Paddy procurement
-
ధాన్యం కొనుగోలులో దళారీలు వచ్చేసారు..
-
బాబు పాలనలో ధాన్యం సేకరణ, మద్దతు ధర రెండూ లేవు
-
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.ఇవిగో వాస్తవ గణాంకాలు...‘జగన్మోహన్రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.అదే 2019–23 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న
సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కంకులతోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన వరా్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదురాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటుతుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు. పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.గింజ కొనే వారు లేరు..కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్టీవో 906200015240005 జనరేట్ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. వాస్తవానికి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.రైతుకు అన్యాయం జరుగుతోంది..‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. ..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.మాఫియాకే ‘మద్దతు’!రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండిఇదిలా ఉంటే.. ఫెంగల్ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. ఇక్కడ యుద్ధప్రాతిపదికన పంటను తరలించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్లోడింగ్కు రోజులు తరబడి సమయంపడుతోంది. సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతున్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతున్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.గతంలో ఎంతో మేలు..గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.‘హాయ్’ అన్నా పలకని ప్రభుత్వం..పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలుఅత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టంఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. అంచనా వేసిన వ్యవసాయశాఖఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎకరాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.భయమేస్తోంది..నేను కౌలుకు సాగుచేస్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపానుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. – యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా కొనేవారు కరువయ్యారు.. ‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. – వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాఅన్ని విధాలా నష్టపోయాం.. పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా నష్టపోయాం. – నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాగతంలో ఇలా ఇబ్బంది పడలేదు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. – పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే: ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్ నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ : ధరావత్ రవి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్ -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు
-
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారానికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టాల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తక్షణ స్పందన రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకొక ఐఏఎస్ అధికారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్ ఫండ్ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. మొలక 7–10 శాతం ఉన్నా సరే.. మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్లైన్లో (వాస్తవానికి పూర్తిగా ఆన్లైన్లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలానికో మినీ మొబైల్ మిల్లు నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్ అయినా íపిలిస్తే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నారు. రంగంలోకి మార్క్ఫెడ్ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్ఫెడ్ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా.. జిల్లా రైతుల సంఖ్య సేకరించిన ధాన్యం (టన్నుల్లో) పశ్చిమగోదావరి 28,650 2,62,711 ఏలూరు 11,423 1,34,543 తూర్పుగోదావరి 12,998 1,19,748 కోనసీమ 5,975 46,669 కాకినాడ 2,481 18,357 కృష్ణా 2,598 15,298 బాపట్ల 1968 12,014 నెల్లూరు 281 4257 ప్రకాశం 411 2577 ఎన్టీఆర్ 113 1456 ––––– వేగంగా స్పందించి కొన్నారు నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చారు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు. – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. – పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా ధాన్యం తరలింపు అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్లైన్లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రబీ సీజన్లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా.. సంవత్సరం టన్నులు 2014–15 18,91,106 2015–16 20,70,540 2016–17 16,95,341 2017–18 18,12,994 2018–19 16,47,193 (మార్చి 31 వరకు) మొత్తం 91,17,174 –––– వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2018–19 11,05,578 (ఏప్రిల్ 1నుంచి) 2019–20 34,73,827 2020–21 37,23,522 2021–22 26,22,386 2022–23 6,17,761 (మే 6వ తేదీ వరకు) 1,15,43,074 ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారి అల్లూరి సీతారామరాజు ప్రవీణ్కుమార్, ఎండీ ఎపీఐఐసీ అనకాపల్లి జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ బాపట్ల కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ (ఇన్ఫ్రా) తూర్పు గోదావరి వివేక్యాదవ్, కమిషనర్ సీఆర్డీఎ ఏలూరు శశిభూషణ్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖ గుంటూరు ఎండీ ఇంతియాజ్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, సెర్ప్ కాకినాడ పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్సీఎస్సీఎల్ కృష్ణా లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్హెచ్సీఎల్ ఎన్టీఆర్ గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఎస్పీఎస్ నెల్లూరు చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ పల్నాడు సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్ పార్వతీపురం మన్యం ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకాశం ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య పశ్చిమగోదావరి కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ అనంతపురం ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు. కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో కలెక్టర్ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది. -
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్మోడల్గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్కార్డులు అందజేశారు. -
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఉత్తరాంధ్రలో వారంలోగా.. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాప్.. నిజామాబాద్ ఆఖరున ఆదిలాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 63.20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ కారణంగా.. దాదాపు 65 లక్షల టన్నులకు మించి సేకరణ జరిగే అవకాశం కనిపించడం లేదు. ముప్పావువంతుకుపైగా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించగా, అతితక్కువ సేకరణలో ఆదిలాబాద్ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,015 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,100 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 20 వరకు కొంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. రెండు, మూడు స్థానాల్లో కామారెడ్డి, నల్లగొండ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.1,204.36 కోట్ల విలువైన 5,85,661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మూడేళ్లుగా పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్లోనే అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ తరువాత స్థానాల్లో 4,75,082 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రెండోస్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, 4,11,827 మెట్రిక్ టన్నులతో మూడోస్థానంలో నల్లగొండ జిల్లా ఉంది. 2,198 మెట్రిక్ టన్నులతో ఆఖరున ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో వరిసాగు అతితక్కువగా ఉండడమే అందుకు కారణం. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం రాష్ట్రంలో ధాన్యం సేకరణకు పట్టాదారు పాస్పుస్తకంతోపాటు ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానం చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట వంటి జిల్లాల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని మిల్లర్లు కల్లాల మీదే కొనుగోలు చేసి, బియ్యంగా మరపట్టించి విక్రయించారు. అగ్గువకో, సగ్గువకో తక్షణమే నగదు వస్తుండటంతో రైతులు కూడా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు భారీ ఎత్తున విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రావలసిన ధాన్యం తగ్గింది. 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారుల ద్వారా బహిరంగ మార్కెట్కు తరలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.12,430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ ఆఖరు నాటికి 25.84 ఎల్ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. నిజామాబాద్ టాప్ వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్ జిల్లాలో 5,38,354 మెట్రిక్ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 3,22,047 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సన్నాలకు డిమాండ్తో... జై శ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. -
ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణ కోసం ఈసారి 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ధాన్యం కోసం అవసరమైన 25 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. -
ఈసారి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట సాగైన నేపథ్యంలో వానాకాలం సీజన్కు సంబంధించి సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజను సేకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవసాయ, పోలీస్, మార్కెటింగ్, సహకార శాఖలకు చెందిన అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండించిన స్థితి నుంచి ఏకంగా కోటీ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ సారి 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు, తేమ కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 17 జిల్లాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం అక్రమ దిగుమతిని అడ్డుకొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు తెచ్చే ధాన్యాన్ని విజిలెన్స్తో పాటు పోలీస్ శాఖ అడ్డుకోవాలని ఆదేశించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ధాన్యం నిల్వకు ఏర్పాట్లు మిల్లర్ల వద్ద ఇప్పటికే దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యానికి తగిన నిల్వ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి గంగుల ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా సీఎంఆర్ కింద అప్పగించి, తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్కు ఎఫ్సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్సీఐ తీసుకున్న సీఎంఆర్కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
ధాన్యం సేకరణపై స్పందించకుంటే నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. మోదీ కుట్రలను ఛేదించడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతుచూస్తామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత మరమ్మతులు చేసి పంపులను వినియోగంలోకి తెస్తుందని రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్రెడ్డి, బండి సంజయ్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
కేంద్రం రైడింగ్ల పేరుతో వేధింపులు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులకు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తోందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయనివ్వకుండా మిల్లర్లపై కేంద్రప్రభుత్వం రైడింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేసే నాయకుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక్కరేనని, అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ధాన్యాన్ని తెచ్చి తెలంగాణలో కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవం చేయిస్తే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేల పారితోషికం అందిస్తామని చెప్పారు. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరలోనే 1,300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. -
నిరంతరం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ న్నారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశా మని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినపక్షంలో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తా మని రైతులకు భరోసా ఇచ్చి, ప్రతి ధాన్యం గింజను కొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ధాన్యం కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే రూ.3 వేల కోట్లకు పైగా భారాన్ని భరిస్తూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ చేయిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.5,888 వేల కోట్ల విలువైన 30.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 4.72 లక్షల మంది రైతుల నుండి సేకరించాం..’అని గంగుల వివరించారు. కేంద్రం సహకరించకున్నా.. ‘కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష తనిఖీల పేరుతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విష యాన్ని రైతులు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మే 2 వరకు ఒక్క గన్నీ బ్యాగును రాష్ట్రానికి అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదు. 6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ 500 కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయింది. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నాం. 11.64 కోట్ల గన్నీ బ్యాగుల్ని సేకరించాం. వీటిలో 7.52 కోట్ల సంచులు వాడగా, ఇంకా 4.12 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఈ బ్యాగులు సరిపోతాయి. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలలో మరో వారం రోజుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ధరకు వడ్లు కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేవలం ఒక్కరిద్దరికే మద్దతు ధర ఇస్తున్నారని, మిగతా వారి నుంచి తక్కువ ధరకే వడ్లు కొంటూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. ‘రైతుల నుంచి వడ్లు కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరి వేసిన రైతులు అతలాకుతలమవుతున్నారు. రైతన్నలు పంట వేయకపోతే మనం అన్నం కాకుండా గడ్డి తినాలా’అని షర్మిల నిలదీశారు. మద్దతు ధర కూడా ఇవ్వని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రను సైతం పక్కన పెట్టానన్నారు. పంట బీమానే కాదు.. పంట నష్ట పరిహారం కూడా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. -
కేసీఆర్ చెప్తేనే అలా చేశాం.. మోసపోయాం.. పరిహారమిచ్చి ఆదుకోండి
ఉప్పల్వాయికి చెందిన తిరుమలయ్యకు పెద్ద చెరువు కింద ఏడు ఎకరాల భూమి ఉంది. చెరువులో నీరు ఉండటంతో వానాకాలంలో మొత్తం వరి సాగు చేశాడు. యాసంగిలో కూడా వరి వేద్దామనుకున్నాడు. కానీ ప్రభుత్వం ధాన్యం కొనం అనడంతో ఐదు ఎకరాలు బీడు ఉంచి రెండు ఎకరాల్లో వేశాడు. తీరా ప్రభుత్వం ఇప్పుడు పంట కొంటాం అనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మద్దికుంటకు చెందిన బండి నవీన్కు 3 ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది. రెండు బోర్లు మంచిగా పోస్తాయి. యాసంగిలో వడ్లు కొనం అని ప్రభుత్వం ప్రకటించడంతో తన భూమిలో ఇతర పంటలు పండవని బీడుగా వదిలేశాడు. తీరా ఇప్పుడు ధాన్యం కొంటుండంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సర్కార్ మాట విని మోసపోయానని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. రామారెడ్డి (నిజామాబాద్): సర్కార్ మాట విని యాసంగిలో వరి వేయకుండా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంట వర్షాలకు దెబ్బతిని నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వం మాట విని బీళ్లుగా ఉంచామని వాపోతున్నారు. యాసంగిలో వరి వేయద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక వేళ వరి సాగు చేసిన కొనుగోలు చేయమని ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు నీళ్లున్నా.. భూములను బీళ్లుగా ఉంచారు. చెరువుల కింద ఇతర పంటలు పండక పోవడంతో చాలావరకు బీడు పెట్టారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి వరి వేశారు. జిల్లాలో భూములు ఆరుతడి పంటలను అనుకులంగా లేకపోవడం, కోతుల బెడద, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పంటలు వేయలేదు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో వరి సాగు తగ్గింది. గతేడాది యాసంగిలో జిల్లాలో 2.47 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 1.5లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఉపాధి కరువు జిల్లాలో ఎక్కువగా బోరు బావులు, చెరువు నీళ్లు పారకంతో వ్యవసాయం చేస్తుంటారు. వడ్లు కొనమని చెప్పడంతో ఎకరం ఉన్న రైతులు బీడుగా వదిలేయగా, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 2 ఎకరాల వరకు వరి పంటను సాగు చేశారు. చాలా మంది యువ రైతులు, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఉపాధి కరువై వలస బాట పట్టారు. పనులు లేకపోవడంతో హైదరాబాద్, ముంబాయి నగరాలకు వెళ్లారు. తీరా ఇప్పుడు కొనుగోళ్లు ప్రా రంభించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చెప్పడంతోనే తాము వరి వేయలేదని.. కొనుగోలు చేస్తామని ముందే చెబితే తాము నష్టపోయేవారం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట విని పొలాలను బీళ్లుగా ఉంచిన వారికి పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కేసీఆర్ వద్దంటేనే వేయలేదు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ అనడంతోనే పంట వేయలేదు. ఇప్పుడు వడ్లు కొంటామని చెప్తున్నారు. నీళ్లు ఉన్నా వరి వేయని మా పరిస్థితి ఏమిటి? వరి వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి. – రాములు, రైతు, గిద్ద పరిహారం ఇవ్వాలి వరి సాగు చేయవద్దని వ్యవసాయాధికారులే చెప్పారు. ఇప్పుడు వడ్లు కొంటాం అంటున్నారు. వారి మాట విన్న మేము మోసపోయాం. ప్రభుత్వం పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. – రాజయ్య, రైతు, గిద్ద -
నూకల పరిహారం ఎంతిద్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. -
ధాన్యం సేకరణకు బీజేపీ మోకాలడ్డుతోంది: పల్లా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణకు బీజేపీ నేతలు సహకరించకపోగా, అడుగడుగునా మోకాలడ్డుతున్నారని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్తో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తోడై తెలంగాణకు, రైతులకు శాపంగా మారారన్నారు. ఉప్పుడు బియ్యం సమస్య తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లలో కూడా ఉందని ఆ రాష్ట్రాల ఎంపీలు చెబుతుంటే రేవంత్ సిగ్గు లేకుండా తెలంగాణలోనే సమస్య ఎందుకుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైద్య సీట్ల భర్తీపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్కు లేఖ రాశారని పేర్కొన్నారు. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వైద్య విద్య ప్రవేశాల్లో అక్రమాలపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ..బీజేపీ లేకపోతే టీఆర్ఎస్కు పదవులు ఎక్కడివని బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 1997 నాటి కాకినాడ తీర్మానానికి అనుగుణంగా 2000 సంవత్సరంలోనే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవా అని ప్రశ్నించారు. -
వరి... ఉరి కాకుండా ఆపలేమా?
కొంతకాలంగా తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న వరి పండించే రైతన్నలకు ప్రత్యామ్నాయం చూపవలసి ఉంది. వరి పండించవద్దని చెప్పడం సరైంది కాదు. వరి కొనుగోలు సమస్య ముఖ్యంగా యాసంగి పంటకు వస్తుంది. కారణం – యాసంగిలో వడ్ల మిల్లింగ్లో ఎక్కువ నూకల శాతం ఉండడమే. నూక శాతాన్ని తగ్గించుకోవడానికి మిల్లర్లు బాయిల్డ్ రైస్ వైపు మొగ్గు చూపడం వలన కేంద్రం కొనుగోలుకు విముఖంగా ఉంది. రైస్కు ఉన్న డిమాండ్ బాయిల్డ్ రైస్కు లేకపోవడం, బాయిల్డ్ రైస్ వినియోగం దేశంలో తగ్గుతుండడం కేంద్ర ప్రభుత్వ నిరాసక్తతకు ఊతమిస్తున్నాయి. ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబబు కాదు. రైతుల క్షోభను అర్థం చేసుకుని ఇరు ప్రభుత్వాలూ సానుభూతితో పరిష్కారం కోసం కృషి చేస్తే రైతుల మన్ననలను పొందగలరు. సమస్యకు మూలకారణమైన నూకలు, బాయిల్డ్ రైస్ వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే, రైతులకు మంచి ధరను అందించవచ్చు. వీటిని వినియోగించి ‘ఇథనాల్’ తయారీకి మంచి అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఇంధనం కొరత, అధిక ఇంధన ధరలకు ఒక పరిష్కారం కూడా అవుతుంది. పెట్రోల్ కొరత, దాని ఇతర ఉత్పత్తుల ధరల పెరుగుదల వలన, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. బ్లెండెడ్ పెట్రోల్ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) అన్ బ్లెండెడ్ పెట్రోల్పై లీటరుకు రెండు రూపాయల అదనపు ఎక్సైజ్ సుంకం ఉండడం వలన, బ్లెండెడ్ పెట్రోల్ వినియోగించడానికి ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంది. ఇథనాల్ ఉపయోగిస్తే రైతులకు మేలుతో పాటు, దేశానికి పెట్రోలియం దిగుమతుల భారం తగ్గుతుంది. దేశంలో ‘ఇథనాల్’ కొరతను కూడా అధిగమించవచ్చు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా, వరి ఉత్పత్తులతో ఇథనాల్ తయారీకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశం మెండుగా ఉందనీ, తయారీకి ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామనీ చెప్పడం కూడా గమనార్హం. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) ఇథనాల్ను రైస్ తయారీలో కూడా మితంగా ఉపయోగిస్తారు. నూకలను, బాయిల్డ్ రైస్ను పిండిగా మార్చి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మ సౌందర్యానికి ఫేస్ప్యాక్, రైస్ బిస్కెట్లు, నిల్వ ఆహార పదార్థాల తయారీలో కూడా బియ్యపు పిండిని వాడుతారు. ఇవే కాకుండా ఇంకా మెరుగైన వినియోగానికి మార్గాలను పరిశోధనల ద్వారా అన్వేషించి ఉపయోగించడం ద్వారా వరి రైతులకు ఊరటనివ్వడమే కాకుండా పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థికం పరిపుష్టమౌతుంది. – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయ్: మధు యాష్కీ
సాక్షి, ఖమ్మం: వరంగల్ పట్టణం మే 6నలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుందని ఆ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ప్రశ్నించారు. రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ-మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ-టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ధర్నా కాదు.. డ్రామా అని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్లో ధర్నా చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని విమర్శించారు. -
రైతన్నా.. మీసం తిప్పెయ్..
ఖమ్మం మయూరి సెంటర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్) -
పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లై సన్నద్ధమైందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయిని తెలిపారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కొనుగోళ్లు మొదలవుతాయని చెప్పారు. మే చివరి నాటికి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైతు అని నిర్ధారించుకోవడానికే ఈ సిస్టం ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందుల కారణంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముతారనే సమాచారం ఉందని తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు ధాన్యం చేరిన తర్వాత ప్రభుత్వానికి మెసేజ్ రాగానే మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగిలో 36 లక్షల వరి సాగు అయ్యిందని తెలిపారు. -
Sakshi Cartoon: ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్!
ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్! -
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్సీ కవిత
-
మరోసారి రైతు ఉద్యమానికి సిద్ధం
బోనకల్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పాలకులు ప్రకటించాలని, లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో మరోసారి రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయడం చేతకాదని చేతులెత్తేసిన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇప్పుడు ధర్నాలు చేయడం గర్హనీయమని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు. కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షతతో జాతి సమైక్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలే కరువయ్యాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులను టీఆర్ఎస్ భయపెడుతోంది: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై రైతులను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన మంళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ దీక్ష చేసినా రైతులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ లేఖ ఇచ్చారా? లేదా? చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదని తెలిపారు. బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్సీఐ నిలిపివేసిందని గుర్తుచేశారు. ‘రా రైస్’ తీసుకోవడానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని సీఎం కేసీఆర్ లేఖ ఇచ్చారని అన్నారు. గత సీజన్ గురించి తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజవరకు కొంటామని తెలిపారు. గత సీజన్లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని అన్నారు. లేని వడ్ల సమస్యను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎవరూ ఉప్పుడు బియ్యం తినడం లేదని, ఉపయోగం తగ్గిందని తెలిపారు. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని అన్నారు. ఉచితంగా ఇచ్చినా తీసుకోవడం లేదని తెలిపారు. రైతులను టీఆర్ఎస్ భయపెడుతోందని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ధాన్యంపై కేంద్ర, రాష్ట్రాల డ్రామాలు
బోనకల్: యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో భట్టి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు.. తమ బాధ్యతను విస్మరించి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ పక్క వరి కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని విచారం వ్యక్తంచేశారు. ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొన్నాక కేంద్రంతో యుద్ధం చేయాలని సూచించారు. ఏదిఏమైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీకి 24 గంటల డెడ్లైన్:కేసీఆర్
-
మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉంది: కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. టీఆర్ఎస్ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తమ రాష్ట్ర రైతులు పండించే ధాన్యం ప్రధాని కొంటే సరి. కొనకపోయినా ఫర్వాలేదని అన్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతునే ఉంటుందని తెలిపారు. తాము పేదవాళ్లమేమీ కాదని.. రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం కొనాలన్న డిమాండ్తో తెలంగాణ మంత్రి మండలి, రైతులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. భారత ప్రధాని మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారని ధ్వజమెత్తారు. ధర్మబద్ధమైన డిమాండుతో తామొస్తే.. పీయూష్ గోయల్ అవమానించారని మండిపడ్డారు. ఆయన పీయూష్ గోయల్ కాదని.. పీయూష్ గోల్మాల్ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఈ దేశ రైతులు బిచ్చం అడగడం లేదని.. హక్కులు కోరుతున్నారని అన్నారు. కొత్త వ్యవసాయ విధానం రూపొందించాలని, దానికి తాము సహకరిస్తాని పేర్కొన్నారు. లేదంటే కేంద్ర పాలకుల్ని గద్దె దించి.. తామే కొత్త పాలసీ తయారు చేసుకుంటామని తెలిపారు. పంట మార్పిడి చేయమని కేంద్రం చెబితే, తాము గ్రామగ్రామానికి, ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పామని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేస్తాం టీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే, బీజేపీ హైదరాబాద్లో ధర్నా చేస్తోందని.. వాళ్లకు సిగ్గుందా? అని నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా? మనసు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తామంతా రాకేశ్ టికాయత్ పోరాటానికి మద్ధతిస్తున్నాని చెప్పారు. దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్ గోల్మాల్ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని మండిపడ్డారు. హిట్లర్, ముస్సోలినీ వంటి ఎందరో నేతలే మట్టికలిశారని.. మీరెంత? అని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈడీ, సీబీఐలు ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవని, తనను జైలుకు పంపుతామని అంటున్నారు. దమ్ముంటే రావాలని.. తనను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చోటామోటా కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేశామని, ఇప్పుడు దేశం కోసం చేస్తామని తెలిపారు. నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్కు రెండు చేతులూ జోడించి కోరుతున్నా.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ధాన్యం కొంటున్నారో తమ దగ్గర కూడా అలాగే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమ వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని మరింత ముందుకెళ్తామని అన్నారు. -
కేసీఆర్వి దొంగ ధర్నాలు: షర్మిల
రఘునాథపాలెం: వడ్ల కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో సంతకాలు చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు దొంగ ధర్నాలు చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయా త్ర శనివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పడమటి తండా వద్ద ప్రారంభమైంది. తర్వాత జాన్బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీల మీదుగా పాపటపల్లి చేరుకుంది. అక్కడ ఆమె రైతు దీక్ష చేపట్టారు. అనంతరం యాత్ర కామేపల్లి మండలానికి చేరుకుంది. యాత్ర 50వ రోజుకు చేరడంతో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పాపటపల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై రైతులతో షర్మిల మాట్లాడారు. పరిపాలన చేయాలని కేసీఆర్కు ప్రజలు అధికారమిస్తే ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ సూచనతో రైతులు వరి వేయకపోవడంతో అటు రైతులు, ఇటు కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. సీఎం సంతకం పెట్టినందుకే కేంద్రం వడ్లు కొనేది లేదని చెబుతోందని, ఆ సంతకం ఎవరిని అడిగి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుతో మిల్లర్లు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 మేర ధర తగ్గించి రైతులను దోచుకునేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరతో ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. -
వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహాకుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే బ్రోకర్లకు అమ్ముకునే పరిస్థితులు సృష్టించి లబ్ధి పొందేలా సీఎం కేసీఆర్ పథకం రచించారన్నారు. దీని వెనుక రూ. వందల కోట్లు ప్రభు త్వ పెద్దలకు కమీషన్లుగా ముట్టబోతున్నాయని, వడ్ల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఇందులో భాగమేనని చెప్పారు. ఈ మేరకు శనివారం రైతులకు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘యాసంగి పం టను ఎట్లా అమ్ముకోవాలో తెలియక రైతులు బాధపడుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన సీఎం ఢిల్లీ వెళ్లి ధర్నాలు, ఆందోళనల పేరిట రాజకీయం చేసి సమస్యను జఠిలం చేయడం ఎంతవరకు కరెక్టు?’ అని ప్రశ్నించారు. సర్కారు పెద్దలకు క్వింటాలుకు 100 కమీషన్! ‘యాసంగి పంట ద్వారా కోటి మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి జరిగింది. కేంద్రం క్వింటాలు వడ్లకు మద్దతు ధర రూ.1,960గా నిర్ణయించింది. కొందరు మిల్లర్లు క్వింటాలు వడ్లను రూ.1,300 నుండి రూ.1,660 లోపే కొంటున్నారు. ఎమ్మెస్పీ దక్కక రైతులు నష్టపోతున్నారు’అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కామ్లో ప్రభుత్వ పెద్దలకు ప్రతి క్వింటాలుకు రూ. వంద చొప్పున రూ. వందల కోట్ల కమీషన్ ఇచ్చేలా కొందరు రైస్ మిల్లర్ల మాఫియా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది’ అని సంజయ్ ఆరోపించారు. -
కేంద్రమే కొనాలి..
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కష్టాలను చూపేందుకే: కేకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనేవరకు వదలం: నామా కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఢిల్లీలో లొల్లికి రెడీ! యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది. శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. -
మిల్లర్లతో సర్కారు కుమ్మక్కు
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం సేకరణలో రాష్ట్రం లోని మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జేబులను కొల్లగొడుతోందని, రూ. వేల కోట్లను దోచుకుంటోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం లో రైతుల నుంచి ఎంఎస్పీ కంటే సుమారు రూ.400 నుంచి రూ.600 తక్కువకే మిల్లర్లు ధాన్యం కొంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలపై విజిలెన్స్ దాడులు చేయించకపోవడం, క్రిమినల్ కేసులను పెట్టకపోవడాన్ని బట్టి మిల్లర్లతో సర్కారు కుమ్మక్కైనట్లు అర్థమవుతోందన్నారు. శనివారం తెలంగాణభవన్లో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న సీఎం.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రధాని మోదీ, మంత్రులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం సేకరించకపోతే తామే కొంటామని ఢిల్లీ ధర్నాలో కేసీఆర్ ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ధర్మపోరాటం పేరుతో ఢిల్లీలో దీక్ష చేస్తే ఏం జరిగిందో తెలుసుకుంటే మం చిదని సీఎం కేసీఆర్కు సూచించారు. రైస్ మిల్లర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేలా పెద్ద కుంభకోణం జరుగుతోందని, రాష్ట్రంలో ధా న్యం సేకరణను ప్రారంభించకపోతే ఈ నెల 15 నుంచి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. -
టీఆర్ఎస్, బీజేపీని ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంతోపాటు ఏడేళ్లుగా టీఆర్ఎస్, బీజేపీలు ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్పార్టీ నిర్ణయించింది. ఈ పార్టీల గుట్టువిప్పి ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ఆందోళనలు, విద్యుత్సౌధ ముట్టడిపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరున రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటన ఉంటుందని, ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో మరింతగా ఉద్యమించాలని సూచించారు. అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ‘ధాన్యం కొనుగోలుకు ఈ నెల 11లోపు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా 12న అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలసి ధర్నాలు చేస్తాం. రైస్మిల్లర్లతో కుమ్మక్కయిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 15 తర్వాత బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల సమస్యలపై పోరాడుతాం’అని మధుయాష్కీ అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్కుమార్యాదవ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్అలీ, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవితోపాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. మహిళల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీ భవన్లో శుక్రవారం జరిగిన ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నేతలతోపాటు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. భేటీ తర్వాత గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వచ్చిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిందపడిపోవడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇతర నేతలను అరెస్టు చేసి నారాయణగూడ పీఎస్కు తరలించారు. -
ఓవర్ టు.. ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో పక్షం రోజులుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘వరి పోరు’కు ఇక ఢిల్లీ వేదికకానుంది. గత నెల 21న సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొదలైన వరి పోరు కార్యాచరణ శుక్రవారం ఊరూరా నల్లజెండాల ఎగురవేతతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన తెలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడంతో..: ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర మంత్రుల బృందం కోరినా.. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ గత నెలలో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి. తిరిగి ఈ నెల 4 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వరకు.. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఊరూరా నల్లజెండాల ఎగురవేత, మోదీ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దేశ రాజధానిలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 3నే ఢిల్లీ వెళ్లారు. 12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యత పాటిస్తున్నాయి. మంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ దీక్షకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీక్షకు రావాల్సిందిగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 1,500 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీ దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. వీరంతా ఆదివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం 11వ తేదీ ఉదయం రాజధానికి వెళతారని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతల అనుచరులు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానాలు.. రైలు బోగీలు పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారి కోసం రెండు ప్రత్యేక విమానాలతో పాటు ప్రత్యేక రైలు బోగీలను బుక్ చేశారు. అయితే అధికారిక పనుల కారణంగా సుమారు అరడజను మంది మంత్రులు ఢిల్లీ దీక్షలో పాల్గొనబోవడం లేదని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే నేతల వివరాలు, వెంట వరి ధాన్యం తెస్తున్నారా.. తదితర వివరాలు సేకరిస్తోంది. -
ఒకే దేశంలో ద్వంద్వ ప్రమాణాలా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు అర్థమవు తాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు వ్యవసాయ కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే రైతులు అనేక వ్యయభారాలతో కుంగి పోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులను వడ్డించాలనడం విడ్డూరం. రైతులను క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే సేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్ని స్తోంది. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తును అందిస్తు న్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. కాగా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతున్నది. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నది. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొను గోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం... యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే, కేంద్రంపై ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం తప్పదు. తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న తీరును పలువురు జాతీయ విపక్ష నేతలు ప్రశంసిస్తున్నరు. ఇప్పుడు జరగాల్సింది ఇదేన ంటున్నరు. ఒకవైపు టీఆర్ఎస్ రైతుల బాగు కోసం పోరాడుతుంటే మన రాష్ట్ర విపక్ష నేతలు సహాయ నిరాకరణతో పీత రాజకీయాలు చేస్తున్నరు. దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే మోదీ సర్కార్ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్ శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతా రాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల ఇబ్బందులు, కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అంది వరి విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరీ పెడుతోంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి? పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న! దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమా ధానం చెప్పడం లేదు. పైగా అవమానిం చేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరి సాగును కొంత తగ్గించారు. అయినా ధాన్యం కొనుగోలు చేయలేమని సవా లక్ష కారణాలను కేంద్రం ఏకరువు పెడుతోంది. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహ రించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేవి. పంజాబ్ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండేవి. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించిన తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తు న్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యాన్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేంద్రమంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏంటో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే... రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నట్లుంది. తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా, నచ్చని చోట మరోలా చూస్తున్నది. ఇలా పక్షపాతంతో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్రం ఆలోచించాలి. -పువ్వాడ అజయ్ కుమార్ వ్యాసకర్త రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
హోరెత్తిన వరి పోరు!
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు మోకాళ్లపై కూర్చుని వడ్లు దోసిట్లో పట్టుకుని ఆందోళన చేశారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉందంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ‘ధర్నా’లో దున్నపోతుపై నీళ్లు చల్లుతూ నిరసన తెలిపారు. వరి పోరులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్ కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి, రెచ్చగొట్టి మరీ వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే.. తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చి మోసం. వారికి ఎంత బలుపు.. నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరిస్తం. కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ.. చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి.. రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్ర్యాలీలు నిర్వహించాలి. ఈనెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేటు దూరంలో ధర్నా చేస్తాం. – సిరిసిల్ల నిరసనల్లో మంత్రి కేటీఆర్ మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు: హరీశ్ నాడు రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం. నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కాం. లక్ష్యాన్ని సాధిస్తాం. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పనిచేస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్లరుణాలు మాఫీ చేశారు. రైతుల పంటను కొనాలంటే నష్టం వస్తుందంటున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కాదు.. ముందు తెలంగాణ రైతుల బాధలు వినాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు ఆయన అచ్చే దిన్ అని అధికారంలో వచ్చారు. కానీ ఇప్పుడు జనం సచ్చే దిన్ తీసుకొచ్చారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నట్టు తయారైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. – సిద్దిపేట దీక్షలో మంత్రి హరీశ్రావు మంత్రులు ఎవరేమన్నారంటే.. ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు. – మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వరి కంకులతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య వనపర్తి: వరి కొనకుండా ఇబ్బందిపెడ్తున్న కేంద్రంపై రైతులు పెడుతున్న శాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి. – మంత్రి నిరంజన్రెడ్డి సంగారెడ్డి: పంజాబ్ మాదిరిగా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలు – మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వరంగల్: వడ్లు కొనకుండా రైతులను మోసం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ వైఖరిని తిప్పికొట్టాలి. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ములుగు, మహబూబాబాద్: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. – మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్: ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. – మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కరీంనగర్: వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతుపై వానపడినట్టే వ్యవహరిస్తోంది. – మంత్రి గంగుల కమలాకర్ వికారాబాద్: రాష్ట్రంలో ధాన్యం బాగా పండితే కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నారు. – మంత్రి సబితారెడ్డి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం. – మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజామాబాద్, కామారెడ్డి: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ మాట్లాడటం దారుణం. – మంత్రి ప్రశాంత్రెడ్డి మహబూబ్నగర్: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష సాధిస్తోంది. ప్రతి గింజను కేంద్రం కొనేదాకా పోరాటం చేస్తాం. – మంత్రి శ్రీనివాస్గౌడ్ నల్లగొండ: దేశంలో ఆహార పంటలపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచుతారు. – మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి -
యాసంగి ధాన్యం కొనాల్సిందే!
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్’’ అని శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అడుగడుగునా నిరసనలతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్ల ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ►నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వైజంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ►ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్రెడ్డి, మాణిక్రావు, దేవీప్రసాద్రావు, చింతా ప్రభాకర్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ►మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు. -
ఉప్పుడు బియ్యంపై అట్టుడికిన సభ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి టీఆర్ఎస్ కొనసాగిస్తున్న ఆందోళనతో మంగళవారం లోక్సభ అట్టుడికింది. ధాన్యం కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని కోరుతూ ఎంపీలు లోక్సభలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ అంశంపై త్వరితగతిన చర్చ చేపట్టి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనల నేపథ్యంలో సభ రెండుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనూ కేంద్రం తీరుకు నిరసనగా సభ్యులు వాకౌట్ చేశారు. ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో డిప్యూటీ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని విన్నవించారు. లోక్సభ రెండుమార్లు వాయిదా.. మంగళవారం సభ ఆరంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఎంపీలు నామా, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, కవిత, పసునూరి దయాకర్, ఎంఎస్ఎన్ రెడ్డి, వెంకటేశ్ నేత, రాములు.. తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు సైతం ధరల పెరుగుదల అంశంపై చర్చ కోరుతూ వెల్లోకి వెళ్లారు. వీరితోపాటే వెల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం సేకరణపై జాతీయ విధానం తేవాలి.. అన్నదాతలను శిక్షించొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటున్న సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పెట్టి నిరసన కొనసాగించారు. టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశా రు. సభ తిరిగి మొదలయ్యాక సైతం ఎంపీలు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలో వాకౌట్... రాజ్యసభ ఆరంభం అయిన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు.. సురేశ్రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సురేశ్రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. ‘బాయిల్డ్ రైస్పై చర్చించాలని నోటీసులిచ్చాం. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు కేంద్రం తీరుతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య అయినందున చర్చ పెట్టండి’అని కోరారు. చైర్మన్ నిరాకరిం చడంతో సురేశ్రెడ్డి సహా ఇతర ఎంపీలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు తెలంగాణ భవన్లో ఎంపీలు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు. -
వానాకాలం బియ్యం యాడబొయ్యాలె?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం మధ్య మొదలైన ధాన్యం, బియ్యం రగడకు ఇప్పట్లో తెరపడేలా లేదు. వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధులంతా ధర్నాకు సిద్ధమయ్యారు. వచ్చే వారంలో యాసంగి కోతలు మొదలవనుండగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు గోదాముల్లోని బియ్యం మూవ్మెంట్ లేక మగ్గిపోతుండగా 2020–21 వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ని ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జూలైలోగా వానాకాలం ధాన్యానికి సంబంధించి 47 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (సీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 15.37 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యాన్ని తరలించేందుకు గోదాములు కూడా ఖాళీ లేవు. గడువు ముగిసిందనే నెపంతో 2020–21 యాసంగి సీఎంఆర్ 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్సీఐ తెగేసి చెప్పింది. ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. తాజాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న కయ్యం నేపథ్యంలో మరోసారి వానాకాలం సీజన్ సీఎంఆర్పై వివాదం రేకెత్తే పరిస్థితి కనిపిస్తోంది. గోదాముల్లో జాగా లేదు... రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాములతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాములు, ప్రైవేటు గోదాములు 72 ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి సామర్థ్యం 20.05 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ గోదాములన్నీ ప్రస్తుతం 2020–21 యాసంగి, వానాకాలం బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు తరలించే బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అక్కడి అవసరాలకు అనుగుణంగా తీసుకెళ్తుండటం, రైల్వే రేక్లను సమయానుకూలంగా సమకూర్చకపోవడంతో గోదాముల్లోని బియ్యంలో లక్క పురుగులు, ఎలుకలు, పందికొక్కులు చేరి పొక్కిలి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లో... ధాన్యం నిల్వలన్నీ మిల్లుల్లో మగ్గే పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యాన్ని తరలించేందుకు గోదాములు ఖాళీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిన సొమ్ము రీయింబర్స్మెంట్ కింద తిరిగి రాక ఆందోళన చెందుతోంది. ఉత్పత్తి, నిల్వకు మధ్య భారీ తేడా... 2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 92.34 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 67 శాతం బియ్యాన్ని (62.53 లక్షల మెట్రిక్ టన్నులు) ఎఫ్సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. కానీ మార్చి 31 నాటికి 53.38 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది. ఇంకా 9.15 ఎల్ఎంటీ బియ్యాన్ని ఇవ్వడానికి మే 31 వరకు రాష్ట్రం గడువు కోరినా కేంద్రం ససేమిరా అన్నది. ఇక వానాకాలం సీజన్ సీఎంఆర్ కింద 47 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 15.37 ఎల్ఎంటీ మాత్రమే ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడమొక్కటే పరిష్కారం. అయితే ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడాన్నిబట్టి కొత్తగా బియ్యం నిల్వలను నింపల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా ఎఫ్సీఐ గోదాములను సమకూర్చుకోకపోవడంతోపాటు గోడౌన్లలోని నిల్వలను ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడం సమస్యకు కారణంగా అధికారులు చెబుతున్నారు. గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడంతో మిల్లుల నుంచి కొత్తగా సీఎంఆర్ సరఫరా చేసే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ వాదిస్తోంది. అయితే గత యాసంగి తాలూకు బియ్యం 9.15 ఎల్ఎంటీని కేంద్రం తీసుకోకపోయినా మిల్లింగ్ చేసి రాష్ట్ర అవసరాలకు నిల్వ చేయాల్సిందే. అలాగే వానాకాలం సీజన్ బియ్యం 31.68 ఎల్ఎంటీ బియ్యం కలిపితే 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలకు అనుగుణంగా జూలై నాటికి గోదాములు సిద్ధంగా ఉంటాయా అనేది ప్రశ్న. 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించాం: ఎఫ్సీఐ డిసెంబర్ 2021 నుంచి ఈ మార్చి వరకు రాష్ట్రంలోని గోదాముల నుంచి 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించినట్లు ఎఫ్సీఐ అధికారులు తెలిపారు. 2020–21 యాసంగి సీఎంఆర్ డెలివరీకి సెప్టెంబర్ 2021తో గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐదుసార్లు గడువు పొడిగించామని, వానాకాలం సీజన్ బియ్యం కోసం జూలై వరకు మాత్రమే గడువు ఉందని ఆయన తెలిపారు. -
కేంద్రం కాదంటే కొనుడే!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సమస్యపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని కేసీఆర్ సర్కార్ ఈనెల రెండోవారంలో అనూహ్య నిర్ణయం ప్రకటించి రైతుల మద్దతు పొందేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఆదివారం మొదలు 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ధాన్యం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి మహాధర్నా నిర్వహించిన అనంతరం.. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రైతాంగానికి అండగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని చాటి చెప్పనుంది. రైతులకు అండగా నిలవడం ద్వారా పడే దాదాపు రూ.2,000 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 11 తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారం భరించడం వైపే మొగ్గు.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానం మొదటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి ఉప్పుడు బియ్యంగా ఎఫ్సీఐకి పంపించడం. అయితే ఇందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ఉప్పుడు బియ్యం తీసుకునే ప్రసక్తి లేదని, ముడి బియ్యంగా ఇస్తే ఎంతైనా తీసుకుంటామని తేల్చి చెబుతోంది. నిర్ణయాన్ని రైతులకే వదిలేయాలనేది రెండో ప్రత్యామ్నాయం. యాసంగిలో వరి వేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని యాసంగి పంట వేసే సమయంలోనే ప్రభుత్వం చెప్పింది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం కొనదు కనుక.. రైతులు నేరుగా మిల్లర్లు, దళారులకు విక్రయిస్తే కనీస మద్దతు ధర ప్రసక్తే ఉండదు. క్వింటాలుకు రూ.500 వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. అందువల్ల ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని తెలిసింది. మద్దతు ధర రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం.. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ, ఈ ప్రత్యామ్నాయంపైనే కేసీఆర్ సర్కార్ దృష్టి సారించినట్లు తెలిసింది. ముడి బియ్యంతో నష్టమెంత? ఇప్పటివరకు సాగిన విధానంలో.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా రూపంలో (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎఫ్సీఐకి అప్పగించి కేంద్రం నుంచి డబ్బులు వసూలు చేసుకునేది. ఈ విధానంలో 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిల్లింగ్లో నూకల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్నేళ్లుగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నారు. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటూ గత ఏడాది నుంచి ఈ విధానంపై పేచీ పెడుతోంది. కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామనిని చెబుతోంది. ఉప్పుడు కాకుండా ముడిబియ్యమే..! కేంద్రం చెప్పినట్లు ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా ముడిబియ్యంగా మార్చి ఎఫ్సీఐకి ఇచ్చే ప్రతిపాదనపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా 100 కిలోల ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారిస్తే యాసంగిలో 68 కిలోల బియ్యం వస్తుంది. ఒకవేళ ముడిబియ్యంగా మారిస్తే 100 కిలోల ధాన్యాన్ని మర పట్టిస్తే నూకలు పోను 40 కిలోల నుంచి 50 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా నివేదికల్లో వివరించినట్లు తెలిసింది. నూకలను ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా ఎంతమేర నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే దానిపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. బియ్యం లోటు నష్టాన్ని మిల్లర్లకు చెల్లించేలా.. ముడిబియ్యంగా మార్చి ఇచ్చే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, ముడిబియ్యంగా మార్చే ప్రక్రియలో బియ్యం లోటు వల్ల ఏర్పడే నష్టాన్ని మిల్లర్లకే నేరుగా చెల్లించి ఎఫ్సీఐ లెక్కల ప్రకారం 68 కిలోల బియ్యాన్ని తీసుకునేలా ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బద్నాం చేసి, తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా తానే ధాన్యం సేకరించాలనే వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అధికారులు, మిల్లర్లతో మంత్రి సమావేశం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్ర, శనివారాల్లో సంస్థ ఎండీ అనిల్కుమార్తో పాటు మిల్లర్ల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై చర్చించారు. నష్టాన్ని భరిస్తే తాము ధాన్యం మిల్లింగ్కు తీసుకుని ముడి బియ్యం ఇచ్చేందుకు సిద్ధమేనని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తే వచ్చే నష్టాన్ని లెక్కలు వేశారు. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బియ్యం కొనకపోతే.. నూకలు చెల్లు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నూకలు చెల్లడం ఖాయమని టీఆర్ఎస్ హెచ్చరించింది. తెలంగాణపై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో పండే వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో పాటు, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పచ్చబడుతున్న తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ధాన్యం కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతృత్వం వహించిన మంత్రులు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట, ఖిల్లాఘనపురం మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి పాల్గొనగా, హన్వాడలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. కరీంనగర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నిజామాబాద్ జిల్లా వేల్పూరులో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగిన నిరసనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షలో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అన్ని మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రణాళికబద్ధ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ వందేళ్ల అబద్ధాలను ఎనిమిదేళ్లలోనే ప్రజలకు చెప్పిందని విమర్శించారు. మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలందరూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలతో పాటు, వరి సాగు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దీక్షల్లో పాల్గొన్న వారికి వినిపించారు. చాలాచోట్ల ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు, యాసంగిలో వరి సాగు విషయంలో బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. దీక్షల అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. రేపు నాలుగు హైవేలపై రాస్తారోకో వరిపోరు కార్యాచరణలో భాగంగా మంగళవారం విరామం తర్వాత బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు లేనందున బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. -
వరంగల్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ
-
ధాన్యంపై నేటి నుంచి టీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ సోమవారం నుంచి నిరసన చేపట్టనుంది. పార్టీ పిలుపు మేరకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలో రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సన్నాహాలు పూర్తి చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత జిల్లా మంత్రులు ఆదివారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొనాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 6న జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేయడం, 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. -
బండి సంజయ్ ,కిషన్రెడ్డిల బండారం బయటపెట్టిన :కేటీఆర్
-
కేంద్రంపై ‘వరి’ యుద్ధం
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతులను అవమానించేలా మాట్లాడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీ ఉద్యమ కార్యాచరణను శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో మొదలయ్యే టీఆర్ఎస్ నిరసనలు 11న ఢిల్లీ వేదికగా జరిగే నిరసన దాకా కొనసాగుతాయని కేటీఆర్ వివరించారు. ఢిల్లీలో జరిగే నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. దౌర్భాగ్య నాయకులు రెచ్చగొట్టి వరి వేయించారు... ‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని మూర్ఖపు, పిచ్చి, రైతు వ్యతిరేక, మనసులేని ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, రాష్ట్రానిది దళారీ పాత్ర అంటూ రైతుల్ని రెచ్చగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ గతేడాది నవంబర్ 18న సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి నిరసన దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గినా 35–36 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్రెడ్డి అనే పనికిమాలిన కేంద్ర మంత్రి వల్లే ఈ పరిస్థితి తలెత్తగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం తెలివితక్కువ వాళ్లు అంటూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఇప్పుడు రైతులు పండించే ధాన్యాన్ని బీరాలు పలికిన బీజేపీ దౌర్భాగ్యులు తీసుకుంటారా? ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టం.. అంతు చూస్తాం. ఇప్పటికే 12,769 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్లు, పీఏసీఎస్లు తదితర సంస్థలన్నీ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించి ప్రధానికి పంపాయి. కేంద్రం స్పందించనందున గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలపాలని నిర్ణయించాం’అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గువ్వల బాలరాజు, గండ్ర వెంకట రమణారెడ్డి, గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, క్రాంతికిరణ్, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఉద్యమ కార్యాచరణ... ► ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఈ శిబిరంలో రైతులు కూడా పాల్గొనాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 5న విరామం ► 6న రాష్ట్రం మీదుగా వెళ్లే 4 జాతీయ రహదారులపై నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రాస్తారోకోలు చేపడతారు. ► 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి. ► 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, రైతులు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి కేంద్రం దమననీతి, భ్రష్టు రాజకీయాలపై నిరసన తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 9, 10 తేదీల్లో విరామం ► 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసనకు దిగనుంది. మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్ఫాలో కండి: కేటీఆర్ . -
తెలంగాణాలో వేడి వేడిగా వడ్ల రాజకీయం
-
వడ్లు కొనాలి లేదా సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు సెంటర్లను తెరిచి కొనుగోళ్లు ప్రారంభించాలని లేదంటే సీఎం కేసీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పండించిన ప్రతి గింజా కొంటామని సీఎం ప్రజలకు గతంలో పదే పదే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పెంచిన విద్యుత్, బస్ చార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నెపంమోపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ 17 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా పంటలు వేయకుండా రైతులను కన్నీళ్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించకుండా సీఎం, ఆరోగ్య శాఖమంత్రి తప్పులు చేస్తే శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? అని వరంగల్ ఘటనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈటల స్పందించారు. -
ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని, ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని పీయూష్ గోయల్ ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారని,పంజాబ్లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.. మరి అటువంటి బియ్యాన్ని ఇవ్వాలని కోరామని అన్నారు పీయూష్ గోయల్. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణలో పండే రా రైస్ మొత్తం తీసుకుంటామన్నారు. -
కేంద్రంపై ‘వరి పోరు’కు కార్యాచరణ సిద్ధం చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూపిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్.. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఆ మేరకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలను రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టడం కూడా ఉద్యమ కార్యాచరణలో అంతర్భాగంగా ఉండనుందని పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వారం రోజులుగా ఉద్యమ వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన ఆర్థిక మంత్రి హరీశ్రావుతో పాటు పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశంపై గత మూడు, నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు. పది రోజుల అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో కూడా సీఎం ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరి పోరుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను కేసీఆర్ ఈ నెల 3న మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించనున్నారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనలు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, ఏ ఒక్క వర్గానికి నష్టం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా నిరసన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. బంద్లు, రాస్తారోకోలు వంటివి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటం, విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమవుతుండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలని సీఎం భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సడక్ బంద్, వంటా వార్పు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లిన రీతిలోనే వరి పోరును కూడా శాంతియుత పద్ధతిలోనే చేపట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలని పార్టీ కేడర్కు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడితో పాటు ధాన్యం కొనుగోలుపై వైఖరి చెప్పాలంటూ అడుగడుగునా నిలదీసేలా నిరసన చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 14న గద్వాల నుంచి తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి అమిత్షా ప్రారంభించనున్నారు. ఆ సమయానికే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకునేలా టీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వేదికగా సీఎం నేతృత్వంలో నిరసన రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిరసనకు దిగుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. రైతు సంఘాలు, భావ సారూప్య రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలు, పలువురు నేతలను కూడా ఈ దీక్షకు ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో అనేక వినూత్న నిరసన రూపాలను చూశాం. అలాగే ఉగాది తర్వాత మొదలయ్యే రైతు ఉద్యమంలోనూ సరికొత్త ఉద్యమ రూపాలను చూస్తారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తి చూపడంతో పాటు వరి కొనుగోలుకు కేంద్రం దిగివచ్చేలా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి..’అని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ధాన్యాన్ని కేంద్రమే కొనాలి: మంత్రి వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంజాబ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో రైతులు పెద్దఎత్తున వరి పండిస్తున్నారన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2014లో 4.29లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో 7.14లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరిత వైఖరి మానుకోవాలని హితవు పలికారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. యాసంగిలో తెలంగాణ రైతులు సాగు చేసిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతూ చైర్మన్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. గత కొన్ని నెలలుగా పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయనున్నారని తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి చేసే పోరాటంలో పాల్గొంటానని రాహుల్గాంధీ హామీ ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం ఢిల్లీలో రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న 40 లక్షల మందికి రూ.2 లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కింద రూ.6.34 కోట్ల చెక్కును రాహుల్ చేతుల మీదుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. కాగా 40 లక్షల సభ్యత్వ నమోదు చేసినందుకు రాష్ట్ర నేతలను రాహుల్ అభినందించారు. భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం 4.5 లక్షల సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్ 1 నుంచి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. రాహుల్తో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, అజారుద్దీన్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్వర్రెడ్డి, మహేశ్గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్తో 4న మరోసారి భేటీ బుధవారం నాటి భేటీలో రాష్ట్రంలో పార్టీ పటిష్టత, టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలతో చర్చించిన రాహుల్ గాంధీ.. ఇదే అంశంపై ఏప్రిల్ 4న వారితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో సుమారు 25 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం. కాగా రాష్ట్ర పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు, సీనియర్ల మధ్య విభేదాలతో పాటు రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలనే అంశంపై రాహుల్ చర్చిస్తారని తెలిసింది. -
చిత్తశుద్ధి ఉంటే ఆమరణ దీక్ష చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం కొనుగోలు చేసే వరకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ క్షేత్రంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు రాష్ట్ర రైతులను కేసీఆర్ పణంగా పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్ పార్టీ దిగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్కు రూ.10 వేల కోట్లిస్తే 45 రోజుల్లో తెలంగాణలో యాసంగి ధాన్యం ఎలా సేకరిస్తామో చేసి చూపిస్తామన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొడుకు నుంచి తప్పించుకొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం... ‘ఏప్రిల్ మొదటివారం నుంచి వరి కొనుగోలు చేయకుండా నాటకాలు ఆడితే కేసీఆర్, కేటీఆర్ను నడి బజారులో ఉరివేసే బాధ్యత రైతుల పక్షాన కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రగతిభవన్లు, పోలీస్ పహారాలు మిమ్మల్ని కాపాడుతాయని అనుకుంటున్నారేమో, ఏవీ కాపాడవు. నిజాం కూడా ఇలాగే అనుకున్నడు. ఆయనను కోట గోడలు కాపాడలేదు.. రజాకార్ల సైన్యం కాపాడలేదు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ రైతులకు కేసీఆర్ మెడలు వంచడం తెలుసు. దీనికి ఎలా నాయకత్వం వహించాలో కాంగ్రెస్కు తెలుసు’అని రేవంత్ ధ్వజమెత్తారు. రైతులను దివాలా తీయించారు... ‘ఎఫ్సీఐకు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ గతేడాది సంతకం పెట్టి ప్రధానికి లొంగిపోయి ఇప్పుడు రాజకీయ లాభం కోసం డ్రామాలు చేస్తున్నారు. కేసీఆర్కు మందుమీద మాత్రమే చూపు ఉంది.. ముందుచూపు లేదు. రాష్ట్రంలో పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను కావాలనే దూరం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల కుట్రలతో రైతులను దివాళా తీయించారు. రైతులను ఆదుకొనేందుకు కాంగ్రెస్ ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్రం కొంటలేదు కాబట్టి వరి వద్దంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఎందుకు దళారి పని చేయడానికా’అని రేవంత్ ప్రశ్నించారు. అందరిని వద్దని కేసీఆర్ మాత్రం తన ఫామ్హౌస్లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్ ధాన్యం కొనేవాళ్లు.. పేదల వడ్లు కొనరా అని ఆయన ప్రశ్నించారు. శ్రీమంతులుగా ఎలా మారారో ప్రజలకు చెప్పాలి ‘దోపిడీదారుడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ కేసీఆర్కు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఆగర్భ శ్రీమంతులుగా మారింది. నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసుల వద్దే ఎక్కువ సంపద ఉంది. ఈ 8 ఏళ్లలో ఎలా శ్రీమంతులుగా మారారన్నది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్ర, తెలంగాణ ప్రజల గురించి కేటీఆర్కు అవగాహన లేదు’అని రేవంత్ ఆరోపించారు. -
వడ్ల గింజలపై ‘పిట్ట’ పోరు
ఉదయం 9:32 బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. – కాంగ్రెస్ నేత రాహుల్ ఉదయం 10:32 రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిరసన తెలపండి. ఒక దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉదయం 11:42 టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో పోరాటం చేయడం లేదు. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ 2021 ఆగస్టులో ఒప్పం దంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే. – టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్యాహ్నం 12:10 తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిచేయండి. ఒకే దేశం, ఒకే ధాన్యం సేకరణ విధానంలో మీ పార్టీ వైఖరి ఏంటో ముందు చెప్పండి. – మంత్రి హరీశ్రావు రాత్రి 10:40 రాహుల్ జీ.. మీ పార్టీకి ఈ దేశాన్ని 50ఏళ్లకు పైగా పాలించే అవకాశం లభించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 6 గంటలు కూడా కరెంటివ్వకుండా రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు కారణం అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలు ఉన్నాయి. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను రోజురోజుకూ వేడెక్కిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య వరిపై మాటల వార్ నడుస్తోంది. నేతల పదునైన వ్యాఖ్యలు, ఘాటైన విమర్శలతో కూడిన ఈ యుద్ధానికి మంగళవారం ట్విట్టర్ వేదికగా మారింది. తెలంగాణ రైతాంగానికి మద్దతుగా రాహుల్గాంధీ తెలుగులో చేసిన ట్వీట్తో మొదలైన వాగ్యుద్ధం.. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఆయా పార్టీల కేడర్ స్పందనలు, ప్రతి స్పందనలతో దాదాపు 7 గంటలకు పైగా కొనసాగింది. ఈ రెండు పార్టీల మాటల తూటాలను నెటిజన్లు కూడా ఆసక్తికరంగా ఫాలో అయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు టీఆర్ఎస్ను విమర్శిస్తూ, రాహుల్కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే కాకుండా ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు సైతం రాహుల్ ట్వీట్ను ఫాలో అయ్యి కామెంట్లు చేయడం గమనార్హం. ట్విట్టర్ వార్ సాగిందిలా...! ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్, బీజేపీల వైఖరిని ఎండగడుతూ మంగళవారం ఉదయం 9:32 నిమిషాలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. రాహుల్కు కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 9:43 నిమిషాలకు ట్వీట్ చేశారు. అయితే రాహుల్ చేసిన ట్వీట్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10:12 నిమిషాలకు స్పందించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. కవిత ట్వీట్కు కౌంటర్ ఇస్తూ రేవంత్ 11:42 నిమిషాలకు మరో ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 1:47 గంటల సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా కవితకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత 3:29 నిమిషాలకు కవిత, తర్వాత 4:49కు మాణిక్యం ఠాగూర్ మధ్య మరోమారు మాటల యుద్ధం సాగింది. రాష్ట్ర మంత్రి హరీశ్రావు 12:10 నిమిషా లకు రాహుల్ ట్వీట్నుద్దేశించి రీట్వీట్ చేయగా హరీశ్ రీట్వీట్కు రేవంత్రెడ్డి మధ్యాహ్నం 2:40 గంటలప్పుడు కౌంటర్ ఇచ్చారు. రాత్రి పొద్దుపో యాక రాహుల్ ట్వీట్కు ప్రతిగా మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఎవరెవరు ఏమన్నారంటే.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరును విమర్శించిన రాహుల్ గాంధీ.. ‘తెలంగాణలో రైతుల చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది..’అన్నారు. కాగా ‘తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు..’అని రేవంత్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో‘రాహుల్గాంధీజీ మీరు ఎంపీగా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ పార్లమెంట్ వెల్లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలియజేయండి..’అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. స్పందించిన రేవంత్.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఇక మంత్రి హరీశ్రావు రంగంలోకి దిగి.. ‘తెలంగాణ ప్రజల మేలు కోరేవాళ్లు అయితే పార్లమెంటులో మా ఎంపీలతో కలిసి మీరూ ఆందోళన చేయండి. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి.’అంటూ ధ్వజమెత్తారు. హరీశ్ను ఎద్దేవా చేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. ‘మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తుంటే జాలేస్తోంది. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి.. మా పార్టీ సెంట్రల్ హాల్లో ఫోటో షూట్ చేయదు. రైతుల కోసం ఫైట్ చేస్తుంది.’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల స్పందన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో స్పందించారు. ‘ఒక్కరోజైనా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వడ్ల సమస్యపై మాట్లాడలేదు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా మాట్లాడలేదు. రైతుల కోసం రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాహుల్గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్, కవితలకు లేదు. కేంద్రంతో ములాఖత్ అయి ఎఫ్సీఐకి ధాన్యం ఇవ్వబోమని రాసిచ్చారు. ముందు రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొని ఆ తర్వాత కేంద్రంతో యుద్ధం చేయండి’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. -
రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది: రాహుల్గాంధీ
-
ధాన్యం కొనుగోళ్లపై రాహుల్గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
-
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకు పోరాడుతాం: రాహుల్గాంధీ
-
రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్.. కల్వకుంట్ల కవిత కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ఓ ట్వీట్ చేశారాయన. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు. మరోపక్క తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నిరసనలకు పిలుపు ఇచ్చింది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. — Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022 ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ట్వీట్ పట్ల టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. .@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022 -
ఏప్రిల్ నెలంతా కాంగ్రెస్ ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని, ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గం నిర్ణయించింది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం జూమ్ యాప్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. నల్లగొం డ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చై ర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహే శ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, గీతారెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ చార్జీ ల పెంపు, ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వాల మోసాన్ని ఎండగట్టాలి రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా పెంచారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, సీనియర్ నేతలంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిం చి ప్రజలు, రైతాంగానికి ఈ విషయాలను తెలియజెప్పాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ సిలెండర్లకు దండలు వేయడంతో పాటు డప్పులు కొట్టి నిరసనలు తెలపాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన సివిల్ సప్లయిస్ భవన్, విద్యుత్ సౌధల వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శ్రీధర్బాబు నేతృత్వంలో కమిటీ ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను పరిరక్షించే జీవో 111 విషయంలో సీఎం కేసీఆర్ అస్పష్ట ప్రకటన చేసిన నేపథ్యంలో. ఈ ప్రకటన ఫలితాలు, ఆయా గ్రామాల ప్రజలపై పడే ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు పర్యావరణ అంశాలపై అవగాహన ఉన్న మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, దాసోజు శ్రావణ్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలావుండగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో మంచి కృషి చేసి 40 లక్షల పైచిలుకు డిజిటల్ సభ్యత్వాలను చేర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ఎన్రోలర్స్ను టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. -
ధాన్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. పెంచిన కరెంట్, ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై మోయం లేని భారం పడుతున్న అంశాన్ని దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. శనివారం రాత్రి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘వడ్లను కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నడు. ప్రజలు తరిమికొడతారనే భయంతో తన తప్పును కేంద్రంపై నెట్టి బీజేపీని బదనాం చేయాలని చూస్తున్నడు. సెంటిమెంట్ను రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి అన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నరు’అని బండి పేర్కొన్నారు. ‘కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని పంచాయతీలతో కలెక్టర్లు బలవంతంగా తీర్మానం చేయిస్తున్నారని అన్నారు. -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
Sakshi Cartoon: ధాన్యం సేకరణపై రోజుకో డ్రామా!
ధాన్యం సేకరణపై రోజుకో డ్రామా! -
మాయమాటలతో నిజాలను మరుగు పరచలేరు!
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరి ధాన్యం విషయంలో గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. తొలుత ‘వరి వేస్తే ఉరే గతి’ అన్నారు... ఆమధ్య యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నరు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని పేచీ పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి మర ఆడించి, బియ్యంగా మార్చి వాటిని ఎఫ్సీఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకూ జరిగిందదే. ఇందుకయ్యే ఖర్చు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోంది. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో కనీస మద్దతు ధరను కేంద్రమే చెల్లిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమిటి? కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ... కేసీఆర్ కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం అధీనంలో తగిన యంత్రాంగం లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్రాలకు అప్పగించింది. ఈ విషయం చెబితే పంజాబ్లో కొంటున్నప్పుడు ఇక్కడెందుకు కొనడం లేదని కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు. పంజాబ్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ కమిటీలే స్వయంగా రైతుల నుండి వడ్లను కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసి వడ్లను కేంద్రానికి అప్పగిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ మార్కెట్ కమిటీలు తూతూ మంత్రంగా పనిచేస్తున్నయ్.. వాటికి ధాన్యం సేకరించే బాధ్యతను అప్పగిస్తే సేకరించే స్థాయి ఉందా? ఇక్కడ మరో విషయం చెప్పాలి... 2021–22 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఈ రెండింటికి నడుమ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. మరి ఒప్పందాన్ని తానే ఉల్లంఘంచి... ఆ ఒప్పందం నుండి తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని గత అక్టోబర్ 4న కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాసింది. మెడమీద కత్తి పెట్టిందనే అభియోగంతో ఇప్పుడు మాట తప్పుతున్నారు. గతంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాల ప్రజలు బాయిల్డ్ రైస్ తినేవారు. ఇప్పుడు దాన్ని తినడం తగ్గించేశారు. ఆయా రాష్ట్రాలే అక్కడి అవసరాల మేర ఆ రైస్ను తయారు చేసుకుంటున్నాయి. అందుకే కేంద్రం ఆ బియ్యం వద్దంటున్నది. మనకంటే ఎక్కువ వరి పండించే రాష్ట్రాలు ఉన్నా అక్కడ కొనుగోళ్ల సమస్య రావడంలేదు. మన పొరుగు రాష్ట్రం ఏపీ మనకంటే ఎక్కువ వరి పండిస్తోంది. అక్కడ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి నేరుగా కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటోంది. కొన్న ధాన్యంలో... రేషన్ సరఫరాకు అవసరమైన ధాన్యాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని కేంద్రానికి అమ్ముతోంది. కానీ కేసీఆర్ చేస్తోందేమిటి? వానా కాలం పంట వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు. అసలు తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం ఎంత? ఈ ప్రభుత్వం చూపుతోంది ఎంత? వాస్తవాలు తేల్చడానికి తక్షణమే కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించాలని మేం అడగబోతున్నం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ తరపున మేం చెబుతున్నం... కేసీఆర్కు ‘వరి అంటే ఉరి’.. కానీ మా దృష్టిలో ‘వరి అంటే సిరి’! మేం అధికారంలోకి వస్తే వానాకాలంతోపాటు యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొని చూపిస్తం. అవసరమైతే రైతు కోసం రాష్ట్రం తరఫున కొంత బోనస్ లేదా సబ్సిడీ కూడా ఇస్తాం. (క్లిక్: సంఘటితమైతేనే రాజ్యాధికారం) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. పోయిన యాసంగి, అంతకుముందు నిల్వ చేసిన బియ్యాన్ని కూడా మిల్లర్లు వానా కాలం పంటగా చూపుతూ ఎఫ్సీఐకి పెడుతున్నరు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో చౌకగా కొన్న ధాన్యాన్నీ ఇక్కడిదేనని లెక్కలు చెబుతున్నరు. కేంద్రానికి మిల్లర్ల వ్యవహారం అంతా అర్థమైంది. కొన్ని చోట్ల తనిఖీలు చేసి పట్టుకుంది. ఇదే విషయం చెబుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్కు లేఖ రాశారు. ఇకపై అట్లా జరగకుండా చూస్తామని బదులిచ్చి, ఇప్పుడు మళ్లీ కొత్త వాదనలకు తెర లేపారు. అందుకే కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో యాసిడ్ టెస్ట్కు సిద్ధమైంది. ఎఫ్సీఐ సేకరించే ధాన్యంపై యాసిడ్ టెస్ట్ చేస్తే ఏ సీజన్లో పండించారో తేలిపోతుంది. అంతేగాదు.. ఆ పంట తెలంగాణకు సంబంధించిందా? ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చారా అనేది కూడా తెలిసి పోతుంది. ఈ విషయాలు బయటపడతాయనే కేసీఆర్, మిల్లర్లు కుమ్మక్కై సమస్యను దారి మళ్లిస్తుండ్రు. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) యాసంగిలో పండించే ఏ వెరైటీ ధాన్యమైనా మిల్లింగ్ చేస్తే సగానికిపైగా నూక వస్తుందనే సీఎం మాటలు పచ్చి అబద్దం. యాసంగిలో సన్న వడ్లు మిల్లింగ్ చేస్తేనే నూక ఎక్కువొస్తది. సన్నవడ్లు పట్టిస్తే క్వింటాల్కు అదనంగా 10 కిలోల నూక వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. అయినా నష్టమేముంది? నూకతో రైస్బ్రాన్ ఆయిల్ తయారు చేస్తున్నరు. రాష్ట్రంలో రైస్బ్రాన్ ఆయిల్ సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రంతో చేసుకున్న ఒప్పందంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ సంస్థలను నెలకొల్పిన దాఖలాల్లేవు. నూక వల్ల యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు మించి భారం పడే అవకాశమే లేదు. రైతు బంధు ద్వారా రూ. 13 వేల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే సీఎం రైతు సంక్షేమం కోసం రూ. 1,000 కోట్లు భరించలేరా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. - బండి సంజయ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -
వారు రైతు వ్యతిరేకులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ధాన్యం సేకరణ విషయంలో తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. తెలంగాణలోని కొందరు నాయకులు తప్పుడు వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు పారదర్శకంగా ఉంటే, నిజంగా రైతులకు మేలు చేయాలని తలిస్తే తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని కోరారు. గురువారం తెలంగాణ మంత్రుల బృందంతో జరిగిన సమావేశం అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాణ్యత మేరకు అదనపు నిల్వల కొనుగోలు కేంద్రం చేయాల్సిన పనిని ఎలాంటి భేదభావాలు లేకుండా తప్పకుండా పూర్తి చేస్తుందని తెలంగాణ రైతులకు పీయూష్ భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్లో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పని చేయాలని సూచించారు. తెలంగాణ నుంచి నాణ్యతా ప్రమాణాల ప్రకారం అదనపు నిల్వలను కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పీయూష్ చెప్పారు. ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిన ఎమ్మెస్పీ చెల్లింపులు 2014–15లో తెలంగాణ రైతులకు వరికి రూ.3,391 కోట్లు కనీస మద్దతు ధరగా చెల్లించామని, ఇది ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిందని, 2020–21 ఖరీఫ్ పంట కాలంలో రూ.26,610 కోట్లు ఎమ్మెస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కాగా ‘తెలంగాణలో ఏవైనా అదనపు నిల్వలు ఉంటే, వాటి స్వంత వినియోగం తర్వాత, ముడి బియ్యం రూపంలో, కేంద్రంతో ఎంఓయూ ప్రకారం, ఎఫ్సీఐ పేర్కొన్న నాణ్యత ప్రకారం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కట్టుబడి ఉంది.. ’అని గోయల్ పేర్కొన్నారు. ముడిబియ్యం ఎంత ఇచ్చేదీ చెప్పలేదు తెలంగాణలో ధాన్యం సేకరణ విషయమై జరుగుతున్న ప్రచారం సత్యదూరమని, దేశంలో ఉన్న డిమాండ్ మేరకు కేంద్రానికి ముడి బియ్యం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బియ్యం సేకరణపై చర్చించేందుకు 2022 ఫిబ్రవరి 25న ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలను నిర్దిష్ట ఫార్మాట్ను ఇవ్వాలని కోరగా, తెలంగాణ ప్రభుత్వం ఫార్మాట్ను సమర్పించలేదని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ఇదేశాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలోనూ ముడిబియ్యం ఎంత ఇస్తామన్న విషయాన్ని తెలంగాణ చెప్పలేదన్నారు. మరోవైపు ప్రస్తుత రబీ పంటలో సెంట్రల్ పూల్కు తన వాటాగా అందించే ముడిబియ్యం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడిబియ్యం సేకరిస్తామన్నారు. -
అది ‘వ్యాపార’ కేంద్రం!
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. – వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మంత్రులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం నిరంజన్రెడ్డి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం’’అని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు. -
కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం: పీయూష్ గోయల్
-
‘కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం’
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారని, ధాన్యం కొనుగోలులో ఏ రాష్ట్రంపై వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరిస్తున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. పంజాబ్కు అనుసరిస్తున్న విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నామన్నారు. రా రైస్ ఎంత ఇస్తామనే విషయం ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, ఎన్నిసార్లు అడిగినా టీఎస్ సర్కారు స్పందించలేదన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఫిబ్రవరి 22, మార్చి 8వ తేదీల్లో సమావేశాలకు రావాలని ప్రభుత్వాన్ని కోరినా ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదని పీయూష్ గోయల్ తెలిపారు.కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. -
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు: గోయల్
-
ధాన్యం కొనకపోతే మద్దతు ధరకు అర్థమేముంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు రబీ (యాసంగి) సీజన్లో పండించి విక్రయించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించేలా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పంటను సేకరించకపోతే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అర్థమే లేదన్నారు. ఇది వ్యవసాయ రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రధానికి సీఎం లేఖ రాశారు. పంజాబ్, హరియాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం, గోధుమలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు విభిన్నమైన విధానాలు ఉండకూడదన్నారు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణకు ఒకే విధానం ఉండాలని.. నిపుణులు, సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలని ప్రధానికి సూచించారు. లేఖలో కేసీఆర్ ఏమేం ప్రస్తావించారంటే.. ఆహార భద్రత చట్టం లక్ష్యానికి విఘాతం రాష్ట్రాల ప్రజా పంపిణీ అవసరాలను తీర్చిన తర్వా త కేంద్రమే మొత్తం ధాన్యాన్ని సేకరించాలనేది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం. తెలంగాణలో ఏ ధాన్యం అందుబాటులో ఉందో దాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. గతంలో ఇదే ఆనవాయితీగా ఉన్నా ఆహార శాఖ రెండేళ్లుగా వరి ధాన్యాన్ని సేకరించేందుకు విముఖత చూపుతోంది. ఇది ఆహార భద్రత చట్టం లక్ష్యా న్ని ఉల్లంఘించడమే. ఈ చట్టం అమలు బాధ్యత మీదే. రాష్ట్ర ప్రభుత్వాలకు నిల్వ సామర్థ్యం, ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర తరలింపు అవకాశాల్లేవు. కాబట్టి ఆహార ధాన్యాలను సేకరించి సరఫరా చేసే బాధ్యతను ఈ చట్టం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణలో ప్రగతిశీల విధానాలు దేశంలో సగం జనాభా వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో వ్యవసాయ రంగంలో స్థిరమైన అధిక వృద్ధి రేటును సాధించడానికి మేం ప్రగతిశీల, రైతు అనుకూల విధానాలను అనుసరించాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయల కల్పన వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు గణనీయంగా తగ్గాయి. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాం పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఆయిల్ పామ్, ఎర్రపప్పు తదితర పంటల సాగును ప్రోత్సహించాం. తద్వారా వరి సాగు 52 లక్షల ఎకరాల నుంచి 36 లక్షల ఎకరాలకు తగ్గింది. ఈ నేపథ్యంలో రబీలో రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోగా మార్కెట్కు వచ్చే మిగులు వరి పంటను పూర్తి స్థాయిలో కేంద్రమే సేకరించాలి. దేశం రైతుల ఆగ్రహాన్ని చవిచూసింది కేంద్రం తీసుకున్న కొన్ని అస్థిరమైన, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశం మన రైతుల ఆగ్రహాన్ని చవి చూసింది. రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించడం వల్ల వారు నిస్సహాయ స్థితితో తీవ్రంగా బాధపడ్డారు. రైతు ఆందోళనకు తలవంచి చివరికి ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.