Milk
-
బోరింగులో నుండి కారుతున్న పాలు
-
పాలు కారుస్తున్న వేప చెట్టు ఎగవడ్డ అమ్మలక్కలు
-
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
52 ఏళ్లుగా అన్నం బంద్!
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు లొక్కిడి గంగారాం యాభై రెండేళ్లుగా అన్నం తినడం బంద్ చేశారు. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామంలో 1948లో గంగారాం జన్మించారు. యాభై ఏళ్ల క్రితం ఆయన కొలిప్యాక్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. దైవ చింతన ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఓ రెండు గదులలో నివాసం ఉంటున్నారు. గంగారాంకు భార్య సత్యగంగు ఉన్నారు. కుమారుడు గతంలోనే వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తుతం గంగారాం వయస్సు 76 ఏళ్లు. గంగారాంకు 1971లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్ కలిగోట్ యూపీఎస్ పాఠశాలలో రాగా, అక్కడే 18 ఏళ్లు పని చేశారు. అప్పుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1972 సంవత్సరం నుంచి గంగారాం అజీర్తి సమస్యతో అన్నం తినడం బంద్ చేశారు. దీంతో ఆహారంగా పల్లి పలుకులు, నీరు తీసుకోవడం ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా కలిగోట్, కొలిప్యాక్, మనోహరాబాద్, కొండాపూర్, మచ్చర్ల, సుర్బిర్యాల్, ఖుదావంద్పూర్, చేంగల్, వాడి, లింగాపూర్ గ్రామాల్లో పని చేశారు.2004లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి పండ్లు జ్యూస్, అరటి, ఆపిల్, సీజనల్ పండ్లు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యాభై రెండు ఏళ్లుగా ఎలాంటి అనారోగ్యం రాలేదని గంగారాం తెలిపారు. ఒక్క మందు గోలి, ఇంజెక్షన్ తీసుకోలేదన్నారు. స్వచ్ఛమైన గాలి, సాత్విక ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరి చేరదన్నారు. ప్రస్తుతం గంగారాం ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. గత యాభై ఏళ్లు గా ఊరూరా తిరుగుతూ ‘శ్రీరామ కోటి ’రాయిస్తున్నారు. వెయ్యి కోట్లు రామనామం రాయించాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపా రు. ప్రస్తుతం మనోహరాబాద్ గ్రామ రెవిన్యూ శివారులో పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. లోక కల్యాణం, భక్తిభావం, మానవతా దృక్పథంతో భగవంతుని సన్నిధికి చేరుకోవాలని తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని, ఈ జీవితం భగవంతునికి అంకితమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో బైక్పై తిరుగుతూ రామకోటి రాయిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు. పాండురంగ ఆశ్రమం వద్ద అన్ని రకాల దేవత విగ్రహాలను, స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి వచ్చే వారికి దైవత్వాన్ని బోధిస్తున్నారు. -
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
రెండో స్థానానికి కర్ణాటక
భారతదేశంలో కర్ణాటక రెండో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), మాండ్య జిల్లా సహకార మిల్క్ యూనియన్లు సంయుక్తంగా కొత్త నందిని పాల ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. దేశంలో పాల ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.డెయిరీ రంగానికి రాష్ట్రం అపార మద్దతు ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమను పెంపొందించడంలో, పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్ణాటక ప్రస్తుతం రోజుకు 92-93 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు 2.5 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ‘క్షీరధారే పథకం’ ద్వారా, పాలను లీటరుకు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదనంగా లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!స్టాక్ మార్కెట్లో పాల ఆధారిత ఉత్పత్తులను అందించే కంపెనీలకు కర్ణాటక రాష్ట్రంలోని మిల్క్ యూనియన్ల సహకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాలతోనే విభిన్న ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి, పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్న కొన్ని కంపెనీలు కింద తెలియజేస్తున్నాం.పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్: గోవర్ధన్ అండ్ గో బ్రాండ్లకు ప్రసిద్ధి.దొడ్ల డెయిరీ లిమిటెడ్: పాల ఉత్పత్తుల తయారీ, పంపిణీలో దొడ్లా డెయిరీ దక్షిణ భారతదేశంలో బిజినెస్ చేస్తోంది.హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్: హట్సన్, అరుణ్, ఆరోక్య వంటి బ్రాండ్లను ఇది నిర్వహిస్తోంది.హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: ఈ సంస్థ ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: ఐస్ క్రీములకు ఇది ప్రసిద్ధి. వాడిలాల్ పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. -
అలాంటి వాళ్లు నెయ్యి లేదా వెన్న తినొచ్చా..?
నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.లాక్టోస్ అసహనం అంటే..లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..కడుపు నొప్పివాంతులువిరేచనాలునిరంతర కడుపు ఉబ్బరంగ్యాస్ సమస్య అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు. ప్రత్యామ్నాయాలు..సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి. అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు. ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు. నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే! View this post on Instagram A post shared by Amita Gadre | Nutritionist (@amitagadre) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్లు 7.5 కోట్లు. భారత్లోనే చాలావరకు డెయిరీ ఫామ్లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివనే చాలామంది భావిస్తారు. అంతెందుకు పూర్వకాలం మన పెద్దవాళ్లు అప్పుడే పితికిన పాలనే నేరుగా తాగేవారు కూడా. ఇలా తాగితే మంచి పోషకాలు అందుతాయని విశ్వసించేవారు. అయితే శాస్త్రవేత్తుల ఇలా అస్సలు తాగకూడాదని చెబుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తయాని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం మంచిదనే భావన కేవలం అపోహే అనే కొట్టిపారేస్తున్నారు. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగాలని పిలుపునిస్తున్నారు. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం వెల్లడయ్యిందంటే..పాశ్చరైజ్ చేసిన పాల కంటే పచ్చిపాలే రుచిగా ఉంటాయని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. దీని వల్ల లాక్టోస్ అసహనం ఉండదని, అలెర్జీలకు చికిత్స చేయగలదని చెబుతుంటారు. ముఖ్యంగా గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వాదనలు వినిపిస్తునన్నాయి. కానీ శాస్తవేత్తల పరిశోధనల్లో ఇవన్ని నిజం కాదని తేలింది. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలతో పోలిస్తే పచ్చి పాలు తాగడం లేదా సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే ఆరోగ్యానికి సురక్షితం కాదని తేలింది. అదే పాశ్చరైజేషన్ పాల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం చాలా తక్కువని తెలిపారు. ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటే..పచ్చిపాలల్లో సూక్ష్మక్రిములు ఎక్రువగా ఉంటాయి. ఇవి ఆహార విషాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఉదర తిమ్మిరి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తయని చెబుతున్నారు. పచ్చిపాలల్లో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు ఉంటాయిని, ఇవి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పారు. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల వల్ల 840 రెట్లు అనారోగ్య ప్రమాదం, 45 రెట్లు ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చిపాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్యానికి గురవ్వుతారని వైద్యలు హెచ్చరించారుముఖ్యంగా చిన్నారులు, యువకులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, కేన్సర్, మధుమేహం లేదా హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి ఈ పాలు మరింత ప్రమాదకరమని చెప్పారు. అంతేగాదు అమెరికాలో పచ్చిపాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతి ఉంది. కేవలం రైతు నేరుగా పచ్చిపాలను విక్రయిస్తేనే అక్కడ ప్రజలు వినియోగించవచ్చు. అదీగాక ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కలకలం పచ్చిపాల వినియోగాన్ని మరింతగా పరిమితం చేసింది. పక్షులు నుంచి పౌల్ట్రీ అలా యూఎస్లోని ఆవులకు సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. దీని కారంణంగా నలుగురు వ్యక్తులు మరణించారు కూడా. ఈ నేపథ్యంలో పచ్చిపాల వినియోగంపై మరింత ఆందోళనలు వెల్లువెత్తాయి. పాశ్చరైజేషన్ అంటే..? ఇది పాలను సురక్షితంగా చేస్తుందా..?పాల భద్రతకు పాశ్చరైజేషన్ ముఖ్యం. పాలను 145 డిగ్రీల ఫారెన్ హీట్కు గురిచేయడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే జెర్మ్స్, సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే ఈ ప్రక్రియలో పాలు త్వరతిగతిన చల్లబడిపోతాయి కూడా. పశ్చిపాలల్లో ఉండే పోషలకాలే పాశ్చరైజేషన్ పాలల్లో కూడా ఉండటమే కాకుండా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
పాలు, పాల ఉత్పత్తులకు ఏ1, ఏ2 పేర్లు వద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద A1, A2 పేరుతో పాలు, నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది. అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ1, ఏ2 క్లెయిమ్లను తొలగించాలని వెల్లడించింది.ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు కూడా ఈ క్లెయిమ్లను వెంటనే తమ వెబ్సైట్ల నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే.. అలంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.ఏ1, ఏ2 పాలలో ప్రోటీన్లు వేరు వేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని.. మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. -
రోజూ ఎనిమిది గ్లాసులు పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్! ఇలా తీసుకోవచ్చా..?
బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ఒక ఇంటర్యూలో తన చిన్నప్పుడూ రోజుకి ఏకంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు పాలు తాడేవాడినని చెప్పారు. అందదువల్లే తాను జీర్ణ సమస్యలు ఫేస్ చేస్తున్నానని తెలిసిందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన నాన్న ధర్మేంద్రకి బహుమతిగా వచ్చిన ప్రత్యేక గాజు గ్లాస్ తన దగ్గర ఉండేదని, దానిలోనే పాలు తాగేవాడనని అన్నారు. ఇలా ఆ హీరోలా ప్రతి రోజూ అన్ని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?. ఎదురయ్యే సమస్యలేంటీ తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాబీ డియోల్ మాదిరిగా అంతలా పాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇలా పిల్లలు, పెద్దలు తీసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారని అన్నారు. పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం. ఇవి ఎముకల పెరుగుదలకి, అభివృద్ధికి తోడ్పతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం అధిక బరువు, లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదుర్కొనవల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ఏంటి లాక్టోస్ అసహనం..?పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల లాక్టోస్ ఎంజైమ్లు అధికంగా పని చేస్తాయి కాబట్టి శరీరంలో లాక్టోస్ ఎంజైమ్లలో క్షీణత ఏర్పడి ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది. ఓ వయసు వచ్చేటప్పటికీ శరీరంలో లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి. దీంతో లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, డయేరియా, పొత్తికడుపు తిమ్మిరికి కారణమవుతుంది. ఈ లక్షణాలు రోజూవారీ జీవితాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయం ప్రభావితం చేస్తాయని వెల్లడించారు నిపుణులు.వచ్చే ఆరోగ్య సమస్యలు..ఎక్కువ పాలు తాగే పెద్దల్లో అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది. పాలు కేలరీలు కలిగిన పానీయం. పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు పిల్లలలో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కలుగజేసే అవకాశం ఉంది. కలిగిస్తుంది. ఇలా పాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారి తీస్తుంది.అలాగే దీనిలోని అధిక కాల్షియం ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అదీగాక చాలా పాడి పశువులకు హార్మోన్ల కాక్టెయిల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది పశువులలో వేగవంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పైగా కృత్రిమంగా పాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఈ హార్మోన్లలో ఒకటి, IGF-1, అసాధారణ కణాల విభజన పెంచి, వివిధ కేన్సర్లు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. మితంగా పాలు తీసుకుంటే మంచి పోషకాలను, ప్రయోజనాలను పొందగలం. పోషకాల అసమతుల్యతను నివారించేలా పిల్లలు, పెద్దలు సమతుల్య ఆహారానికే ప్రాధాన్యతే ఇవ్వాలి. ముఖ్యంగా సంతృప్త కొవ్వును తగ్గించడం లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?
డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.డ్రై ఫ్రూట్స్ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్ల నుంచి డెజర్ట్ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. నీటిలో నానబెడితే..నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. పాలల్లో నానబెడితే..పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే..జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
పొంగిన నందిని పాల ధర
శివాజీనగర: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరికొన్ని నిత్యావసరాల ధరలను భగ్గున మండించింది. రాష్ట్ర పాల సమాఖ్య (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాల ధరను లీటర్పై రూ. 2 పెంచింది, బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటినుంచి అర్ధ, 1 లీటర్ పాల ప్యాకెట్లో అదనంగా 50 మి.లీ.పాలను చేర్చి విక్రయిస్తామన్నారు. 50 మిల్లీలీటర్ల పాల విలువ 2 రూపాయల 10 పైసలు అవుతుందన్నారు. ఇది అదనపు పాల ధర తప్ప పెంపు కాదని చెప్పారు.లీటరుకు రూ. 44కు చేరికప్రస్తుతం నందిని నీలిరంగు ప్యాకెట్ పాల ధర లీటర్ రూ.42 ఉండగా, బుధవారం నుంచి రూ.44 అవుతోంది. అర్ధ లీటర్ పాల ధర రూ.22 నుంచి రూ. 24కు చేరుతుంది. పెరుగు, ఇతర నందిని ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని తెలిపారు. కొన్నిరోజుల పాటు పాల ప్యాకెట్లపై పాత ఉన్నా కొత్త రేటును వసూలు చేస్తారని ప్రజలు గమనించాలని కోరారు.పోరాడుతాం: బీజేపీపాల ధరపై బీజేపీ నేతలు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే పాల ధరను 2 సార్లు పెంచారు. పేదలు, మద్య తరగతి ప్రజలపై కొంచైమెనా కనికరం ఉంటే తక్షణమే పాల ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, కూరగాయలతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెంపుపై నిరంతరం ఆందోళనలు చేస్తామని తెలిపారు.నాకు తెలియదే: సీఎం సిద్దుకేఎంఎఫ్ పాల ధర పెంపు తన దృష్టికి రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పడం గమనార్హం. మంగళవారం తన నివాస కార్యాలయం కృష్ణాలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం నిర్వహణపై సాహితీవేత్తలతో చర్యలు జరిపారు. ఆపై విలేకరులతో మాట్లాడుతూ పాల ధర పెంపు నాకు తెలియదు. కేఎంఎఫ్తో మాట్లాడుతాను. ధరల విషయం ప్రభుత్వ పరిధిలో ఉండదు అని అన్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాల ధర తక్కువగా ఉంటుందని చెప్పారు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్కి బ్రష్తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్ల వరకు ప్రతీదీ హాట్టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్ నెట్టింట తెగ వైరల్గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!సాధారణంగానే ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్కు చెందిన హోల్స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు. ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్ తాగవు..ఆర్ఓ వాటర్ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.ఈ పాలల్లో ఉండే పోషకాలు..హోల్స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట. (చదవండి: మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!) -
బర్డ్ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్!
జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు. -
యూఎస్లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకారం..బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
సీతాకోక చిలుక పాలు గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఆవు పాలు, గేదే పాలు, ఒంటె పాలు ఇలా రకరకాల పాల గురించి విన్నారు. వాటిలో అత్యంత ఖరీదైన పాలు ఏవంటే ఒంటె పాలని ఠక్కున చెప్పేస్తారు. కానీ వాటన్నింటికంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు ఇంకొకటి ఉన్నాయి. ఔను! అది కూడా ఓ చిన్న జీవి నుంచి వచ్చే పాలవి. ఎవ్వరూ నమ్మరు దాన్నుంచి పాలు వస్తాయా ? అని. కానీ ఓ జపాన్ వ్యక్తి ఆ జీవి నుంచి పాలను తీసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఏ జీవి అంటే.. అదేనండి సీతాకోక చిలుక. ఏంటీ సీతాకోక చిలుక నుంచా..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగానే సీతాకోక చిలుక నుంచి పాలు తీసున్నాడు జపాన్ వ్యక్తి. అసలు సీతాకోక చిలుకకు పాలు ఎలా వస్తాయనే కదూ..! లార్వా దశలో ఓ చిన్న గుడ్డు నుంచి గొంగళి పురుగు బయటకొచ్చి ఏ చెట్టు కాండానికో, ఏ గోడకో బలంగా చుట్టుకుని దాని చుట్టు ఓ దూదిలాంటి రక్షణ వలయాన్ని ఏర్పారుచుకుంటుదంది. అది ప్యూపా దశకు చేరుకోవడానికి నాలుగు వారాలు పడుతుంది. సరిగ్గా అది ప్యూపా దశకు చేరుకుని ఇంకొక్క వారంలో సీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుందనంగా దాని బాడిలో భారీ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఆ టైంలో దాని కకూన్(గూడు) నుంచి ఈ ప్యూపాను తీసి జెంటిల్గా తోక భాగాన్ని ప్రెస్ చేయగానే తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. ఇది చాలా గాఢతగా ఉంటుంది. ఇది ఒక లీటర్ నీటిలో కలిపి ఉపయోగించాలి. ఈ పాలని మార్కెట్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు జపాన్ వ్యక్తి. ఈ సీతకోక చిలుక పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటిగా నిలిచింది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇది ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల పాలిట వరంలా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన చాలామంది స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడ్డారట కూడా. ఇది నేచురల్ వయాగ్రాల కూడా పనిచేస్తుందంట ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయట. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. > (చదవండి: సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!) -
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
అమూల్ బేబీనే టాప్..!
క్యూట్గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు. 'అమూల్' బ్రాండ్ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. -
నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజువారీ జీవితంలో పాలు పెరుగు లేకుండా పొద్దు గడవదు. చాయ్ రూపంలో లేదా పెరుగు రూపంలోనో పాలను తీసుకోకుండా ఉండలేం. అందులోనూ ఆఫీస్కి వెళ్లేవాళ్లకు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అలాగే పెరుగన్నం తినకుండా భోజనం పూర్తి అయ్యిన ఫీల్ రాదు చాలామందికి. అయితే డాక్టర్లు మాత్రం ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. అంతేగాదు ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మన ఆరోగ్యంలో గొప్ప మెరుగైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. అదేంటి పౌష్టికాహారం అయిన పాలే మానేయాలా? ఏంటిదీ..? ఒక నెల రోజుల పాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు సిద్ధపడితే మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలరని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ డైరీ ఫ్రీ ప్రయోగం మంచి సత్ఫతితాలనిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు యశోధ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే డైరీ ప్రొడక్ట్స్కి దూరంగా ఉంటే ఆహారం నుంచి అదనపు సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఆటోమెటిక్గా తగ్గిపోతాయని అన్నారు. ఈ డైట్ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. జస్ట్ మూడు వారాల్లోనే దీని ప్రయోజనాలు మన శరీరంలో కనిపించడం మొదలవుతుందని తెలిపారు. అంతేగాదు గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం వంటి రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు. అలాగే ఈ డైరీ ఉత్పత్తులు మన ఆహారంలో తగ్గిచడం ప్రారంభిస్తామో అప్పుడూ వెంటనే మన బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్ ప్రభావం వ్యక్తులు మధ్య వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడూ పోషకలోపాలను భర్తీ చేసేలా సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో డైరీ ఉత్పత్తులను తగ్గిస్తే గట్ బ్యాక్టీరియా యాక్టివిటీలో మార్పులు వస్తాయాని, అవి ప్రతికూలం లేదా సానుకూలమైన కావొచ్చు. ఇది వ్యక్తలు ఆరోగ్య స్థితిని బట్టి ఆయా ఫలితాలు రావడం జరగుతుందని చెబుతున్నారు వైద్యులు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగపడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మెటిమల సమస్య నివారణవవుతుంది. అయితే చర్మం మెరుగుదలకు అవసరమైన పాల ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని హర్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల్లో ఎముకల ఆరోగ్యానికి మూలమైన కాల్షియం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడూ ఆ భర్తీని కాల్షియం, విటమిన్ డీ వంటి ప్రోటీన్ పోషకాలు అందించే బాదం, టోఫు, బ్రోకలీ, అత్తి పండ్లను, పొద్దుతిరుగుడు విత్తనాలతో పొందొచ్చు. ఇక్కడ పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే డైట్ అనుసరించాలనుకుంటే ఆ పాలల్లో ఉండే కాల్షియంని పొందేలా ప్రత్యామ్నాయా ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. పాల వినియోగంతో ముడిపడే ఉండే రొమ్ము, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వటి వ్యాధులు దరిచేరవని తెలిపారు. అలాగే జీవక్రియ, నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేగాక కొందరూ వ్యక్తులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నవారు కూడా ఉన్నారన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగపడి పలు విధాల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ పాల ఉత్పత్తులను తగ్గించిన వెంటనే కొందరిలో శ్లేష్మం తగ్గి శ్వాసకోస సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫలితాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందని, అందువల్ల ఈ డైట్ఫాలో అయ్యేటప్పుడూ డ్రైరీ ప్రోటీన్లకూ దూరంగా ఉండటం వల్ల వచ్చే అసహనాన్ని ఓపిగ్గా ఎదుర్కొంటూ ఫాలో అయితే మంచి ఫలితాలను పొందుతారని వైద్యుల సూచిస్తున్నారు. (చదవండి: -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
కృత్రిమ పాలు.. అనారోగ్య పాలు!
అచ్చంపేట రూరల్: పాడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుతం కల్తీపాలతో మసకబారుతోంది. అక్రమ వ్యాపారులకు అడ్డాగా నిలుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు హానికరమైన రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. వాటితో పన్నీరు, కోవా, పెరుగు తదితర పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. అక్రమార్కుల పా‘పాల’తో అందరి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. డిమాండ్ పెరగడంతో.. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు పాలు, టీ తాగుతుంటారు. అలాగే పెరుగు, కోవా, పన్నీరు, నెయ్యి తదితరాలు మనిషి జీవనంలో భాగమయ్యాయి. హైదరాబాద్ నగరం సమీపంలో ఉండటంతో పాలకు మరింత డిమాండ్ పెరిగింది. గృహ యజమానులు, హోటళ్లు, మిఠాయి దుకాణాలకు రోజుకు వేల లీటర్లలో సరఫరా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని విజయ డెయిరీతో పాటు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు నేరుగా విక్రయిస్తున్నారు. పాల డిమాండ్ విపరీతంగా పెరగడంతో అక్రమార్కులు కృత్రిమంగా పాలు తయారు చేసి.. కాసులు దండుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో అధికం.. పట్టణ ప్రాంతాల్లో పాల విక్రయ కేంద్రాలు అధికంగా వెలుస్తున్నాయి. పల్లెల నుంచి పాలను తీసుకొస్తున్నామని చెబుతూ క్యాన్లలో అక్కడక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. అమాయక ప్రజలు వీరిని నమ్మి పాలను కొనుగోలు చేస్తున్నారు. దశాబ్ద కాలంగా కృత్రిమ పాల తయారీ దందా సాగుతున్నా.. ఆహార పరిరక్షణ, స్థానిక యంత్రాంగం గుర్తించలేకపోతోంది. రసాయనాలు, పాలపొడి, నూనె, యూరియా, నీటి మిశ్రమాన్ని కలిపి తయారు చేసే ద్రావణంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. కొందరు వెన్న తీసిన పాలలో యూరియా కలిపి వెన్న శాతాన్ని పెంచుతున్నారు. వెన్న శాతం ప్రకారం లీటరు పాలు రూ.40 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద లభిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు కృత్రిమ పాలను గుర్తించలేరు. మరికొందరు పాలలో మీగడ తీసి యూరియా, నూనె ప్యాకెట్లు, సర్ఫు ద్వారా కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తప్పవు.. అచ్చంపేటలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నాలుగు సెంటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. వారి నుంచి పాల శాంపిళ్లను సేకరించాం. హైదరాబాద్లోని స్టేట్ ల్యాబరేటరీకి శాంపిళ్లను పంపిస్తాం. పాలలో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల ఆరోగ్యానికి హాని కల్గిస్తే ఉపేక్షించేది లేదు. – మనోజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అచ్చంపేటలో మెరుపు దాడులు... అచ్చంపేటలో కృత్రిమ పాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగాల రోడ్డులోని శ్రీనివాస మిల్క్ సెంటర్, రైతు పాల విక్రయ కేంద్రంతో పాటు మరో రెండు సెంటర్లను పరిశీలించి, పాల శాంపిల్స్ సేకరించారు. అలాగే బస్టాండ్, పాత బజార్ ప్రాంతాల్లోని పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా.. గత డిసెంబర్లో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అచ్చంపేటలోని పాల కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ కల్తీ చేయడంతో పాటు పాడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు తనిఖీలు చేపట్టి.. కృత్రిమ పాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూడళ్లలో పాలు పంచిన పోలీసులు..
కొత్త సంవత్సరం 2024లోకి మనమంతా కాలుమోపాం. నూతన సంవత్సరం తొలి రోజును ఆనందంగా గడిపేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే రాజస్థాన్లోని జోధ్పూర్ పోలీసులు నూతన సంవత్సరం వేళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జోధ్పూర్ పోలీసులు ఈ ఏడాది తొలిరోజున జనం చేత పాలు తాగించారు. నూతన సంవత్సరం వేళ నగరంలోని ప్రధాన కూడళ్లలో సామాన్యుల చేత పాలు తాగించిన పోలీసులు మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మద్యానికి బదులుతా పాలు తాగాలని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూపాల్ సింగ్ లఖావత్ కోరారు. కాగా నగరంలోని పలు కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన పాలకేంద్రాలకు భారీగా జనం తరలివచ్చారు. కొందరు అక్కడే పాలుతాగగా, మరికొందరు పాలను పాత్రలలో ఇళ్లకు వెళ్లారు. కోల్కతాలోని పార్క్ స్ట్రీట్లో నూతన సంవత్సరం సందర్భంగా పలువురు హుషారుగా నృత్యాలు చేశారు. చెన్నైలోనూ అర్థరాత్రి దాటిన తరువాత కూడా నూతన సంవత్సర వేడుకలు కొనసాగాయి. మెరీనా బీచ్కు చేరుకున్న జనం సంబరాల్లో మునిగిపోయారు. ఐటీ సిటీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో జనం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది కూడా చదవండి: పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం! #NewYear2024 पर जोधपुर पुलिस की अनूठी पहल, दूध पिलाकर दिन की शुरुआत, बाल्टी-केतली लेकर लाइन में दिखे लोग #JodhpurNews pic.twitter.com/twS0y4SHse — Khushbu Goyal (@kgoyal466) January 1, 2024 -
అరెస్టైన ఇద్దరు పాల పాపాత్ములు!
భూదాన్పోచంపల్లి: మండలంలోని కనుముకుల, గౌస్కొండ గ్రామాల్లో ఆదివారం ఎస్ఓటీ పోలీసులు అకిస్మిక దాడులు చేసి కల్తీపాలు తయారు చేస్తున్న పాలవ్యాపారులను అరెస్ట్ చేశారు. కనుముకులకు చెందిన పాల వ్యాపారులు పాండు, గౌస్ కొండ గ్రామానికి చెందిన అజ్గర్ ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 350 లీటర్ల కల్తీపాలు, 2.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిమ్డ్ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారుచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్రెడ్డి తెలిపారు. -
పాము పాలు తాగదు మరీ పుట్టలో పోయడం ఎందుకు ?
నాగుల చవితి ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది. నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి? ఆ 12 నాగులనే ఎందుకు పూజిస్తారు..? ఇక చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. ని పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. శ్రావణ మాసంలో ఎందుకు చేస్తాం అంటే.. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. కార్తీకంలో ఎందుకంటే..? పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం.. అందువల్ల నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం* పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. ఆ 12 నాగులనే ఆరాధిస్తారు.. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. నాగుల చవితి మంత్రం పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అనంత వాసుకి శేష పద్మ కంబాల కర్కోటకం ఆశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కలియా తక్షక పింగళ ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుంmr మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. (చదవండి: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన..చనిపోయిన ఆ మొసలి స్థానంలో..) -
ఈ పాలు మాత్రం అస్సలు తాగకండి, చాలా డేంజర్
పాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా మనలో చాలామంది ఆవు లేదా గేదె పాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఓ జంతువు పాలు తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదరమట. ఇలాంటి పాలను అస్సలు తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలల్లో కాల్షియం ఉంటుందని తెలుసు కానీ.. ఈ జంతువు పాలల్లో మాత్రం ఆల్కహాల్ ఉంటుందని మీకు తెలుసా? అవును. అడవిలో గజరాజుగా మనందరికి తెలిసిన ఏనుగు పాల గురించి ఈ చర్చంతా. ఏనుగు పాలల్లో బీర్, విస్కీ లేదా వైన్ కంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ శాతం ఉంటుందట. అంతేకాకుండా ఏనుగు పాలు తాగడం వల్ల మత్తు రావడమే కాకుండా వెంటనే మూర్ఛపోతారట. అంత డేంజర్ మరి. ముఖ్యంగా ఆడ ఏనుగు పాలల్లో శాతం ఆల్కహాల్ లెవల్స్ ఉంటాయి.నిజానికి, ఏనుగు చెరకు తినడానికి ఇష్టపడుతుంది. చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం తెలిసిందే.ఇదే ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం పెరగడానికి కారణమవుతుంది. ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే రసాయనాలు మనుషులకు హానీ చేస్తాయట. ఈ పాలల్లో బీటా కేసైన్ ఉంటుంది. దీని కారణంగా పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది. ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి. అందుకే మానవులు రెండు సిప్స్ తాగిన తర్వాత మూర్ఛపోతారని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ పాలలోని కార్బోహైడ్రేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. వీటి కారణంగా వీటిని తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
ఇజ్రాయెల్ ఆవుల ప్రత్యేకత ఏమిటి? పాలను ఏ పద్ధతిలో తీస్తారు?
ఇజ్రాయెల్ పలు అంశాలలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. వీటిలో ఒకటి ఆవుల పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ ఆవులు ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. అవి గరిష్టంగా పాలను అందిస్తాయి. ఇందుకోసం ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి 12,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆవులు హోల్స్టెయిన్ జాతికి చెందినవి. ఆవులను ఉత్తమంగా సంరక్షించడంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందుంది. ఈ దేశంలో పాడి పరిశ్రమ నిర్వహణకు మంచి పేరుంది. రోజువారీ పాల దిగుబడి శాతాన్ని పరిశీలిస్తే, భారతీయ ఆవు 7.1 లీటర్లు, బ్రిటిష్ ఆవు 25.6, అమెరికన్ ఆవు 32.8, ఇజ్రాయెల్ ఆవు 38.7 లీటర్ల మొత్తంలో పాలు ఇస్తుంది. హెర్జ్లియా నగరాన్ని ఇజ్రాయెల్ పాల రాజధాని అని పిలుస్తారు. ఇజ్రాయెల్ అంతటా దాదాపు 1000 డైరీ ఫామ్లు ఉన్నాయి. 2016లో ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్లు సుమారు 1,450 మిలియన్ లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేశాయి. పాడి ఆవుల నిర్వహణకు దేశంలో ప్రత్యేక మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇజ్రాయెల్లో ఆవు పాలను ఉపయోగించి 1000 కంటే ఎక్కువ విభిన్న పాల ఉత్పత్తులను తయారు చేస్తారు. 'మిక్వే ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ స్కూల్' 1880లో స్థాపితమయ్యింది. దేశంలో హోల్స్టెయిన్ జాతి ఆవు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెలీ పాడి పరిశ్రమ విజయానికి అక్కడి సాంకేతిక పురోగతి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ రైతులు తమ ఆవులను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. భారతదేశం నుండి పలు బృందాలు శిక్షణ కోసం ఇజ్రాయెల్ డెయిరీలకు కూడా వెళ్లాయి. ఇజ్రాయెల్ ప్రభావంతో భారత్తోపాటు చైనా, వియత్నాం, కెనడాలలో పాల ఉత్పత్తులు వృద్ధి చెందాయి. ఇజ్రాయెల్ డెయిరీలు చాలా వరకు సహకార సంస్థలు. ఇవి 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందాయి. ఆవుల పాల ఉత్పత్తిలో వాటి పాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ప్రమాణం ప్రకారం ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తాం. ఇజ్రాయెల్లోని అన్ని డెయిరీలు ఇజ్రాయెల్ డెయిరీ బోర్డ్ విధానాలను అనుసరిస్తాయి. రోబోటిక్ పద్ధతిలో ఆవుల నుండి పాలను తీస్తారు. ఈ రోబోటిక్ ప్రక్రియ 1999లో ఇక్కడ ప్రారంభమయ్యింది. ఇక్కడి ఆవులను పశువైద్యులు క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
93 ఏళ్ల వయసులో కూడా సాగు చేస్తున్న రైతు
-
ఎలుక పాలు లీటరు 18 లక్షలా..!
ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి, మన వినాయకుడి వాహనం అయిన మూషికం పాలే ఖరీదైనవి. ఏకంగా లక్షలు పలుకుతోంది ధర. పైగా పరిశోధకలకు ఎంత ప్రియమైన జంతువట అది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్టలీ? అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే! షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం. ఎలుకపాలు సంపాదించటం అంత ఈజీ కాదు. పైగా ఇది 30 నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే సుమారు 18 లక్షల రూపాయలు. దేనికీ ఈ పాలు.. ఎలుక పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలేనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటే..ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే వేల ఆవులను వినయోగించడం సాధ్యం కాదు. దానికంటే వేల ఎలుకలను ఉపయోగించడమే చాలా ఆచరణాత్మకమైనది, సులభమైనది కూడా. ఏ ఔషధాల్లో ఉపయోగిస్తారంటే.. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్ మెటీరియల్గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. ఏజంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే.. ఒక ఆవు ఏడాదికి దాదాపు 10 వేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 కిలోల బరువు పెరుగుతుంది. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఎంతో ఇష్టంగా తాగే చాయ్లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా!
ఓ కప్పు 'టీ' తాగితే హమ్యయ్య అనిపిస్తుంది. అంతెందుకు పనివాళ్ల దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అబ్బా ఓ కప్పు 'టీ' పడితే ప్రాణం సుఖంగా ఉంటుంది. హుషారుగా పనిచెయ్యొచ్చు అనుకుంటారు. చాలామంది టీ తాగితే చాలు ఆకలి తీరిపోయిందనుకుంటారు. అంతలా చాయ్కి అతక్కుపోయారు కొందరూ. అలాంటి టీలో ఒకప్పుడూ పాలు కలిపేవారే కాదట. మధ్యలోంచే మొదలైంది. అక్కడనుంచి టీని పాలు కలిపి తయారు చేయడం ప్రారంభించారట. అంతేగాని ముందుగా ఓన్లీ డికాషన్ తప్ప పాలు కలపేవారే కాదట. అసలెప్పుడూ అలా చేయడం ప్రారంభమైంది? ఎలా వచ్చింది? తదితరాలు గురించే ఈ కథనం. మన దేశంలో ఎవరైన వస్తే ముందుగా టీ తాగుతారా అని అడుగుతారు. ఇంట్లో ఏం లేకపోయిని జస్ట్ ఓ టీ కప్పు, కొన్ని బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాయ్లో పాలు కలపడం అనే ప్రక్రియ భారత్ నుంచి ప్రారంభం కాలేదట. మన వరకు వచ్చేటప్పటికీ.. బ్రిటీస్ వాళ్లు టీ తోటలు పెంచేంత వరకు మనకు చాయ్ గురించి తెలియనే తెలియదు. బ్రిటీష్ వాళ్లకు కూడా టీ గురించి 17వ శతాబ్దం వరకు తెలియదట. టిబెట్లో ప్రజలు టీ పొడితో పాలు కలిపి తయారు చేసేవారట. అలా చైనా నుంచి మంగోలియాకు టీ తయారీ విధానం విస్తరించిందట. ఇక 1800 మధ్య కాలం నుంచి బ్రిటీష్వారు టీ పొలాలు ఏర్పాలు చేసి దుకాణాలు పెట్టి విక్రయించేంతవరకు టీ పెట్టే అలవాటు మనకు లేనేలేదట. కాబట్టి మనకు టీలో పాలు కలపడం గురించి బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసిందే గానీ ముందుగా భారత్లో మాత్రం లేదు. టీలో పాలు కలపడం వెనుక కారణం.. పశ్చిమ ఐరోపాలో పర్యటించేటప్పుడూ సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు ఉండేవి. ఆ టైంలో కాస్త నకీల టీల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో టీని ఆసక్తికరంగా రుచిగా ఉండేలా తయారు చేసే విధానాలపై దృష్టి పెట్టారు అప్పటి ప్రజలు. ఆ క్రమంలో పాలు జోడించటం జరిగింది. సాధారణ 'టీ' డికాషన్ చేదుగా ఉండటంతో పాలు జోడించి మరింత రుచిగా తాగేలా చేయడమ ప్రారంభించారు. అలానే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే..యూరోపియన్ పింగాణి పాత్రలు చాలా సున్నితమైనవి, ఖరీదైనవి. దీంతో వేడివేడీ టీ పోయగానే అవి పగలిపోయేవి. కప్పులు పగలకుండా లేదా పగళ్లు రాకుండా ఉండేలా చల్లటి పాలు పోసి ఆ తర్వాత వేడివేడి టీ డికాషిన్ పోసేవారట. అలా పాలతో టీ సర్వ్ చేయడం ప్రారంభమైందట. పాలతోనే రుచిగా ఉటుందని ఎప్పుడూ తెలిసిందంటే.. టిబెటియన్లు పోషకాహారాన్ని పెంచెందుకు ఈ టీ తయారీకి పాలు జోడించారట. అలాగే బ్రిటన్ పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రామిక తరగతి ప్రజలు టీలో పాటు జోడించేవారట. వారు దానిని బిల్డర్స్ టీ అని పిలిచేవారట. సుదీర్ఘ పనిదినాల్లో టీ విరామంలా దీన్ని సేవించి తిరిగి నూతన ఉత్తేజంతో పనిచేశేవారట. టీలో ఉండే టానిన్లు కారణంగా చేదుగా ఉంటుంది. పాలుతో కాకుండా నేరుగా తాగితే నోరు పొడిబారినట్లు అవుతుంది. అదే ఇలా పాలతో తీసుకుంటే టానిన్ల ప్రభావాన్ని తగ్గించి చక్కటి రుచితో బాటు కాస్త నోరు తేమగా ఉండేలా చేస్తుంది. పాలు ఉపయోగించడంతో తక్షణమే ఒంట్లోకి శక్తి వచ్చి కాస్త బలంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి నుంచి ఇలా పాలను టీ పోడితో జోడించి రుచిగా తయారు చేయడం ప్రారంభమైందట. అలాగే మరో కారణం కూడా చెబుతుంటారు కొందరూ. టీని పాలతో తీసుకునే అలవాటు ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వారి నుంచి మొదలైందని కొందరి వాదన. 1685లో, ఫిలిప్ సిల్వెస్ట్రే డుఫోర్ పాలతో దగ్గు, జీర్ణ రుగ్మతలకు విరుగుడుగా ఇలా టీని తయారు చేశాడని అంటారు. కలోనియల్ బోస్టన్లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ బ్లాక్ టీలు తప్పనిసరిగా పాలతో బాగా రుచిగా ఉండేవి. వారు కాంటన్ నుంచి లండన్ మీదుగా తమ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి టీ పాతబడిపోయి రుచిగా ఉండేది కాదు. దీంతో పాలు జోడించగానే రుచిగా ఉండేది. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక కెన్యాలో ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన టీలో ఎక్కువ భాగం పాలతో కలిపి తాగడానికి తయారు చేసిన టీనే ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
మూన్ మిల్క్ గురించి విన్నారా! ఐదువేల ఏళ్ల నాటి..
మూన్మిల్క్ గురించి విన్నారా! ఇది పురాతన ఆయుర్వేద పానీయం. ఆయుర్వేద మూలికల నుంచి తయారుచేసిన దివ్వ ఔషధం. పూర్వం ఈ పానీయంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేవారట. అందువల్లే వాళ్లు ఎలాంటి అనారోగ్యం బారిన పడిన తట్టకుని బతికిబట్టగట్టగలిగేవారట. దీన్ని అత్యంత శక్తివంతమైన ఔషధంగా వారంతం ప్రగాఢంగా విశ్వసించేవారని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. ఈ మూన్మిల్క్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తయారు చేయాలి తదితరాల గురించే ఈ కథనం. అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇది దాదాపు 5వేల ఏళ్ల నాటి పురాతన సహజసిద్ధ ఔషదం. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడం కోసం మూన్మిల్క్ని ఉపయోగించేవారట. మీకు పుష్టిని కలిగించడమేగాక రోగనిరోధక శక్తిని పెంచేలా ఈ మూన్మిల్క్కి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా దీని తయారీలో ఉపయోగించే మూలిక ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయని అంటున్నారు. దీన్ని ఆవు పాలతో తయారు చేస్తారు కాబట్టి. ముఖ్యంగా కొలస్ట్రాల్ లేకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉపయోగించే బాదం, సోయా, వోట్, దాల్చిన చెక్క, ఏలకులు, పసుపు అశ్వగంధం తదితర సుగంధ ద్రవ్వయాలు వినియోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి తోపాలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను వృద్ధి చేస్తుంది. ఇక ఇందులో వినయోగించే అశ్వగంధం వంటి అడాప్టోజెనిక్ మూలికలు శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖవంతమైన నిద్ర ఈ మూన్ మిల్క్ని సేవిస్తే..కలవరపాటుకు గురి కాని మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక ఇందులో ఉపయోగించే పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను వృద్ధి చేసి రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. శీతాకాలంలో దీన్ని సేవిస్తే మరింత ప్రయోజనం ఉండటమే గాక ఎన్నో రుగ్మతల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక యాలకులు, దాల్చిన చెక్క వంటి సున్నితమైన సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడం మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ మసాలాలు అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ల వంటి సమస్యలకు చెక్పెడతాయి. భారీ మొత్తంలో భోజనం సమయంలో ఇది సేవిస్తే చాలా చక్కగా జీర్ణం అవ్వడమే గాక ఎలాంటి ఆపసోపాలు పడాల్సిన పని ఉండదు. తయారీ విధానం చంద్రుని పాలు తయారీకి ఆవు పాలు లేదా గేదె పాలు(వాల్నట్ మిల్స్, బాదం మిల్క్ లేదా జీడిపప్పు మిల్స్ అయినా ఉపయోగించొచ్చు) ఓ కప్పు తీసుకుని వేడి చేయండి. అందులో అర టీ స్పూన్ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క, యాలకులు కలపండి. అశ్వగంధం వంటి అడాప్లోజెనిక్ మూలికలు ఒక టీస్పూన్ వేయండి. బాగా మరిగిన తర్వాత దించి చల్లారక తాగండి. ఇది ఆరోగ్యానికి బహుముఖ ప్రయోజనాలను అందించడమే గాక ఒత్తిడిని దూరం చేసే మంచి సుఖవంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది. (చదవండి: స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?) -
రోజూ పాలు తాగడం కూడా ప్రమాదమేనా?.. వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
పాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కాల్షియం ఉంటుంది ఎముకలకు బలం మన పెద్దవాళ్లు చెబుతుంటారు. చదివే పిల్లలు రోజు పాలు తాగడం మంచిదని మన బామ్మలు పాలు అవి ఇస్తుంటారు. కమ్మటి పాలు తాగితే హాయిగా నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాంటి పాలను రోజు తాగొద్దంటూ ఆరోగ్య నిపుణులు. కాదని అలా తాగితే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ పురుషులకైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. కాల్షియం వంటి విటమిన్లను అందించే పాలు రోజు తాగితే..ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఎముకలకు బలం అన్న ఆ పాలే మంచిది కాదని స్ట్రాంగ్గా చెప్పేస్తున్నారు యూకే ఆధారిత క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు. ఆ రీసెర్చ్ సెంటర్ వైద్య బృందం చేసిన పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లండించారు. పాలల్లో ఉండే హార్మోన్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ హార్మోన్లే క్యాన్సర్ కారకాలుగా.. యూకే క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తన పరిశోదన ఫలితాల్లో పాలు ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలా కారకం అవుతుందో వెల్లడించారు. ఈస్ట్రోజన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు సహజంగా ఆవుపాల్లో ఉంటాయి. ఈ హర్మోన్లు పెరుగుదల హార్మోన్లు. అవే ఇప్పుడు క్యాన్సర్ వృద్ధికి కారణమవుతాయని అంటున్నారు. ప్రతి రోజు కాఫీతో పాలు తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. యూఎస్లోని లోమా లిండా విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలుగా 22 వేలమంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజు 2.5 శాతం పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిని ఇవ్వగా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని నిర్థారించారు వైద్యులు. అధిక వెన్న శాతం ఉన్న పాల కంటే తక్కువ వెన్న శాతం ఉన్న నాన్ క్రీమ్ పాలతోనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ప్రత్యేకించి ఈ ఆహారం నుంచే ఈ ప్రమాదం ఎక్కువ అని కచ్చితంగా చెప్పడం కష్టమేనని అన్నారు. దీనిపై మరింత పరిశోనలు చేయాల్సి ఉందని కూడా చెప్పారు. దీనికి సరైన విధమైన జీవనశైలి పాటించని వారై, చెడ్డ ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
‘పాడి’కి మేలి మలుపు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలున్నాయి. ఇది వరకు ప్రైవేట్ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 13 శాతం రావడంతో లీటర్కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెలకు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా.. లీటర్కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లెక్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది. ‘అన్నా.. ఇది పాల బాటిల్.. నీళ్ల బాటిల్ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం. పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు. పక్కాగా వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం పాలల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్ చేయకుండా, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు. పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్ మిషన్ ఒకటే ఉంటుంది. అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిల్క్ ఎనలైజర్ (వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం, ప్రొటీన్, వాటర్ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్ (పాలు మిక్స్ చేయడానికి) సాప్ట్వేర్ సిస్టమ్ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ స్కేల్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్ చేసిన పాలను ్రస్ట్రిరర్పై పెట్టి, ఆ శాంపిల్ను మళ్లీ ఎనలైజర్లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమూల్కు, హెరిటేజ్కు మధ్య ఎంత తేడా! 2020 డిసెంబర్లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో లీటర్కు హెరిటేజ్ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు. అమూల్ ప్రారంభంలోనే లీటర్ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్ ప్రస్తుతం గేదె పాలకు లీటర్ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే. అదే సంగం డెయిరీ లీటర్కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎ¯Œన్ఎఫ్తో గేదె పాలకు లీటర్కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్కు లాక్ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్ మాత్రం ఎలాంటి లాక్ సిస్టమ్ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది. పాడి రైతులకు అన్ని విధాలా భరోసా గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్ మాత్రం 20–22 శాతం ప్రోటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్కు 5 శాతం చొప్పున బోనస్ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. అదనపు ఆదాయం నిజం మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్ఎన్ఎఫ్ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది. – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా నెలకు రూ.3,600 అదనపు ఆదాయం మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా లీటర్కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్ఎన్ఏఫ్ 9.2 శాతం, ఫ్యాట్ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర రాలేదు. – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా గతంలో రూ.30కి మించి వచ్చేది కాదు మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్ కేంద్రంలో పోస్తే ఎస్ఎన్ఏఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.1 శాతంతో లీటర్కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం. – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రైతుల నుంచి మంచి స్పందన జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ -
పాలుతాగావా.. బసవన్నా!
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్కోట్ గ్రామంలోని బసవన్న దేవాలయంలో నందీశ్వరుడు పాలు తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరన్కోట్ గ్రామంలోని మెయిన్ బజార్లో పురాతన బసవన్న దేవాలయం ఉంది. గ్రామానికి చెందిన పూజ, స్రవంతి శుక్రవారం ఆలయంలో నైవేద్యం సమరి్పచేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహానికి పాలుతాపే ప్రయత్నం చేయగా... నిజంగా పాలు మొత్తం తాగినట్లు ఆ మహిళలు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పురాతన ఆలయం కావడంతో శనివారం ఉదయం ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఇదంతా దేవుడి మహిమ అని త్వరలో ఆలయానికి మరమ్మతులు చేపడతామని ఉప సర్పంచ్ హేమంత్కుమార్ తెలిపారు. నందీశ్వరుడు పాలు తాగిన విషయం నిజమేనని ఉపసర్పంచ్ కూడా చెప్పారు. బీసీలకు రెండు -
నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు
నది దగ్గరకు వెళ్లి పాలలో నీళ్లు కలుపుతున్న పాల వ్యాపారికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. ఈ ఫొటోను క్లిక్ మనిపించిన మధ్యప్రదేశ్లోని శ్యోపూర్ జిల్లా కలెక్టర్ దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఒక పాల వ్యాపారి ఒక నది దగ్గర నిలుచుని పాల క్యాన్లలో నీటిని కలపడం కనిపిస్తుంది. ఈ ఫొటోను స్వయంగా కలెక్టర్ తన మొబైల్ ఫోనుతో క్లిక్ మనిపించారు. తరువాత దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసి, వైరల్ చేశారు. వివరాల్లోకి వెళితే శ్యోపూర్ పట్టణానికి సమీపంలో ఉన్న మోర్డోంగరీ నది దగ్గరకు ఒక పాల వ్యాపారి తన బైక్కు పాల క్యాన్లను తగిలించుకుని వచ్చాడు. తరువాత ఒక క్యాన్లో నదిలోని నీటిని నింపి, ఆ నీటిని మిగిలిన పాల క్యాన్లలో నింపాడు. ఈ సమయంలో మార్నింగ్ వాక్ చేస్తూ, అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఆ పాల వ్యాపారికి ఫొటో తీశారు. అనంతరం ఆ పాల వ్యాపారిని అడ్డుకుని, పాలలో నీటిని కలపవద్దంటూ మందలించి అక్కడి నుంచి పంపివేశారు. కలెక్టర్ చేసిన ఈ పనితో మిగిలిన పాల వ్యాపారులలో వణుకు పుట్టింది. సదరు పాల వ్యాపారి ఫోటోను కలెక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపధ్యంలో జనం రకకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఉదంతం గురించి కలెక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తాను మార్నింగ్ వాక్కు వెళుతుండగా డోంగరీ నది దగ్గర ఒక పాల వ్యాపారి పాల క్యాన్లలో నీటిని కలుపుతుండగా చూశానని అన్నారు. అతని దగ్గరకు వెళ్లి మందలించానని తెలిపారు. ఇప్పటీకీ పాల వ్యాపారులు తమ తీరుమార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్ -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 సన్రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
‘మద్యం మత్తులో.. పాలు తాగాడంట!’
Drunken Drive Funny Viral: మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి పెద్ద జోక్ అయ్యింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండగా.. కారులో ఓ వ్యక్తి వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి. ఏం తీసుకున్నావని పోలీసులు ప్రశ్నించగా.. పాలు తాగానని చెప్పడంతో అక్కడే ఉన్న ఉన్నతాధికారి ఒక్కసారిగా ఘోల్లుమని నవ్వాడు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్గ్రూపుల్లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తిని అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే ఐటీ ఉద్యోగిగా.. పోలీసులు అతని ద్వారానే చెప్పించారు. ఆ తర్వాత తమ స్టయిల్లో గట్టిగా నిలదీసేసరికి.. మద్యం సేవించినట్లు అంగీకరించాడు. ఆపై అతనిపై కేసు ఫైల్ చేశారు. -
వీడియో: ‘నేను పాలు తాగిన సార్ అంతే’.. హైదరాబాద్ పోలీసుల రియాక్షన్ చూసేయండి
-
ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం!
పచ్చిపాలు, రోజ్ వాటర్ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వలయాకారంగా మర్దన చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్తో తుడిచేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాలు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. పచ్చిపాలు ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తేమ కోల్పోయిన చర్మానికి తేమనందిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా ఈ వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తే ముఖం మీద మొటిమలు వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది. -
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు. -
అమూల్ పాల సేకరణ ధరలు మరోసారి పెంపు
-
పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!
హాస్టల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుండటం సాధారణమే. ఒకరి వస్తువులను మరొకరు వాడటం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం మొదలైన విషయాల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక యువతి తన రూమ్మేట్ తన ఆహారాన్ని రోజూ దొంగిలిస్తున్నదని గ్రహించి,అత్యంత విచిత్ర రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. హాస్టల్, లేదా పీజీలో ఉండేవారు అక్కడ లభ్యమయ్యే ఆహారం కన్నా ఇంటి భోజనమే వెయ్యిరెట్లు ఉత్తమమని భావిస్తుంటారు. అందుకే కొందరు బయటి నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో రూమ్మేట్స్తో షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇటీవల ఒక యువతి తన ఫ్లాట్మేట్ నుంచి తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చ్యపోవాల్సిందే. సారా అనే యువతి టిక్టాక్లో @saatj32 హ్యాండిల్పై ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఆమె మరోదారిలేక తాను తన ఆహారాన్ని పాడు చేసుకోవలసి వస్తున్నదని ఈ వీడియోలో పేర్కొంది. తన ఫ్లాట్ మేట్ తన ఆహారాన్ని చోరీ చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని పేర్కొంది. ఆమె షేర్ చేసిన వీడియోలో ఆమె ఒక ఆర్గానిక్ బ్రిటీష్ సెమీ స్కిమ్డ్ మిల్క్ డబ్బా తెరుస్తూ కనిపిస్తోంది. తరువాత ఆమె దానిలో అత్యధిక మోతాదులో ఉప్పు కలిపింది. తరువాత ఆమె కెమెరావైపు చూస్తూ.. తన ఫ్లాట్మేట్ దొంగచాటుగా పాలను తాగేసి, డబ్బా అక్కడ పెట్టేస్తోంది. ఈ పాలు ఎలా తాగుతుందో ఇప్పుడు చూస్తాను అని పేర్కొంది. ఈ వీడియో క్యాప్షన్లో.. ‘ఈ విషయంలో నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పలువురు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇలా చేసేముందు నువ్వు నీ రూమ్మేట్కు ఒకసారి ఈ విషయం చెప్పి ఉండాల్సింది’ అని రాశారు. చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
హైదరాబాద్లో అక్షయకల్ప భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప స్థానిక అవసరాల కోసం పాల సేకరణకు సంబంధించి హైదరాబాద్ సమీపంలోని అప్పాజీగూడలో క్లస్టర్ను ఏర్పాటు చేస్తోంది. దీనిపై రూ. 20–30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు శశి కుమార్ తెలిపారు. మూడేళ్లలో ఇది అందుబాటులోకి రాగలదని, తొలుత రోజుకు 10వేల లీటర్ల వరకు పాల సేకరణ ఉండగలదని వివరించారు. ప్రస్తుతం తమకు కర్ణాటక, తమిళనాడులో చెరో క్లస్టర్ ఉందని చెప్పారు. ఒక్కో క్లస్టర్లో సుమారు 300–400 మంది పాడి రైతులు ఉంటారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో నెలకు సుమారు రూ. 20 కోట్ల వరకు అమ్మకాలు ఉంటున్నాయని శశి కుమార్ తెలిపారు. కొత్తగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ‘గ్రీన్స్’ పేరిట సేంద్రియ కూరగాయలు, పండ్ల విక్రయాలు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో దాదాపు 180 మంది, మొత్తం మీద సుమారు 800 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 205 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 300 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శశి కుమార్ పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటు చేసినప్పట్నుంచి దాదాపు దశాబ్దకాలంలో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు వివరించారు. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. షీర్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు!
అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం. పాకిస్థానీ షీర్ కుర్మా కావలసినవి: ►సన్న సేమ్యా – పావుకేజీ ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – పావుకేజీ ►నెయ్యి – కప్పు ►జీడిపప్పు – అర కప్పు ►బాదం – అర కప్పు ►పిస్తా – పావు కప్పు ►గులాబీ రెక్కలు– గుప్పెడు ►యాలకులు – పది. తయారీ: ►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి. ►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి. -
ఆ తెల్లటి పాల వెనక ఎంతటి అక్రమం? ఎంత నేరం?
పిఠాపురం: తెల్లనివన్నీ పాలు కాదు అంటుంటారు. అది నిజమనిపించేలా వ్యవహరిస్తున్నారు కొందరు పాల వ్యాపారులు.. డైరీ ఫాం యజమానులు. పాల ఉత్పత్తి పెరిగేందుకు ప్రమాదకర పాలసేపు ఇంజెక్షన్లు వాడుతూ వీరు ఆందోళన కలిగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ల వినియోగంతో పాల సేపుతో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. పాల శాతం ఎంత పెరుగుతుందో దాని కంటే రెట్టింపు ప్రమాదం కూడా పొంచి ఉందని పశువైద్యులు రైతులకు సూచిస్తున్నారు. రైతులను మభ్య పెట్టి కొందరు ప్రైవేటు వ్యాపారులు ఈ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా అమ్మడంతో పాటు వినియోగిస్తున్నారు. ఆక్సిటోసిన్ అనే ఉత్ప్రేరక ఇంజెక్షన్ను వాడడం వల్ల పశువుతో పాటు పాలుతాగే వారికి కూడా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పశుసంవర్ధకశాఖాధికారులతో పాటు ఆహార తనిఖీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడుతున్న వారిపై నిఘా పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంజెక్షన్ ఎప్పుడు వాడతారు పాడి పశువులు ఈనే సమయంలో ప్రమాదకరంగా మారి ఈనలేనప్పుడు, పొదుగు వాపులో పాలు రానప్పుడు, పశువు ఈనిన తర్వాత మాయ వేయలేనప్పుడు , మొయ్యను సరిదిద్దడానికి ఆక్సిటోసిన్ వాడుతుంటారు. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను 1953లో కృత్రిమంగా తయారు చేసి వాడేవారు. ఈ ఇంజెక్షన్ రెండు నుంచి ఆరు నిమిషాలు రక్తంలో స్రవించి జీవక్రియ జరుగుతుంది. తద్వారా పాలు సేపునకు రావడంతో పాటు ఎక్కువగా పాలు స్రవిస్తాయి. దీనివల్ల నష్టాలు ఆక్సిటోసిన్ వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇది ఒక హార్మోన్. దీనిని రోజూ వాడటం వలన పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. పశువు ఎదకు వచ్చినా చూలు నిలబడక పోవటం, తిరిగి ఎక్కువ సార్లు పొర్లడం, గర్భస్రావం జరగడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి. ఈ హార్మోన్ స్రవించిన పాలు తాగడం వల్ల మనుషుల్లోను దుష్ఫరిణామాలు అధికంగా తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లల్లో వినికిడి, దృష్టి లోపాలు వస్తుంటాయి. శరీరం నుంచి శక్తి నశించి తొందరగా అలసటకు గురవుతారు. చంటి పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాలింతల్లో హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ రావచ్చు. ఆడ పిల్లల్లో ఈ హార్మోన్ ఉన్న పాలు తాగడం వల్ల చిన్న వయసులోనే ప్రౌఢ దశకు చేరతారు. ఈ ఇంజెక్షన్ను 1960లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టూ యానిమల్స్చట్టం–1960 కింద ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు వీటిని వాడుతున్నారు. అంతేకాదు రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంజెక్షన్తో పని లేదు పశువులకు మేపులో పౌష్టిక దాణాలు, ఖనిజ లవణాలున్న మేతను అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు. దీనివల్ల పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రోగాలు దరిచేరవు. అజోల్లా వంటి ఆరోగ్యకరమైన మేతలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. పశువుల ఆరోగ్యమూ మెరుగు పడుతుంది. అనేక ప్రాంతాల్లో దూడల పోషణ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా 30 శాతం దూడలు చనిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దూడ లేక పోతే పశువు పాలు ఇవ్వదు. పశువులకు అలవాటు చేసిన ప్రకారం పాలసేపు అనేది వస్తుంది. ముందుగా దూడను తాగించి తరువాత పాలు తీస్తే అదే అలవాటు అవుతుంది. దూడ లేకపోతే పాలు సేపునకు రావు. అలా కాకుండా ముందుగా పాల గిన్నెల శబ్ధాలు అలవాటు చేయడంతో పాటు పితికిన తరువాత దూడలకు పాలు వదలాలి. అలా చేస్తే దూడలేకపోయినా పశువులు పాల సేపునకు వస్తాయి. – ఎస్ సూర్యప్రకాశరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి. జిల్లాలో పాడి పశువులు ఆవులు : 76502 గేదెలు : 2.82,273 పాల ఉత్పత్తి : 33474 లీటర్లు (రోజుకు) -
ఏపీలో మరో కీలక చట్టం
-
‘విజయ’ పాలకు ఎసరు, అధికారుల తీరుపై విమర్శలు.. కావాలనే చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల విక్రయాలపై కుట్ర జరుగుతోందా..?. అంగన్వాడీ కేంద్రాలకు విజయ పాలు సరఫరా కాకుండా అధికారులే అడ్డుపడుతున్నారా.. ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. విజయ డెయిరీకి టెండర్ దక్కకుండా అధికారులే నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఇటీవల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహా్వనించారు. కేవలం కర్ణాటక, గుజరాత్లకు చెందిన డెయిరీలకే టెండర్ దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న హాకా ఆయా టెండర్లు పిలవాల్సి ఉండగా, దాన్ని పక్కనపెట్టి ఐసీడీఎస్ ద్వారా టెండర్లు పిలవడంపై కూడా వివాదం రేగుతోంది. ఏడాదికి 3 కోట్ల లీటర్ల విజయ పాలకు ఎసరు రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 4.57 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. 10.34 లక్షల మంది ఏడాది నుంచి నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 6.67 లక్షలు 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం తరపున పాలు అందజేస్తారు. ఒక్కో తల్లికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తారు. అందుకోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. ఏడాదికి అంగన్వాడీ కేంద్రాలకు దాదాపు 3 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్ పాలు సరఫరా చేస్తున్నారు. ఈ పాలను రాష్ట్రంలోని విజయ డెయిరీ వంటి సహకార డెయిరీల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నిబంధనలు మార్చడంతో విజయ డెయిరీకి భారీగా నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన వ్యాపారానికి గండిపడుతుందనే చెప్పాలి. సామర్ధ్యానికి మించి నిబంధనలు... 20 రోజుల క్రితం హాకా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అప్పుడు సింగిల్ టెండరే వచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేయాలనుకున్నారు. కానీ ఈసారి హాకాను పక్కనపెట్టి ఐసీడీఎస్ వర్గాలు టెండర్లకు వెళ్లాయి. విజయ డెయిరీ టెట్రాప్యాక్ పాల సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు కాగా, టెండర్లో 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని పొందుపరిచారు. అలాగే గత మూడేళ్లలో ఏదో ఒక ఏడాది 1.5 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్లు సరఫరా చేసిన సామర్థ్యం ఉండాలన్న నిబంధనను కూడా విధించారు. ఈ సామర్థ్యం కూడా విజయ డెయిరీకి లేదు. గతంలో ఇలాంటి నిబంధనలను విధించలేదు. కేవలం కర్ణాటక, గుజరాత్కు చెందిన డెయిరీలకే అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని చెబుుతు న్నారు. ఈ నెల 20వ తేదీన టెండర్ దా ఖలుకు చివరి తేదీ కాగా, నిబంధనలు ఎలా ఉన్నా టెండర్లు వేస్తామని విజయ డెయిరీ వర్గాలు వెల్లడించాయి. -
కర్ణాటకలో ముదురుతున్న పాల వివాదం
-
క్షీర విప్లవం వెల్లువెత్తేలా..!
సాక్షి, అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద ప్రస్తుతం 1,515 ఆర్బీకేల పరిధిలో 2.60 లక్షల మంది మహిళా రైతులు నమోదు కాగా.. 65 వేల మంది నుంచి ప్రతిరోజు 1.75 లక్షల లీటర్ల పాలను అమూల్ సంస్థ ద్వారా అత్యధిక ధర చెల్లించి సేకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,388 ఆర్బీకేల పరిధిలో కనీసం 4.58 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్లు, 2024 మార్చి నాటికి 8,021 ఆర్బీకేల పరిధిలో 6 లక్షల మంది రైతుల నుంచి 9 లక్షల లీటర్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. నిత్యం 30 మందితో మాట్లాడేలా.. పాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లాకో కమాండ్ కంట్రోల్ సెంటర్ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కంట్రోల్ సెంటర్ పని చేస్తాయి. డీఆర్డీఎ, పశుసంవర్థక, సహకార శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది షిఫ్ట్ల వారీగా ఈ సెంటర్లో సేవలందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. ప్రతిరోజు కనీసం 30 మంది మహిళా పాడి రైతు సంఘాల కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ల సిబ్బంది మాట్లాడతారు. పాలుపోసే మహిళా పాడిరైతులతోపాటు రూట్ ఆఫీసర్స్, అమూల్ టీమ్కు జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పాల సేకరణ, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతం గుర్తింపు, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. సేకరణ తగ్గితే రంగంలోకి ప్రత్యేక టీమ్లు ఏ గ్రామంలో అయినా పాల సేకరణ తగ్గినట్టుగా గుర్తిస్తే వెంటనే అందుకు గల కారణాలను విశ్లేషించి పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక టీమ్లను పంపించే ఏర్పాటును కమాండ్ కంట్రోల్ సెంటర్లు చేస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో పాటు బీఏంసీయూ, ఏఎంసీయూ భవనాల నిర్మాణాల పురోగతి, పాడి రైతులకు బ్యాంక్ లింకేజ్ను కలెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఎంపీడీఓ, తహసీల్దార్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సొసైటీల రిజిస్ట్రేషన్లు, పాల సేకరణకు చెల్లించే హ్యాండ్లింగ్, నిర్వహణ చార్జీలు ఎప్పటికప్పుడు జమయ్యేలా చూస్తాయి. రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అన్ని గ్రామాలకు విస్తరిస్తాం జగనన్న పాల వెల్లువ పథకాన్ని దశల వారీగా అన్ని ఆర్బీకేలకు, అన్ని గ్రామాలకు విస్తరించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2024 మార్చి కల్లా పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకే పరిధిలో పాల సేకరణ ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ -
Sweet Recipe: మూడు రోజుల వరకు తాజాగా ఉండేలా ఫిర్ని తయారీ ఇలా!
ఈ హోలీ రోజు ఇంట్లో వాళ్లకు ఇలా ఫిర్ని చేసిపెట్టండి! ఫిర్ని తయారీకి కావలసినవి: ►బియ్యం – పావు కప్పు ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – అర కప్పు ►బాదం పప్పు – 10 ►పిస్తా – 10 ►యాలకుల పొడి – అర టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 15 రేకలు ►పన్నీరు – 2 టీ స్పూన్లు (ఇష్టమైతేనే) ►కిస్మిస్: 20 ►జీడిపప్పు: 10. తయారీ: ►బియ్యం కడిగి దళసరి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి (మరీ మెత్తగా అక్కరలేదు). ►ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి. ►అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి. ►వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి. ►ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి. ►పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ►చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. ►మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి. ►ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాల సేపు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఫిర్నీ రెడీ. ఈ ఫిర్నీని కప్పులో పోసిన తర్వాత మిగిలిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి. ఈ ఫిర్నీని గోరువెచ్చగా తినవచ్చు లేదా చల్లబరిచి తినవచ్చు. ఫ్రిజ్లో రెండు– మూడు రోజులు తాజాగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా.. హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! -
రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్తో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోండి! రస్మలై తయారీకి కావాల్సినవి: ►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్వి తీసుకోవచ్చు) ►పాలు – లీటరు ►చక్కెర – 5 టేబుల్ స్పూన్లు ►బాదం –10 ; పిస్తా– 10 ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 20 రేకలు తయారీ: ►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. ►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. ►పైకి తేలిన మీగడను స్పూన్తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. ►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. ►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. ►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! -
Holi 2023: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా!
ఈ హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! తీపి రుచిని ఆస్వాదించండి! రైస్ ఖీర్ తయారీ విధానం ఇలా కావలసినవి: ►బియ్యం– కప్పు ►పాలు – ఒకటిన్నర లీటరు (వెన్న తీయనివి) ►చక్కెర – కప్పు ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు– చిటికెడు లేదా 15 రేకలు ►బాదం – టేబుల్ స్పూన్ ►జీడిపప్పు – టేబుల్ స్పూన్ ►పిస్తా – టేబుల్ స్పూన్ ►కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యం కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి. ►చిన్న పాత్రలో నీటిని వేడి చేసి బాదం, పిస్తా వేసి మూతపెట్టాలి. ►అర గంట తర్వాత పొట్టు తీసి సన్నగా తరగాలి. ►కిస్మిస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ►బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టి పాలు పోసి మరిగించాలి. ►ఒక గరిటెడు పాలు విడిగా తీసుకుని కుంకుమ పువ్వు రేకలను నానబెట్టాలి. ►బియ్యంలోని నీటిని వంపేసి బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ►బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత చక్కెర వేసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. ►అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత యాలకుల పొడి, బాదం, పిస్తా తరుగు, కిస్మిస్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. రైస్ ఖీర్ రెడీ. ►ఖీర్ దగ్గరయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ►స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారే కొద్దీ దగ్గరవుతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు -
నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే..
Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది. రసగుల్ల తయారీ విధానం ఇలా: కావలసినవి: ►పాలు – లీటరు (వెన్న తీయనివి) ►నిమ్మరసం– 3 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 2 కప్పులు ►నీరు – లీటరు ►పాలు – టేబుల్ స్పూన్ ►ఉప్మారవ్వ– టీ స్పూన్ ►పిస్తాపలుకులు : 20 తయారీ: ►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. ►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్ జరగని పాలకు ఒక స్పూన్ నిమ్మరసం సరిపోతుంది). ►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి. ►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. ►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. ►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది. ►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. ►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. ►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్ స్పూన్ పాలు వేయాలి. ►రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. ►స్పూన్తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. ►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). ►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. ►అప్పుడు స్టవ్ ఆపేయాలి. ►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్ స్పూన్ సిరప్, పిస్తా వేసి సర్వ్ చేయాలి. గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు. ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! బనానా, ఓట్స్తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా! -
మెడి టిప్
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి... ♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి. ♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు. ♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి. ♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్రూమ్ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. -
హెల్త్ టిప్స్
♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ♦ చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. ♦ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. ♦ దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, ♦ అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. -
మీకు తెలుసా?
పాలు అనగానే సాధారణంగా గేదెపాలు లేదా ఆవుపాలే అందరికీ తెలుసు. అయితే ఇటీవల గాడిదపాలు, మేకపాలు కూడా కొందరు తాగుతున్నారు. ఇవే కాదు, కొబ్బరిపాలు కూడా ఉన్నాయి. పచ్చికొబ్బరిని కోరి లేదా ముక్కలు చేసి తగినన్ని నీళ్లు చేర్చి రుబ్బి, వడపోయడం ద్వారా కొబ్బరిపాలను తయారు చేయవచ్చు. కొబ్బరిపాలను తాగడం ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం... ♦ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. ♦ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ♦ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి. ♦ ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. మీ పిల్లలు మామూలు పాలు తాగడానికి మొగ్గు చూపనప్పుడు ఒకసారి కొబ్బరిపాలను పట్టించడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం ఉంటుంది. -
ఇక కల్తీ పాలకు చెక్!
సాక్షి, అమరావతి: రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో తెల్లనివన్నీ పాలు అని నమ్మే పరిస్థితి లేదు. ఈ తరుణంలో వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలను అందించాలనే లక్ష్యంతో సహకార పాల డెయిరీల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్ (ఏపీ కార్ల్)లో రూ.11కోట్లతో స్టేట్–సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ ల్యాబ్ ద్వారా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించి, నివారణకు చర్యలు చేపట్టనుంది. నాణ్యత ఇలా... గేదె పాలల్లో 5.5 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు), ఆవు పాలల్లో 3.2 శాతం కొవ్వు, 8.3 శాతం ఎస్ఎన్ఎఫ్ ఉంటే మంచి పోషక విలువలు ఉన్న పాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. నాసిరకం దాణా వల్ల పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరస్థాయిలో విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని పలు పరిశోధనల్లో గుర్తించారు. కొందరు ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయం పలుమార్లు వెలుగులోకి వచ్చింది. ఇటువంటి నాసిరకం, కల్తీ, నకిలీ పాల వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలల్లో నాణ్యతను గుర్తించేందుకు రాజమహేంద్రవరం, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో అత్యా«దునిక పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా ఏపీ కార్ల్లో దేశంలోనే అతి పెద్ద స్టేట్, సెంట్రల్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. మూడు నెలల్లో అందుబాటులోకి... ఏపీ కార్ల్లో ఇప్పటికే ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగా, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్ను పరీక్షించేందుకు కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది. ఒక్కో శాంపిల్కు రూ.2,500 నుంచి రూ.30వేల వరకు ఖర్చయ్యేది. పులివెందులలోని ల్యాబ్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో ఏడాదికి 500 నుంచి 1,000 వరకు పరీక్షలు చేయవచ్చు. ఈ ల్యాబ్లో ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనరైజర్, ఎఫ్టీఐఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్యాడ్రపుల్ మాస్ డిటెక్టర్తో ఎస్సీఎంఎస్, ఎఫ్ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిప్యూజ్, అడల్టరెంట్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్ వంటి పరికరాలు అందుబాటులో ఉంటాయి. సుమారు 15 మంది నిపుణులైన సిబ్బందిని నియమిస్తున్నారు. మూడు నెలల్లో ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. రసాయన అవశేషాలను గుర్తించవచ్చు స్టేట్ సెంట్రల్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు, పాడి రైతులు, వాటాదారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎగుమతులను పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, భారీ లోహాలు, మైకో టాక్సిన్లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషించి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కల్తీలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
ఇది ఆరోసారి.. పాల సేకరణ ధరలు భారీగా పెంచిన అమూల్
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా ఆరో సారి సేకరణ ధరలను పెంచింది. లీటర్కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.3.08 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.30, ఘనపదార్థాలపై రూ.22 మేర పెంచారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో శనివారం నుంచి ఈ పెంపు వర్తించనుంది. 2.29 లక్షల మంది పాడి రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. 26 నెలల్లో ఆరు దఫాలు సేకరణ ధరలు పెంపు రాయలసీమలో అమూల్ తరఫున కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా తాజా పెంపుతో కలిపి గత 26 నెలల్లో ఆరు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో పాలు సేకరిస్తున్న కైరా యూనియన్ గతేడాది నవంబర్లో పెంచగా, సెంట్రల్ ఆంధ్రలో సబర్కాంత్ యూనియన్ సెప్టెంబర్లో పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.82.50, ఆవు పాలకు రూ.39.48 చొప్పున చెల్లిస్తోంది. కాగా ఆరోసారి ఈ రెండు యూనియన్లు మరోసారి పాలసేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్కు గేదె పాలపై కనిష్టంగా (5.5 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.1.65, గరిష్టంగా (11 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.3.30 చొప్పున పెంచాయి. ఆవుపాలపై కనిష్టంగా (3.2 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.2.47, గరిష్టంగా (5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.3.08 చొప్పున పెంచాయి. దీంతో గేదె పాలకు లీటర్కు కనిష్టంగా రూ.40.75 నుంచి రూ.42.40కు, గరిష్టంగా రూ.82.50 నుంచి 85.80కు పెంచింది. ఆవుపాలకు లీటర్కు కనిష్టంగా రూ.31.73 నుంచి రూ.34.20కు పెంచగా, గరిష్టంగా 39.48 నుంచి రూ.42.56కు పెంచింది. ఈ పెంపు శనివారం నుంచి వర్తించనుంది. ఉత్తరాంధ్ర పరిధిలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ డిసెంబర్ 15వ తేదీన పెంచింది. 26 నెలల్లో 6.36 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాలతో ప్రారంభం కాగా ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.61 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,173 గ్రామాలకు విస్తరించింది. 1,608 ఆర్బీకేల పరిధిలోని 3,142 గ్రామాల్లో రైతుల నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. రెండేళ్లలో 6.36 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.276 కోట్లు చెల్లించారు. లీటర్పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా అంతకు మించి ప్రస్తుతం లీటర్కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.2,728 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. మార్చిలోగా మిగతా జిల్లాలకు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున రాయలసీమ, కోస్తాంధ్రలో కైరా, సబర్కాంత్ యూనిట్లు ఆరోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను పెంచాయి. తాజా పెంపుతో సుమారు 2.29 లక్షల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 17 జిల్లాల్లో జేపీవీ అమలవుతుండగా మార్చిలోగా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. – అహ్మద్బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
మారిన పరిస్థితి.. భూమి మీద గాడిదలు చూస్తామో లేదో!
అనంతపురం అగ్రికల్చర్: కష్టజీవి అయిన గాడిద (ఖరము) క్రమేణా కనుమరుగవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు మానవుని జీవన శైలిలో మార్పులు వచ్చాక గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని సంవత్సరాలు కొనసాగితే భూమి మీద గాడిద జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి... వీటి సంతతిని పెంచాలని వార్షిక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ► గాడిద జీవితకాలం 50 సంవత్సరాలు. గ్రామీణ ప్రాంతాల్లో బరువు మోయడానికి వినియోగిస్తారు. చాకలివారు తమ వృత్తి పనిలో వీటినే ఎక్కువగా వాడేవారు. కొండలు, గుట్టలు లాంటి ప్రాంతాల్లో నివసించే వారు రవాణాకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో కూడా వినియోగించేవారు. లగేజీ రవాణాకు ఆటోలు, తోపుడు బండ్లు, ద్విచక్రవాహనాలు అందుబాటులోకి రావడంతో గాడిదల వినియోగం తగ్గిపోయింది. 30 ఏళ్ల కిందట వరకు గాడిదల సంఖ్య గణనీయంగా ఉండేది. పల్లెల్లో చూస్తే ఎక్కడ చూసినా కనిపించేవి. గాడిద పాలను పిల్లలకు రోగనిరోధక శక్తిగానూ, కొన్ని ఆయుర్వేద మందుల్లోను వాడతారు. అక్కడక్కడా ఉన్న గాడిదల నుంచి కొందరు పాలను సేకరించి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాటి పాలకు గిరాకీ ఉన్నందున గాడిద కూడా కొందరికి జీవనాధారంగా మారింది. వెయ్యిలోపే గాడిదలు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 2007 లెక్కల ప్రకారం 15 వేలకు పైగా గాడిదలు ఉండేవి. 2012లో ఆ సంఖ్య 6,800కు చేరగా, 2018లో 3,200కు పడిపోయింది. తాజాగా గాడిదల సంఖ్య వెయ్యికి లోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రొళ్ల, శెట్టూరు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, కూడేరు, కుందురి్ప, అమరాపురం, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో గాడిదలు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. గాడిదల పెంపకంపై 23న సదస్సు అంతరించిపోతున్న గాడిదల సంతతిని పెంచాలనే ఆలోచనతో ఈ నెల 23న అనంతపురంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘బ్రూక్ హాస్పిటల్’ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ సహకారంతో ‘డీక్లినింగ్ డాంకీ పాపులేషన్ అండ్ స్టెప్స్ ఫర్ మిటిగేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, బ్రూక్ హాస్పిటల్ ప్రతినిధులతో పాటు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, నోడల్ ఆఫీసర్లు, అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు, గుంటూరుకు చెందిన గాడిద పెంపకందారులు కొందరు హాజరు కానున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
భళా బామ్మ! సాఫ్ట్వేర్ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
Telangana: మూడు నెలలుగా పాలు లేవ్..
వికారాబాద్లోని గరీబ్నగర్ అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు వీరు. ఇక్కడ రెండున్నర నెలలుగా చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే పాలు అసలే రావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పంపిణీ చేసే పౌష్టికాహారం సరఫరాపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చేతులెత్తేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు అందడం లేదు. అంగన్వాడీల్లో నమోదైన చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్లు.. గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు సరఫరా చేయాల్సి ఉంది. వీటిని టెట్రా ప్యాకెట్ల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలాఖరుతో అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త కాంట్రాక్టరు ఎంపిక టెండరు ఖరారు చేయలేదు. కనీసం పాత కాంట్రాక్టర్కే తాత్కాలికంగా పాల పంపిణీ బాధ్యతలనూ అప్పగించలేదు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పాలు అందించడం లేదేమిటంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను నిలదీస్తున్నారు. పాల బడ్జెట్ ఏటా రూ.100 కోట్లు పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాల పంపిణీ కోసం ఏటా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతినెలా సగటున 18.5 లక్షల లీటర్ల పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లీటరు పాలకు సగటున రూ.43, ప్యాకింగ్, రవాణా చార్జీ కింద మరో రూ.9 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తోంది. ఇంత కీలకమైన, ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ నిర్లక్ష్యంతో పాల పంపిణీ నిలిచిపోయింది. మూడు నెలలుగా అందక.. కాంట్రాక్టు గడువు ముగిసే క్రమంలో సదరు సంస్థ అన్ని కేంద్రాలకు పాలు పంపిణీ చేసి ఆపేసింది. ఆ స్టాకు అందుబాటులో ఉన్నంత వరకు దాదాపు అక్టోబర్ రెండో వారం వరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు పాల ప్యాకెట్లను లబ్ధిదారులకు సర్దుబాటు చేశారు. తర్వాత పంపిణీ నిలిచిపోయింది. 3 నెలలుగా పాలు అందకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో కాంట్రాక్టరే పాలు సరఫరా చేయడం లేదంటూ లబ్ధిదారులకు చెప్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారులను అడిగితే.. త్వరలో టెండర్లు ఖరారవుతాయని, పాల పంపిణీ మొదలవుతుందని చెప్తుండటం గమనార్హం. -
Chocolate: కోకో పౌడర్, గోధుమ పిండి.. చాకొలెట్లు ఇంట్లోనే ఇలా ఈజీగా..
కాలం కరిగిపోతుంది. చాక్లెట్లు కూడా... నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాక్లెట్లనగానే మనకు బయటినుంచి కొనుక్కుని రావడం మాత్రమే తెలుసు. కానీ కాస్త సమయం కరిగిస్తే ... ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లతో పాటే తీపి జ్ఞాపకాలను కూడా చప్పరించేయొచ్చు. అదెలాగో చూడండి మరి! మిల్క్ చాక్లెట్ కావలసినవి: ►కోకో పౌడర్ – 2 కప్పులు ►చక్కెర – అర కప్పు ►గోధుమ పిండి– పావు టీ స్పూన్ ►బటర్ – ముప్పావు కప్పు (ఉప్పు లేనిది) ►పాలు – ముప్పావు కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►కోకో, బటర్ను ప్రాసెసర్లో మెత్తని పేస్టు చేయాలి. ►ఇప్పుడు పెనం వేడి చేసి పావు కప్పు నీరు పోసి వేసి చేసి అందులో కోకో, బటర్ మిశ్రమం పేస్ట్ ఉన్న పాత్రను ఉంచాలి. ►కోకో మిక్స్ బాగా కరిగిన తర్వాత ఆ పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ వేడి చేయాలి. ►మరిగే స్థాయికి వచ్చిన తర్వాత దించేసి మిశ్రమాన్ని విస్కర్తో బాగా చిలకాలి. ►ఇప్పుడు పాలను మరిగించి పిండి, చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. ►ఇందులో కోకో మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు మిశ్రమాన్ని చాకొలెట్ మౌల్డ్ ట్రేలో పోసి ఫ్రిజ్లో పెట్టాలి. ఫ్రిజ్ మ్యాగ్జిమమ్లో ఉంచాలి. ►మిశ్రమం గట్టిపడిన తర్వాత బయటకు తీసి మౌల్డ్ నుంచి వేరు చేయాలి. ►వెంటనే వేరుపడకపోతే ట్రేని గోరువెచ్చని నీటి మీద తేలేటట్లు నాలుగైదు సెకన్ల పాటు ఉంచితే చాక్లెట్లు ట్రే నుంచి విడివడుతాయి. వైట్ చాక్లెట్ కావలసినవి: ►కోకో బటర్– కప్పు ►చక్కెర పొడి– 3 టేబుల్ స్పూన్లు ►పాల పొడి– 3 టేబుల్ స్పూన్లు ►వెనిల్లా ఎసెన్స్– మూడు చుక్కలు. తయారీ: ►ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో కోకో బటర్ ఉన్న పాత్రను పెట్టి కలుపుతూ కరిగించాలి. ►దించిన తర్వాత అందులో చక్కెర పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా సమంగా కలిగే వరకు కలపాలి. ►ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మౌల్డ్లో పోసి ఫ్రిజ్లో పెట్టాలి. ►మిశ్రమం గట్టి పడడానికి మ్యాగ్జిమమ్ డిగ్రీల్లో అర గంట నుంచి ముప్పావు గంట పడుతుంది. ►ఇంకా త్వరగా కావాలంటే ఫ్రీజర్లో పెడితే 20 నిమిషాల్లో చాక్లెట్ తయారవుతుంది. -
సామాన్యులకు షాక్.. పాల ధర రూ.2 పెంపు, ఈ ఏడాదిలో ఐదోసారి!
న్యూఢిల్లీ: ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను రూ.2 పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం (డిసెంబర్ 27) నుంచి ఈ పాల ధర పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే, ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్ల ఎంఆర్పీ (MRP)లో ఎటువంటి పెంపు ఉండదని పేర్కొంది. ఈ సంస్థ రెండు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, ఏడాది వ్యవధిలో ఇది ఐదోసారి. డెయిరీ ఫుల్క్రీమ్ మిల్క్పై లీటర్కు రూ.2 పెంచడంతో రూ.66 చేరకోగా, టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి చేరుకుంది. డబుల్ టోన్డ్ పాల ధర లీటరుకు రూ.45 నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా పాల ధరల పెంపు సామాన్యుల గృహ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. కారణం ఏదైన ఈ పాల ధరల పెంపు సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి. Mother Dairy hikes milk rate by Rs 2/litre effective from tomorrow There is no revision in the MRP of Cow Milk and Token Milk variants. pic.twitter.com/SXoQ8sbqBS — ANI (@ANI) December 26, 2022 చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
Beauty: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా... ఒత్తైన కనుబొమ్మలు ►పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో కాటన్ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి. ►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి. ముడతలు మాయం ►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి. నల్లని వలయాలు తగ్గుముఖం ►పచ్చిపాలలో కాటన్ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ►కీరా జ్యూస్లో, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ►టొమాటో జ్యూస్లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి. ►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్లో ఈ సమస్యలు.. -
Health: రాత్రి వేళ పాలలో మెంతి గింజల్ని ఉడకబెట్టి.. వాటిని తాగితే!
Menthi Podi- Milk- Health Tips In Telugu: మెంతుల్ని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అదే రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి లేదా చిటికడు మెంతి పొడిని పాలలో కలిపి తాగితే సుఖమైన నిద్ర పడుతుంది. మెంతి పొడి పాలల్లో కలిపి తాగడం వల్ల కలిగే అదనపు లాభాలు ►శరీరం అంతర్గతంగా పటిష్టమౌతుంది. ►వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ►శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు పాలు, మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ►అంతేకాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. ►అందుకే చలికాలంలో మెంతిపొడిని పాలలో కలిపి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ►గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మెంతులు కొలెస్ట్రాల్ లెవెల్స్ను గణనీయంగా తగ్గిస్తాయి. ►బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తాయి. ►మెంతిపొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ►పాలలో తీసుకోలేనివారు రాత్రిపూట గ్లాసు నీళ్లలో అరచెంచా లేదా చెంచా మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను నమిలి, నీటిని తాగినా మంచిదే. ►అయితే వేడిపాలలో చిటికడు మెంతుల పొడి కలుపుకుని తాగడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయని అనుభవజ్ఞుల సూచన. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్లో ఈ సమస్యలు.. Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. -
దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల
Cinnamon- Health Benefits In Telugu: దాల్చినచెక్క.. భారతీయుల వంట గదిలో కనిపించే సుగంధ ద్రవ్యాల్లో ముందు వరుసలో ఉంటుంది. నిజానికి మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. అయితే, కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఔషధపరంగానూ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు.. ఇతరత్రా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు దీని పొడిని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని న్యూట్రీషనిస్ట్ లోవనీత్ బాత్రా ఎన్డీటీవీతో పేర్కొన్నారు. దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►మహిళల్లో రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ►ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ►ఇందులోని యాంటీ- ఇన్ఫ్లామేటరీ గుణాలు మంట, వాపులను తగ్గించేందుకు దోహదపడతాయి. ►దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో తోడ్పడుతుంది. ►అదే విధంగా దగ్గు, పంటినొప్పులను తగ్గించడంలో దోహదపడుతుంది. ►గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు తదితర సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే ఉపశమనం పొందవచ్చు. ►ఫుడ్పాయిజన్ అయిన సందర్భాల్లో దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ►నిద్రలేమి సమస్యతో బాధపడే వారు.. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించాలి. దీనిలో తేనె కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. సినామాల్డెహైడ్ అనే రసాయనం వల్ల యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాల్చిన చెక్క సువాసన, రంగుకు కారణమైన సినామాల్డెహైడ్ అనే రసాయనం హైపోగ్లైసెమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. కాబట్టి షుగర్ పేషంట్లు దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే(చక్కెర లేకుండా) తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక సినామాల్డెహైడ్ యాంటీ ఫంగల్ ఏజెంట్గానూ పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల నివారణకు దోహదం చేస్తుంది. అదే విధంగా రక్తనాళాలు మూసుకుపోకుండా చేస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. Health: తొడల మీద దద్దుర్లు.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలివే! కారణాలేంటి? రిస్క్ ఎవరికి ఎక్కువ? -
పెరిగిన మదర్డెయిరీ పాల ధరలు..రేపట్నుంచి అమల్లోకి
ప్రముఖ పాలపంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- ఎన్సీఆర్ (National Capital Region) పరిధిలో లీటర్ పాలపై రూ.1 లీటర్ విడిపాల (token milk) ధర రూ.2 పెంచింది. దీంతో పెరిగిన ధరలతో ఫుల్ క్రీమ్ (వెన్నతీయని) పాల ధర రూ.64, విడి పాల ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది. కాగా, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరల్ని యథాతథంగా ఉంచుతున్నట్లు మధర్ డైరీ ప్రతినిధులు తెలిపారు. ఇక తాజాగా పెరిగిన పాల ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. -
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..
Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Health Tips: ఆ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగారో ఇబ్బందుల్లో పడ్డట్లే!
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి? ►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం. ►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది. ►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది. ►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్... ఆందోళనలో శాస్త్రవేత్తలు
తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్ని గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్స్టెషానో చెబుతున్నారు. అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్లు, సింథటిక్ ఫ్యాబ్రిక్తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. (చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!) -
Health Tips: టొమోటాలు, సోయా, బెర్రీలు.. ఇంకా.. ఇవి తినండి... వయసు తగ్గించుకోండి!
సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.. పాలు స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్ను కూడా తగ్గిస్తుంది. టొమోటాలు స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాల సోయా పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ను తింటే బలంగా ఉంటారు. క్యాన్సర్ను అడ్డుకునే బెర్రీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా! -
పాలు ప్రాణాలు తీస్తాయనుకుంటామా?.. కానీ అదే జరిగింది
గురుగ్రాం: పాలు విషయమై దంపతుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం ముదిరి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. జార్ఖండ్కు చెందిన జుహి(22), బెంగాల్లోని రాంపురాకు చెందిన సుశాంత ఘోష్(25) దంపతులు చుమా గ్రామంలోని అద్దెంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి జుహి తనకు పాలు, చపాతి తినాలనుందని చెప్పడంతో ఘోష్ బయటి నుంచి వాటిని తీసుకువచ్చాడు. అనంతరం పాల విషయంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. మనస్తాపంతో ఘోష్ ఏదో విష పదార్థం తీసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించిన రెండు గంటల తర్వాత కన్నుమూశాడు. విషయం తెలిసి జుహి కూడా విషం తాగి, ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. చదవండి: (CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్పై కర్ణాటక సీఎం ఆగ్రహం) -
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!
పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్లో చేరిస్తే మంచిది. ►పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి. ►ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి. ►వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇవి కూడా... ►అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ►వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు. ►ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ►ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట. చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
పాల ఉత్పత్తి మూడింతలు అవుతుంది
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే. అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు. -
Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే!
వర్షాకాలంలో సైతం కొంతమంది చర్మం తేమలేక పొడిబారడమే గాక, మొటిమలతో విసిగిస్తుంటుంది. ఇటువంటి చర్మానికి తేనె, వేప, పాలతో తయారైన ఫేస్ప్యాక్ మంచి పరిష్కారం చూపుతుంది. వేప.. మొటిమలను తగ్గిస్తే... తేనె చర్మానికి తేమనిస్తుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే! రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. కాంతివంతమైన ముఖం కోసం.. ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి. చదవండి: Yami Gautam: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది -
TIPS: రోజూ వాడే పాలప్యాకెట్లను పడేస్తున్నారా.. ఇలా వాడుకోవచ్చు
పాలు నిల్వచేయడానికి వాడే ప్యాకెట్ గట్టిగా ఉంటుంది. అందువల్ల ప్యాకెట్లన్నింటిని వెడల్పుగా కత్తిరించి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒకదానితో ఒకటి కలిపి చిన్న చిన్న బుక్స్కు అట్టలుగా, ప్యాకింగ్ కవర్లుగా వాడుకోవచ్చు. దీనివల్ల నోట్బుక్స్, ప్యాకింగ్ చేసిన వస్తువులు తడవకుండా ఉంటాయి. ►పాలప్యాకెట్లను గరాటు ఆకారంలో రోల్ చేసి ఊడకుండా టేప్తో గట్టిగా అతికించాలి. ఈ గరాటులో ఫుడ్క్రీమ్, మెహిందీ వేసి నచ్చిన విధంగా డిజైన్లు వేసుకోవచ్చు. ∙ఇంట్లో చాలా పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు అన్నింటిని కలిపి మ్యాట్లా కుట్టు్టకుని వాడుకోవచ్చు. ►ప్యాకెట్లతో విసనకర్రలా తయారు చేసి వాడుకుంటే చల్లటి గాలి వస్తుంది. ►కుండీల్లో మొక్కలు పెంచే స్థలం లేనప్పుడు పాలప్యాకెట్లలో మొక్కలను పెంచుకోవచ్చు. ప్యాకెట్స్లో కొద్దిగా మట్టి పోసి విత్తనాలు వేసి చిన్నచిన్న మొక్కలు పెంచుకోవచ్చు. -
విజయ పాల ధరలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమావేశం నిర్వహించి.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ అధికారికంగా అలాంటి సమావేశమేమీ నిర్వహించకుండానే.. గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవరకు.. అంటే సెప్టెంబర్ 10, 13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. -
వైరల్ వీడియో: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
-
Viral Video: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. చిన్నారి పాపలను అదృష్ట దేవతలుగా భావిస్తుంటారు. అంతేకాదు ఆడపిల్లలను అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకుంటారు. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అయిన ఓ వీడియో ఇలాంటి భావనను మన కళ్ల ముందుకు తెచ్చింది. జార్ఖండ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. ‘భావోద్వేగ క్షణం. తల్లిదండ్రులు తమ కుమార్తెకు వీడ్కోలు చెబుతూ ఆమె పాదముద్రలను ఇంట్లో భద్రపరుస్తార’ని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ వీడియోలో ఏముంది? ఓ యువతిని కుర్చీలో కూర్చోపెట్టి తల్లిదండ్రులు ఆమె పాదాల చెంత కూర్చుంటారు. ఆమె పాదాలను పళ్లెంలో ఉంచి ముందుగా తండ్రి నీళ్లతో కడుగుతాడు. తర్వాత పాలతో పాదాలను కడుగుతాడు. పాదాలను కలిగిన పాలను తండ్రితో పాటు యువతి తల్లి కూడా తాగుతారు. తర్వాత యువతి పాదాలను ఎరుపు రంగు నీళ్లలో ఉంచి తెల్లటి వస్త్రంపై ఆమె పాదముద్రలు పడేలా చేస్తారు. అయితే ఈ వీడియోలోని వారు ఎక్కడ వారనే వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు ఈ వీడియో ఎప్పటిదనే విషయం కూడా తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పని మాత్రం ఎంతో మందిని కదిలించింది. మిశ్రమ స్పందన రెండు నిమిషాల 15 సెకన్ల ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేయగానే లక్షకు పైగా వ్యూస్తో వైరల్గా మారింది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హార్ట్ టచింగ్’ అంటూ చాలా మంది మెచ్చుకున్నారు. ‘భారతీయ సంస్కృతిలోని గొప్పదనానికి మచ్చుతునక’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘ఇంకా ఏ యుగంలో ఉన్నారు సార్ అని మరొకరు అంటే.. ‘ఇదంతా బాగానే ఉంది కానీ ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వండి’ అని ఇంకొరు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆడపిల్లను అపురూపంగా చూసుకోవాలన్న సందేశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. (క్లిక్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి) -
Beauty Tips: దాల్చిన చెక్క, పప్పు, పాలు, పంచదార.. బ్లాక్హెడ్స్కు చెక్!
How To Get Rid of Blackheads: ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం డల్గా, కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, నిమ్మకాయ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... కొల్లాజెన్ విడుదలలో.. ►చర్మంలో అతిముఖ్యమైన ప్రోటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. ►అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్హెడ్స్ తగ్గుముఖం పడతాయి. ఎర్రకందిపప్పు ఉంటే.. ►పాలు చర్మానికి పోషణ అందిస్తే పప్పు దినుసులు బ్లాక్హెడ్స్ను వేళ్లతోసహా పీకేస్తాయి. ఎర్రకందిపప్పుని ఒక టేబుల్ స్పూను తీసుకుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానినపప్పులో నీటిని తీసేసి రెండు స్పూన్ల పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని యాంటిఆక్సిడెంట్స్ చర్మానికి అందుతాయి. మర్దనతో బ్లాక్ హెడ్స్ పోతాయి. సున్నిత చర్మతత్వం కలిగిన వారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది ►స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార లోతుగా శుభ్రంచేసి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంతోపాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది! అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్హెడ్స్ను తొలగించి చర్మం కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..
అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికం. కాబట్టి మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాదు అరటిపండులో మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్ బీ6 ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే విటమిన్ సీ కూడా ఎక్కువే! అంతేకాదు.. యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, కొంతమందికి అరటిని నేరుగా తినడం ఇష్టం ఉండదు. పాలల్లో చక్కెర వేసుకుని కలపుకొని తినడం లేదంటే స్మూతీలు, షేక్లు తయారు చేసుకుని తాగడం చేస్తూ ఉంటారు. ఇక పాలు తాగితే కలిగే ఆరోగ్య లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రొటిన్లు, విటమిన్ బీ, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? వీటితో పాటు ఎముకలు, కండరాల ఆరోగ్యానికి దోహదపడుతూ.. నాడీ వ్యవస్థ పని విధానాన్ని ప్రభావితం చేయగలిగే కాల్షియం కూడా ఉంటుంది. మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అరటిని, పాలను కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీటీవీ తన కథనంలో పేర్కొన్న అంశాలు మీకోసం.. డైటీషియన్, సైకాలజిస్ట్ హరీశ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ‘‘అరటిని పాలతో కలిపి తినమని నేను సిఫార్సు చేయలేను. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అయితే, ఈ రెండింటినీ విడిగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాలు తాగిన 20 నిమిషాల తర్వాత అరటి పండు తినవచ్చు. కానీ బనానా మిల్క్షేక్లు తరచుగా తాగితే జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు’’ అని పేర్కొన్నారు. మరి ఈ విషయం గురించి న్యూట్రీషనిష్ట్, మాక్రోబయోటిక్ హెల్త్కోచ్ శిల్ప అరోరా ఏం చెప్పారంటే.. ‘‘బాడీ బిల్డర్లు అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బరువు పెరగాలనుకున్న వాళ్లు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయవచ్చు. తక్షణ శక్తి లభిస్తుంది కూడా! అయితే, అస్తమా వంటి ఎలర్జీలతో బాధ పడేవారు మాత్రం ఈ రెండూ కలిపి తినవద్దు. కఫం పట్టి శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మరి ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఆయుర్వేదం ప్రకారం. ప్రతి ఆహారం తనదైన రుచి(రస) కలిగి ఉంటుంది. అలాగే సదరు ఆహారం తిన్న తర్వాత కలిగే ప్రభావాలు వేర్వేరు(విపాక)గా ఉంటాయి. దాని వల్ల శరీరం వేడి చేయొచ్చు లేదంటే చల్లబడనూ(వీర్య) వచ్చు. కొన్ని విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహారాలు కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి వాటిలో అరటి, పాలు కూడా ఉన్నాయట. నిజానికి పండ్లతో పాలు కలపడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయం గురించి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ సూర్య భగవతి మాట్లాడుతూ.. ‘‘అరటి, పాలు కలిపి తినడం మంచిది కాదు. కొంతమందికి ఈ కాంబినేషన్ వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. ఆహారం సరిగా జీర్ణంకాదు. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. పైన చెప్పిన విధంగా.. వేర్వేరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి, పాలు కలిపి తింటే వచ్చే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి రెండూ పోషకాహారాలే.. కాబట్టి విడిగా తింటే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే, ఏ ఆహారమైనా వేర్వేరు వ్యక్తుల శరీర తత్వాలను బట్టి వేర్వేరు ప్రభావాలు చూపుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోట్: ఈ కథనం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
పచ్చిపాలతో ఇలా చేస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు
పచ్చిపాలు, రోజ్ వాటర్ను సమానంగా తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మర్దనా చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్తో తుడిచేయాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి రాసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో పచ్చిపాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా పై రెండింటిలో ఏదైనా ఒక పద్దతిని అనుసరిస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు సంతరించుకుంటుంది. -
సామాన్యులకు కేంద్రం భారీ షాక్..
చండీగఢ్:మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తారు. దీనితో ఆయా ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్టీ అమలవుతుంది. పన్నులను హేతుబద్ధీకరించే ఉద్దేశంతో మినహాయింపులను ఉపసంహరించుకోవడానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల బృందం (జీఓఎం) చేసిన సిఫార్సులను చాలావరకూ మండలి ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రారంభించిన సమయానికి (2017 జూలై 1) 14.4 శాతంగా ఉన్న సగటు జీఎస్టీ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీనిని పెంచడానికి జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ అవసరమని మండలి ప్రధానంగా భావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇక్కడ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో రెండు రోజుల కీలక జీఎస్టీ మండలి 47వ సమావేశం ప్రారంభమైంది. మొదటిరోజు సమావేశం మంత్రుల బృందం చేసిన పలు సిఫారసులను ఆమోదించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార ఉత్పత్తులు పొందుతున్న పన్ను మినహాయింపులను తొలగించాలని సుదీర్ఘ చర్చ తర్వాత మండలి నిర్ణయించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మండలి నిర్ణయాలు ఇవీ... ♦ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన మాంసం (ఘనీభవించిన స్థితిలోలేని పదార్ఘాలు మినహా), చేపలు, పెరుగు, పనీర్, తేనె, ఎండిన చిక్కుళ్ళు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, మెస్లిన్ పిండి, బెల్లం, పఫ్డ్ రైస్ (మూరి) సంబంధిత అన్ని ఉత్పత్తులు, సేంద్రియ, కంపోస్ట్ ఎరువుకు ఇకపై జీఎస్టీ మినహాయింపు వర్తించదు. దీనిపై ఇకపై 5 శాతం పన్ను విధింపు ఉంటుంది. ♦అదేవిధంగా చెక్కుల జారీకి (వదులుగా లేదా పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. అట్లాస్సహా మ్యాప్లు, చార్ట్లపై 12 శాతం లెవీ ఉంటుంది. ♦ప్యాక్ చేయని, లేబుల్ లేని, బ్రాండెడ్ కాని వస్తువులపై జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది. ♦రోజుకు రూ. 1,000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై 12% పన్ను ఇకపై అమలవుతుంది. ప్రస్తుతం ఇక్కడ పన్ను మినహాయింపు ఉంది. ♦వంట నూనె, బొగ్గు, ఎల్ఈటీ ల్యాంప్స్, ప్రింటింగ్– డ్రాయింగ్ ఇంక్, ఫినిష్డ్ లెదర్ సోలా ర్ వాటర్ హీటర్తో సహా అనేక వస్తువుల విషయంలో ఇన్వర్టెడ్ డ్యూటీ వ్యవస్థలో సవరణను కూడా జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహారంసహా పలు కీలక అంశాలపై బుధవారం మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. -
చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?
మొన్న కన్నడ సినీహీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి.. తాజాగా గాయకుడు కేకే.. గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించిన వారు వీరందరూ! ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పైన ఉదహరించిన వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారే. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకునే వారే. అయినా సరే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమైనా... ఈ ఘటనల సారాంశం ఒక్కటే! అది ఆరోగ్యంపై పురుషులు మరింత శ్రద్ధ వహించాలని. అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య వారోత్సవాల (జూన్ 13 – 19)నేపథ్యంలో ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం ఎలాగో చూద్దాం... ప్రొటీన్ మోతాదు పెంచండి... మనం తినే ఆహారం.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు. ప్రతీదీ తగు మోతాదులో అవసరం. ఆహార అలవాట్ల ప్రకారం మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటాం. ఇలా కాకుండా... భోజనంలో ఎంతో కొంత ప్రొటీన్లను కూడా తీసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లు మొదలుకొని పన్నీర్, పరాఠా, చేపలు, రాజ్మా, సాంబార్, బీన్స్, సోయా పులావ్ వంటి వెజ్/నాన్వెజ్ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రమాణాల ప్రకారం ప్రతి భారతీయుడు రోజుకు కనీసం 48 గ్రాముల ప్రొటీన్ను తీసుకోవడం అవసరం. ఇంకోలా చెప్పాలంటే ప్రతి కిలోగ్రాము బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది. అయితే నూటికి 80 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారు. కండరాలు బలోపేతమయ్యేందుకు మాత్రమే కాకుండా... రోగ నిరోధక శక్తిని పెంచేందుకూ, ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తికీ ప్రొటీన్ అత్యవసరమన్న విషయం పురుషులు గుర్తించాలి. ఐదారు సార్లు పండ్లూ, కాయగూరలు! మెరుగైన ఆరోగ్యం కోసం కాయగూరలు, పండ్లు అవసరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అందేందుకు ఇదే మేలైన దారి. జాతీయ పోషకాహార సంస్థ అంచనాల ప్రకారం రోజు కనీసం 400గ్రాముల కాయగూరలు, పండ్లు తినాల్సి ఉండగా.. చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవడం లేదు. వీటిలోని పీచు పదార్థం జీర్ణకోశం మెరుగ్గా పనిచేసేందుకు, యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.ఏ కాయగూరనైనా ఏదో ఒక రూపంలో శరీరానికి అందివ్వడం మేలు. మితమే.. హితం! ఎంత తింటే అంత బలం కాదు.. మితమే హితమకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక పాటించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహారం విష యంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. నోరు కుట్టేసుకుని ఉండటం ఎలా అనిపిస్తే... అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరి. పాల ఉత్పత్తులు... పాల ఉత్పత్తుల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోజూ వాడాలని కొందరు, అవసరమే లేదని కొందరు చెబుతారు. పెరుగు, మజ్జిగల రూపంలో తీసుకునే విషయంలో మాత్రం ఎవరికీ అభ్యంతరాలు లేవు. అయితే ఎంత మోతాదులో అన్నది ఒక ప్రశ్న. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు ఏదో ఒక రూపంలో కనీసం 300 మిల్లీలీటర్ల పాలు/పాల ఉత్పత్తులు శరీరానికి అందించడం మేలు. చిరుతిళ్లతోనూ చిక్కులు.. సాయంత్రం చిరుతిళ్లు తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల్లో నూనె పదార్థాలు కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, వేరుశనగ పప్పుల్లాంటివి తినడం మేలు. వీటివల్ల శరీరానికి శక్తి, ప్రొటీన్లు రెండూ లభిస్తాయి. ఉప్పుతో ముప్పు... ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చదువుతూనే ఉన్నాం. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. కానీ.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. శుద్ధీకరించిన ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మేలు. ఈ ఆహారపు అలవాట్లకు తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నలభై ఏళ్లు దాటిన తరువాతైనా తరచూ వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా పురుషులు ఆకస్మిక మరణాలను కొంతవరకైనా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
తెలుగింటి మురిపాలు.. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం
సూర్యుడు లేవడం డిలే అయినా పర్వాలేదు టైముకు పాలబ్బాయి పాల ప్యాకెట్ జార విడువకపోతే మన ఇల్లాళ్లకు తెల్లారదు. కాఫీ కొరకు ఒక అత్తగారు చాయ్ కోసం ఒక భర్తగారు పాల గ్లాసు కోసం బంగారుకొండలు అందరికీ సమాధానం చెప్పాల్సిందే. పాలు మనిషి ప్రాథమిక ఆహారం. సంస్కృతిలో భాగం. మొగుడూ పెళ్లాం పాలు నీళ్లలా కలిసిపోతేనే కాపురం. పాలుగారే పిల్లలతో మురిపాలు పోవడమే జీవితం. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం. అనుక్షణం జీవితంలో, జీవనంలో భాగమైన పాలకు పాలాభిషేకం చేసుకోవాల్సిన రోజు ఇది. ‘పాలు’ అనే మాటకు ఏకవాచకం లేదు. సదా బహువాచకమే. అందుకే ఇంట్లో చేరేప్పుడు పాలు పొంగిస్తారు. నలుగురూ కలిసి మెలిసి కళకళలాడాలని, ఆ తర్వాత ఆ పాలతో పాయసం చేస్తారు. తియ్యటి రోజులు ప్రాప్తించాలని. ప్రకృతి పాలకు తెల్లరంగు ఇచ్చింది. తెలుపు స్వచ్ఛతకు గుర్తు. అమ్మ పాలే కాదు ఏ పాలైనా స్వచ్ఛంగా ఉంటాయి. మన దేశంలో పాల వాడకం 6 వేల ఏళ్ల క్రితం నుంచి ఉందట. సైంటిస్టులు బిగ్బ్యాంగ్ థియరీలు చెబుతారుగాని ఆఫ్రికన్లలో కొన్ని తెగలు ఈ విశ్వం ఒక క్షీర బిందువు నుంచి మొదలైందని విశ్వసిస్తాయి. ప్రాచీన గ్రీస్లో చాలా కాలం మామూలు ప్రజలకు పాలు తాగే వీలు లేదు. ఆ అర్హత రాచకుటుంబాలకు, పురోహితులకూ ఉండేది. ఇవాళ మన దేశంలో పాలు అందరికీ దొరుకుతున్నాయి. కాని ఒక మోస్తరు రాబడి ఉన్నవారే ‘నెయ్యి’ వాడతారు. అంటే మన దగ్గర కూడా మరో విధంగా పాలు అందరికీ అందుబాటులో లేనట్టే. పేదల ఇళ్లలోనే కాదు మధ్యతరగతి ఇళ్లల్లో కూడా నెయ్యి గిన్నె నేడు కానరావడం లేదు. పాలు... మారుపాలు తల్లికి పాలు పడకపోతే పూర్వం పాలుతాపే మారుతల్లులు ఉండేవారు. చిన్న కోడలో పెద్ద కోడలో బిడ్డకు చనుమొన అందించేది. అమెరికాలో దొరలు కన్న బిడ్డలకు ఆఫ్రికన్ బానిస స్త్రీల పాలు తాపే వారు. ఒక గర్భంలో పుట్టకపోయిన మరో వక్షం నుంచి పాలు తాగితే ఆ తల్లికీ ఈ తల్లికీ పుట్టిన పిల్లలు సహోదరులు అవుతారని ఒక సెంటిమెంట్. ఈ దశను దాటించేందుకు డబ్బాపాలు వచ్చాయి. ‘పిల్లాడికి పాలు అయిపోయాయి. డబ్బా తీసుకురండి’ అని చెప్పిన భార్యకు, తేవడం వీలవని భర్తకు భీకరమైన సంగ్రామాలు జరిగేవి. కూలినాలి చేసుకునే తండ్రి పాలడబ్బా నిండుకుంటూ ఉందంటే బెంగటిల్లిపోయేవాడు. అయితే మధ్యతరగతి ఇళ్లలో ఖాళీ అయిన పాలడబ్బాల్లో ఉప్పు, చింతపండు పెట్టుకునే ఆనవాయితీ ఉండేది. వంటగది అల్మారా తెలిస్తే బోసినవ్వుల పాపాయి బొమ్మ ఉన్న డబ్బాలే అన్నీ. విషాదం ఏమిటంటే పాడిపశువుల మన దేశం 1960 వరకూ విదేశాల నుంచి దాదాపు 55 వేల టన్నుల పాలపొడి దిగుమతి చేసుకునేది. లాల్బహదూర్ శాస్త్రి, కురియన్ల పుణ్యమా అంటూ ‘అమూల్’తో ‘క్షీర విప్లవం’ వచ్చాక ఇటు పాడి రైతు, అటు సగటు మనిషి పాలతో అవస్థపడే స్థితి పోయింది. అందుకే తన రోజుల్లో గాంధీ గారు మేక పాలను ప్రమోట్ చేశారు. చల్లకొచ్చి ముంత దాస్తే పాలు ఉంటే పాలబువ్వ ఉంటుంది. పెరుగన్నం ఉంటుంది. మంది పెరిగితే మజ్జిగ పలుచనవుతుంది. ఆ తర్వాత వెన్న పోగవుతుంది. మరగపెట్టుకుంటే నెయ్యి అవుతుంది. ఒకనాటి స్త్రీలకు ఈ పాల వ్యాపకాలన్నీ ఉండేవి. పాలు మరిగాక పైన ఎర్రగా కట్టే మీగడ కొందరు పిల్లలకు ఇష్టం. విరిగిన పాలతో చేసే జున్ను మరికొందరికి ఇష్టం. గడ్డపెరుగులో ఆవకాయ నంజుకోవడం అందరికీ ఇష్టం. మంచి ముద్దపప్పు, ఆపకుండా పోసే నెయ్యితో పెట్టే పెళ్లి భోజనం శ్రేష్ఠం. మారాం చేసే పిల్లల చేత పాలు తాగించడానికి కొందరు తల్లులు మహా మహా కథకులైపోయేవారు. హార్లిక్స్లు, బూస్ట్లు వారి క్రియేటివిటీని చావు దెబ్బ తీశాయి. ఇంతకు మునుపే కాఫీ, టీ తోటలు వచ్చి టీ, కాఫీలను అలవాటు చేసి వాటిని ఇంటి పానీయాలు చేశాయి. ‘టీ చేసి భర్తను నిద్రలేపే ఇల్లాలు’ అనే స్టీరియోటైప్ సిద్ధమైంది.ఇవాళ్టికీ టీ ప్రకటనల్లో టీ చేసేది ఇల్లాలే. రెండు టీలు పెట్టాలంటే ఎన్ని చెంచాల టీ పౌడర్ వేయాలో తెలియని మహానుభావులు నేటికీ నిండా ఉన్నారు. ఫ్రిజ్జులు రానంత కాలం ప్రతి ఇల్లాలికి పిల్లి బెడద ఉండేది. పాలకు విలన్ అదే. ‘పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు’ అని ఒక సామెత. ‘చల్లకొచ్చి ముంత దాచడం’ మరో సామెత. అభిషేకాలు భారతీయ పండగల్లో, పూజల్లో పాలు ముఖ్యం. ప్రసాదాల్లో విరివిగా వాడతారు. దధ్యోజనం, చక్కెర పొంగలి, పంచామృతం... పాలు లేకుండా సాధ్యం కాదు. పాలాభిషేకం చేయించడం ఒక ఆరాధన. సినిమా అభిమానులు కూడా తన హీరోల కటౌట్లకు పాలాభిషేకం చేయిస్తారు. ఇరవై ఏళ్ల క్రితం వినాయకుడి విగ్రహం పాలు తాగిన ‘వింత’ చాలామందికి గుర్తు. తాగడానికి గుక్కెడు పాలు లేని పిల్లలు కోట్లాది మంది. నేటికీ మన దేశంలో ఉంటే ఐశ్వరవంతులు కొందరు ‘పాలు తాగడం పాత ఫ్యాషన్’ అంటున్నారు. ‘అతి శాకాహారులు’ పాలు తాగడం పాపం అంటున్నారు. ఏమీ లేనప్పుడు ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోయే మధ్యతరగతి మనుషుల గురించి వీరికి తెలియదు. పాల గురించి ఎవరు ఏమి చెప్పినా కల్తీ లేని పాలు ఉన్నంత కాలం మనిషి జీవంతో ఉంటాడు. జీవితాన్ని నిర్వహిస్తాడు. పాలు తాగుదాం. -
పాలు ఇస్తున్న మేకపోతు
యశవంతపుర: మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రం హావేరి జిల్లా హనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో జరిగింది. చమన్ షావలి అనే గ్రామస్తుడు ఒక మేక పోతును సాకుతున్నారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోందని చెప్పాడు. చుట్టుపక్కలవారు మొదట నమ్మలేదు. దీంతో వారి ముందే పాలు పితకడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. (చదవండి: కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..) -
Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే!
నెలల పసికందు దగ్గర నుంచి ఐదారేళ్ల పిల్లల దాకా.. వాళ్లకు ఎప్పుడు ఆకలేస్తుందో? ఎందుకు ఏడుస్తారో? అనేది ఊహించడం కష్టం. ఒకవేళ ఏ అర్ధరాత్రో వారికి ఆకలేసి ఏడిస్తే.. అప్పటికప్పుడు పాలు కాచి, చల్లార్చి తాగించాలంటే చాలా సమయం పడుతుంది. ఓ పక్క వాళ్ల ఏడుపు.. మరో పక్క మిగిలిన వారికి నిద్రాభంగం.. ఇలా అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది ఈ మిల్క్ వార్మర్. ఇందులో రెండు పాల బాటిల్స్ను కూల్గా ఉంచి, పాలు విరిగిపోకుండా స్టోర్ చేయడంతో పాటు ఐదే ఐదు నిమిషాల్లో గోరువెచ్చటి పాలను అందిస్తుంది. ఈ డివైజ్ను బెడ్ రూమ్లోనే పవర్ సాకెట్ దగ్గర అమర్చుకుని.. స్విచ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే చాలు. డివైజ్ వెనుకవైపు భాగం ప్రత్యేకమైన మూత కలిగి ఉంటుంది. దానిలో రెండు పాల బాటిళ్లను ఉంచితే ఏ కాలంలోనైనా చల్లగా నిలువ ఉంటాయి. బిడ్డ ఏడవడం మొదలుపెట్టిన వెంటనే.. అందులోని ఒక పాల బాటిల్ను ముందువైపు చిత్రంలో ఉన్న విధంగా పెట్టు కోగానే.. 5 నిమిషాల్లో పాలు వేడెక్కుతాయి. భలే ఉంది కదూ? ఈ డివైజ్ బెడ్ రూమ్లో ఉంటే.. ఎప్పుడుపడితే అప్పుడు కిచెన్లోకి వెళ్లాల్సిన పనిలేదు. పిల్లలు పాలకోసం ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు ధర 107 డాలర్లు (రూ.8,249) చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్ధర రూ. 1,990 -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్లో డ్రైవర్గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్నర్స్గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే..
శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి 12 తగినంత లేకపోతే ముఖ్యంగా ఎదరయ్యే సమస్య అరికాళ్లు, అరచేతుల తిమ్మిర్లు. ఇది లోపించిందో, తగినంత ఉందో అని తెలుసుకునేందుకు చేసే పరీక్ష కాసింత ఖరీదైనదే. అయితే మనకు ఎదురయ్యే కొన్ని సమస్యల ద్వారా ఈ పోషక లోపం ఉన్నట్లు అర్థం చేసుకుని దీనిని భర్తీ చేసేందుకు తగిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ బి12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు.. ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80 శాతం వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. విటమిన్ బి12 తక్కువగా ఉండడం వల్ల శరీరం వివిధ రకాలు గా ప్రభావితమవుతుంది. విటమిన్ బీ 12 లోపం మూడ్ స్వింగ్స్కు కారణమైతే మరికొందరిలో డిప్రెషన్కు కూడా దారి తీస్తుంది. విటమిన్ బి12 సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకునే వీలుంటుంది. ఇతర లక్షణాలు: కళ్లు తిరగడం: విటమిన్ బి12 మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారుచేస్తుంది. బి12 లోపిస్తే.. రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, గజిబిజిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కారణాలు విటమిన్ బి12 లోపానికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది పెర్నీషియస్ అనీమియా.. అంటే ఇందులో మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంటుంది. జీర్ణాశయంలోని కణాలను ఇలా నాశనం చేయడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ బి12 శరీరానికి అందదు. ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. రెండోది మనం తీసుకునే ఆహారంలోనే సహజంగా విటమిన్ బి12 తక్కువగా ఉండడం.. సాధారణంగా వీగన్లు లేదా శాకాహారుల డైట్లో విటమిన్ బి12 తక్కువగానే లభిస్తుంది. ఇలాంటివారిలో ఈ లోపం కనిపించవచ్చు. ఏకాగ్రత లేకపోవడం చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. గతంలో మంచి జ్ఞాపకశక్తి ఉన్నవారిలో కూడా, బి12 లోపించినందువల్ల ఏకాగ్రత లేకపోవడం, విషయాలు తరచూ మర్చిపోతుండడం వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇది కొంత కాలానికి డిమెన్షియాకి దారి తీస్తుంది. అంటే వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వ్యక్తులను గుర్తించడానికి సమయం పట్టడం వంటివి అన్నమాట. బీ12 సమృద్ధిగా లభించే ఆహారం గుడ్డు, పొట్టుతీయని ధాన్యం, పెరుగు, పాలు, చేపలు, నెయ్యి, బీట్రూట్, మష్రూమ్స్, ఆల్ఫాల్ఫా అనే ఒకరకమైన గోధుమ జాతికి చెందిన గడ్డి, జున్ను, ఈస్ట్, అరటి, యాపిల్, బెర్రీ జాతి పండ్లు. రోజుకు ఎంత మేర విటమిన్ బి12 కావాలో తెలుసుకొని ఆ మొత్తంలో ఈ పోషకాన్ని అందించే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించడం.. వీలు కానప్పుడు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు వాడటం మంచిది. చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే -
బరువు పెరుగుతామన్న భయం లేదు.. ఈ స్మూతీ హెల్దీగా, రుచిగా..
మ్యాంగో గ్రీన్ స్మూతి.. ఉదయం ఆల్పాహారంగానూ, సాయంత్రాల్లో స్నాక్స్తోపాటు ఈ స్మూతీ తీసుకుంటే రుచిగా హెల్థీగా ఉంటుంది. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం లేదు. మామిడిపండులో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండులోని పొటాషియం, పీచుపదార్థం, పాలకూరలోని ఐరన్, విటమిన్ కే లు చర్మం, జుట్టుకు పోషణ అందిస్తాయి. మ్యాంగో గ్రీన్ స్మూతి తయారీకి కావలసిన పదార్థాలు: చల్లటి మామిడిపండు ముక్కలు – ఒకటిన్నర కప్పులు, అరటి పండు – ఒకటి, లేత పాలకూర – కప్పు, బాదం పాలు – పావు కప్పు. తయారీ: మామిడి ముక్కలు, తొక్కతీసిన అరటిపండు, పాలకూర, బాదం పాలను మిక్సీజార్లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే ఈ స్మూతీని సర్వ్ చేసేకుంటే చాలారుచిగా ఉంటుంది. చదవండి👉🏾 Best Calcium Rich Foods: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే
అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే. తల్లికి తన బిడ్డలతో ఉండే ఏ బిడ్డయినా ఒకటే. ఆవుపాలు అమ్మ పాలకంటే శ్రేష్టం అంటారు. అలా.. ఓ శ్రేష్టమైన ఆవు తన బిడ్డతోపాటు నాలుగు మేకపిల్లలకూ పాలను పంచుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్కు చెందిన ముక్త్యార్కు కొన్నేళ్ల క్రితం అటవీప్రాంతంలో ఓ ఆవుదూడ దొరికింది. దాన్ని పెంచి పెద్దచేసిన తర్వాత అదొక బిడ్డకు జన్మనిచ్చింది. ముక్త్యార్ కొద్దిరోజుల క్రితం నాలుగు మేకపిల్లలను కొన్నాడు. ప్రస్తుతం వాటికి కూడా ఆ గోమాతనే పాలిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. – నిర్మల్ -
ఫార్ములా 1 రేస్ కారులాంటి వాహనంలో పాల క్యాన్లు... వీడియో వైరల్
A viral video shows motorist carrying milk cans: చాలామంది మంచి ఖరీదైన బైక్ పై రైడ్ చేయాలనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్య లేక మరేదైన కారణాల వల్లో తమకు ఇష్టమైన వాహనాల్లో వెళ్లలేకపోతుంటారు. ఇది సర్వసాధరణమే. కానీ కొంతమంది తమ కలల వాహనంలోనే రైడ్ చేయాలనుకుంటారు. అందుకోసం తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరీ తమ డ్రీమ్ వాహనాన్ని రూపొందించుకుంటారు. ఇక్కడోక వ్యక్తి అచ్చం అలాంటి కోవకు చెందినవాడే. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫార్తులా వన్ రేస్ కారు మాదిరి వాహనంలో పాల క్యాన్లు మోసుకు వెళ్తున్నాడు. పైగా అతను ఫార్ములా వన్ కారు రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో అలానే అతను నల్లటి కోట్, హెల్మెట్ ధరించి రైడ్ చేస్తున్నాడు. అయితే అతను పాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని రోడ్స్ ఆఫ్ ముంబై సంఘం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఇన్నోవేషన్ వీడియోలను షేర్ చేసేందుకు ఆసక్తి కనబర్చే దిగ్గజ పారశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాకి ఈ వీడియో నచ్చుతుందంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. నిజానికి సృజనాత్మకత భారతీయుల రక్తంలోనే ఉంది. గతంలో కూడా ఓ వ్యక్తి విద్యుత్తు లేకుండా పనిచేసే చెక్క ట్రెడ్మిల్ రూపోందించి అందరి మన్నలను అందుకున్న సంగతి తెలిసిందే. When you want to become a F1 driver, but the family insists in helping the dairy business 👇😜 pic.twitter.com/7xVQRvGKVb — Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) April 28, 2022 (చదవండి: సెలవు కావాలని వైరల్ లేఖ) -
Summer: బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తాగితే..
Summer Drinks- Poha Banana Shake Recipe: అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటితో తయారు చేసే పోహా బనానా షేక్లో ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ కూడా అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. పోహా బనానా షేక్ తయారీకి కావలసినవి: అటుకులు – పావు కప్పు(శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి), అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి), తియ్యటి పెరుగు – అరకప్పు, చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు. తయారీ: బ్లెండర్లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన అటుకులను వేయాలి. దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్ చేసుకోవాలి. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. చదవండి: Healthy Weight Gain Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
గోల్డెన్ మిల్క్ తో వందలాది వ్యాధులకు చెక్..
-
Milk Maker: కొబ్బరి, బాదం, సోయా పాలు.. ఇలా తయారు చేసుకోండి.. ధర ఎంతంటే!
కొబ్బరి, బాదం, సోయా పాలు వంటివి వంటల్లో చవులూరించే రుచినే కాదు ఒంట్లో ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్న వారికోసమే ఈ డివైజ్. ఇది గింజలు, నట్స్ నుంచి పాలు తీసి పెడుతుంది. దీంట్లో బాదం లేదా కొబ్బరి లేదా సోయా(రాత్రి నానబెట్టి) వంటివి వేసుకుని.. సరిపడా నీళ్లు పోసుకుంటే.. జ్యూస్లా చేసిపెట్టేస్తుంది. చివరిగా టీ వడకట్టుకునే తొట్టెతో వడకట్టుకుంటే సరిపోతుంది. పైగా ఇందులో బ్రెడ్ రెసిపీ తయారు చేసుకోవడం, కాఫీ గింజలను పౌడర్ చేసుకోవడం.. వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్ మాదిరి ఉండే డివైజ్ కావడంతో వినియోగించడం చాలా సులభం. ధర 109 డాలర్లు- (రూ.8,347) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక
టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి. ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్బాల్, క్రికెట్లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని స్నాక్స్గా ఇస్తూ ఉండాలి. ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువు తగ్గిస్తుంది. చిలగడదుంపను తింటే ఇక ఆకలి వెయ్యదు. చాలా సేపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకేవీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలుంటుంది. నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది. రోజులో కనీసం అరగంట యోగా చేయడం మూలంగా, శరీరంలోని అనేక విషతుల్య మలినాలు తొలగుతాయి. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచగలవు. యోగా ఊపిరితిత్తులను బలపరచడమే కాకుండా, వాటిని శుభ్రపరుస్తుంది. అంతేకాదు, ఒత్తిడికి కూడా దూరంగా ఉండవచ్చు. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
అమ్మతనమంటే ఇదే.. మేక పిల్లలకు పాలిస్తున్న కుక్క !
భువనేశ్వర్: సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. పేగు తెంచుకుని కన్న బిడ్డలకు ఆదరించి లాలించడం పరిపాటే. తల్లి లేని లోటు ఏ జీవికైన భర్తీ చేయలేనిది. కూనలు కన్ను తెరిచేలోగా ప్రసవించిన తల్లి మేక కన్ను మూసింది. పోషణకు ఆధారమైన తల్లి పాలు లేక అల్లాడుతున్న మేక పిల్లల్ని వీధి కుక్క అక్కున చేర్చుకుంది. నిత్యం క్రమం తప్పకుండా తన పాలుని పంచిపెడుతోంది. మయూర్భంజ్ జిల్లా జమదా మండలం మధుపూర్ గ్రామంలో ఈ విభిన్న మాతృత్వం శుక్రవారం తారసపడింది. రాగా అంకుర్ బాగే పోషించిన మేక 2 పిల్లల్ని ఈనింది. మరుక్షణమే తల్లి మేక కన్ను మూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గంజితో జీవుల ఆకలి తీర్చేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకి తల్లిని కోల్పోయిన మేక పిల్లలు చేరువయ్యాయి. కడుపునిండా పాలు పంచి మేక పిల్లల్ని కుక్క అక్కున తీసుకుని ఆదరించడం స్థానికులను ఆలోచింపజేసింది. -
వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’
సాధారణంగా పొద్దున్నే ఎవరి ఇళ్లలోనైనా రోజు ఎలా మొదలవుతుంది? టీ, కాఫీ లేదా పాలు తాగడంతోనే కదా.. మరి ఇందుకోసం మీరు ఏ పాలు వాడతారని అడిగితే... గేదె పాలు, ప్యాకెట్ పాలు లేదా ఆవు పాలని టక్కున బదులిస్తారు. మరి ఆలూ పాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆలుగడ్డతో చేసే వంటకాల గురించి తెలుసుగానీ ఆలూతో పాలు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి వెరైటీ అంటే... సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ తరహాలోనే తాజాగా ఆలూ మిల్క్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్ కంపెనీ అయిన ‘డగ్’ ఈ పాలను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాఫీ తరహాలో ఉండే లాట్టెస్, కాపిచీనో తయారు చేసుకొనేందుకు ఈ పాలు ఎంతో బాగుంటాయని తెలిపింది. త్వరలోనే ఇతర యూరోపియన్ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వివరించింది. స్పందన భారీగానే... మాల్టోడెక్స్ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్సీడ్ ఆయిల్, ఫ్రక్టోస్, సూక్రోస్ సహా వివిధ విటమిన్లతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ముఖ్యంగా ఇది వెగాన్ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో శాకాహారులంతా ఈ ఆలూ పాలు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అలాగే జంతువుల నుంచి సేకరించే పాలలో ఉండే లాక్టోస్ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. ‘డగ్’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్రహితమైనవి కావడం వల్ల కూడా చాలా మంది ఈ పాలు తాగుతున్నారట. దీని ధర సైతం ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్తో పోలిస్తే చవకగానే (లీటరుకు సుమారు రూ. 170కి విక్రయిస్తోంది) ఉందని వినియోగదారులు చెబుతున్నారు. రుచి అంతంతే..! అయితే దీన్ని రుచి చూసిన వారిలో కొందరు మాత్రం ఆలూ పాలు అంత గొప్పగా లేవని చెబుతున్నారు. దాని రుచి ‘తటస్థం’గా ఉందని కొందరంటే ఇంకొందరేమో ఆలూ పాలు కాస్త ‘ఉప్ప’గా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. సోయా మిల్క్లో ఉండే 8 గ్రాముల ప్రొటీన్, ఓట్ మిల్క్లో ఉండే 3 గ్రాముల ప్రొటీన్లతో పోలిస్తే ఆలూ మిల్క్లో కేవలం ఒక గ్రాము ప్రొటీన్ (ఒక సర్వింగ్కు) మాత్రమే ఉందని ఇంకొందరు పేర్కొన్నారు. అయితే సోయా పాలలో లభించే ప్రొటీన్లకన్నా నాలుగురెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఆలూ పాలలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఆలూనే ఎందుకు? సోయా, ఓట్ మిల్క్తో పోలిస్తే ఆలుగడ్డను తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉండటం, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా ఎంచుకున్నట్లు ‘డగ్’ చెబుతోంది. అలాగే తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ తెలిపింది. అన్నింటికీ మించి ఇతర పాలతో పోలిస్తే కారుచౌకగా ‘ముడిసరుకు’ లభిస్తుందని పేర్కొంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అక్కడ పాలు ఉచితం.. అమ్మితే అరిష్టమే..
సాక్షి, తాడిమర్రి (అనంతపురం): పాలు లీటరు రూ.40 నుంచి రూ.60 దాకా పలుకుతున్న రోజులివి. ఎవరికైనా పాలు కావాలంటే కొనాల్సిందే. కానీ ఆ గ్రామంలో పాలు అమ్మరు.. కొనరు. ఎన్ని కావాలన్నా ఉచితమే. అవును ఇది నిజం. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. తాడిమర్రికి ఉత్తర దిశన 23 కిలోమీటర్ల దూరంలో చిల్లవారిపల్లి గ్రామం ఉంది. 400 కుటుంబాలు, 1900మంది జనాభా, 1100 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో దాదాపు 300 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ వందలాది లీటర్ల పాలు ఉత్పత్తవుతాయి. అయితే గ్రామంలో పాడి పశువులు లేని వారికి పాలు అవసరమైతే డబ్బు తీసుకోకుండా ఉచితంగా పోస్తారు. పాలకుండలో దేవుడు కనిపించాడని.. చిల్లవారిపల్లిలో పూర్వం కాటికోటేశ్వరస్వామి (కాటమయ్య) పాల కుండలో నవ యువకునిగా కనిపించాడని ప్రతీతి. దీంతో గ్రామంలో ఆలయం నిర్మించి స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజున గ్రామంలో కాటికోటేశ్వరస్వామిని ఊరేగిస్తారు. దేవుడు పాలకుండలో కన్పించినందున ఆనాటి నుంచి పాలు అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆచారాన్ని విస్మరించి ఎవరైనా పాలు అమ్మితే వారి ఇంటికి అరిష్టం జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. చదవండి: (అర్హతలే భీమవరానికి వరం!) కోర్కెలు తీర్చే ఇలవేల్పు కాటికోటేశ్వరస్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మా గ్రామస్తులు కాటికోటేశ్వరస్వామిని తప్ప ఇంకొక స్వామిని ఎరుగరు. కాటికోటేశ్వరస్వామి అంటే గ్రామస్తులకు అపారమైన భక్తి. గ్రామంలో 80 శాతంపైగా పరమశివుని నామాలతోనే పేర్లు ఉండటం విశేషం. –పీ.పెద్దశివారెడ్డి, సర్పంచ్, చిల్లవారిపల్లి పాలు అమ్మిందే లేదు వందల ఏళ్ల నుంచి గ్రామంలో పాలు అమ్మింది లేదు. మా తాత, ముత్తాతల కాలం నుంచి పాలు అమ్మడమనేది చూడలేదు. మాకు 15 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ నాలుగు ఆవులు, ఒక గేదె సుమారు 15 లీటర్ల పాలు ఇస్తాయి. అయినా చుక్క కూడా పాలు, పెరుగు అమ్మం. అడిగిన వారికి ఉచితంగా పోస్తాం. – పి.బాలమ్మ, వృద్ధురాలు, చిల్లవారిపల్లి -
రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..
నూతన సంవత్సరం సందర్భంగా చాలమంది పలురకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది ప్రజల హితం కోరి విన్నూతన పద్ధతుల్లో వేడకను జరుపుకుంటున్నారు. అచ్చం అలానే పుణేకి చెందిన వ్యక్తి కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విచిత్ర వేషధారణలో మద్యం మానేయండి అంటూ విన్నూతనంగా ప్రచారం చేశాడు. (చదవండి: డబ్బులు కోసం ఏకంగా 14 సార్లు కరోనా వ్యాక్సిన్లా?) అసలు విషయంలోకెళ్లితే...పుణెకు చెందిన ఓ వ్యక్తి రావణుడి వేషధారణలో కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాల ప్యాకెట్లు పంచి పెడుతూ మద్యానికి స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారని అందుకే మీలోని రావడుడిని విడిచిపెట్టి మద్యానికి స్వస్తి పలకేందుకే తాను రావణుడి వేషం వేసుకున్నాని అరుణ్ ఓహర్ అన్నారు. ఈ మేరకు అక్కడ స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ.." సమాజంలో మద్యపాన వ్యసనం పెరుగుతోంది. దీని ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మద్యపానాన్ని వదిలివేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు. పైగా ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలామంది తాగి నానా రచ్చ చేస్తుంటారని కూడా చెప్పారు. ఈ వేడకను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలనే చెప్పేందుకు తాను ఈ విధంగా రావణుడి వేషం ధరించి పాల ప్యాకెట్లు పంచిపెడుతున్నాను అని రావణ వేషధారి అరుణ్ ఓహర్ అన్నారు. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) -
విజయ పాలధర లీటర్ రూ.2 పెంపు
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: విజయ డెయిరీ పాల ధర మరోమారు పెరిగింది. కొత్త ఏడాది నుంచే ఈ ధర అమలులోకి వచ్చింది. టోన్డ్ మిల్క్ లీటర్కు రూ.2 చొప్పున పెంచినట్లు డెయిరీ ప్రకటించింది. ప్రస్తుతం రూ.47గా ఉన్న టోన్ట్ మిల్క్లీటర్ ధర నేటి నుంచి రూ.49కి పెంచినట్లు సంస్థ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సరఫరా చేయనున్న పాలకు ఈ పెంచిన ధరలు వర్తిస్తాయని, హోల్ మిల్క్ ధర లీటర్కు రూ.4 చొప్పున పెంచామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ పాలను పలురకాల సైజుల్లో ఉన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నందున సైజులవారీగా ధరలను పెంచుతూ విజయ డెయిరీ నిర్ణయం తీసుకుంది. డబుల్టోన్డ్ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్ ధర రూ.9 నుంచి రూ.9:50కి పెరిగింది. 300 మిల్లీలీటర్ల ధర రూ.14 నుంచి రూ.15కు, 500 మిల్లీలీటర్ల ధర రూ.22 నుంచి రూ.23కు, ఆవుపాలు లీటర్పై రూ.48 నుంచి 50కు పెరిగింది. టోన్డ్ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్ రూ.10 నుంచి రూ.10.50కు, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్ రూ.24 నుంచి రూ.25కు పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచామని... కావున వినియోగదారులు సహకరించాలని విజయ డెయిరీ అధికారులు కోరారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పాలు...
యూనివర్సల్ హెల్త్ డ్రింక్ ప్యాకేజీలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి బి1, బి2, బి12, విటమిన్లతో పాటు విటిమిన్ డి కూడా ఉంటుంది. తీపి పదార్ధాలతో పాటు అనేక డైరీ ఉత్పత్తులకు మూలం పాలు కాబట్టి.. వీటి వినియోగం అనేక లాభాలను అందిస్తుంది. పిల్లలకు పాల అవసరంపై పోషకాహార నిపుణులు, సిథ్స్ఫార్మ్స్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి చెబుతున్న విశేషాలివే... అత్యుత్తమ పోషకాలు... పాలలో పొటాషియం మరియు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎదుగుదల దశలో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. పాలు అనేది అన్ని పోషకాలను కలిగి ఉన్న ఏకైక పానీయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో పాల వినియోగం తగ్గితే అది వారి 1.9% తక్కువ ఎదుగుదలకి దారితీస్తుంది. అలాగే పాలు తాగిన పిల్లల బరువు, ఎత్తులో తాగని వారితో పోలిస్తే 20% అధిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అధ్యయనాల సారాంశం.. పిల్లలలో పాల వినియోగం ప్రభావాన్ని గుర్తించే అధ్యయనాలెన్నో వెలువడ్డాయి. పాలను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందని ఫోర్టిఫైడ్ మిల్క్ ప్రోగ్రామ్ తేల్చింది. పిల్లలలో దృష్టి లోపాన్ని తగ్గించడంలో పాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి. పాలను ఎక్కువగా తాగడం ఐక్యు స్థాయిలలో గణనీయమైన మెరుగుదల, ఆటలు వంటి శారీరక శ్రమలపై వారికి ఆసక్తిని పెంచుతుందని కూడా ఇవి స్పష్టం చేశాయి. ఉత్పత్తిలో మిన్న కానీ... పాల ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు అయినప్పటికీ 2018 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది పిల్లలలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో పాల ప్రాముఖ్యత, పోషక విలువల దృష్ట్యా ఎన్డిబిబి ఫౌండేషన్ ఫర్ న్యూట్రిషన్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని ట్రస్ట్ బలవర్థకమైన ఫ్లేవర్డ్ మిల్క్ ను ప్రవేశపెట్టింది. చిన్న పిల్లలకు ఆహారంగా పాలప్రాముఖ్యత తెలియజెప్పేలా ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్ 1ని ప్రపంచ పాల దినోత్సవంగా ప్రకటించింది. – తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను, నాణ్యమైన ప్రోటీన్ అందించే గొప్ప వనరు పాలు. ఇది వయస్సు–సంబంధిత కండర నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది – కఠిన వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి సహకరిస్తుంది. –విటమిన్ డి, విటమిన్ కె, ఫాస్పరస్, మెగ్నీషియంతో సహా కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి పాలు శరీరానికి సహాయపడతాయి. – బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం ఊబకాయం ప్రమాదాన్ని నివారిస్తుంది కూడా. – పాలు అందరికీ నప్పకపోవచ్చు. వీరి కోసం నాన్–డైరీ మిల్క్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. – పాలను 3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికిస్తే.. విలువైన పోషకాలను కోల్పోతుంది. – ప్లాస్టిక్ డబ్బాల్లో పాలను నిల్వ ఉంచడం లేదా మైక్రోవేవ్ చేయడం అనేవి క్యాన్సర్ కారకాలు. –కిషోర్ ఇందుకూరి, పోషకాహార నిపుణులు -
వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..
శివమొగ్గ(కర్ణాటక): అమ్మ కొట్టిందని, పెన్సిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ మధ్యకాలంలో చూశాం. అటువంటిదే ఈ కేసు. నా ఆవులు పాలు ఇవ్వడం లేదు. పాలు ఇచ్చేలా చేయండి, లేదా వాటిపై కేసు నమోదు చేయండి.. అని ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చదవండి: అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్! ‘ఆవులకు తగినంత దాణా, గడ్డి పెట్టి పోషిస్తున్నా, 4 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు, పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయి. వాటికి బుద్ధి వచ్చేలా చేయండి’ అని స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నివ్వెరపోయారు. ఇటువంటి కేసులను నమోదు చేయడం కుదరదు. ఆవులను మంచిగా చూసుకో, పాలు ఇస్తాయని నచ్చ చెప్పి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..! -
‘మా అమ్మ పాలు ఇలానే ఊదేది’.. ఆరేళ్ల బాలుడు మృతి!
ఇండోర్: తెలిసీతెలియని వయసది. పొంగుతున్న వేడిపాలను తల్లి ఏవిధంగా ఊదుతుందో చూసి.. తను కూడా అలాగే అనుసరించాలనే ప్రయత్నంలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లసూడియా పోలీసుల కథనం ప్రకారం... ఫీనిక్స్ టౌన్షిప్లో నవంబర్ 23 సాయంత్రం సమయంలో బాలుడి తండ్రి రామ్జీ ప్రసాద్ పనిమీద బయటికి వెళ్లాడు. అతని భార్య రంజూదేవి, కుమారుడు సంజీవ్ కుమార్ (6), రెండున్నరేళ్ల కుమార్తె స్వీటి ఇంటి వద్ద ఉన్నారు. ఆ రోజు సాయంత్రం తల్లి రంజూదేవి గ్యాస్పై పాలు పెట్టి వేరేపని నిమిత్రం వంటగది నుంచి బయటికి వెళ్లడం చూసిన సంజీవ్, బల్లపైకెక్కి ప్లాస్టిక్ పైప్తో పాలను ఊదడం ప్రారంభించాడు. ఆ టైంలో వేడి పాలు పైపులోనుంచి నోట్లోకి వెళ్లడంతో వేగంగా శ్వాసపీల్చుకున్నాడు. దీంతో నోటిలోపలి భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా మూడురోజుల తర్వాత ఆదివారం మృతి చెందాడని వివరించారు. ప్రతిరోజూ తల్లి మరుగుతున్న పాలపై ఊదడం చూసేవాడని, అదేవిధంగా పొంగుతున్నపాలను పైపుతో ఆర్పడానికి ప్రయత్నించి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి రామ్జీ ప్రసాద్ తెలుపుడూ కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు! -
పశువుల్లో యాంటీబయాటిక్స్ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..
యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)గా వ్యవహరిస్తున్నాం. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్. సమస్య వల్ల యాంటీబయాటిక్ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్ అండ్ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది. 24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. పాలలో యాంటీబయాటిక్స్ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్, తన సహచరులు డా. ఎన్. పుణ్యమూర్తి, ఎస్.కె. కుమార్తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ – 63602 04672. nair.mnb@tdu.edu.in చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
వింత ఘటన: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత
భోపాల్: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని కామెడీ సనిమాల్లో మా ఇల్లు తప్పిపోయిందని, ఓ చిన్న పిల్లాడు తన పెన్సిల్ దారిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సన్నివేశాలను మనం చూసుంటాం. ఈ తరహాలోనే తాజాగా ఓ వ్యక్తి తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాబూలాల్ జాతవ్ (45) అనే గ్రామస్థుడు శనివారం నయాగావ్ పోలీస్ స్టేషన్కు తన గేదెను తీసుకెళ్లాడు. పోలీసులతో తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని, పాలు కూడా తనని పితకనివ్వడం లేదని తెలిపాడు. తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తోందని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ తన గేదెతో పోలీస్స్టేషన్కు చేరుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. తన గేదె పాలు ఇచ్చేలా తనకు సహాయం చేయాలని కోరాడు. దీంతో పోలీసులకు అతనికి ఒక పశువైద్యుడి వద్దకు ఆ గేదెను పంపారు. చివరకు తన గేదె పాలు ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి అతను ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్స్టేషన్కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ‘చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనని వారికి థాంక్స్ చెప్తున్నారు. చదవండి: వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్షూట్.. సరిపోయిందా.. ఇంకా కావాలా? -
వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే
How To Stop Milk Boiling Over: సాధారణంగా కొత్త ఇల్లు కొన్నవారు గృహప్రవేశ సమయంలో గిన్నెలో పాలు వేసి వాటిని వేడిచేస్తూ పొంగించంటం చేస్తుంటారు. అయితే అది సంప్రదాయంలో భాగంగా చేస్తుంటారు. కానీ సాధారణ సమయంలో స్టవ్ మీద వేడి చేస్తున్నప్పుడు గిన్నెలోని పాలు పొంగిపోవటం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అయితే గృహిణీలు చాలా మంది స్టవ్ మీద పాలు పెట్టామన్న విషయాన్నే మర్చిపోయి ఇరుగుపొరుగువారితో కబుర్లలో మునిగిపోతారు. కొంత మంది టీవీకే అతుక్కుపోతారు. దీంతో పాలు కిందిపోయి గృహిణీలకు సమస్య మారుతుంది. అయితే తాజాగా పాలు పొంగటాన్ని నియంత్రించే ఓ వంటింటి చిట్కాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రచయిత, డాక్టర్ నందితా అయ్యార్ తాజాగా ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోలో పాత్రలోని పాలు పొంగిపోకుండా ఓ చెక్క గరిట నియంత్రిస్తుంది. ‘చెక్క గరిట పాల గిన్నెపై ఉండటం వల్ల పాలు పొంగి కిందపోకుండా ఉంటాయన్న విషయం మీకు తెలుసా?’ అని కామెంట్ చేశారు. పాలు మరిగించినప్పుడు వెలువడే ఆవిరి చెక్క గరిటకు తగలటంతో పాలు మరిగే ఒత్తిడి తగ్గుతుందని ఆమె తెలిపారు. దీంతో పాలు గిన్నె నుంచి పొంగిపోయి కిందకు పడకుండా ఉంటాయనిపేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ఇంతవరకు ఈ చిట్కా తమకు తెలియదని.. నమ్మలేకపోతున్నాము’ అని ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ చిట్కా బాగుంది.. అదేవిధంగా ప్రెజర్ కుక్కర్ విజిల్స్ను లెక్కించడానికి కూడా ఎవరైనా ఓ చిట్కా కనిపెట్టాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ చిట్కా కొన్నేళ్ల క్రితమే తెలిసి ఉండాల్సింది.. పాలు పొంగిపోయిన ప్రతిసారి మా అమ్మ నాపై గట్టిగా అరిచేది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి మనం కూడా ఒకసారి ట్రై చేసి ఇది పని చేస్తుందో లేదో చూద్దామా? Did you know keeping a wooden ladle over the milk pan prevents the milk from boiling over? #Cookingtip pic.twitter.com/hDC5mb51iV — Nandita Iyer (@saffrontrail) November 10, 2021 -
అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
Benefits of drinking ginger milk: ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి. గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి. అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది చదవండి: ఎయిర్ హోస్టెస్ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..! -
Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట.. పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! సీటీఎచ్లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
Health Tips: బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ..
బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ‘ఇ’, మాగ్నిషియం, మాంగనీస్, కాపర్, పాస్పరస్.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు పుష్టి, బరువు అదుపులో ఉంచడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం.. వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే బాదం పాలల్లో కూడా పోషకాలు తక్కువేం కాదు. ఐతే మితిమీరి తీసుకుంటే అలర్జీల రూపంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. కడుపులో వికారం బాదం అధికంగా తీసుకుంటే వీటిల్లోని మినరల్స్, నూట్రియన్స్ అవసరానికి మించడం వల్ల వాంతికి రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం.. వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన జీర్ణాశయాంతర ప్రతిచర్యలకు దారితీస్తుంది. చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. గింజల అలర్జీ నట్స్ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్జోస్ అలర్జీలున్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉండటమే మేలు. షుగర్ స్థాయిలు ఎక్కువ ఆవుపాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది కూడా అరోగ్యానికి హానికారకమే. థైరాయిడ్పై ప్రభావం బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే ఈ విధమైప ఆహారాలు థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణమవుతాయన్నమాట. వీటిని అధికమోతాదులో తీసుకుంటే థైరాయిడ్కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. థైరాయిడ్తో బాధపడేవారు బాదం పప్పు లేదా బాదం పాలు మితంగా తీసుకుంటే బెటర్! పిల్లలకవసరమైన పోషకాలు అందవు బాదం పాలు పిల్లలకు కూడా అంత మేలు చేసేదేంకాదు. పిల్లలకు అవసరమైన సరైన పోషకాలు కూడా దీనిలో అంతగా ఉండవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మాత్రం వీటిని అస్సలు పిల్లలకు పట్టించకూడదు. కాబట్టి బాదం పాలు తాగే ముందు ఓ సారి ఆలోచించి తాగితే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. చదవండి: World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే.. -
Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’
సాధారణంగా అన్ని జీవాలకు ఆకలి బాధలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన ఆకలితో వాటికి జాతి వైరం కూడా గుర్తుకురాదు. అలా కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం. తాజాగా ఓ చిన్న పంది పిల్ల ఆకలి వేయడంతో శునకం పాలు తాగింది. ఆ పందిపిల్ల పాలు తాగుతున్న క్రమంలో శునకం మరో చోటుకి వెళ్లుతుంది. కానీ, పంది పిల్లకు ఎంత ఆకలి ఉందో? దాని వెంటనే పరుగెడుతూ మళ్లీ శునకం దగ్గరుకు వెళ్లీ పాలు తాగుతుంది. దీంతో శునకం అక్కడే ఉండి పంది పిల్ల ఆకలి తీర్చుతుంది. ఈ వింత ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని వీధిలో శునకం పంది పిల్లకు పాలు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. జాతి వైరం వీడి పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటిందని పలువురు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే...
పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నివసించే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? వీరు కల్తీలేని స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు కాబట్టి. సంపూర్ణ లేదా సమతుల్య ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి. ఐతే చాలా మందికి పాలు, పాల ఆధారిత పదార్థాలు తినే అలవాటు అస్సలుండదు. హృద్యోగ సమస్యలకు దారీతీసే కొవ్వులు, కొలెస్ట్రాల్లు పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయనేది వీరి బలమైన నమ్మకం. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తాజా పరిశోధనల్లో కూడా తేలిందేమిటంటే పాల ఉత్పత్తులు గుండెను రక్షించడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని ధ్రువీకరించాయి. కొంత మంది వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా పాలను నేరుగా తీసుకోలేరు. అలాంటప్పుడు ఇతర మార్గాల ద్వారా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ కింది సూచించిన 5 రకాల పాల ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం.. పన్నీర్ భారతీయుల ఆహారంలో పన్నీర్ చాలా ప్రసిద్ధమైనది. కూరగా వండుకున్నా లేదా ఇతర ఏ పద్ధతుల్లో వండినా రుచితో పాటు పోషకాలు అందుతాయి. దీనిలో కాల్షియం, విటమిన్ బి, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. ఎముకల పుష్టికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీ హార్మొన్ల ఆరోగ్యానికి అవసరమైన మాగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు తగుమోతాదులో అందేలా చేస్తుంది. పెరుగు హృదయ ఆరోగ్యానికి, ఎముకల దృడత్వానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కడుపులోని పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల (బ్యాక్టీరియా) వృద్ధికి ఇది చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణక్రియ, ఇతర జీవక్రియలకు కూడా పెరుగు ఉపయోగపడుతుంది. పాలకోవ స్వీట్లలో పాలకోవ స్థానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే స్వీట్ ఇది. పాలను బాగా చిక్కబడేంత వరకూ వేడిచేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దీనిలో ‘డి, బి, కె’ విటమిన్లు, కార్బొహైడ్రేట్స్తోపాటు, పాస్పరస్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగ ప్రొటీన్లు, విటమిన్ ‘ఎ, బి’లు, కాల్షియం, పొటాషియం, రైబోఫేవిన్, ప్రొబయోటిక్స్ నిండుగా ఉంటాయి. ప్రాచీన కాలం నుంచే ధనిక పేద భేదం లేకుండా మన భారతీయుల ఆహారపు అలవాట్లలో మజ్జిగ మిలితమైఉంది. నెయ్యి రోజువారీ ఆహారంలో నెయ్యి కూడా ముఖ్యమైనదే. ఇది ఎముక ఖనిజ సాంద్రతలో నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఐదు మార్గాల ద్వారా పాల సంబంధిత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాన్ని మీరే తెలుసుకుంటారు! పలు పరిశోధనలు కూడా ఈ విషయానే దృవీకరించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే తినండి, ఆరోగ్యంగా ఉండండి!! చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
పాలు విరిగాయా? వర్రీ అవద్దు.. ఇలా ఉపయోగించండి!
Usage Of Spoiled Milk: ఇంట్లో ఒక్కోసారి పాలు విరిగిపోతుంటాయి. అయ్యో పాలు విరిగిపోయాయే! అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే విరిగిన పాలను కూడా మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు. చదవండి: తక్కువ ప్యాకేజీ.. జమ్మూ కశ్మీర్ వెళ్లొస్తారా..? ► చపాతి, రోటీ, పరోటాల కోసం పిండి కలిపేటప్పుడు విరిగిన పాలను దానిలో పోసి పిండిని ముద్దగా కలిపి చపాతీలు చేస్తే..చపాతీలు మృదువుగా, రుచిగా వస్తాయి. ► కూర చేసేటప్పుడు గ్రేవీకోసం నీళ్లుపోయకుండా విరిగిన పాలను పోసి ఉడికిస్తే కూర రంగు, రుచి కూడా బావుంటుంది. పోషకాలు కూడా పెరుగుతాయి. ► కేక్ల తయారీలో బేకింగ్ సోడాకు బదులు విరిగిన పాలను వాడటం వల్ల కేక్ సాఫ్ట్గా, టేస్టీగా వస్తుంది. చదవండి: Weight Loss: బరువు తగ్గాలా.. ‘గ్రీన్ కాఫీ’ ట్రై చేయండి! -
Weight Loss: పాలతో అవిసె గింజలు, అరటిపండు కలిపి తింటే..
Rajgira: దాదాపు 10 నుంచి 12 గంటల విరామం తరువాత ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్లో తీసుకునే పోషకాలు బరువును నియంత్రణలో ఉంచడంలోనూ, మధుమేహం, రక్తపీడనాన్ని అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. అందువల్ల రాజ్గిరా లేదా రమదానా అని పిలిచే మిల్లెట్స్ను బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తపీడనం, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పాలతో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అరటిపండుతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు. ప్రోటీన్, పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల ఇవి తింటే కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతుంది. చదవండి: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు! Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో
సాక్షి, జడ్చర్ల టౌన్(మహబూబ్నగర్): సమాజంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. అలాంటిదే ఈ వింత. జడ్చర్లలో మంగళవారం ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్గా మారింది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు. పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. చదవండి: ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! -
విజయ డెయిరీ చైర్మన్ చలసాని మాయ.. వెన్న నుంచి కమిషన్లు
అంతులేని అక్రమాలు.. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలకు ఆలవాలంగా మారిన విజయ డెయిరీలో రోజుకో అక్రమాల చిట్టా బయటపడుతోంది. భూముల కొనుగోలులో చేతివాటం మొదలుకొని.. రూ.కోట్లలో నిధులను మింగేయడం.. కమీషన్ల దందా నడిపించడం.. బోనస్ల బాగోతం వంటి అక్రమాల పుట్టలెన్నో విజయ డెయిరీ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం బట్టబయలు కావడంతో పాల సొసైటీల చైర్మన్లు అవాక్కవుతున్నారు. సాక్షి, అమరావతి: వెన్న నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ.. విజయ డెయిరీలో మాత్రం వెన్న నుంచి కమీషన్లు కూడా పిండారు. డెయిరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్టు ఆ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆయన హయాంలో ప్రతి వ్యవహారం అవినీతిమయంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్ల తీరు తెలుసుకుని పాల సొసైటీల చైర్మన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీటిని భారీగా కొనుగోలు చేసి కమీషన్ల రూపంలో రూ.కోట్లు మింగేశారని చెబుతున్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి వెన్న, పాల పౌడర్ కొనేవారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి పేరున్న సంస్థల నుంచే కొనుగోలు చేసేవారు. డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొద్దినెలల క్రితం 2,500 టన్నుల వెన్నను మద్రాసుకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయించారు. ఇదికాకుండా సంస్థలో మరో 500 టన్నుల వెన్న తయారైంది. మొత్తం 3 వేల టన్నుల వెన్న విజయ డెయిరీ వద్ద నిల్వ ఉంది. ఇంత వెన్న ఒకేసారి కొనుగోలు చేయడం అంటే కమిషన్ కోసమే తప్ప వేరే ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. ఎంత పక్కాగా నిల్వ చేసినా సంవత్సరం లోపు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా కమిషన్ కోసం ఒకేసారి భారీగా కొనేశారు. అప్పు చేసి కొని.. కోల్డ్ స్టోరేజీల్లో దాచారు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన రుణంలో సుమారు రూ.75 కోట్లను వెచ్చించి వెన్న కొన్నారు. తర్వాత దాన్ని విశాఖ, హైదరాబాద్లోని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచారు. స్థానిక కోల్డ్ స్టోరేజీల్లో అయితే ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుందని, అందుకే ఆ నగరాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టినట్టు సమర్ధించుకుంటున్నారు. అసలు కొనడమే అనవసరమని రైతులు వాపోతుంటే కొని ఎక్కడో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టామని చెప్పుకోవడం ఏమిటనే ప్రశ్నలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సుమారు వెయ్యి టన్నుల వెన్నను అతికష్టం మీద వినియోగించారు. రాబోయే రెండు నెలల్లో మహా అయితే మరో 500 టన్నులు వినియోగించే అవకాశం ఉంది. ఇంకా 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది. చివర్లో దీన్ని చిన్న డెయిరీలకు ఎంతోకొంతకు అమ్మి వదిలించుకోవాల్సిందే. దీనివల్ల సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లనుంది. చైర్మన్కు మాత్రం ముందే భారీగా లాభం సమకూరింది. పాల పొడి కొనుగోళ్లలోనూ కమీషన్ల పర్వం పాల పొడి కొనుగోళ్లలోనూ ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమీషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్, వెన్న కొనేవారు. ఆంజనేయులు చైర్మన్ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నారు. హర్యానా ఫుడ్స్, బోయీ బాబా, స్టెర్లిన్ ఆగ్రో, మధు డైరీస్ వంటి సంస్థల వద్ద వీటిని కొనడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్టే. కానీ.. కమీషన్లు భారీగా ముడుతుండటంతో చైర్మన్కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి వల్ల విజయ బ్రాండ్ మసకబారుతోందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలకవర్గాన్ని సాగనంపకపోతే విజయ డెయిరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
వైరల్: పితకకుండానే పాలొచ్చేస్తున్నాయి.. ఆవు నుంచి ‘పాలధార’
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఎన్వీఆర్ కండ్రిగలో ఓ ఆవు పాలు పితకకుండానే ఇస్తోంది. చూడి కట్టకనే.. ఈత ఈనకుండానే .. పొదుగు లేకున్నా.. ఆవుకు పాలు కారడాన్ని వింతగా మారింది. ఈ వార్త వైరల్గా మారింది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఆవు ఉంది. ఆదివారం పితకుండానే పాలు కారుతుండడాన్ని రైతు గుర్తించాడు. దీంతో పితకగా ఆ ఆవు రెండు లీటర్ల పాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా హాట్టాపిక్ అయ్యింది. ఇలా ఆవు పాలు ఇవ్వడంపై వడమాలపేట పశువైద్యశాల లైవ్స్టాక్ ఆఫీసర్ లోకనాథం వివరణ ఇచ్చారు. పశువుల్లో హర్మోన్ల సమస్యతో ఇలా జరుగుతుంటుందని తెలిపారు. -
Milk Wasted: 2 వేల లీటర్లు నేల‘పాలు’
దొడ్డబళ్లాపురం: నాణ్యత లేదనే సాకుతో దొడ్డ పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో 2 వేల లీటర్ల పాలను మురుగుకాలువలో పారబోశారు. బమూల్ సిబ్బంది చర్యను పాల రైతులు తీవ్రంగా ఖండించారు. దొడ్డ తాలూకాలో రైతుల నుండి తీసుకుంటున్న పాలలో నాణ్యత లోపించిందని సిబ్బంది చెప్పారు. ఎస్ఎన్ఎఫ్ 8.5 కంటే తక్కువైతే పాలపొడి తయారీకి పనికిరావన్నారు. పొదుగువాపు రోగం ఉన్న ఆవుల నుండి తీసిన పాలు, పాచి కట్టిన క్యాన్లలో తీసుకువచ్చే పాలు వేస్తుండడం వల్ల పాలు నాణ్యత లోపిస్తున్నాయన్నారు. నేలపాలు చేయడానికి బదులు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచితంగా అందజేసినా బాగుండేదని రైతులు అన్నారు. -
పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్
రాయవరం: మండే ఎండల్లో ఎవరికైనా దప్పిక వేయడం సహజం. దాహార్తితో అల్లాడుతున్న ఓ వానరానికి ఓ వ్యక్తి గ్లాసులో కూల్డ్రింక్ పోసి దాని సమీపంలో ఉంచాడు. ఒక్క ఉదుటున దానిని అందుకున్న ఆ వానరం కూల్డ్రింక్ను ఆత్రంగా తాగుతూనే.. తన బిడ్డకు చనుబాలు ఇచ్చిన అపురూప దృశ్యాలివి. రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో ‘సాక్షి’ కంటపడ్డాయి. గ్లాసులో ఉన్నది ఏమిటబ్బా! తాగి చూస్తే పోలా! అమ్మా.. నాకు ఇవ్వవా మరి..! నువ్వు నా పాలు తాగు.. నేను ఈ డ్రింక్ తాగుతా -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్లో గుజరాత్లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్ల్యాండ్లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్గా ఆమెనే చెబుతారు. -
పాలు పోయడానికి వచ్చా..ఓట్లివ్వండి
26 ఏళ్ల అరితా బాబూ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి పాలు పితికి 15 ఇండ్లకు పాలుబోసి ప్రచారానికి బయలుదేరుతుంది.కేరళ ఎన్నికలలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన ఎం.ఎల్.ఏ అభ్యర్థి.పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పాల అమ్మకాన్ని జీవనాధారం చేసుకున్న అరిత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చాక కూడాపాల వాడికీలకు వెళ్లి పాలుపోయడం మానలేదు. ‘పాలు గిన్నెలో పోసే క్షణంలోనే ఆ ఇంటి కష్టం సుఖం నాకు తెలిసిపోతాయి. ఎం.ఎల్.ఏ అభ్యర్థికి అంతకన్నా ఏం కావాలి’ అంటోంది. ఆమె ఉత్సాహం, ఊపు అక్కడ పెద్ద వార్త. నిన్న మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. అయితే ఆమె తమిళనాడు వెళ్లలేదు. కేరళకు వచ్చారు. కేరళలో కూడా చాలా నియోజకవర్గాలు ఉండగా మొదట అలెప్పుజా జిల్లాలోని కాయంకులం నియోజకవర్గానికి వెళ్లారు. ఏప్రిల్ 4న జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరితాబాబును తన జీప్ ఎక్కించుకుని రోడ్ షో చేశారు. ‘అరితా... నువ్వు కేరళ భవిష్యత్తువి’ అన్నారు. ఆ తర్వాత అరిత ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరించారు కూడా. కేరళలో అత్యంత చిన్న వయస్కురాలైన అసెంబ్లీ అభ్యర్థిగా వార్తల్లో ఉన్న 27 ఏళ్ల అరితా బాబు హవా అది. కేరళ సినీరంగంలో గొప్ప కమెడియన్గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న సలీమ్ కుమార్ అరితా బాబు నామినేషన్ వేస్తుంటే స్వయంగా వచ్చి తోడు నిలిచాడు. ఆమె గెలవాలి... అందుకు నేను సాయపడతాను అన్నాడు. అరితా బాబుది వెనుకబడిన సామాజికవర్గం. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త. వాళ్లు ఆవు పాలు అమ్ముకుని జీవిస్తుంటారు. అరితా తండ్రి ప్రభావంతో కాలేజీ రోజుల నుంచే చురుగ్గా విద్యార్థి రాజకీయాల్లో పాల్గొంది. ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో పని చేసింది. 2015లో జరిగిన స్థానిక ఎన్నికలలో పంచాయతీ సర్పంచ్గా గెలుపొంది ఐదేళ్లు పదవిలో ఉంది కూడా. సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అరితా తండ్రికి కేన్సర్ రావడంతో ఇంటి బాధ్యత తీసుకుంది. ఆవు పాలు పితికి ఇళ్లకు వేయడం ఆమె పని. అందుకోసం రోజూ తెల్లారి నాలుగుకు లేచి ఆరు గంటలకు పాల క్యాన్లు తీసుకుని టూ వీలర్ మీద బయలుదేరుతుంది. అలాంటి అరిత ఈసారి ఎం.ఎల్.ఏ కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పార్టీ అనుకుంది. యు.డి.ఎఫ్ అభ్యర్థిగా ఆమెను కాయంకులంలో నిలబెట్టింది. ప్రతి గడప కష్టం నాకు తెలుసు ‘పాలు పోయడానికి గడప గడప తిరిగే నాకు తెలియని కష్టం లేదు. నా నియోజక వర్గానికి ఏం కావాలో నాకు తెలుసు. ఇక్కడ టూరిజమ్ పరిశ్రమను అభివృద్ధి చేసి ఉపాధి పెంచాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. ఉపాధి పెంచడం గురించే నేను ఎక్కువ కృషి చేస్తాను’ అంది అరిత. అయితే అరితకు ఈ గెలుపు సులభమా? కాయంకులం నియోజక వర్గం నుంచి గత మూడు ఎలక్షన్లలో ఎల్.డి.ఎఫ్ అభ్యర్థులే గెలుస్తున్నారు. గత ఎలక్షన్లలో కూడా సి.పి.ఎం అభ్యర్థి అయిన ప్రతిభ గెలిచింది. ఆమెను మళ్లీ ఆ పార్టీ నిలబెట్టింది. దాంతో ఇద్దరు మహిళా అభ్యర్థులు హోరాహోరీగా పోరాడే నియోజకవర్గంగా కాయంకులంను పరిశీలకులు గుర్తిస్తున్నారు. ‘ఈసారి పార్టీ అభ్యర్థులపై రాహుల్ గాంధీ ముద్ర ఉంది. ఆయన కొత్త, యువ అభ్యర్థులకు ఎక్కువ చోటిచ్చారు. నాలాగే ‘రూపాయి లాయర్’గా పేరొందిన బి.ఆర్.ఎం.షఫీర్కు కూడా సీటు ఇచ్చారు. మేమంతా పరిపాలనలో ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం’ అంది అరిత. ఎలక్షన్లలో డబ్బు ఖర్చు సంగతి తెలిసిందే. అరితా దగ్గర తన టూ వీలర్, కొన్ని ఆవులు తప్ప మరేం లేవు. ప్రచారం అంతా పార్టీ చూస్తోంది. ‘నేను శ్రేష్ఠమైన పాలు పోస్తాను. కనుక కల్తీ లేని పాలన కూడా అందిస్తానని నా నియోజకవర్గం ప్రజలు భావించి నాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది’ అంది అరితా. ఆమె గెలుపు ఏమయ్యిందో ఇంకో పది రోజుల్లో తెలుసుకుందాం. -
ప్రశాంతమైన నిద్రకు ఈ ఐదు తినండి!
మీరు తీసుకున్న ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హైప్రోటీన్ డైట్ అయినా అది నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిద్రానిపుణులు. రాత్రి ఆహారానికి, నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుందంటున్నారు శామీ మార్గో అనే ప్రముఖ స్లీప్ ఎక్స్పర్ట్. ఆమె ఇటీవలే ‘ద గుడ్ స్లీప్ గైడ్’ అనే పుస్తకం రాశారు. రాత్రివేళల్లో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది నిద్రపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు శామీ మార్గో. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు... ఈ ఐదూ నిద్రను దూరం చేస్తాయనీ, అయితే... అరటిపండ్లు, బాదం (ఆల్మండ్స్), తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు... ఈ ఐదూ ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మంచి ఆహారాలని పేర్కొన్నారు శామీ. తగ్గుతున్న అడవులూ... పెరుగుతున్న దోమలూ, వ్యాధులు! ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. ఫలితంగా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వంటి దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులూ, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని బెంబేలెత్తుతున్నారు. ఇది డిసీజ్ బర్డెన్ పెంచడంతో పాటు పర్యావరణాన్నీ మరింతగా దెబ్బతీసి మరిన్ని ఉత్పాతాలకు కారణమవుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. -
మరో పిడుగు : భారీగా పెరగనున్న పాల ధర
సాక్షి, భోపాల్ : ఒకవైపు ఆకాశాన్నంటుతున్న పెట్రోలు ధరలు, మరోవైపు వంటగ్యాస్ ధర పెంపు సగటు భారతీయుడి నెత్తిన పెనుభారాన్నిమోపుతున్నాయి. పెట్రో ధరల సెగ నిత్యావసరాలు, రవాణా, ఇతర రంగాలపై పడుతుందన్న ఆందోళన నేపథ్యంలో మరో బాంబు ప్రజల నెత్తిన పడనుంది. ఇప్పటికే భారీ పెరిగిన ఉల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.. తాజాగా పాల ధర కూడా భగ్గుమనేందుకు సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దేశంలో కూడా ధర భారీగా పెరగనుందన్న ఆందోళన వినియోగదారులను మరింత బెంబేలెత్తిస్తోంది. (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) డీఎన్ఏ సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 25 గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల ఉత్పత్తిదారు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 23న నిర్వహించిన సమావేశంలో లీటరుపై రూ.12 పెంచేందుకు నిర్ణయించారు. సంబంధిత అధికారుల అనుమతి అనంతరం మార్చి 1 నుంచి ధర పెంపును అమలు చేయనున్నారు. ఈ ధర అమల్లోకి వస్తే, లీటరు పాల ధర రూ .55 పలకనుంది. అంటే ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 చెల్లించాల్సి ఉంటుందన్న మాట. గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు. కానీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడిందని ఇపుడిక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ అధ్యక్షుడు హిరలాల్ చౌదరి వెల్లడించారు. -
పాడి రైతుకు సిరులు కురిపించే అమూల్ ఒప్పందం
గుజరాత్లోని కైరా జిల్లాలో పాల రైతులు దళారీల నుండి దోపిడికి గురవుతున్న నేపథ్యంలో 1942లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాతో స్వాతంత్య్ర సమర యోధుడు, రైతు ఉద్యమ నేత త్రిభువన్ దాస్ కిషీ భాయ్ పటేల్ నేతృత్వంలో 1946 డిసెంబర్ 14న కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పారు. అంతక్రితం పాల్సన్ డైరీ రైతుల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి బొంబాయి మార్కెట్లో అధిక ధరలకు అమ్మి లాభాలు గడిం చేది. రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దాన్ని ఎదుర్కొనడానికి ఆవిర్భవించిన సంఘమే అనంత రకాలంలో అమూల్గా రూపాంతరం చెందింది. అమెరికాలో డైరీ ఇంజనీరింగ్ చేసి స్వదేశానికి వచ్చిన డాక్టర్ వర్గీస్ కురియన్ త్రిభువన్ దాస్ పటేల్ ప్రోత్సాహంతో పాడి రైతులకు బాసటగా నిలబడ్డారు. వీరిద్దరి నేతృత్వంలో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్(అమూల్) ఆవిర్భవించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అనేక అవా ర్డులు సాధించింది. పాల సేకరణలో ప్రపంచంలోనే అమూల్ 8 వ స్థానంలో నిలిచింది. అమూల్ ఒక బ్రాండ్ కాదు... ఒక ఉద్యమానికి ప్రతీక. పాడి రైతుకు మంచి ధర ఇచ్చి పాలు కొనుగోలు చేయడం, తనకు వచ్చే ఆదా యంలో కొంత మొత్తాన్ని బోనస్ రూపంలో ఏటా రైతులకు ఇవ్వడం ఆ సంస్థ విశిష్టత. కురియన్ 1921 నవంబర్ 26 న జన్మించి 2012 సెప్టెంబర్ 9న 91వ సంవత్సరంలో మరణించే వరకూ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయన సేవాతత్పరతకు, అంకితభావానికి గుర్తిం పుగా 1965లో పద్మశ్రీ, 1989లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1996లో పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్, అవార్డులు లభించాయి. కురియన్ నిరంతర కృషి కారణంగానే పాల ఉత్పత్తులలో మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థానానికి ఎగబాకింది. 2006 నుంచి 2011 వరకూ అలహాబాద్ విశ్వ విద్యాలయానికి మొదటి ఛాన్సలర్గా కురియన్ సేవలందించారు. 30 విశిష్ట సంస్థలను స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపచేస్తూ, ఆ సంస్థ లను నిపుణులతో అనుసంధానం చేశారు. గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కురియన్ను నేష నల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వ్యవస్థాపక చైర్మన్గా నియమించారు. కేరళలో క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండి యాగా, శ్వేత విప్లవ పితామహుడుగా ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. పాడి పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచశ్రేణి సంస్థలతో మనం పోటీ పడేవిధంగా తీర్చిదిద్దిన ఘనత కురియన్దే. రైతు లకు మంచి ధర ఇచ్చి పాలు సేకరించడం, వాటిని వినియోగదారులకు వీలైనంత తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా అమూల్ కృషి చేస్తోంది. 1948 జూన్లో కేవలం రెండు గ్రామాలనుంచి రెండు వందల యాభై లీటర్ల పాలు సేకరించిన అమూల్ నేడు గుజరాత్లో 36 లక్షల మంది రైతుల నుంచి సేకరించే స్థాయికి ఎదిగింది. పాడి రైతులకు వరం ఇలాంటి మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర పాడి రైతులకు వర మని చెప్పాలి. ఈ ఒప్పందంతో ఇకపై దోపి డీకి గురయ్యే పరిస్థితి రైతుకు ఎదురుకాదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్య అన్ని రాష్ట్రాలకూ ఆదర్శనీయం. పశుసంపదలో మన రాష్ట్ర వాటా 8.4 శాతం. పాల ఉత్పత్తిలో 7.6 శాతం. ఇక్కడ సుమారు 60 లక్షల గేదెలు, 40 లక్షల ఆవులద్వారా రోజూ 412 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతు న్నాయి. ప్రతి రోజు హెరిటేజ్ లాంటి వివిధ పాల కంపెనీలు 69 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. 123 లక్షల లీటర్లు స్వీయ వినియోగానికి కేటా యిస్తుండగా 219 లక్షల లీటర్లు అసంఘటిత విభా గంలో సేకరిస్తున్నారు. అమూల్ ప్రవేశంతో పాల ఉత్పత్తులపై ఆధారపడి ఉన్న 27 లక్షల మంది మహిళల జీవితాల్లో సంతోషం పెల్లుబుకుతుంది. పాడి రైతుకు ప్రతి లీటర్ పాల అమ్మకంలో అద నంగా రూ. 5 నుంచి రూ. 7 వరకూ లబ్ధి చేకూరు తుంది. ఇది మహా విప్లవం అనుకోవచ్చు. ఇంత వరకూ జరిగిన ఆర్ధిక దోపిడీ దీంతో ఆగుతుంది. ప్రస్తుతం పాల సేకరణ ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభం కాగా త్వరలో ఇది అన్ని జిల్లాలకూ విస్తరించి కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులకు దోహదపడుతుంది. అమూల్ తో ఒప్పందం చరిత్రాత్మకమైన నిర్ణయం. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపే నిర్ణయం. దోపిడీ వ్యవస్థను అరికట్టే నిర్ణయం. పాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం చేరుకోవడానికి దోహదపడే నిర్ణయం. ఆవు పాలను గేదె పాలలో కలిపి అధిక ధర లకు అమ్మి వివిధ పాలసేకరణ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు గడించాయి. వాటి లక్ష్యం రైతుల నుండి వీలైనంత తక్కువ ధరకు పాలు సేకరించడం వినియోగదారులకు వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి అత్యధిక లాభాలు గడించడం. అమూల్ రాకతో వీరి దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లీటర్కు అదనంగా ఇస్తున్న నాలుగు రూపాయలతో పాల రైతులు మంచి ధర పొందటానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలో 264 మిలియన్ల ఆవులు, గేదెల ద్వారా దాదాపు 600 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ తలసరి పాల ఉత్పత్తి సంవత్సరానికి ఒక ఆవుకు 2200 లీటర్లుగా ఉంది. మన దేశం 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఉండగా అమెరికా 94 మిలియన్ టన్నులతో రెండో స్థానం, 45 మిలియన్ టన్నులతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. తదుపరి స్థానాల్లో పాకిస్తాన్, బ్రెజిల్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, టర్కీలున్నాయి. దేశంలో మనది మూడో స్థానం. అమూల్తో చెలిమివల్ల మొదటి స్థానానికి చేరడానికి ఎంతో కాలం పట్టదు. వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్: 99499 30670 -
దారుణం: ఐదేళ్ల బిడ్డకు పాలలో విషమిచ్చి..
టీ.నగర్(తమిళనాడు): పేదరికం కారణంగా ఐదేళ్ల బిడ్డకు పాలలో విషమిచ్చి కడతేర్చి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. విల్లుపురం పాపానకుళం ప్రాంతానికి చెందిన అన్వర్బాషా కుమారుడు సాధిక్బాషా (35) ప్రైవేటు బస్ కండక్టర్. ఇతని భార్య యాస్మిన్ (28). వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా సాధిక్బాషా పనిలేక ఇంట్లో ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతనెల 28న ఐదు నెలల చిన్నారికి యాస్మిన్ పాలుపట్టి పడుకోబెట్టింది. మరుసటి రోజున బిడ్డ మృతిచెందింది. సాధిక్బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విల్లుపురం వెస్ట్ పోలీసులు విచారణ జరిపారు. పోస్టుమార్టం నివేదిక గురువారం వచ్చింది. అందులో బిడ్డకు పాలలో విషమిచ్చి చంపినట్లు తెలిసింది. దీంతో తల్లి యాస్మిన్ను పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై) భార్యను కడతేర్చి భర్త ఆత్మహత్య: సెమ్మంజేరి సునామీ క్వార్టర్స్కు చెందిన నారాయణన్ (70). ఇతని భార్య మనోన్మణి (48). భార్యపై నారాయణన్కు అనుమానం రావడంతో దంపతులు మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన నారాయణన్ మనోన్మణిపై బండరాయితో దాడి చేసి హతమార్చాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెమ్మంజేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..) -
ఎంగిలి చేసిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు
-
ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా
సాక్షి, హైదరాబాద్ : మీరు రోజు పాలు తాగుతారా.. అయితే ఈ వార్త చదవకపోవడమే మంచిది. సాధారణంగా పాలలో నీళ్లు కలుపుతారన్న మాట నిజమే.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి మాత్రం పాలు తాగాలనిపించదు. డబీర్పురకు చెందిన మహ్మద్ సోహైల్ డైరీ ఫాం నడుపుతున్నాడు. తాజాగా మహ్మద్ సోహైల్ గేదెల నుంచి పాలు పిండాడు. తర్వాత ఆ పాలను ఒక గ్లాస్లో పోసుకొని సగం తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అనంతరం గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.(చదవండి : కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, వ్యక్తి ఆరెస్ట్) మహ్మద్ సోహైల్ చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రజలు తాగే పాలను ఇలా అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తికి అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డబీర్పుర పోలీసులు డైరీ ఫామ్ యజమాని సోహైల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పాలు తాగించబోతే తిరిగి పాలిస్తున్న మగ మేక
జైపూర్: అవు పాలలోనే కాదు, మేక పాలలోనూ పోషకాలు ఉంటాయి. కానీ అవి అదో రకమైన వాసన రావడం వల్ల ఎవరూ పెద్దగా తాగడానికి ఇష్టపడరు. మరి మగ మేక పాలు కూడా ఇలాగే ఉంటాయా? ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని విసుక్కోకండి. ఓ చోట నిజంగానే మగ మేక పాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విడ్డూరం రాజస్థాన్లో బయటపడింది. ఢోల్పూర్లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మగ మేకను పెంచుకుంటున్నాడు. (వీటిలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?) అది పాలివ్వడం గురించి ఆయన మాట్లాడుతూ.. "దాన్ని రెండున్నర నెలల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. ఆరు నెలల వయసొచ్చేసరికి దానికి పొదుగులు వచ్చాయి. మేకకు పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే అదే తిరిగి పాలిచ్చింది. రోజుకు 200- 250 గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తుంది" అని తెలిపారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే ఇలా జరుగుతుందని వెటర్నటీ సర్జన్ జ్ఞాన్ ప్రకాశ్ సక్సేనా వివరించారు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు. (ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య) -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్నైట్లో స్టార్స్ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్పూర్కు శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా రైల్వే స్టేషన్లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’) మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్పీఎఫ్ జవాన్ పాల ప్యాకెట్ కొని తెచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! ) दिनांक 14 जून 2020 को हटिया रेलवे स्टेशन पर ट्रेन संख्या 06563 बेंगलुरु से गोरखपुर जाने वाली श्रमिक स्पेशल ट्रेन का सुबह 06:00 बजे आगमन हुआ. इस ट्रेन से यात्रा कर रही एक महिला यात्री (नाम- मेहरून्निसा )ने स्टेशन पर कार्यरत रेल सुरक्षा बल की महिला कर्मचारी ASI, श्रीमती 1/2 pic.twitter.com/KVj52XEYZp — DRM Ranchi (@drmrnc) June 14, 2020 -
పాల కుమార్
శివకుమార్కి టీ స్టాల్ ఉంది. లాక్డౌన్కి ముందు రోజుకు 600 నుంచి 700 వరకు రాబడి ఉండేది. ఇప్పుడు సగానికి డౌన్ అయిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి డౌన్ కానిది ఒక్కటే. అతడిలోని ‘ఇచ్చే గుణం’. వంబన్లో అందరికీ తెలిసిన భగవాన్ టీ స్టాల్ అతడిదే. పిల్లలకు ఆవు పాలు ఉచితం అందులో. శివకుమార్ వయసు 42. మొదట్లో రైతు కూలీ. కన్న బిడ్డలకు పాలు కూడా కొనలేని రోజులు ఉన్నాయి అతడి జీవితంలో. మరొకరికి ఆ దుర్భరతను రానివ్వకూడదనుకున్నాడు. పేద రైతు కూలీలు ఎక్కువగా ఉండే వంబన్.. తమిళనాడులోని పుదుకొట్టయ్ జిల్లాలో ఉంది. ఆ ఊరి పిల్లలు పాలకు ఏడవకుండా శివకుమార్ ఉన్నాడు. -
రియల్ హీరోగా మారిన కానిస్టేబుల్
-
ఒంటె పాలు@ 600
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వేళ నగరంలో ఉంటున్న వలస జీవులు సొంత ప్రాంతాలకు తరలిపోతుండగా...రాజస్థాన్కు చెందిన కొందరు ఒంటెల యజమానులు మాత్రం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. తద్వారా కొద్దిగా ఆదాయం వస్తోందని వారు పేర్కొన్నారు. శుక్రవారం కొందరు ఒంటెల్ని మలక్పేట వద్ద నిలిపి మేత వేసి...నీళ్లు తాపించారు. -
పాలను వేడి చేస్తే ప్లాస్టిక్గా మారింది
ఉడికిస్తే పాలు ప్లాస్టిక్ పదార్థంగా తయారైంది. లాగితే సాగుతోంది. భూమికి కొడితే బంతిలా లేచింది. దీంతో అందోళన చెందిన వినియోగదారులు కల్తీ పాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాన్సువాడ: పాలను ఉడికిస్తే ప్లాస్టిక్ పదార్థంలా మారి నేలకేసి కొడితే బంతిలా ఎగరడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బుధవారం ఈ చోద్యం చోటుచేసుకుంది. స్థానిక రాజారాం దుబ్బలో నివాసం ఉండే అస్లామ్ ఓల్డ్బాన్సువాడలో గల పాల కేంద్రం నుంచి లీటర్ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వేడి చేయగా అవి పగిలిపోయాయి. అయితే పగిలిపోయిన పాలను వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామనే ఉద్దేశంతో మరిగించగా ఆ పాలు కాస్త ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. ఆ ముద్దను ఎంత లాగినా ప్లాస్టిక్ లాగే ఉండడం, తినడానికి ప్రయత్నిస్తే ప్లాస్టిక్ వాసన రావడంతో అవాక్కయ్యారు. దీంతో ఆందోళన చెందిన అతను బాన్సువాడ డీఎస్పీ దామోదర్రెడ్డికి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన డీఎస్పీ, అదే పాలకేంద్రం నుంచి మరో లీటర్ పాలను తీసుకువచ్చి ఆ పాలను పగిలిపోయేలా చేసి వేడి చేయగా, అది కూడా ప్లాస్టిక్ ముద్దలా తయారైంది. దీంతో పాలలో రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసి, ఆ పాల కేంద్రాన్ని సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. లీటర్కు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న ఆ పాలలో రసాయనాలు కలిపి చిక్కగా మారే విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు. పాలలో రసాయనాలు కలపడం వల్ల అది కల్తీ అయి, ప్లాస్టిక్గా మారుతోంది. స్వయాన పరిశీలించాను. పెరుగు కూడా ప్లాస్టిక్గా తయారవుతోంది. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సమగ్ర విచారణ చేస్తారు. ఆయనకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, శాంపిల్స్ను సేకరిస్తారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటాం. – దామోదర్రెడ్డి, డీఎస్పీ పాలను వేడి చేస్తే ప్లాస్టిక్గా మారింది పాల కేంద్రం నుంచి నేను లీటర్ పాలను ఇంటికి తీసుకెళ్లాను. అవి పగిలిపోయాయి. వేడి చేసి చక్కెర కలిపి పిల్లలకు ఇద్దామనుకున్నాం. వేడి చేయగా అవి పూర్తిగా ప్లాస్టిక్లా మారింది. దాన్ని ముద్ద చేస్తే ప్లాస్టిక్ బంతిలా తయారైంది. వెంటనే డీఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాను.–అస్లామ్, పాలను కొనుగోలు చేసిన వ్యక్తి -
వైరల్: ‘ఎవరూ ఇలా ఆలోచించి ఉండరు’
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా పాలు పంపిణీ చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐఏఎస్ అధికారి నితిన్ సవాంగ్ శుక్రవారం షేర్ చేశారు. ఈ ఫొటోకు ‘ఈ వ్యక్తి కరోనా నుంచి తనను మాత్రమే సురక్షితంగా ఉంచడమే కాకుండా ఇతరులను కూడా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక ‘‘మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ఇంట్లోనే ఉండటం, మాస్క్లు ధరించడం, చేతులకు గ్లౌజ్లు ధరించడం చేస్తున్నారు. కానీ ఇతడిలా ఏ ఒక్కరూ కూడా ఆలోచించి ఉండరు’’ అంటూ రాసుకొచ్చారు. (ఇర్ఫాన్ విషయంలో పెద్ద తప్పు చేశా: నటుడు) Good to see that some people go extra mile to keep themselves and others safe. Let's do basic minimum things of staying at home, wearing mask and keeping social distance even if we cannot go an extra mile like this innovative milkman. pic.twitter.com/RrjYVtdaKW — Nitin Sangwan, IAS (@nitinsangwan) May 7, 2020 ఈ ఫొటోలో ఆ వ్యక్తి తన మోటారు సైకిల్పై పాలు పంపిణీ చేస్తున్నాడు. అతను చేతులకు గ్లౌజ్లు, మొహనికి మాస్క్లు, ధరించడమే కాకుండా తన కస్టమర్ల నుంచి భౌతిక దూరం పాటించడానికి వినూత్న ఆలోచన చేశాడు. తన మోటరు సైకిల్ పోడవైన పైపును అమర్చి చేసి వినియోగదారులకు పాలు పోయడానికి ఉపయోగించిన అతని ఆలోచనకు నెటిజన్లంతా ఫిదా అవుతన్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్లో వివిధ పరిశ్రమలు, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం నిత్యవసర సేవలకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. (పెళ్లిపై స్పందించిన సల్మాన్ ప్రియురాలు!) -
కరోనా కాలంలోనూ ‘క్షీర ధార’
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలోనూ పశు సంపదకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మేపు మొదలు పాల ఉత్పత్తుల వరకు వేటికీ కొరత ఏర్పడలేదు. పైగా ఈ సమయంలో పాడి పరిశ్రమ వ్యవస్థీకృతమైంది. మార్కెట్ స్థిరీకరణకు తోడ్పడింది’ అని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి తో మాట్లాడుతూ.. లాక్డౌన్ తొలి నాళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ కొంత ఇబ్బంది పడినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేద న్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ► గత ఏడాదితో పోలిస్తే పాల సేకరణ ధర పెరిగింది. గత ఏడాది 10 శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటర్ రూ.56 ఉంటే.. ఇప్పడు రూ.63 అయ్యింది. పాల సేకరణ కూడా పెరిగింది. ► టీ స్టాల్స్ మూత పడటంతో పాల వినియోగం తగ్గిన మాట వాస్తవమే. కానీ.. గతంలో బయట టీ సేవించే వారంతా ఇప్పుడు ఇళ్లల్లోనే ఒకటికి రెండుసార్లు తాగుతు న్నారు. అందువల్లే ఇళ్లల్లో పాల వినియోగం పెరిగింది. ► ఎప్పటిలానే లాక్డౌన్ వేళ కూడా 48 లక్షల నుంచి 50 లక్షల లీటర్ల పాలను డెయి రీలు సేకరిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డెయిరీలు రైతులకు బోనస్ చెల్లించాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్లు లేకపోవడంతో బల్క్ కర్డ్ (పెరుగు బకెట్లు) విని యో గం తగ్గినా.. రిటైల్ విని యోగం బాగా పెరిగింది. ► వేసవి కనుక సహజంగానే పచ్చిగడ్డి తక్కువగా ఉం టుంది. ఎండు మేతకు, దాణాకు కొరత లేదు. ఈ ఏడాది రబీలో వాతావరణం అనుకూలించి రికార్డు స్థాయిలో పంటలు సాగవటంతో ఎండుగడ్డికి ఇబ్బంది లేదు. ► లాక్డౌన్ సాకుతో పశువుల మేతను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే కాల్ సెంటర్ నంబర్ 1962కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ► డెయిరీలు, డెయిరీ సంబంధిత కర్మాగారాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ నాయకత్వంలో కమిటీలు ప్రతి జిల్లాలో చురుగ్గా పని చేస్తున్నాయి. ► వేసవి తీవ్రమవుతున్నందున వడగాడ్పుల నుంచి పశువులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. నీడ పట్టున ఉంచే మార్గాలు చూడాలి. ► ఎండ నుంచి వచ్చిన పశువుల్ని చన్నీటితో కడిగితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. -
రాజస్తాన్ నుంచి ఒడిశాకు ఒంటె పాలు
భువనేశ్వర్: ఆటిజమ్, ఫుడ్ అలర్జీలతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి రాజస్తాన్ నుంచి ఒంటె పాలు సరఫరా చేయడం ద్వారా రైల్వే శాఖ తన మానవతను చాటుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజస్తాన్లోని ఫల్నా ప్రాంతం నుంచి ఒడిశాలోని బెహ్రంపూర్కు ఈ ఒంటెపాలు సరఫరా చేయడం విశేషం. పార్సిల్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ద్వారా ఢిల్లీ, హౌరా మీదుగా పాలు ఒడిశా చేరాయని, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో బాలుడి బంధువుకు పాలు అందజేశామని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 20 కిలోలున్న ప్యాకేజీ కోసం రూ.125 వసూలు చేశామని తెలిపింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమం సేతు ద్వారా దీనిని చేపట్టామని అధికారులు తెలిపారు. ఆటిజమ్, ఫుడ్ అలర్జీలు ఉన్న బాలుడికి ఒంటెపాలు ఎంతో మేలు చేస్తాయని బాలుడి బంధువు చందన్ కుమార్ ఆచార్య తెలిపారు. సేతు కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అత్యవసరమైన మందులు, ఇతర పదార్థాల సరఫరా సాఫీగా జరిగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 100 ప్రాంతాల్లో అత్యవసరమైన పదార్థాలను సరఫరా చేశామని తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రంతోనూ తాము పనిచేశామని, మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు, వెంటిలేటర్లు, ఎరువులు, కొన్ని ముడిసరుకులను దేశవ్యాప్తంగా రవాణా చేశామని వివరించారు. కరోనా వైరస్: మరో దుర్వార్త -
నష్టాల పాలు!
సాక్షి, సిటీబ్యూరో: అన్ని వయసులవారికీ పౌష్టికాహారం పాలు. గ్రేటర్కు వీటి సరఫరా సమృద్ధిగా ఉన్నా.. డిమాండ్ అంతంతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం పలు సహకార, ప్రైవేట్ పాల డెయిరీలకు నష్టాలనే మిగిలిస్తోంది. సాధారణ రోజుల్లో మహానగరానికి నిత్యం వివిధ డెయిరీలకు సంబంధించి సుమారు 30 లక్షల లీటర్ల పాల వినియోగం ఉండేది. లాక్డౌన్ అనంతరం డిమాండ్ అనూహ్యంగా పడిపోయింది. సకల వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాలు స్తంభించడంతో మెజారిటీ సిటీజన్లు పల్లెబాట పట్టడం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, టీస్టాళ్లు మూతపడడం, పాల ప్యాకెట్లు ఇంటింటికీ సరఫరా చేసే డెలివరీ బాయ్స్ అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ సుమారు 10 లక్షల లీటర్ల మేర తగ్గిందని.. దీంతో సిటీకి అన్ని డెయిరీలు విక్రయించే పాలను కలిపినా వాస్తవ సరఫరా 20 లక్షల లీటర్లు మించడం లేదని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం గృహ వినియోగానికి సంబంధించిన పాల వినియోగంలో సుమారు 20 శాతం.. వాణిజ్య విభాగమైన హోటళ్లు, ఫంక్షన్హాళ్లకు సరఫరా చేసే మొత్తంలో సుమారు 50 శాతం కోత పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన డిమాండ్ ఇలా.. కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్ నగరానికి నిత్యం సుమారు 57 సహకార, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలకు చెందిన పాలు గతంలో సుమారు 30 లక్షలు.. ఇప్పుడు 20 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగంలో 20 శాతం.. వాణిజ్య విభాగంలో 50 శాతం వినియోగం తగ్గడం గమనార్హం. సాధారణంగా అన్ని వ్యవస్థీకృత డెయిరీలు విక్రయంచే పాలు 60 శాతం జనాభాకు సరఫరా అవుతున్నాయి. మరో 40 శాతం మందికి పాల విక్రయాలు ఇంటింటికీ స్కూటర్పై తిరిగి పాలను విక్రయించే వారు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి మిల్క్ వెండర్స్కు డిమాండ్, సరఫరాలో పెద్దగా కోత పడలేదు. ప్రధానంగా డెయిరీ పాలపైనే లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మెజారిటీ సిటీజన్లు సొంత గ్రామాలకు వెళ్లడం, హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాళ్లు, ఫంక్షన్ హాళ్లు మూతపడడం, డెలివరీ బాయ్స్ విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో డిమాండ్ తగ్గింది. పాల ఉత్పత్తులకు గిరాకీ అంతంతే.. పాలతో తయారయ్యే ఉత్పత్తులు పెరుగు, పన్నీర్, లస్సీ, స్వీట్స్ దూద్పేడా, ఐస్క్రీమ్స్, వెన్న తదితర ఉత్పత్తులకు కూడా డిమాండ్ అనూహ్యంగా పడిపోయిందని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. నగరంలో వివాహాది శుభకార్యాలు వాయిదాపడడం, ప్రజలు ఇంటి వంటకే ప్రాధాన్యమివ్వడం, బయటి నుంచి తిను బండారాలు కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు విముఖత చూపడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వల్లభ డెయిరీ నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ అంతగా లేకపోవడంతో పలు డెయిరీలు పాల పౌడర్, వెన్న తయారీ చేసే సంస్థలకు మిగిలిన పాలను సరఫరా చేస్తున్నాయన్నారు. పలు సహకార, ప్రైవేటు డెయిరీలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పలు ప్రధాన డెయిరీలు విక్రయిస్తున్న పాలు.. లీటర్లలో (రోజువారీగా) గమనిక: సాధారణ రోజుల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న పాలకంటే గృహ వినియోగంలో 20 శాతం, వాణిజ్య విభాగంలో 50 శాతం అధికంగా పాలను విక్రయించేవారు. -
నేలపాలైన పాల కోసం కుక్కలతో....
-
నేలపాలైన పాల కోసం కుక్కలతో....
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పొట్టనింపుకునేందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సిగ్గు ఎరగదని... ఈ సంఘటన ఈ నానుడిని మరోసారి గుర్తు చేస్తుంది. నేలపై ఒలికిపోయిన పాలను ఒకవైపు మనిషి ఎత్తిపోసుకునేందుకు ప్రయత్నిస్తే... ఇంకోవైపు కుక్కల గుంపు ఆబగా జుర్రుకోవడం అందరి మనసులను కలచివేసేదే. విషయం ఏమిటంటే.. ఆగ్రాలో తాజ్మహల్కు ఆరు కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం ఓ భారీ పాల వ్యాను బోల్తా పడింది. దీంతో బోలెడన్ని పాలు నేలపై ఒలికిపోయాయి. లాక్డౌన్ కారణంగా తగినంత ఆహారం దక్కని కుక్కల గుంపు ఈ పాలను తాగుతూండగానే...ఓ మనిషి ఈ పాలను ఎలాగైనా వాడుకోవచ్చు అన్న అంచనాతో ఓ మట్టి కుండలో వాటిని చేతులతోనే నింపుకునే ప్రయత్నం కనిపించింది. కమాల్ ఖాన్ అనే వ్యక్తి ఈ విషాద దృశ్యాన్ని వీడియోలో బంధించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి ఆఖరు వారంలో అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పలువురు వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామందికి తినడానికి తిండి కూడా దక్కడం లేదు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి వలస కూలీలకు ఆహారం అందించే ప్రయత్నం జరుగుతున్నా.. కొందరు ఇప్పటికీ తిండికి అల్లాడిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు మూడువారాల లాక్డౌన్ ముగిసిన క్రమంలో మరో రెండు వారాల పాటు పొడిగించిన క్రమంలో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేసింది. పని కోల్పోయిన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుస్తూ స్వస్ధలాలకు చేరుకోగా, మరికొందరు నగరాలు, పట్టణాల్లో చిక్కుకుపోయి పూటగడవని స్ధితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు సబ్సిడీపై ఆహార ధాన్యాలు సమకూర్చింది. మరోవైపు భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 11,000 దాటగా 377 మందికి పైగా మరణించారు. -
‘దూద్ దురంతో’ పార్శిల్ రైళ్లు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఆహార వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో రైల్వేశాఖ ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు రైల్వే పార్శిల్ వ్యాన్లను పట్టాలెక్కించింది. వీటి ద్వారా సరుకుల్ని సరఫరా చేస్తోంది. మూడు రోజుల కిందట సికింద్రాబాద్ నుంచి హౌరాకు తొలి పార్శిల్ రైలు నడిపి 92 టన్నుల ఆహార వస్తువుల్ని తీసుకెళ్లింది. (ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...) శనివారం ఢిల్లీ ప్రజల అవసరాల్ని తీర్చేందుకు గాను రేణిగుంట నుంచి హజరత్ నిజాముద్దీన్కు ‘దూద్ దురంతో’ పార్శిల్ రైళ్లను ప్రారంభించింది. 2.4 లక్షల లీటర్ల పాలు, 23 టన్నుల మామిడి, 23 టన్నుల పుచ్చకాయల్ని ఈ రైళ్లలో తీసుకెళ్లారు. సాధారణంగా పార్శిల్ వ్యాన్ల రైలు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ప్రజల అవసరాల దృష్ట్యా తొందరగా సరుకు చేరాల్సి ఉన్నందున గంటకు 55 కి.మీ. వేగంతో నడుపుతున్నారు. (లాక్డౌన్ దశలవారీగా సడలింపు!) -
15 వేల లీటర్లు నేల‘ పాలు’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. కిరాణా, మందులు, ఆహారం వంటి నిత్యావసరాలను పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ ప్రజలకు, ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సందర్బంగా కొన్ని ఆన్లైన్ సరఫరా సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ సంక్షోభ సమయంలో సేవలందిస్తున్నతాము సెక్యూరిటీ గార్డుల నుంచి దాడులు, పోలీసులనుంచి వేధింపులను ఎదుర్కొంటున్నామని ఆరోపించాయి. అంతేకాకుండా పోలీసుల అత్యుత్సాహం వల్ల ఏకంగా 15 వేల లీటర్ల పాలు, 10వేల కిలోల కూరగాయలను పారవేయవలసి వచ్చిందని వెల్లడించాయి. పాలు, కూరగాయలు, మందులు, ఆహారం, తదితర సరుకులును డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులను పోలీసులు వేధిస్తున్నారని , డెలివరీ బాయ్స్ పై భౌతిక దాడులు కూడా చేశారని ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. తద్వారా లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో అటు జనం, ఇటు తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరారు. గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు తమను దూషించడం, కొట్టడమే కాకుండా, డెలివరీ ఏజెంట్ను అరెస్ట్ కూడా చేశారని బిగ్ బాస్కెట్, ప్రెష్ మెనూ, పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ గణేష్ చెప్పారు. దీంతో తమ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) ‘అన్ని చోట్ల పోలీసులకు ఇది ఒక ముఖ్యమైన సేవ అని తెలియదు, అందుకే వారు చాలా సందర్భాల్లో, కఠినంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలను కొడుతున్నారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కొట్టవద్దు’ అని గణేష్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్న మా రైడర్లను వేధిస్తున్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూసుకోవాలి కదా అంటూ కెప్టెన్ గ్రబ్కు చెందిన కరణ్ నంబియార్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. కేరళలో, రోగికి సేవ చేయడానికి వెళుతున్న తమ ఆరోగ్య కార్యకర్తలలో ఒకరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. డెలివరీని అత్యవసర సేవగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నామని హోమ్ డెలివరీ అసోసియేట్స్ ప్రతినిధి సౌరభ్ కుమార్ కోరారు.(కశ్మీర్లో కరోనా తొలి మరణం) అత్యవసర సర్వీసులను మాత్రం మినహాయింపు ఉన్నప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 2 వ రోజు స్థానిక అధికారుల అంతరాయాలు కారణంగా 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంతంగా పారవేయవలసి వచ్చిందని, కిరాణా, పాల డెలివరీ వెబ్సైట్ మిల్క్ బాస్కెట్ ప్రకటించింది. అలాగే గుర్గావ్, నోయిడా, హైదరాబాద్ లలో తాజా పాలను అందించలేమని ఆన్లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్ఫాం ప్రెష్ హోం తెలిపింది. (కరోనాపై యుద్ధం : భారత్పై చైనా ప్రశంసలు) మరోవైపు హోం డెలివరీ సందర్బంల్లో తలెత్తుతున్న ఆటంకాలపై స్పందించిన నీతి ఆయోగ్ సీఈవో సంస్థ గుర్తింపు కార్డులు ఉన్న హోం డెలివరీ ప్రతినిధులను అడ్డుకోవద్దని బుధవారం ప్రకటించారు. సంబంధిత ఆదేశాలను అధికారులకు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో అవసరమైన సామాగ్రి ప్రజలకు చేరేలా కూరగాయల అమ్మకందారులకు, కిరాణా దుకాణదారులకు ఈ-పాసులు జారీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్లపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి ఎంఎస్ రంధావా తెలిపారు. -
అమ్మ, అమ్మమ్మ కలిసి జిల్లేడి పాలు పోశారు..
చెన్నై, అన్నానగర్: ఆండిపట్టి సమీపంలో గురువారం జిల్లేడి పాలు ఇచ్చి ఆడ శిశువుని హత్య చేసిన తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రామనాథపురానికి చెందిన సురేష్. భార్య కవితా (29). సురేష్ కేరళాలో ఉన్న కోలిక్కోడులో మేస్త్రీ పని చేస్తూంటాడు. వీరికి కుమార్తెలు పాండి మీనా (10), హరిణి (8) ఉన్నారు. ఈ క్రమంలో కవితా మూడోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఫిబ్రవరి 20న క.విలక్కు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అదే నెల 26న ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా ఆడ బిడ్డ పుట్టింది. 2 రోజుల తరువాత ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మార్చి 2న కవితా తల్లిపాలు ఇచ్చినప్పుడు విరోచనాలు ఏర్పడి బిడ్డ మృతి చెందినట్లుగా పలికి ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో పాతి పెట్టారు. స్థానికులు దీనిపై అనుమానంతో జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, ఆండిపట్టి తహసీల్దార్ చంద్రశేఖర్కి సమాచారం అందించారు. తహసిల్దార్ చంద్రశేఖర్ గ్రామ నిర్వాహక అధికారి దేవి, రాజధాని పోలీసులు కవితా, అత్త చెల్లమ్మాల్ వద్ద తీవ్ర విచారణ చేశారు. గురువారం విచారణలో కవితా, ఆమె అత్త చెల్లమ్మాల్ జిల్లేడి పాలు ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బిడ్డ మృతదేహాన్ని గురువారం బయటకి తీసి అక్కడే ప్రభుత్వ డాక్టర్తో పోస్టుమార్టం చేయించారు. ఇందులో జిల్లేడిపాలు ఇచ్చి బిడ్డని హత్య చేసిన విషయం తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు. -
ఆకు లేని పాలకూరలు
ఇక్కడ చెప్పినవన్నీ ‘పాల’కూరలే. మామూలుగా మనం పాలకూర అని పిలిచే వెజిటబుల్లో ఆకులుంటాయి. ఇక్కడ చెప్పిన కూరల్లో దేనిలోనూ ఆకుల్లేవు. కానీ ఆకుకూరలంత ఆరోగ్యముంది. సంపూర్ణాహారమైన ‘పాలు’ పోసి వండిన కూరలివి. వీటి రుచుల్లో పాలభాగం సగపాలు. మిగతాది ఆ కూరల పాలు. వీటి రుచులెంతో మేలు. తింటే మంచి ఆరోగ్యం మీ ‘పాలు’. బీరకాయ పాలు కూర కావలసినవి: బీరకాయలు – అర కేజీ; పాలు – పావు కప్పు పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టీ స్పూను; మినప్పప్పు – ముప్పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత. తయారీ: ∙చెక్కు తీసేసిన బీర కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి, ఐదు నిమిషాల తరవాత పాలు పోసి మరోమారు కలియబెట్టి, పది నిమిషాల సేపు మూత ఉంచాలి ∙మెత్తగా ఉడికి, పాలన్నీ ఇగిరిపోయిన తరవాత దింపేయాలి ∙ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది. మునగకాడ పాలు కూర కావలసినవి: మునగ కాడలు – 3 (పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; నానబెట్టిన బియ్యం – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; పాలు – 400 మి.లీ. పోపు కోసం: నూనె – 5 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన బియ్యం వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి నాలుగైదు నిమిషాలు కలియబెట్టాలి ∙మునగ కాడ ముక్కలు, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, పావు గంట సేపు ఉడికించాలి ∙మెత్తగా చేసిన పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం, పాలు జత చేసి బాగా కలియబెట్టి, మరో పావు గంట ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. సొరకాయ పాలు కూర కావలసినవి: సొరకాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6 (సన్నగా పొడవుగా తరగాలి); పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙సొరకాయ ముక్కలకు తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి ∙ఉడికించిన సొరకాయ ముక్కలు జతచేసి మరోమారు కలియబెట్టాలి ∙బాగా ఉడికిన తరవాత పాలు పోసి, మూత ఉంచి, కూర దగ్గర పడేవరకు ఉడికించి దింపేయాలి (ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం కాని పం^è దార కాని వేసుకోవచ్చు) ∙అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. వంకాయ పాలు కూర కావలసినవి: వంకాయలు – 8 (గుత్తి కాయలు); ఉల్లి తరుగు – పావు కప్పు; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; గసగసాలు – ఒక టేబుల్ స్పూను; లవంగాలు – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్లు; మిరప కారం – అర టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పాలు – ఒక కప్పు; ఆవాలు + జీలకర్ర – ఒక టేబుల్ స్పూను; పసుపు– పావు టీ స్పూను; నూనె – తగినంత తయారీ: ∙వంకాయలను గుత్తులుగా కట్ చేసి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ∙మిక్సీలో గసగసాలు, ధనియాలు, ఉల్లి తరుగు, అల్లం తురుము, టొమాటో తరుగు, ఎండు కొబ్బరి పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేసి, ఈ మిశ్రమాన్ని వంకాయలలోకి స్టఫ్ చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙స్టఫ్ చేసిన వంకాయలను జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి ∙పది నిమిషాల తరవాత పాలు జత చేసి కూరను బాగా కలియబెట్టి, మరోమారు మూత ఉంచి, బాగా ఉడికించి దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పాలు కూర కావలసినవి: పొట్ల కాయ – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; జీడిపప్పులు – 10; నూనె – ఒక టేబుల్ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట (చిన్నది); పాలు – పావు లీటరు (ఒక గ్లాసు). తయారీ: ∙పొట్ల కాయను శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, ఉప్పు నీళ్లలో శుభ్రంగా కడిగి, నీరంతా పిండేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, జీడి పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙టొమాటో తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పొట్లకాయ చక్రాలను జత చేసి బాగా కలియబెట్టి, పది నిమిషాల పాటు ఉడికిన తరవాత, పాలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙బాగా ఉడికిన తరవాత మూత తీసేసి, కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలిపి, ఉడికించి దింపేయాలి ∙ ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది. -
ఆ పాలతో నిత్య యవ్వనం..
లండన్ : వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా డీఎన్ఏ వయసు మీరడాన్నినియంత్రించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని పేర్కొంది. 6000 మంది జీన్స్ను, వారు తీసుకునే ఆహారం, ఎలాంటి పాలు తాగుతారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆ సర్వే కీలక వివరాలను వెల్లడించింది. క్రోమోజోముల పరిమాణం ఆధారంగా డీఎన్ఏ వయసును శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు తీసుకునే పాలల్లో ఒక శాతం కొవ్వు అధికమైనా ఒక్కో శాతానికి వారి డీఎన్ఏ నాలుగేళ్ల పైగా వయసు మీరినట్టు సర్వేలో వెల్లడైంది. 0.3 శాతం కొవ్వు కలిగి ఉన్న పాలను తీసుకునే వారు 3.6 శాతం కొవ్వున్న పాలను తీసుకునే వారితో పోలిస్తే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని సర్వే సూచించింది. సంతృప్త కొవ్వులతో కూడిన పాలను తీసుకుంటే అది కణాలపై ఒత్తిడి పెంచి వాటిని నిర్వీర్యం చేస్తుందని శరీరంలోని కండరాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. పాలు తాగడం అనారోగ్యకరం కాదని, కానీ మీరు ఎలాంటి పాలు తాగుతున్నారనే దానిపై అవగాహన ఉండాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక కొవ్వున్న పాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే వెన్నతీసిన పాలు డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయనేందుకు పరిశోధకులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. వారు కేవలం ఈ పాలను తీసుకుంటే కలిగే ప్రభావాలను మాత్రమే పరిశీలించారు..కారణాలపై లోతుగా విశ్లేషించలేదు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అథ్యయనానికి ప్రొఫెసర్ లారీ టకర్ నేతృత్వం వహించారు. ఈ అథ్యయన వివరాలు సైన్స్ జర్నల్ ఆక్సిడేటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంగివిటీలో ప్రచురితమయ్యాయి. చదవండి : గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న!