన లింగమూర్తి దంపతులను పలువురు అభినందిస్తున్నారు. కట్నం ముఖ్యం కాదు.. గుణగణాలు ఉంటే చాలు.. అంటూ లింగమూర్తి దంపతులు వరకట్నానికి వ్యతిరేకంగా సమాజంలో పెద్దల మనసు మార్చడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి.. గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన గోలివాడ ప్రదీప్కుమార్ 2017లో కేరళ రాష్ట్రం వాయినాడు ప్రాంతానికి చెందిన షాజిత అనే యువతిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శిబిరంలో నెహ్రూ యువ కేంద్రం తరుఫున పాల్గొన్న ప్రదీప్కుమార్కు అదే శిబిరంలో పాల్గొన్న షాజిత పరిచయమైంది. తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇరు వర్గాల పెద్దలను ఒప్పించారు. దీంతో కట్నం తీసుకోకుండా షాజితను పెళ్లి చేసుకున్నట్లు ప్రదీప్కుమార్ తెలిపాడు. పాప రితణ్య పుట్టడంతో చాలా హ్యాపీగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దంపతులు. -
పెళ్లిళ్లు అవుతున్నాయ్.. మాంద్యమెక్కడ?
న్యూఢిల్లీ: ‘విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి’ అని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడీ అన్నారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసి ప్రధాని మోదీ ప్రతిష్టను తగ్గించేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘మూడేళ్లకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం సహజమే. అది త్వరలోనే సర్దుకుంటుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సహా ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నాయి. దీనిపై సురేశ్ అంగడీ మాట్లాడుతూ, ఆర్థిక మందగింపు సహజమేనని, త్వరలో పుంజుకుంటుందని, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కారణం లేక, దీనిని ప్రస్తావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. -
రత్నాల పెళ్లి కూతుళ్లు
అది కేరళ రాష్ట్రం, తిరువనంతపురం నగరానికి సమీపంలో ఉన్న గ్రామం. పేరు పోథెన్కోడ్. ఆ ఊర్లో ఓ ఇంటి ముందు ‘పంచ రత్నం’ అని అందంగా రాసిన నేమ్ ప్లేట్ ఉంది. ‘అవును నా ఇంట్లో పంచరత్నాలున్నాయి. అందుకే ఇంటికి ఆ పేరు పెట్టుకున్నాను’ అని చెప్పేవారు ఆ ఇంటి యజమాని ప్రేమ్కుమార్. ఆయన భార్య రమాదేవి కూడా.. ‘అవును మరి, మా బిడ్డలు పంచరత్నాలు’ అని మురిసిపోయేది. ఇది ఆ ఇంటికి ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు కాదు, 1995, నవంబర్ 18వ తేదీన ఐదుగురు పిల్లలతోపాటు పేరు కూడా పుట్టింది. నిజమే, ఐదుగురు పిల్లలూ ఒకేసారి పుట్టారు. వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ల పేర్లు ఉత్రజ, ఉత్తర, ఉత్తమ, ఉత్ర. ఇక అబ్బాయి పేరు ఉత్రాజన్. వీళ్లు పుట్టినపుడే వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత పుట్టినరోజు, పదో తరగతి పాస్ అయిన సందర్భం... ఇలా వార్తల్లో కనిపిస్తూ స్థానికంగా సెలబ్రిటీలైపోయారు. ఇప్పుడు పెళ్లి కూతుళ్లుగా మరోసారి వార్తల్లోకొచ్చారు. కల నిజం కాబోతోంది ‘‘పిల్లలు పుట్టినప్పుడే... నలుగురమ్మాయిలకూ మంచి సంబంధాలు దొరికి నలుగురికీ ఒకేరోజు ఒకే వేదిక మీద ఆ దేవుని సన్నిధిలోనే పెళ్లి చేయాలని గురువాయూర్ శ్రీకృష్ణుడిని మొక్కుకున్నాను. ఆ కల నిజం కాబోతోంది’’ అన్నారు రమాదేవి. వచ్చే ఏడాది ఏప్రిల్ 26వ తేదీన గురువాయూర్లోని శ్రీకృష్ణుని దేవాలయంలో ఈ అమ్మాయిల పెళ్లి జరుగుతోంది. ఈ సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ప్రేమ్కుమార్ లేకపోవడం ఆ కుటుంబానికి పెద్ద లోటు. ఆయన ఐదేళ్ల కిందట హటాత్తుగా మరణించాడు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను రమాదేవి ఒంటిచేత్తో నిర్వహించారు. ఆమె అప్పటికే గుండె సమస్యతో బాధపడుతోంది. పేస్మేకర్తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కోఆపరేటివ్ బ్యాంకులో చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలను ప్రయోజకులను చేశారు రమాదేవి. అమ్మాయిల్లో ఉత్రజ, ఉత్తమ ఇద్దరూ అనస్తీషియా టెక్నీషియన్లు, ఉత్తర ఫ్యాషన్ డిజైనర్, ఉత్ర ఆన్లైన్ జర్నలిస్ట్. వాళ్ల ఏకైక సోదరుడు ఉత్రాజన్ ఐటీ ఉద్యోగి. మరి అతడి పెళ్లెప్పుడు? అంటే... ‘‘వాడు అధిరోహించవలసిన ఉన్నత శిఖరాలెన్నో ఉన్నాయి. ఆ తర్వాతే పెళ్లి’’ అని ఉత్రాజన్ తల్లి అంటున్నారు. -
ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్ కిందే లెక్క..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ నియంత్రణ చట్టం వచ్చినపుడు ‘మే మిద్దరం..మాకిద్దరు’ అనే నినాదం మార్మోగిపోయింది. అయినా జనాభా పెరుగుదల ఆగకపోవడంతో ‘మేమిద్దరం..మాకొక్కరు’ అంటూ నినాదంలో మార్పులు తెచ్చారు. అయితే కొందరు వ్యక్తులు ‘నేనొక్కడిని..నాకిద్దరు భార్యలు’ అంటూ పలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మదురై హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదురైకి చెందిన తేన్మొళి అనే మహిళ మదురై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నా భర్త పోలీసు కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఎస్ఐగా పదోన్నతి పొందాడు. 1982లో మాకు వివాహం కాగా ఆయనకు అంతకు ముందే ముత్తులక్ష్మి అనే మహిళతో వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో మా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొనగా ఉసిలంపట్టి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశాను. ఇద్దరి మధ్య జరిగిన సామరస్య పూర్వకచర్చల ఫలితంగారెండు కుటుంబాలను బాగా చూసుకుంటానని పెద్దల ముందు వాగ్దానం చేశాడు. 2011లో భర్త చనిపోగా పింఛను, ఇతరత్రా ఆర్థిక సహాయాలు నాకు అందలేదు. పోలీసుశాఖాపరంగా మంజూరైన మొత్తాల్లో 50 శాతం నాకు చెందేలా ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో పేర్కొంది.ప్రజాసేవలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఎంఎం సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అయితే వారు విధుల్లో ఉండగా బయటకురావడం లేదు, రిటైరయినా, మరణించిన తరువాత ఆర్థికవ్యవహారాల్లో వివాదాలు ఏర్పడి వెలుగుచూస్తున్నాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం మంచి నడవడిక అనిపించుకోదు. అంతేగాక చట్ట ప్రకారం నేరం. అయితే ఈ చట్టాలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తేన్మొళి కేసులో పోలీసులే రెండు పెళ్లిళ్లకు అనుకూలంగా రాజీ కుదర్చడం ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకున్నపుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రిటైరైన ఉద్యోగి మరణిస్తే అతని పింఛన్ సొమ్ము భార్యకు చెందేలా ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మార్చేందుకు వీలుపడదు కాబట్టి తేన్మొళి పిటిషన్ను కొట్టివేస్తున్నాను. అయితే రిటైరైన ఉద్యోగికి పింఛన్ మంజూరు చేసే ముందు సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరపాల్సి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణైతే శాఖాపరమైన చర్యలతోపాటూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తేన్మొళి పిటిషన్ను కొట్టివేశారు. -
మాంగల్య బలం
సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెళ్లిళ్లు చేయడం కష్టతరం అవుతున్న తరుణంలో ఆస్తులు అమ్మి పెళ్లిళ్లు చేసేవారిని, అప్పు లు చేసి పెళ్లిళ్లు చేసే వారిని ఎందరినో చూస్తుంటాం. పరువు, ప్రతిష్టల కోసం పెళ్లిళ్లు చేయడాని కి లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఎంతో ఇ బ్బందులకు గురి అవుతుంటారు. ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లను ఆడంబరంగా చేయడానికే ఇష్టపడుతు న్న నేటిరోజుల్లో ఈ గ్రామంలో మాత్రం అత్యం త నిరాడంబరంగా, అది కూడా సామూహికంగా వివాహాలను జరిపి ఆదర్శంగా నిలుస్తున్నారు. వధువైనా వరుడైనా పెళ్లి ఇక్కడే ఇటీవల ఐదు జంటలకు సామూహికంగా పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడ పురుషుడికి, స్త్రీలకు చట్ట ప్రకారం యుక్తవయస్సు వచ్చిన తర్వాత పెద్దలు అంగీకరించిన తర్వాతే పెళ్లికి అంగీకరిస్తారు. ఈ గ్రామంలో ఆడపిల్లను ఏ ఊరికి ఇచ్చినా వివాహంమాత్రం ఇక్కడే జరుపుతారు. వరుడు కూడా ఏ ఊరిలో పెళ్లి కుదిరినా ఈ గ్రామంలోనే పెళ్లి చేసుకుంటారు. కాలం ఎంతో మారుతున్న నేటి పరిస్థితుల్లో కూడా నేటి యువతీ యువకులు కూడా ఈ సంస్కృతి, సంప్రదాయాన్ని ఆచరిస్తుండటం అంతటా ప్రఖ్యాతి పొందింది. ఇంటి వాకిట్లోనే మాంగల్య ధారణ ఈ వివాహాల లగ్నపత్రికను కూడా సామూహికంగానే అచ్చు వేయిస్తారు. ఈ జంటలకు సంబంధించిన ఇరువైపుల వారిని ఆహ్వానిస్తారు. మాంగల్యధారణ మాత్రం వధువు పుట్టినింటనే జరగడం విశేషం. అందరూ కలిసి భోజనాలు, జాభజంత్రీల బృందాన్ని కలిపే ఎంపిక చేస్తారు. మొత్తం ఖర్చును లెక్కించి అందరూ సమానంగా భరిస్తారు. ఇంత తక్కువ ఖర్చులో వివాహం చేయడం సామూహిక వివాహ పద్ధతి వల్లే సాధ్యమైందని బెల్లదారహట్టి గ్రామ పంచాయతీ సభ్యుడు రుద్రముని సాక్షికి తెలిపారు. పెళ్లి ఖర్చులు తగ్గడంతో మిగిలిన డబ్బును కొత్త జంట ఇంటి అవసరాలకు ఉపయోగిస్తామని, అప్పుల బాధ కూడా దగ్గరకు రాదని సంతోషంగా చెప్పారు. దుబారా ఖర్చులకు చెక్ సామూహిక వివాహాలను కూడా నిరాడంబరంగా చేసుకుంటారు. కనీస సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామమైన ఈ ఊరులో ఈడిగ, కుమ్మర కులస్తులే ఎక్కువగా నివసిస్తున్నారు. 200 ఇళ్లు, 1500 జనాభా ఉండగా వీటిలో 150 ఇళ్లు ఈడిగ వర్గానికి చెందినవి. ఈ గ్రామంలో తమ తల్లిదండ్రుల వివాహం కూడా సామూహిక వి వాహ వేడుకల్లోనే జరిగిందని ఆ గ్రామ పం చాయితీ సభ్యుడు తెలిపారు. తన పెళ్లి కూ డా ఇదే విధంగా జరిగిందని, మా ఊరులో నివసిస్తున్న ఈడిగ వర్గానికి చెందిన అన్ని జంటల వివాహాలు సామూహికంగానే జరగ డం విశేషమన్నారు. ఒక్క జంటకు కూడా విడిగా ఇప్పటి వరకు పెళ్లైన దాఖలాలు లేవు. ప్రతి ఏటా సామూహిక వివాహ వేడుకలను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అర్హులైన వధూవరులు ముందుగా నిశ్చయాలు చేసుకుని సామూహిక వేడుకల్లో మూడుముళ్లతో దంపతులవుతారు. పేదైనా..ధనికైనా ఒక్కటే ధనవంతులైనా, పేదవారైనా ఆ గ్రామంలోని ఒక సామాజిక వర్గంవారు సామూహిక పెళ్లి వేడుక నిర్వహించి అక్కడే అందరికీ టిఫిన్లు, భోజనాలు వడ్డించడం సంప్రదాయంగా వస్తుండడం విశేషం. దీంతో ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు బంధుత్వాలు బలపడతాయి. చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం తళకు ఫిర్కా పరిధిలోని బెళ్లదారహట్టిలో ఈడిగ కులస్తులు పెళ్లిళ్లు సామూహికంగా చేసుకోవడం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. గ్రామంలో కనీసం రెండు మూడు పెళ్లిళ్లు కుదిరేవరకు వేచి చూస్తారు. -
కల్యాణం జరిపిస్తాం రండి
హిమాయత్నగర్: వివాహం చేసుకునేందుకు ఆర్థిక స్థోమత లేని అభాగ్యులకు ‘కోవిధ సహృదయ ఫౌండేషన్’ చేయూతనందిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ నెలలో వంద జంటలకు ఉచితంగా వివాహాలు చేసేందుకు సిద్ధమైనట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి తెలిపారు. గురువారం హిమాయత్నగర్లో ఆమె మాట్లాడుతూ.. బలహీనవర్గాల వారి కి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. వధూవరులకు సంబంధించిన ఇరువర్గాల వారు మాట్లాడుకుని అంతా సిద్ధం అనుకుంటే తాము నిర్వహిం చే సామూహిక పద్ధతిలో ఈ వివాహాలను జరిపిస్తామన్నారు. 100 జంటలకు వివాహా లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా మ న్నారు. పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఇరువర్గాల వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివరాలకు 86885 18655, 88850 03969లకు ఫోన్ చేసి ఈ నెల 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. -
ఐదుగురు యువతులను మోసగించి ఆరో పెళ్లి..
చెన్నై , తిరువొత్తియూరు: ఐదుగురు యువతులను మోసగించి పెళ్లి చేసుకుని, ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో పరారైన వ్యక్తిపై ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. దిండుక్కల్, తేనాంపట్టికి చెందిన మురుగన్ మల్లిక దుకాణం నడుపుతున్నాడు. అతనికి రాధ అనే యువతితో పరిచయమై ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను రాధ కుటుంబసభ్యులు తిరస్కరించారు. రాధ తల్లిదండ్రులను వద్దనుకుని మురుగన్తో వెళ్లి వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఎక్కెడికైనా వెళ్లి డబ్బు సంపాదించి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన మురుగన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రాధ భర్త కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. విచారణలో అతనికి ఇదివరకే నలుగురితో వివాహం అయ్యిందని, తాను ఐదో భార్య అని తెలియడంతో దిగ్భ్రాంతి చెందారు. ఇదిలాఉండగా మురుగన్ ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో కలిసి పరారైనట్టు తెలిసింది. దీంతో అయోమయంలో పడిన రాధ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని తల్లిదండ్రులు ఆదరించలేదని తెలిసింది. దీంతో విరక్తి చెందిన రాధ కొన్ని రోజులుగా ఆలయంలో దీనావస్థలో గడుపుతోంది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న రాధ తనను మోసం చేసి పారిపోయిన భర్తపై వడమదురై పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
అక్కడ ఆ మూడు నెలలు పెళ్లిళ్లు నిషేధం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల యూపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహ వేడుకలను నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయం రాష్ట్రం మొత్తం కాదు.. కేవలం ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) సిటీలో మాత్రమే. ఆ సమయంలో కుంభమేళా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. కుంభమేళా జరిగే మూడు నెలల కాలంలో ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు పెట్టుకోరాదని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికే పెళ్లి తేదీలను - ఫంక్షన్ హాళ్లను మాట్లాడుకున్న వారు వాటిని రద్దు చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్న వాళ్లు మరో చోటు వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఈ సీజన్ లో పెళ్లి తేదీలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెడ్డింగ్ బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వాటి నిర్వాహకులు వాపోతున్నారు. కుంభమేళా ముగిసే వరకు ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు నిర్వహించరాదు అని ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది. జనవరిలో మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో. ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాఘ పూర్ణిమ రోజుల్లో. మార్చిలో మహాశివరాత్రి పర్వదినాలలో జరిగే స్నానాల సమయంలో భారీ ఎత్తున భక్తులు వస్తారని అందుకే ఆ రోజుల్లో వివాహా వేడుకలు ఉంటే ఇబ్బందులు ఎదురయితాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది -
వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్లు!
దేశంలో ఇటీవలికాలంలో చిత్రవిచిత్ర కారణాలతో వివాహాలు రద్దవుతున్నాయి. అబ్బాయి భయస్తుడనీ, అమ్మాయి సరిగ్గా మాట్లాడటం లేదని సాకులు చెబుతూ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోతున్నారు. తాజాగా వాట్సాప్లో నిండా మునిగిపోయిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్లో కాబోయే భర్త షాకిచ్చాడు. వాట్సాప్లో గంటల తరబడి గడుపుతూ కాబోయే అత్తమామలకు భారీగా సందేశాలు పెట్టడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఆమ్రోహీ జిల్లాలో చోటుచేసుకుంది. ఆమ్రోహీ జిల్లాలోని నౌగావ్సాదత్ గ్రామానికి చెందిన ఉరోజ్ మెహందీ కుమార్తెకు ఫకీర్పురాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటి నుంచి అమ్మాయి వాట్సాప్లో కాబోయే అత్తమామలకు ఇష్టానుసారం సందేశాలు పెట్టడంతో ఈ నెల 5న వివాహ మండపానికి వరుడి కుటుంబ సభ్యలెవరూ రాలేదు. దీంతో అమ్మాయి తండ్రి ఫోన్ చేయగా తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వరుడి తండ్రి తెలిపాడు. అమ్మాయి ఎప్పుడూ వాట్సాప్లో ఉంటూ సందేశాలు పంపడంతో తమ కుమారుడు ఆమెతో పెళ్లికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశాడు. దీంతో వధువు తండ్రి ఉరోజ్ పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబం అడిగిన రూ.65 లక్షల కట్నాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రవిచిత్ర కారణాలతో చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. ♦ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన ఓ వరుడు తాము కోరిన మాంసాహారాన్ని వధువు కుటుంబ సభ్యులు వడ్డించలేదన్న కోపంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ♦ విందులో పెళ్లి కొడుకు సోదరుడికి ఇంకో రసగుల్లా ఇవ్వడానికి వధువు తరఫు బంధువులు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్లోనే మరో పెళ్లి ఆగిపోయింది. ♦ ఇక యూపీలోని షాజహాన్పూర్ కు చెందిన ఓ యువతి ఊరేగింపు సందర్భంగా పెళ్లికొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్తో చిరాకుపడి వివాహాన్నే రద్దు చేసుకుంది. ♦ బిహార్లోని సరన్లో మరింత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపుగా వస్తున్న పెళ్లికొడుకు ఉరుము శబ్దానికి అదిరిపడటంతో అంత పిరికివాడిని తాను పెళ్లి చేసుకోలేనని మరో యువతి తేల్చిచెప్పింది. దీంతో పీటల దగ్గరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. -
శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణలతో ఆదివారం రాత్రి శేషాచల కొండలు హోరెత్తాయి. వివాహాలకు అత్యంత బలమైన ముహూర్తాలు కావడంతో రాత్రి 7.21, 9.48 గంటల సమయాల్లో జోరుగా పెళ్లిళ్లు జరిగాయి. దీంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివెట్టి మండపం, అలాగే స్వామి కల్యాణ మండపాలు పూర్తిగా పెళ్లిజనాలతో నిండిపోయాయి. ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలులేనంతగా పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రంలో దాదాపు 60కు పైగా వివాహాలు జరినట్లు పురోహితులు చెబుతున్నారు. పెళ్లిబృందాల వాహనాలతో క్షేత్ర రహదారులు కిక్కిరిశాయి. దేవస్థానం, ప్రైవేటు సత్రాలు, కల్యాణ మండపాలు, గదులు పెళ్లివారితో నిండిపోయాయి. వివాహానంతరం నూతన వ«ధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు చినవెంకన్నను, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరి ముహూర్తాలు కావడంతో పాటు, మరో రెండు నెలల వరకు వివాహాలకు బ్రేక్ పడటంతో జిల్లా వ్యాప్తంగా వందలాదిగా పెళ్లిళ్లు జరిగాయి. -
ఇక పెళ్లిళ్లకు లెక్కలు ఉన్నాయ్..
పోడూరు : పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అంటూ వివాహం గురించి, పెళ్లి సందడి గురించి ఒక్క పాటలో కవులు తెలిపారు.మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక విశిష్టత ఉందని విదేశీయులు సైతం నమ్ముతారు. వివాహం తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతాయి. తాళి అనే బంధం ఏర్పడినప్పటి నుంచి కాటికి చేరే వరకు భార్యాభర్తలు ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తోడూ నీడగా ఉంటారు. అలాంటి పటిష్టమైన మన వివాహ వ్యవస్థను కట్న కానుకలు, లాంఛనాలనే చీడ పురుగు పట్టి పీడిస్తుంది. ఇటీవల పేద, ధనిక అనే తేడా లేకుండా ఆడంబ రాలకు పోయి తలకు మించిన ఖర్చులు పెడుతూ పెళ్లిళ్లు వైభవంగా జరిపిస్తున్నారు. అయితే కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వేధించే అత్తింటి వారు, అలాగే అత్తింటివారిపై తప్పుగా వరకట్న కేసులు పెట్టి వేధించే కోడళ్లను నిత్యం సమాజంలో చూస్తున్నాం. ఈనేపథ్యంలో వరకట్న వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం 498 చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు వరకట్న కేసులు కూడా నమోదవుతున్నాయి. భార్యాభర్తల గొడవల్లో కోర్టులకెక్కినపుడు పెళ్లి సమయంలో అనేక లాంఛనాలు సమర్పించామని, ఘనంగా ఖర్చు చేసి పెళ్లి జరిపించామని ఇరువైపుల నుంచి కోర్టులో పిటీషన్లు దాఖలవుతున్నాయి. కట్నం కోసం కట్టుకున్నదాన్ని తన్ని పుట్టింటికి తరిమివేసేవారు కొందరైతే, అత్తింటివారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే అతివలు మరికొందరున్నారు. ఇలా ఇరువైపుల నుంచి వచ్చే కేసుల దృష్ట్యా ఇలాంటి తప్పుడు కేసులు అరికట్టేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. దాని ప్రకారం పెళ్లి సమయంలో అయ్యే ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి సంబంధీకులు సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు. గతంలోనూ వివాహాల గురించి చట్టాలు వచ్చాయి. వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే చట్టం ఉన్నా అమలు చేసే అధికార యంత్రాంగం, ఆచరించే ప్రజలు లేక అవి నిష్ఫలమయ్యాయి. అందుకే చట్టాలు వచ్చినపుడు ప్రజలు దాన్ని అర్ధం చేసుకుని నడుచుకుంటే సత్ఫలితాలుంటాయి. అలాగే చట్టాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేసినపుడే ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి తెలపాలనే సుప్రీంకోర్టు సూచనను పలువురు మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరకట్న వివాదాలుండవు సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్టం చేస్తే ముఖ్యంగా మన దేశంలో వరకట్న వివాదాల కు చెక్ పడుతుంది. వరకట్న వివాదాల్లో చాలా వరకు తప్పుడు కేసులు ఉంటున్నాయి. పెళ్లిళ్ల పేరుతో చేసే ఆడంబరాలు తగ్గుతాయి. ఇలాంటి ఆడంబరాలు తగ్గించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.-కొప్పిశెట్టి ఏసుబాబు, గుమ్మలూరు అప్పుల బాధ తప్పుతుంది పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఒక ఆడ బిడ్డకు పెళ్లి చేయాలంటే లక్షల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి మనదేశంలో నెలకొంది. ఆర్థిక సామర్థ్యం లేకపోయినా కట్న కానుకలు, ఆడంబరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆ అప్పుల బాధ చాలా వరకు తగ్గుతుంది.తాళాబత్తుల వెంకటేశ్వరరావు, జిన్నూరు కచ్చితంగా అమలు చేయాలి పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి చెప్పాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలి. వరకట్న నిషేధం ఎప్పట్నుంచో అమలులో ఉన్నా సరిగా అమలు కావడం లేదు. వర కట్నాల వల్ల కొంత మంది సంసారాలు నాశనమవుతున్నాయి. అత్తింటి పోరు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అందే నాగేశ్వరరావు, రావిపాడు -
విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు
సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ గాయకుడు జాన్ నికోస్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్స్లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్తో ఆండ్రూ నీబోన్తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్ జోనాస్లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. గతంలో.. ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్ గుడ్నఫ్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్ బ్రెంట్ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. లాస్ వెగాస్లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్కు చెందిన లార్స్ జెల్సన్ అనే ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు. అరుణోదయ్ సింగ్ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్ హాలమ్. ఈమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ శశి కపూర్ బ్రిటీష్ నటి జెన్నిఫర్ కెండల్ను 1958లో వివాహమాడారు. సల్మాన్ ఖాన్, రొమేనియన్ మోడల్ లూలియా వాంటూర్కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపికే. -
ఔను..వాళ్లిద్దరూ విడిపోతున్నారు!
పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో ఓ మధురానుభూతినికలిగించే అంశం. పెళ్లీడుకొచ్చిన ప్రతి ఒక్కరూ కాబోయే జోడిని ఊహించుకుంటూ కలల ప్రపంచంలో తేలియాడుతుంటారు. వివాహమైన తర్వాత చాలా జంటలు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతుంటాయి. కానీ ఇటీవల కాలంలోవివాహమైన రెండు, మూడేళ్లకే విడాకుల కోసంకోర్టు మెట్లెక్కుతున్నారు. భార్యాభర్తల మధ్యఅపోహలు, అనుమానాలు, ఆర్థిక అసమానతలు, ఈర్షా్యద్వేషాలు తదితర కారణాలతో పండంటి కాపురాలను నిలువునా చీల్చుకుంటున్నారు.నూరేళ్లు నిలవాల్సిన మూడు ముళ్ల బంధంమూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. కర్నూలు : పెళ్లి ఎంత ఆడంబరంగా చేసుకుంటున్నారో అంతకంటే వేగంగా విడాకులకు సైతం సిద్ధమవుతున్నారు. ప్రేమ, అప్యాయతలతో ఆనందంగా గడపాల్సిన వారు అపోహలు, అనుమానాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు, వన్స్టాప్ సెంటర్లకు, న్యాయస్థానాలకు వస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం. ప్రతిరోజూ ఆయా కేంద్రాలకు మూడు నుంచి ఆరు జంటలు కౌన్సెలింగ్ కోసం వస్తున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. పెళ్లైన ఆరు నెలల నుంచి ఏడాది తిరగకుండానే అభిప్రాయ భేదాలు రావడం, గృహహింస, అనుమానాలు, సంసార జీవితం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో దంపతులు విడిపోతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అక్కడక్కడా ఉన్నా అమ్మాయి తరుపు వారు తమ కుమార్తె అత్తారింట్లో ఎందుకు చాకిరి చేయాలని భావించి వేరే కాపురం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంలోనే పెళ్లికాని వరకు ఎంతో అప్యాయంగా ఉండే అన్నదమ్ములు వివాహమయ్యాక ఆస్తిగొడవలు, వేరు సంపాదన పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా వేరు కాపురాలు అధికమయ్యాయి. దీనికితోడు ఉద్యోగాలు చేసే వారు అధికం కావడంతో చిన్న కుటుంబాలు అధికమయ్యాయి. చిన్న కుటుంబాల్లో ఏవైనా గొడవలు వస్తే సర్ది చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అధికమై చివరకు వారి బంధం విడాకులకు దారి తీస్తోంది. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్తో పాటు ఆయా స్టేషన్లకు ఏటా దాదాపు 2 వేల వరకు విడాకుల కేసులు నమోదు వుతున్నాయి. డొమెస్టిక్ వయెలెన్స్ సెంటర్కు ఏటా 150 కేసులు వస్తుండగా కౌన్సిలర్లు కొన్ని జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చేస్తున్నారు. కొందరు మాత్రం విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. సర్దుకుపోతేనే సంసారం మా వద్దకు పెళ్లైన రెండు, మూడేళ్లకే విడిపోవడానికి సిద్ధమయ్యే కేసులు అధికంగా వస్తున్నాయి. ఇందులో ప్రధాన కారణం సర్దుబాటులేకపోవడమే. మెట్టినింటి అలవాట్లు, పద్ధతులను ముందే భర్త/అత్త వివరించి చెప్పాలి. దీనికి అనుగుణంగా అమ్మాయి, అబ్బాయి కూడా సర్దుకుపోవాలి. చదువుకున్న వారు, ఉద్యోగుల్లో మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. నీకంటే నేనేమీ తక్కువ కాదన్న భావన ఇద్దరిలోనూ ఎక్కువవుతోంది. – నర్మద, డొమెస్టిక్ వయొలెన్స్ సెంటర్(డీవీసీ), కౌన్సిలర్ ఇతరులతో పోల్చుకో కూడదు ఆడమగా ఒకరి గురించి మరొకరి గుణగణాలు పూర్తిగా తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఈ కారణంగా మన ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. ఏ ఒక్కరూ 100 శాతం మంచిగా ఉండరు. ఏ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు ఒకే విధంగా ఉండవు. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. మనది ఇంకా మగవారిదే ఆర్థిక పెత్తనం ఉంటోంది. ఇద్దరూ సంపాదిస్తుంటే ఆడవారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. ఇతరులతో పోలికలు లేకుండా చూడాలి. – డాక్టర్ కె. నాగిరెడ్డి, మానసిక వ్యాధి నిపుణులు, కర్నూలు పచ్చని సంసారానికి మార్గాలు ⇔ భాగస్వాముల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ⇔ చిన్న విషయాలకే ఒకరినొకరు అనుమానించకూడదు. ⇔ అసూయ పడేలా వ్యవహరించొద్దు. ⇔ అభద్రతా భావన కలిగించరాదు. ⇔ నిత్యం మీ చుట్టూనే తిరగాలని కోరుకోకూడదు. ⇔ ఇతరుల మధ్య చులకన భావంగా మాట్లాడకూడదు. ⇔ ఆర్థిక విషయాల్లో ఇద్దరి మధ్య దాపరికాలు వద్దు ⇔ పరస్పరం భాగస్వామికి ప్రేమ, గౌరవం ఇవ్వాలి. ⇔ సంసార బాధ్యతలు పంచుకోవాలి. ⇔ ఏ విషయంలోనైనా చర్చించడానికి, రాజీ పడడానికి అవకాశం ఇవ్వాలి. ⇔ వ్యక్తిగత, వృత్తి గత జీవితాన్ని సమన్వయ పరచుకోవాలి. ⇔ చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ⇔ ఇద్దరి మధ్య అంతా పారదర్శకత ఉండాలి. ⇔ ఇద్దరి అనుబంధానికే కాక వారితో ముడిపడిన అన్ని బంధాలకు సమయాన్ని కేటాయించుకోవాలి. మేనరికాల్లో మనమే టాప్ మేనరికపు వివాహాలు జిల్లాలో అధికంగా జరుగుతున్నాయి. కొత్త సంబంధాల కన్నా తెలిసిన వారికి ఇచ్చి పెళ్లి చేయడమే శ్రేయస్కరమని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేవలం గ్రామీణులే గాక పట్టణాల్లో నివసించే విద్యావంతులు సైతం మేనరికాలకే ముందుగా ఓటు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య నిర్వహించిన సర్వేలో మేనరికపు వివాహాలు చేసుకునే రాష్ట్రాల్లో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నట్లు తేల్చింది. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని, కర్నూలు డివిజన్లలో మేనరికపు వివాహాలు ఎక్కువే. 32 శాతం మేనరికపు వివాహాలు జరుగుతున్నట్లు ఆ సర్వేలో పేర్కొంది. దీనికితోడు ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు కూడా ఎక్కువే. కనీసం అమ్మాయిని డిగ్రీ దాకా చదివిస్తే భవిష్యత్లో ఆమె కాళ్లపై ఆమె నిలబడుతుందన్న ఆలోచన కూడా చాలా మందికి ఉండటం లేదు. బయటకు పంపించాలంటే భయం, ప్రేమ వ్యవహారాలతో పరువు పోతుందనే ఆందోళన బాల్య వివాహాల వైపు అడుగులు వేస్తున్నారు. -
ఇంత బరువు భావ్యమా?
నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా హుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారింట’’ అన్నాడో సినీకవి. నిజమే! ఎవరం కోరుకునేదయినా అదే! వారి వారి అంతస్తులు, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా ఏ ఇంటి ఆడబిడ్డయినా, మగబిడ్డయినా యుక్తవయసు రాగానే సరిజోడయిన వారితో పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటాం. చక్కగా పెళ్లయి, సంతానం పొంది, పిల్లా, పాపలతో బతికినంత కాలం సుఖసంతోషాలతో ఉండాలనేదే ఎవరి కోరికైనా! మానవ మనుగడలో పెళ్లి అనేదొక కీలక ఘట్టం. ఇద్దర్ని జత కలపడమే కాకుండా, ఇకపై వారు ఉమ్మడిగా దాంపత్య జీవితం కొనసాగిస్తారని అందరికీ తెలియజెప్పడానికే పెళ్లి అంటారు పెద్దలు. ఇది, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబాల బహిరంగ వేడుక. దీవించ వచ్చే వందలు, వేలాది మంది దానికి సాక్షులు. సాధారణ పరిస్థితుల్లో పెళ్లి వీలయినంత తక్కువ వ్యయంతో జరగాలనే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు వెల్లడిస్తున్నాయి. కానీ, క్రమంగా పరిస్థితి మారుతోంది. ఒకరకంగా చేయి దాటిపోతోంది. పెళ్లి అనే పవిత్ర ప్రక్రియను చుట్టుముట్టి కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు వేర్వేరు కాలాల్లో చాలా కుటుంబాల్ని వేధించాయి, ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. కుటుంబాలే రగిలే సామాజిక అశాంతికి అవి పోసిన ఆజ్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడిక, అసాధారణ వ్యయభారంతో పెళ్లి ప్రక్రియే ఓ గుదిబండలా తయారయింది. ఖరీదయిన, ఖర్చుతో కూడిన పెద్ద ఆర్థిక వ్యవహారం అయింది. పేద, మధ్యతరగతి వారికి, ఉద్యోగులు, అల్పాదాయవర్గాలు, ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్నవారికి పెళ్లంటేనే భయం కలిగించే పరిస్థితి నెలకొంది. కొందరు సంపన్నులకిది ‘సంపద అసభ్య ప్రదర్శన’కు ఓ అవకాశమైంది. మరికొందరు, హంగూ –ఆర్భాటాల పెళ్లితో తమ ఆర్థిక–సామాజిక హోదాను చాటుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల పెళ్లిని ఓ పెద్ద తంతుగా మార్చి, లెక్కకు మిక్కిలి డబ్బు వ్యయం చేస్తున్న తీరు గగుర్పాటు కలిగిస్తోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. కొందరు హెచ్చు లకోసం, ఇంకొందరు దర్పం కోసం, మరి కొందరు సంపద ప్రదర్శన కోసం చేస్తే.... అత్యధికులు ‘ఇక మాకూ తప్పదేమో!’ అనే అపోహలో చేస్తున్నారు. సాటివారితో సరిపోల్చుకొని తామూ హంగులు, ఆర్భాటాలకు పోతున్నారు. ఈ వడిలో పడి ఆస్తులు కరిగిస్తున్నారు, లేదంటే అప్పుల పాలవుతున్నారు. కమ్మేసిన మార్కెట్ మాయ! సమాజంలో పలు అంశాల్లాగే క్రమంగా పెళ్లినీ మార్కెట్ మాయ కమ్మేసింది. పెళ్లి ఏ పవిత్రతనూ వదలకుండా ప్రతి అంశాన్నీ మార్కెట్ తన పిడికిట్లోకి లాక్కుంది. అనుబంధ వ్యవహారాలన్నింటిలోకి మార్కెట్ చొరబడింది. పెళ్లి చేసే వారి మెడపై కత్తి పెట్టి వసూళ్లకు దిగినట్టుంది పరిస్థితి. వారది తమ అవసరమనుకుంటే, వీరికిది అవకాశం! సాధారణ కుటుంబాల్లోనూ ఈ అయిదారేళ్లలోనే పెళ్లి వ్యయం సగటున 30 నుంచి 40 శాతం పెరిగింది. వెరసి ఒకో పెళ్లి ఖర్చు లక్షలు, కొన్నిచోట్ల కోట్ల రూపాయలకు విస్తరించింది. పదేళ్ల కింద, నగరంలో పేరు మోసిన ఓ డాక్టర్ నాతో మాట్లాడుతూ ‘‘.... ఏమిటిది! ప్లేటు 800 రూపాయలట, పెళ్లికి కనీసం 2000 మంది వస్తారనుకుంటున్నాము. ఒక్కపూట భోజనానికే 16 లక్షల రూపాయలు, మా వియ్యంకుడైనా, నేనైనా.. సరే మేమిద్దరం పెట్టగలిగిన వాళ్లం కనుక, చెరిసగం భరిస్తున్నాం. పెట్టలేని వాళ్ల సంగతేంటి? లేదు... ఎక్కడో ఈ దుబారా పరిస్థితి మారాలి. మీ బోటివాళ్లు ప్రసంగాల్లోనో, వ్యాసాల్లోనో చెప్పి ఓ సామాజిక మార్పుకు నాంది పలకాలి’ అన్నారు. ఈ దశాబ్దకాలంలో అది మారకపోగా మరింత దిగజారింది. స్థాయి ఉందో, లేదో కూడా చూసుకోకుండా నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ ఈ మూడూ దాదాపు తప్పనిసరి ప్రక్రియలయ్యాయి. పెళ్లి పత్రికల నుంచే చేతి చమురు వదలడం మొదలవుతుంది. అక్కడ్నుంచి బట్టలు–నగల కొనుగోళ్లు, మంటపాలు, వేదిక, పూల అలంకరణ, వీడియో ప్రొమోలు, డ్రెస్ డిజైనింగ్–మేకప్, ఫొటో–వీడియోగ్రఫీ, కొరియోగ్రఫీ.... ఇలా ప్రతి వ్యవహారమూ ఖరీదే! ఎంత గిరిగీసి లెక్కేసినా ఖర్చు గిర్రున తిరిగే మీటరే! వాటికి తోడు మెహంది, సంగీత్ ఉత్సవాలు జరిపే సంస్కృతి తోడయింది. అపరిమితమైన మాంసాహార భోజనాలు, మద్యం టేబుళ్లతో విందులు, రిటర్న్ గిఫ్టులు.... ఖర్చు ఆలోచించండి! ఇక రిసార్టులో, స్టార్ హోటళ్లో బుక్ చేసుకొని ఎక్కడో గోవానో, జైపూరో, ఇండొనేíసియానో.... వెళ్లి జరిపే ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వ్యయానికి లెక్కే లేదు. సంప్రదాయిక విలువలేమయ్యాయి? నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా çహుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ఇంటి ముంగిట పెళ్లి నిర్వహణ ఎంతో సౌలభ్యం! వచ్చేవారి సౌకర్యమనే సాకు చూపి అందరూ నేల విడిచి సాము చేస్తున్నారు, డబ్బు తగలేస్తున్నారు. మధ్య, అల్పాదాయాల వారిపై సంపన్నులు ఒత్తిడి పెంచుతున్నారు. నగరాలు, పట్టణాలు, చివరకు మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాళ్లలోనే పెళ్లిళ్లు. సీనియర్ పాత్రికేయుడొకరంటారు.. ‘మా ఊళ్లోగాని, మా మండలంలోగాని, ఆ మాటకొస్తే నాకు తెలిసిన వాళ్లెవరూ గడచిన మూడేళ్లలో.. ఇంటిముందు వేసిన పచ్చని పందిట్లో పెళ్లి జరిపిన సందర్భమే నే చూడలేదు’అని. ఫంక్షన్ హాళ్లదీ ఓ మాయ! హాలుకే పెద్ద మొత్తం చార్జీ చేస్తారు. అది కాకుండా ఇక వేదికపై అలంకరణ, కుర్చీలు, వంట సామగ్రి, దేనికదే ప్రత్యేక చార్జీ! పురోహితుడి నుంచి బాజా, భజంత్రీ, సన్నాయి, పూలవాడు, మైక్సెట్టు, పాటకచేరీ.... ఇలా అందరి వ్యాపారమూ హాల్ వాడితో ముడివడి ఉంటుంది చాలా సందర్భాల్లో! అదో మాయా మేళం! మండల కేంద్రాల్లో, రెండు మూడు పెద్ద గ్రామాల మధ్యలో ఇటీవల చాలా ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. కరీంనగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాలతో పాటు పలు పట్టణాల్లో దాదాపు కమ్యూనిటీ హాళ్లన్నీ ఇలాంటి కమర్షియల్ ఫంక్షన్ హాళ్లయ్యాయి. ఆర్థికంగా స్థితిమంతులయిన వారు హడావుడి చేస్తున్నారు. సామాజికంగా, బంధుత్వాల పరంగా సమస్థాయిగల వారు తమ వద్ద సొమ్ము లేకపోయినా... హెచ్చులకు అదే స్థాయిలో పెళ్లిళ్లు్ల చేస్తున్నారు. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ చేయి కాల్చుకుంటున్నారు. పోల్చి చూసుకోవడం, ఫలానా వారికన్నా తగ్గొద్దనే భావనలు పెరిగాయి. ఖర్చు తట్టుకోవడానికి, ఉంటే ఆస్తులు కరిగేసుకోవడం, లేదంటే అప్పో, సప్పో చేయడం రివాజయింది. అప్పటి వరకు నిబ్బరంగా, గౌరవంగా బతికిన కుటుంబాలు, పెళ్లి తర్వాత చితికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. హన్మకొండలో తాహతుకు మించిన ఖర్చుతో పెళ్లి చేసిన ఓ ఉమ్మడి కుటుంబం తర్వాత విడివడి, చితికిపోయింది. కరీంనగర్లో ఓ వ్యాపారి పెళ్లి జరుగుతున్నంత సేçపూ హెలికాప్టర్తో పూలవర్షం కురిపించి, తర్వాత ఐటీ దాడులు, ఆస్తికి సరితూగని ఆదాయవనరులు... కేసుల్లో ఇరుక్కుని నలిగిపోయాడు. చట్టపరంగా నియంత్రించే యత్నాలు... పెళ్లికొచ్చే అతిథుల సంఖ్యపైన, వంటకాలపైన, మొత్తం పెళ్లి ఖర్చులపైన పరిమితులు విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇందుకోసం ఓ చట్టమే ఉండాలనేది అభిమతం. కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ లోక్సభలో కిందటేడు ఒక (ప్రయివేటు మెంబరు) బిల్లును ప్రతిపాదించారు. ఈ ‘పెళ్లి (తప్పనిసరి రిజిస్ట్రేషన్–అనవసర వ్యయ నియంత్రణ) బిల్లు’కు ఆమోదం లభించలేదు. 2011లో అఖిలేష్ దాస్గుప్త రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు లాంటిదే! అతిథుల సంఖ్య, విందులో వంటకాలపై పరిమితికి యత్నం. పెళ్లి ఖర్చు రూ.5 లక్షల వరకే అనుమతించాలని, మించితే పది శాతం చొప్పున స్థానిక ప్రభుత్వాలకు చెల్లించేలా చర్యలుండాలని ప్రతిపాదించారు. ఆ డబ్బును పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని ప్రతిపాదన. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1996లో సరోజ్ కపర్దే, 2005లో ప్రేమ్ కరియప్ప రాజ్యసభలోను, 2005లోనే తెలుగు ఎంపీ రాయపాటి సాంబశివరావు, 2011లో పి.జె.కురియన్, అదే సంవత్సరం మహేంద్ర చౌహాన్లు లోక్సభలో దాదాపు ఇటువంటి బిల్లుల్నే ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చులపైన, జల్సాలపైన, ఆహారం వృథాపైన నియంత్రణ ఉండాలంటూ ఇలాంటి బిల్లులు జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిపాదనకు వచ్చాయి. పొరుగుదేశం పాకి స్తాన్లో పెళ్లి వ్యయం, అతిథుల సంఖ్యపై నియంత్రణ ఉంది. పెళ్లిళ్లు, రిసెప్షన్లలో వచ్చే అతిథుల సంఖ్య, వడ్డించే ఆహారపదార్థాల సంఖ్య, మైకుల వినియోగం, టపాసులు కాల్చడంపై నియంత్రణ విధిస్తూ గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఇదే యత్నాలు ఇతర రాష్ట్రాల్లోనూ సాగుతున్నాయి. సమగ్ర చట్టం వస్తే తప్ప ఈ పెళ్లి దుబారాలను, డీజేలు, రికార్డింగ్ డాన్స్లు, పెద్దపెద్ద శబ్దాలతో గంటల తరబడి సాగే బారాత్లను నియంత్రించలేమని పోలీసులంటు న్నారు. పబ్లిక్ న్యూసెన్స్ తప్ప వేరే కేసులు పెట్టలేకపోతున్నామని వారి వాదన. పెళ్లి ముగింపు కాదు ఆరంభం ఉన్న డబ్బంతా కరిగించి జల్సా చేయడానికి పెళ్లేం ముగింపు వేడుక కాదు, ఇది దాంపత్య జీవితానికి ఆరంభం! పెళ్లిలో దుబారా ఆపి, పొదుపు ద్వారా మిగిల్చే డబ్బు ఆ దంపతులకిచ్చినా ఓ గొప్ప భరోసాతో వారి ఉమ్మడి జీవితం మొదలవుతుంది. తదుపరి దశలో పిల్లల పెంపకం, విద్య, వైద్యం వంటి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు, నియంత్రించ గలిగిన చోటన్నా ఎందుకు చేయరనేది ప్రశ్న! పెళ్లి జీవిత కాలపు వేడుకే! అది జీవితాన్ని వెలిగించేదవాలి తప్ప ఖర్చు తడిసి మోపెడై నలిపేసేది కావద్దు! దిలీప్ రెడ్డి dileepreddy@sakshi.com -
‘నువ్వు నాకు ఏడో భార్యవు’
లఖ్నవూ, ఉత్తరప్రదేశ్ : ‘నువ్వు నాకు ఏడో భార్యవు’ అనే భర్త మాటల్ని సరదా తీసుకున్న భార్య అదే నిజమని తెలిసి హతశురాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన సమీర్ అనే వ్యక్తికి ఏడాది క్రితం లఖ్నవూకి చెందిన అఫ్షా అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి పని పేరుతో తరచూ బయటి ఊళ్లకు సమీర్ వెళ్లి వస్తుండేవాడు. అలా వచ్చినప్పుడు అఫ్షాతో సరదాగా ‘నువ్వు నాకు ఏడో భార్యవు’ అంటూ ఆటపట్టిస్తుండేవాడు. సరదాకి అంటున్నాడని భావించిన అఫ్షా కూడా సమీర్ మాటలను అంతగా పట్టించుకోలేదు. అయితే నేహా అనే యువతి నుంచి తరచూ సమీర్కు ఫోన్లు వస్తుండటంతో అఫ్షాకు అనుమానం కలిగింది. సమీర్ ఫోన్ను చెక్ చేసేందుకు ఆమె యత్నించడంతో అతను వారించాడు. దీంతో సమీర్కు తెలీకుండా అతని ఫోన్ను తెరచి నేహాకు కాల్ చేసింది. నేహా సమీర్ తన భర్త అని చెప్పడంతో అఫ్షా హతశురాలయ్యారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అఫ్షాను ఎలాగైతే ఏడో భార్య అంటుండేవాడో, నేహాను సమీర్ తరచుగా తొమ్మిదో భార్య అనేవాడట. దీంతో సమీర్పై అఫ్షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులకు తాను మూడు పెళ్లిళ్లే చేసుకున్నానని సమీర్ చెప్పడంతో అవాక్కవ్వడం వారి వంతైంది. ఒకరికి తెలీకుండా మరొకరిని కలుస్తూ అవసరానికి బ్యాంకుల ద్వారా సమీర్ డబ్బు పంపేవాడని పోలీసులు తెలిపారు. -
హిజ్రాల పెళ్లిసందడి
అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టు కూవాగంలోహిజ్రాలుముస్తాబయ్యారు. సంప్రదాయవస్త్రాలతో నవ వధువులుగా మారారు. కూత్తాండవర్ఆలయంలో తాళి కట్టించుకుని ఆనందపారవశ్యంలో మునిగారు సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో ఏటా చిత్తిరై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి ఉత్సవాలు హిజ్రాలకు ఓ పండుగే. దేశ విదేశాల్లోని హిజ్రాలకు ఓ వసంతోత్సవమే. మహాభారత యుద్ధగాథతో ఇక్కడి ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని హిజ్రాలు తమ ఆరాధ్యుడిగా కొలుస్తూ ఈ ఉత్సవాల సంబరాల్లో మునిగి తేలుతారు. ఆ దిశగా కూవాగంలో కొలువై ఉన్న కూత్తాండవర్ తమ ఆరాధ్య ఐరావంతుడిగా భావించి తరిస్తారు. ఇక్కడి ఉత్సవాలు గత నెల ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తు్తన్నారు. మహాభారత గాథను ప్రజలకువివరిస్తూ ఇక్కడ నాటక ప్రదర్శన సాగింది. పెళ్లి సందడి: ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం సాయంత్రం జరిగింది. అత్యంత వేడుకగా జరిగే ఈ మహోత్సవానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు సోమవారమే ఇక్కడికి తరలి వచ్చారు. ఎటుచూసినా, ఎక్కడ చూసినా హిజ్రాలతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. అందగత్తెలకు తామేమి తక్కువ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని కూవాగంకు ప్రత్యేక వన్నెను హిజ్రాలు తీసుకొచ్చారని చెప్పవచ్చు. వీరిని చూడడానికి ఆ పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున వెలిసిన దుకాణాల్లో పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్లను ఉదయం నుంచి కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి, విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం తరలి రావడం విశేషం. సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాబైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి చేతుల మీదుగా తాళిబొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. ఈ వేడుకతో కూవాగంలో పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఇక, రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారంతో íßహిజ్రాలు సందడి చేశారు. ఆట, పాటలతో ఆనందం తాండవంతో ఐరావంతుడ్ని తమ భర్తగా స్వీకరించి స్వామి సేవలో తరించారు. మిస్ కూవాగంగా మోబీనా: పెళ్లి సందడికి ముందుగా, వయ్యారాల ఒలక బోస్తు హిజ్రాలు తమసత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. అందగత్తెలకు, మోడల్స్కు తామేమి తీసిపోమన్నట్టుగా ర్యాంప్పై అలరించారు. వయ్యారాలే కాదు, తమలోని ప్రతిభను చాటుకున్నారు. దక్షిణ భారత హిజ్రాల సంఘం, తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, విల్లుపురం హిజ్రాల సంఘం తదితర సంఘాల సంయుక్తంగా మిస్ కూవాగం పోటీలను నిర్వహించాయి. 72 మంది హిజ్రాలు పోటీ పడగా, వివిధ కేటగిరిల వారీగా ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు. ఇందులో చెన్నై అరుంబాక్కంకు చెందిన మోబీనా మిస్ కూవాగం కిరిటాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానాన్ని చెన్నై పోరూర్కు చెందిన ప్రీతి, మూడో స్థానాన్ని ఈరోడ్కు చెందిన శుభశ్రీ దక్కించుకున్నారు. కార్యక్రమానికి సినీ నటి కస్తూరి, నటుడు విమల్, రచయిత స్నేహన్, విల్లుపురం జిల్లా ఎస్పీ జయకుమార్, ఏఎస్పీ శంకర్ హాజరయ్యారు. -
బీచుపల్లిలో వివాహాల సందడి
ఇటిక్యాల(అలంపూర్): వివాహాలకు మంచి ముహూ ర్తం ఉండడంతో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఎక్కడ చూసినా ఆలయాలు, కళ్యాణ మండపాల్లో పెళ్లి సందడి కనిపించింది. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లిలో ఒకేరోజు 20 వివాహాలు జరిగాయి. పుణ్యక్షేత్రంలోని టీటీడీ, కోదండ రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో మొత్తం 20 వివాహాలు జరిగాయని సిబ్బంది తెలిపారు. ఆయా వివాహాలకు హాజరైన భక్తులతో బీచుపల్లి కిక్కిరిసిపోయి కనిపించింది. -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్ను బట్టి ఫంక్షన్హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
రాష్ట్రంలో పెళ్లి పండుగ.. పెద్ద ఎత్తున వివాహాలు
సాక్షి, అమరావతి : మూడు నెలల విరామం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి ముచ్చట్ల సంబరాలు మొదల వుతున్నాయి. నేటితో మూఢాలు ముగియడంతో సోమవారం నుంచి భాజా భజంత్రీలు మోగనున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకూ రెండు మూఢాలు రావడం, మంచి రోజులు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభ కార్యాలకు ముహూర్తాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫాల్గుణ మాసంలో ఈనెల 19 నుంచి ముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. మార్చి 3, 4వ తేదీల్లో వివాహాలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ లగ్నాలను ఖరారు చేసుకున్నారు. శుభలేఖలు పంచి వివాహ వేదికలను బుక్ చేసుకుని పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జూలై 7 వరకూ శుభకార్యాల సందడి పండితుల సమాచారం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంలో జూలై 7వ తేదీ వరకూ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో సంబంధాలు ఖరారైన కుటుం బాలు ఫాల్గుణ, భాద్రపద, మార్గశిర మాసాల్లో వివాహాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర నగరాల్లో మార్చి 3, 4వ తేదీల్లో అత్యధిక కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల ముందస్తు బుకింగ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దూర ప్రాంతాల నుంచి పురోహితులు.. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటంతో కొందరు దూర ప్రాంతాల నుంచి పురోహితులను రప్పిస్తున్నారు. బ్యాండ్ మేళం, క్యాటరింగ్, వేదికల అలంకరణ బృందాలకు డిమాండ్ పెరిగింది. ఇక పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ఖర్చులకు తోడు జీఎస్టీ అదనపు భారంగా మారిందని మధ్యతరగతి కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి. ఖరీదైన వేడుకలు... పెళ్లి వేడుకలు చూసేవారికి బాగుంటున్నా ఖర్చులు మాత్రం సాధారణ కుటుంబాలు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఏసీ సదుపాయం ఉన్న కల్యాణ వేదికల ఒకరోజు అద్దె హాల్ పరిమాణాన్ని బట్టి రూ. 70 వేల నుంచి రూ.1.3 లక్షల వరకూ ఉంది. ఏసీకి, నాన్ ఏసీకి మధ్య రూ.20 వేల వరకూ వ్యత్యాసం ఉంటోంది. విజయవాడలో మధ్యస్థాయి ఫంక్షన్ హాళ్ల అద్దె రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉంది. ఇక వివాహ వేదికల అలంకరణ ఖర్చు కనీసం రూ.లక్ష పైమాటే. సీమకు బెంగళూరు రోజా పూలు.. రాయలసీమలో పెళ్లి మండపాల అలంకరణకు రకరకాల రోజా పూలను బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. అలంకరణ పనులను కాంట్రాక్టుకు ఇవ్వడం రివాజుగా మారింది. ఫంక్షన్ హాలు పరిమాణం, అలంకరణ తీరు ఆధారంగా లక్ష నుంచి రెండు లక్షల వరకూ తీసుకుంటున్నారు. అరటి పిలకలు కట్టడం, మామిడి తోరణాలు, పూలతో అలంకరణ దాకా అంతా వారే చూసుకుంటారు. భారీ కల్యాణ మండపాల అలంకరణ ఖర్చు ఐదారు లక్షల రూపాయల వరకూ ఉంటుందని బెంగళూరుకు చెందిన అలంకరణ కాంట్రాక్టరు విజయసింహరాజు తెలిపారు. పసందైన విందుకు భారీ ఖర్చు... కోస్తాలో పెళ్లంటే బొబ్బట్లు, జిలేబి, జీడిపప్పుతో కూడిన చక్కెర పొంగలి లాంటి స్వీట్లతోపాటు గారె, కూరగాయల బిర్యానీ, నోరూరించే పులిహోర తదితరాలు మెనూలో తప్పనిసరిగా మారాయి. ప్రాంతాన్ని బట్టి వంటకాలు మారుతుంటాయి. మాంసాహారమైతే మెనూ వేరుగా ఉంటుంది. గతంలో పెళ్లిళ్లకు వంటవాళ్లను పిలిపించి సరుకులు తామే తెప్పించి చేయించేవారు. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ కేటరింగ్ పార్టీలకే అప్పగిస్తున్నారు. ఎంతమంది వస్తారు? పిండివంటలు, ఆహార పదార్థాలు ఏం ఉండాలో చెబితే చాలు. వడ్డించడంతో సహా అంతా కేటరింగ్ పార్టీ వారే చూసుకుంటారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి నగరాల్లో మధ్యతరగతి పెళ్లిళ్లకు ఒక్కో ప్లేటు భోజనానికి మెనూను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకూ తీసుకుంటున్నారు. ఉదాహరణకు వెయ్యి మందికి భోజనం పెట్టాలంటే ప్లేటు రూ.250 ప్రకారం రూ.2.50 లక్షలు అవుతుంది. ఉదయం అల్పాహారం బిల్లు దీనికి అదనం. డ్రోన్లతో చిత్రీకరణ.. గతంలో పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు వచ్చి ఫొటోలు, వీడియోలు తీసేవారు. కాలంతోపాటు అదికూడా మారిపోయింది. ప్రస్తుతం డ్రోన్లతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. -
3,400 మందిని ఎత్తుకెళ్లి పెళ్లి చేశారు
పాట్నా, బిహార్ : బలవంతపు పెళ్లిళ్లు బిహార్ రాష్ట్రంలో తారాస్థాయికి చేరాయి. అబ్బాయిని అపహరించి, తలకు గన్ను గురిపెట్టి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టించిన 3,400 సంఘటనలు 2017లో జరిగాయి. వరుడికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇలా బలవంతంగా వివాహం జరిపే పద్దతిని బిహార్లో ‘పకడ్వా వివాహ్’ అని పిలుస్తారు. వినడానికి ఈ పద్దతి ఆశ్చర్యంగా అనిపించినా.. బలవంతపు పెళ్లి సందర్భంగా నాకు ఈ పెళ్లి వద్దూ అంటూ అబ్బాయిలు కిందపడి ఏడ్చేసిన సందర్భాలు కోకొల్లలు. తలకు తుపాకీ గురిపెట్టి, లేదా కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరించి 3,400 యువకులకు 2017లో పెళ్లి తంతు జరిపించినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో ‘పకడ్వా వివాహ్’లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు సూచించాం’ అని పోలీసు శాఖా ఉన్నతాధికారులు చెప్పారు. బిహార్ రాష్ట్రంలో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015 లెక్కల ప్రకారం 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిలను అపహరించడంలో దేశంలోనే బిహార్ మొదటి స్థానంలో ఉంది. పకడ్వా వివాహ్ బిహార్లో ఓ సామాజిక సమస్య అని, వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లికుమార్తె తరఫు వారు ఈ పద్ధతిని పాటిస్తున్నారని సామాజిక వేత్త మహేంద్ర యాదవ్ చెప్పారు. -
పెళ్లి పేరుతో మహిళ మోసం
చిత్తూరు,తిరుపతి కల్చరల్: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు. తిరుపతి శివజ్యోతినగర్లో కాపురమున్న గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
పెళ్లిళ్ల రాయుడు.. పురుషోత్తమన్
అన్నానగర్ (చెన్నై): అతడి పేరు పురుషోత్తమన్...తానో సచ్చీలుడిగా ప్రచారం చేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరిని.. అలా ఏకంగా ఎనిమిది మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఆపై వారి నుంచి కోట్లాది రూపాయాలు కాజేసి పరారైపోయాడు. పాపం పండడంతో పెళ్లిళ్ల బ్రోకర్లతో పాటు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు వెళ్ళలూర్కి చెందిన పురుషోత్తమన్ (57) తనను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుని భార్య మృతి చెందడంతో రెండో వివాహం చేసుకోదలిచినట్లు కోయంబత్తూరులోని ‘మెట్టిఒలి కళ్యాణ సమాచార కార్యాలయం’లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ కార్యాలయాన్ని నడుపుతున్న మోహనన్ (65), అతని భార్య వనజాకుమారి (53)లు కుముదవల్లి (45) అనే మహిళ వద్ద పురుషోత్తమన్ గురించి గొప్పగా చెప్పారు. కుముదవల్లి..పురుషోత్తమన్ని నేరుగా కలవగా తన భార్య మృతి చెందడం, కళాశాలలో చదువుతున్న కుమార్తె ఆలనపాలన చూసుకునేందుకే రెండో వివాహానికి సిద్ధమైనట్లు నమ్మబలకడంతో గతేడాది ఆగస్టులో పురుషోత్తమన్ను పెళ్లి చేసుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చినట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కుముదవల్లి నుంచి రూ.3 కోట్లు తీసుకుని పురుషోత్తమన్ పరారైయ్యాడు. అనుమానం వచ్చిన కుముదవల్లి అతడి గురించి ఆరాతీయగా కోయంబత్తూరుకు చెందిన సబితా, ఉషారాణి, శాంతి, సుశీల, చెన్నై అన్నానగర్కి చెందిన ఇందిరాగాంధీ, ఈరోడ్కు చెందిన చిత్ర సహా మొత్తం ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుని కోట్లాది రూపాయలు కాజేసి వారిని మోసం చేసినట్లు తెలుసుకుంది. తండ్రి మోసాలకు కుమార్తె గీతాంజలి కూడా సహకరిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు కుముదవల్లి ఫిర్యాదు చేసింది. -
మూడు పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ అరెస్ట్
గుంటూరు : మూడు పెళ్లిళ్లు చేసుకున్న చిలూకూరి వీరాంజనేయులు అనే నకిలీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరాంజనేయులు మూడో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్గా నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడైంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో 9 ఏళ్ల పాటు టెక్నీషియన్గా వీరాంజనేయులు పని చేశారు. అక్కడ గడించిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల క్లినిక్లు ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పేరుతో నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యలు 1, 2, 3...8, అందరినీ మోసం..
కోయంబత్తూరు : సరకు రవాణా వ్యాపారం అంతగా లాభసాటిగా సాగడం లేదు. అందుకే ‘పెళ్లి’ని వ్యాపారంగా మార్చి.. తాళిని ఎగతాళి చేయాలని భావించాడో ఘనుడు. అందులో విజయం సాధించడమే కాక భార్యలను మోసంగించి కోట్లకు పడగలెత్తాడు. వరుసపెట్టి ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని వారిని రూ.4.5 కోట్ల మేర ముంచాడు. కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి. పురుషోత్తమన్(57) కోయంబత్తూర్లోని వెల్లలూర్లో నివాసం ఉండేవారు. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఆయనకు కుమార్తె గీతాంజలి(18) ఉంది. కోయంబత్తూర్లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్న పురుషోత్తమన్.. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎనిమిదేళ్లలో మొత్తం ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. చెన్నైకు చెందిన ఇందిరా గాంధీ(45) కూడా పురుషోత్తమన్ చేతిలో మోసపోయారు. లెక్చరర్గా పనిచేస్తున్న ఇందిరా గాంధీకి మాయమాటలు చెప్పి పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండడంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్లో కొనుగోలు చేయాలని చెప్పాడు. పురుషోత్తమన్ మాటలు నిజమేనని నమ్మి రూ.1.5 కోట్లకు అమ్మి డబ్బును అతని చేతిలో పెట్టింది. డబ్బు చేతికి అందిన మరుక్షణం నుంచి మళ్లీ అతడు ఇందిర కంటికి కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పురుషోత్తమన్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఇందిరా నిర్ఘాంతపోయారు. కుముదవల్లి అనే మహిళను కూడా పురుషోత్తమన్ ఇలానే మోసం చేశాడని తెలిసి కుప్పకూలిపోయారు. తనకు రావాల్సిన రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని పురుషోత్తమన్ కుముదవల్లిని కోరాడని పోలీసులు తెలిపారు. అతడిని గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టిందని చెప్పారు. ఆ తర్వాత పురుషోత్తమన్ కనిపించకుండా పోయాడని వివరించారు. పురుషోత్తమన్పై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. -
సెలబ్రిటీల కల్యాణాలతో సందడే సందడి
సాక్షి, తిరుమల: మూడు ముళ్లు.. ఏడడుగులు.. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. యువతీ యువకులకు అందమైన కల.. మధురమైన జ్ఞాపకం. ఇంతటి గొప్ప వివాహ వేడుకను నిత్య కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అందరూ తపిస్తుంటారు. సప్తగిరీశుడి సన్నిధిలో ఏడాది పొడవునా వివాహబంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటాయి. సెలబ్రెటీలు సైతం ఈ దివ్యక్షేత్రంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. నాటి మేటి నటి జమున నుంచి రంభ వరకు సెలబ్రిటీ లెందరెందరో ఇక్కడ వివాహం చేసుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీల వేడుకను మరోసారి మనం తిలకిద్దాం.. జమున–రమణరావు నాలుగు దశాబ్దాల కిందట అలనాటి నటి జమున,రమణరావు వివాహం తిరుమలలో జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో వైభవంగా వేడుక సాగింది. అప్పట్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో సినీ తారలు విచ్చేశారు. వారిని చూసేందుకు ఏపీ, తమిళనాడు నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ మీద జరిగిన జమున పెళ్లి వేడుకను నేటికీ స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. బాలకృష్ణ–వసుంధర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, దివంగత ఎన్టీ రామారావు కుమారుడు హీరో బాలకృష్ణ, వసుంధర వివాహం తిరుమలలో జరిగింది. రెండున్నర దశాబ్దాల కిందట పడమర మాడ వీధిలోని కర్ణాటక సత్రంలో వారి పెళ్లి జరిగింది. ఇదే సందర్భంలోనే బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, జయశ్రీ వివాహం జరిగింది. అప్పటికే హీరోగా రాణిస్తున్న బాలకృష్ణ వివాహ మహోత్సవానికి సినీనటులు, రాజకీయ నేతలు విచ్చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తరలివచ్చారు. ఘట్టమనేని రమేష్ సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ్ణ పెద్ద కుమారుడు, హీరో రమేష్బాబు వివాహం జూన్ 18,1998లో ఇక్కడి కర్ణాటక సత్రాల్లో జరిగింది. కృష్ణ పెద్దకుమార్తె మంజుల,సంజయ్ స్వరూప్ల వివాహం కూడా ఇక్కడి శ్రీశృంగేరి శంకర మఠం లో జరిగింది. సినీ పరిశ్రమలోని పెద్ద లంతా హాజరయ్యారు. శ్రీకాంత్–ఊహ పదిహేనేళ్లకు ముందు ఇక్కడి ఎస్ఎంసీ కల్యాణ మండపంలో శ్రీకాంత్, ఊహ కల్యాణం జరి గింది. అప్పటికే ఇద్దరూ కూడా సినీస్టార్లుగా చిత్ర పరిశ్రమలో ఉ న్నారు. వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నటులు విచ్చేసి ఆశీర్వదించారు. మీనా–విద్యాసాగర్ నటి మీనా–సాఫ్ట్వేర్ ఇంజినీర్ కె.విద్యాసాగర్ వివాహం 2009, జూలై 12న తిరుమలలో జరిగింది. బాలనటిగా, 1990లో సీతా రామయ్య గారి మనుమరాలు’ చిత్రంతో హీరోయిన్గా, 2009లో ‘వెంగమాంబ’ వంటి ఎన్నెన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన మీనా పెళ్లివేడుక ఇక్కడి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో జరిగింది. నటులు సంఘవి, రాగిణి, కృష్ణ వేణి, దర్శకుడు చేరన్, నిర్మాతలు వి.దొరస్వామి రాజు, టి.శివ, పలువురు నటులు, ప్రము ఖులు హాజరయ్యారు. మహేశ్వరి–జయకృష్ణ గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయకృష్ణ్ణతో 2008, సెప్టెంబర్18న ఇక్కడి ఉడ్సైడ్ హోటల్లోని ఆర్యవైశ్య సత్రంలో పెళ్లి జరిగింది. మహేశ్వరి శ్రీదేవికి బంధువు కావడంతో బోనీ కపూర్ కుటుంబ సభ్యులు విచ్చేశారు. నటి మీనా, విజయకుమార్, మంజులతోపాటు వారి కుమార్తె శ్రీదేవి, మరికొందరు నటులు వేడుకల్లో పాల్గొన్నారు. రంభ–ఇంద్రకుమార్ నటి రంభ, కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ ఇంద్రకుమార్ వివాహం తిరుమల కర్ణాటక సత్రాల్లో జరిగింది. ఏప్రిల్ 8, 2010లో జరిగిన ఈ వివాహానికి దర్శకులు రాఘవేంద్రరావు, ఆర్కే సెల్వమణి, హీరోయిన్ రోజాతోపాటు అనేక మంది నటీనటులు హాజరయ్యారు. కల్యాణోత్సవ సేవలో నిత్యం 900 జంటలు తిరుమల క్షేత్రం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీవేంకటేశ్వరుడు నిత్య కల్యాణ చక్రవర్తి. ఆలయంలో లోక కల్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిత్యం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు స్వామి దర్శనానికి వచ్చి శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించే సంప్రదాయం క్రమంగా పెరుగుతోంది. ఆలయంలో ఐదు శతాబ్దాల కిందట కల్యాణోత్సవం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు 800 నుంచి 900 జంటల వరకు ఈ కల్యా ణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఏడాది పొడవునా వివాహాలే .. తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతూ ఉంటారు. శుభ లగ్నాలతో పనిలేకుండా కూడా రోజూ పెళ్లి వేడుకలు సాగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. -
పెళ్లిళ్లతో ఆగిపోయిన జెడ్పీ సమావేశం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా జెడ్పీ సమావేశానికి పెళ్లిళ్లు దెబ్బకొట్టాయి. జడ్పీ సభ్యులు పెళ్లిళ్లకు వెళ్లటంతో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆగిపోయింది. కోరంలో సరిపడా సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవటంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ప్రకటించారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతోనే సభ్యుల్లో చాలమంది సమావేశానికి హాజరు కాలేదని, త్వరలోనే సమావేశం తేదీని ప్రకటిస్తామని ఆమె ప్రకటించారు. -
ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు
-
కల్యాణ వైభోగమే!
జీవితంలో వివాహం మధుర ఘట్టం. అటువంటి వివాహ బంధపు దివ్యానుభూతిని దివ్యాంగులకు కల్పిస్తూ చెన్నై, గీతాభవన్ ట్రస్ట్ నిరుపమాన సేవలందిస్తోంది. ఏటా కొంతమంది దివ్యాంగులను, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎంపిక చేసి సామూహిక వివాహాలు జరిపిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గత ఏడేళ్లలో 349 వివాహాలను జరిపించింది. టీ.నగర్: గీతాభవన్ హాల్లో సోమవారం సామూహిక వివాహాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వి.సరోజ, రాష్ట్ర తమిళ భాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రి కె.పాండ్యరాజన్, దివ్యాంగుల సంక్షేమశాఖ, రాష్ట్ర కమిషనర్ వి.అరుణ్రాయ్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి నూతన దంపతులకు ఆశీస్సులందించారు. ఇందులో మాజీ రాష్ట్రపతి మనవరాలు పద్మా వెంకటరామన్, లతా పాండ్యరాజన్, సింహచంద్రన్ పాల్గొన్నారు. ఇందులో ఓ.పన్నీర్ సెల్వంను అశోక్కుమార్ గోయెల్ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రి వి.సరోజ వధూవరులను ఉద్ధేశించి ప్రసంగించారు. ఏడేళ్లలో 349 వివాహాలు: మేనేజింగ్ ట్రస్టీ అశోక్కుమార్ గోయల్ తన స్వాగతోపన్యాసంలో ఎనిమిదేళ్ల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు వివాహాలు జరిపించాల్సిందిగా కోరిందని, దీంతో 2010లో 34 వివాహాలు జరిపించామన్నారు. అందులో ఐదుగురు వధూవరులు దివ్యాంగులని అన్నారు. అప్పట్లో దివ్యాంగుల ముఖాల్లో సంతోషాన్ని చూసిన తాము దివ్యానుభూతికి గురయ్యామన్నారు. అనంతరం తాము ఇతర నిర్వాహకులతో చర్చించి ఏటా ఈ తరహా వివాహాలు జరిపేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో 349 వివాహాలు జరిపించామని, ప్రస్తుతం 61జంటలకు వివాహాలు జరుపుతున్నట్టు తెలిపారు. మంత్రుల సమక్షంలో వేదపండితులు అశ్వనీశాస్త్రి మంత్రోచ్ఛరణల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహంతో జంటలు ఏకమయ్యాయి. నూతన దంపతులు గీతాభవన్ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలిపారు. వివాహ జంటలతో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వివాహ సామగ్రి ఉచితం: వివాహం చేసుకోదలచిన జంటలకు బంగారు మంగళసూత్రం, వెండి కాలిమెట్టెలు, ఫ్యాన్సీ జ్యువెలరీ, ముహూర్త వస్త్రాలు, పూజ, వంట పాత్రలు, గృహోపకరణాలు, రెండు నెలలపాటు కిరాణా వస్తువులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ముందుగా గాయత్రీ శంకరన్ ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. -
మూడు ‘ముళ్ల’ బంధం
స్వాతి.. నల్లగొండ జిల్లా.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కిరణ్తో పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు.. ఇరవై లక్షల కట్నమిచ్చారు.. కానీ ఆరు నెలల్లోపే స్వాతిని అమెరికా నుంచి ఇంటికి పంపించేశాడు కిరణ్. తల్లిదండ్రులు అదేంటని అడిగితే.. స్వాతి నచ్చలేదని, మరింత కట్నం కావాలని, అప్పటిదాకా మీ వద్దే ఉంచుకోవాలని సమాధానం. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి కట్నమిచ్చిన ఆ తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. దిక్కుతోచక హైదరాబాద్లోని మహిళా పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు! ..ఇది ఒక్క స్వాతి కథే కాదు.. రాష్ట్రంలో అనేక మంది అమ్మాయిలది, వారి తల్లిదండ్రులది ఇదే వ్యథ!! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నారై పెళ్లిళ్ల మోసాలు, వరకట్న వేధింపులు, విడాకుల కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఇందులో రాష్ట్రం పంజాబ్ను సైతం మించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్నారై మోసాలకు సంబంధించి పంజాబ్లో దేశంలోనే అత్యధికంగా ప్రతినెలా 60 కేసులు నమోదవుతున్నట్టు జాతీయ మహిళా కమిషన్ 2015లో తెలిపింది. ఇప్పుడు తెలంగాణలో వాటిని మించి నమోదవుతున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్, పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న కేసులు.. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి అదనపు వరకట్నం, వేధింపుల కింద 339 కేసులు నమోదైనట్టు పోలీస్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలోనే 136 కేసులు, సైబరాబాద్లో 76, రాచకొండలో 32, వరంగల్లో 18, కరీంనగర్లో 9, నల్లగొండలో 9, మహబూబ్నగర్లో 12, రంగారెడ్డిలో 9, ఖమ్మంలో 18, ఆదిలాబాద్లో 8, నిజామాబాద్లో 12 కేసులు నమోదయ్యాయి. ఇలా ఐదేళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ, వివిధ పోలీస్స్టేషన్లలో కలిపి మొత్తం 738 కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీస్ శాఖ చెబుతోంది. 60 శాతం 25 ఏళ్ల లోపు వారే.. ఎన్నారై మోసాలకు సంబంధించిన కేసుల్లో 60 శాతం మంది 25 ఏళ్లలోపున్న అమ్మాయిలే బాధితులుగా ఉన్నారు. పెళ్లైనా ఆర్నెల్ల నుంచి ఏడాది లోపే భర్తలు తిప్పి పంపడం, వరకట్నం కోసం వేధింపులు, నచ్చలేదని పంపించేయడంతో వీరంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే బాధితుల్లో 17 శాతం మంది 31 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుండగా మిగతావారు 36 ఏళ్ల పైబడిన వారని పోలీస్ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. చదువుల దశలోనే సంక్షోభం వైపు.. కొందరు తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్ పూర్తవగానే తమ కూతుళ్లకు ఎన్నారై వరుడితో పెళ్లి చేసి పంపేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత వారు అక్కడ పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ఇలా అక్కడ చదువుకుంటున్న దశలోనే వెనక్కి వస్తున్న యువతుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఎన్నారై కేసుల్లో ఇలాంటివి 38 శాతం దాకా ఉన్నట్టు పోలీస్ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్ విభాగం చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇలాంటి వారు అటు చదువు పూర్తి చేయలేక.. ఇటు జరిగిన అన్యాయంపై పోరాటం చేయలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. ఎన్నారై సంబంధం అనగానే తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ఒప్పేసుకోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా పలు ఎన్నారై కేసులను పరిశీలించగా అందులో 38 శాతం సంబంధాల్లో మాత్రమే వధువు తల్లిదండ్రులు.. వరుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొన్నట్టు స్పష్టమైంది. 22 శాతం పెళ్లి సంబంధాల్లో నామ్కేవాస్తేగా విచారణ జరిపినట్టు సర్వేలో తేలింది. అబ్బాయిల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేయడం వల్ల కూడా సమస్యలు వచ్చిపడుతున్నట్టు వెల్లడైంది. -
మూడు ముళ్లకు మూడే ముహుర్తాలు!
సాక్షి, హైదరాబాద్ : మూడు ముళ్ల బంధానికి ఇక మూడే ముహూర్తాలున్నాయి. మూఢం ముంచుకొస్తుండటంతో వివాహాలు చేయించాలనుకునే పెళ్లివారు తొందరపడుతున్నారు. ఏటా కార్తీక మాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఈ నెల 9వరకూ గురు మౌఢ్యమి (మూఢం) వివాహాలకు అడ్డుపడింది. మళ్లీ 28 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఈ మౌఢ్యమి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఉండటంతో వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. దీంతో ఈ నెల 23,24,25 తేదీల్లో మూడు ముహూర్తాల్లో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. దీంతో పురోహితులకు, ట్రావెల్స్, పూల మండపాలకు, వివాహ సామాగ్రికి భారీ డిమాండ్ ఏర్పడింది. -
పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..
- వివాహాలను పెంచేలా వినూత్నయత్నాలు - పేరయ్యగా మారిన చైనా ప్రభుత్వం బీజింగ్ : దేశంలోని పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోతున్నందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీనికి విరుగుడుగా తానే పెళ్లిళ్లు చేయించాలని కంకణం కట్టుకుంది. అవివాహితులైన యువతీయువకులను ఒకే వేదికపైకి రప్పించి పెళ్లిళ్లు కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు పది కోట్ల మందికి పైగానే ఉన్నారు. పెళ్లీడుదాటుతున్నా ఒకింటి వారమవ్వాలనే వాంఛ వీరిలో కలగటం లేదు. 2010 జనాభా లెక్కల ప్రకారం 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని మహిళలు 2.74 శాతం మంది ఉన్నట్లు తేలింది. మారిన పరిస్థితులు, విధి నిర్వహణలో పోటీ వాతావరణం, కఠిన పరిస్థితుల్లో పని చేయాల్సి రావటం వంటి కారణాలతో యువత ప్రేమ-పెళ్లి ప్రస్తావన లేకుండానే బతికేస్తున్నారని వెల్లడయింది. దీంతో వీరికి పెళ్లిళ్లు ఎలా జరపాలనే దానిపై ప్రభుత్వం తీవ్ర ఆలోచనలో పడింది. ఇందుకు అనుగుణంగా అధికార కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న కమ్యూనిస్టు యూత్ లీగ్(సీవైఎల్)కు ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. యువతీయువకులకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. కుటుంబ భావన సామాజిక జీవనం సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుందని, పెళ్లి ఇందులో మొదటి మెట్టని తెలిపింది. వ్యక్తిగత అభివృద్ధికి జీవిత భాగస్వామి ఉండటం అవసరమని పేర్కొంది. యువతీయువకులు ఒంటరిగా ఉండటం సామాజిక, ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంది. దీనికి స్పందించిన ఝెజియాంగ్ ప్రావిన్స్ సీవైఎల్ కమిటీ జూన్లో వివాహవేదిక ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 5వేల మంది అవివాహితులు పాల్గొనగా కొందరికి జీవిత భాగస్వాములు దొరికారు. ఈ కార్యక్రమాల్లో కుటుంబసంక్షేమ శాఖ, మహిళా, కార్మిక సంఘాలు కూడా భాగస్వాములయ్యాయి. కొన్ని సంస్థలైతే వివాహవేదికలో పాల్గొనే వారికి సెలవు కూడా మంజూరు చేశాయని సీవైఎల్ ప్రశంసించింది. ప్రభుత్వం చేపడుతున్న వివాహ వేదికలను పలువురు నెటిజన్లు కొనియాడుతుండగా..వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. -
‘నిఖా’ర్సయిన దగా!
పేదరికం ఎక్కడుంటుందో కష్టాలక్కడ ఉంటాయి. అలాంటిచోట ఆడ, మగ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికం ఉన్నచోట మహిళలు, బాలికల స్థితి మగవాళ్లతో పోలిస్తే అత్యంత దుర్భరంగా, దయనీయంగా ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు సంప్రదాయం పేరుతో, నిఖా పేరుతో వలవేసి ఆ ఇళ్లలోని ఆడపిల్ల లకు మెరుగైన జీవితాన్నిస్తామని అబద్ధాలు చెప్పి వివాహం చేసుకున్నట్టు నటించి వారి బతుకుల్ని నాశనం చేస్తున్న అరబ్ షేక్లు, వారి తరఫున గద్దల్లా వాలే దళా రీలు హైదరాబాద్లోని పాత బస్తీలో మరోసారి పట్టుబడ్డారు. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతికరమైనవి. ముంబైకి చెందిన ఒక ప్రధాన ఖాజీ సహా ఈ వ్యవహారంలో 20మందిని వారు అరెస్టు చేశారు. ఈ పెళ్లిళ్ల వెనక భారీ నెట్వర్క్ ఉన్నదని గుర్తించారు. ఆ ప్రధాన ఖాజీ ఇప్పటికే వేల సంఖ్యలో ఇలాంటి దొంగ పెళ్లిళ్లు జరిపించాడని, వాటికి వివాహ ధ్రువీకరణ పత్రా లిచ్చి గల్ఫ్ దేశాలకు పంపించాడని తేలింది. పాత బస్తీ ఇలాంటి దురన్యాయాలకు చాన్నాళ్లక్రితమే ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి నెలా అక్కడ 20 నుంచి 30 కాంట్రాక్టు పెళ్లిళ్లవుతాయని ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ పెళ్లిళ్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అప్పులపాలైన కుటుంబాలు... తీవ్ర అనారోగ్యంతో కుములుతూ చికిత్స చేయించుకునే స్థోమత లేని కుటుంబాలు... అర్ధాకలితో అలమటిస్తూ కనీసం తమ పిల్లయినా సుఖపడు తుందన్న ఆలోచన ఉన్న కుటుంబాలు దళారులు చెప్పే మాటలకు లొంగి పోతున్నాయి. తమ పిల్లల జీవితాలను అగాధాల్లోకి నెడుతున్నామని గుర్తించలేక పోతున్నాయి. నిఖాలతో పేరిట సాగుతున్న ఈ తంతు అత్యంత దుర్మార్గమైనది. ఇందుకు సహకరించే ఖాజీలు ఫోన్లో సైతం పెళ్లిళ్లు జరిపించేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అరబ్ దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్లు మైనర్ బాలికలతో పెళ్లి తంతు ముగించుకుని ఒకటి రెండు నెలలు కాపురం పేరిట వారితో కాలక్షేపం చేసి తలాఖ్ చెప్పి వెళ్లిపోవడం లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆ దేశాలకు తీసుకుపోయి వారిని కట్టుబానిసల్లా చూడటం రివాజుగా మారింది. దుబాయ్, ఒమన్, సూడాన్, బహ్రెయిన్, నైజీరియా తదితర దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్లు భారీగా కమిషన్ ఇస్తామని దళారులకు ఆశ చూపి వారి ద్వారా ఈ మైనర్ బాలికలను రప్పించుకుంటున్నారు. ఒక పెద్ద మాఫియా నెట్ వర్క్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నది కాబట్టి బయటకు పొక్కేవి చాలా తక్కువం టున్నారు. పాతబస్తీలో వెల్లడవుతున్న ఘటనలు వింటుంటే అసలు మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామన్న సందేహం తలెత్తుతుంది. నిరుడు ఆత్మ హత్య చేసుకున్న ఒక బాలిక ఉదంతం ఈ కాంట్రాక్టు పెళ్లిళ్ల తీరును వెల్లడించింది. ఒక్కొక్కరితో నెల నుంచి అయిదు నెలలు గడిపేలా ఒప్పందాలు కుదిర్చి 17 కాంట్రాక్టు వివాహాల్లో ఆమెను ఇరికిస్తే జీవితంపై విరక్తి చెంది బాలిక ఆత్మహత్య చేసుకుంది. పదహారేళ్ల బాలికను 68 ఏళ్ల వృద్ధుడికిచ్చి కట్టబెట్టి ఒమన్ పంపిస్తే అక్కడ నిత్యం ఎదురవుతున్న చిత్రహింసలకు తాళలేక గత నెల తల్లికి ఫోన్ చేసి మొరపెట్టుకుంది. భార్యగా తీసుకెళ్లి వెట్టి చాకిరీ చేయించుకోవడం, వ్యభిచార గృహాలకు అమ్మేయడంలాంటి ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ దొంగ పెళ్లిళ్లకు బలైనవారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉన్నదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. ఒక్కో పెళ్లికి దాదాపు రు. 20 లక్షల వరకూ చేతులు మారుతుండగా బాలిక కుటుంబానికి మిగిలేది వేల రూపాయలకు మించడం లేదు. అమృతా అహ్లువాలియా అనే ఎయిర్హోస్టెస్ ఒకరు 1991లో విమానంలో ప్రయా ణిస్తున్న ఒక బాలిక ఆగకుండా రోదిస్తుండటాన్ని గమనించి ముంబైలో దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన ఘటనలో తొలిసారి ఈ దొంగ పెళ్లిళ్ల వ్యవ హారం ప్రముఖంగా బయటికొచ్చింది. ఆనాటినుంచీ పోలీసులు అడపా దడపా దాడులు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నా ఈ దుర్మార్గం అంతకంతకూ పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదు. ఇదిప్పుడు కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా పాకింది. ఇలాంటి ఉదంతాలను కేవలం పెళ్లిళ్ల కోణంలో చూసి కేసులు పెట్టడంలోనే సమస్యంతా ఉంది. ఈ వ్యవహారాన్ని మోసపు పెళ్లిగా మాత్రమే గుర్తించి... ఖాజీలిస్తున్న వివాహ ధ్రువీకరణ పత్రాలనూ, వాటి ఆధారంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చే నిఖా ధ్రువపత్రాలనూ పరిశీలించడానికి, వాటిల్లోని నిజానిజాలను తేల్చడానికి సమయం వృథా చేయకుండా మైనర్ బాలికలను అపహరించి తరలిస్తున్నట్టు పరిగణించాలి. అందుకు కారకులైనవారిని, వారికి సహకరిస్తున్న వారిని కిడ్నాపర్లుగా గుర్తించి కేసులు నమోదు చేయాలి. అలాగైతేనే నిందితులకు యావజ్జీవ శిక్ష వరకూ పడే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే పకడ్బందీ ఆధారాలు సమర్పించి న్యాయస్థానాల్లో కేసుల సత్వర విచారణకు సహకరించాలి. అప్పుడు ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారిలో భయం ఏర్పడుతుంది. ఇప్పుడను సరిస్తున్న విధానాలవల్ల ఎవరిపైనా సరైన చర్య తీసుకోలేకపోతున్నారు. నిందితులు సులభంగా బెయిల్ సంపాదించి బయటికొస్తున్నారు. తమ నేరాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పెళ్లిళ్ల తంతుకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ఉందంటున్నారు. ఐపీసీలోని కఠిన సెక్షన్లు వర్తించేలా అందులోని నిబంధనలుండాలి. పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలు దుర్భర దారిద్య్రానికి మారుపేరుగా ఉన్నాయి. అక్కడ 40 శాతం కుటుంబాలు పేద రికంలో మగ్గుతున్నాయని చెబుతున్నారు. ఉపాధి అవకాశాలను పెంచడం, మెరు గైన విద్యా సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లలను చదివించే కుటుంబాలకు ఆసరా కల్పించడం వగైరా చర్యలు కూడా అవసరం. అలాగే మత పెద్దల సహ కారాన్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ సమగ్రంగా అమలు చేసినప్పుడే దీన్ని శాశ్వ తంగా రూపుమాడానికి అవకాశం ఉంటుంది. -
నాల్గో పెళ్లి అడ్డుకున్నమూడో భార్య
చెన్నై: నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన భర్తను పోలీసులు పట్టించి పెళ్లిని అడ్డుకుంది అతని మూడో భార్య. ఈ ఘటన చెన్నైలో జరిగింది. వివరాలు.. మాధవరం తనికాచలం నగర్కు చెందిన నందకుమార్(34) కారు డ్రైవర్. ఇతనికి ఓట్టేసి కొసపేటకు చెందిన విజయలక్ష్మి(30)తో వివాహం నిశ్చయించారు. దీని ప్రకారం పెరంబూర్ సిరువళ్లూర్ రోడ్డు వద్ద ఉన్న పెళ్లి మండపంలో ఆదివారం పెళ్లి జరగాలి. అయితే కొళత్తూర్కు చెందిన ఉష(35) అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. నందకుమార్ తో తనకి వివాహం అయిందని, ఇప్పటికే మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం నాల్గో పెళ్లికి సిద్ధమయ్యాడని గొడవకు దిగింది. దీంతో సెబియం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అందులో నందకుమార్ తాను రైల్వే ఉద్యోగి అని నమ్మించి పలువురు యువతులను పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. నాల్గో భార్యగా విజయలక్ష్మిని చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పోలీసులు నందకుమార్ను అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. -
25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు..
కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని కూడా పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146 అయింది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్స్టన్ బ్లాక్మోర్. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్స్టన్ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నాడు. వాస్తవానికి 1990ల్లోనే విన్స్టన్ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి కెనడా చట్టాల్లో ఉన్న లొసుగులతో విన్స్టన్ విచారణ, శిక్షల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్స్టన్ వివాహాలు చేసుకుంటూనే ఉన్నాడు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్ షెరీ ఆన్ డొనెగాన్.. విన్స్టన్కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. విన్స్టన్తో పాటు మరో బహుభార్యత్వం కేసును కూడా కోర్టు విచారించింది. జేమ్స్ ఓలర్(53) అనే వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. ఓలర్కు ఐదుగురు భార్యలున్నారు. అయితే, అతనికి ఇంకా శిక్ష ఖరారు కావాల్సివుంది. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్స్టన్ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిలు చేసుకున్నానని చెప్పాడు. -
నలుగురిని పెళ్లి చేసుకుని..
- కటకటాల్లో నిత్య పెళ్లి కొడుకు తిరుపతి : ఓ నిత్య పెళ్లికొడుకు బండారం బట్టబయలైంది. అమాయక యువతలను వంచిస్తూ ఏకంగా నలుగురిని ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. మూడవ భార్యను వేధించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత యువతులు తమను మోసం చేశాడంటూ తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. భాకరాపేట సమీపంలోని కూరపర్తివారిపల్లికి చెందిన నాగభూషణంరాజు (28) తిరుపతి నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతని తల్లి వీరమ్మ అదే గ్రామంలో ఉపసర్పంచ్గా పనిచేస్తున్నారు. వివాహితుడైన నాగభూషణం రాజు పీలేరుకు చెందిన కల్పన అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు, ఈ వివాహాల గురిం చి చెప్పకుండా వెంకటగిరికి చెందిన లక్ష్మిని 2015లో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే ఆమెకు ఏడాది బాబు ఉండగా ప్రస్తుతం ఆమె గర్భవతి. ఇదిలా వుంటే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన కృప అనే యువతి (నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ట్రైనీ రిసెప్షన్గా పనిచేస్తున్నారు)ని మాయమాటలతో ప్రేమలోకి దించి వివాహం చేసుకున్నాడు. బరితెగించాడు ఇలా.. నాలుగు వివాహాలు చేసుకున్న నాగభూషణం రాజు మంగళవారం కొర్లగుం టలో నివాసముంటున్న మూడవ భార్య అయిన లక్ష్మి ఇంటికి నాల్గవ భార్య కృపను వెంటబెట్టుకుని వెళ్లాడు. దీంతో లక్ష్మి ఈయువతి ఎవరు అని ప్రశ్నించగా ఈమెను కూడా పెళ్లి చేసుకున్నానని మనమందరం కలిసే ఉందామని లక్ష్మిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో లక్ష్మికి నాగభూషణం మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దీంతో నాగభూషణం లక్ష్మిని చితకబాదాడు. దీంతో సహనం కోల్పోయిన లక్ష్మి మహిళా పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు కేసు ఈస్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్ఐ ఈశ్వరయ్య చీటింగ్ కేసు నమోదు చేసి నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాధితుడ్ని వివరణ కోరగా తనకు నాలుగు పెళ్లిళ్లు కాలేదని నిన్న రాత్రి జరిగిన పెళ్లితో కలసి మూడు పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయని బుకాయించాడు. అందరినీ బాగానే చూసుకుంటున్నానని కావాలనే లక్ష్మి తనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
పెళ్లిలుంటే వీడికి పండుగే
కర్నూలు: పెళ్లిళ్లు జరుగుతున్న కల్యాణ మండపాల సమాచారాన్ని ముందుగానే సేకరించుకుని బంధువుల తరహాలో కల్యాణ మండపానికి చేరుకుంటాడు. వధూవరుల గదిని గుర్తించి ఎవరి పనిలో వారు నిమగ్నమైవున్న సమయంలో గదిలోనికి ప్రవేశించి బ్యాగులలో భద్రపరచిన నగలు, నగదును మూటకట్టుకుని ఉడాయిస్తాడు. ఇలా 11 కేసుల్లో నిందితుడైన మాదవరపు సచ్చినాథ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.40 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన బైక్ను రికవరీ చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. సేవాస్తంభ్ జిల్లా నాయకుడు దివంగత నల్లారెడ్డి కుమారుడైన మాదవరపు సచ్చినాథ్ 2005లో పుల్లారెడ్డి కాలేజ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లోని సెల్ వరల్డ్లో సేల్స్మెన్గా 2008 నుంచి ఏడాది పాటు పనిచేశాడు. 2009 ఫిబ్రవరిలో కర్నూలు శివారులోని ఎన్టీఆర్ బిల్డింగ్స్కు చెందిన పెద్దరంగయ్య కుమార్తె సరళను వివాహం చేసుకున్నాడు. ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. 2010లో సెల్ఫోన్ దొంగతనానికి పాల్పడ్డాడు. అప్పట్లో తండ్రికి ఉన్న మంచిపేరుతో పోలీసులు మందలించి వదిలేశారు. 2011లో తండ్రి పనిచేయు ఏపీజీఎల్ఐసీ ఆఫీసులో క్లర్కు కింద అసిస్టెంట్గా చేరాడు. 2014లో నల్లారెడ్డి మృతిచెందాడు. ఆ తర్వాత మళ్లీ నేరాలబాట పట్టాడు. 2016 నవంబర్ మాసంలో రామలింగేశ్వరనగర్లో దొంగతనం చేస్తుండగా, స్థానికులు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా మిద్దెపై నుంచి దూకి తప్పించుకున్నాడు. గాలింపు చర్యలు చేపట్టి నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి బెయిల్పై వచ్చినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. ఆర్థిక సమస్యలతో మళ్లీ నేరాల బాట పట్టాడు. ఇలా దొరికాడు... పాతబస్తీలోని పూలబజార్లో ఉన్న చిన్నమ్మ వారి శాలలో ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. వేదిక వెనుకవైపు కుడి పక్కన ఉన్న రూమ్లోకి ప్రవేశించి లగేజీ బ్యాగులో ఉన్న 21 తులాల బంగారు ఆభరణాలను అపహరించి బైక్పై పారిపోయాడు. వాహనం నంబరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉండటంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా ముందు వాహనాన్ని గుర్తించి, తర్వాత దొంగను పట్టుకున్నారు. సమీపంలోని నెట్ సెంటర్లో కూడా సీసీ కెమెరాలో మోటర్బైక్ నంబరు నమోదైనట్లు పోలీసులు గుర్తించి స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించారు. నేరాల చిట్టా ఇది.. చిన్నమ్మ వారి శాల, ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, ఎస్ఏపీ క్యాంపులోని టీజీవీ కల్యాణ మండపం, కేవీఆర్ గార్డెన్స్, దేవీ ఫంక్షన్ హాల్, టీటీడీ కల్యాణ మండపం, బి.క్యాంప్లోని టీజీవి కల్యాణ మండపంలో సచ్చినాథ్ చోరీలకు పాల్పడ్డాడు. మొత్తం 11 కేసులలో ఇతను నిందితుడు. దొంగిలించిన వస్తువులను కర్నూలు షరాఫ్ బజార్లో గతంలో 29వ నంబర్ గల షాపును నడుపుతున్న కదమ్ గోపాలరావు అలియాస్ గోపి ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ వ్యాపారీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్వల్పకాలంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో 11 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేయడమే కాక పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును రికవరీ చేసినందుకు సీఐలు బి.ఆర్.కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజు యాదవ్, శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, ఏఎస్ఐ భాస్కర్, హెడ్ కానిస్టేబుళ్లు సూర్యనారాయణరెడ్డి, హుసేన్, కానిస్టేబుళ్లు, మురళి, మహమ్మద్ బాషా, మాసూం, మల్లి, రఘు, హోంగార్డు డ్రైవర్ రఘు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. -
శ్రీకారం చుట్టుకుంది.. పెళ్లి ఉత్సవం..
ఐదు నుంచి 11వ తేదీ వరకూ సత్తెన్న కల్యాణ మహోత్సవాలు వైశాఖ ఏకాదశి, ఆరో తేదీ రాత్రి 9:30కి దివ్య కల్యాణం అన్నవరం : సత్యదేవుని వార్షిక కల్యాణ వేడుకలకు పెళ్లిపుస్తకం(శుభలేఖ) శ్రీకారం చుట్టింది. ప్రతీసారి వీఐపీలకు, ఇతర ముఖ్యులకు పంపిణీ చేసే శుభలేఖ రంగుల పుస్తకంలా ఉండేది. అయితే ఈసారి ఆ పుస్తకానికి బదులు డిజిటల్ ప్రింటింగ్లో ఆకర్షణీయంగా శుభలేఖ ముద్రించారు. వైశాఖ శుద్ధ దశమి ఈనెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి ఆరో తేదీ రాత్రి 9:30 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు రత్నగిరి కల్యాణ వేదికపై దివ్యకల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.ఇప్పటికే ఈ శుభలేఖలను ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఊరూవాడా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఏడు రోజుల వేడుక... సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలను ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించారు. విద్యుత్ దీపాలంకరణ, ఇతర పనులకు అదనంగా మరో రూ.పది లక్షల వరకూ ఖర్చు చేసే వీలుంది. కల్యాణమహోత్సవాలు షెడ్యూల్ l మే 5, వైశాఖ శుద్ధ దశమి : స్వామి, అమ్మవార్లను వధూవరులు చేసే కార్యక్రమం l మే 6, వైశాఖ శుద్ధ ఏకాదశి : శ్రీసత్యదేవుని దివ్య కల్యాణమహోత్సవం. రాత్రి 9 : 30 గంటల నుంచి రత్నగిరిపై వార్షిక కల్యాణవేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్లకు దివ్యకల్యాణ మహోత్సవం. l మే 7, వైశాఖ శుద్ధ ద్వాదశి : నవదంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణబ్రహ్మ వాహనంమీద స్వామివారి ఊరేగింపు l మే 8, వైశాఖ శుద్ధ త్రయోదశి: వేదపండిత సదస్యం l మే 9, వైశాఖ శుద్ధ చతుర్దశి: వనవిహారోత్సవం, వెండి రథోత్సవం l మే 10, వైశాఖ పౌర్ణిమ: ఉదయం, శ్రీచక్రస్నానం, మధ్యాహ్నం గౌరీపూజ, నాకబలి, దండియాడింపు. l మే11, వైశాఖ బహళ పాడ్యమి. శ్రీపుష్పయాగ మహోత్సవం -
ఏం చర్యలు తీసుకొంటున్నారు
విదేశాల్లో మన బాధిత మహిళల అంశంపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: భారత్లో వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లి, అక్కడ విడాకుల బాధితులుగా మారుతున్న మహిళలకు న్యాయ సాయం అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. స్వదేశంలో పెళ్లిళ్లు చేసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తరువాత తమ భార్యలకు విడాకులు ఇస్తున్నారని, దీంతో ఆ దేశాల్లో సదరు మహిళలకు న్యాయసాయం అందడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పైడా అర్చన హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, విదేశాల్లోని విడాకుల బాధిత మహిళలకు న్యాయ సాయం అందించే విషయంలో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సిఫారసులు అమలు కావడం లేదన్నారు. -
పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి
♦ వివాహాలపై వారసత్వ ఉద్యోగాల రద్దు ప్రభావం ♦ కట్నకానుకల కోసం పెరగనున్న డిమాండ్ ♦ కుటుంబాల్లో కలహాలు సృష్టిస్తున్న వైనం గోదావరిఖని : ‘గోదావరిఖనిలోని ఓ గనిలో పనిచేసే కార్మికుడి స్వస్థలం బెల్లంపల్లి. సింగరేణిలో తానుచేసే వృత్తికి ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో పనిచేయడం సాధ్యం కావడంలేదు. ఈలోపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించింది. కొడుకు, అల్లుడు లేక సోదరుడికి అవకాశం కల్పించింది. దీంతో పెళ్లీడుకొచ్చిన కూతురుకు అల్లుడిని చూసి ఆయనకు వారసత్వ ఉద్యోగం పెట్టించాలని అనుకున్నాడు. గోదావరిఖనిలోని ఓ కాలనీకి చెందిన అబ్బాయిని చూసి ఉద్యోగమిచ్చే ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 15న బెల్లంపల్లిలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అయితే 16వ తేదీన గోదావరిఖనిలో అబ్బాయి వారింటి వద్ద రిసెప్షన్ ఉండగా....అదే రోజు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అబ్బాయి తరుఫువారు కట్న కానుకలు ఎక్కడ అడిగి అల్లరి చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయి బంధువులు ఈ రిసెప్షన్కు ఎక్కువమంది హాజరుకాలేదు. అయితే ఉద్యోగానికి బదులు కట్నకానుకలు ఇవ్వాలని మాత్రం అమ్మాయి తరఫు కుటుంబసభ్యులకు పెళ్లికొడుకు కుటుంబసభ్యులు హుకూం జారీచేశారు. పెళ్లి కూతురు తరఫువారు దానికి అంగీకరించకపోతే ...రెండు కుటుంబాల్లో అలజడి చెలరేగడం మాత్రం ఖాయం.’.. ఇలా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాలలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారనే నేపథ్యంలో ఇటీవల కాలంలోనే పలు జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. వివాహ సమయంలో ఇచ్చే కట్నకానుకలకు బదులు ఉద్యోగం పెట్టించడానికి అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించడంతో అబ్బాయి తరుపువారు ఒప్పుకున్నారు. అయితే నేడు ఆ ఉద్యోగాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా కుటుంబాలు నిరాశనిస్పృహలకు లోనవుతుండగా...ఉద్యోగం పెట్టించనందున అమ్మాయి తరుఫువారు ఏమిస్తారని అబ్బాయివారి నుంచి బేరసారాలు మొదలయ్యాయి. దీంతో చేసేదేమీలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగంపై ఆశతో... అన్ని వదులుకుని... సింగరేణిలో ఉద్యోగావకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నత విద్యను చదివి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రైవేటుగా ఉద్యోగాలు చేస్తున్న చాలామంది యువకులు కోల్బెల్ట్ ప్రాంతాలపై దృష్టిసారించారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇదే అనువైన సమయంగా భావించుకుని ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునే వారు పెళ్లిచూపులకు వచ్చి ఒప్పుకున్నారు. వారసత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందే పెళ్లి జరిగిపోవాలని, ఆ పెళ్లి ఫొటోలు, వీడియో దరఖాస్తుతో జత చేయాలని ఆదేశాలుండడంతో ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ముగిసిన తర్వాత దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారసత్వఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు వార్త వెలువడడంతో కొత్త అల్లుళ్లకు ఏమిచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. కట్నకానుకల కోసం డిమాండ్ పెళ్లి సమయంలో కట్నకానుకలకు బదులు సింగరేణిలో ఉద్యోగం ఇస్తున్నందున చాలామంది అల్లుళ్లు అంగీకారం తెలిపారు. నేడు పరిస్థితి మారడంతో ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందున దాని స్థానంలో కట్నకానుకలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు రాజీకి వస్తే ఆ జంటల కాపురాలు సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే రోజు యుద్ధమే జరుగుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కట్నకానుకలు ఇవ్వలేని కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి కూతుళ్లకు అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగే అవకాశాలుంటాయి. మొత్తమ్మీద వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్లి జంటలపై ప్రభావం చూపుతుండగా...వారి కుటుంబాల్లో మాత్రం మానసిక క్షోభకు దారితీస్తున్నదని చెప్పక తప్పదు. -
‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’
గ్వాలియర్: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివాహ కార్యక్రమాలు ఇతర ఉత్సవాల్లో సెలబ్రిటీలు తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది. ఆ తుపాకులు కావాలని పేలుస్తున్నవి కాదని, అనుకోకుండా జరుగుతున్న సంఘటనలని చెబుతూ వారు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి గ్వాలియర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి తదితర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ చర్యలను వీడియో రికార్డింగ్ చేసి ఆధారాలుగా సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. గ్వాలియర్ ప్రాంతంలో విందు, వినోదాలే కాకుండా తమకు సంతోషం కలిగించే ఏ సందర్భాల్లోనైనా మరోమారు ఆలోచించకుండా గాల్లోకి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం తప్పు. అయినా, అలాంటి వారిని నిలువరించేందుకు ఆధారాలు సరిగా లభ్యం కావు. దీంతో ఆ చర్యలను అడ్డుకునేందుకు తాజాగా పదివేల రివార్డును ప్రకటించింది. -
కళ్యాణ వైభోగమే
నేడు భీమేశ్వరస్వామి సన్నిధిలో స్వామివార్ల కల్యాణోత్సవాలు, అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనారసింహుని వివాహ వేడుక రేపు జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి, పుట్టకొండ లక్షీ్మనరసింహస్వామి, పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలో జనార్దునుడి కల్యాణాలు కల్యాణ మహోత్సవాల సందడితో ఆలయాలు కళకళలాడుతున్నాయి. కల్యాణకాంతులు విర జిమ్ముతున్నాయి. ఆకాశ పందిళ్లు.. భక్తుల సందళ్లతో కల్యాణతంతు కడు రమణీయంగా.. కమనీయంగా సాగనున్నాయి. మేళతాళాల మధ్య స్వామివార్లు పరిణయ వేడుకకు సిద్ధమయ్యారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలు సోమవారం జరగనున్నాయి. మంగళవారం జి.మామిడాడలో సూర్య నారాయణ మూర్తి, పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి, పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలోని ధవళగిరిపై వేంచేసిన జనార్దనుడి కల్యాణాలు మంగళవారం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెదపూడి : మండలంలోని జి.మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య వేదమార్గ ప్రతిషా్ఠపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఈనెల 7న భీష్మ ఏకాదశి మంగళవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బాణసంచా సిద్ధం చేశారు. బాణసంచా పోటీల్లో గెలుపొందిన వారికి కాసు బంగారం బహుమతి ఇస్తారు. కల్యాణం రోజున ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఇవే.. ఈ నెల3న రథసప్తమితో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల11తో ముగిస్తాయి. 7న భీష్మ ఏకాదశి, స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు నిత్యోపాసన, విశేషహోమం, బలిహరణ, ఎనిమిది గంటలకు «ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో అన్నసమారాధన, మధ్యాహ్నం 12.35 గంటకు శ్రీవారి రథోత్సవం, రాత్రి ఏడు గంటలకు కనులపండువగా స్వామి వారి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాలు 8న ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, 9న నిత్యార్చన, నిత్యహోమాలు, శ్రీవారికి సదస్య మహోత్సవం10న స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం,∙11న పవిత్ర తుల్యభాగనది తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహాపూర్ణాహుతి, ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. -
రత్నగిరిపై మొదలైన పెళ్లిసందడి
సత్యదేవుని సన్నిధిలో 40 వివాహాలు స్వామివారిని దర్శించిన 15వేల మంది భక్తులు ఆదాయం రూ.15 లక్షలు అన్నవరం: రెండు నెలల విరామం అనంతరం రత్నగిరిపై వివాహాల సందడి నెలకొంది. మాఘమాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముహూర్తాలలో సుమారు 40 వివాహాలు జరిగాయి. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా వివాహాలు చేసుకున్న పెళ్లి బృందాల వారు కూడా నవదంపతులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిస్తున్నారు. ఈ నెలలో ఐదో తేదీ, తొమ్మిదో తేదీ, 13, 15, 16, 18 తేదీల్లో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు. సత్యదేవుని దర్శించిన 15 వేల మంది భక్తులు రత్నగిరికి భక్తులతోపాటు వివాహ బృందాల రాక కూడా పెరిగింది. దీనికి తోడు శుక్రవారం రథ సప్తమి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు. ప్రతీ వ్రతమండపంలోను నవదంపతులు వ్రతాలాచరించడంతో మండపాలకే కళ వచ్చింది. సత్యదేవుని దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,622 జరుగగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.15 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
పెళ్లాగిపోయింది
-
కరెన్సీ కష్టాలతో పెళ్లిళ్లు వాయిదా