Moeen ali
-
Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అండర్-19 టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ఈ ఫీట్ నమోదు చేసి ఔరా అనిపించాడు.మొయిన్ అలీ తర్వాతచెన్నై వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగతున్న అనధికారిక తొలి టెస్టు సందర్భంగా మంగళవారం ఈ ఘనత సాధించాడు. కాగా అండర్ 19 స్థాయిలో వైభవ్ కంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ మొయిన్ అలీ. ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ 2005లో కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకన్నాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్కు వచ్చింది. పుదుచ్చేరిలో జరిగిన వన్డే సిరీస్లో పర్యాటక జట్టును 3-0తో వైట్వాష్ చేసిన యువ భారత్.. చెన్నైలోని చెపాక్లో అనధికారిక తొలి టెస్టు మొదలుపెట్టింది.వైభవ్ రనౌట్ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటలోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా 26 పరుగులతో ఆడుతుండగా.. వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రరెడ్బాల్ మ్యాచ్లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు.. దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు.. ఇదే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించి.. బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.కాగా దేశవాళీ క్రికెట్లో వైభవ్ బిహార్ జట్టుకు ఆడుతున్నాడు. ఇక 12 ఏళ్ల వయసులోనే రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు.చదవండి: ‘జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శి ఎవరో గానీ.. ఈసారి అక్కడ మ్యాచ్లు వద్దు’ -
‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు ఎక్కువే’
టెస్టు క్రికెట్లో ఐదు శతకాలు బాదినందుకు తాను గర్వపడుతున్నానని ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. మేటి బ్యాటర్ జో రూట్ను అనుకరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. అయితే అతడిలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం తనకు సాధ్యంకాలేదని తెలిపాడు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే క్రీజులోకి వెళ్లి సెంచరీలు చేయడం తనకే ఆశ్చర్యంగా ఉండేదని పేర్కొన్నాడు.మూడు ఫార్మా ట్లలో త్తా చాటిన మొయిన్ అలీకాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడైన అలీ... తన కెరీర్లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. పదేళ్ల కెరీర్లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్లూ ఆడాడు. బంతితో, ఇటు బ్యాట్తో రాణించి.. టెస్టుల్లో 3094 పరుగులు చేయడంతోపాటు 204 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మొయిన్ అలీ తన మార్కు చూపించాడు. వన్డేల్లో 2355 పరుగులు సహా 111 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో 1229 పరుగులతో పాటు 51 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే రిటైర్మెంట్తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉందని.. అయితే, కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు 37 ఏళ్ల మొయిన్ అలీ ఆదివారం వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నా.. ఫ్రాంచైజీ క్రికెట్లో మరి కొన్నాళ్లు ఆడతానని స్పష్టం చేశాడు.ఆ విషయంలో విఫలమయ్యానుఈ నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి నెమరువేసుకున్న మొయిన్ అలీ.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుసేన్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఐదు శతకాలు బాదినందుకు గర్వపడుతున్నా. కేవలం ఐదే కదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ.. డౌన్ ఆర్డర్లో వచ్చి మరీ ఇలా ఆడటం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.అసలేం చేయగలనో తెలియని స్థితిలో క్రీజులోకి వెళ్లి.. పరుగులు రాబట్టడం నా వరకు ఊహించని విషయమే. ఉన్న కాసేపైనా బ్యాటింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిని. నిజానికి జో రూట్లా నేనూ పక్కా ప్లాన్తో ఆడాలని భావించేవాడిని. కానీ విఫలమయ్యాను. అప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లుగా మారిపోవడమే నాకు తెలుసు. అయితే, ఒక్కోసారి అనుకున్న మేర పరుగులు సాధించలేకపోయాననే భావన వెంటాడేది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ పట్ల మొయిన్ అలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానమే లక్ష్యంగా రూట్ ముందుకు సాగుతున్నాడు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు! -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ జట్టు నుంచి తప్పుకున్న అనంతరం మెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి రెండు సార్లు రిటైర్ అయ్యి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్కే గుడ్బై చెప్పాలని అతడు డిసైడ్ అయ్యాడు. డైలీ మెయిల్లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్తో మెయిన్ మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ తెలిపాడు."నేను అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో నేను మళ్లీ ఇంగ్లండ్కు ఆడాలంటే ఆడగలను. కానీ మళ్లీ నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయను. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం నా ఫిట్నెస్ కాదు.ఇప్పటికీ నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. కానీ జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంగ్లండ్ క్రికెట్లోకి కొత్త తరం ఆటగాళ్లు రావాలని" అలీ పేర్కొన్నాడు.ఇక ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న అలీ... ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ తరపున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అలీ.. వరుసగా 3,094, 2,355, 1,229 పరుగులు సాధించాడు. అదే విధంగా మూడు ఫార్మాట్లు కలిపి 254 వికెట్లు పడగొట్టాడు. -
ఇంగ్లండ్కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య లూయిస్ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలవు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతడు లీగ్ దశ మ్యాచ్లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బట్లర్ దూరమైతే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్రౌండర్ మొయిన్ అలీ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 4న బార్బోడస్ వేదికగా స్కాట్లాండ్తో తలపడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్తో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు అయింది.శనివారం ఇరు జట్లు మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలో రెండో టీ20కు ముందు మొయిన్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. "నేను వైస్-కెప్టెన్గా ఉన్నప్పుడు జోస్ బట్లర్ గైర్హజరీలో చాలా సందర్బాల్లో జట్టును నడిపించాను. ఆ సమయంలో కెప్టెన్సీ పరంగా నేను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదు. కొత్తగా కూడా నాకేమి అన్పించలేదు. మనం తీసుకునే నిర్ణయాలపై ఏదైనా ఆధారపడి ఉంటుంది.ఇక జోస్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. బేబీ అనుకున్న సమయంలోనే ఈ ప్రపంచంలో అడుగుపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా జోస్ ఎక్కువ మ్యాచ్లకు దూరం కాకుడదని నేను కోరుకుంటున్నాని" అలీ పేర్కొన్నాడు. -
ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్సెక్స్కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్లే ఆడాడు. ససెక్స్కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్..
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్కు మరోసారి విడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం మొయిన అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఇంగ్లండ్ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. తొలిసారి అలా.. కాగా అంతకుముందు మొయిన్ అలీ 2021 సెప్టెంబర్లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యాషెస్ సిరీస్-2023కు ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ నచ్చచెప్పడంతో మెయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడిని ఈ ఏడాది యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్గా యాషెస్ 2023లో నాలుగు మ్యాచ్లో ఆడిన మొయిన్.. 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఓ వైపు చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ తన వంతు సేవలను అలీ అందించాడు. ఇదే చివరి మ్యాచ్.. ఇక మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ.. "రిటైర్మెంట్ విషయం గురించి స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే, వెంటనే డిలీట్ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్ను బాగా ఎంజాయ్ చేశాను. చివరి మ్యాచ్ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. స్టోక్సీ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తొలుత నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడను అని చెప్పా. స్టోక్స్ మాత్రం నాకు సపోర్ట్గా నిలిచి, నీవు అద్భుతంగా రాణించగలవని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో ఆడేందుకు ఒప్పుకున్నాను. మళీ జిమ్మీ,బ్రాడ్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి:IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
Ashes 4th Test: మొయిన్ అలీ డబుల్ ధమాకా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, 299/8 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్నైట్ స్కోర్కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్కు దక్కింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
రూట్ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. మిస్ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్డౌన్లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్కు కనువిందు చేసింది. రూట్ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్ను వరుసగా మూడో ఇన్నింగ్స్లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
Ashes 2nd Test: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అనుకున్న విధంగానే ఓ మార్పు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ముందుగా అనుకున్న విధంగానే మేనేజ్మెంట్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీని తప్పించింది. అతని స్థానంలో యువ పేసర్ జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టునే ఇంగ్లీష్ మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించింది. ఆసీస్.. తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, మొయిన్ అలీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన టంగ్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాషెస్ సిరీస్కు ముందు ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టంగ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ పూర్తిగా పేస్ అటాక్తోనే బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బజ్బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులుకాల్చుకుంది. మరి ఈ మ్యాచ్లో అయిన ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. England have announced their playing XI for the second men’s Ashes Test at Lord’s 🏏 More 👉 https://t.co/ctbQmFfLDt pic.twitter.com/zvlpdaLzYq — ICC (@ICC) June 28, 2023 -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్ను మొయిన్ అలీకి రీప్లేస్గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్తోనే కానిచ్చేయండి!' -
యాషెస్ రెండో టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి యువ ఆటగాడు
యాషెస్ తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అన్ని విధాల సన్నద్దం అవుతోంది. రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ఇంగ్లీష్ జట్టు ఆల్రౌండర్ మొయిన్ అలీ ఆడేది సందేహం గా మారింది. తొలి టెస్టులో మోయిన్ అలీ చేతి వేలి గాయంతో బాధపడ్డాడు. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్లో పెద్దగా అలీ బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు మెనెజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోయిన్ అలీ బ్యాకప్గా యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. కాగా 18 ఏళ్ల అహ్మద్.. గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఏడు వికెట్లు పడగొట్టి అందరని రెహాన్ అకట్టుకున్నాడు. ప్రస్తుతం విటిలిటి టీ20 బ్లాస్ట్లో లీసెస్టర్షైర్ తరపున ఆడుతున్న రెహాన్ పర్వాలేదనపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అలీ బ్యాకప్గా ఈయువ లెగ్గీని ఎంపిక చేశారు. చదవండి: Shayan Jahangir: 'కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. ఎదురుచూస్తున్నా' -
మొయిన్ అలీకి బిగ్షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీకీ ఐసీసీ బిగ్షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ను ఉల్లంఘించినందుకు మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని అలీ ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకనటలో పేర్కొంది. అదే విధంగా అతడికి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. అలీ ఏం చేశాడంటే? ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అలీ.. డ్రెయింగ్ ఏజెంట్తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే అంపైర్లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు. వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్లు గానీ స్ప్రేలు గాని చేయకూడదు. కానీ అలీ అంపైర్ల రూల్స్ను అతిక్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా యాషెస్ తొలి టెస్టుతోనే అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: Ashes 2023: మెయిన్ అలీ సూపర్ డెలివరీ.. బిత్తిరి పోయిన గ్రీన్! వీడియో వైరల్ -
మెయిన్ అలీ సూపర్ డెలివరీ..బిత్తర పోయిన గ్రీన్! వీడియో వైరల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగుతున్న యాషెస్ తొలి టెస్టుతో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67 ఓవర్లో అలీ తొలి బంతిని ఔట్ సైడ్ఆఫ్ దిశగా వేశాడు. ఆఫ్సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా గ్రీన్ బిత్తిరిపోయాడు. చేశాదేమి లేక గ్రీన్నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గ్రీన్ 38 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మెయిన్ అలీని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసిచాడు. "వాటే ఏ బ్యూటీ మోయిన్" అంటూ.. గ్రీన్ ఔటైన వీడియోను భజ్జీ ట్విటర్లో షేర్ చేశాడు. ఇక యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 100 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(137), కమ్మిన్స్ ఉన్నారు. చదవండి: నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే: మాజీ కెప్టెన్ What was that Moeen Ali.. 🥹#ENGvAUS #Ashes #Ashes23 pic.twitter.com/dATMqppgXQ — Abu Zaid Sarooji (@Sarooji_) June 17, 2023 What a beauty Moen ♠️ https://t.co/Rai7KEj4XN — Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2023 -
Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్
యాషెస్ సిరీస్ 2023 కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని (టెస్ట్లు) సైతం వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. 22 నెలల సుదీర్ఘ విరామం (650 రోజులు) తర్వాత టెస్ట్ల్లో తొలి వికెట్ సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో మొయిన్.. కీలకమైన ట్రవిస్ హెడ్ (50) వికెట్ పడగొట్టాడు. హెడ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో మొయిన్ అతని వికెట్ను దక్కించుకుని, మళ్లీ ఆసీస్ను కష్టాల్లోకి నెట్టేశాడు. లెగ్ సైడ్ అప్పర్ డ్రైవ్ చేసే క్రమంలో మిడ్వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జాక్ క్రాలే క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలిన్ బాట పట్టాడు. Moeen Ali gets his first wicket upon returning to Test cricket. pic.twitter.com/gmSUjQtNT6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2023 కాగా, మొయిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2021 (సెప్టెంబర్) భారత పర్యటనలో ఆడాడు. అనంతరం అతను టెస్ట్లకు గుడ్బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతున్నాడు. రీఎంట్రీకి ముందు టెస్ట్ల్లో మొయిన్ చివరి వికెట్ రిషబ్ పంత్ది. ఆ మ్యాచ్ కూడా పంత్ కూడా హెడ్ లాగే 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. కాగా, హెడ్ వికెట్ కోల్పోయాక కాస్త నెమ్మదించిన ఆసీస్ స్కోర్.. 56 ఓవర్లు ముగిసే సమయానికి 172/4గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (78), కెమరూన్ గ్రీన్ (12) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆసీస్ ఇంకా 221 పరుగులు వెనుకపడి ఉంది. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్కు 2, స్టోక్స్ ఓ వికెట్ (స్మిత్) పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్భూషణ్పై చార్జ్షీట్ దాఖలు 'నా సక్సెస్లో సగం క్రెడిట్ కేన్మామదే' -
#MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది
ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇటీవలే టెస్ట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడో లేదో ఈసీబీ అతన్ని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కోసం ఎంపిక చేసింది. ఇక జూన్ 16 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ సిద్ధమవుతున్నాడు. జాక్ లీచ్ గైర్హాజరీలో మొయిన్ అలీ జట్టు బౌలింగ్లో కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్స్టోక్స్ అని మొయిన్ అలీ రివీల్ చేశాడు. స్టోక్స్ చెప్పిన యాషెస్ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్బాస్టన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మొయిన్ అలీ మాట్లాడాడు. ''స్టోక్స్ నేను సరదాగా చాట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్?(Ashes?) అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్ లీచ్ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్(Lol) అని మెసేజ్ చేశా. అంతే స్టోక్స్ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్ లీచ్ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్కు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్లో నీ అవసరం ఉందని స్టోక్స్ నాతో అన్నాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. అందునా యాషెస్ అనే పదం వినగానే నాలో ఉత్సాహం వచ్చింది.. ఆడాలని నిశ్చయించుకున్నా. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్బ్యాక్కు బెన్స్టోక్స్ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ వివరించాడు. మొయిన్ అలీ కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్లు ఆడి 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. ఆసీస్పై 11 టెస్ట్లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్పై ఏకంగా 64.65గా ఉంది. ఇక స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టుల్లో దూసుకుపోతుంది. బజ్బాల్ విధానంతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు స్టోక్స్ కెప్టెన్సీలో 13 టెస్టుల్లో 11 విజయాలు నమోదు చేయడం విశేషం. 2015 తర్వాతి నుంచి మరో యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్ను ఓడించి యాషెస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. Moeen Ali's response when Ben Stokes first approached him about an Ashes comeback: "lol" 😂 pic.twitter.com/qIy8Jf6Btx — ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2023 చదవండి: అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్.. అభిమానులకు పండగే! -
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం.. మొయిన్ అలీ బాటలోనే..!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్ ప్రజలు బోల్ట్ను వన్డే వరల్డ్కప్-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్ సెంట్రల్ కాంట్రక్ట్ ఇచ్చిన రోజే (జూన్ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బౌల్ట్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్కప్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్.. 2023 వరల్డ్కప్లో కూడా న్యూజిలాండ్ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్కప్లలో న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరడంలో బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఆసీస్ మిచెల్ స్టార్క్తో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా (22).. 2019లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్గా (8 మ్యాచ్ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్గా బౌల్ట్ వరల్డ్కప్లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 7) ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సైతం తన దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా టెస్ట్ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్ అలీని యాషెస్ సిరీస్కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ల్లో ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్ 2021లో టెస్ట్లకు గుడ్బై చెప్పాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం -
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్లో టెస్ట్లకు గుడ్బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్ను జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్ట్లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్ 2021లో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక రెడ్ బాల్తో కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. మొయిన్ రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్పై 11 టెస్ట్లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్ యావరేజ్కు రెండింతలు. కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్లు ఆడిన మొయిన్.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్ట్లకు ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలే, డేనియల్ లారెన్స్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఫైనల్ మాత్రం తనదే!
IPL 2023 Final- CSK vs GT: ‘‘కెప్టెన్ ధోని అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. నాకు తెలిసి అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి ఉంటాడు. ఈరోజు అతడిదే అవుతుందనుకుంటున్నా’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కాగా ఐపీఎల్-2023లో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టులో సీనియర్ అయిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్కు ఈ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు 10 ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 23. ఇక బౌలింగ్పరంగా చూస్తే.. 7.50 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మొయిన్ అలీ- ఎంఎస్ ధోని (PC: IPL) జడ్డూ బ్యాట్తో మెరుస్తాడు ‘‘ధోని ఎందుకో మొయిన్ అలీ సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇక జడేజా ఈరోజు బ్యాట్తో మెరుస్తాడనుకుంటున్నా. ఎందుకంటే.. అహ్మదాబాద్ పిచ్పై అతడి బౌలింగ్ వర్కౌట్ కాకపోవచ్చు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండబోతోందనపిస్తోంది. దూబేను అలా ట్రాప్ చేస్తారు ఇక శివం దూబే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్లో నూర్ అహ్మద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అతడిని ఫాస్ట్ బౌలింగ్తో కాకుండా స్పిన్నర్లతో ట్రాప్ చేయడం పక్కా. రహానే నంబర్ 3 మరోవైపు.. అజింక్య రహానే.. చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై వెలుపలే అతడు ఎక్కువగా పరుగులు రాబట్టాడు. రహానే ఇక్కడ కచ్చితంగా రన్స్ సాధిస్తాడనే అనుకుంటున్నా. రహానే మూడో స్థానంలో దిగితే బాగుంటుంది. నిజానికి సీఎస్కే వారి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రుతు, కాన్వే అద్భుత ఫామ్లో ఉన్నారు. కాబట్టి మహ్మద్ షమీ వీరిద్దరని కచ్చితంగా టార్గెట్ చేస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో కాన్వే ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్లో 625 పరుగులు, రుతురాజ్ 14 ఇన్నింగ్స్ ఆడి 564 పరుగులు సాధించారు. ఇక గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్కే- గుజరాత్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్ సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl — Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023 -
జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. షమీ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని మొయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరిగెత్తుకొచ్చాడు. అయితే ఇది గమనించని మొయిన్ అలీ అప్పుడు క్రీజు నుంచి కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహా వికెట్ల వైపు విసరగా.. అప్పటికే జడ్డూ తన బ్యాట్ను క్రీజులో ఉంచాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. జడేజా బ్యాట్ పెట్టేలోపు మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు. ఒకవేళ సాహా నేరుగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు బంతిని విసిరి ఉంటే మొయిన్ అలీ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడే కానీ తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు..''జడ్డూ చిరుతపులిలా పరిగెత్తుకొస్తే.. మొయిన్ అలీ మాత్రం ముసలోడిలా పరిగెత్తాడు'' అంటూ కామెంట్ చేశారు. Jadeja returned from School and Moeen Ali is just going to School 😭 pic.twitter.com/9xz1SFhUpT — ♚ (@balltamperrer) May 23, 2023 చదవండి: దీపక్ చహర్ అరుదైన ఘనత.. -
మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవి చూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కే వైపే నిలిచింది. మొయిన్ అలీపై ధోని సీరియస్ ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డింగ్లో అలసత్వం వహించిన మొయిన్ అలీపై ఎంస్ కోపంతో ఊగిపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన పతిరానా బౌలింగ్లో చివరి బంతికి పార్నెల్ ఎక్స్ట్రా కవర్ దిశగా షాట్ ఆడాడు. బంతికి ఎక్స్ట్రా కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో పార్నెల్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్స్ట్రైకర్లో ఉన్న ప్రభుదేశాయి మాత్రం పార్నెల్ను గమనించలేదు. పార్నెల్ గట్టిగా అరవడంతో ప్రభుదేశాయ్ వికెట్ కీపర్వైపు పరిగెత్తాడు. అయితే మొయిన్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా తన పక్కనే ఉన్న బంతిని వికెట్ కీపర్కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు. ఒక వేళ బంతిని వెంటనే అందుకుని వికెట్ కీపర్కు అతడు త్రో చేసి ఉంటే సుయాష్ ప్రభుదేశాయి రనౌట్గా వెనుదిరిగేవాడు. బంతిని త్రో చేయడంలో మొయిన్ అలీ అలసత్వం వహించడంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి సుయాష్ తప్పించుకున్నాడు. ఇక మొయిన్ అలీ పేలవ ఫీల్డింగ్పై ధోని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ధోని కోపంతో మొయిన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/yeXJEpm5Ts — Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023 .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 చదవండి: #MS Dhoni: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. 18వ ఓవర్లోనే మ్యాచ్ ముగిసేది! కానీ.. -
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. కోట్లు పోసి కొన్న ఆటగాడు ఔట్..!
ఐపీఎల్-2023లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ను గాయాల బెడద వెంటాడుతూ ఉంది. ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ తిరగబెట్టడంతో రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లీగ్లో తదుపరి కొనసాగేది అనుమానంగా మారగా.. తాజాగా మరో ఆటగాడు, రూ. 16.25 కోట్ల ప్లేయర్ బెన్ స్టోక్స్ బొటనవేలి గాయం కారణంగా వారం రోజులు లీగ్ను దూరంగా ఉంటాడని తెలుస్తోంది. సీఎస్కే మేనేజ్మెంట్ చాహర్ 4 లేదా 5 మ్యాచ్లకే దూరంగా ఉంటాడని చెబుతున్నప్పటికీ అతని గాయం తీవ్రత అధికంగా ఉందని సమాచారం. చాహర్ ఇదే గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఈ సీజన్ పరిస్థితి ఏమోనని సీఎస్కే యాజమాన్యం లోలోపల ఆందోళన చెందుతుంది. చాహర్ గురించే తలలు పట్టుకున్న సీఎస్కేకు స్టోక్స్ రూపంలో మరో స్ట్రోక్ తగలడంతో బెంబేలెత్తిపోతుంది. స్టోక్స్కు తగిలిన గాయాన్ని చిన్నదిగా చూపించాలని ఎల్లో ఆర్మీ భావిస్తున్నప్పటికీ, ఆ జట్టు కంగారు పడుతున్న తీరు చూస్తుంటే, 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తానికే దూరమవుతాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవి చాలవన్నట్లు కోట్లు పోసి సొంతం చేసుకున్న మరో ఆటగాడు మొయిన్ అలీ కూడా అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇతను కూడా తదుపరి మ్యాచ్లకు దూరమైతే సీఎస్కే విజయావకాశాలపై భారీ ప్రభావం పడుతుంది. ఇన్ని టెన్షన్స్ మధ్య ముంబైతో మ్యాచ్లో రహానే రాణించడం ఒక్కటి సీఎస్కేకు ఊరట కలిగిస్తుంది. ఒకవేళ సీఎస్కే నిజంగా చాహర్, స్టోక్స్ సేవలు కొన్ని మ్యాచ్లకైనా సరే కోల్పోవాల్సి వస్తే, ఆ జట్టు గత సీజన్లో మాదిరే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండాల్సి వస్తుంది. -
MI VS CSK: 32.25 కోట్లు పెట్టి కొన్నారు, పక్కకు పెట్టారు.. ఎందుకు..?
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య భారీ అంచనాల నడుమ నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఆసక్తికర సమరంలో ఓ విషయం హైలైట్ అయ్యింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాళ్లను ఇరు ఫ్రాంచైజీలు బెంచ్కే పరిమితం చేసి పెద్ద సాహసమే చేశాయి. ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు) లేకుండా, సీఎస్కే మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) లేకుండా బరిలోకి దిగి అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. వీరు ముగ్గురు తుది జట్టులో లేకపోవడానికి గల కారణాలను సంబంధిత కెప్టెన్లు టాస్ సమయంలో వెల్లడించినప్పటికీ, అవి పొంతనలేనివిగా తెలుస్తోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాడు ఆర్చర్ గాయపడ్డాడని తొలుత చెప్పి, ఆతర్వాత ముందు జాగ్రత్త చర్యగా అతనికి రెస్ట్ ఇచ్చామని చెప్పగా.. సీఎస్కే సారధి ధోని తమ ఆటగాళ్లు మొయిన్ అలీ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని, స్టోక్స్ మడమ గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు. 32.25 కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల విషయంలో కెప్టెన్లు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో సదరు ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తి చెందని ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగానే గాయాల సాకు చూపించి వారి తప్పించినట్లు తెలుస్తోంది. మొయిన్ అలీ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 23 పరుగులు చేయగా, లక్నోపై ఆల్రౌండ్ ప్రదర్శనతో (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, 4-0-26-4) అదరగొట్టాడు. మొయిన్ అలీ నిజంగా అనారోగ్యం బారిన పడ్డాడని వదిలేస్తే, ఆల్రౌండర్గా సేవలందిస్తాడనుకున్న స్టోక్స్ మాత్రం ఆడిన 2 మ్యాచ్ల్లో తేలిపోయి, తనపై గంపెడాశలు పెట్టుకున్న ఫ్రాంచైజీని, అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ గుజరాత్పై 6 బంతుల్లో ఫోర్ సాయంతో 7 పరుగులు, లక్నోపై 8 బంతుల్లో ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్చర్ విషయానికొస్తే, భారీ అంచనాల నడుమ ఓ సీజన్ ముందుగానే బుక్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్లీష్ బౌలర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక నిరాశపరిచాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు కనీసం నామమాత్ర ప్రదర్శన కూడా చేయకుండా చేతులెత్తేస్తుండటంతో ఫ్రాంచైజీ వారిని తప్పించే సాహసం చేయక తప్పలేదు. అయితే, ఈ విషయంలో ముంబై మాట అటుంచితే, సీఎస్కే మాత్రం సత్ఫలితం రాబట్టిందనే చెప్పాలి. మొయిన్ అలీ, స్టోక్స్ లేకపోయిన టెస్ట్ ప్లేయర్గా ముద్రపడిన వెటరన్ అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను తుది జట్టులోకి తీసుకునే సీఎస్కే సక్సెస్ సాధించింది. అతనితో పాటు జడేజా (3/20), సాంట్నర్ (2/28), తుషార్ దేశ్పాండే (2/31), మగాలా (1/37), రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్) రాణించడంతో ముంబై ఇండియన్స్పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
'భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్ నాకు ఆఖరిది'
ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్తో మంగళవారం జరిగిన చివరి టి20 మ్యాచ్లోనూ ఓటమి పాలైన ఇంగ్లండ్ వైట్వాష్కు గురైంది. ఈ ఓటమి ఇంగ్లండ్ అభిమానులను బాధిస్తే.. బంగ్లా అభిమానులను మాత్రం ఫుల్ ఖుషీ చేసింది. కారణం.. టి20 క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్గా ఉన్న ఇంగ్లండ్ను ఓడించడమే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ తన రిటైర్మెంట్పై చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పిన మొయిన్ అలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది భారత్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ తర్వాత ఆటకు గుడ్బై చెప్పనున్నట్లు వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.. ''నేను రిటైర్ కానని చెప్పను.. అలాగని రిటైర్ అవ్వకుండా ఉండను. మరో ఏడు, ఎనిమిది నెలల్లో 35వ పడిలో అడుగుపెట్టబోతున్నా. రిటైర్మెంట్ వయసు వచ్చేసిందనిపిస్తుంది. ఇక ఎలాంటి గోల్స్ పెట్టుకోదలచుకోలేదు. అయితే ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్కప్లో ఆడాలనుకుంటున్నా. ఆ వరల్డ్కప్ గెలవాలని కోరుకుంటున్నా. బహుశా అదే నా చివరి వన్డే కావొచ్చు.'' అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ కేవలం వన్డేలకు మాత్రమే గుడ్బై చెప్పనున్నాడు. టి20ల్లో మాత్రం కొంతకాలం కొనసాగనున్నాడు. ఇక మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 64 టెస్టుల్లో 2914 పరుగులతో పాటు 195 వికెట్లు, 123 వన్డేల్లో 2051 పరుగులతో పాటు 95 వికెట్లు, 71 టి20ల్లో 1044 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. చదవండి: WTC Final: ఏ లెక్కన ఆసీస్ను ఓడించదో చెప్పండి? ఇంగ్లండ్కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన బంగ్లా -
David Wiese: ఐదేసి ఇరగదీసిన వీస్.. వారియర్స్ ఖేల్ ఖతం
ఇనాగురల్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 (దుబాయ్ లీగ్)లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో గల్ఫ్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలవ్వడంతో షార్జా వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్ పేసర్, వెటరన్ ఆల్రౌండర్ డేవిస్ వీస్ ఐదు వికెట్లు (4-0-20-5) తీసి అదరగొట్టడంతో జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జెయింట్స్.. వారియర్స్ను 18.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్లో కోహ్లెర్ కాడ్మోర్ (33), స్టోయినిస్ (18), మహ్మద్ నబీ (21), నూర్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వారియర్స్ ఇన్నింగ్స్లో కోహ్లెర్ కాడ్మోర్ ఆరంభంలో మెరుపు వేగంతో పరుగులు చేసి జెయింట్స్ బౌలర్లను భయపెట్టాడు. అయితే టామ్ హెల్మ్ కాడ్మోర్కు కళ్లెం వేయడంతో వారియర్స్ ఢీలా పడిపోయి వరుసగా వికెట్లు కోల్పోయింది. జెయింట్స్ బౌలర్లలో వీస్ ఐదేయగా.. కార్లోస్ బ్రాత్వైట్ 2, సంచిత్ శర్మ, టామ్ హెల్మ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్ బాంటన్ (11), కెప్టెన్ జేమ్స్ విన్స్ (27), కొలిన్ డి గ్రాండ్హోమ్ (35), అయాన్ అఫ్జల్ ఖాన్ (14 నాటౌట్), గెర్హార్డ్ ఎరాస్మస్ (10 నాటౌట్) రాణించారు. వారియర్స్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 2, మార్కస్ స్టోయినిస్ ఓ వికెట పడగొట్టారు. ఈ విజయంతో వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ క్వాలిఫయర్స్కు.. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ను అర్హత సాధించాయి. 6 జట్లలో చివరి స్థానంలో నిలిచిన అబుదాబీ నైట్రైడర్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించింది. ఫిబ్రవరి 8: గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ (క్వాలిఫయర్స్ 1) ఫిబ్రవరి 9: ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ (ఎలిమినేటర్) -
అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్
South Africa vs England, 3rd ODI- Moeen Ali: ఇంగ్లండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఒంటిచేత్తో షాట్కు యత్నించి విఫలమయ్యాడు. స్విచ్ హిట్ బాదాలని ప్రయత్నించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఫెయిలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి షాట్ ఆడేందుకు ట్రై చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్లలో గెలుపొందిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు.. సిరీస్ను కైవసం చేసుకుంది. అదరగొట్టిన మలన్, బట్లర్, అలీ ఇక నామమాత్రపు మూడో వన్డేలో పర్యాటక ఇంగ్లండ్కు ఊరట విజయం దక్కింది. డేవిడ్ మలన్ 118 పరుగులు, జోస్ బట్లర్ 131 పరుగులతో చెలరేగడంతో 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. వీరికి తోడు మొయిన్ అలీ 41 రన్స్తో రాణించాడు. దీంతో బట్లర్ బృందం క్లీన్స్వీప్ గండం నుంచి గట్టెక్కింది. ఇదేం షాట్ భయ్యా అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 44వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్లో మొయిన్ అలీ రివర్స్ హిట్కు యత్నించిన తీరు ఆశ్చర్యపరిచింది. షంసీ వేసిన షార్ట్బాల్ను కుడిచేతితో బౌండరీకి తరలించాలని భావించిన ఈ లెఫ్టాండర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక తర్వాతి బంతికి మాత్రం భారీ సిక్సర్ బాది చైనామన్ స్పిన్నర్ షంసీకి షాకిచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘అన్నా ఏందన్నా ఇది! బహుశా ఎవరూ కూడా మరీ ఇంత వింతైన షాట్ ట్రై చేసి ఉండరు. మేమైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అలీ భాయ్!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో వన్డేలో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. అలీ ఈ మ్యాచ్లో 23 బంతుల్లో 41 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్తో అట్లుంటది మరి! Suryakumar: ఒకే స్టైల్లో రెండు స్టన్నింగ్ క్యాచ్లు.. 'స్కై' అని ఊరికే అనలేదు What was Brother Moeen doing 😂😂😂 pic.twitter.com/8NcE1OW285 — Taimoor Zaman (@taimoorze) February 1, 2023 Imagine he made contact with this shot. One-handed reverse Slap from Moeen Ali😂😭 #EngvSa #SAvENG pic.twitter.com/ioHJwv5e6U — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) February 1, 2023 -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు
టి20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్కప్ను అందుకున్నారు. బెన్ స్టోక్స్ విజయంలో కీలకపాత్రో పోషించగా.. ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు వికెట్లు తీసి విజయంలో భాగమయ్యాడు. 2010లో టైటిల్ నిలిచిన ఇంగ్లండ్ మళ్లీ పుష్కరకాలం తర్వాత పొట్టి ఫార్మట్లో చాంపియన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో వారి సెలబ్రేషన్స్కు అవదులు లేకుండా పోయాయి. ఇక సెలబ్రేషన్స్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పెద్ద మనసు చాటుకున్నాడు. సాధారణంగా ఒక జట్టు ఎలాంటి మేజర్ టోర్నీలు నెగ్గినా షాంపెన్తో సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. టైటిల్ అందుకున్న తర్వాత బట్లర్ తన జట్టుతో గ్రూప్ ఫోటో దిగాడు. ఆ తర్వాత షాంపెన్ సెలబ్రేషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే బట్లర్ రషీద్, మొయిన్ అలీని పిలిచి షాంపెన్ సెలబ్రేషన్ చేస్తున్నాం.. పక్కకు వెళ్లండి అని పేర్కొన్నాడు. అర్థం చేసుకున్న ఈ ఇద్దరు బట్లర్కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు షాంపెన్ పొంగించి సంబరాలు చేసుకున్నారు. కాగా మద్యపానం ఇస్లాంకు విరుద్ధం. మద్యపానం నిషేధం మాత్రమే కాదు.. ఎక్కడ ఈవెంట్ జరిగినా అక్కడ ముస్లింలు మద్యపానం జోలికి కూడా వెళ్లరు. అందుకే బట్లర్ ఇస్లాం మతానికి విలువనిస్తూ ఆదిల్ రషీద్, మొయిన్ అలీలను పక్కకు వెళ్లమన్నాడు. వాళ్లు వెళ్లిన తర్వాతే షాంపెన్ సెలబ్రేషన్ చేయడం పట్ల బట్లర్కు ఇస్లాం మతంపై ఉన్న గౌరవం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు కూడా ..''బట్లర్ది నిజంగా పెద్ద మనసు.. మతాలకు చాలా విలువనిస్తాడు '' అంటూ కామెంట్ చేశారు. England's captain reminded Adil Rashid to leave and checked to see that he and Moeen Ali had left before they celebrated with champagne. Respect. pic.twitter.com/y30bGRFyHG — ilmfeed (@IlmFeed) November 13, 2022 చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
సూర్యకుమార్ నన్ను చంపేశాడు.. మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్పై ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా రేపు (నవంబర్ 10) భారత్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్లో సూర్యకుమార్ ఊచకోతను గుర్తు చేసుకుంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్లో జరిగిన ఓ మ్యాచ్లో తన తొలి టీ20 సెంచరీ బాదిన సూర్య.. ఆ మ్యాచ్లో తనను చంపేశాడని, నాటి భయానక ఇన్నింగ్స్ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో శివాలెత్తిన సూర్యకుమార్.. తనను మరే బ్యాటర్ భయపెట్టని విధంగా భయపెట్టాడని అన్నాడు. అదృష్టవశాత్తు అతను అలసిపోయి తన బౌలింగ్లోనే ఔట్ కావడంతో ఊపరిపీల్చుకున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ ఆడిన షాట్లు అత్యద్భుతమని, క్రికెట్లో తాను చూసిన షాట్లలో అవే అత్యుత్తమమని, ఇప్పటికీ అవి తన కళ్లముందే మెదులుతున్నాయని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే తనకు సూర్యకుమార్ అంటే ఏంటో అర్ధమైందని, ఇప్పుడు అతనింకా రాటుదేలాడని, ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడని కొనియాడాడు. ఒక్కసారి అతను క్రీజ్లో కుదురుకున్నాక బౌలింగ్ చేయడం ఎంతటి బౌలర్కైనా చాలా కష్టమని, క్రికెట్ చరిత్రలో ఇలా బౌలర్లను భయపెట్టే బ్యాటర్లలో సూర్యకుమార్ ముందు వరుసలో ఉంటాడని ఆకాశానికెత్తాడు. ఏబీడీ తర్వాత మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అన్న పేరుకు సూర్యకుమార్ వంద శాతం అర్హుడని, రేపు తమతో జరుబోయే సెమీస్ మ్యాచ్లో అతను శాంతంగా ఆడాలని ఆశిస్తున్నానని అన్నాడు. సెమీస్లో టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ.. అండర్ డాగ్స్గా బరిలోకి దిగే తమను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. చదవండి: '360 డిగ్రీస్' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్ -
మలాన్, మొయిన్ మెరుపులు.. ఆసీస్కు ఘోర పరాభవం
టీ20 ప్రపంచకప్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా రెండో టీ20లోనూ ఓటమిపాలైన ఆసీస్.. మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. కాన్బెర్రా వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో (170) నిలిచిపోయింది. ఫలితంగా ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. మలాన్, మొయిన్ మెరుపులు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 4.1 ఓవర్లలో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. వన్ డౌన్ బ్యాటర్ డేవిడ్ మలాన్ (48 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ మొయిన్ అలీ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. జోస్ బట్లర్ (13 బంతుల్లో 17) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా 2, కమిన్స్, స్టార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ పోరాటం వృధా.. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోగా.. మిచెల్ మార్ష్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (23 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు వరుసగా ఔట్ కావడంతో, ఆఖర్లో వచ్చిన వేడ్ (10 బంతుల్లో 10), కమిన్స్ (11 బంతుల్లో 18) వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇంగ్లీష్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, డేవిడ్ విల్లే, రీస్ టాప్లే తలో వికెట్ సాధించారు. -
PAK vs ENG: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్పై పాక్ విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ 3-2 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కాగా 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ మొయిన్ అలీ అఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే సాధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో మొయిన్ (అలీ 51 పరుగులు నటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే విధంగా పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు, నవాజ్, వసీం, షాదాబ్ ఖాన్, ఆహ్మద్, జమేల్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టి పాక్ను దెబ్బతీశాడు. అదే విధంగా సామ్ కరణ్, విల్లీ చెరో రెండు వికెట్లు.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో మరో సారి మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిజ్వాన్ 46 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
Pak Vs Eng: ఇంగ్లండ్తో ఉత్కంఠ పోరు.. ఆఖరికి మూడు పరుగుల తేడాతో!
Pakistan vs England, 4th T20I- Karachi: ఇంగ్లండ్తో ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 2-2తో సమం చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్, రెండో మ్యాచ్లో పాకిస్తాన్, మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచాయి. ఇక కరాచీ వేదికగా ఆదివారం జరిగిన నాలుగో టీ20 ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగగా.. పాక్ పైచేయి సాధించింది. టాస్ గెలిచి.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పర్యాటక జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(67 బంతుల్లో 88 పరుగులు) శుభారంభం అందించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 36 పరుగులతో రాణించగా.. మసూద్ 21 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పాక్ 166 పరుగులు చేసింది. ఆదిలోనే షాక్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, అలెక్స్ హేల్స్ వరుసగా 8, 5 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బెన్ డకెట్ 33, ఐదో స్థానంలో వచ్చిన హ్యారీ బ్రూక్ 34 పరుగులతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఇక కెప్టెన్ మొయిన్ అలీ 29 పరుగులతో రాణించగా.. లియామ్ డాసన్ 34 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో.. మూడు పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. 19.2 ఓవర్లలో 163 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్లో మ్యాచ్ ప్రత్యేకం.. ఎందుకంటే! Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్ Top throw from Shan Masood in clutch finish 🎯 Incredible scenes in Karachi! 👏👏#PAKvENG | #UKSePK pic.twitter.com/1MeKn5sijn — Pakistan Cricket (@TheRealPCB) September 25, 2022 -
'పాకిస్తాన్ కూడా ఓడిపోయింది'.. ఇంగ్లండ్ ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ను పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. కరాచీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు) ఆసియా కప్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 31 పరుగులు చేసి ఔటవ్వగా.. ఇఫ్తికర్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. మిగతావారెవరు పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ 2, సామ్ కరన్, మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. కాగా ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండడంతో మొయిన్ అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్స్లో అలెక్స్ హేల్స్ 53 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. చివర్లో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన హారీ బ్రూక్ జట్టును గెలిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలలో ఉస్మాన్ ఖాదీర్ 2, షాహనవాజ్ దహనీ, హారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సెప్టెంబర్ 22న(గురువారం) జరగనుంది. ఇక పాకిస్తాన్ ఓడిపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేశారు. ''ఒకేరోజు రెండు ఉపఖండపు జట్లు పరాజయం చవిచూశాయి. ఒకటి టీమిండియా అయితే.. రెండో జట్టు పాకిస్తాన్''..'' ఈ రెండు జట్లు తాము ఆడుతున్న సిరీస్లో కొత్త జెర్సీలతో బరిలోకి దిగాయి. కొత్త జెర్సీ రెండు జట్లకు కలిసి రాలేదు''... ''ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతే.. పాకిస్తాన్ కూడా ఓడిపోయింది ఇంగ్లండ్ చేతిలో'' అంటూ పేర్కొన్నారు. చదవండి: దినేశ్ కార్తిక్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ మెగా టోర్నీలో భాగం కానున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను శుక్రవారం వెల్లడించింది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్కు మొండిచేయి ఎదురైంది. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆరోజే తొలి మ్యాచ్ ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న పేస్ ద్వయం క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్ సైతం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022: ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన జట్టు ఇదే! జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: IPL Auction: షాహిన్ ఆఫ్రిది ఐపీఎల్ వేలంలోకి వస్తే 14- 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు: అశ్విన్ Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. పవర్ హిట్టర్ ఎంట్రీ! Squad 🙌 #T20WorldCup 🏏 🌏 🏆 pic.twitter.com/k539Gzd5Ka — England Cricket (@englandcricket) September 2, 2022 -
Eng Vs Pak: పాక్తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ కెప్టెన్గా మొయిన్ అలీ.. కారణమిదే!
England Tour Of Pakistan 2022: పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ టూర్కు దూరమయ్యాడు. హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు పిక్కల్లో గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో పాక్ పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ మొయిన్ అలీ.. బట్లర్ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అలీ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ పాక్లో పర్యటించనుంది. టెస్టు సిరీస్ సైతం.. 2005 తర్వాత సెప్టెంబరులో తొలిసారిగా పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 2 వరకు టీ20 సిరీస్ ఆడనుంది. మొదటి ఆరు మ్యాచ్లు కరాచీ వేదికగా జరుగనుండగా.. ఆఖరి టీ20కి లాహోర్ వేదిక కానుంది. ఈ టూర్ ముగిసిన తర్వాత డిసెంబరులో మరోసారి టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ మరోసారి పాక్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా మూడు టెస్టులు ఆడనుంది. రావల్పిండి, ముల్తాన్, కరాచీలలో డిసెంబరు 1 నుంచి 21 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరుగనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జాకిర్ ఖాన్ ధ్రువీకరించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ఆల్రౌండర్ల జాబితాలో మొయిన్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: Rishabh Pant: జట్టులో పంత్కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు! Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన హార్దిక్.. కెరీర్ బెస్ట్... ఏకంగా.. -
ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు!
యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాను షార్జా వారియర్స్ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు మోయిన్ అలీ,డేవిడ్ మలన్తో పాటు ఎవిన్ లూయిస్, మొహమ్మద్ నబీ, క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లతో షార్జా ఒప్పందం కుదర్చుకుంది. కాగా షార్జా వారియర్స్ ఫ్రాంచైజీను భారత్ ఆధారిత కంపెనీ కాప్రి గ్లోబల్ కొనుగోలు చేసింది. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి. షార్జా వారియర్స్ జట్టు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), ), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లాండ్), క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), డానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), బిలాల్ ఖాన్ (ఒమన్) మరియు జేజే స్మిత్ (నమీబియా) ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సభ్యులు: పోలార్డ్(వెస్టిండీస్), బ్రావో(వెస్టిండీస్), నికోలస్ పూరన్(వెస్టిండీస్), బౌల్ట్(న్యూజిలాండ్), ఫ్లెచర్(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), సమిత్ పటేల్ (ఇంగ్లాడ్) , విల్ స్మీడ్(ఇంగ్లాడ్), జోర్డాన్ థామ్సన్(ఇంగ్లాడ్), నిజబుల్హా జోర్ధార్ (ఆఫ్ఘనిస్తాన్), జహీర్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), ఫజల్ హుక్(ఆఫ్ఘనిస్తాన్), బ్రాడ్లే(స్కాట్లాండ్), లీడ్ (నెదర్లాండ్). దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ చదవండి: T20 WC 2022: ఆసియా కప్, టీ20 వరల్డ్కప్ టోర్నీలకు బంగ్లాదేశ్ కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్! -
చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్స్టోన్
హండ్రెడ్ లీగ్ 2022లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్ రాకెట్స్తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్హామ్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మొయిన్ అలీ ఆల్రౌండ్ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్హామ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్హామ్ కోల్పోయిన 3 వికెట్లు లూక్ వుడ్ ఖాతాలో చేరాయి. అంతకుముందు డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్ రాకెట్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్ హేల్స్ (1), డేవిడ్ మలాన్ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్హామ్ బౌలర్ హోవెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బర్మింగ్హామ్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్ రాకెట్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన లండన్ స్పిరిట్ ఈ జాబితాలో టాప్ ప్లేస్లో ఉండగా.. ఓవల్ ఇన్విన్సిబుల్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్ సూపర్ చార్జర్స్ (4 మ్యాచ్ల్లో ఒక్క విజయం), సథరన్ బ్రేవ్ (4 మ్యాచ్ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్ ఒరిజినల్స్ (3 మ్యాచ్ల్లో 3 పరాజయాలు), వెల్ష్ ఫైర్ (3 మ్యాచ్ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు -
Eng VS SA: ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
England vs South Africa, 3rd T20I: ఇంగ్లండ్తో మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్ ఆట కట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరిగింది. సౌతాంప్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ హెండ్రిక్స్(70 పరుగులు)కు తోడు మార్కరమ్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ప్రొటిస్ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బట్లర్ బృందానికి దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తబ్రేజ్ షంసీ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనం శాసించాడు. దీంతో 16.4 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 90 పరుగుల తేడాతో మూడో టీ20లో గెలిచి.. దణాఫ్రికా సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్స్టో 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రొటిస్ బౌలర్ షంసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హైలెట్ క్యాచ్.. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు మొయిన్ అలీ. అతడైనా జట్టును ఆదుకుంటాడని భావిస్తే.. పదో ఓవర్లోనే అవుటయ్యాడు. మార్కరమ్ బౌలింగ్లో బంతిని అలీ గాల్లోకి లేపగానే.. స్టబ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూసుకువచ్చాడు. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. అసాధ్యమనుకున్న క్యాచ్ను విజయవంతంగా అందుకుని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. సంచలన క్యాచ్తో మ్యాచ్లో హైలెట్గా నిలిచాడు. One of the best catches you'll ever see 👏 Scorecard/clips: https://t.co/kgIS4BWSbC 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/FBlAOf3HUM — England Cricket (@englandcricket) July 31, 2022 ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి అత్యుత్తమ క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు అని పేర్కొంది. ఇందుకు.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సూపర్మాన్ అంటూ స్టబ్స్ను కొనియాడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్లో బ్యాటర్గా మాత్రం స్టబ్స్ విఫలమయ్యాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మొదటి టీ20 మ్యాచ్లో మాత్రం అతడి అద్భుత ఇన్నింగ్స్ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. ఈ మ్యాచ్లో స్టబ్స్ 28 బంతుల్లోనే రెండు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు India Probable XI: అలా అయితే అయ్యర్పై వేటు తప్పదు! ఓపెనర్గా మళ్లీ అతడే!? -
టీ20ల్లో మొయిన్ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా!
బుధవారం బ్రిస్టల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అలీ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా అలీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్పై 17 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన లియామ్ లివింగ్స్టోన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో లివింగ్స్టోన్ రికార్డును అలీ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. అతడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ ప్టో(90) పరుగులతో చేలరేగగా.. మొయిన్ అలీ(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టాబ్స్( 28 బంతుల్లో 72 పరుగులు), రీజా హెండ్రిక్స్(57) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు! -
మెయిన్ అలీ, బెయిర్ స్టోల విధ్వంసం.. తొలి టి20లో ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బుధవారం బ్రిస్టల్ వేదికగా జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్ స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు విధ్వంసం సృష్టించగా.. మెయిన్ అలీ 18 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 52 పరుగులతో ప్రొటీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకముందు డేవిడ్ మలాన్ కూడా 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు, రీజా హెండ్రిక్స్ 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేసినప్పటికి మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ.. బౌలింగ్లో ఒక వికెట్ తీసిన మొయిన్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 గురువారం(జూలై 28న) జరగనుంది. చదవండి: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
ఇంగ్లండ్తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న టెస్ట్ మ్యాచ్పై ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ తన అంచనాలను వెల్లడించాడు. న్యూజిలాండ్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి జోష్ మీద ఉన్న ఇంగ్లండ్ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ గతేడాదే పూర్తై ఉంటే ఫలితం టీమిండియాకే అనుకూలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు లోడెడ్ గన్ను తలపిస్తుందని, దానికి ఎదురుపడిన వారు ఎంతటి వారైనా ఫైరవుతారని హెచ్చరించాడు. టీమిండియాకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సేవలు అందుబాటులో లేకపోవడం మరింత మైనస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మైండ్ సెట్ గతేడాదితో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు స్టోక్స్ టీమ్ ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. అంతిమంగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్ అని జోస్యం చెప్పాడు. కాగా, గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి జరుగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో (4 మ్యాచ్లు) ఉండగా సిరీస్ ఫలితంగా తేలకుండా నిలిచిపోయింది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే 3-1తో, డ్రా చేసుకున్నా 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం 2-2తో సిరీస్ డ్రా అవుతుంది. చదవండి: రోహిత్ దూరమైతే అతడిని కెప్టెన్గా నియమించవద్దు: పాక్ మాజీ కెప్టెన్ -
కాన్వేకు పెళ్లి వర్కౌట్ అయినట్లుంది.. మొయిన్ అలీ ఫన్నీ కామెంట్
Moeen Ali Lauds Devon Conway: హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డెవాన్ కాన్వేపై అతని సహచర ఆటగాడు మొయిన్ అలీ ఫన్నీ కామెంట్ చేశాడు. కాన్వే పెళ్లైనప్పటి నుంచి బ్యాటింగ్లో అదరగొడుతున్నాడని, అతనికి మ్యారేజీ వర్కౌట్ అయినట్లుందని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆదివారం (మే 8) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడిన సునామీ ఇన్నింగ్స్పై మాట్లాడుతూ మొయిన్ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాన్వే అద్భుతమైన ఆటగాడని, అతను అన్ని యాంగిల్స్లో షాట్లు కొట్టగల సమర్ధుడని అలీ కొనియాడాడు. Devonum Deviyum! 💛 Happy Whistles for the soon-to-be's! Wishing all the best to Kim & Conway for a beautiful life forever!#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/yPJe5DBQQK — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 కాగా, దక్షిణాఫ్రికాలో పుట్టి న్యూజిలాండ్ క్రికెటర్గా పేరు ప్రఖ్యాతలు గడించిన డెవాన్ కాన్వే.. 2022 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేతో జతకట్టాడు. సీఎస్కే యాజమాన్యం అతన్ని కోటి రూపాయల బేస్ ప్రైజ్కు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన అనంతరం ఇష్ట సఖి కిమ్ వాట్సన్ను మనువాడేందుకు కొన్ని రోజుల పాటు బయోబబుల్ను వీడిన కాన్వే.. రీఎంట్రీలో వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో పరాజయాల బాట పట్టిన సీఎస్కేను గెలుపు ట్రాక్ ఎక్కించాడు. వివాహం (ఏప్రిల్ 23) అనంతరం సన్రైజర్స్తో మ్యాచ్లో 55 బంతుల్లో 85 పరుగులు చేసిన కాన్వే.. ఆతరువాత ఆర్సీబీపై 37 బంతుల్లో 56, తాజాగా డీసీపై 49 బంతుల్లో 87 పరుగులు స్కోర్ చేశాడు. Now showing - Kim & Conway Wedding Cassette 📼! 📹👉 https://t.co/oYBPQHs25f!#WeddingWhistles #Yellove 🦁💛 pic.twitter.com/pTLdQgTa5n — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 చదవండి: IPL 2022: ఇష్ట సఖిని మనువాడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ -
మొయిన్ అలీకి గాయం.. సీఎస్కే హెడ్ కోచ్ ఏమన్నాడంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి గాయంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫన్ ఫ్లేమింగ్ స్పందించాడు. అతడు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరడానికి మరో వారం రోజులు పడుతుందని ఫ్లేమింగ్ తెలిపాడు. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ట్రైనింగ్ సెషన్లో అలీ గాయపడ్డాడు. "మొయిన్ అలీ చీలమండకు గాయమైంది. అయితే అదృష్టవశాత్తూ.. ఎక్స్రేలో ఎలాంటి ఫ్రాక్చర్ లేదని తేలింది. అయితే అతడికి వారం రోజులు పాటు విశ్రాంతి అవసరం. ఎలాంటి ఫ్రాక్చర్ లేనందున త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము" అని ఫ్లెమింగ్ సోమవారం మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు పేసర్లు దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే ఐపీఎల్-2022 సీజన్కు దూరమయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందింది. చదవండి: IPL 2022: "ఆ స్థానంలో బ్యాటింగ్కు రావడం నా కల.. ఈ సారి అస్సలు వదులుకోను" -
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్.. చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్!
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో పాటు మరి కొన్ని మ్యాచ్లకు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ట్రైనింగ్ సెషన్లో అలీ గాయపడ్డాడు. దీంతో అతడు ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే అతడు ఇంకా గాయం నుంచి కోలులేనట్టు తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో మిచెల్ సాంట్నర్ కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వాంఖడే వేదికగా సోమవారం పంజాబ్ కింగ్స్తో సీఎస్కే తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: నా అద్భుతమైన ఫామ్కు కారణం అతడే: జోస్ బట్లర్ -
IPL 2022: ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్
Moeen Ali Reunites With CSK: ఐపీఎల్ 2022 సీజన్ను ఓటమితో ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్కు ఊరట కలిగించే వార్త తెలిసింది. క్వారంటైన్ నిబంధనల కారణంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇవాళ (మార్చి 28) జట్టుతో కలిశాడు. అలీ జట్టు సభ్యులను పలకరిస్తూ, ఆలింగనం చేసుకుంటున్న వీడియోను సీఎస్కే తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Vanganna Vanakkangana! 🙏🏻 A Superfam welcome to Namma Mo Bhai! 🦁💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Y9L5tqES7r — Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2022 కాగా, ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభ మ్యాచ్లో సీఎస్కే... కేకేఆర్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా నేతృత్వంలోని సీఎస్కే జట్టు కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై తమ రెండో మ్యాచ్ను మార్చి 31న ఆడనుంది. ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్తో సీఎస్కే తలపడనుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్రౌండర్ వచ్చేశాడు
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్కేకు భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. భారత్కు చేరుకున్నాక అతడు నేరుగా జట్టుతో కలిశాడు. వీసా సమస్య కారణంగా అతడు భారత్కు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. కాగా అతడు చెన్నై జట్టు శిబిరంలో చేరినప్పటికి కేకేఆర్తో జరగబోయే తొలి మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందకుంటే అతడు మూడు రోజులు పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. ఇక గత ఏడాది సీజన్లో టైటిల్ చెన్నై టైటిల్ గెలవడంలో అలీ కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు తొలి మ్యాచ్కు దూరం కావడం చెన్నైకు పెద్ద ఎదుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక తొలి మ్యాచ్కు ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకుని అందరినీ షాక్ గురి చేశాడు. కాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. అదే విధంగా సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 26న(శనివారం) వాంఖడే వేదికగా కేకేఆర్తో తలపడనుంది. సీఎస్కే జట్టు: రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, తుషార్ దేశ్పాండే, కెఎమ్ ఆసిఫ్, శివమ్ దూబే, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్, డి సమర్జీత్ సింగ్, డి. , డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, ఆడమ్ మిల్నే, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సి హరి నిశాంత్, ఎన్ జగదీసన్, క్రిస్ జోర్డాన్, కె భగత్ వర్మ చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్రౌండర్ వచ్చేశాడు -
చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నైసూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్కు చేరుకోవడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. కేకేఆర్తో జరిగే తొలి మ్యాచ్కు మొయిన్ అలీ అందుబాటులో లేడని అతడు తెలిపారు. “మొయిన్ అలీ తొలి మ్యాచ్కు దూరమవడం దాదాపు ఖాయం. అతనికి ఇంకా వీసా రాలేదు. బీసీసీఐతో అతడి వీసా సమస్య గురుంచి మేము చర్చించాం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించబడుతుందని నేను భావిస్తున్నాను. అతడు ఇక్కడకు చేరుకున్నాక మూడు రోజుల పాటు క్వారంటైన్ ఉండనున్నాడు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో అతడికి వీసా లభించినా తొలి మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక మార్చి 26 నుంచి వాంఖడే వేదికగా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. చదవండి: BAN vs SA: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి! -
సీఎస్కేకు మరో షాక్.. తొలి మ్యాచ్కు స్టార్ ఆల్రౌండర్ దూరం
సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్కు వచ్చే అవకాశాలు లేవు. దీంతో కేకేఆర్తో మ్యాచ్కు అతను దూరమవనున్నాడని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ''ఫిబ్రవరి 28నే మొయిన్ అలీ ఇండియా వచ్చేందుకు వీసా అప్లికేషన్ పెట్టుకున్నాడు. 20 రోజులైనప్పటికి అతని వీసా అప్లికేషన్పై ఎలాంటి కదలిక లేదు. వాస్తవానికి మొయిన్ అలీ భారత్కు రెగ్యులర్గా వస్తుండేవాడు. ఎప్పుడు రాని వీసా సమస్య ఈసారి మాత్రమే ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. మేం కూడా ఇంగ్లండ్లోని భారతీయ ఎంబసీతో మాట్లాడమని.. మొయిన్ అలీ వీసా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నాం. త్వరలోనే మొయిన్ అలీ జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. బీసీసీఐ కూడా అలీ వీసా విషయమై ఆరా తీసిందని.. సోమవారం కల్లా అతనికి వీసా పేపర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇండియాకు వచ్చినప్పటికి మూడు రోజులు క్వారంటైన్లో ఉండాలి కాబట్టి అలీ కేకేఆర్తో మ్యాచ్కు దూరం కానున్నాడు.'' అంటూ కాశీ విశ్వనాథన్ తెలిపారు. కాగా ఇప్పటికే తొలి మ్యాచ్కు రుతురాజ్ దూరం కాగా.. గాయంతో దీపక్ చహర్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. తాజాగా మొయిన్ అలీ కేకేఆర్తో మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఆల్రౌండర్ను మెగావేలానికి ముందు రూ. 8 కోట్లతో సీఎస్కే రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఆరంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్ సీఎస్కే, కేకేఆర్ మధ్య వాంఖడే వేదికగా జరగనుంది. చదవండి: IPL 2022: ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పడు నెట్బౌలర్గా.. షాకింగ్! IPL 2022: రోహిత్ శర్మ ఎట్టకేలకు సాధించాడు.. ఫ్యాన్స్ ఖుషీ -
13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చటోగ్రామ్ ఛాలెంజర్స్తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో కొమిల్లా విక్టోరియన్స్ బ్యాటర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో అలీ బ్యాట్తోను, బాల్తోను అద్భుతంగా రాణించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్లో 2 సిక్స్లు, 3ఫోర్లు ఉన్నాయి. అదే విధంగా బౌలింగ్లో కూడా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు అలీ చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిన అలీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి కొమిల్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022లో రూ. 8 కోట్లతో మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
రెచ్చిపోయిన మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో అర్థ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో(బీపీఎల్ 2022) ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కొమిల్లా విక్టోరియన్స్, కుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అయితే 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో ఫిఫ్టీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత ఒక సిక్స్, ఒక ఫోర్ బాది మొత్తం 75 పరుగులు రాబట్టాడు. అతనికి జతగా డుప్లెసిస్ 38 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కుల్నా టైగర్స్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. తిసార పెరీరా 26 పరుగులతో టాప స్కోరర్గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో గత సీజన్లో సీఎస్కే తరపున దుమ్మురేపిన మొయిన్ అలీని ఆ జట్టు రిటైన్ చేసుకుంది. Moeen Ali madness in BPL scored 50 from just 23 balls with 8 sixes 🔥🤯#BPL2022 #Cricketpic.twitter.com/LDyUrAPstd — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 11, 2022 -
చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. అతడు ఫామ్లోకి వచ్చేశాడు... 7 సిక్సర్లతో విధ్వంసం!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్-2022 ముందు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ అధ్బుతమైన ఫామ్లో ఉన్నాడు. కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మోయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 7 సిక్స్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్స్ర్లు అలీ బాదాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(52), మోయిన్ అలీ(63), విన్స్(34) పరుగులతో రాణించారు. విండీస్ బౌలరల్లో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. విండీస్ బ్యాటర్లలో కైల్ మేయర్స్(40), జాసన్ హోల్డర్(36) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్, లివింగ్స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక 5 మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు రెండు విజయాలతో సమంగా నిలిచాయి. కాగా వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య ఐదో టీ20 ఆదివారం జరగనుంది. ఇక చెన్నైసూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు మోయిన్ అలీను రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: యార్కర్తో వికెట్ పడగొట్టాడు.. అభిమానులకు దండం పెట్టాడు! -
అయ్యో పాపం విండీస్.. ఆఖరి ఓవర్లో 28 పరుగులు.. అయినా!
బార్బడోస్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఉత్కంఠ బరిత పోరులో ఇంగ్లండ్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా విండీస్ 28 పరుగులు సాధించి ఓటమి పాలైంది. విండీస్ ఆటగాడు అకేల్ హోస్సేన్.. షాకిబ్ మహమూద్ వేసిన అఖరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబాట్టాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(45), మోయిన్ అలీ(31), టామ్ బాంటన్(25) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, ఫాబియన్ ఆలీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది. విండీస్ బ్యాటర్లలో రొమారియో షెపర్డ్(44), అకేల్ హోస్సేన్(44) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు పడగొట్టగా,ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు. కాగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్1-1తో సమమైంది. చదవండి: SA vs IND: రాహుల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత కెప్టెన్గా.. -
రూట్ అందరితో బాగా కలిసిపోతాడు.. అంటే నా కెప్టెన్సీని విమర్శిస్తున్నావా.. లైవ్లోనే
Alastair Cook and Moeen Ali Heated Discussion: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, ఆల్రౌండర్ మొయిన్ అలీ లైవ్లోనే వాగ్వాదానికి దిగారు. ఓ స్పోర్ట్స్ షోలో చర్చ సందర్భంగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. యాషెస్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్టు మొదటి రోజు కవరేజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా జో రూట్ సారథ్యంలోని జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి మూడు టెస్టుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్ ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో రూట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా కుక్, రూట్ మధ్య గల వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రూటీ.. సహచర ఆటగాళ్లతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతాడు’’అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన కుక్.. ‘‘అంటే.. నువ్వు నా కెప్టెన్సీని విమర్శిస్తున్నావా’’అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘అవును... అలాగే అనుకోవచ్చు.. ఇద్దర మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కుకీ సారథ్యంలో నేను బాగా బ్యాటింగ్ చేయగలను.. అదే రూట్ కెప్టెన్సీలో అయితే.. మెరుగ్గా బౌలింగ్ చేయగలను’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ఈ సమాధానంతో చిరాకుపడిన కుక్... ‘‘నువ్వు నన్ను విమర్శించవచ్చు.. కానీ నిన్ను ఎప్పుడూ జట్టు నుంచి తప్పించలేదు. అదే మరి.. రూట్ ఎన్నిసార్లు నిన్ను డ్రాప్ చేశాడు?’’ అంటూ గట్టిగానే ప్రశ్నించాడు. మొయిన్ అలీ సైతం తగ్గేదేలే అన్న రీతిలో.. ‘‘అవును నిజమే. కానీ నా ఇంటర్నేషనల్ కెరీర్లో తొలి ఏడాది 1-9 వరకు ఏ స్థానంలో పడితే ఆ స్థానంలో ఆడించావు’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఆపై వారి సంభాషణ సాగిందిలా... కుక్: నేను నీకు చాలాసార్లు అవకాశమైతే ఇచ్చాను. నువ్వు ఎప్పుడు టెయిలెండర్గా దిగాలి.. ఎప్పుడు ఓపెనింగ్ చేయాలి.. ఏ స్థానానికి నువ్వు పర్ఫెక్ట్ అన్నది నాకు తెలుసు. జట్టు అవసరానికి తగ్గట్లుగానే నేనలా చేశాను. అలీ: నేను ఏం అన్నానో నువ్వు అర్థం చేసుకోవాలి. రూటీ సహచర ఆటగాళ్లతో బాగా కలిసిపోతాడన్నది నా అభిప్రాయం. అంతేతప్ప కుకీ అలాంటి వాడు కాదు అని నేను చెప్పలేదు. కుక్: ఏదేమైనా నీ మాటలను నేను తేలికగా తీసుకోలేను. ఇక ఆట విషయానికొస్తే రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 13 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్ 416 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్ pic.twitter.com/eLylCS8jQt — Liam O’Connor (@liamoconnorrrr) January 5, 2022 -
Eng Vs WI T20 Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్.. కొత్తగా
England Tour OF West Indies- T20 Series Squad: వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్ సీమర్ డేవిడ్ పైన్, జార్జ్ గార్టన్లకు చోటు దక్కింది. విండీస్ టూర్ సందర్భంగా వీరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్కు పాల్ కోలింగ్వుడ్ తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మార్కస్ ట్రెస్కోథిక్ అసిస్టెంట్ కోచ్గా విధులు నిర్వర్తించనున్నాడు. ఈ విషయం గురించి కోలింగ్వుడ్ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్, టైమల్ మిల్స్, డేవిడ్ పైన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, జేమ్స్ విన్సే. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- టీ20 సిరీస్- షెడ్యూల్: ►తొలి మ్యాచ్- జనవరి 22 ►రెండో మ్యాచ్- జనవరి 23 ►మూడో మ్యాచ్- జనవరి 26 ►నాలుగో మ్యాచ్- జనవరి 29 ►ఐదో మ్యాచ్- జనవరి 30. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్కోచ్ -
IPL 2022 Auction: చెన్నై రీటైన్ చేసుకునేది, విడుదల చేసేది వీళ్లనే!
IPL 2022 Auction: CSK To Retain These 4 Players Check Full Details Here: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్-2021 సీజన్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నిర్ణయం తీసుకుంది. జట్టును నాలుగుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రీటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, సురేశ్ రైనాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 16 ఇన్నింగ్స్లో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇక మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ సైతం 633 పరుగులతో రాణించినప్పటికీ విదేశీ ఆటగాళ్ల కోటాలో ఫ్రాంఛైజీ.. బ్యాటింగ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ వైపే మొగ్గు చూపడం విశేషం. కాగా రీటైన్ జాబితాను సమర్పించేందుకు తుది గడువు నవంబరు 30 అన్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్ అనౌన్స్మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు! -
మూడుసార్లు రివ్యూలో సక్సెస్.. టెస్టు చరిత్రలో రెండో బ్యాటర్గా
Tom Latham Was 2nd Batsman Thrice Overturning OUT Decision In Innings.. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో నానాకష్టాలు పడ్డారు. రెండోరోజు ఆటను కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ముగించింది. అంతకముందు 345 పరుగుల వద్ద టీమిండియాను ఆలౌట్ చేసిన కివీస్ ఓవరాల్గా రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రివ్య్వూలు కూడా టీమిండియాకు అనుకూలంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా బౌలర్లు టామ్ లాథమ్ను మూడుసార్లు ఔట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూడుసార్లు రివ్య్వూకు వెళ్లిన లాథమ్కే అనుకూలంగా వచ్చింది. అలా టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో మూడుసార్లు రివ్యూలో సక్సెస్ సాధించిన రెండో బ్యాటర్గా లాథమ్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఇంగ్లండ్కు చెందిన మొయిన్ అలీ.. 2016-17లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఔట్పై మూడుసార్లు రివ్యూ కోరి సక్సెస్ అయిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. కాగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 3, 15, 56వ ఓవర్లో టీమిండియా బౌలర్లు ఎల్బీ విషయంలో అప్పీల్కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ మూడుసార్లు ఔట్ ఇచ్చాడు. అయితే ప్రతీసారి రివ్యూకు వెళ్లగా మూడుసార్లు లాథమ్ నాటౌట్ అని తేలింది. చదవండి: Ravindra Jadeja: క్లీన్బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు -
T20 World Cup 2021: విండీస్ విలవిల.. చెత్త రికార్డు
T20 World Cup 2021: ఐదేళ్ల క్రితం 2016 టి20 ప్రపంచకప్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్. టైటిల్ గెలిచేందుకు చివరి ఓవర్లో వెస్టిండీస్ 19 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రాత్వైట్ నాలుగు వరుస సిక్సర్ల విన్యాసం ప్రతి క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లు గడిచాయి. ఆ ఫైనల్కు కొనసాగింపు అన్నట్లు ప్రస్తుత టి20 ప్రపంచకప్లో ఇరు జట్లు మరోసారి తలపడ్డాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన వెస్టిండీస్ ఈసారి పూర్తిగా తడబడింది. చెత్త ఆటతీరుతో 55 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 లీగ్ల్లో ఆడే ప్రముఖ ఆటగాళ్లు... ఎనిమిదో వరుస ఆటగాడి వరకు ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా... పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర జట్టుగా పేరు... అయితేనేం టి20 ప్రపంచకప్లోని తమ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ బోల్తా పడింది. గ్రూప్–1లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. టి20 ప్రపంచ కప్లో వెస్టిండీస్కిదే అత్యల్ప స్కోరు కాగా... ఓవరాల్గా రెండోది. 2019లో ఇంగ్లండ్పైనే చేసిన 45 పరుగుల తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (4/2)తో తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్రిస్ గేల్ (13 బంతుల్లో 13; 3 ఫోర్లు) మాత్రమే విండీస్ జట్టులో రెండంకెల స్కోరును సాధించాడు. ఛేజింగ్లో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 56 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (22 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు. రషీద్ మ్యాజిక్ ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మ్యాజిక్ స్పెల్తో వెస్టిండీస్ పని పట్టాడు. కేవలం 2.2 ఓవర్లు (14 బంతులు) వేసిన అతడు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో విధ్వంసకర కీరన్ పొలార్డ్ (6), ఆండ్రీ రసెల్ (0)లతో పాటు మెకాయ్ (0), రవి రాంపాల్ (3) వికెట్లు ఉన్నాయి. రషీద్కు మొయిన్ అలీ (2/17), టైమల్ మిల్స్ (2/17) సహకరించడంతో వెస్టిండీస్ కోలుకోలేకపోయింది. జట్టులో గేల్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగిలిన పది మంది సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను అకీల్ తన బౌలింగ్తో ఇబ్బంది పెట్టాడు. అయితే లక్ష్యం మరీ చిన్నదిగా ఉండటం... బట్లర్ నిలవడంతో ఛేదనలో ఇంగ్లండ్ కాస్త తడబడినా విజయాన్ని అందుకుంది. విండీస్ ఇన్నింగ్స్లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు స్కోర్లు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి) లివింగ్స్టోన్ (బి) మొయిన్ అలీ 3; ఎవిన్ లూయిస్ (సి) మొయిన్ అలీ (బి) వోక్స్ 6; గేల్ (సి) మలాన్ (బి) మిల్స్ 13; హెట్మైర్ (సి) మోర్గాన్ (బి) మొయిన్ అలీ 9; బ్రావో (సి) బెయిర్స్టో (బి) జోర్డాన్ 5; పూరన్ (సి) బట్లర్ (బి) మిల్స్ 1; పొలార్డ్ (సి) బెయిర్స్టో (బి) ఆదిల్ రషీద్ 6; రసెల్ (బి) ఆదిల్ రషీద్ 0; అకీల్ హోసీన్ (నాటౌట్) 6; మెకాయ్ (సి) రాయ్ (బి) ఆదిల్ రషీద్ 0; రవి రాంపాల్ (బి) ఆదిల్ రషీద్ 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (14.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–8, 2–9, 3–27, 4–31, 5–37, 6–42, 7–44, 8–49, 9–49, 10–55. బౌలింగ్: మొయిన్ అలీ 4–1–17–2, వోక్స్ 2–0–12–1, మిల్స్ 4–0–17–2, జోర్డాన్ 2–0–7–1, ఆదిల్ రషీద్ 2.2–0–2–4. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) గేల్ (బి) రవి రాంపాల్ 11; బట్లర్ (నాటౌట్) 24; బెయిర్స్టో (సి అండ్ బి) అకీల్ 9; మొయిన్ అలీ (రనౌట్) 3; లివింగ్స్టోన్ (సి అండ్ బి) అకీల్ 1; మోర్గాన్ (నాటౌట్) 7, ఎక్స్ట్రాలు 1; మొత్తం (8.2 ఓవర్లలో 4 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1–21, 2–30, 3–36, 4–39. బౌలింగ్: అకీల్ 4–0–24–2, రవి రాంపాల్ 2–0–14–1, మెకాయ్ 2–0–12–0, పొలార్డ్ 0.2–0–6–0. -
ఇంగ్లండ్ అభిమానులకు షాకిచ్చిన మొయిన్ అలీ..
Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఊహించని షాకిచ్చాడు. 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సాంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకున్న విషయం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. కాగా, 2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్ల్లో 2914 పరుగులు చేయడంతో పాటు 195 వికెట్లు పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా -
CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్లు
దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే బ్యాట్స్మెన్కు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ 2020 సీజన్ను గుర్తు చేస్తూ సీఎస్కే దారుణ ఆటతీరును కనబరుస్తుంది. 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఇక బ్యాట్స్మన్కు వచ్చిన విచిత్ర పరిస్థితి విషయానికి వస్తే.. ఈ సీజన్లో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్ 50, మొయిన్ అలీ 58, అంబటి రాయుడు 72 పరుగులతో రాణించారు. కాగా తాజా మ్యాచ్లో మాత్రం ఈ ముగ్గురు సున్నా పరుగులకే వెనుదిరిగారు. ఇందులో డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌట్లు కాగా.. రాయుడు సున్నా పరుగుల వద్దే దురదృష్టవశాత్తూ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దీనిపై అభిమానులు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. అప్పుడు అర్థసెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్లు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం సీఎస్కే 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రుతురాజ్ (17), జడేజా(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: Glenn Maxwell: సూపర్ ఓవర్ టై.. మ్యాక్స్వెల్ క్లీన్బౌల్డ్ -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్కు పగ్గాలు..? -
కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆటలో తొలి రెండు రోజులు ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడు, నాలుగు రోజులు టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. ఇక ఐదో రోజు ఇరు జట్లకు కీలకంగా మారింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపుకు 291 పరుగుల దూరంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో కొన్ని కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. ► విరాట్ కోహ్లిని ఔట్ చేయడం ద్వారా మొయిన్ అలీ కొత్త రికార్డు సాధించాడు. ఓవరాల్గా మొయిన్ అలీ అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లిని ఇప్పటివరకు 10 సార్లు ఔట్ చేశాడు. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్గా నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో ఆరుసార్లు కోహ్లిని అవుట్ చేశాడు. టెస్టుల్లో కోహ్లిని ఎక్కువసార్లు అవుట్ చేసిన జాబితాలో అలీ రెండో స్థానంలో ఉన్నాడు. జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), నాథన్ లియాన్(ఆస్ట్రేలియా)లు కోహ్లిని ఏడేసి సార్లు ఔట్ చేసి తొలి స్థానంలో నిలిచారు. ► 21వ శతాబ్దంలో ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 400కు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2002లో నాటింగ్హమ్ టెస్టులో టీమిండియా 428 పరుగులు చేసింది. ► డకౌట్ల విషయంలో అజింక్యా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై మూడుసార్లు డకౌట్గా వెనుదిరిగిన తొలి భారత బ్యాట్స్మన్గా రహానే నిలిచాడు. 2014, 2018లో ఇదే ఓవల్ మైదానంలో రహానే రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ► ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆసియా ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు ఆసియా నుంచి సచిన్, ద్రవిడ్లు మాత్రమే ఉన్నారు. చదవండి: Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి! చదవండి: Ajinkya Rahane: రహానే ఎందుకిలా.. అభిమానుల ఆగ్రహం Rahane's poor form continues 😓 The vice-captain departs for a 🦆 Tune into #SonyLIV | JioTV+ 📺#ENGvIND #AjinkyaRahane #Wicket pic.twitter.com/Gc9WetmTfF — JioTV+ (@jiotvplus) September 5, 2021 -
మొయిన్ అలీ అరుదైన రికార్డు; టీమిండియాపై ఆరో స్పిన్నర్గా
లార్డ్స్: ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్గా మొయిన్ అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ వికెట్ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా భారత్పై టెస్టుల్లో మురళీధరన్(శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్ గిబ్స్(వెస్టిండీస్) మూడో స్థానంలో, అండర్వుడ్(ఇంగ్లండ్) 62 వికెట్లతో నాలుగు.. 52 వికెట్లతో బెనాడ్(ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో చేరిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 62 టెస్టుల్లో 2831 పరుగులు.. 190 వికెట్లు, 112 వన్డేల్లో 1877 పరుగులు.. 87 వికెట్లు, 38 టీ20ల్లో 437 పరుగులు.. 21 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు ఇన్నింగ్స్కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్లో కనిపించిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. -
వారంతా విఫలం.. మొయిన్ అలీకి ఛాన్స్
లండన్: గురువారం నుంచి లార్డ్స్ వేదికగా భారత్తో జరిగే రెండో టెస్టు కోసం ఆల్రౌండర్ మొయిన్ అలీని ఇంగ్లండ్ జట్టులోకి తీసుకున్నారు. భారత్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా స్టార్ ఆల్రౌండర్లు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్లు సిరీస్కు దూరమవ్వడం ఇంగ్లండ్కు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ‘ది హండ్రెడ్’ లీగ్లో రాణిస్తున్న అలీకి ఇంగ్లండ్ కోచ్ సిల్వర్వుడ్ జట్టులో స్థానం కల్పించారు. ఇక ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఐదో రోజు ఆటను రద్దు చేయడంతో తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: సెకండ్ ఫేజ్ ఆడడంపై డేవిడ్ వార్నర్ క్లారిటీ -
'ఐపీఎల్లో ఆడినా.. జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాలేడు'
ముంబై: ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన మొయిన్ అలీ 132 పరుగులతో పాటు 4 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కీలక సమమంలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి గేమ్ చేంజర్ అయ్యాడు. అంతేగాక సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వస్తూ పరుగులు చేస్తూ కీలకంగా మారాడు. గతేడాది ఆర్సీబీ తరపున ఆడిన మొయిన్ అలీని వేలానికి ముందు రిలీజ్ చేయగా.. సీఎస్కే అతని ఆటపై నమ్మకముంచి రూ. 7 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అలీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ''ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టుకు వచ్చేసరికి టీ20ల్లో మాత్రం ఆప్షనల్ ఆటగాడిగా ఉంటాడే తప్ప రెగ్యులర్ సభ్యుడు కాలేడు. ఎవరైనా గాయపడడం లేదా సిరీస్ నుంచి వైదొలిగితేనో అతనికి అవకాశం వస్తుంది. 20 ఏళ్ల కిందట ఆసీస్ జట్టుకు రెగ్యులర్గా ఆడడానికి మైక్ హస్సీ, డామియన్ మార్టిన్లు ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చిందో.. అచ్చం అదే పరిస్థితిలో ప్రస్తుతం మొయిన్ అలీ ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడే.. కానీ అతని నుంచి మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన రావాలని అందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం అతను తన కెరీర్ పరంగా టాప్గా కొనసాగుతున్నాడు.. త్వరలోనే అతను ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటాడని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్ -
సీఎస్కే అసలుసిసలైన ఆల్రౌండర్ అతనే..
ముంబై: మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు రాబట్టడమేకాకుండా, తన కోటా ఓవర్లను విజయవంతంగా పూర్తి చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్న సీఎస్కే ఆల్రౌండర్ మొయిన్ అలీపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కీలకమైన వన్డౌన్లో రాణిస్తూ, బౌలర్ పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మొయిన్ అలీ ఈ సీజన్లో సీఎస్కే అసలుసిసలైన ఆల్రౌండర్గా అవతరించాడని ఆకాశానికెత్తాడు. ప్రస్తుత సీజన్లో చెన్నై ఆడిన మూడో మ్యాచ్ల్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి వరుసగా 36, 46, 26 పరుగులు స్కోర్ చేసిన మొయిన్.. సోమవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మూడు కీలకమైన వికెట్లు(మిల్లర్, రియాన్ పరాగ్, మోరిస్) పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాశించాడని కొనియాడాడు. మొయిన్ లాంటి అసలుసిసలైన ఆల్రౌండర్ లేని కారణంగానే గత సీజన్లో చెన్నై ఆఖరి స్థానానికి పడిపోయిందని పేర్కొన్నాడు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్ అలీని దక్కించుకోవడం సీఎస్కేకి కలిసొచ్చిందని, మున్ముందు జరుగబోయే మ్యాచ్ల్లో అతని ఆల్రౌండ్ ప్రతిభ జట్టుకు మేలుచేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్లో 3 మ్యాచ్ల్లో 108 విలువైన పరుగులతో పాటు 4 కీలకమైన వికెట్లు పడగొట్టిన మొయిన్..చెన్నై తరుపు ముక్కగా మారాడని ప్రశంసించాడు. అలాగే ఫామ్లోని లేని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను ఫ్లెమింగ్ వెనకేసుకొచ్చాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైనా రుతురాజ్ టెక్నిక్ పరంగా ఉత్తమ ప్లేయర్ అని కొనియాడాడు. రుతురాజ్కు మరిన్ని అవకాశలు కల్పిస్తామని, ఆతరువాతే ఉతప్పకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నాడు. జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్లు సాధించకపోయినా.. ఆయా ఆటగాళ్లు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన సీఎస్కే.. బుధవారం(ఏప్రిల్ 21న) జరుగబోయే తదుపరి మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది. చదవండి: డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుంది: ఐసీసీ -
ఇంత దారుణమా.. సోషల్ మీడియాను బహిష్కరించాల్సిందే!
లండన్: ఇటీవల కాలంలో ఇంగ్లండ్ క్రికెటర్లపై సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువగా కావడంతో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసహనం వ్యక్తం చేశాడు. తన సహచర క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్,. మొయిన్ అలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అందుకు సోషల్ మీడియా బాయ్కాట్ ఒక్కటే మార్గమని ఒక సందేశాన్ని ఇచ్చాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అంతా కలిసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.ఇంగ్లండ్కు చెందిన స్వానిసా, బర్మింగ్హమ్, స్కాట్ చాంపియన్స్, రేంజర్స్ ఫుట్క్లబ్లలోని పలువురు ఆటగాళ్లు తరుచు జాతి వివక్షకు గురౌతున్నారు. వారిపై జాతి వివక్ష వేధింపులు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ కావడంతో ఆ ప్లాట్ఫామ్ను బహిష్కరించేందుకు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ను కూడా బ్రాడ్ కోరుతున్నాడు. ఆన్లైన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియా బహిష్కరణ ఒక్కటే మార్గమన్నాడు. అలా చేస్తేనే స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుందని బ్రాడ్ తెలిపాడు. ఇది చాలా దారుణమైన అంశమని, దీనిపై ఆ యాప్ క్రియేటర్స్ అయినా చర్యలు తీసుకోవాలన్నాడు. సోషల్ మీడియా పోస్టులు పబ్లిక్లోకి వచ్చేముందు వారు జవాబుదారీగా ఉండాలన్నాడు. కాగా, జోఫ్రా ఆర్చర్పై కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో జాతి వివక్ష పోస్టులు పెట్టగా, ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా భారత్లో ఉన్న మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేశారు. ఈ తరహా పోస్టులను అరికట్టాలంటే సోషల్ మీడియాను బహిష్కరించడమే మార్గమని బ్రాడ్ అంటున్నాడు. ఈ క్రమంలోనే జట్టు మొత్తం కలిసి వస్తే ఒక గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నాడు. -
తస్లీమాపై పరువు దావా నష్టం వేయనున్న మొయిన్ అలీ
ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ''మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేసింది. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మొయిన్ అలీపై తస్లీమా చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ ఆమెను ఉతికారేశారు. తాజాగా తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలపై మొయిన్ అలీ పరువు నష్టం దావా వేయనున్నట్లు సమాచారం. ''మొయిన్ అలీపై తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు అలీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. అందుకే లీగల్ పద్దతిలో మా లాయర్తో చర్చించి కోర్టును ఆశ్రయించనున్నాం. ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడినందుకు తస్లీమాపై పరువు నష్టం దావా వేయనున్నాం.''అంటూ అలీ మేనేజ్మెంట్ కంపెనీ ఎసెస్ మిడిల్ ఈస్ట్ తన ట్విటర్లో రాసుకొచ్చింది. అయితే మొయిన్ అలీ తస్లీమా వ్యాఖ్యలపై స్పందించలేదు.. అయితే ఈ విషయాన్ని తన మేనేజ్మెంట్ చూసుకుంటుందని అలీ భావించి ఉంటాడని సమాచారం. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో మెయిన్ అలీ సీఎస్కేకు ఆడనున్న సంగతి తెలిసిందే. కాగా వేలంలో సీఎస్కే అలీని రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్కే ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ను ఏప్రిల్10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. చదవండి: ‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే For the record - we are consulting our lawyers with regards the defamatory tweet made by @taslimanasreen in regards to Moeen Ali and will look at the possible angles for legal proceedings - one mustn’t be allowed to utter such nonsense and be allowed to get away with it — Aces Middle East (@Aces_sports) April 6, 2021 -
‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు’
న్యూఢిల్లీ: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో తస్లీమాపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రికెటర్పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, తన చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదు కదా? అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తస్లీమా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కాగా, త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తగా జెర్సీని రూపొందించింది. అయితే ఆ జర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున దాని బదులు మరో జర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్ అలీ జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యమే మొయిన్ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైంది. కాగా, లోగో అంశంలో మొయిన్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి: ఒకే మ్యాచ్లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే లక్ష్యం: షకీబ్ -
‘ఆ జెర్సీ వేసుకోలేను’ వార్తలపై సీఎస్కే సీఈవో క్లారిటీ
ముంబై: తాను ఆల్కహాల్ లోగో ఉన్న జెర్సీలను ధరించనంటూ సీఎస్కే ఆటగాడు మొయిన్ అలీ చేసిన రిక్వస్ట్కు ఆ ఫ్రాంచైజీ ఒప్పుకున్నట్లు నిన్నంతా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఇండియా టుడే కాశీ విశ్వనాథన్ను కలవగా ఆయన అది వాస్తవం కాదని పేర్కొన్నారు. ‘మొయిన్ అలీ లోగో అంశంపై మీడియా రిపోర్ట్లో ఏదైతే వచ్చిందో అందులో వాస్తవం లేదు. అసలు మొయిన్ అలీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి రిక్వస్ట్ చేయలేదు’ అని తెలిపారు. తన జెర్సీపై ఆల్కాహాల్ కంపెనీ అయిన ఎస్ఎన్జే 10000 లోగోను మొయిన్ తీశాయమన్నాడని జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. స్వతహాగా ఆల్కహాల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి మొయిన్ అలీ ఇష్టపడని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎస్కేను కూడా రిక్వస్ట్ చేసే ఉంటాడనేది వార్తల్లోని సారాంశం. కాగా, దీన్ని సీఎస్కే ఖండించడంతో లోగో అంశంపై అలీ ఎటువంటి విజ్ఞప్తి చేసుకోలేదనేది అర్థమైంది. జెర్సీలను ధరించడంలో ఎటువంటి మినహాయింపు లేకుండా మిగతా క్రికెటర్లు మాదిరే దాన్ని ధరిస్తాడనే విశ్వనాథన్ మాటల ద్వారా తేలిపోయింది. ఇక సీఎస్కే వెబ్సైట్లో మొయిన్ అలీ మాట్లాడుతూ.. నేను మా ఫ్రాంచైజీ ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడుతూ వారి ప్రదర్శన గురించి ఎక్కువగా చర్చిస్తున్నా. నేను ఒక గొప్ప కెప్టెన్ అనే విషయాన్ని నేను నమ్ముతా. ధోని కెప్టెన్సీలో ఆడుతున్నామంటే గ్యారంటీగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దానికదే వచ్చేస్తుంది. అటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు ధోని. ఈ ఐపీఎల్లో సీఎస్కేకు ఆడటం నాకు తెలియన అనుభూతిని తీసుకొచ్చింది’ అని పేర్కొన్నాడు. ఈ సీజన్లో మొయిన్ అలీని రూ. 7కోట్లు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అలీని సీఎస్కే దక్కించుకుంది. గత మూడు సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న మొయిన్ అలీని ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. దాంతో వేలంలోకి రాగా సీఎస్కే దక్కించుకుంది. ఏప్రిల్10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో సీఎస్కే తలపడనుంది. ఇక్కడ చదవండి: పొలార్డ్ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే సీఎస్కే జట్టు ఇదే -
ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే
ముంబై: ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని రూ. 7కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొయిన్ అలీ స్వతహాగా ఆల్కహాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జెర్సీలను ధరించడానికి ఇష్టపడడు. అటువంటి జెర్సీలను తాను వేసుకోనని ఇంతకముందు చాలాసార్లు తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అది ఇంగ్లండ్ తరపున లేదా ఇతర డమొస్టిక్ క్రికెట్ ఏది ఆడినా సరే అతను వేసుకొనే జెర్సీపై ఆల్కహాల్కు సంబంధించిన లోగోను లేకుండా చూసుకునేవాడు. తాజాగా సీఎస్కే జెర్సీపై ఎస్ఎన్జె 10000 లోగో ఉండడం గమనించే ఉంటాం. దీంతో ఆల్కహాల్ లోగో ఉన్న జెర్సీని తాను వేసుకోలేనని.. ప్లెయిన్ జెర్సీని వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అలీ సీఎస్కేను కోరాడు.కాగా అలీ ప్రతిపాదనకు సీఎస్కే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అతను వేసుకొనే జెర్సీపై ఆ లోగోను తొలగించనున్నట్లు సీఎస్కే స్పష్టం చేసింది.ఇంతకముందు మొయిన్ అలీ ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా ఆల్కహాల్ లోగో లేని జెర్సీనే ధరించి ఆడాడు. కాగా మొయిన్ అలీ ఇప్పటివరకు 19 మ్యాచ్లాడి 309 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ధోని సారధ్యంలోని సీఎస్కేకు ఆడేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అలీ ఇటీవలే చెప్పుకొచ్చాడు. చదవండి: 'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్ ఆడితే బాగుండేది' 'మేం సీఎస్కేకు ఆడలేం'.. కారణం అదేనట -
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్: ఆరంభం, ముగింపు ఒకేలా!
పుణే: ఇంగ్లండ్తో మూడో వన్డేలో కోహ్లి ఏడు పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 18 ఓవర్ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లిని అత్యధికసార్లు ఔట్ చేసిన జాబితాలో మొయిన్ అలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రేమ్ స్వాన్, జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్లు కోహ్లిని ఎనిమిదిసార్లు ఔట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసింది టిమ్ సౌతీ. న్యూజిలాండ్కు చెంది ఈ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ 10సార్లు ఔట్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అరుదైన సందర్భం.. ఆరంభం, ముగింపు ఒకేలా! టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా రెండో టెస్టులో కోహ్లి వికెట్ను రెండు ఇన్నింగ్స్ల్లోనూ మొయిన్ అలీనే దక్కించుకున్నాడు. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లిని బౌల్డ్ చేసిన మొయిన్.. రెండో ఇన్నింగ్స్లో ఎల్బీగా ఔట్ చేశాడు. తొలి టెస్టులో చోటు దక్కని మొయిన్.. రెండో టెస్టు తుది జట్టులో చోటు సంపాదించి ఎనిమిది వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లను మొయిన్ తీశాడు. కాగా, తాజా మ్యాచ్ ఇంగ్లండ్కు ఈ పర్యటనలో చివరిది. ఇక్కడ మొయిన్ అలీ ఖాతాలోనే కోహ్లి వికెట్ చేరింది. అది కూడా బౌల్డ్ రూపంలో కోహ్లి వికెట్ వచ్చింది మొయిన్ అలీకి. ఇలా మొయిన్ అలీ ఆడిన తొలి మ్యాచ్లోనూ, చివరి మ్యాచ్లోనూ కోహ్లి వికెట్ను తీయడం ఒకటైతే, బౌల్డ్ రూపంలో రావడం మరొకటి. ఇది అరుదైన సందర్భమనే చెప్పాలి. ఇంగ్లండ్తో చివరి మ్యాచ్లో కోహ్లి బౌల్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, 2019 ఆగస్టు నుంచి విరాట్ వన్డే యావరేజ్ తగ్గడానికి కూడా స్పిన్ బౌలింగ్లో ఔట్ కావడమేనని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. ఇక్కడ చదవండి: ఆ సిక్స్ దెబ్బకు.. బ్యాట్నే చెక్ చేశాడు! -
అతనొక గొప్ప డ్రింక్ మిక్సర్ అయ్యిండొచ్చు
లండన్: టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-3 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లండ్ జట్టుపై ముప్పేట దాడి మొదలైంది. జట్టు యాజమాన్యం అవలంభిస్తున్న రోటేషన్ పద్దతి కారణంగానే ఇంగ్లీష్ జట్టు సిరీస్ను కోల్పోవాల్సి వచ్చిందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. టీ20 స్పెషలిస్ట్ అయిన స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీకి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం కల్పించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మండిపడ్డాడు. టీ20 సిరీస్కు ముందు జరిగిన టెస్టు సిరీస్లో మొయిన్ అలీ ఆడిన ఏకైక టెస్టులో(రెండో టెస్టు) ఆశాజనకమైన ప్రదర్శన(8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో18 బంతుల్లో 43 పరుగులు) కనబర్చినప్పటికీ.. రోటేషన్ పద్దతి కారణంగా అతన్ని ఆఖరి రెండు టెస్టు మ్యాచ్లకు దూరం పెట్టడంపై వాన్ ధ్వజమెత్తాడు. తిరిగి టీ20 సిరీస్ కోసం అతను జట్టులో చేరినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా, కేవలం బెంచ్కే పరిమితం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొయిన్ను ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్.. డ్రింక్స్ సప్లయర్గా, ఎనర్జీ డ్రింక్స్ మిక్సర్ ఉపయోగించుకుందని ఆయన ధ్వజమెత్తాడు. మొయిన్ ఓ గొప్ప డ్రింక్ మిక్సర్ అయ్యిండొచ్చు .. అందుకే యాజమాన్యం అతనినలా ఉపయోగించుకొని ఉండవచ్చని వ్యంగ్యంగా స్పందించాడు. రోటేషన్ పద్దతి పేరుతో యాజమాన్యం ఆటగాళ్లతో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. కాగా, సిరీస్ మొత్తంలో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం కల్పిస్తే, ఇంగ్లండ్ మాత్రం కేవలం ఆదిల్ రషీద్కే పదేపదే అవకాశం కల్సిస్తూ, మొయిన్అలీని విస్మరించిడంపై ఆయన మండిపడ్డాడు. -
పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ
అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. జేసన్ రాయ్ 49 పరుగులతో రాణించగా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ కీలక మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆర్చర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ విజయం అనంతరం.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు. ఇంతలో అదిల్ రషీద్ వద్దకు వచ్చిన ఆర్చర్ అతన్ని హగ్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పాడు. రషీద్ వెనుకే ఉన్న మొయిన్ అలీ కూడా ఆర్చర్కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఆర్చర్ మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అలీని పట్టించుకోలేదు.. దీంతో మైండ్ బ్లాంక్ అయిన అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ చర్య సోషల్ మీడియాలో ఆసక్తి కలిగించింది. తుది జట్టులో రషీద్కు చోటు దక్కడంతో తొలి టీ20లో అలీ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం తమదైశ శైలిలో కామెంట్లు చేశారు. ఆర్చర్, అలీ మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే ఆర్చర్ అలీని పట్టించుకోలేదని.. ఇద్దరి మధ్య ఏవేనై పాత గొడవలున్నాయేమో అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) జరగనుంది. చదవండి: పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం Ouch pic.twitter.com/IOWFIW3Z1g — Maara (@QuickWristSpin) March 12, 2021 -
మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం!
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కోసం తీవ్ర పోటీ నడిచింది. పంజాబ్ కింగ్స్- చెన్నై సూపర్ కింగ్స్లు మొయిన్ కోసం చివరి వరకూ పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే అతని ధర పెరుగుతూ పోయింది. మొయిన్ అలీ కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా అతన్ని రూ. 7 కోట్లకు సీఎస్కే పంతం పట్టి మరీ దక్కించుకుంది. ఇక బంగ్లాదేశ్ అల్రౌండర్ షకీబుల్ హసన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. షకీబుల్ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కేకేఆర్ సొంతం చేసుకుంది. షకీబుల్ కోసం పంజాబ్ కింగ్స్ కూడా పోటీ పడినా కేకేఆర్ చివరి దక్కించుకుంది. ఇక్కడ చదవండి: : స్టీవ్ స్మిత్కు జాక్పాట్ లేదు -
'అలీ బాయ్.. అజిత్ సినిమా అప్డేట్ ఏంటి!'
చెన్నై: టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీతో ఫ్యాన్స్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాట సినిమాలను విపరీతంగా అభిమానిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ హీరోల కోసం అభిమానులు ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తమిళనాట సూపర్స్టార్గా వెలుగొందుతున్న అజిత్ తాజాగా 'వాలిమయి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాట ఈ చిత్రంపై చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులోనూ అభిమానుల మధ్య ఈ సినిమాకు సంబంధించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ స్పిన్నర్ అలీతో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అజిత్ సినిమా అప్డేట్ గురించి అడిగారు. బౌండరీ లైన్ వద్ద నిలబడి ఉన్న మొయిన్ అలీతో.. 'అలీ బాయ్.. వాలిమయి అప్డేట్ ఏంటి 'అని అడిగారు. వారి భాష అర్థంకాని మొయిన్ అలీ నవ్వుతూ వారికి చేతులూపాడు. అలీ సంభాషణను ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో ట్రెండింగ్గా మారింది. కాగా ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో కీలకపాత్ర పోషించాడు. తొలిరోజు కోహ్లిని అలీ అవుట్ చేసిన తీరు హైలెట్గా నిలిచింది. అంతేగాక తొలిరోజు ఆటలో మూడు వికెట్లు తీసి స్పిన్ సత్తా చాటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు వద్ద తొలిరోజు ఆటను ముగించిన టీమిండియా రెండోరోజు మరో 29 పరుగులు మాత్రమే జోడించి 329 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్లో రోహిత్ 161 పరుగులు, రహానే 66 పరుగులు, రిషబ్ పంత్ 58 నాటౌట్ రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4 వికెట్లతో రాణించగా, ఓలీ స్టోన్ 3, జాక్ లీచ్ 2 వికెట్లు తీయగా.. కెప్టెన్ రూట్ ఒక వికెట్ తీశాడు. చదవండి: మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా? #Thala fans asking #Valimai update to #MoeenAli ...😀😀😀😀 pic.twitter.com/3ZCSfvmFEt — Anand (@anandviswajit) February 13, 2021 -
తొలి స్పిన్నర్గా మొయిన్ రికార్డు
చెన్నై: ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(161; 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్లు), అజ్యింకా రహానే(67; 149 బంతుల్లో 9ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఈ జోడీ 162 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రోహిత్-రహానేల జోడి ఆదుకుంది. కాగా, వీరిద్దరూ స్పల్ప వ్యవధిలో ఔటైన తర్వాత టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది. ఇన్నింగ్స్ 73 ఓవర్లో రోహిత్ ఔట్ కాగా, 76 ఓవర్లో రహానే పెవిలియన్ చేరాడు. రోహిత్ను జాక్ లీచ్ బోల్తా కొట్టించగా, రహానేను మొయిన్ ఒక అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి ఆఫ్ సైడ్ పడి వికెట్ల మీదుకు రావడంతో రహానే ఔటయ్యాడు. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్లో ఓపెనర్ శుబ్మన్ గిల్ డకౌట్ కాగా, విరాట్ కోహ్లి కూడా పరుగులేమీ నిష్క్రమించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిషభ్ పంత్(33 బ్యాటింగ్; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్( 5 బ్యాటింగ్; 7 బంతుల్లో 1 ఫోర్)లు క్రీజ్లో ఉన్నారు. తొలి స్పిన్నర్గా రికార్డు టీమిండియా ఇన్నింగ్స్లో భాగంగా మొయిన్ అలీ వేసిన 22 ఓవర్ రెండో బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. బంతిని కోహ్లి అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. ఆ బంతికి కోహ్లి సైతం షాక్కు గురయ్యాడు. అసలు బంతి వికెట్లను తాకిందా.. లేక కీపర్ చేతులు తగిలి వికెట్లపడ్డాయా అనే సందిగ్థత కోహ్లి ముఖంలో కనబడింది. కానీ అది క్లియర్ ఔట్ కావడంతో కోహ్లి పెవిలియన్ చేరక తప్పలేదు. అయితే మొయిన్ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరింది. టెస్టుల్లో కోహ్లిని డకౌట్ చేసిన తొలి స్పిన్నర్గా మొయిన్ రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఇప్పటివరకూ కోహ్లి 11సార్లు డకౌట్ కాగా స్పిన్నర్కు డకౌట్ కావడం ఇదే తొలిసారి. టెస్టుల్లో కోహ్లిని డకౌట్ చేసిన బౌలర్లలో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ప్యాట్ కమిన్స్, బెన్ హిల్పెనాస్, స్టార్క్, లక్మాల్, అబు జాయద్, ప్లంకట్, రవి రాంపాల్, కీమర్ రోచ్లు ఉన్నారు. వీరంతా మీడియం పాస్ట్, పేసర్లు కావడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: కింగ్స్ పంజాబ్కు ‘వేలం’ కష్టాలు -
కోహ్లి పేరిట మరో చెత్త రికార్డు
చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట మరోచెత్త రికార్డు నమోదు అయింది. రెండో టెస్టులో భాగంగా కోహ్లి ఇంగ్లండ్ స్పిన్నర్ మెయిన్ అలీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి డకౌట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అలీ వేసిన బంతి ఆఫ్స్టంప్కు అవతల పడుతూ వెళ్లడంతో కోహ్లి కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంఫ్ వికెట్ను గిరాటేసింది. దీంతో అసలేం జరిగిందో అర్థం కాక కోహ్లి షాక్ తిన్నాడు. తన అవుట్పై సందేహం వచ్చి కోహ్లి రివ్యూ కోరగా.. అక్కడా నిరాశ ఎదురైంది. దీంతో తన టెస్టు కెరీర్లో కోహ్లి 11వ సారి డకౌట్గా వెనుదిరగ్గా.. ఒక స్పిన్నర్ బౌలింగ్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకముందు 10 సార్లు కోహ్లి ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే డకౌట్గా వెనుదిరగాడు. రవి రాంపాల్, బెన్ హిల్పెనాస్, లియాన్ ఫ్లంకెట్, జేమ్స్ అండర్సన్, మిచెల్ స్టార్క్, సురంగ లక్మల్, స్టువర్ట్ బ్రాడ్, పాట్ కమిన్స్, కీమర్ రోచ్, అబి జావెద్లు ఫాస్ట్ బౌలర్లు కాగా.. అలీ ఒక్కడే కోహ్లిని డకౌట్ చేసిన స్పిన్నర్గా అరుదైన గుర్తింపు పొందాడు. అంతేగాక క్లీన్బౌల్డ్ రూపంలోనే వరుసగా రెండోసారి కోహ్లి డకౌట్గా వెనుదిరగడం విశేషం. కాగా అంతర్జాతీయ కెరీర్లో కోహ్లికి మొత్తం 26 డకౌట్లున్నాయి. టీమిండియా తరపున టెస్టు కెప్టెన్గా ఉంటూ అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా కోహ్లి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజా డకౌట్తో కోహ్లి ధోనిని అధిగమించగా.. 13 డకౌట్లతో సౌరవ్ గంగూలీ మొదటి స్థానంలో ఉన్నాడు. చదవండి: 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' What a beautiful delivery from Moeen Ali and after that Virat Kohli reaction is priceless 👏👏#INDvsENG #RohithSharma #ViratKohli #MoeenAli #lunch pic.twitter.com/2CNnaRG0Wh — Mateen (@TheSyedMateen) February 13, 2021