Nikhil Siddhartha
-
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'అనంతం'.. టీజర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరో!
వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం తాజా చిత్రం "అనంతం". ఈ సినిమాలో రుచిత సాధినేని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీని టీజర్ విడుదల చేశారు మేకర్స్. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉందని నిఖిల్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.నిర్మాతలు మాట్లాడుతూ - 'మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి థియేట్రికల్ రిలీజ్కు తీసుకొస్తాం' అని అన్నారు. -
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్తో టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వయంభూ సెట్స్పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. -
'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్ను విడుదల చేశారు.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లండన్ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు అనే డైలాగ్ వింటే లవ్ అండ్ యూత్ఫుల్ స్టోరీ అని అర్థమవుతోంది. 90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా అనే నిఖిల్ డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా హర్ష చెముడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.Did an Experimental Screenplay based breezy film with @sudheerkvarma @rukminitweets @itsdivyanshak @SVC_official @harshachemudu Here is the teaser 👇🏼 https://t.co/hHtdfqcEDe @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @Rip_Apart @NavinNooli @JungleeMusicSTH— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
టాలీవుడ్ మూవీ సెట్లో ఆయుధ పూజ.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభూ. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్తో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా మూవీ టీమ్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా షూటింగ్ సెట్లో ఆయుధ పూజ నిర్వహించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ చిత్రంలో ఉపయోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఈ దీపావళికి నిఖిల్ సైతం థియేటర్లలో సందడి చేయనున్నాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించనున్నారు.Worshipping the tools of our livelihood ✨Ayudha Pooja celebrations from the sets of #Swayambhu ❤🔥Team #Swayambhu wishes everyone a Happy Dussehra 🔥@actor_Nikhil @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @DOPSenthilKumar @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/mhHMczqmgd— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్..
'కార్తికేయ 2', '18 పేజీస్' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ గతేడాది 'స్పై' చిత్రంతో బోల్తా పడ్డాడు. ఈసారి ఎలాగైనా మరో బంపర్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'లో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రీకర్, భువన్ నిర్మిస్తున్నారు. ‘బాహుబలి, ఆర్ర్ఆర్’ వంటి చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.శనివారం (జూన్ 1) నాడు నిఖిల్ బర్త్డేను స్వయంభూ సెట్లో సెలబ్రేట్ చేశారు. స్వయంభూ సినిమాలోని నిఖిల్ గెటప్స్తో కేక్ను ముస్తాబు చేశారు. నభా ఆ కేకుపై క్యాండిల్స్ పెట్టి వెలిగించింది. యుద్ధవీరుడి గెటప్లో నిఖిల్ కేక్ ముందు కత్తితో నిలబడ్డాడు. ఆ తర్వాత హీరోయిన్తో పాటు అక్కడున్నవారికి కేక్ తినిపించాడు. ఈ వీడియోను నిర్మాణ సంస్థ పిక్సెల్ స్టూడియో ట్విటర్లో విడుదల చేసింది. A sweet surprise for @actor_Nikhil on the sets of #Swayambhu ✨The team celebrated his birthday on the sets with all the cast and crew extending their heartfelt wishes to Nikhil ❤🔥@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar pic.twitter.com/eUolNTQfE9— Pixel Studios (@PixelStudiosoff) June 2, 2024 చదవండి: రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి -
టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!
యంగ్ హీరో నిఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ఫ్యామిలీ, రీసెంట్గా పుట్టిన కొడుకు కోసం ఓ త్యాగం చేశాడు. ఇకపై కొన్ని విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్సయ్యాడు. తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఇదంతా బయటపెట్టాడు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: హీరోయిన్కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!) 'హ్యాపీడేస్' సినిమాలో ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో పేరు సంపాదించాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'స్వయంభు' అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. నిఖిల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2020లో పల్లవి అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లకు బాబు పుట్టాడు. తాజాగా తన కొడుక్కు ధీర సిద్ధార్థ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడో ఓసారి అయినా నైట్ పార్టీలకు వెళ్లేవాడినని, ఇకపై మాత్రం టైమ్ అంతా తన కొడుక్కే ఇస్తానని చెప్పుకొచ్చాడు. పిల్లలు పుడితే తల్లిదండ్రులు మారతారని అంటారు. బహుశా నిఖిల్ కూడా కొడుకుతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనమాట. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) -
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్బాల్ కౌన్సిల్ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్బాల్ మ్యాచ్ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
నిఖిల్ 'కార్తికేయ'.. ముచ్చటగా మూడోసారి
హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందూ మొండేటిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’(2014) సూపర్ హిట్గా నిలిచింది. అలాగే వీరి కాంబోలో వచ్చిన ద్వితీయ సినిమా ‘కార్తికేయ 2’ (2022) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ‘కార్తికేయ 3’ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. నిఖిల్, చందూ కలయిక ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతోంది. ‘కార్తికేయ 3’ సినిమా రూపొందనున్నట్లు స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీకి (కార్తికేయ 3) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. ‘కార్తికేయ 3’ స్పాన్, స్కేల్ పరంగా చాలా పెద్దగా ఉండబోతోంది. డా.కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అన్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు చందూ మొంటేటి. -
హీరో నిఖిల్ కుమారుడి నామకరణ వేడుక
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు. తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చదవండి: స్టేజీపై హీరోయిన్కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్ట్రాలు కొడ్తున్నాడే! -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
బంజారాహిల్స్లో సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ (ఫొటోలు)
-
'సలార్' రెండో ట్రైలర్తో ప్రభాస్ రెడీ
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూపర్ కాంబినేషన్లో సలార్ రానుంది. ఇండియా రేంజ్లో అత్యంత భారీ యాక్షన్ చిత్రంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. రెండు రోజుల క్రితం వరకు ఎలాంటి ప్రచారం లేకుండా ఉన్న సలార్ టీమ్ ఒక్కసారిగా దూకుడు పెంచేసింది. ప్రభాస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ వరకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్తో భారీ బజ్ క్రియేట్ చేసిన సలార్ తాజాగా రెండో ట్రైలర్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో ప్రభాస్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్గా నేడు (డిసెంబర్ 17) విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెట్ రెడీ ఫర్ వైలెంట్ అని హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ పేజీలో క్లూ ఇచ్చింది. కానీ రెండో ట్రైలర్ ఉంటుందని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మొదటి ట్రైలర్లో ప్రభాస్,పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపిన మేకర్స్ రెండో ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండనున్నాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొదటి టికెట్ను టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కొన్నారు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ కూడా 100 టికెట్లు కొన్నట్లు తెలిపాడు. డిసెంబర్ 22న హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని ఆయన చెప్పడం విశేషం. -
ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్
స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు. ఇక ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ నుంచి 'సలార్' మూవీ వస్తుందంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందేనని వీరాభిమానులు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు యంగ్ హీరో బంపరాఫర్ ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. మరో వారంలో అంటే ఈ డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. మరోవైపు యంగ్ హీరో నిఖిల్.. ప్రభాస్ వీరాభిమానుల కోసం 100 టికెట్స్ ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. డిసెంబరు 22న అర్థరాత్రి ఒంటి గంటకు శ్రీరాములు థియేటర్లో 'సలార్' మిడ్ నైట్ షో పడనుంది. ఇప్పుడు ఇక్కడే 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్తో కలిసి సినిమా చూస్తానని యువ హీరో నిఖిల్ చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని మాటిచ్చాడు. మరి ఆ అదృష్టవంతులు మీరు కూడా కావొచ్చేమో. కాస్త ట్రై చేయండి. (ఇదీ చదవండి: ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్) -
తండ్రి కాబోతున్న హీరో నిఖిల్
-
తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్
'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్.. తాజాగా 'స్వయంభూ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రమిది. అయితే నిఖిల్ సతీమణి పల్లవి ప్రెగ్నెట్ అని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. కొద్దిరోజుల క్రితం నిఖిల్ తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్కు వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్తో కనిపించారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటికే మరో హీరో శర్వానంద కూడా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
‘స్వయంభూ’ కోసం వియత్నామ్ వెళ్లిన హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్లో వాలిపోయారు. ఏదో వెకేషన్కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్ల కోసం నిఖిల్కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో నెక్స్ట్ మూవీస్ లైనప్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చేసిన సినిమా 'స్పై'. ట్రైలర్తో ఇది అంచనాలు పెంచినప్పటికీ.. థియేటర్లలో ఫెయిలైంది. ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) 'స్పై' కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్లో సీక్రెట్ ఏజెంట్. శ్రీలంకలో ఓ మిషన్లో ఉండగా స్వదేశంలోని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్పాండే).. గతంలో చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ. అందులో స్ట్రీమింగ్ కంటెంట్ వీక్ కావడంతో 'స్పై' సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలోకి వస్తే.. తొలి వీకెండ్కే తట్టాబుట్టా సర్దేసుకుంది. దీంతో అందరూ ఆ చిత్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్లో సైలెంట్గా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'స్పై' స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఆడుతూ పాడుతూ ఈ మూవీని చూసేయొచ్చు. #SpyMovie now streaming in @PrimeVideo #NikhilSiddharth #Spy pic.twitter.com/FRJmfwcRf3 — Matters Of Movies (@MattersOfMovies) July 26, 2023 (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) -
స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్
నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్లో సూపర్ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మరో రికార్డు కూడా స్పై ఖాతాలో చేరిపోయింది. తాజాగా 'స్పై' మూవీ గురించి నిఖిల్ ఒక నోట్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి; నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..) 'నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. (ఇదీ చదవండి: Samantha: సమంత ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్, చివరి మూవీ ఇదే!) హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ లేఖలో తెలిపాడు. -
'స్పై' తొలిరోజు కలెక్షన్స్.. నిఖిల్ సరికొత్త రికార్డ్
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మిశ్రమ స్పందన అందుకుంటోంది. అయినాసరే తొలిరోజు వసూళ్లలో రచ్చ చేసింది. హీరో నిఖిల్ అయితే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. 'స్పై' కథేంటి? రీసెర్ట్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో జై(నిఖిల్) ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ లో ఉండగా.. రా చీఫ్ శాస్త్రి ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగొస్తాడు. ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో ఖాదిర్ ఖాన్(నితిన్ మెహతా)ని చంపే క్రమంలో ఏజెంట్ సుభాష్ వర్దన్ ప్రాణాలు కోల్పోతాడు. అతడి చావు వెనక రహస్యం తెలుసుకోమని జైకి ఫైల్ అప్పగిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ జై ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏం జరిగిందనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) తొలిరోజు వసూళ్లు 'కార్తికేయ 2' సక్సెస్ వల్ల నిఖిల్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ 'స్పై' ఆ విషయంలో ఫెయిలైంది. రొటీన్ రెగ్యులర్ కథతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్స్ ని నిరాశపరిచింది. అయినాసరే అడ్వాన్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో తొలిరోజు ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరికొత్త రికార్డ్ 'కార్తికేయ 2'తో తొలిరోజు రూ.8.50 కోట్లు సొంతం చేసుకున్న నిఖిల్.. 'స్పై' చిత్రంతో మరో మూడు కోట్లకు పైగా ఎక్కువగా సాధించాడు. తద్వారా తన కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని అందుకున్నాడు. తొలిరోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ ఈ వీకెండ్ గడిస్తే గానీ అసలు సంగతి తెలియదు. అంతవరకు మనం వేచి చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే) Thank you 🙏🏽 ❤️ For this much love from you all🙏🏽 #Spy #SpyMovie pic.twitter.com/pBXqct6bw9 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2023 -
'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ కొత్త సినిమా 'స్పై'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీపై రిలీజ్ కు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే సమయంలో 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది. దీంతో ఓటీటీ ఆడియెన్స్ అలెర్ట్ అయిపోయారు. మరి ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 'స్పై' కథేంటి? ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు జై. 'రా' ఇంటెలిజెన్స్లో ఏజెంట్గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ పూర్తి చేసి, స్వదేశానికి తిరిగొస్తాడు. రా చీఫ్ శాస్త్రి, ఇతడికి ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో చనిపోయిన ఏజెంట్ సుభాష్ ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావు వెనక కారణం తెలుసుకోమంటాడు. అలా ఈ మిషన్ లో భాగమైన ఏజెంట్ జైకి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. చివరకు ఏమైంది? అసలు ఈ స్టోరీకి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి సంబంధమేంటి? తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీని చూడాల్సిందే. ఆ ఓటీటీలోనే తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా తెలిసిన కథతోనే 'స్పై' తీశారు. చూస్తున్నంతసేపు అలా సాగుతూనే వెళ్తుంది తప్ప పెద్దగా గొప్పగా ఏం అనిపించదు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. మూవీ ప్రారంభంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బహుశా 5-6 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు తొలి లేదా రెండోవారంలో 'స్పై' సినిమా ఓటీటీలోకి రావొచ్చని అంచనా. పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా రివ్యూ) -
SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ
టైటిల్: స్పై నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: గ్యారీ బీహెచ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ విడుదల తేదీ: 29 జూన్ 2023 నిడివి: 2h 15m టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం! కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ. ఎలా ఉందంటే? సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు. ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన్నట్లు తయారయ్యాయి. ఎవరెలా చేశారు? ఏజెంట్గా నిఖిల్ ఫెర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది. -చందు, సాక్షి వెబ్ డెస్క్ -
నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు: హీరో నిఖిల్
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్ కాల్స్ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్ తాగమని ఆఫర్ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్. చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత -
అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్లోనూ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్ 29న స్పై రిలీజ్ చేయాలని నిర్మాత రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్ అప్సెట్ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్ హవా తగ్గడంతో నిర్మాత మరోసారి స్పై రిలీజ్ డేట్ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్ ఆయన చెప్పిన డేట్కే కట్టుబడి ఉన్నాడు. తాజాగా నిఖిల్ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ -
4 పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్
-
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్
-
అందుకే అమిత్ షా పిలిచినా వెళ్లలేదు : హీరో నిఖిల్
కార్తికేయ-2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్. ఆయన తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రానున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 28న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా ఓ మీడియా ప్రతినిథి అడగ్గా.. నిఖల్ మాట్లాడుతూ.. 'అమిత్ షా నుంచి నాకు ఆహ్వానం అందింది. కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని ఉద్దేశంతో నేను వెళ్లలేదు. నన్ను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదు. ఒక భారతీయుడిగా సినిమాలు చేస్తున్నాను' అంటూ నిఖిల్ వివరించారు. -
భార్య తో కలిసి శ్రీ వారిని దర్శించుకున్న నిఖిల్...
-
తిరుమల శ్రీవారినీ దర్శించుకున్న నటుడు నిఖిల్
-
నిఖిల్ సిద్ధార్థ్ న్యూ లుక్.. ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్ లుక్తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోస్టర్ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్లో లుక్లో కనిపించారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
ఆహాలో 18 పేజెస్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరింకెందుకాలస్యం.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే శుక్రవారం ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్ వీక్షించేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు, కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్టర్గా వ్యవహరించాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. Mee intrigue ki therapadabothundhi😅 Suku"Mark" magic ki ready ga undandi!#18PagesOnAHA | Premieres Jan 27 #18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @idineshtej @NavinNooli @lightsmith83 @GA2Official @SukumarWritings @adityamusic pic.twitter.com/g33HqN6RCL — ahavideoin (@ahavideoIN) January 20, 2023 చదవండి:గర్భవతిగా పూజా.. స్విమ్మింగ్ పూల్లో ముద్దులాట అంబానీ ఇంట్లో ఫంక్షన్కు ఆ డ్రెస్లో వెళ్తావా? -
రూ. 25 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్, అనుపమ ‘18 పేజెస్’ చిత్రం
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. ఈ ఫీల్ గుడ్ లవ్స్టోరీని చూసేందుకు మళ్లీ మళ్లీ థియేటర్కు వస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 20 కోట్ల గ్రాస్ సాధించింది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని ఫీల్గుడ్ లవ్స్టోరీగా మలిచారు. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ -
నిఖిల్ ఖాతాలో మరో హిట్.. కలెక్షన్లతో దూసుకెళ్తున్న '18 పేజెస్'
ఈ ఏడాది యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం కార్తికేయ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి "18 పేజెస్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ రొమాంటిక్ మూవీలో నిఖిల్ జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. (ఇది చదవండి: 18Pages: సెలిబ్రిటిస్తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్) రిలీజైన తొలి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. కేవలం మౌత్ టాక్తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. రిలీజైన తర్వాత మూడో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సీజన్లో మరింత విజయవంతంగా ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.13.5 కోట్ల గ్రాస్, రూ.22 కోట్ల నాన్-థియేట్రికల్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కథను అందించగా.. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపి సుందర్ సంగీతమందించారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. -
18Pages: సెలిబ్రిటిస్తో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
నిఖిల్ సిద్దార్థ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘18పేజిస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలో అనుపమ చేసిన నందిని పాత్రకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. క్లైమాక్స్,అలానే కొన్ని కొత్త ఫీల్ ను తీసుకొచ్చే సీన్స్ ,గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. ‘18 పేజెస్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన రావడంతో చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది. శనివారం రాత్రి ఈ చిత్ర యూనిట్ టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో మెగా నిర్మాత అల్లు అరవింద్, పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్, చందు మొండేటి, బుచ్చిబాబు, వశిష్ట, ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
18 Pages Box Office Collection: ‘18 పేజెస్’ ఫస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.45 కోట్ల(రూ.1.75 షేర్) కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా నిజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్లో రూ.0.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.12.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇంకో రూ.10.75 కోట్ల కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ డేస్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సీనీ వర్గాలు చెబుతున్నాయి. -
హీరో అవ్వడానికి రూ.5 లక్షలు ఇచ్చా.. మోసం చేశారు : నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాడు. కార్తికేయ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ రీసెంట్గా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ తన సినీ కెరీర్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత ఓ సీరియల్లో కూడా నటించాను. కానీ అక్కడే ఉండే బుల్లితెరకే పరిమితం అవుతాననిపించింది. దీంతో సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. కొందరికి నా యాక్టింగ్ నచ్చి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇంకొందరేమో నిన్ను హీరోగా చేయాలా? రూ 50లక్షలు, కోటి రూపాయలు తీసుకురా అనేవాళ్లు. అలా నేను హీరో అవ్వడానికి రూ.5లక్షలు ఇచ్చాను కూడా. లక్ష రూపాయల వరకు షూటింగ్ చేసి ఆపేశారు. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని అర్థమయ్యింది. ఇక శేఖర్ కమ్ముల గారు చాలా జెన్యూన్. నా యాక్టింగ్ నచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని దాచుకున్నాను. ఆ సినిమా తర్వాతే నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కార్తికేయతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
'18 పేజెస్' మూవీ రివ్యూ
టైటిల్: 18 పేజెస్ నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయూ, దినేశ్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, రమణ, రఘుబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ నిర్మాత: బన్నీ వాసు కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్ దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్ సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: ఏ. వసంత్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: డిసెంబర్ 23, 2022 నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సరికొత్త స్టోరీతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిసెంబర్ 23 రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంటికి దూరంగా ఓ రూమ్లో ఉంటూ ఆఫీస్కు వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా నిఖిల్కు ఆ అమ్మాయి గట్టి షాక్ ఇస్తుంది. ఆ షాక్ నుంచి డిప్రెషన్లో వెళ్లిన నిఖిల్కు సహాద్యోగి బాగీ( సరయూ) అండగా నిలుస్తుంది. అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది. అది ఓ పల్లెటూరు అమ్మాయి నందిని(అనుపమ పరమేశ్వరన్)రాసిన డైరీ. అసలు ఆ డైరీ ఏముంది? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? ఆ డైరీ చదివాక సిద్ధులో వచ్చిన మార్పులేంటి? అసలు నిఖిల్(సిద్ధు) నందినిని కలిశాడా? వారిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? చివరికి ఈ కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ. ఎలా ఉందంటే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్తో ఈ కథనం సాగుతుంది. తెలిసిన కథే అయినా సుకుమార్ టీమ్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్గా, కొత్తగా ఉంది. ఒకపైపు ప్యూర్ లవ్స్టోరీని చూపిస్తూనే.. మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ని ప్రేక్షకులకు కలిగించారు. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది. సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా స్క్రీన్ప్లే అదరగొట్టారు సుకుమార్. సుకుమార్ అనుకున్న పాయింట్ని తెరపై చూపించడంలో వందశాతం సఫలం అయ్యాడు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.సెకండాఫ్ ఆద్యంత ట్విస్ట్లతో సాగుతుంది. కథ ముందుకు సాగే కొద్ది ఆసక్తి మరింత పెరుగుతుంది. మొత్తంగా 18 పేజీల డైరీతో సస్పెన్స్ లవ్ స్టోరీని చక్కగా తెరకెక్కించారు ఎవరెలా చేశారంటే.. నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా నిఖిల్ ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. నిఖిల్ ఎమోషన్స్తో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సస్పెన్స్ లవ్ స్టోరీలో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నటనతో మెప్పించింది. మొబైల్ లేకుండా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ ఒదిగిపోయింది. సరయూ నిఖిల్కు సహాద్యోగిగా తెలంగాణ యాసలో అదరగొట్టింది. మధ్యలో రఘుబాబు కామెడీతో అలరించాడు. లాయర్ పాత్రలో పోసాని కృష్ణమురళి, డాక్టర్ సందీప్గా దినేశ్ తేజ్, కండక్టర్ పాత్రలో రమణ, విలన్ పాత్రలో అజయ్(తల్వార్) తమ పాత్రలకు న్యాయం చేశారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీసుందర్ బీజీఎంతో అదరగొట్టాడు. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ బాగుంది. వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. -
‘18 పేజెస్’ మూవీ ట్విటర్ రివ్యూ
కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా మారాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. అదే ఊపుతో ఇప్పుడు ‘18 పేజెస్’ అంటూ ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ఈ ప్రేమ కథా చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘18 పెజెస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #18Pages : the movie has a good story and could have been a great feel good movie. However, the cringe moments in the movie ruined the experience. @actor_Nikhil @anupamahere @aryasukku — Telugu Cinemaalaya (@cinemaalayaa) December 23, 2022 #18Pages 18 Pages - A sweet ❤️ Romantic Entertainer..Good one by Sukumar Writings team..👍 — jayaram abishek (@Jayaram_nikhil_) December 23, 2022 All the best self-made pan india star @actor_Nikhil and #anupama for #18Pages release today. Hope you will get huge BB hit with this, chala days tarvata oka movie release kosam chala exiting ga wait chestuna....🤞🤞❤#sukumarwrittings #geethaarts #18PagesOnDec23 pic.twitter.com/EFI8o68DTv — gang_star_saiyadav (@DHF_nikhil) December 23, 2022 Sure you're all set to startle and treat the audience and fans once again. All the best @RaviTeja_offl garu @aryasukku garu & @actor_Nikhil Best wishes to the teams of #Dhamaka & #18Pages@anupamahere @dirsuryapratap @GA2Official@sreeleela14 @TrinadharaoNak1 @peoplemediafcy pic.twitter.com/D9BCFKwROY — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 22, 2022 #18pages @actor_Nikhil Message to USA Audience Huge Grand Release Ever in Recent times with 355+ locations. Bookings open Now Release by @Radhakrishnaen9 🇺🇸@aryasukku @GeethaArts @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @SukumarWritings @GA2Official pic.twitter.com/1WNtBeJkJp — Radhakrishnaentertainments (@Radhakrishnaen9) December 23, 2022 -
సక్సెస్ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన క్రేజీ లవ్స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్ప్లే డిఫరెంట్గా ఉన్న ఇలాంటి లవ్స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
ఆ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను: అనుపమా పరమేశ్వరన్
‘‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచమే లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ ఉండదు. ‘18 పేజెస్’ వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ. అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్– సుకుమార్ రైటింగ్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక అనుపమా పరమేశ్వరన్ చెప్పిన విశేషాలు.. ► సూర్యప్రతాప్గారు చెప్పిన ‘18 పేజెస్’ కథ ఎగ్జయిటింగ్గా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘కార్తికేయ 2’కి ముందే ‘18 పేజెస్’కి సైన్ చేశాను. ‘కార్తికేయ 2’ అడ్వెంచరస్ మూవీ అయితే ‘18 పేజెస్’ ఫీల్ గుడ్ లవ్స్టోరీ. ‘కార్తికేయ 2’ ఇక్కడ సూపర్ హిట్ కావడంతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ కావడంతో మా జంట (నిఖిల్, అనుపమ)కి మంచి పేరొచ్చింది. ‘18 పేజెస్’ చాలా మంచి సినిమా.. ‘కార్తికేయ 2’లాగే ఈ మూవీ సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ► సుకుమార్గారి ‘రంగస్థలం’ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఏ సినిమా కథ అయినా మనం ఎంచుకోం.. ఆ కథే మనల్ని ఎంచుకుంటుంది. ‘రంగస్థలం’ మిస్ అయినా ఇప్పుడు సుకుమార్గారు రాసిన పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన నందిని పాత్ర గుర్తుండిపోతుంది. సుకుమార్గారి కథకి సూర్యప్రతాప్గారు వందశాతం న్యాయం చేశారు కాబట్టే సినిమా బాగా వచ్చింది. ► ‘18 పేజెస్’లోని లవ్ స్టోరీ నా ఫేవరెట్. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్లో మొబైల్ లేకుండా ఒక్క రోజు కూడా చాలామంది ఉండలేరు. అలాంటిది మొబైల్, సోషల్ మీడియా లేకుండా ఉండే ఒక అమాయకమైన నందిని పాత్ర నా మనసుకు బాగా దగ్గరగా అనిపించింది. ► ‘నాకు అనుపమలాంటి కూతురు ఉంటే బాగుండు’ అని అల్లు అరవింద్గారు అనడం పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన నన్ను కూతురిలా బాగా చూసుకుంటారు. అందుకే మా కజిన్స్ చాలామంది ఆయన్ని మావయ్యా అని పిలుస్తుంటారు (నవ్వుతూ). బన్నీ వాసుగారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ► నేను ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోయాక.. నటనకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని, దర్శకుల వద్ద సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా కథ రాస్తున్నాను.. అయితే నా డైరెక్షన్లో నేను నటించను. -
మా గురువు సుకుమార్ అలా కాదు: పల్నాటి సూర్య ప్రతాప్
‘‘చాలామంది ఓ ఐడియా కోసం వర్క్ చేస్తారు. కానీ నా గురువు, నేను అన్నయ్యలా భావించే సుకుమార్గారు మాత్రం ఓ కొత్త ఐడియా వచ్చిన తర్వాత దానిపై డెప్త్గా వర్క్ చేస్తుంటారు. అలాగే అన్నింటికన్నా కథే గొప్పదని ఆయన అంటారు. నేనూ అదే నమ్ముతాను’’ అన్నారు పల్నాటి సూర్య ప్రతాప్. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కేవలం ప్రేమకథే కాదు.. విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి. అలాగే ఫన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. అందుకే ఇది రొటీన్ లవ్స్టోరీ కాదని చెబుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఇందులోని క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నిఖిల్, అనుపమ అద్భుతంగా నటించారు. గీతా ఆర్ట్స్లో సినిమా చేస్తున్నానని దర్శకులు గౌరవంగా చెప్పుకుంటారు. అలాంటి బ్యానర్ అది. కొంత గ్యాప్ తర్వాత ‘18 పేజెస్’ సినిమాతో దర్శకుడిగా వస్తున్న నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అల్లు అరవింద్గారు. ఈ సినిమా ఎండింగ్ పాజిటివ్గా ఉంటుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘కుమారి 21ఎఫ్’ చిత్రం తర్వాత దాదాపు ఏడేళ్లకు నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత రైటింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలని నా గురువు సుకుమార్గారి దగ్గర చేరాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయితే దర్శకుడిగా ఇక నాకు గ్యాప్ ఉండకూడదని మేం నిర్ణయించుకున్నాం. సుకుమార్గారు, నేను అనుకున్న కథలు మూడు ఉన్నాయి. నేనూ ఓ కథ అనుకున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీస్లో ఉంటుంది. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్లో ఓ కమిట్మెంట్ ఉంది’’ అన్నారు. -
ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్
‘‘ఇది వరకు మనం సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే రీచ్ ఉండేది. కానీ దక్షిణాది సినిమాలు ఉత్తరాదికి వెళ్లేందుకు ‘బాహుబలి’తో బాటలు వేసిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ‘పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార’ సినిమాలు పాన్ ఇండియా వెళ్లడం హ్యాపీ. మన చిత్రాలు దేశమంతా చూస్తుండటం మనకు గర్వకారణం’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 విడుదలకానుంది. గోపీసుందర్, సూర్యప్రతాప్, వివేక్ కూచిభొట్ల, బన్ని వాసు, సుకుమార్, అనుపమ, అల్లు అర్జున్, నిఖిల్ ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్గారు లేకుంటే నా ఈ జీవితం, ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా నాన్నకి(అల్లు అరవింద్) సొంత ఓటీటీ ఉంది. ‘18 పేజెస్’ విడుదల ఆలస్యం అవుతుండటంతో ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా మంది చెప్పినా థియేటర్లోనే విడుదల చేస్తున్న ఆయనకి థ్యాంక్స్. ‘18 పేజెస్’ కి గోపీ సుందర్ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్కి థ్యాంక్స్. ‘హ్యాపీడేస్’ నుంచి నిఖిల్ గ్రాఫ్ చూస్తున్నాను.. చాలా మంచి కథలు ఎంచుకుంటున్నాడు. ఎలా అని ఓ సారి అడిగితే బుక్స్ బాగా చదువుతాడట. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఒక యాక్టర్కి కావాల్సిన అర్హత ఏంటంటే పుస్తకాలు చదవడం.. అది తనలో చాలా ఉంది. ‘18 పేజెస్’ కి యూనిట్ పెట్టిన కష్టం మీ మనసులను టచ్ చేస్తుంది. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘18 పేజెస్’ వంటి అద్భుతమైన కథని సుకుమార్ రాశాడు. ఇది గీతా ఆర్ట్స్లో తీస్తే బాగుంటుందని బన్ని వాసుకి కథ ఇచ్చి, మా గీతా ఆర్ట్స్లో సినిమా తీయించినందుకు తనకి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అవుదామని ‘జగడం’ టైమ్లో అనుకున్నా. ‘ఆర్య 2’ తీస్తున్నప్పుడు నిఖిల్కి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ‘హ్యాపీడేస్’ సినిమా చూసినప్పుడే తను సక్సెస్ అవుతాడనిపించి, ఆ అడ్వాన్స్ ఇచ్చాను. ‘18 పేజెస్’ సక్సెస్ క్రెడిట్ సూర్యప్రతాప్దే. ‘పుష్ప 2’ ఐదు రోజులు షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్, సుకుమార్లు లేకపోతే బన్ని వాసు అనే వాడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు సినిమాలు తీసుకెళ్లేలా బాటలు వేసిన దర్శకులు రాజమౌళి సర్, సుకుమార్ సర్కి థ్యాంక్స్. ‘18 పేజెస్’ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది’’ అన్నారు నిఖిల్. ఈ వేడుకలో నిర్మాతలు వై.రవిశంకర్, ‘జెమిని’ కిరణ్, ఎస్కేఎన్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాల్గొన్నారు. -
'18 పేజెస్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'18 పేజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యడు, సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. నిఖిల్, అనుపమల కెమిస్ట్రీ మరింత హైలైట్గా నిలుస్తుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 19న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బన్నీ రాకతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. Mana andariki Nachinodu Manodu Sarrainodu Vastunadu.. @alluarjun 🔥🤩#AAFor18Pages 2 Days to go ❤️@GeethaArts @actor_Nikhil #18pages pic.twitter.com/lYkaktFqBL — Allu Arjun TFC™ (@AlluArjunTFC) December 17, 2022 ANDD!! The much awaited update is here!🔥 𝐈𝐂𝐎𝐍 𝐒𝐓𝐀𝐑 @alluarjun garu to grace the grand pre-release event of #18Pages on 𝐃𝐄𝐂 𝟏𝟗 !🤩#AAFor18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @adityamusic @shreyasgroup pic.twitter.com/EsLjKusjk2 — Sukumar Writings (@SukumarWritings) December 16, 2022 -
'18 పేజెస్' ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ప్రేమించడానికి కారణం ఉండకూడదు.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్ ట్రైలర్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. యూత్లో బాగా బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అద్భుతమైన విజువల్స్తో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు ట్రైలర్లో. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలోని ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్లో చూపించారు. ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు’ వంటి డైలాగ్స్తో ట్రైలర్ను ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదల కానుంది. -
ఏంటీ బ్రో అల్లు అర్జున్ వస్తున్నారా?.. నిజమా.. నిఖిల్ షాక్..!
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈనెల 19న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నట్లు ఈ వీడియోలో హీరో నిఖిల్కు అభినవ్ చెప్పడం సరదాగా అనిపిస్తోంది. బన్నీ హాజరువుతున్నారని అభినవ్ చెప్పడంతో అఖిల్ సైతం అశ్చర్యానికి గురి కావడంలో అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియో అభినవ్, అఖిల్ సరదా సంభాషణ వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు విభిన్న రీతిలో చూపించారు. సరదా సంభాషణ సాగిందిలా.. అభినవ్:బ్రో నిఖిల్, కార్తికేయ మీరు ఇక్కడ ఎంటీ? నిఖిల్: జోర్డాన్కి షూటింగ్ కోసం వచ్చా అభినవ్: నువ్వు షూటింగ్ ఏంది భయ్యా? మీది ఏదో సినిమా రిలీజ్ ఉంది కదా. నిఖిల్: ఏదో కాదు 18 పేజెస్. అభినవ్:18 పేజెస్ నాకు తెలుసు తగ్గేదేలే. నిఖిల్: అది పుష్ప సినిమా డైలాగ్. 18 పేజెస్ సినిమా డైలాగ్ కాదు. అభినవ్: మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ వస్తున్నారు నిఖిల్: ఏంటీ? మళ్లీ వస్తున్నారా? అల్లు అర్జున్ వస్తున్నారా? ఐ లవ్ యూ బ్రో అభినవ్: ఐ లవ్ యూ టూ బ్రో నిఖిల్: మరీ వెళ్దాం పదా..! అభినవ్: మీ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందా? స్క్రిప్ట్ మొత్తం ఇచ్చారా? నిఖిల్: హా బాగా వచ్చింది. 18 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చారు. అంటూ ఇద్దరు అక్కడి వెళ్లిపోయారు. ANDD!! The much awaited update is here!🔥 𝐈𝐂𝐎𝐍 𝐒𝐓𝐀𝐑 @alluarjun garu to grace the grand pre-release event of #18Pages on 𝐃𝐄𝐂 𝟏𝟗 !🤩#AAFor18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @adityamusic @shreyasgroup pic.twitter.com/6QZ8MpW8oz — 18Pages (@18PagesMovie) December 16, 2022 -
'18 పేజెస్' అప్డేట్.. 'నీ వల్ల ఓ పిల్ల' అంటున్నా నిఖిల్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాట ద్వారా కొత్త రచయిత తిరుపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జీఏ పిక్చర్స్. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, పోస్టర్స్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. యూత్లో బాగా బజ్ క్రియేట్ ఈ చిత్ర ట్రైలర్ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఇవాళ ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
నిఖిల్, అనుపమల '18 పేజెస్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, "కుమారి 21ఎఫ్'' డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. యూత్లో బాగా బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం ట్రైలర్ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
నిఖిల్, అనుపమ ‘18 పేజిస్’ నుంచి మరో మేలోడి సాంగ్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. చదవండి: అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దామంటూ సుకుమార్ నాతో చెప్పడంతో ‘18 పేజెస్ తీశాం. ఇది మామూలు ప్రేమకథ కాదు’’ అన్నారు. ‘‘జానపద పాటలు రాసే తిరుపతిగారిని ఈ సినిమాతో పాటల రచయితగా లాంచ్ చేస్తున్నాం’’ అన్నారు బన్నీ వాసు. ‘‘గీతా ఆర్ట్స్లో డైరెక్షన్ చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు సూర్యప్రతాప్ పల్నాటి. -
అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యమలో ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన..’ పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. శ్రీమణి రాసిన సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ పాటను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘అనుపమ గురించి మాట్లాడకుండ ఉండలేను. ఆమెను చూస్తే నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి తను. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్పరేంట్గా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే అనుమప అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. హీరో నిఖిల్ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ చాలా అంకిత భావంతో పనిచేస్తాడంటూ ప్రశంసించారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్స్టోరీ కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '18 పేజీస్'.. క్రేజీ అప్డేట్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను డిసెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారికి ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్తో పాటు 'నన్నయ్య రాసిన', 'కొంచెం టైం ఇవ్వు పిల్ల' అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం సిధ్ శ్రీరామ్ పాడిన పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇదివరకే రిలీజైన రెండుపాటలకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. కార్తికేయ మూవీతో భారీ హిట్ అందుకున్న నిఖిల్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Get ready to fall in love with the melodious #YedurangulaVaana song from #18Pages 💕 Full song out on Dec 11th! A @GopiSundarOffl Musical 🎼@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @sidsriram @ShreeLyricist @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/Xt4xciKoTI — 18Pages (@18PagesMovie) December 9, 2022 -
రవితేజ, నిఖిల్తో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న నయన్!
క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి. -
'పిల్ల కొంచెం టైం ఇవ్వు' అంటున్న నిఖిల్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజీస్'. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి "టైం ఇవ్వు పిల్ల" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించారు. ప్రతీ ఒక్కరి లైఫ్లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు" అనే పాటను శింబు ఆలపించారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలై టీజర్, 'నన్నయ్య రాసిన' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. -
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన సూపర్నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ నటి చేసిన ట్వీట్పై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఆమెపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా యంగ్ నిఖిల్ సైతం మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ.. 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ రిచా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్వీట్ని తప్పుబడుతూ మంచు విష్ణు, అక్షయ్కుమార్తోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఖిల్ ట్వీట్లో రాస్తూ.. ' 20 మంది భారత సైనికులు గాల్వాన్ వద్ద తమ ప్రాణాలను అర్పించారు. దేశాన్ని, మన ప్రాణాలను రక్షించారు. వారి త్యాగం గురించి వింటే ఇప్పటికీ మనకు కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను మరచి.. మన సైన్యం, సాయుధ దళాలను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానించకూడదు. రిచా దయచేసి దేశం తర్వాతే ఏదైనా తెలుసుకోండి.' అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు సైతం ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు బుద్ధి లేదంటూ మండిపడుతున్నారు అసలు వివాదం ఎందుకంటే..: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని(పీవోకే) కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి సరైన సమాధానం ఇస్తాం’ అంటూ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె క్షమాణపలు కూడా చెప్పింది. 20 Brave Indian soldiers gave up their lives at Galwan protecting our country and us. Reading about their Ultimate Sacrifice still brings tears to our eyes. FORGET POLITICS. Our Army and the Armed forces should always be respected and never insulted. @RichaChadha plz #IndiaFirst pic.twitter.com/SZvaOtKMEv — Nikhil Siddhartha (@actor_Nikhil) November 24, 2022 What is wrong with this woman???? How can you even imagine such a horrid line? Everyone in the armed forces should be worshipped if not anything else’s for their service to our great country. Just hurts to see such ungrateful Indians. pic.twitter.com/zOD5w9QZi7 — Vishnu Manchu (@iVishnuManchu) November 24, 2022 Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH — Akshay Kumar (@akshaykumar) November 24, 2022 -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎంపీ ఇంటిపై దాడి.. తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాపం శ్రద్ధా వాకర్.. అప్పుడు కూడా అదే టార్చర్.. 2020 ఫోటో వైరల్ శ్రద్ధా వాకర్కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మరో షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. బెండకాయ వేపుడు.. బెండకాయ పులుసు.. బెండకాయ 65.. బెండకాయ కూర.. వంటకం ఏదైనా అందులో బెండీ ఉంటే చాలు లొట్టలేసుకుని భోజనం లాగించేస్తారు. కేవలం నోటికి రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది బెండకాయ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్కు మరో షాక్! ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విడాకులకు సిద్ధమైన మరో యంగ్ హీరో నిఖిల్? ఫోటోతో తేల్చేశాడుగా! టాలీవుడ్లో చై-సామ్ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్టాపిక్గానే ఉంది. తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పల్లవితో విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని, కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు నిఖిల్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యంగ్ హీరో నిఖిల్పై రూమర్స్.. అవన్నీ ఫేక్..!
యంగ్ హీరో నిఖిల్పై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరో తన భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని అసత్య ప్రచారం నడుస్తోంది. ఇటీవలే కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు నిఖిల్. ప్రస్తుతం తన భార్య పల్లవితో గోవాలో వెకేషన్లో ఉన్నారు యంగ్ హీరో. గోవాలో ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. 'మనిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. కాగా 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
'18 పేజెస్' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ విడుదల
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక కార్తికేయ-2 హిట్ తర్వాత నిఖిల్, అనుపమ కలిసి నటించిన సినిమా కావడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన గతంలోనూ కుమారి 21 ఎఫ్ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం డిసెంబర్23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి నన్నయ్య రాసిన అనే లిరికల్ వీడియోను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
చివరి పేజీ షురూ
నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి జీఏ2 పిక్చర్స్పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ ‘18 పేజెస్’ చివరి పేజీ (షెడ్యూల్) ప్రారంభమైంది. ‘‘కార్తికేయ 2’ విడుదల, ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం కొంచెం విరామం తీసుకున్న తర్వాత నిఖిల్ తాజాగా ‘18 పేజెస్’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. డిసెంబర్ 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
18 పేజేస్ చివరి షెడ్యూల్లో పాల్గొన్న నిఖిల్.. ఫోటో వైరల్
నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్టు కొట్టిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా ఆయన కథను అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ 18 పేజెస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి GA2 పిక్చర్స్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కాగా, నిఖిల్ ఈ షూటింగులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
కార్తికేయ 2 హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్: పరుచూరి గోపాలకృష్ణ
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. సినిమాలో తల్లి సెంటిమెంట్ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్ను, హీరోయిన్ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్.. హీరోకు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. క్లైమాక్స్లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: నెట్ఫ్లిక్స్లో నాగార్జున ఘోస్ట్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే? -
కార్తికేయ- 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్
కార్తికేయ-2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హీరో నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా కంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందీ చిత్రం. నార్త్ ఆడియెన్స్కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ-3 కోసం అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. తాజాఆగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుపడతామని, అంతేకాకుండా కార్తికేయ-3ని 3Dలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. -
'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్
ఎన్టీఆర్, రామ్చరణ్లు మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా ఆస్కార్కు నామినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలిందే. ఆర్ఆర్ఆర్ని ఆస్కార్కి నామినేట్ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేశారు. దీనిపై హీరో నిఖిల్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవసరమా? నాకు ఆస్కార్పై వేరే అభిప్రాయం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించారు. అదే సినిమాకు అతిపెద్ద విజయం అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్ఫేర్, జాతీయ అవార్డులు ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే ఆస్కార్కి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఇటీవలె స్పెయిన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. అక్కడ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాను ఇంతలా ఆదరిస్తుంటే, ఇంక ఆస్కార్ అవసరం లేదని నా ఫీలింగ్ అని నిఖిల్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈమూవీ హిట్టాక్ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ కురువైన నేపథ్యంలో తెలుగు చిన్న సినిమా అయిన కార్తికేయ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఇప్పటికీ థియేటర్లో కార్తీకేయ 2 సందడి చేస్తోంది. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా రూ. 60 కోట్లు షేర్ చేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ చేసింది. బ్లాక్బస్టర్గా హిట్గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఏ చిత్రంమైన థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి ఈ మూవీ థియేటర్లో విడుదలైన నెల రోజులు కావోస్తున్న నేపథ్యంలో కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్కు ముస్తాబవుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుందని వినికిడి. ఇక త్వరలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుందట. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచే కార్తికేయ 2 అన్ని భాషల్లో అందుబాటులోకి రానుందని కూడా అంటున్నాయి సినీవర్గాలు. దీనిపై జీ5 త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. కాగా టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. #karthikeya2 ott update#nikhil #nikhilsiddhartha #anupamaparmeswaran #anupamkher #adithya #superstar #youngtiger #powerstar #megastar #megapowerstar #rebelastar #stylishstar #naturalstar pic.twitter.com/NxR8MSxFRO — Aniket Nikam Creations (@ANikamCreations) September 10, 2022 -
కర్నూలులో ‘కార్తికేయ’ సందడి (ఫొటోలు)
-
వంద కోట్ల క్లబ్లో చేరే దిశగా కార్తికేయ 2
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్లో, బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరేట్లు కనిపిస్తోంది. Thank You🙏🏽 Indian Movie Lovers ki 🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 #Karthikeya2Hindi pic.twitter.com/CL7a5Uuthj — Nikhil Siddhartha (@actor_Nikhil) August 22, 2022 #Karthikeya2Hindi growth is outstanding. 2nd week numbers- Fri: ₹2.46 cr Sat: ₹3.04 cr Sun: ₹4.07 cr Total: ₹15.32 cr 🔥 At the same time, a film starring Tapsee and directed by Anurag Kashyap #Dobaaraa gets Fri: ₹72 lacs Sat: ₹1.02 cr Sun: ₹1.24 cr Total: ₹2.98 cr pic.twitter.com/vsMVigH3Ii — idlebrain jeevi (@idlebrainjeevi) August 22, 2022 చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే -
కార్తికేయ 2 సక్సెస్పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రం ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ముఖ్యంగా బి-టౌన్ థియేటర్లపై ఈ మూవీ దండయాత్ర చేస్తోంది. అక్కడి స్టార్ హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టి భారీగా వసూళ్లు చేస్తోంది. కేవలం 50 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం అక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఈ సినిమాలు ఆపేసి కార్తికేయ 2ను రన్ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఊహించని బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడంతో సినీ విశ్లేషకులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాజాగా కార్తికేయ 2 భారీ విజయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 సినిమాల కంటే కార్తికేయ 2 బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రెండవ శుక్రవారం రోజున అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబుల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అని తన పోస్ట్లో పేర్కొన్నాడు. దీంతో బాలీవుడ్ హీరోకలు చురక పెడుతూ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈచిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీ రోల్ పోషించారు. కాల భైరవ సంగీతం అందించాడు. . @actor_nikhil ‘s #karthikeya2 produced by @abhishekofficl on 2nd Friday doing DOUBLE COLLECTIONS of #AamirKhan ‘s #LSJ and @AkshayKumar ‘s #RakshaBandhan proves on ROI,K2 is BIGGER BLOCKBUSTER than @ssrajamouli ‘s #RRR and @Prashant_neel ‘s #KGF2 ..CONGRATS to @chandoomondeti — Ram Gopal Varma (@RGVzoomin) August 20, 2022 -
కృష్ణాష్టమిని క్యాష్ చేసుకున్న కార్తికేయ 2, కలెక్షన్స్ ఎంతంటే?
దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర.. అప్పుడెప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇది. దీన్ని కొంచెం అటూఇటుగా మార్చి దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద దండయాత్ర.. చెప్పుకోవాల్సి వస్తోందిప్పుడు. అలా ఉంది సౌత్ జోరు. మరీ ముఖ్యంగా టాలీవుడ్లోని పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాలు హిందీ బాక్సాఫీస్ను రఫ్ఫాడించాయి. ఇటీవలే వచ్చిన మీడియం రేంజ్ మూవీ కార్తికేయ 2 కూడా బాలీవుడ్ను ఓ ఊపు ఊపేస్తుండటం విశేషం. కేవలం 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే మామూలు విషయం కాదు. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఈ పెద్ద సినిమాలు తీసేసి కార్తికేయ 2ను రన్ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కృష్ణాష్టమిని ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఆగస్టు 13న రిలీజైన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. 🙏🏽🙏🏽🙏🏽#Karthikeya2 #Karthikeya2Hindi #KrishnaIsTruth pic.twitter.com/npHXzEG4ga — Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022 #Karthikeya2 #Hindi emerges first choice of moviegoers... Collects more than #LSC and #RB *yesterday* [Fri]... Mass pockets/single screens are super-strong... Will continue to dominate over the weekend... [Week 2] Fri 2.46 cr. Total: ₹ 8.21 cr. #India biz. HINDI version. pic.twitter.com/E6cKGuG6b8 — taran adarsh (@taran_adarsh) August 20, 2022 చదవండి: హీరో వరుణ్తేజ్తో రిలేషన్.. నోరు విప్పిన అందాల రాక్షసి అన్ని వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్న లైగర్! -
శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్లలో విజయవంతంగా ఆడుతోంది. ఇక ఈమూవీ సక్సెస్ నేపథ్యంలో నేడు(శనివారం) హీరో నిఖిల్, కార్తికేయ 2 టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్పై ఘాటు స్పందన ఉదయం వీఐపీ దర్శన సమయంలో హీరో నిఖిల్తో పాటు డైరెక్టర్ చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇతర టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులకు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ 2 మంచి విజయం సాధించడంతో స్వామివారిని దర్శించుకున్నామని మూవీ టీం పేర్కొంది. ఇక నిఖిల్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం’ అని తెలిపాడు. Went, Thanked and took the blessings of Tirumala Venkateshwara Swamy for bestowing team #Karthikeya2 with this Success 🙏🏽 @AbhishekOfficl @vishwaprasadtg @Actorysr @chandoomondeti @MayankOfficl @sahisuresh #Karthikeya2Hindi pic.twitter.com/lDCNNXogFf — Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022 -
బాలీవుడ్ను షేక్ చేస్తున్న కార్తికేయ 2
బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్'.. రెండూ ఆగస్టు 11న రిలీజైన పెద్ద సినిమాలు. వీటి మధ్య పోటీ ఏమో కానీ వీటితో పోటీపడేందుకు ఆగస్టు 13న థియేటర్లలో రిలీజైంది కార్తికేయ 2. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్లలో విజయవంతంగా ఆడుతోంది. భాష అనే బారికేడ్లను దాటుకుని ఘన విజయం సాధించింది. నేడు కృష్ణాష్టమి సందర్భంగా స్క్రీన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కార్తికేయ 2 బాలీవుడ్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరు బడా హీరోల సినిమాలను తొక్కేసి మరీ బ్లాక్బస్టర్ హిట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా సత్తాను చాటిన కార్తికేయ 2 చిత్రయూనిట్పై ప్రేక్షకులు, సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే? -
కార్తికేయ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. మంచి విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్గా తెరకెక్కిందీ మూవీ. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతంగా ఆడుతోందీ చిత్రం. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను వెనక్కు నెట్టి కార్తికేయ 2 హౌస్ఫుల్ రన్తో జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే డబుల్ బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రిపుల్ బ్లాక్బస్టర్ దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. ఇక ఐదురోజుల్లోనే రూ.38 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ కొల్లగొట్టేదిశగా పయనిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్న కార్తికేయ 2 ఇప్పుడప్పుడే ఓటీటీలో వచ్చేలా కనిపించడం లేదు. సుమారు 6 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. #Karthikeya2 [#Hindi] is akin to sunshine in an otherwise gloomy scenario... Day-wise growth is an eye-opener... Sat 7 lacs, Sun 28 lacs, Mon 1.10 cr [holiday], Tue 1.28 cr [partial holiday]. Total: ₹ 2.73 cr. #India biz. HINDI version. pic.twitter.com/sij41RTnS2 — taran adarsh (@taran_adarsh) August 17, 2022 Overseas #Karthikeya2 has Crossed 700k $ dollars and Racing Towards 1 Million… These are the USA THEATRES LIST … plz catch #Karthikeya2 in theatres and do spread the word… 🙏🏽🙏🏽🙏🏽🔥🔥🔥love u all for this terrific response ❤️ pic.twitter.com/4pmEcOrrLn — Nikhil Siddhartha (@actor_Nikhil) August 18, 2022 చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే.. భారీ ఆఫర్ను వదులుకున్నా.. ఎమోషనల్ అయిన ఛార్మి -
‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్, 17.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్తో సర్ప్రైజ్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.13.30కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ని దాటేసి లాభాల బాట పట్టింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తికేయ2 మూడు రోజుల కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం -రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.83 కోట్లు ► ఈస్ట్ - రూ.99లక్షలు ► వెస్ట్ - రూ. 73 లక్షలు ► ఉత్తరాంధ్ర -రూ. 1.51 కోట్లు ► గుంటూరు- రూ. 1.14 కోట్లు ► కృష్ణా - రూ. 87 లక్షలు ► నెల్లూరు - రూ.41 లక్షలు ►కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 70 లక్షలు ►ఓవర్సీస్- రూ.2.60 కోట్లు ►నార్త్ ఇండియా-రూ.60లక్షలు ►మొత్తం రూ.15.44 కోట్లు(26.50 కోట్లు గ్రాస్) -
‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్ 24) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్లో జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్తో పాటు హీరోయిన్, డైరెక్టర్ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్ అక్కడిక్కడే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ సదరు అభిమాని ఈవెంట్లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్కు తను పెట్టుకున్న కూలిగ్గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్ మహేశ్ దాసరి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన అతడి ట్వీట్పై నిఖిల్ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. Take good care of the Goggles bro … My spontaneous gift for ur love ❤️🙏🏽 #Karthikeya2 trailer event.. https://t.co/KKTHtuz264 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 25, 2022 -
కార్తికేయ 2 ట్రైలర్: ఆజ్యం మళ్లీ మొదలైంది..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్గా వస్తోంది చిత్రం. సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అంటూ ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. ఈసారి డైరెక్టర్ శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. శాంతను.. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది' అంటూ హీరోకు ఎలివేషన్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్తో మరోసారి మెప్పించారు. ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 3 Years of Blood Sweat and Much more… TRAILER OF #KARTHIKEYA2 is here…. Watch it and if u like it Please SHARE with ur friends and family …. #LordKrishna India’s Epic Mystical Adventure Zee Cinemalu YouTube - https://t.co/9fYA4X0cHm pic.twitter.com/x0DcBSrIqn — Nikhil Siddhartha (@actor_Nikhil) June 24, 2022 చదవండి: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, స్పందించిన వర్మ -
కార్తికేయ 2: ముఖ్య పాత్రల పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్; చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. దీనిపై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్రధన్ దాస్ కార్తికేయ 2పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️ India's epic mystical adventure🌟🔥releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022 చదవండి: సీక్రెట్గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు -
మంచులో కప్పేసిన డబ్బాలో నుంచి తుపాకీలు తీసిన నిఖిల్
‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ వంటి సినిమాలకు ఎడిటర్గా పని చేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పై. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ కథానాయిక. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యాయి. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. చదవండి: మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్ కరణ్ జోహార్ బర్త్ డే: బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా -
నిన్ను తలవని రోజుండదు డాడీ: నిఖిల్ ఎమోషనల్ పోస్ట్
యంగ్ హీరో నిఖిల్ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ గురువారం (ఏప్రిల్ 28న) కన్నమూయడంతో అతడి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తాజాగా అతడు తన తండ్రితో పెనవేసుకున్న బంధాన్ని, పోగుచేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. 'నా తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్ యూ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్ను ఎంజాయ్ చేయడం.. ఇవన్నీ నేను మిస్ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. మరో నోట్లో తండ్రి గురించి చెప్తూ.. 'ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. తను నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని కలలు కన్నాడు. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. జేఎన్టీయూ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ఆయన స్టేట్ టాపర్. ఎప్పుడూ కష్టాన్ని నమ్మేవాడు. జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. కార్టికోబాసల్ డీజెనరేషన్ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ' అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. దీనికి తన తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేశాడు. Devastated that My father Shyam Siddhartha Passed away yesterday. Hope U find peace wherever you r Daddy..We Love u.. Our RTC Xroad movie and Biryani Outings, Travel,laughter, Summers in Mumbai.. will miss them all. I am always proud to be Your son. Hope we meet again daddy🙏🏽 pic.twitter.com/vVsJOL6ad1 — Nikhil Siddhartha (@actor_Nikhil) April 29, 2022 చదవండి: హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూత -
నిఖిల్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్లుక్ వచ్చేసింది, బుల్లెట్ల మధ్యలో హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాకు స్పై అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. స్పై చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్గా పని చేస్తున్నారు. అలాగే మరో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. The sentinel is geared up for the Task!Unfolding & Presenting 𝐒𝐏𝐘🔥#SPY ATTACKING PAN INDIAN THEATRES this DASARA 2022😎స్పై - स्पाई - ஸ்பை - ಸ್ಪೈ - സ്പൈ@Ishmenon @Garrybh88 @AbhinavGomatam @tej_uppalapati @julian_amaru #EDEntertainments #KRajashekarreddy pic.twitter.com/MBRlUsb7it— Nikhil Siddhartha (@actor_Nikhil) April 17, 2022 చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? -
నిఖిల్ 'కార్తికేయ 2'గా వచ్చేది అప్పుడే..
Nikhil Karthikeya 2 Movie Release Date Announced: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ 'కార్తికేయ 2' మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా విడుదల తేదిని రివీల్ చేశారు. 'కార్తికేయ 2' జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, దాపర యుగానికి సంబంధించిన కథతో ఈ సినిమా వస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చదవండి: 'నాలుగు సినిమాలకు సైన్ చేశాను.. ఇప్పుడేమో ఇలా అయ్యింది' The date is locked to enter the mystical world of Lord Sri Krishna with #Karthikeya2. Bringing you a GRAND BIG SCREEN EXPERIENCE on July 22nd.@actor_Nikhil @anupamahere @chandoomondeti @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl pic.twitter.com/Qge561F3Hb — Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 11, 2022 చదవండి: అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్, షూటింగ్ టైంలో అలా.. -
ఎలన్ మస్క్కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్
Tollywood Stars Welcome Elon Musk After KTR Tweet: తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్పై బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్మస్క్కి ఆహ్వానం పలుకుతున్నారు. .@elonmusk - Come to Hyderabad - India!!! It will be epic to have you 🤍 The Government here in Telangana is terrific too.. — Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022 Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k — Gopichandh Malineni (@megopichand) January 15, 2022 Love this car so so much @elonmusk Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW — Genelia Deshmukh (@geneliad) January 15, 2022 Welcome to #Tesla 🚘 @elonmusk sir you have best land& infrastructure in Telangana🙏🏻of course best Minister & Administration @KTRTRS https://t.co/fmJYszN4PP — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2022 ఈమేరకు టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని సైతం కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. What a Person ❤ Lets Get Tesla to Telangana anna ... @KTRTRS @elonmusk @TelanganaCMO https://t.co/E5yc1QYW5e — Nikhil Siddhartha (@actor_Nikhil) January 15, 2022 నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్రా సైతం ఉన్నారు. సంబంధిత వార్త: హేయ్ ఎలన్మస్క్ .. వెల్కమ్ టూ తెలంగాణ: కేటీఆర్ -
కన్నీళ్లు ఆగడం లేదు: హీరో నిఖిల్
Hero Nikhil Emotional Tweet About Janani Song From Rrr Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని హీరో నిఖిల్ అన్నాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. జనని సాంగ్ను ఇప్పటివరకు 20సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. దేశం మొత్తాన్ని ఎమోషనల్గా దగ్గరచేసే చిత్రమిది. కీరవాణి, రాజమౌళి ..మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని నా విన్నపం అని నిఖిల్ పేర్కొన్నాడు. ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని, ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారని రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గరం గరం ముచ్చట్లు 30 may 2021
-
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
ఆ సినిమాలు పూర్తయ్యాకే మెగాఫోన్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో ఆయన స్వయంగా వెల్లడించారు. తాను దర్శకుడిగా తెరకెక్కించే తొలి మూవీ.. చిన్నారులకు సంబంధించిందిగా తెలిపారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ముఖ్యపాత్రల్లో నటించనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా అని చెప్పారు. చిన్న పిల్లల సినిమా అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అయితే దర్శకత్వంపై నిఖిల్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘చిన్న పిల్లల చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాశాను. ఈ చిత్రాన్ని ఇప్పట్లో తెరక్కెక్కించలేను. ప్రస్తుతం నేను ‘కార్తికేయ-2, 18 పేజీస్' చిత్రాల షూటింగ్స్లో పాల్గొంటాను. ఆ తర్వాతే మెగాఫోన్ పట్టుకునేది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఇక నిఖిల్ సిద్దార్థ్ తన సినిమా కెరీర్ను మూవీ టెక్నీషియన్గా ప్రారంభించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’అనే సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో నిఖిల్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ఇక నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తన ప్రేయసి పల్లవి వర్మను పెద్దల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. Thanks for the Love nd Response... We Wrote a Bound Script for a Childrens Film but I will Not be Directing anytime soon Since the Heavy/Hectic Shoots of Both my films #18Pages & #Karthikeya2 will be taking off from October-November of this year. Cu in Theatres Soon 😇👍🏼 https://t.co/s2EBlxG5Cp — Nikhil Siddhartha (@actor_Nikhil) September 16, 2020 -
చైనా వస్తువులను బహిష్కరించాలి: నిఖిల్
సాక్షి, హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు యావత్ దేశం కన్నీటి నివాళి అర్పించింది. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) అమరవీరుల మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేశ్ బాబు, దేవిశ్రీప్రసాద్, నిఖిల్ సిద్దార్థ, అనిల్ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. చైనా అహంకార చర్యలపై నా రక్తం మరిగిపోతోందని, టిక్టాక్ నుంచి మొదలు చైనా వస్తువులన్నింటిని బహిష్కరించాలని నిఖిల్ పిలుపునిచ్చాడు. అంతేకాకుండా వీర జవాను సంతోష్ బాబు తల్లిని ఉద్దేశిస్తూ ‘అమ్మ నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మేమందరం మీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అంటూ నిఖిల్ మరో ట్వీట్ చేశారు. (విషం చిమ్మిన చైనా..) Amma We r all with you 🙏🏽 Please stay strong... Your sacrifice will never be forgotten 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 🙏🏽 Mother of #ColonelBSantoshBabu #IndiaChinaFaceOff #IndiaChinaBorder #BoycottChina https://t.co/moARnT9tiu — Nikhil Siddhartha (@actor_Nikhil) June 16, 2020 Deeply disturbed and saddened to learn that our soldiers were martyred at #GalwanValley. Your sacrifice for the nation will forever be etched in our hearts. We salute your bravery and patriotism. My heartfelt condolences to the bereaved families. Jai Hind — Mahesh Babu (@urstrulyMahesh) June 17, 2020 Heartfelt condolences to Col. Santosh Babu, an Indian army officer hailing from Suryapet, Telangana who laid down his life for the nation. I salute you, your family & all our bravehearts of Galwan. Jai Jawan! #IndianArmy #SantoshBabu #Galwanvalley pic.twitter.com/fLztX6Lmhz — Vishnu Manchu (@iVishnuManchu) June 17, 2020 My heart goes out to all the lost brave souls at the border#GalwanValley #BraveSonsofIndia #Saluteindianarmy pic.twitter.com/2K8VmWAvZO — Anil Ravipudi (@AnilRavipudi) June 17, 2020 #GalwanValley you are our true heroes. Strentgh to their families. Ok 2020 you may end now..enough is enough — Lakshmi Manchu (@LakshmiManchu) June 17, 2020 -
‘సుశాంత్కు అన్నీ ఉన్నప్పటికీ... ’
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) అనూహ్య మరణంపై టాలీవుడ్ తారాలోకం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ పలువురు తెలుగు హీరోలు ట్వీట్లు చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. మంచి పేరు ప్రతిష్టలు, అందం, ఆరోగ్యం ఉన్నప్పటికీ సుశాంత్ మానసిక సమస్యలతో అర్ధాంతంగా తనువు చాలించాడని యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ట్విటర్లో పేర్కొన్నారు. కఠిన విమర్శలు లేదా ప్రశంసలు కొన్నిసార్లు నటీనటులకు మానసికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య : దర్యాప్తు ముమ్మరం) ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకాల మరణ వార్తలు విని షాకయ్యాను. అతను ప్రతిభావంతుడైన యువకుడు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతని కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సుశాంత్ లేడన్న వార్తను నమ్మలేకపోతున్నానని రాంచరణ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతిభ త్వరగా కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. ‘సుశాంత్ మరణవార్త విని షాకయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కాగా, ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ ఆదివారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. (చదవండి: హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య) -
కేర్ అండ్ షేర్లో నిఖిల్..
విజయవాడ : యంగ్ హీరో నిఖిల్ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. సోమవారం తన బర్త్ డే సందర్భంగా గన్నవరం మండలంలోని కేర్ అండ్ షేర్ అనాథ శరణాలయానికి వెళ్లిన నిఖిల్ అక్కడి పిల్లలతో సరదాగా గడిపారు. ట్రస్ట్కు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తన బర్త్డే పార్టీకి ఖర్చు చేసే మొత్తాని.. ఆ ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరోవైపు నిఖిల్ బర్త్డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి : అది నువ్వేనా: హీరోయిన్ వీడియోకు నెటిజన్లు ఫిదా!) ‘నా పుట్టిన రోజున కొద్ది సమయం గన్నవరం కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్లో గడిపాను. ఈ ట్రస్ట్.. వదిలివేయబడిన మరియు అనాథ పిల్లలను సంరక్షిస్తుంది. సాధారణంగా నా బర్త్ డే పార్టీకి ఖర్చు చేసే మొత్తం డబ్బును.. ఈ ట్రస్ట్కు విరాళంగా ఇవ్వబోతున్నాను’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. కాగా, నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తన ప్రేయసి పల్లవి వర్మను పెద్దల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా తర్వాత నిఖిల్ జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో.. పల్లవి కూడా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్డే లవ్.. నువ్వు చాలా బలంగా ఉంటావు.. అయినప్పటికీ సున్నితమైన విషయాలపై చాలా సున్నితంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కలలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను’ అని పల్లవి పేర్కొన్నారు. -
హీరో నిఖిల్ వెడ్డింగ్ టీజర్...
లాక్డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రేయసి పల్లవి వర్మను పెళ్లాడాడు టాలీవుడ్ హీరో నిఖిల్. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిఖిల్ అభిమానులతో పాటు శ్రేయోలాభిలాషులకు అతడి పెళ్లిని నేరుగా చూసే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తన పసుపు ఫంక్షన్, పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నిఖిల్.. తాజాగా తన వెడ్డింగ్ వీడియోను పోస్ట్ చేశాడు.(వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్) ‘‘ప్రతీ ఒక్కరు నా పెళ్లికి రావాలని కోరుకున్నాను. కానీ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఈ వీడియో ద్వారా మాత్రమే మీ ఆశీర్వాదాలు పొందగలనని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతోంది’’అంటూ తన జీవితంలో మధుర జ్ఞాపకాలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులతో పంచుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వీడియోను చూసేయండి. -
సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు
వివాదాలు ఆమెకు కొత్త కాదు.. తను అనుకుంటున్నది ఏదైనా కుండబద్దలు కొట్టి చెప్పే స్వభావం. లాక్డౌన్లో పెళ్లిళ్లు చేసుకున్న కొందరు సెలబ్రెటీలను ఉద్దేశించి నటి మాధవీలత చేసిన ఫేస్బుక్ పోస్ట్ మరోసారి ఆమెను వివాదాల్లోకి లాగింది. లాక్డౌన్ కొనసాగుతుండగా అతికొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న సినీ ప్రముఖులపై తనదైన శైలిలో స్పందిస్తూ.. మాస్కులు పెట్టుకొని మరీ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాది.. పిల్ల దొరకదా లేక పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా? అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. మీరు అంటున్నది నిఖిల్ పెళ్లి గురించా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఏమో అంటూ సమాధానాన్ని దాటవేసింది. ‘పేద, మద్య తరగతి కుటుంబాలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. కానీ సెలబ్రటీలు మాత్రం మాస్కులు వేసుకొని మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నా పోస్ట్ కేవలం సెలబ్రెటీలను ఉద్దేశించి పెట్టినదే’ అంటూ క్లారిటీ మాత్రం ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ఇటీవల పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజుల గురించే పోస్ట్ చేసిందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (వారికి కూడా నా ధన్యవాదాలు: నిఖిల్) మాధవీలత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిప్రాయాలను కొంతమంది సమర్థిస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ‘ఎవరి అభిప్రాయాలు వారివి. మీ ఉచిత సలహాలు ఎందుకు’ అంటూ ఫైర్ అవుతున్నారు. ‘నా ఫేస్బుక్ పోస్ట్ నా ఇష్టం. నా భావాలను చెప్పే హక్కు నాకుంది’ అంటూ పోస్ట్ చేసింది. నిఖిల్, డాక్టర్ పల్లవీ వర్మను అతికొద్ది మంది సమక్షంలో ఈనెల 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా) -
వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్
హైదరాబాద్ : హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉండటంతో హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకకు హాజరైన కొద్ది మంది అతిథులకు కూడా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు.. మాస్క్లు, శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అయితే లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలోని నిఖిల్ స్నేహితులు చాలా మంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. (చదవండి : ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్) ఈ క్రమంలో నిఖిల్ స్నేహితులతోపాటుగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిఖిల్, పల్లవి జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. దీంతో నిఖిల్ వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నా ఫోన్, సోషల్ మీడియా మీ ఆశీస్సులు, ప్రేమతో నిండిపోయింది. ఈ పెళ్లి కోసం పనిచేసిన టీమ్కు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. అద్భుతమైన డెకరెషన్, ఫొటోగ్రఫీ, ఔట్ఫిట్ అందించిన మీరు పెళ్లిని గుర్తుండిపోయేలా చేశారు ’ అని నిఖిల్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాలని భావించిన కరోనా ఎఫెక్ట్తో అదికాస్త మే 14కు వాయిదా వేశారు. అయితే రెండోసారి కూడా పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అనుకున్న ముహుర్తానికే నిఖిల్, పల్లవిలు వివాహ బంధంతో ఒకటయ్యారు.(చదవండి : క్లాసికల్ డ్యాన్స్తో అదరగొట్టిన సాయేషా) Thanks for all the wishes pouring in.. my phn nd social media has been flooded with Blessings and Love. I also wanna thank the team behind the Wedding👉🏼Decor by @ekaa_customdecor Photography by @aswin_suresh_photography nd Outfit frm @jahanpanahhyd made the Wedding Memorable 4 me pic.twitter.com/la4EhFfu7h — Nikhil Siddhartha (@actor_Nikhil) May 15, 2020 -
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ఎట్టకేలకు ఓ ఇంటి వాడయ్యాడు. అనేక వాయిదాల అనంతరం గురువారం ఉదయం 6.31 నిమిషాలకు తాను ప్రేమించిన ఇష్టసఖిని మూడు ముళ్ల బంధంతో మనువాడాడు. పంచభూతాల సాక్షిగా డాక్టర్ పల్లవి వర్మతో ఏడడుగులు వేశాడు. షామీర్పేట్లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ పల్లవిల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. మొదట ఏప్రిల్ 16న వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. ఈ వేడుకకు నేడు మూహుర్తం ఖరారయ్యింది. కరోనా కారణంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల మధ్య నిరాడంబరంగా హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. పూర్తి నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ పచ్చని పందిరిలో పెళ్లితో ఒకటయ్యారు. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా బుధవారం రాత్రి నిఖిల్ను పెళ్లి కొడుకు, పల్లవిని పెళ్లికూతురుని చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాల్సిన నిఖిల్.. ఇలా సాదాసీదాగా చేసుకోవడంతో అతని అభిమానులు కాస్తా నిరాశకు గురవుతున్నారు. స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం’ వంటి విజయాలను నిఖిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. (పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్న నిఖిల్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్తో... స్టే హోం అంటూ ఇప్పటికే సినీ తారలు సోషల్ మీడియాలో తామేం చేస్తున్నామో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే లాక్డౌన్లో ఇంటికే పరిమితమై తనకిష్టమైన గిటార్ నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక హీరో నాని ...తన కొడుకుతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. అలాగే హీరో రాంచరణ్ భార్య ఉపాసన తాను పెంచుకుంటున్న డేజీ అనే గుర్రంతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. (మేడమ్.. థ్యాంక్యూ: విద్యాబాలన్) ఇక యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ పోలీసుల కోసం శానిటైజర్లు తయారు చేశాడు. అంతేకాకుండా ఖాళీ సమయంలో వ్యాయమం చేయడంలో మునిగిపోయాడు. అలాగే తన సిక్స్ప్యాక్ బాడీ ఫోటోలను.. నిఖిల్ షేర్ చేశాడు. (వైరస్ భయపడుతుంది!) -
నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించారు. కరోనా కారణంగా అతని పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా గత కొద్దికాలం ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవితో సినీ హీరో నిఖిల్ వివాహం గత నెల నిశ్చమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. 'ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్ను అడ్వాన్స్గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్న నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం' అని నిఖిల్ అన్నారు. చదవండి: ఇదిగో నా ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్: నటుడు -
హీరో నిఖిల్ నిశ్చితార్థం
-
రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన
సాక్షి, హైదరాబాద్: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను చిత్ర యూనిట్ నేరుగా కలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు వెళ్లిన హీరో నిఖిల్ అక్కడ రోడ్డు మీద ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను ఓ మహిళ అమ్ముతుండడం గమనించి షాక్కి గురయ్యాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఇలా.. రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని చెప్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Had so much fun interacting with Housefull Crowds in Guntur yesterday and on the way back stopped for tea and Found This ... #ArjunSuravaram and other movie DVD’s being openly sold🤦🏻♂️ pic.twitter.com/nEBCbtAeqh — Nikhil Siddhartha (@actor_Nikhil) December 8, 2019 -
నిఖిల్ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్!
ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్... అర్జున్ సురవరం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ లేదని తేల్చి చెప్పేశాడు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘పెద్దన్న ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ తరువాతే అర్జున్ సురవరం రిలీజ్ ఉంటుంద’ని చెప్పాడు. సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే నిఖిల్ సినిమా రిలీజ్కు ఇక నెలపైనే సమయముందన్న మాట. ప్రస్తుతానికి ప్రమోషన్ కూడా పక్కన పెట్టేసిన చిత్రయూనిట్, ఇంత గ్యాప్ తరువాత ఈ మూవీపై తిరిగి హైప్ తీసుకురావటంలో ఎంతవరకు సక్సెష్ అవుతుందో చూడాలి. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన కనితన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం మూవీలో నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించారు. ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్లు నిర్మిస్తున్నారు. The wait will b worth.. After pedannas Saaho... release of #ArjunSuravaram #WaitingForArjunSuravaram https://t.co/LPQsdd3M9j — Nikhil Siddhartha (@actor_Nikhil) July 27, 2019 -
ప్రత్యేక హోదాపై గళం విప్పిన టాలీవుడ్ హీరో
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కానక్కర్లేదని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిరాశే ఎదురవడంతో నటుడు నిఖిల్ తన వంతుగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, అది ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నిధుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొందరు తనను 'నీకు ఏపీకి ప్రత్యేక హోదా' లాంటి విషయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో దీనిపై నిఖిల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. 'ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. కొంత మంది ఇలాంటి విషయాలు నీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని' నటుడు నిఖిల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కిర్రాక్ పార్టీ విడుదలకు సిద్ధంగా ఉంది. Im just an Actor nd many will say "Neeku ivvi Enduku" but I hav shot across Ap recently nd realised how much work needs 2 be done 2 get an urban centre going in the State,which is only possible through huge funding frm the govt. As a Telugu nd an Indian👉#APDemandsSpecialStatus pic.twitter.com/wYdSExNJEq — Nikhil Siddhartha (@actor_Nikhil) 5 February 2018 -
నిఖిల్కు జోడిగా కేథరిన్
విభిన్న చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, ఇప్పుడు రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న కిరాక్ పార్టీ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమాలోనే నటించనున్నాడు నిఖిల్. తమిళనాట సంచలన విజయం సాధించిన కనితన్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. కోలీవుడ్ అధర్వ నటించిన పాత్రలో నిఖిల్ అలరించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన సంతోష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'కార్తికేయ 2' వచ్చే ఏడాది మొదలవుతోంది..!
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్వామిరారా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ కు 'కార్తికేయ' సక్సెస్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అందుకే కార్తికేయ రిలీజ్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ప్రస్తుతం కన్నడ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న నిఖిల్, మరోసారి కార్తీకేయ సీక్వల్ పై క్లారిటీ ఇచ్చాడు. తొలి భాగం రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి వచ్చే ఏడాది సీక్వల్ మొదలవుతుందని తెలిపారు. తొలి భాగాన్ని ఒక గుడి నేపథ్యంలోనే తెరకెక్కించిన చందూ రెండో భాగాన్ని అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వినిపించాయి. Karthikeya Part 2... Script Loading... ☺️ https://t.co/bo941J83fT — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 3 yrs went by quick.. It's my most favorite film... There will be a 2nd installement starting next year.. #Karthikeya #3yrs @chandoomondeti https://t.co/Aic6d7j7FW — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 -
పెళ్లి ఫొటోల్లో.. పిచ్చి పీక్స్!
పెళ్లి ఫొటోలను ఆయా ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్లో తీస్తుంటారు. ఇందుకోసం వాళ్లు రకరకాల కష్టాలు పడుతుంటారు. సమయానికి లైటింగ్ సరిగ్గా ఉండాలి, తాము అనుకున్న ఫ్రేము సరిగ్గా రావాలి, అంతా చేసి ఫొటో తీశాక వధూవరుల్లో ఒకళ్లు కళ్లు మూయడమో, లేదా వేరేవైపు చూడటమో జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు డిజిటల్ ఆల్బంలు వచ్చిన తర్వాత.. చిత్ర విచిత్రమైన యాంగిల్స్లో ఫొటోలు తీస్తూ.. వాటిని ఆ తర్వాత వధూవరులకు కానుకగా అందిస్తున్నారు. ఇందుకోసం పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత.. వధూవరులను మాత్రమే ఒకచోట ఉంచి వాళ్లను రకరకాలుగా ఫొటోలు తీస్తున్నారు. సరిగ్గా అలాంటి ఫొటో ఒకదాన్ని హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేశాడు. వధూవరులిద్దరూ ఎదురెదురుగా ఉండి చేతులు పట్టుకుని ఉండగా.. ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరి మధ్య కింద పడుకుని సరిగ్గా ఆ చేతుల కిందకు తన కెమెరా వచ్చేలా ఉన్నాడు. ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ.. 'వెడ్డింగ్ ఫొటోల పిచ్చి పీక్స్' అని కామెంట్ పెట్టాడు. ఆ ట్వీట్ను మరో హీరో దగ్గుబాటి రానా కూడా రీట్వీట్ చేశాడు. Picchih peakss of Wedding Photography :-)) pic.twitter.com/egVvFcVZKB — Nikhil Siddhartha (@actor_Nikhil) February 9, 2016 -
నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి'
చెన్నై: 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హిట్ సాధించిన హీరోయిన్ హేబా పటేల్ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా నిఖిల్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ హేబా ఎంపికైంది. ఫస్ట్ హీరోయిన్ గా అవికా గోర్ నటిస్తోంది. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుందని దర్శకుడు ఆనంద్ తెలిపారు. రొమాంటిక్ ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ సినిమాను వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. జనవరి 20 నుంచి షూటింగ్ మొదలుకానుంది. కాగా, రాజ్ తరుణ్ తో మరో సినిమాలో నటించేందుకు హేబా పటేల్ ఇప్పటికే అంగీకరించింది. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరోగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడీగా తొలుత అవికా గోర్ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్లో హేబాను సెలెక్ట్ చేశారు. -
నిఖిల్ తో జతకట్టనున్న అవికా గోర్
-
నిఖిల్ తో జతకట్టనున్న అవికా గోర్
చెన్నై: 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా మారిన 'చిన్నారి పెళ్లికూతురు' అవికా గోర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువహీరో నిఖిల్ తో ఆమె జత కట్టనుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలో వీరు కలిసి నటించనున్నారు. మరో హీరోయిన్ గా తాప్సీ ఎంపికైంది. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, మరో హీరోయిన్ ను ఖరారు చేయాల్సివుందని దర్శకుడు ఆనంద్ తెలిపారు. ఫాంటసీ ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నిఖిల్ నటిస్తాడని వెల్లడించారు. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభంకానుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నాడు. తాను తెలుగులో దర్శకత్వం వహించిన 'టైగర్' సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ఆనంద్ తెలిపారు. -
సూర్య V సూర్య యూనిట్కు బ్రహ్మరధం