Pocharam Srinivas reddy
-
పద..పదమంటూ ‘పోచారం’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆయన డెబ్బై ఆరేళ్ల వయస్సులో కూడా నవ యువకుడిగా తిరుగుతూనే ఉంటారు. అడవి అయినా, గుట్ట, పుట్ట ఎక్కడికైనా సరే చలో అంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు... పనులు పూర్తయ్యే దాకా కాంట్రాక్టర్ల వెంట పడతారు. తనే స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆయనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి. మంత్రిగా స్పీకర్గా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఒకే రకమైన టెంపో కొనసాగిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు సాధించి వాటిని పూర్తి చేసేదాకా వెంటపడతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు తీసుకొచ్చాడని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 10 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన కృషి ఎంతో ఉందంటారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును ఆయన ఎన్నోసార్లు పర్యవేక్షించారు. రోడ్లు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, స్కూల్ భవనాలు... ఇలా ఏ పని అయినా సరే తను వెళ్లాల్సిందే. నియోజకవర్గ పరిధిలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన ప్రతి నెలలో ఒకటి రెండుసార్లు పరిశీలించారు. ఎంతదూరమైనా సరే, ఎంత లోపలకు ఉన్నా సరే వెళతారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా లేదని కార్లు వెళ్లే పరిస్థితి లేదంటే బైక్ మీద కూడా వెళ్లి వస్తారు. బాన్సువాడ పట్టణంలో జరిగే పనులను రెగ్యులర్గా పరిశీలిస్తారు. జోరువర్షం కురుస్తుందని అందరూ ఇళ్లలో ఉంటే తను మాత్రం బ్యాటరీ వాహనంలో ఊరంతా చుట్టేస్తారు. నీరు నిలిచిపోకుండా నాలాలను శుభ్రం చేయించమని ఆదేశిస్తారు. కాంట్రాక్టర్లు పనులు ఆపితే కారణాలు తెలుసుకొని బిల్లుల సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పించి వారికి సహకరిస్తుంటారు. దీంతో అందరూ పోచారం స్టైలే వేరబ్బా అంటుంటారు. పెద్దాయనతో పోటీపడలేమని ఇతర ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. -
రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టానికి తూట్లు.. జీవన్ రెడ్డి ఆగ్రహం..
-
మంత్రివర్గంలోకి పోచారం?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలోకి మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డిని తన కారులో ఎక్కించుకొని స్వయంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన సీఎం... ఆయన్ను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, స్పీకర్గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. జిల్లాలో ఉన్న ఆయన పలుకుబడి పార్టీ ఉన్నతికి ఉపయోగపడుతుందని వారి దృష్టికి తెచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేని దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వివరించారు. దీనిపై హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ అంశంతోపాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించారు. పీసీసీ రేసులోకి బలరాం, షెట్కార్ పార్టీ పెద్దలతో పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం సైతం చర్చ కు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే సామాజికవర్గాల వారీగా పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా కొత్తగా ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెటా్కర్ల పేర్లు రేసులోకి వచ్చాయి. పీసీసీ పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు మహేశ్కుమార్గౌడ్, మధుయాష్కీగౌడ్ పోటీ పడుతుండగా మరో మంత్రి సీతక్క పేరు సైతం ప్రచారంలో ఉంది.అయితే సోమవారం నాటి భేటీలో మాత్రం మహేశ్కుమార్ గౌడ్తోపాటు ఎస్టీ కోటాలో బలరాం నాయక్, బీసీ కోటాలో షెటా్కర్ పేర్లు ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది. అయితే ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదని తెలుస్తోంది. రాష్ట్ర సీనియర్లతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపైనా రేవంత్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. -
నేను కాంగ్రెస్ లో చేరటానికి ప్రధాన కారణం ఇదే
-
పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లోకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు హంగామా సృష్టించారు.తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్పై చర్యలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.కాగా, ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. -
బీఆర్ఎస్ కి మరో దెబ్బ కాంగ్రెస్ లోకి పోచారం
-
కాంగ్రెస్లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ: దానం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆ ఎస్ను ముంచాయని మండిపడ్డారు. ఈ మేరకు గాంధీభవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడాఉంటుందని తెలిపారు.మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు దానం నాగేందర్. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని జోస్యం చెప్పారు. అయితే హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని విమర్శించారు.కాగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు విషయం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడమే కారణం. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. -
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లోకి పోచారం.. ఇంటి వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన కాంగ్రెస్ పార్టీ చేరారు.కాగా, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం, రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు పోచారం అండగా నిలిచారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని ఆయనను కలిశాను. మాను అండగా నిలవాలని కోరాము. పార్టీలో శ్రీనివాస రెడ్డికి తగిన గౌరవం ఇస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని కామెంట్స్ చేశారు.మాజీ స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ‘రైతుల కష్టాల తీరాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను. నేను ఆశించే పదవులు ఏమీ లేవు. ఆరు నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోంది. నా రాజకీయ జీవితం కాంగ్రెస్లోనే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తాను’ అని అన్నారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి
-
కేసీఆర్ను దూషించడం పద్ధతి కాదు..
నిజామాబాద్: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్రెడ్డి దూషించడం పద్ధతి కాదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ సమీపంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయమన్నారు. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోయేదన్నారు. 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్ఎస్ను గెలిపిస్తారని అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సిగ్గులేకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నారని, ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి సొంత ఊరిలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు రూ.15 వేలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపును బాన్సువాడ నియోజకవర్గమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ నీటి విడుదల విడతల వారీగా జరుగుతుందని, ఎకరం కూడా ఎండిపోకుండా చూస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీకి సిద్ధం.. పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. ప్రతి కార్యకర్తకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. నాయకులు పోచారం సురేందర్రెడ్డి, మోహన్నాయక్, అంజిరెడ్డి, బద్యా నాయక్, నీరజావెంకట్రాంరెడ్డి, శ్యామల ఉన్నారు. ఇవి చదవండి: గ్రామపాలనపై.. ప్రత్యేకాధికారులకు సవాల్! -
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్మోహన్రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు: కేసీఆర్ ఫైర్
సాక్షి, కామారెడ్డి: అతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. మెదడు కరిగించి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. బాన్సువాడలో సోమవారం బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బాన్సువాడలో అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ బంగారువాడలా మారిందని ప్రశంసించారు. బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించామని తెలిపారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్లో ఉందని తెలిపారు. అభివృద్ధికి ఏకైక కొలమానం తలసరి ఆదాయమని చెప్పారు. పదేళ్లు నీతి, నిబద్ధతో పనిచేస్తేనే అది సాధ్యమైందని పేర్కొన్నారు. చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొండి కత్తి మాకూ దొరకదా అనిప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. చదవండి: మెదక్ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్ సీరియస్, డీజీపీకి ఆదేశాలు -
లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?
అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు. ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. సెంటిమెంట్ ఏం చేస్తుందో? స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
ప్రజాధనం లూటీ చేస్తే క్షమించి వదిలేయాలా?
సాక్షి, అమరావతి: ప్రజా ధనం లూటీ చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడిని క్షమించి వదిలేయాలా అంటూ తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసింది చిన్న తప్పు కాదని తెలిపారు. మంత్రి బొత్స శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధికారం ఉందని తప్పులు చేస్తే క్షమించరాని నేరమవుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వారిని క్షమించి వదిలేయాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం విచిత్రంగా ఉంది’ అని బొత్స మండిపడ్డారు. ‘గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, న్యాయస్థానం తీర్పు ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు ఒప్పందం రద్దు చేసుకున్న సీమెన్స్ కంపెనీ పేరుతో ఎలాంటి బిల్లులు లేకుండా రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. సీమెన్స్తో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో, ఏయే తేదీల్లో డబ్బులు ఆ కంపెనీకి చెల్లించారో చంద్రబాబు చెప్పడంలేదు. ఇంత మొత్తం డబ్బును ఏ కంపెనీలకు చెల్లించారో కూడా వెల్లడించడంలేదు. ఇలాంటి అవినీతిపరుడికి తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం వత్తాసు పలకడం శోచనీయం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉద్దేశపూర్వంగా అక్రమాలు చేస్తే చూసీ చూడనట్టు వదిలేయాలనడం దారుణం. ఇలాంటి తప్పు తెలంగాణలో జరిగితే అక్కడి సీఎం కేసీఆర్ చూసీచూడనట్టు వదిలేస్తారా’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి కేసులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పులు ఎన్నో చేశారని చెప్పారు. ఆ పత్రికలు సొంత భాష్యం చెబుతున్నాయి ప్రభుత్వంలో ప్రతి ఫైల్కు, ప్రతి సంతకానికి ఎంతో విలువ ఉంటుందని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రొసీడింగ్స్కు, రూల్స్కు విరుద్ధంగా సంతకాలు చేసి ప్రజాధనం దారిమళ్లించారని చెప్పారు. సాక్ష్యాత్తు ఈడీ, ఇన్కంట్యాక్స్ విభాగాలు దీనిని తేల్చి చెప్పాయన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్యాలు రాస్తున్నాయన్నారు. చంద్రబాబు ఫైళ్లపై చేసిన సంతకాలు, కంపెనీ పేర్లు లేకుండా నిధులు విడుదల చేసిన ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఓ వర్గం మీడియా మాత్రం బాబును భుజానకెత్తుకుని చట్టాలకు, రూల్స్కు అతీతంగా సొంత భాష్యం చెప్పడం విచారకరమన్నారు. నిధుల మళ్లింపు రూల్స్ విరుద్ధంగా చేశారా లేదా అని చంద్రబాబునే అడిగితే సమాధానం వస్తుందన్నారు. రూల్స్ పాటించే చేశానని చెప్పే ధైర్యం ఆయన చేయరని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గత ప్రభుత్వంలో ఎలా పనిచేశాయి, ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా పరిశీలించి చెప్పాలని ఆయన అన్నారు. అక్రమార్కుడు చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ మద్దతెలా ఇస్తారు? ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్ శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు మద్దతివ్వడం శోచనీయమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని తెలిపారు. స్కిల్ కుంభకోణంలో పాత్ర ఉన్న వారందరినీ నిందితులుగా చేర్చే విషయం సీఐడీ చూసుకుంటుందన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశి్నంచారు. -
స్పీకర్ డ్రమ్స్..లంబాడి సోదరుల డ్యాన్స్
-
బిల్లులు వెనక్కి పంపుతారా?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను పునఃపరిశీలన కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శుక్రవారం రాత్రి సభలో అనుమతించారు. ఈ సందర్భంగా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బిల్లులు ఆపడంలో రాజకీయ కోణం దాగి ఉందని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయగా.. గవర్నర్ బిల్లులు పెండింగ్లో పెట్టడం, తిప్పి పంపడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ముఖ్యం: హరీశ్రావు ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ)బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత రాకుండా, ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి 65 ఏళ్లకు పెంచుతూ గతంలోనే చట్టాన్ని తెచ్చాం. ఇందులో టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరణ తెస్తూ బిల్లు తెచ్చాం. అయితే, రిటైర్ అయి న వాళ్లను తీసుకోవడంతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నట్టుగా గవర్నర్ భావించినట్టు తెలిసింది. వాస్తవానికి అలాంటి అంశాలకు తావులేదు.. అదనంగా ప్రభుత్వంపై భారం లేద’న్నారు. రాజకీయ కోణం తప్ప అభ్యంతరాలకు తావులేదు..: మంత్రి కేటీఆర్ పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లును ప్రవేశపెడుతూ మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం పెంచేలా కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచాం. ఇందుకు గవర్నర్ అభ్యంతరాలను ప్రస్తావించారు. కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచినప్పుడు దామాషా ప్రకారం మైనార్టీల సంఖ్య పెరుగుతుంది. ఇందులో మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కేవలం అవి అపోహలే. రాజకీయ కోణం తప్ప గవర్నర్ లేవనెత్తిన అంశాల్లో ఏమీ అభ్యంతరాలు లేనందున తిరిగి బిల్లును పాస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు. -
గవర్నర్ తిరస్కరించిన బిల్లులు మళ్లీ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో కీలకమైన 4 బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. అసెంబ్లీ గతంలోనే పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లు, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ)బిల్లు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్దీకరణ) సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట (సవరణ) బిల్లులను పాస్ చేసింది. ప్రభుత్వం వాటిని గవర్నర్ తమిళిసైకి పంపించినా ఆమోదముద్ర వేయలేదు. ఆయా బిల్లుల్లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపేశారు. ఈ క్రమంలో ఆ నాలుగు బిల్లులను పునః పరిశీలించాలంటూ సంబంధిత మంత్రులు శుక్రవారం రాత్రి శాసనసభలో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపుతున్న నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ, ఉద్యాన అభివృద్ధి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉపాధ్యాయుల బదిలీ ల నియమావళి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు సభకు సమర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎజెండాలో పది ప్రశ్నలు ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా.. ఐటీ ఎగుమతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం తదితర అంశాలపైనే మంత్రులు సమాధానాలిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.విజయరామారావు (ఖైరతాబాద్), కొమిరెడ్డి రాములు (మెట్పల్లి), కొత్తకోట దయాకర్రెడ్డి (మక్తల్), సోలిపేట రామచంద్రారెడ్డి, (దొమ్మాట), చిల్కూరి రామచంద్రారెడ్డి (ఆదిలాబాద్) మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఇటీవల సంభవించిన వరదలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్రావు ఇచ్చిన వాయిదా తీ ర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ తర్వాత మధ్యాహ్నం 12.05కి స్పీకర్ టీబ్రేక్ విరా మం ఇవ్వగా.. సభ తిరిగి 12.50కి సమావేశమైంది. వరదలు, విద్య, వైద్యారోగ్యంపై లఘు చర్చ రెండో రోజు సమావేశం ఎజెండాలో భాగంగా రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరిగిన చర్చకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలపై చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రా రంభించారు. దీనిపై రాత్రి 8 వరకు సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. తర్వాత మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు ఆయా అంశాలపై సమాధానాలిచ్చారు. రాత్రి 10.20 వరకు సమావేశం కొనసాగగా.. కీలక బిల్లులను ఆమోదించాక శనివారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ తిరస్కరించడంతో.. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు సభలో ఉండాలి: కేటీఆర్ శాసనసభ సమావేశాలను 30 రోజులు జరపాలని బీజేపీ, 20 రోజులు జరపాలని కాంగ్రెస్ కోరాయని.. కానీ చర్చల సమయంలో ఆ పారీ్టల సభ్యులు సభలో ఉండటం లేదని మంత్రి కేటీఆర్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు సభలోకి రాగా.. ‘‘శ్రీధర్ బాబుగారికి వెల్కమ్. శాసన సభ్యులు కచ్చితంగా సభలో ఉండేలా చూడాలి. సభలో ఉండి సమాధానాలు వినాలి. బయటికి వెళ్లి అటూ ఇటూ తిరగడం, మీడియాతో మాట్లాడడం సరికాదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. తనతోపాటు రఘునందన్రావు బీజేపీ తరఫున ఉన్నారని పేర్కొన్నారు. దీంతో బీజేపీ నుంచి సస్పెండైన మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక జీరో అవర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీరు సంగారెడ్డి వరకు మెట్రో కోరితే.. మేం ఇస్నాపూర్ వరకు మంజూరు చేసినా అభినందించడం లేదు. సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ప్రభుత్వాన్ని అభినందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్బాబులకు మనసు రావడం లేదు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
ప్రతీ అంశంపై సమగ్ర చర్చ జరగాలి: స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సభ హుందాతనం, ఔన్నత్యం కాపాడుకుంటూ ప్రతీఅంశంపై సమగ్రంగా చర్చ జరగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మండలి చీఫ్విప్ భానుప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పోచారం అన్నారు. సమావేశాలు జరిగే రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు ప్రతీశాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు : మండలి చైర్మన్ గుత్తా జిల్లాల్లో ప్రొటోకాల్ అంశంలో ఇబ్బందులు వస్తున్నాయని, వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. ఉభయసభలు సజావుగా నడిచేందుకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గతంలో అసెంబ్లీ సగటున రోజుకు రెండుగంటల చొప్పున జరగ్గా, ప్రస్తుతం ఎనిమిదిగంటలపాటు జరుగుతోందని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. నోడల్అధికారి శాఖల వారీగా సమాచారం కోసం సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీకర్, మండలి చైర్మన్ సూచనలు పాటిస్తూ కొత్త ప్రొటోకాల్ బుక్ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. శాసనసభ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్లను పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డిలు ప్రారంభించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరి్వంద్కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అక్బరుద్దీన్తో మంత్రి వేముల భేటీ మంత్రి ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇద్దరి మధ్య సమావేశం కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు హయాంలో నీళ్లకోసం భిక్షమెత్తుకోవాల్సి వచ్చేది
బాల్కొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం శివారులో వరద కాలువ జీరో పాయింట్ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్లోకి విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నిజామాబాద్ జిల్లాకు నీటి విడుదల చేపట్టాలంటే చంద్రబాబు ఇంటి వద్ద భిక్ష మెత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు. పునరుజ్జీవన పథకంతో ఆయకట్టు కింద అదనంగా 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి తరలించడం అపూర్వ ఘట్టమ న్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో భూములను కోల్పోయిన రైతులకు, పునరావాస గ్రామాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లు అంది ప్రతిఫలం దక్కుతోందన్నారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, రేఖా నాయక్, విఠల్రెడ్డి, మహిళా సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్ విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీళ్లు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎదురెక్కాయి. శుక్రవారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మూడవ పంపు వద్ద బటన్ నొక్కి మోటార్లను ప్రారంభించారు. నాలుగు మోటార్ల ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి ఉరకలేసింది. అనంతరం కాళేశ్వరం నీళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్ నీటితో కాళేశ్వరం నీళ్లు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
సోదమ్మ చెప్పిన మాటలకు అవాకైనా పోచారం శ్రీనివాస్
-
బిల్లులు రాక ఇల్లు తాకట్టుకు సిద్ధమయ్యా: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, కామారెడ్డి (బాన్సువాడ/నస్రూల్లాబాద్): డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడం కొంత ఆలస్యం కావడంతో.. ఒకానొక సందర్భంలో సొంతింటిని తాకట్టు పెట్టి బిల్లులు చెల్లించాలనుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కానీ కొందరు తనపై విశ్వాసంతో వారించడంతో ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలను నిర్వహించారు. పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో సొంత స్థలాలున్న వారికి 7 వేల ఇళ్లు, ప్రభుత్వపరంగా 4 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కాగా, ఓ లబ్ధిదారుడు కలలో కూడా ఇంతమంచి ఇంట్లో ఉంటానని ఊహించలేదని.. స్పీకర్ సార్ తనకు దేవుడితో సమానమని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో స్పీకర్ కూడా కంటతడి పెట్టారు. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? -
ఈసారికి మార్పులేదు.. పోచారంకు గట్టిగా చేప్పేసిన కేసీఆర్
-
పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జోరుగా రిటైర్మెంట్పై చర్చ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు. చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు! ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. 2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సర్వేల్లో ఏం తేలింది? సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. సై అనక తప్పలేదా? బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్. పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. చదవండి:కేసీఆర్ సర్కార్పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం -
స్పీకర్ పక్కనుండగానే నిద్ర పోతున్నాడు ఈ ఆఫీసర్
-
కాళేశ్వరంతో సస్యశ్యామలం...
సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ ఆయకట్టు కోసం సింగూరు జలాలు వదలాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నో ఆందోళనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రోజుల తరబడి దీక్షలు చేస్తేగానీ నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది కాదు. ఆ దీక్షలు చూశా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగూరు సమస్య కూడా ఒక కారణమే. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా నిజాంసాగర్ నిండు కుండనే. నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైంది. రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్కు నీటిని తెచ్చుకుంటున్నాం..’అని సీఎం చంద్రశేఖర్రావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ (తిమ్మాపూర్)లోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన కల్యాణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం తన సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు, భక్తులు అందించిన రెండు కిలోల స్వర్ణకిరీటాన్ని స్వామివారికి ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. నాడు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. ‘తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నపుడు మంజీర నదిపై దేవునూరు వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక దాని సామర్థ్యాన్ని 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్ ప్రజలు ఎక్కువగా తరలివచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్లో పంటలు ఎండుతున్నా సాగునీరు అందించలేదు. సింగూరు నీటి కోసం ఎమ్మెల్యేలు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. పంటలను కాపాడుకునేందుకు రోజుల తరబడి దీక్షలు చేసేవారు. సింగూరు మీదనే ఆధారపడిన ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టుకు కూడా నీళ్లివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమస్యలను చూసి చాలామంది పెద్దలతో చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రులతో మాట్లాడినా పట్టించుకోలేదు. పైగా తృణీకార భావంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన ప్రధాన అంశాల్లో సింగూరు సమస్య ఒకటి..’అని సీఎం చెప్పారు. శ్రీనివాస్రెడ్డి ఎన్నో దీక్షలు చేశారు.. ‘సింగూరు నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఆయన బాన్సువాడ మీదుగా వెళ్తుంటే బతికున్నపుడు మంచినీళ్లు ఇచ్చి, గంజి పోసైనా సరే బతకనియ్యండి గానీ, చచ్చిపోయాక బిర్యానీ పెట్టినా లాభం లేదు అని పోచారం చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో కలిసి ఉద్యమంలోకి వచ్చాక, ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతుంటే రోడ్డు మీద కలిసిన లంబాడా బిడ్డలు పోచారం సార్ గెలుస్తాడని ముందే చెప్పారు. పోచారం అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత అభిమానం. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్రెడ్డి నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వయసులో హోదాను సైతం పక్కనబెట్టి నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిలా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతున్నారు. బాన్సువాడ మెటర్నిటీ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానిపై పోచారం పర్యవేక్షణ ఎంత ఉందో అర్థమవుతోంది..’అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నా.. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ.. తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.50 కోట్లు, ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారంటూ అభినందించారు. స్వామి కరుణ, దయ యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా.. ‘నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నా కన్నా వయస్సులో పెద్దవాడైనా నేనున్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్రెడ్డి ఫోన్ చేస్తే చీఫ్ సెక్రెటరీ అయినా, సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది..’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. బడ్జెట్పై చర్చ
అప్డేట్స్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 3 వేలు మెస్ చార్జీలు ఇవ్వలేమా? ►తెలంగాణ వ్యాప్తంగా యూనివర్శిటిలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం మూడు వేల మెస్ బిల్లు ఇవ్వలేమా అని ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మూడు వేలు విద్యార్థుల మెస్ చార్జీల కింద ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. ►బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని, అయితే ఈ బడ్జెట్లో తనకు పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఆదాయ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే, గతేడాది కన్న ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు ఎక్కువగా చూపించామన్నారు. ►ఈ రోజు సెషన్స్లో భాగంగా అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా కంటి వెలుగు టెస్టులను స్పీకర్ పోచారంతో పాటు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరు చేయించుకున్నారు. ►బుధవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
బడ్జెట్ సమావేశాలు: ఈసారి 20 అంశాలతో నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో 20 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం జరిగే చర్చలో భాగంగా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రైతులకు రుణమాఫీ అమలుతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో, ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, ధరణి పోర్టల్ కారణంగా రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ పక్షాన 20 అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఇవ్వకుండా చులకన చేస్తున్నారని ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించినట్టు సమాచారం. దీనిపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని స్పీకర్ను కోరినట్టు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ నిర్ణయించిన 20 అంశాలివే: ►317 జీవో రద్దు రైతు రుణమాఫీ.. బ్యాంకురుణాలు, పంటలకు మద్దతు ధర ►రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు ►మలక్పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మరణాలు ►రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ దందా, కిడ్నాప్లు ►ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లోని అవకతవకలు, ఫీజు రీయింబర్స్మెంట్ ►గ్యాస్, పెట్రోల్, డీజిల్పై పన్నుల తగ్గింపు u పోడు భూములపై గిరిజనులకు హక్కులు u సర్పంచ్ల సమస్యలు, గ్రామపంచాయతీల నిధుల దారి మళ్లింపు ►కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు u విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం u రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఇతర రాష్ట్రాల కేడర్ అధికారులు తెలంగాణలో పనిచేయడం u డబుల్ బెడ్రూం ఇళ్లు u గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ►పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు u రాష్ట్ర అప్పులు u కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దు, పాత పింఛన్ అమలు, పీఆర్సీ ప్రకటన u బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ►వైన్షాపులు, బెల్టుషాప్లు, బార్లు, పబ్బులతో సమస్యలు u ధరణి కారణంగా రైతుల ఆత్మహత్యలు -
Telangana: గవర్నర్కు సాదర స్వాగతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు శుక్రవారం సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉదయం 11.55 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత 12.05 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తర్వాత శాసనసభ హాల్ వరకు గవర్నర్ను సీఎం, స్పీకర్, చైర్మన్ స్వయంగా తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం 12.12 గంటలకు ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం.. 12.44 గంటల వరకు 32 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిశాక గవర్నర్ సభ్యుల స్థానాల వద్దకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం గవర్నర్కు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద సీఎం, మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు వీడ్కోలు పలికారు. యధాతథంగా.. ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంతకాలంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని ప్రజాకవి కాళోజీ కవితా పంక్తులతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులతో ముసిరిన భవితవ్యం ఎంతో..’అని స్వాతంత్య్ర సమరయోధుడు, కవి దాశరథి కృష్ణమాచార్య పంక్తులతో ముగింపునకు వచ్చారు. చివరిలో ‘జయ జయహే తెలంగాణ.. జై తెలంగాణ.. జై హింద్’ నినాదాలతో ముగించారు. ప్రసంగంలో వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ, ‘తెలంగాణ మోడల్’కు పెద్దపీట వేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి అందిన ప్రసంగ పాఠాన్ని చదివి ఎక్కడా వివాదానికి తావులేకుండా ముగించారు. ఎక్కడా విమర్శలు లేకుండా.. గవర్నర్ ప్రసంగ పాఠంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శ లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయ విమర్శలకు వేదికలా కాకుండా కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపించింది. ప్రసంగంలో అనేక మార్లు గవర్నర్ ‘మై గవర్నమెంట్ (నా ప్రభుత్వం)’అనే పదాన్ని వాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల ఫలితాలను వివరించారు. ఇటీవల ప్రభుత్వ పనితీరుపై రాజ్భవన్ వేదికగా విమర్శలు సంధించిన గవర్నర్ నోట ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ఆవిష్కరించే రీతిలో ప్రసంగ పాఠం సాగడం గమనార్హం. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే గవర్నర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. -
బాన్సువాడలో ‘డబుల్’ ధమాకా !
సాక్షి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చొరవతో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోని తాడ్కోల్లో నిర్మించిన 504 డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత స్పీకర్ పోచారం నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా బాన్సువాడకు 11 వేల ఇళ్లను మంజూరు చేయించారు. ఇప్పటివరకు ఏడు వేల పైచిలుకు ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా పట్టణ పరిధిలోని తాడ్కోల్ శివారులో మొదట ఐదు వందల ఇళ్లు నిర్మించారు. వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే కాంపౌండ్లో నిర్మించిన 504 ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించారు. కేసీఆర్ నగర్గా ఈ కాంపౌండ్కు నామకరణం చేశారు. అక్కడే రూ.90 లక్షలతో కల్యాణ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీలో షాపింగ్ కోసం కాంప్లెక్సు నిర్మించారు. కాలనీలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పోచారం పేర్కొన్నారు. కాగా తమకూ ఇళ్లు కావాలంటూ మరికొందరు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. -
చావనైనా చస్తాం... కేసీఆర్ను వదిలివెళ్లం...
సాక్షి, హైదరాబాద్: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఘనంగా కళోత్సవాలు (ఫొటోలు)
-
బాన్సువాడ బరిలో స్పీకర్ తనయుడు!.. పోచారం కీలక వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: వచ్చే ఎన్నికలలో బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. మళ్లీ తానే బరిలో నిలుస్తానని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డి స్పీకర్ హోదాలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడు డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గ నేతలు, అధికారులను సమన్వయం చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భాస్కర్రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ వయసు పైబడుతుండడంతో ఆయనకు బదులు కొడుకులు పోటీ దిగుతారని పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రచారానికి తెరపడినట్టయ్యింది. జనం మధ్యలో.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడుపుతు న్నారు. కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం¿ోత్సవాల్లో పాల్గొంటున్నారు. వీధులన్నీ తిరుగుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా.... ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడిని చూస్తుంటే ఎన్నికలు వచ్చాయా అనిపిస్తోంది. ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అందరినీ కలుస్తున్నారు. ప్రజలు తమ గల్లీకి రావాలని కోరగానే అటు పరుగులు తీస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో వారి పర్యటనలు సాగుతున్నాయి. జనంతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే ఎన్నికల బరి ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ సరస్వతి ఆలయ కల్యాణ మండపంలో బీర్కూర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడు సమీక్ష అవసరమన్నారు. అప్పుడే లోటుపాట్లు బయటకి వస్తాయన్నారు. ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పులు చేస్తే తరిమికొడతారని పేర్కొన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని, దానిని నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ రఘు, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు శశికాంత్, నారాయణ, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్లకే టికెట్లన్న సీఎం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్లకే అవకాశం ఇస్తామని, ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడాలని ఆదేశించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడనుంచి వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్, జుక్కల్లో హన్మంత్సింధేలకే అవకాశాలు దక్కనున్నాయి. -
ప్రివిలేజెస్ కమిటీకి షర్మిల వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రులు నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ చాంబర్లో పోచారంను కలిసి ఫిర్యాదును అందజేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించడంతో పాటు నిరాధారంగా జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. కాగా షర్మిల వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్రెడ్డికి కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
తెలంగాణ అసెంబ్లీ: సెషన్ మొత్తం ఈటల సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య జరుగుతున్న వాడీవేడి వాగ్వాదాలు.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా మూడో రోజు సమావేశాల్లో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఆ సమయంలో ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే స్పీకర్ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ఇదిలా ఉంటే.. ‘స్పీకర్పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్భాస్కర్ కోరారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్రెడ్డి -
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం నోటీసులు పంపింది: కేసీఆర్ ఫైర్
Updates.. ► తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ► కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలి. ఉత్సవాలు గర్వపడేలా ఉండాలి.. గాయపడేలా ఉండకూడదు. వరద నష్టంపై సభలో చర్చ జరపాలి. అవసరమైతే మరో రెండు రోజులు సభ కొనసాగించాలి. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. దీని కోసం సభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. 11: 40 AM ► కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్ వినియోగం ప్రగతి సూచికగా ఉంటుంది. కేంద్రం తెలంగాణకు భయంకరమైన అన్యాయం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సీలేరు పవర్ ప్రాజెక్ట్ సహా 7 మండలాలను లాగేసుకున్నారు. కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ గొంతు నులిమింది. మోదీకి ఎన్నిసార్లు చెప్పినా కర్కశంగా వ్యవహరించారు. మోదీ ఫాసిస్టు ప్రధాని అని ఆనాడే చెప్పాను. విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత. కేంద్రం ఇచ్చిన గెజిట్లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంది. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారు. విద్యుత్ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణ అందరికీ తెలియాలి. విద్యుత్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలి. రఘునందన్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఆర్టీసీని అమ్మేయాలని నాకు కేంద్రం నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్రం లెటర్ల మీద లెటర్లను నాకు పంపిస్తోంది. ఆర్టీసీని అమ్మేస్తే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది. దీనికి సంస్కరణలు అని అందమైన పేరు పెట్టారు. విద్యుత్, వ్యవసాయ రంగాన్ని షావుకార్లకు అప్పగించాలని మోదీ సర్కార్ చూస్తోంది. మమ్మల్ని కూలగొడతామని చెబుతున్నారు. అంటే మీకు పోయే కాలం వచ్చింది. అందరూ కలిస్తే మీరు ఉంటారా?. షిండేలు, బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. హిట్లర్ వంటి వారే కాలగర్బంలో కలిసిపోయారు. వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు. భారతమాత గుండెకు గాయమవుతోంది. జాతీయ జెండానే మార్చేస్తామని చెబుతున్నారు. ఏక పార్టీనే ఉంటుందని చెప్తున్నారు. కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడింది. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. 10:25 AM ► కేంద్రం విద్యుత్ సంస్కరణల చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ► కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం తీరస్కరించారు. ► శాసనసభలో 7 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లులపై రేపు(మంగళవారం) చర్చ చేపడతామని స్పీకర్ పోచారం తెలిపారు. సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను ప్రారంభించారు. -
ఈటలపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమా వేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావే శానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడం క్రమంగా రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ మరమ నిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విష యం తెలిసిందే. ఈటల క్షమాపణ చెప్పకుంటే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని వేముల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈట లను అసెంబ్లీ నిబంధనలను అనుసరించి సస్పెండ్ చేసేందుకు ఉన్న అవకాశాల పరిశీ లన జరుగుతున్నట్లు తెలిసింది. మంగళవా రం వాయిదా పడిన వానాకాల సమావేశాలు తిరిగి వచ్చే సోమవారం ప్రారంభం కానుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ఆరోజు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈటలపై చర్యలకు డిమాండ్ చేసే చాన్స్ ‘కేసీఆర్ చెప్తే చేసే మర మనిషిలా కాకుండా గతంలో ఉన్న సభా సంప్రదాయాలను స్పీకర్ కొనసాగించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. స్పీకర్ తమ హక్కులు కాపాడాలని కోరారు. మరమనిషి అనే పదం నిషిద్ధమైనది ఏమీ కాదని ఎమ్మెల్యే రఘునందన్రావు, స్పీకర్ పదవికి కళంకం తెస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వేర్వేరు చోట్ల వ్యాఖ్యానించారు. బీజేపీ వైఖరి నేప థ్యంలో ఈటలపై అసెంబ్లీ వేదికగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసే అవ కాశముంది. సభ, సభా కమిటీలు, సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా అనుసరించాల్సిన సభా సంప్రదాయాలను టీఆర్ఎస్ ఉటంకిస్తోంది. సభ గౌరవం కాపా డేందుకు పలు కమిటీలు, నియమాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యల ఎపిసోడ్ను స్పీకర్ ద్వారా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తీర్మానం ద్వారా ఎథిక్స్ కమిటీకి.. నిబంధనల ప్రకారం.. మంత్రులు సహా శాససనసభ్యులు ఎవరైనా సభ బయట అనైతికంగా ప్రవర్తించినా, మాట్లాడినా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు ఫిర్యాదును స్పీకర్ ఒక తీర్మా నం ద్వారా ఎథిక్స్ కమిటీ (నైతిక విలు వల కమిటీ)కి అప్పగించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతారు. ప్రస్తు తం ఈ నిబంధన మేరకు స్పీకర్ విషయమై ఈటల చేసిన వ్యాఖ్యలను సభ దృష్టికి టీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ఈటలను అవస రమైతే సభ నుంచి సస్పెండ్ చేసే అవకా శముంటుందని టీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఈటల రాజేందర్, రఘునందన్రావు, రాజాసింగ్లను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్కు నోటీసులు? -
స్పీకర్పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ స్పీకర్పై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని, స్పీకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నాడని దుయ్యబట్టారు. పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్లతో బండి సంజయ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ఫ్యూజ్ చేయడం అందులో భాగమే. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే’ నని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చదవండి: స్పీకర్పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు తెలంగాణ శాసనసభ స్మీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర మనిషిగా పేర్కొంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చెప్తే చేసే మరమనిషిలా కాకుండా స్పీకర్ గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం అన్నారు. బీఏసీ భేటీకి బీజేపీ సభ్యులను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు.. అసెంబ్లీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు’ అని వ్యాఖ్యా నించారు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ప్రశ్నించారు. రఘునందన్రావు మాట్లాడుతూ ముగ్గురం ఎమ్మెల్యేలుగా ఉన్న మమ్మల్ని బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ఏంటని నిలదీశారు. శాసనసభలో ఏమైనా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారా? అని అడిగారు. చదవండి: రాజాసింగ్ బెయిల్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు -
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని, దాన్ని కాపాడుకోవాలని పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. సమాచారా న్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే.. బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. చదవండి: కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని ప్లాన్! -
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ
-
స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ప్రిన్సిపల్ కాళ్లు మొక్కుతానన్న స్పీకర్ సాబ్
-
‘అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు’
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో సమానత్వం పెంపొందించి, ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా, అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, గరపు దయానంద్, జనార్ధన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
17న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి తమ సస్పెన్షన్, సభలోకి అనుమతించే అంశాలపై పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడా న్ని నిరసిస్తూ ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. స్పీకర్ హోదాకు విలువనిస్తూ కోర్టు గౌరవ సూచన చేసినా, ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తారని ఈటల విమర్శించారు. స్పీకర్ తన గౌర వాన్ని నిలుపుకోలేకపోవ డం దురదృష్టకరమన్నారు. ఆస్ట్రియా బృందం ఈ రోజు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలి స్తున్న సందర్భం లో తమ సస్పెన్షన్ ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ విధానాలు చూస్తుంటే ఉత్తర కొరి యా గుర్తు వస్తుందని, అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదు అని ఒక సభ్యున్ని కాల్చి చంపారని ఈటల పేర్కొన్నారు. ఇకపై ఇక్కడా చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక ఉద్యమ నాయకుడినేనని గతంలో ఉద్యమాన్ని తూలనాడిన వారితోనే తమను సస్పెండ్ చేయించడం అవమానకరమన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులు, మీ పిటిషన్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ చెప్పారని రఘునందన్ రావు తెలిపారు. తమ అభ్యర్థనను సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదన్నారు. ‘ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్డే. స్పీకర్ తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారు’అని రఘునందన్ విమర్శించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సస్పెన్షన్కు గురైన ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు తమపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలంటూ మంగళవారం శాసన సభాపతి చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిశారు. అయితే సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని పోచారం స్పష్టం చేయడంతో అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానించడం తెలిసిందే. దీన్ని సవాల్చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్కు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుమారు 45 నిమిషాలపాటు స్పీకర్ను కలిసేందుకు వేచిచూశారు. చివరకు స్పీకర్ చాంబర్లో కలిసేందుకు వారికి పిలుపు రావడంతో పోచారాన్ని కలిసి కోర్టు ఉత్తర్వులతోపాటు సస్పెన్షన్ను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. సభ జరుగుతున్న సమయంలో తమ స్థానం నుంచి కదలలేదని, సభను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని రఘునం దన్రావు, ఈటల రాజేందర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమను బహిష్కరించడం అన్యాయమని, పార్టీలను పక్కనపెట్టి పక్షపాతరహితంగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సభ్యులు కోరారు. పోడియంలోకి వచ్చినట్లు భావిస్తే తాను సస్పెన్షన్కు అర్హుడనని, మిగ తా ఇద్దరు సభ్యులను సభకు అనుమతించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్కు విన్నవించారు. ‘సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవంగా తీసుకుందని’స్పీకర్ వ్యాఖ్యానించగా తమ వినతిని సభతోపాటు సభానాయకుడి ముందు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఈలోగా శాసనసభ సమావేశం ప్రారంభమైనట్లు గంట మోగడంతో స్పీకర్ సభలోకి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు. ‘మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ ప్రకటించారని సభ నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో ప్రకటించారు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. -
తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సెషన్ 2022-23లో భాగంగా.. శనివారం ఉదయం ఐదవ రోజు సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుపల ఆవాసాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు 6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది. సభలో ప్రశ్నలే అడగాలని, ప్రసంగాలు వద్దంటూ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించడం విశేషం. -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
మరోసారి కోవిడ్ బారినపడ్డ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డికి మరోసారి కరోనా వైరస్ సోకింది. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు, ఎప్పటివరకు అంటే.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ స్పీకర్కు కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాస్రెడ్డి కరోనా లక్షణాలతో హైదరా బాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొం దుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా బుధవారం రాత్రి చేసిన వైద్య పరీక్షలో స్పీకర్కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, వైద్యుల సూచ నల మేరకు గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 21న హైదరాబాద్లో స్పీకర్ మనవరాలి వివాహం జరగగా, ఏపీ, తెలం గాణ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీటీ స్కాన్లో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని.. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలిసింది. -
పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన ఇరు రాష్ట్రాల సీఎంలు
-
ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్ఆర్ ఫామ్స్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలానే ఏపీ స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అన్నారు. చదవండి: ‘దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా’ ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టిందని అన్నారు. -
స్పీకర్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని ఒకరి మృతి
మనోహరాబాద్ (తూప్రాన్): శాసనసభ స్పీక ర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టిన సంఘటన లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లక ల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్పీ కర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం కాన్వా య్తో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్నారు. అదే సమయంలో కాళ్లకల్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిని దాటుతు న్న దొంతిరెడ్డి నరసింహారెడ్డి (62)ని కాన్వాయ్ లోని వెనుక వాహనం ఢీ కొట్టింది. దీంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే నిలిచిపోగా, స్పీకర్ మిగతా కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. మృతుడు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎస్ఐ రాజాగౌడ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పీకర్ ఫోన్లో చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
సాక్షి, మెదక్: తెలంగాణ శాసనసభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయి వెళ్తుంది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అదే సమమంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో కాన్వాయ్లోని ఓ వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చదవండి: బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని నర్సింహ్మ రెడ్డిగా (50) పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్నాడు. పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. చదవండి: ‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు -
‘పోడు’పై వాయిదా తీర్మానం తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ను ఆయన చాంబర్లో కలసి పోడు సమస్యలపై సభలో చర్చ జరపాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడం మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో గన్పార్కు వద్దకు వచ్చి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అడవుల్లో నివసించే వారికి తమ హయాంలో భూములపై హక్కులు కల్పించామని, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే అడవిబిడ్డలను పోలీసులు కొట్టి అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినా తిరస్కరించారని, దీనిపై స్పీకర్ను కలిసి నిరసన తెలిపామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకోవాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాట్లాడుతూ గిరిజన పోడు భూములపై ఇచ్చిన మాటలను ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, గిరిజనుల భవిష్యత్తు తో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. -
గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మనమందరం పునరంకితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, తేరా చిన్నపరెడ్డి, కుర్మయ్యగారి నవీన్కుమార్, దయానంద్, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ఏడేళ్ళలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. -
రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ఏర్పాట్లపై గురువారం ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభలోని కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారని గుర్తుచేశారు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ, 8వ సెషన్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాల మాదిరే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ఆయా శాఖల తరఫున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలని తెలిపారు. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే మన శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. సమావేశానికి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ &యూడీ) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీ (ఎస్పీఎఫ్) ఉమేశ్ షరాఫ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డీజీ (లా & ఆర్డర్) జితేందర్, అడిషనల్ సీపీ (క్రైం) షీకా గోయల్, జాయింట్ సీపీ (సెంట్రల్ జోన్) విశ్వ ప్రసాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సీపీ (రాచకొండ) సుధీర్, డీఐజీ (ఇంటలిజెన్స్) శివకుమార్, ఇన్చార్జి డీఐజీ (ఐఎస్డబ్ల్యూ) తప్సిన్ ఇక్బాల్, డీసీపీ (ట్రాఫిక్) భాస్కర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్ తదితరులు హాజరయ్యారు. -
ఈటల రాజీనామా ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కాగా ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అవ్వటంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆ స్థానానికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. చదవండి: హుజూరాబాద్లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరాడు. దీంతో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్ వెలువడనుంది. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెచ్చా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖ అందించారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
వ్యాక్సిన్ వేయించుకున్న స్పీకర్, శాసన మండలి చైర్మన్!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బుధవారం నిమ్స్లో కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ను వేయించుకున్నారు. ఆయనతో పాటు సభాపతి సతీమణి పుష్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన సతీమణి అరుంధతిలు కూడా టీకా వేయించుకున్నారు. వీరంతా మార్చి 3న కోవిడ్ టీకా మొదటి డోస్ వేయించుకున్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ కె.మనోహర్, నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దని..టీకా వేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని చెప్పారు. ఇప్పుడు రెండో డోస్గా కొవాగ్జిన్ను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా 45 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అయితే కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా, 2 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తారన్నారు. ఈ కఠిన నిబంధనలు ప్రజల మేలు కోసమేనని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయని చెప్పారు. -
నిధులివ్వనప్పుడు సమావేశాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్లో పెట్టిన నిధులు ఇవ్వరు, బడ్జెట్తో సంబంధం లేని పనులను హడావుడిగా చేపడుతూ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సభ ఎందుకు, సమావేశాలు ఎందుకు?’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు గురువారం అసెంబ్లీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పేర్కొనగా, పవిత్ర సభను అవమానించేలా ఎలా మాట్లాడతారని, అలా చేస్తే మాట్లాడేందుకే అనుమతి ఇవ్వనని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మీద గౌరవం లేనప్పుడు సభలో మాట్లాడటమెందుకని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు. తొలుత ఆయన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా స్పీకర్ పిలవగా, తన పేరు రాజగోపాలరెడ్డి అంటూ ఆయన పేర్కొనటంతో స్పీకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత రాజగోపాల్రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట ఎక్కువగా నడిచింది నిరుద్యోగులేనని, రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, ఉపాధికి ఢోకా లేదని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు అది అమలు కాకపోయేసరికి నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేటులో 50 శాతం ఉద్యోగాలు స్థానికు లకే ఇచ్చేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్లో 100 ఫార్మా కంపెనీలుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగ మేంటని ప్రశ్నించారు. పథకాలు రూపొందించినా అమలుకు నిధులు ఇవ్వక పనుల కోసం సర్పంచులపై ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులు పోతు న్నాయని, మరి తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని, ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకోవటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమా అంటూ ప్రశ్నించారు. శివన్నగూడెం ప్రజలు ప్రాజెక్టుకు భూములిచ్చి త్యాగం చేస్తే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. -
స్పీకర్ పోచారం కంటతడి
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. – బాన్సువాడ చదవండి: అదుపులోనే భైంసా -
రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్ఎస్ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్ అన్నారు. పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్కు సవాల్ విసిరిన మంత్రి
కామారెడ్డి : బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే భారతీయ ఝటా పార్టీ అని, తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఇస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్కు నిరసన సెగ) -
దివ్యాంగుడికి స్పీకర్ చేయూత
సాక్షి, హైదరాబాద్: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదుకున్నారు. నాగర్కర్నూలు జిల్లా కు చెందిన నరేశ్ 90 శాతం వికలాంగత్వంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి చనిపోవడంతో హైదరాబాద్ పాతబస్తీలోని కుమ్మరిగూడలో తల్లితో పాటు అద్దెకుంటున్నారు. తల్లి రోజువారీ కూలి. నరేశ్ తన గోడును పోచారం శ్రీని వాసరెడ్డికి ఫోన్చేసి వెళ్లబోసుకున్నాడు. దీంతో ఆయన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో మాట్లాడి ప్రభుత్వం నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక ఇంటిని కేటాయించాలని సూచించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ నాయకులు కొల్లి నాగేశ్వరరావుతో మాట్లాడి బ్యాటరీ ట్రై సైకిల్ ను అందించాలని కోరారు. స్పీకర్ సూచనతో మం గళవారం హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్ను నరేశ్కు అందించారు. -
మంత్రులపై స్పీకర్ పోచారం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం కరోనా నిబంధనలు పాటించని మంత్రులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్రెడ్డిలు కరోనా రూల్స్ పాటించకుండా పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. నో సీటింగ్ అని రాసి ఉన్నా అది పట్టించుకోకుండా జగదీష్రెడ్డి ఈటల పక్కనే కూర్చొని మాట్లాడారు. దీన్ని గమనించిన పోచారం నో సీటింగ్ అని రాసి ఉన్న దానిలో ఎలా కూర్చుంటారంటూ.. నిబంధనలు పాటించాలంటూ మంత్రి జగదీష్నుద్దేశించి హెచ్చరించారు. స్పీకర్ హెచ్చరిచకలతో జగదీష్రెడ్డి వెంటనే ఈటెల దగ్గర్నుంచి లేచి తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. సభలో సభ్యులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం మరోసారి తెలిపారు. కాగా సభా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటచుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్రెడ్డి ఎక్కువ సమయం తీసకుంటున్నాడని ఈటెల, ఎర్రబెల్లి ఆయన స్పీచ్కు అడ్డుపడ్డారు. ఒక్క ప్రశ్నకు నిరంజన్రెడ్డి ఎంత సమయం తీసుకుంటారని ఈటెల, ఎర్రబెల్లిలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిద్దరు స్పీకర్కు సమయాన్ని గుర్తుచేశారు. ఇది గమనించిన స్పీకర్ పోచారం నిరంజన్రెడ్డిను ఉద్దేశించి తొందరగా ముగించాలని కోరారు. దీంతో నిరంజన్రెడ్డి ఒక్క నిమిషంలో తన స్పీచ్ను ముగించారు. -
హడావుడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు షురూ..!
సాక్షి, హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో విభిన్న వాతావరణం కనిపించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మీడియా, సందర్శకులతో సందడిగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణంలో ఈసారి కరోనా నేపథ్యంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. మీడియా పాయింట్ ఎత్తివేయడం, లాబీలు, గ్యాలరీలోకి సందర్శకులకు అనుమతి ఇవ్వక పోవడంతో అసెంబ్లీ పరిసరాలు బోసిపోయాయి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సిబ్బందిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సీఎం, స్పీకర్, మంత్రులు సహా అందరూ మాస్క్లతో సభకు హాజరు కాగా, సభలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. సభ లోపల, బయటా కరచాలనాలు, గుమి కూడటం వంటివి లేకుండా సమావేశం వాయిదా పడిన వెంటనే ఎవరికి వారుగా తిరుగుముఖం పట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసి, అందరికీ పరీక్షలు నిర్వహించారు. మాస్క్ పెట్టుకోండి.. దూరం పాటించండి : స్పీకర్ పోచారం సూచనలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులం తా సభకు హాజరయ్యే ముందు జ్వరాన్ని తనిఖీ చేసుకోవాలని.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అది తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ పెట్టు కోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అనవసరంగా వేటినీ తాకరాదని స్పష్టంచేశారు. రోగనిరోధక శక్తి పెంచుకునేలా పౌష్టి కాహారం తీసుకోవాలని, అనారోగ్యం ఉన్నవారితో కలవరాదని చెప్పారు. నీటి సీసాలు పంచుకోరాదని, లిఫ్టు వాడొద్దని పోచారం సూచించారు. చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : మంత్రి వేముల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై శాసనసభ, మండలిలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్లు కీలక పాత్ర పోషించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. పలు అంశాలకు సంబంధించి స్వల్పకాలిక, లఘు చర్చలపై విప్లు అంశాల వారీగా సన్నద్ధం కావాలని తెలిపారు. సభ్యుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. శాసనసభ, మండలిలో చీఫ్ విప్లు, విప్లతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమావేశమై చర్చించారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సుముఖంగా ఉండడంతో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో చీఫ్ విప్లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వెంకటేశ్వర్లు, విప్లు భానుప్రసాద్రావు, ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ విప్లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కరోనా టెస్టులు చేసుకుంటేనే అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరయ్యే సభ్యులు, అధికారులు, పోలీసు, మీడియా, ఇతర సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలసి పోచారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఆరు కేటగిరీలకు చెందిన వారు ఈ నెల 6 సాయంత్రంలోగా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు, మార్షల్స్, మీడియా, మంత్రుల పీఎస్లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులు చూపిస్తేనే సమావేశాలకు అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. జ్వరముంటే నో ఎంట్రీ.. తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అక్కడి వైద్యులతో కరోనా పరీక్షలు చేయించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు స్పీకర్ పోచారం చెప్పారు. మంత్రుల పీఎస్లు, పీఏలకు మాత్రమే సభలోకి అనుమతి ఉందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలు, ఇతర వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని వెల్లడించారు. అసెంబ్లీ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ యంత్రాలు అందుబాటులో పెడతామన్నారు. జ్వరం ఉన్న వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని.. జలుబు, దగ్గు వంటి ఇతర లక్షణాలున్న వారు కూడా అసెంబ్లీకి రాకూడదని స్పీకర్ స్పష్టంచేశారు. మాస్కులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తామని, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద మాస్కులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరిమిత సంఖ్యలో మీడియా పాస్లు పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే శాసనసభ సమావేశాలు జరుగుతాయని, అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీడియాకు పరిమిత సంఖ్యలో పాస్లు జారీ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. సందర్శకులకు అనుమతి లేదని, మీడియా పాయింట్, లాబీపాస్లు జారీ చేయడం లేదన్నారు. మీడియా సంస్థలకు రెండు చొప్పున పాస్లు ఇస్తున్నట్లు వెల్లడిస్తూ, విజిటర్స్ గ్యాలరీని కూడా మీడియాకు కేటాయిస్తున్నామని చెప్పారు. చర్చల సమయంలో సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మహమూద్ అలీకి కరోనా పరీక్షలు చేస్తున్న వైద్యులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. కరోనా లక్షణాలున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు దూరంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సూచించారు. సమావేశాల సం దర్భంగా ధర్నాలు, నిరసనలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసు లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉం డాలని సూచించారు. సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేయడంతో పాటు, పార్లమెంటు మార్గదర్శకాలను పాటి స్తున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల తెలిపారు. ఉభయ సభల్లో భౌతిక దూరం పాటిస్తూ 6 అడుగుల దూరం లో శాసనసభలో అదనంగా 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్లు వినయ్ భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా కిట్లు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్తో కూడిన కిట్లను అందజేస్తామని స్పీకర్ పోచారం వెల్లడించారు. మున్సిపల్, పబ్లిక్ హెల్త్, జీహెచ్ఎంసీ ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరాలతో పాటు పరిసరాలను రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేస్తామని, సభ్యుల కోసం అసెంబ్లీ ఆవరణలో 2 డయాగ్నస్టిక్ కేంద్రాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని వివరించారు. సమావేశాలు.. 20 రోజులు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ ఖరారు చేసింది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల నిర్వహణ తీరు, ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం జరగ్గా... సభలో చర్చకు వచ్చే అంశాల సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాల్సిందిగా వారిని స్పీకర్, చైర్మన్ ఆదేశించారు. గతంలో మాదిరిగా అధికారులను గుంపులుగా కాకుండా, శాఖల వారీ ముఖ్యమైన వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. సాయంత్రం పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో భద్రతపరమైన అంశాలు, బందోబస్తుపై చర్చించారు.ఎస్పీఎఫ్ డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ పాల్గొన్నారు. -
మాస్కు తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ,మండలి సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమవుతాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు వచ్చే సభ్యులందరూ జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. కరోనాను ప్రభుత్వం కట్టడి చేయడం వల్లన మరణాల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా, పోలీసులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకుని సభకు హాజరుకావాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కోవిడ్ టెస్టులు ప్రారంభించామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు కూడా టెస్టులు చేయించుకోవాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. (చదవండి: ‘టిఫిన్’ తినేదెట్లా?) అసెంబ్లీ లాబీ హాల్లోకి ఎమ్మెల్యేల పీఏలకు అనుమతిలేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రతిఒక్కరికి మాస్కులు తప్పనిసరి అని, లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు కరోనా కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆక్సీమీటర్లో 90 కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. లాబీ పాస్లు రద్దు చేశామని తెలిపారు. ఈ శాసనసభ సమావేశాలకు మీడియా పాయింట్ ఉండదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్ వైద్య బృందం, అసెంబ్లీ- మండలిలో ఒక్కో అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. సభా సమయం వృధా కాకుండా సమావేశాలు జరుపుకోవడానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. పార్లమెంట్ తరహాలో, కోవిడ్ నిబంధనలకు లోబడి సమావేశాలు జరుపుతామని స్పీకర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) -
ఒకటో తేదీకల్లా అసెంబ్లీ రెడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఏడో తేదీ నుంచి మొదలుకానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల కోసం ఒకటో తేదీ కల్లా సభ్యుల సీటింగ్, ఇతర ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేయనుంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యుల బృందం గురువారం అసెంబ్లీ, మండ లి సమావేశ మందిరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించింది. భౌతికదూరం, సీటింగ్పై పలు సూచనలు చేసింది. 119 మంది సభ్యులు గల అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి. భౌతికదూరం నిబంధన నేపథ్యంలో అదనంగా మరో 42 సీట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. గతంలో ఒక్కో సీటుకు ఇద్దరు సభ్యులు కూర్చోగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో సీటును ఒక్కో సభ్యుడికి కేటాయిస్తా రు. 40 మంది సభ్యులున్న మండలిలో ప్రస్తుతం 36 మంది ఉన్నారు. ఇందులో 80 సీట్లు ఉండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది లేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించా యి. విజిటర్స్, ప్రెస్ గ్యాలరీని మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. సీట్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చాక ఎందరిని అనుమతించాలనే విషయంపై మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. -
ధీశాలి.. సంస్కరణశీలి
సాక్షి, హైదరాబాద్ : ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 360 డిగ్రీల కోణంలోనూ అద్భుత వ్యక్తిత్వంగల వ్యక్తి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమను వర్ణించడానికి మాటలు చాలవు. గొప్ప సంస్కరణశీలి. విమర్శలు వస్తాయని ఏదైనా చేయడానికి కొందరు భయపడతారు. కానీ భయపడకుండా సంస్కరణలను అమలు చేసిన ధీశాలి పీవీ. ఏ రంగంలో కాలుపెడితే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పీవీ కుటుంబ సభ్యులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులోనూ ఆయన చిత్రపటం ఏర్పాటు చేయాలని పోరాడుతామన్నారు. పీవీ నరసింహారావు 99వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు... అన్ని రకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారాయి. వాటన్నింటినీ బయటకు తీసి భావితరాలకు అందించాలి. వ్యక్తిత్వ పటిమను పెంపొందించడానికి పీవీ చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది. నవభారత నిర్మాతల్లో ఆద్యుడు నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. నెహ్రూకు సమాంతర వ్యక్తి పీవీ అని వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలి. ఈ రోజు 51 దేశాల్లో పీవీ జయంతిని తెలంగాణ బిడ్డలు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 10 కోట్లు విడుదల చేశాం. హర్పల్ మౌలా (ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలే ప్రజ్ఞగలగే వ్యక్తి) అని పీవీని పాకిస్తానీయులు సైతం పొగిడారు. పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో నిర్వహించే పరిస్థితి రావాలి. జ్ఞాన భూమిలో భారీ మెమోరియల్ తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతాం. కాకతీయ యూనివర్శిటీలో ఆధునిక ఆర్థిక విధానాలపై పీవీ పేరుతో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రామేశ్వరంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ను మించి పీవీ మెమోరియల్ను జ్ఞాన భూమిలో వచ్చే ఏడాది జూన్ 28లోగా ఆవిష్కరిస్తాం. ఇంకొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పీవీ పేరు పెడతాం. పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఎంపీ కేశవరావు సూచన మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తా. అముద్రితమైన పీవీ రచనలను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి వర్సిటీలకు పంపిస్తాం. ఏ బాధ్యతలు చేపట్టినా సంస్కరణలు ఉమ్మడి ఏపీలో పీవీకి విద్యా మంత్రి పదవి ఇస్తే సర్వేల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్రెడ్డి సహా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు వాటిల్లో రూపుదిద్దుకున్నారు. కేంద్ర విద్యాశాఖ పదవి ఇస్తే శాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చారు. మళ్లీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ప్రారంభించారు. ఆయనకు జైళ్ల శాఖను అప్పగిస్తే ఓపెన్ జైల్ కాంసెప్ట్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన 1,000/1,200 ఎకరాల ఆసామి. ఆయన 200 ఎకరాల భూమిని కుటుంబానికి ఇచ్చుకొని మిగిలిన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందుకే పీవీ తెలంగాణ ఠీవీ. విమర్శలొచ్చినా వెనకాడని నిశ్చలమైన వ్యక్తి. భూస్వామ్య వ్యవస్థ పోయి నేడు రాష్ట్రంలో 93% చిన్న, మధ్య రైతులు ఉండటానికి కారణం ఆయనే. ఆర్థిక స్వేచ్ఛకు కారణభూతుడు.. పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశం ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉండేది. అలాంటి సంక్షోభ సమయంలో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. అప్పటివరకు రాజకీయాల్లో లేని, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మన్మోహన్సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిని చేసి ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పరిణతికి కారణభూతుడు పీవీ. తగిన గౌరవం లభించలేదు రాష్ట్రానికి, దేశానికి, భూగోళానికి విజ్ఞాన సముపార్జన చేసిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సిన గౌరవం లభించకపోవడం బాధాకరం. చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి వచ్చేలా ముందు తరాలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిద్దాం. కుల, ధన బలం లేకున్నా ప్రధాని అయ్యారు. నిరంతర అధ్యయనశీలి... పీవీ నోట సరస్వతి నాట్యం చేసినట్లు ఉంటది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిజాం రాజు పీవీని ఓయూ నుంచి రస్టికేట్ చేసి తెలంగాణ రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దంటే మహారాష్ట్రలో సీటు సంపాదించారు. మరాఠీ భాషను నేర్చుకోవడమే కాకుండా ఆ భాషలోని నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. వయసుతో నిమిత్తం లేని గొప్ప విద్యార్థి పీవీ. అందుకే ఆయనకు 17 భాషలు వచ్చాయి. నిరంతర అధ్యయనశీలి పీవీ. పీవీ ఆశయం కోసమే 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పదవికి వన్నె తెచ్చారు: కేకే ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ అని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. . భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ సుస్థిరతకు పీవీ అందించిన సేవలు సదా స్మరణీయమన్నారు. నాడే చెప్పిన పీవీ: పోచారం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే సాధ్యమని, ఆయనే తొలి సీఎం అవుతారని ముందే పీవీ చెప్పారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్రావు, పీవీ కుమారుడు హెచ్సీయూకు పీవీ పేరు పెట్టాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 1975లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా, 6 పాయింట్స్ ఫార్మూలా అమలులో భాగంగా ఈ వర్సిటీ ఏర్పాటైందని ప్రధానికి కేసీఆర్ గుర్తుచేశారు. దేశ ఆర్థిక, విద్యా, సాహిత్య రంగాల వృద్ధికి ఎంతో కృషి చేసిన పీవీ పేరును ఈ వర్సిటీకి పెట్టాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధానికి తెలియజేశారు. కేసీఆర్కు కృతజ్ఞతలు భాషకు అందని వ్యక్తిత్వం మా బాపుది. మాకు బాపు గురించి అన్నీ తెలుసనుకున్నాం. కానీ మాకు తెలియని విషయాలు రోజూ తెలుస్తూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – వాణీ దయాకర్రావు, పీవీ కుమార్తె శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్రావు, పీవీ కుమారుడు -
సంక్షోభంలోనూ సంక్షేమం
సాక్షి, సిరిసిల్ల: తమ ప్రభుత్వం సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్కు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆసరా పింఛ న్లు, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు కొనసాగిస్తూనే.. రైతుబంధు, రుణమాఫీ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని 54.22 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పు న రూ.6,889 కోట్ల రైతుబంధు సాయాన్ని అందించామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. రాష్ట్రంలోని 5.60 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పాడి పంటలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. హరితహారం దేశానికే ఆదర్శం: పోచారం రాష్ట్రంలో ఓ యజ్ఞంలా హరితహారం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ మానేరు వాగులో శుక్రవారం చేపట్టిన మెగా ప్లాంటేషన్లో మంత్రి కేటీఆర్తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పవిత్ర హృదయం, చిత్తశుద్ధితో యజ్ఞాన్ని చేసినట్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటి సంరక్షించే యజ్ఞా న్ని సీఎం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మనిషి మనుగడ చెట్లు, కట్టెతో ముడిపడి ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సం క్షేమ పథకాలు అమలు చేసినా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ప్రజలు జబ్బుల బారిన పడతారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం మాత్రమే వన సంపద ఉందన్నారు. పచ్చదనం ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతున్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. హరిత విప్లవం రావాలి రాష్ట్రంలో హరిత విప్లవం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ద్వారా రాజకీయంగా లాభమేమీ కాదని, కానీ, భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. హరితహారాన్ని ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈసారి ప్రజల సెంటిమెంట్లను గౌరవించి పండ్లు, పూల మొక్కల్ని, రాశీ వనాలు, నక్షత్ర వనాలను పెంచుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా 95 బ్లాక్లను గుర్తించామని, సిరిసిల్లలోనూ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్లో గాలి కొనుక్కోకుండా ఉండాలంటే పాడైన అడవులను బాగు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. -
కంటతడి పెట్టిన స్పీకర్ పోచారం
వర్ని: డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గా గ్రామంలో 30 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నష్టం వస్తుందన్న కారణంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదన్నారు. ఈ దశలో తన తనయుడితోపాటు మం డల ప్రజాప్రతినిధులను బ్రతిమా లి ఇళ్ల నిర్మాణం ముందుకు సాగేలా చూస్తున్నామన్నారు. వేరే నియో జకవర్గాల్లో తొలి విడత ఇళ్ల నిర్మా ణం కూడా పూర్తి కాలేదని, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే కొందరు అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తుండడం బాధ కలిగిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వెంటనే సర్దుకున్నారు. -
స్పీకర్ను కలిసిన కవిత
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కవితతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్ తదితరులు స్పీకర్ను కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్లో... పోచారంను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ బయల్దేరారు. (మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కవిత) కాగా శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశించినా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. -
4 రోజులు ముందుగానే...
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగియనున్నాయి. కోవిడ్పై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 20 వరకు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సం బంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్లో శాసనసభ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు, ఎంఐఎం, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనసభ, మండలి రెండూ సోమవారం ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. చివరి రోజు సమావేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లును ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర బిల్లులతో పాటు, సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తరువాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం మండలి కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. పద్దులపై చర్చ... అసెంబ్లీ సమావేశ తేదీల కుదిం పు నేపథ్యంలో ఆదివారం బడ్జె ట్ పద్దులపై చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన 25 పద్దులపై పలు పార్టీ లకు చెందిన 23 మంది సభ్యులు ప్రసంగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు పద్దులపై మొదలైన చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రుల సమాధానాలు చెప్పారు. -
సజావుగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతికి దోహదం చేసే చర్చలను ప్రజలు నిశితంగా గమనిస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులుతో కలిసి బుధవారం శాసనసభ ఆవరణలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ శాసనసభ పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూడాలని, సభ్యులు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని పోచారం ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశాలు నిర్వహిస్తామని గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. శాసనసభ నుంచి శాసనమండలిలోకి వచ్చే మంత్రులకు ట్రాఫిక్ సమస్య ఎదురవకుండా చూడాలని, ఉభయ సభల్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాల నుంచి వచ్చే సభ్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్, విప్లు, ఎమ్మెల్సీల విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సభ జరిగేందుకు అధికారులు సర్వసన్నద్ధులుగా ఉండాలని వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యదర్శులు వాట్సాప్ ద్వారా సమావేశాల తీరును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో ప్రత్యేక భేటీ.. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసు అధికారులతో గుత్తా సుఖేందర్రెడ్డి, పోచారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, డీజీపీ (ఎస్పీఎఫ్) తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, చీఫ్ విప్లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టీఆర్ఎల్పీ ఇన్చార్జి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్ను స్పీకర్, మండలి చైర్మన్ సంయుక్తంగా ప్రారంభించారు. -
డబుల్ బెడ్రూం పేరిట నకిలీ పట్టాల బాగోతం
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట దళారులు కొనసాగిస్తున్న దందాపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నియోజకవర్గమైన బాన్సువాడలో దందా జరుగుతుండడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. వివరాలు.. గత కొంతకాలంగా బాన్సువాడ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో డబుల్ బెడ్రూం ఇండ్లపై నకిలీ పట్టాలు తయారీ చేస్తున్నట్లు సమాచారం అందింది. బాన్సువాడ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ పట్టాల బాగోతం బయటపడింది. పేదల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ పట్టాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నట్లు తేలింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ విచారణ జరిపి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ధాన్య భాండాగారం పాలమూరు: స్పీకర్ పోచారం
సాక్షి, వనపర్తి : పేదవాడి ఆత్మగౌరవం సొంతింటితో పెరుగుతుంది.. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ వందశాతం సబ్సిడీతో రెండు పడకల ఇంటిని పేదవారికి కట్టించేందుకు పూనుకున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను అడ్డం పెట్టుకుని ప్రజాధనం స్వాహా చేసిన సంఘటనలు ఊరూరా కనిపిస్తాయన్నారు. నిజమైన ఇల్లు లేని పేద కంటుంబాలన్నింటికీ.. విడతల వారీగా.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్దిదారుడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. నేరుగా గృహప్రవేశం చేసుకునేలా సీఎం ఈ పథకాన్ని రూపొందించారన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండా, కర్నెతండా, రేవల్లి మండలం చెన్నారంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను, జిల్లా కేంద్రంలో రూ.60 లక్షలతో అభివృద్ధి చేసిన మున్సిపల్ పార్కులు, రూ.95 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్, పాన్గల్ మండలం కొత్తపేట క్రాస్రోడ్ వద్ద బస్òÙల్టర్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాగునీరు లేక బీడు.. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తిండిపెట్టేంత సాగుభూమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉందన్నారు. అలాంటి పాలమూరుపై పాలకుల చిన్నచూపుతో కావాల్సిన మేర సాగునీరందక వేలాది ఎకరాల భూమి బీడుగా మారిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వలస జిల్లాగా పేరున్న పాలమూరును పాడిపంటలతో సస్యశ్యామలం చేసేందుకు కొత్త ప్రాజెక్టులు, కాల్వలు, చెరువుల దురస్తు, సమాంతర కాల్వల బ్రాంచ్ కెనాన్స్ మంజూరు చేయటంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చని పంటలే దర్శనమిస్తున్నాయన్నారు. పాలమూరులోని పారుతున్న జీవనది కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎక్కువ భూ భాగానికి సాగునీరు తీసుకువచ్చేందుకు జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి పాత కాల్వలకు తోడుగా కొత్తగా కాల్వలను తవి్వంచి వ్యవసాయాన్ని పండగలా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, అందుకే ఆయనకు నీళ్ల నిరంజన్రెడ్డి అనే పేరువచ్చిందన్నారు. 42 లక్షల మందికి ఆసరా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులు, వికలాంగులకు భరోసా ఇస్తుందని స్పీకర్ చెప్పారు. ఇందుకు ప్రతినెలా ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, సీఈఓ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, ఎస్పీ అపూర్వరావు, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సామ్యనాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు సాయిరెడ్డి, రంగారెడ్డి, సత్యం, రమేష్ కృష్ణయ్యగౌడ్, రాజు, పురుషోత్తం, చెన్నారం సర్పంచ్ రమే‹Ù, రేవల్లి ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ సభ్యుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇళ్లు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1,400 డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ఇప్పటికే దాదాపుగా మంజూరైన అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఖిల్లాఘనపురం మండలంలో 100 ఇళ్లకు గాను 67 ఇళ్లు పూర్తిచేయడంతోపాటు మరో 33 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుతన్నాయన్నారు. నియోజకవర్గానికి మరో వెయ్యి ఇళ్ల మంజూరుకు కృషిచేస్తామన్నారు. కర్నెతండాతోపాటు ఎత్తైన ప్రాంతాల్లోని బీడు భూములకు కర్నెతండా లిఫ్టు ద్వారా వచ్చే వానాకాలం నాటికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్టు మంజూరుకు సీఎంను కోరినట్లు మంత్రి చెప్పారు. -
అందరికీ ఆరాధ్యుడు సేవాలాల్ మహారాజ్
గన్ఫౌండ్రీ: సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. బంజారా భవన్, కొమురం భీమ్ భవన్లను నిర్మిస్తున్నట్లు, త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శంకర్ నాయక్, పార్లమెంటు సభ్యులు బీబీపాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్నాయక్, తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతు బాగుంటేనే దేశం బాగు
రాజేంద్రనగర్: దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు బిడ్డ కూడా రైతే కావాలని కోరుకునే రోజు రావాలన్నారు. రాజేంద్రనగర్లోని వాలంతరీలో సోమవారం జరిగిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం రైతులు తమ సంతానాన్ని రైతుగా చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రెండేళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి, నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రయోగశాలలోని ఫలితాలు వ్యవసాయ క్షేత్రాలకు చేరాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న రైతులు గ్రామాల్లో తిరుగుతూ సమగ్ర వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, వాలంతరీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టుకు అవార్డు.. సాక్షి దినపత్రిక జర్నలిస్టు పంతంగి రాంబాబుకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. రాంబాబు ‘సాక్షి’లో సాగుబడి శీర్షికపై వార్తలను అందిస్తున్నారు. అలాగే టీ న్యూస్లో చేను చెలక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యాసాగర్రెడ్డికి కూడా అవార్డు అందించారు. -
సీఎం దృష్టికి నిజాంసాగర్ రివర్స్ పంపింగ్
సాక్షి, నిజామాబాద్ : రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మొత్తం 2.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లా సాగునీటి పారుదల సలహాబోర్డు(డీఐఏబీ) నిర్ణయించింది. మొత్తం 20.08 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో బోర్డు సమావేశం జరిగింది. కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆకుల లలిత, జెడ్పీ చైర్పర్సన్లు దాదన్నగారి విఠల్రావు, దఫేదార్ శోభ, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, నీటి పారుదల, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, రామడుగు, కౌలాస్నాలా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే తేదీలు, తడులను ప్రకటించారు. నేను స్పీకర్గా ఈ సమావేశానికి రాలేదు. బాన్సువాడ ఎమ్మెల్యేగా హాజరయ్యాను. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ అతి తక్కువగా ఉంది. దీనిని దృష్టిలోఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటున్నాం. రైతులు సహకరించాలి. నిజాంసాగర్ ఆయకట్టు పరిస్థితిని సీఎం కేసీఆర్కు వివరించి రానున్న రోజుల్లో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. – స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శ్రీరాంసాగర్ ద్వారా 37,449 ఎకరాలకు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వల ద్వారా డిసెంబర్ 25 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆయకట్టుకు ఏడు తడుల్లో నీటిని అందిస్తారు. లక్ష్మి కాలువకు మూడు టీఎంసీలు, కాకతీయకు 0.7 టీఎంసీలు, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకానికి 0.8 టీఎంసీల కేటాయింపులు జరిపారు. మొత్తం 4.5 టీఎంసీల నీటిని 37,449 ఎకరాలకు విడుదల చేయాలనే నిర్ణయం జరిగింది. ‘గుత్ప, అలీసాగర్’ల ద్వారా ఎనిమిది తడులు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా ఈ నెల 26 నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం ఎనిమిది తడుల్లో నీటిని అందిస్తారు. అలీసాగర్కు 4.5 టీఎంసీల నీటిని 45వేల ఎకరాలకు, గుత్ప ఎత్తిపోతల ద్వారా 3.5 టీఎంసీల నీటిని 35వేల ఎకరాలకు అందించనున్నారు. తొలి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే.. నిజాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 3.99 టీఎంసీలే నీరున్నందున మొదటి నుంచి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే విడుదల చేయాలని నిర్ణయించింది. ఆరు తడులు.. ఆన్ఆఫ్ విధానంలో రోజుకు 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేయనున్నారు. 10 నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని ఆయకట్టుకు పంట చివరలో కేవలం రెండు తడుల్లో నీటిని ఇవ్వాలని భావిస్తున్నారు. రామడుగు ఆయకట్టుకు ఏడు తడులు రామడుగు ప్రాజెక్టులోని 0.74 టీఎంసీల నీటిని ఏడు తడుల్లో అందిస్తారు. డిసెంబర్ 26 నుంచి కాలువలకు నీటి విడుదల ప్రారంభమవుతుంది. పది రోజుల వ్యవధికి ఒక తడి చొప్పున విడుదల చేస్తారు. కౌలాస్నాలా ద్వారా ఆరుతడి పంటలకే.. కౌలాస్నాలా ఆయకట్టు కింద కేవలం ఆరుతడి పంటలకే సాగు నీటిని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 16 నుంచే నీటి విడుదల ప్రారంభమవుతుంది. ఐదు తడులు ఇవ్వనున్నారు. బీ–జోన్కే సాగునీళ్లిస్తామంటున్న అధికారులు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. పోచారం ప్రాజెక్టు 1.82 టీఎంసీల నీళ్లతో నిండుకుండలా ఉంది. సుమారు పది వేలకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చు. కానీ అధికారులు మాత్రం కేవలం బీ–జోన్ పరిధిలోని 3,500 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించగలమని తేల్చి చెప్పారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీ జోన్తో పాటు, ఏ జోన్ పరిధిలోని 7,500 ఎకరాలకు కూడా సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి పూర్తి ఆయకట్టుకు నీటిని అందించాలని ఆదేశించారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అలీసాగర్కు ఎగువ ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీటిని అందించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.రివర్స్ పంపింగ్ కోసం ఎస్సారెస్పీ నుంచి శివం కమిటీలో కేటాయించిన 2.78 టీఎంసీలను రిజర్వులో ఉంచుతాం. – మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి -
అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్ట సభల తరహాలోనే శాసనసభ కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం కమిటీ ప్రధాన విధి అని స్పీకర్ పేర్కొన్నారు. బుధ వారం అసెంబ్లీ ఆవరణలో 2019–20 సంవత్సరపు ప్రభు త్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) తొలి సమావేశం కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలను భారత కంపోŠట్రలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కమిటీ పరిశీ లిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందని శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అకౌంట్స్ విషయంలో అకౌంటెంట్ జనరల్ ఇచ్చే నివేదికల్లో లోటుపాట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. సమావేశంలో సభ్యులు విద్యాసాగర్రావు, ప్రకాశ్గౌడ్, అబ్రహం, శంకర్నాయక్, దామోదర్రెడ్డి, భాస్కర్రావు, పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణ్రావు, పురాణం సతీష్ పాల్గొన్నారు. హామీల అమలు బాధ్యత ఆ కమిటీదే.. శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే సందర్భంలో సీఎం, మంత్రులిచ్చే హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీపై ఉంటుందని మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో హామీల అమలు కమిటీ చైర్మన్ గంగాధర్గౌడ్ అధ్యక్షతన జరిగిన 2019–20 హామీల అమలు కమిటీ తొలి సమావేశంలో గుత్తా పాల్గొన్నారు. -
గనులు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మైనింగ్ రంగానికి ఉందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రగతిని గనులు నిర్దేశిస్తాయని అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (తెలంగాణ స్టేట్ సెంటర్) ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ ఆడిటోరియంలో ‘మైనింగ్– ప్రజెంట్ అండ్ ఫ్యూచర్–ఇన్వెస్టిమెంట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైనింగ్ ఇంజనీర్లు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు మూలం గనులేనని, వాటిని క్రమపద్ధతిలో వినియోగించుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనింగ్లో విప్లవాత్మక మార్పులు జరిగాయని, ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004–2013 మధ్య కాలంలో ఇసుకపై వచి్చన ఆదాయం రూ.13.66 కోట్లయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచి్చన ఆదాయం రూ.2,383 కోట్లని తెలిపారు. ప్రారంభోత్సవ సదస్సు అనంతరం సెషన్ల వారీగా వివిధ అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొన్న యువ ఇంజనీర్లను ఉద్దేశించి వక్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహముద్ అలీ, ఎఫ్ఐఈ ప్రెసిడెంట్ టీఎం గుణరాజా, చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వరరావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ బీఆర్వీఎస్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వారంలో జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్
సాక్షి, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. తన సొంతూరు పోచారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి ప్రభత్వం ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని, 15 వేల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని స్పీకర్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో 500 ఇళ్లు పూర్తిచేసి మరో 500 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు. పూర్తయిన ఇండ్లను త్వరలోనే సీఎం కేసీఆర్తో కలిసి ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే అలీసాగర్ రివర్స్ పంపింగ్.. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శ్రీరాం సాగర్లోకి రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు. అలాగే అలీసాగర్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా నిజాంసాగర్ 28 డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు తీసుకురావడానికి సుమారు రూ.150కోట్లతో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారన్నారు. నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న చందూర్, జాకోరాల్లో ఎత్తిపోతల పథకాలకు భూమిపూజ చేయడంతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తారాన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్ రాధ సాయిరెడ్డి, ఎంపీపీ నీరజారెడ్డి, జెడ్పీటీసీ పద్మా, ఎఎంసీ చైర్మన్ నందిని, పోచారం సురేందర్రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, మోహన్నాయక్, భాస్కర్, శ్రీనివాస్రెడ్డి, దేవేందర్రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు పోచారం గ్రామంలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసానికి బుధవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మర్యాద పూర్వకంగా వచ్చారు. దసరా పండుగ సందర్బంగా జమ్మిఆకులు(బంగారం) పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్ ఉన్నారు. -
మండలి చైర్మన్గా గుత్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం శాసన మండలి సమావేశం సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన గుత్తాను శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తల సాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి తదితరులు.. చైర్మన్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. గుత్తాకు మంత్రులతో పాటు అన్ని పారీ్టల శాసన మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం మండలి సమావేశం ప్రారంభమయ్యాక చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. నూతన చైర్మన్గా గుత్తా ఎన్నికైనట్లు ప్రకటించారు. హుందాగా ప్రవర్తిద్దాం: గుత్తా శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. సంకుచిత విమర్శలు, పరస్పర ఆరోపణల జోలికి పోకుండా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి మీద కీలక చర్చలు జరగాలని.. వర్తమాన పరిస్థితుల్లో్ల ఇది ఎంతో కీలకమన్నారు. తనను అత్యున్నత పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. అభినందనల వెల్లువ.. మండలి చైర్మన్గా ఎన్నికైన సుఖేందర్రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి మండలి చైర్మన్ దాకా నాలుగు దశాబ్దాల గుత్తా రాజకీయ ప్రస్తానాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్లు గుత్తాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, విప్లు కర్నె ప్రభాకర్, భానుప్రకాశ్రావు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, బీజేపీ సభ్యుడు రాంచందర్రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డి, ఉపాధ్యా య ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, నర్సింరెడ్డి, రఘోత్తంరెడ్డి చైర్మన్కు అభినందనలు తెలిపారు. 14కు మండలి వాయిదా... మండలి చైర్మన్ ఎన్నికపై ప్రకటన, సభ్యుల అభినందన ప్రసంగాలు పూర్తయిన తర్వాత.. సభను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. 14, 15 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వ సమాధానం కూడా ఉంటుందన్నారు. 16 నుంచి 21 వరకు మండలి సమావేశాలను వాయిదా వేసి, తిరిగి 22న నిర్వహిస్తామని బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం తరఫున సభ ముందుంచారు. మండలి సైడ్లైట్స్... ►గుత్తాను ఉద్దేశిస్తూ.. మీరు ఆజానుబాహులు, మీరు కూర్చోవడం ద్వారా మండలి చైర్మన్ కురీ్చకి హుందాతనం వచి్చందని హరీశ్రావు వ్యాఖ్యానించగా.. అవును మీరిద్దరు ఆజానుబాహులు.. పొగుడుకోవాల్సిందే అని కడియం అన్నారు. ►తాను చిట్యాలలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసిన కాలంలో గుత్తాను తొలిసారి చూశానని కర్నె ప్రభాకర్ పేర్కొనగా.. ఏం ఉద్యోగం చేశావో చెప్పు అని ఎమ్మెల్సీ నారదాసు రెట్టించడంతో.. ప్రైవేటు డెయిరీలో ఉద్యోగం చేశానని కర్నె అన్నారు. వార్డు సభ్యుడిగా.. జననం: 1954, ఫిబ్రవరి 02 జన్మస్థలం: నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం ఉరుమడ్ల విద్యార్హత: బీఎస్సీ పొలిటికల్ కెరీర్: ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981). ఠి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (1984). ఠి చిట్యాల సింగిల్ విండో చైర్మన్ (1991). ఠి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ చైర్మన్ (1992–99). ఠి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా డైరెక్టర్ (1998). ఠి నల్లగొండ లోక్సభ సభ్యులు (13, 15, 16 లోక్సభలో). ఠి తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ (2018–19). -
22 వరకు అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్, పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మొహర్రం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో పా టు, మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి హాజరు కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తర హాలో హైదరాబాద్లో ప్రత్యేక భవనం నిర్మించా లని భట్టి విక్రమార్క సూచించారు. నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవన సముదాయంలో నిర్మిస్తా మని కేసీఆర్ తెలిపారు. అక్టోబర్లో రెవెన్యూ బిల్ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు తెలి సింది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాలను 21 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా అనంతరం తిరిగి 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 22న ముగుస్తాయి. 14వ తేదీ మొదలు 22వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ చర్చించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ కొనసాగించి, 15న ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. 16న హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చిస్తుంది. 17న మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చిస్తారు. 19న పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన, వైద్య, ఆరోగ్య శాఖ పద్దులు, 20న కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ జరుగుతుంది. 21న పాలన, ప్రణాళిక, సమాచార శాఖ పద్దులు, సమావేశాల చివరి రోజు 22న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 14 నుంచి 22 వరకు పలు బిల్లులను కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 22న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఉగాండాలో జరిగే కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళతారు. నాలుగు రోజుల పాటు మండలి భేటీ.. ఈ నెల 11న శాసనమండలి స్పీకర్ ఎన్నిక తర్వాత శాసన మండలిని వాయిదా వేసి, తిరిగి 14, 15, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని శాసన మండలి బీఏసీ నిర్ణయించింది. పద్దుల మీద శాసన మండలిలో చర్చ జరగనందున కేవలం నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాన్స్టిస్ట్యూషనల్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు రాష్ట్రబడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బీఏసీ) సమావేశమైంది. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఈ నెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెపథ్యంలో అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక, టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సూచించినవిధంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ కాన్సిస్ట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈ నెల 14, 15 తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉంటుందని వెల్లడించారు. ఇక, శాసన మండలిలో ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్పై చర్చ జరగనుంది. 15వ తేదీన బడ్జెట్పై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న మండలికి సెలవు కాగా, 11వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. మళ్లీ 12, 13 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 14న బడ్జెట్పై చర్చ, 15న బడ్జెట్పై ప్రభుత్వ సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు మండలి సమావేశాలు జరగనున్నాయి. -
బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహిం చారు. స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్కు సంబంధించిన పలు అంశాలతోపాటు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా అధికారులు సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. మీడియా ప్రతినిధులకు పాస్ల జారీ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపైనా స్పీకర్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణతో పాటు పరిసరాల్లో చేపట్టిన బందోబస్తు వివరాలను పోలీసు అధికారులు స్పీకర్కు వివరించారు. సమావేశంలో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో పాటు, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన శాసనసభ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్ను స్పీకర్ ఈ సందర్భంగా అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రతిపాదన.. ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం కేసీఆర్.. శాసనసభలో స్వయంగా 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయగా, బడ్జెట్ సమావేశం ప్రారంభమయ్యేలోగా మంత్రిమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిలో బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారనే అంశంపై గోప్యత కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాననమండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జరిగే సమావేశాల్లో శాసనమండలిలో ఈటల రాజేందర్ మరోమారు బడ్జెట్ను ప్రవేశపెడతారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. -
నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...
గన్ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సత్యసంగీత ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు, తెలుగు మూవీ, ఆర్టిస్ట్స్ యూనియన్ సభ్యులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంచి ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారని, అందువల్లే తాను కూడా నిత్యం టీవీ సీరియళ్లు చూస్తున్నానని చెప్పారు. రాజకీయ నాయకులకు కొంత ఒత్తిడి ఉంటుందని, ఇటువంటి, సీరియళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి, సీనియర్ ఎన్టీఆర్ డూప్ భాస్కర్ ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ దేవర మల్లప్ప, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి.శివకుమార్, సినీ నటుడు రఘుబాబు, సీల్వెల్ కార్పొరేషన్ ఎండీ బండారు సుబ్బారావు, సత్యసంగీత ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు ఓంకార్ రాజ్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు ఎం.బి కృష్ణాయాదవ్, సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రపతి తరువాత చెక్పవర్ మీకే ఉంది’
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): గ్రామాలను హరితవనంగా, ఆరోగ్యంగా తీర్చి దిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై స్థానిక బీఎల్ఎన్ గార్డెన్లో గురువారం ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రపతి తరువాత సర్పంచ్ను మాత్రమే ప్రథమ పౌరుడు అంటారని, అలాగే రాష్ట్రపతి తరువాత సర్పంచ్కు మా త్రమే చెక్పవర్ ఉంటుందన్నారు. సర్పంచ్ పద వికి చట్టంలో అంత గౌరవం కల్పించారని అన్నా రు. ఆ గౌరవానికి వన్నె తెస్తూ గ్రామాల్లో సర్పం చులు గ్రామాల అభివృద్ధికి, పారిశుధ్య నిర్వహణకు, ఆరోగ్య గ్రామాలుగా తీర్చి దిద్దటానికి పాటు పడాలన్నారు. బాగా పని చేస్తే ఇదే రిజర్వేషన్లతో మళ్లీ ఎన్నికల్లో ప్రజలు వారినే ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్దేశించిన 30 రోజుల కార్యక్రమం ఎంతో ముందుచూపుతో గ్రామాల అభివృద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినదని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇందుకు గాను పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే నెల రోజుల కార్యక్రమంలో వార్షిక, పంచవర్ష ప్రణాళికల కార్యచరణతో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయంతో ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గ్రామాలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తారని, ఈ నిధులు జనాభా ప్రతిపాదికగా సరాసరి ఒక్కొక్కరిపై రూ.1,605 మంజూరవుతాయని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రతే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడుబడ్డ బావులను పూడ్చాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. చేసేది మంచి పని కాబట్టి అది ఎటువంటి పని అయినా సరే తలవంచాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమాలతో పాటుగా అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించాలని, వీలైతే వారితో కలిసి భోజనం చేయాలన్నారు. అలాగే సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సేంద్రియ ఎరువులతో చేస్తారని, అధిక రసాయన ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించే రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి స్థానంలో ఉందని, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. దీని మార్పు కోసం మనమంతా ఆలోచించాలని ఉద్బోధించారు. ఈ మార్పు ఇప్పుడే మొదలైందని, మున్ముందు మరింత అవగాహనతో మార్పు రావచ్చని అభిలాషించారు. చట్టం కఠినంగా ఉందని, 30 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై ఫ్లయింగ్ స్క్వార్డ్స్ పనితీరును పరిశీలిస్తాయన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పని చేయకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. అందరి సహకారంతోనే: కలెక్టర్ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని కలెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో నాలుగు స్థాయీ సంఘాలను గ్రామ సభల ద్వారా ఎన్నిక చేసుకోవాలని, వాటి ద్వారా స్మశాన వాటికలు, వీధి దీపాలు, హరితహారం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు ఆగకుండా మోరీలు శుభ్రం చేయాలని, చెత్తా చెదారం ఎక్కడ కూడా కనిపించవద్దన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని, కోతుల బెడదను తప్పించుకోవడానికి అడవుల్లో, గుట్టల్లో పండ్ల మొక్కలు నాటాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ దాదాన్న గారి విఠల్రావు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. సదస్సులో జిల్లా అటవీ అధికారి సునీల్, ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శన్, డీపీఓ జయసుధ, జెడ్పీ సీఈఓ గోవింద్, డీఆర్డీఓ రమేశ్ రాథోడ్, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు -
14 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను సెప్టెంబర్ 14న శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తారు. తిరిగి సోమవారం 16న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగి సెప్టెంబర్ 21న ముగిసే అవకాశం ఉంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందడం ఆలస్యమయ్యే పక్షంలో మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఉగాండా పర్యటనకు స్పీకర్ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉగాండా రాజధాని కంపాలాలో జరిగే కామన్వెల్త్ దేశాల 64వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వెళ్లనున్నారు. 53 కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్లు పాల్గొనే ఈ సదస్సు సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు జరగనుంది. సదస్సులో భాగంగా 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్పీకర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైనా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ఇంకా కొలిక్కిరావడం లేదు. సెప్టెంబర్ 23వ తేదీలోగా అసెంబ్లీ సమావేశాలు పూర్తికాని పక్షంలో స్పీకర్ ఉగాండా పర్యటన రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. -
గడ్కరీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి..వాటి నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు సహకరించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విఙ్ఞప్తి చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హన్మంత్ షిండేల బృందం గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా నిర్మాణం చేయాలని.. ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారని మంత్రికి తెలిపారు. అదేవిధంగా మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని కోరారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం, అటవీ భూముల మళ్లింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్ పలుమార్లు(ఆగస్ట్ 29, 2018, ఆగస్ట్ 1, 2019) కేంద్రానికి లేఖలు రాశారని టీఆర్ఎస్ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా... ‘హైదరాబాద్లోని గౌరెళ్లి వద్ద ఔటర్ రింగ్రోడ్ జంక్షన్- వలిగొండ- తొర్రూర్- నెల్లికుదురు- మహబూబాబాద్- ఇల్లందు- కొత్తగూడెం (30వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్) 234 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. మెదక్- ఎల్లారెడ్డి- రుద్రూరు 92 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేపట్టాలి. బోధన్-బాసర-బైంస 76 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మించాలి. మెదక్- సిద్దిపేట్- ఎల్కతుర్తి 133 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. చౌటుప్పల్- షాద్ నగర్- కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగంలోని ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్ వరకు.. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ ఉత్తర భాగంలోని ప్రాంతీయ వలయ రహదారిని కలపాలి. దీనిని ఇప్పటికే జాతీయ రహదారి 161ఎఎ గా గుర్తించారు. కానీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మొదలుపెట్టాలి. ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో 50 శాతం వ్యయం భరిస్తుందని, ఆటవి భూముల మళ్లింపు వంటి ఆంశాలను చేపడుతుంది’ అని టీఆర్ఎస్ నేతల బృందం లేఖలో పేర్కొన్నారు. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా సహకరించాలని కేంద్రమంత్రికి విఙ్ఞప్తి చేశారు. -
రాజకీయమంటే వ్యాపారం కాదు
సాక్షి, నస్రుల్లాబాద్: రాజకీయమంటే వ్యాపారం కాదని, రాజకీయ నాయకులు ప్రజా సేవే పరమార్థంగా పని చేయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. ప్రతి నాయకుడు ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని, స్వప్రయోజనాల కోసం ఆలోచించుకోవడం మానుకోవాలన్నారు. మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామంలో నిర్మించిన 31 డబుల్ బెడ్రూం ఇళ్లను సభాపతి పోచారం సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్య పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. కొంత మంది రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటున్నారని, అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రతి వ్యక్తికి తోడు, నీడ ఉండాలని.. తోడు మీరు(ప్రజలు) చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నీడను అందించాలన్న ఉద్దేశ్యంతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు గతంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలు ఇచ్చి పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఇప్పటికి 5 వేల ఇళ్లను కేటాయించామని, వీటిలో 2500 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని లబ్ధిదారులను ఎంపిక చేసి అందివ్వడమే మిగిలిందని చెప్పారు. జెడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, జెడ్పీటీసీ జన్నుబాయి, ఎంపీపీ విఠల్, జిల్లా కో–ఆప్షన్ మెంబర్ మాజీద్ ఖాన్, తహసీల్దార్ అర్చన, డీఎఫ్వో వసంత, వైస్ ఎంపిపి ప్రభాకర్రెడ్డి, ఎంపిటిసి మేని బాయి, మాజి ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, రాము, అయ్యన్న,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి శివారులోని సోమలింగేశ్వరాలయం దినదినాభివృద్ధి చెందుతూ దక్షిణ కాశీగా విరాజిల్లుతోందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో స్పీకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లంలో గల బసవేశ్వర మందిరం, వర్ని మండలంలోని బడాపహాడ్తో పాటు సోమలింగేశ్వరాలయంలో చేపట్టిన కల్యాణ మండపాల నిర్మాణాలు నిధులు లేక నిలిచి పోయాయని చెప్పారు. ఆ పనులు పూర్తి చేయాలని సంకల్పంతో రూ.27లక్షలు కేటాయించి నేడు పూర్తి చేశామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.1.10 కోట్లను కేటాయించామని చెప్పారు. పురావస్తు శాఖ అధ్వర్యంలో రూ.50 లక్షల నిధులతో ఆలయ ప్రాకారం పూర్తిగా సీసీ చేయించేలా నివేదికలను తయారు చేశామన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆలయ కమిటీ చైర్మన్ పోచారం సురేందర్రెడ్డికి సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదర్ శోభ, కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్ మెంబర్ మాజీద్ఖాన్, ఎంపీపీలు విఠల్, నీరజ, సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, నేతలు దివిటి శ్రీనివాస్, పెర్క శ్రీనివాస్, కిషోర్యాదవ్, ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అన్ని కులాలకు సంక్షేమ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఆనందకరమైన జీవితాన్ని అందించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరుస్తోందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్లో వివేకానంద విదేశీ విద్యాపథకం కింద ఎంపికైన విద్యార్థులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. విద్యార్థులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశాక, సభనుద్దేశించి ప్రసంగించారు. సరస్వతి ఉన్న దగ్గరే లక్ష్మి ఉంటుందని, సమా జంలో గౌరవం పొందే వ్యక్తులు విద్యావంతులు మాత్రమేనన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణ గడ్డపై నివసించే ప్రతీ వ్యక్తి సంతోషంగా జీవిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. బ్రాహ్మణ, జర్నలిస్టు, న్యాయవాదుల సంక్షేమానికి నిధులిచ్చిన ప్రభుత్వం మనదేనన్నారు. స్వచ్ఛ భారత్పై దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో సర్వే జరిగితే అందులో 6 తెలంగాణ జిల్లాలు ముందున్నాయన్నారు. పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని, పలు చట్టాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంద న్నారు. యాదాద్రి గుడిలో అద్భుతమైన కట్టడాలు జరుగుతున్నాయని, చరిత్రలో నిలిచి పోయే గుడి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వం పురోహితులకు ఆర్థిక సహాయం చేస్తుందని, అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులిస్తున్నామన్నారు. అనంతరం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి మాట్లాడుతూ వివేకానంద విద్యా పథకం కింద 54 మంది ఎంపికయ్యారని, వీరిలో అమెరికాకు 27 మంది, ఆస్ట్రేలియాకు 12, కెనడాకు 8, ఫ్రాన్స్కు ఒకరు, జర్మనీకి నలుగురు, యూకేకు ఇద్దరు వెళ్తున్నారన్నారు. వీరికి రూ.10.80 కోట్ల విలువైన మంజూరీ పత్రాలు ఇచ్చామన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా అమలయ్యే కార్యక్రమాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, వివిధ పథకాల కింద దరఖాస్తుకు సెప్టెంబర్ 20 వరకు అవకాశం ఉందన్నారు. విద్యాపథకం కింద లబ్ధిదారుకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు తక్కువగా వచ్చిన జిల్లాల నుంచి మరిన్ని స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మీ కాంతరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులతో స్పీకర్ వీడియో కాల్
బాన్సువాడ టౌన్: ఆసరా పింఛన్ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్ చెప్పారు. -
'అందరం కలిసికట్టుగా పనిచేస్తాం'
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీచైర్మన్గా దాదన్నగారి విఠల్, వైస్ చైర్మన్గా రజిత యాదవ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు స్వయంగా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సభను హుందాతనంగా నడిపించాలి. అందరూ పోటి పడీ పనిచేయాలని, అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటలు పాటు కరెంటు అమలవడం, ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని పోచారం పేర్కొన్నారు. 'స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని, దానికి తగ్గట్టే నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నార'ని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్సీ పునరుజ్జీవం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. 'నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని' నూతన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తెలిపారు.కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. -
ప్రపంచానికే తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. ప్రపంచంలోని 20 అత్యుత్తమ పథకాలలో రైతుబంధు, రైతుబీమాలను కూడా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల పట్ల కేసీఆర్ నిబద్ధత, చిత్తశుద్ధి మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సులో భాగంగా రెండో రోజు గురువారం హైటెక్స్లో జరిగిన విత్తన రైతుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు మాత్రమే కాకుండా కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రతి పథకమూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శనీయమన్నారు. రైతు చనిపోయిన వారం రోజులలో రూ.5 లక్షలు సాయం ఆ బాధిత కుటుంబానికి చేరడం మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ విత్తనరంగం గత ఐదేళ్లలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ మార్గదర్శనమే కారణమని ఆయనన్నారు. ఇస్టా సదస్సు మూలంగా భవిష్యత్లో ప్రపంచంలో ప్రముఖ స్థానానికి తెలంగాణ చేరుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. సమావేశంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డి, ఇస్టా అధ్యక్షులు క్రెగ్ మెక్ గ్రిల్, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. విత్తన పంట పండాలి : నిరంజన్రెడ్డి విత్తన ఉత్పత్తికి తెలంగాణలో శ్రేష్టమయిన వాతావరణం ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణలో విత్తనాల పంట పండాలని, ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలన్నారు. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. పెరిగిన ఆయకట్టు ప్రాంతాలలో రైతుల ఆదాయాలు కూడా పెరిగాయని, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిసి పనిచేయాలన్నారు. పంటల వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్)తో లాభాలు వస్తాయన్నారు. విత్తన పంటల సాగే దానికి ప్రత్యామ్నాయమని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంటలు సాగుచేయాలని నిరంజన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి అని, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు జరిగేవన్నారు. ఇప్పుడు కాలక్రమంలో ద్రాక్ష పంటలు కనుమరుగయ్యాయన్నారు. మహారాష్ట్ర ద్రాక్ష రైతులు మేలైన సాగు విధానాలు అవలంబిస్తూ విదేశాలకు ద్రాక్ష ఎగుమతులు చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతులు ద్రాక్ష సాగు తిరిగి చేపట్టి పూర్వవైభవం సాధించాలని కోరారు. విత్తన రైతులకు గుర్తింపుకార్డులు: పార్థసారథి విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ విత్తన రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోయే విత్తన పంట సబ్సిడీలు, ఇతర పథకాలలో గుర్తింపు కార్డులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. విత్తన రైతులకు సాంకేతిక శిక్షణ అందిస్తామన్నారు. నర్సరీ చట్టం ద్వారా కూరగాయ పంటలలో కల్తీకి అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. విత్తన వ్యాపారంలో కల్తీ పెరుగుతున్న నేప థ్యంలో విత్తనం ఎక్కడ పండించారు? ఆ భౌగోళిక ప్రాంతం, ఉత్పత్తిదారుని వివరాలతో కూడిన సమగ్ర సమాచారం విత్తన ప్యాకెట్లపై ఉండేలా బార్ కోడింగ్ విధానం అమల్లోకి రాబోతుందని తెలిపారు. రైతుబంధును అమలు చేస్తాం: కర్ణాటక వ్యవసాయమంత్రి తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైతులు డిమాండ్ను బట్టి పంటలను సాగుచేయాలని, సేంద్రియ తరహాలో పంటలను సాగుచేస్తే మార్కెట్లో ఆదరణ ఉంటుందని, ఎక్కువ ధర వస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అవసరం అయిన 65 శాతం విత్తనాలు అందిస్తుందని, విత్తన పంటల సాగులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేస్తాయని వెల్లడించారు. -
విత్తన ఎగుమతికి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతికి విస్తృత అవకాశాలున్నాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ వర్క్షాప్ను.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలసి ప్రారంభించారు. విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పోచారం వెల్లడించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధిక విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉందన్నారు. దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే చాన్స్: పార్థసారథి వివిధ దేశాల సాగు పరిస్థితులు, పంటల తీరును ఆకళింపు చేసుకుని విత్తనోత్పత్తి చేయాలని.. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఒకే రకమైన పంటలు సాగులో ఉన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు మంచి మార్కెట్ ఉందని, ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్ కేవలం 4.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. ఈ వాటాను పది శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఓఈసీడీ ద్వారా విత్తన ధ్రువీకరణ పొంది, ఎగుమతులు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు రాష్ట్రం నుంచి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలైన మయన్మార్, థాయ్లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశా ల్లో సాగయ్యే పత్తి విత్తనాలు.. తెలంగాణ నుంచి ఎగుమతి చేసే వీలుందని పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 7 శాతం కాగా, భారత్లో ఇది 17 శాతంగా ఉందని.. 2027 నాటికి జనాభా పెరుగుదలతో చైనాను భారత్ మించుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం విత్తనోత్పత్తి పెరగాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఇస్టా అధ్యక్షుడు క్రెయిగ్ మాక్గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి చికెలు బా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి 35 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చూస్తే.. ‘ఫ్లాట్’ అయిపోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హైదర్గూడలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నివాస సముదాయంలోని భవనాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచారి, ఎంపీ జోగినిపల్లి సంతోశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆదర్శ్నగర్, హైదర్గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో 2012లో కొత్తభవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నో ఆటంకాల అనంతరం పనులు పూర్తికావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి సహాయకులు, సిబ్బంది కోసం కొత్త నివాస గృహాలు అందుబాటులోకి వచ్చాయి. క్వార్టర్స్లో ఏర్పాటుచేసిన ఫర్నీచర్ కాంగ్రెస్, మజ్లీస్ సభ్యుల డుమ్మా! కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్లోని హైదర్గూడలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన భవన సముదాయం కొత్త నివాస సముదాయం హైలైట్స్ - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లతో మెయిన్ బ్లాక్ నిర్మించారు. మూడు సెల్లార్లు+గ్రౌండ్ ఫ్లోర్+12 ఫ్లోర్లతో ఈ బ్లాక్ సిద్ధమైంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు.. అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాట్లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, అతిథుల పడక గది, కామన్ టాయిలెట్, కార్యాలయ గది, లివింగ్ అండ్ డైనింగ్ రూం, వంట గది, స్టోర్రూంలు ఉన్నాయి. - మెయిన్ బ్లాక్లోని సెల్లార్లో 81, ఒకటో సబ్ సెల్లార్లో 94, రెండో సబ్ సెల్లార్లో 101 276 కార్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. - మెయిన్ బ్లాక్ గ్రౌండ్ఫ్లోర్లో ఎమ్మెల్యేల కోసం 150 చ.అడుగుల విస్తీర్ణంతో 23 క్యాబిన్లు, ఒక సెక్యూరిటీ రూం, 6 ప్యాసేజ్ లిఫ్టులు, 2 సర్వీసు లిఫ్టులు, 5 మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు. - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకుల (అటెం డెంట్ల) కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - సిబ్బంది కోసం 36 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - లక్షా 25 వేల 928 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, మౌలిక సదుపాయాల బ్లాక్ను నిర్మిం చారు. గ్రౌండ్ఫ్లోర్లో 4,128.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, కిచెన్తో కూడిన క్యాంటీన్, స్టోర్రూంల సదుపాయం ఉంది. తొలి అంతస్తులో 4,701 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి, రెండో అంతస్తులో ఇండోర్ గేమ్స్, మూడో అంతస్తులో గ్రంథాలయం/రీడింగ్ హాల్, వ్యాయామశాల, ఆడియో విజువల్ రూం, నాలుగో ఫ్లోర్లో బాంకెట్ హాల్ సదుపాయం కల్పించారు. - భవన సముదాయం అవసరాల కోసం 0.73 ఎంఎల్డీ నిల్వ సామర్థ్యంతో మంచినీటి సంపు నిర్మించారు. - 250 కేఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. -
సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయండి..
-
తెలంగాణలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్లో సీఎల్పీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్ను వీడిన 12మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్కు సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే వీరంతా అసెంబ్లీ కార్యదర్శిని కూడా కలవనున్నారు. కాగా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. వీరంతా అధికారికంగా టీఆర్ఎస్లో చేరనప్పటికీ వారు కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే పోడెం వీరయ్య కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సాంకేతికంగా 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే... అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టమే. మరోవైపు తాజా పరిణమాలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు మింగుడపడటం లేదు. సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న భట్టి విక్రమార్క.. పార్టీ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతకు ముందు ఈ ఎమ్మెల్యేలంతా ...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. -
జీ ‘హుజూర్’.. ఎవరో?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలసి హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వనున్నారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి గా ఉత్తమ్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సతీమణే వారసురాలా..? ఉత్తమ్ రాజీనామా అనివార్యం కావడంతో ఆ స్థానం ఏర్పాటైన నాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ వారసత్వం ఎవరికి వస్తుందన్నది నియోజకవర్గంలోనూ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. నియోజకవర్గవ్యాప్తంగా గట్టి కేడర్, అనుచరులున్న ఉత్తమ్ స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి అక్కడి నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు కూడా నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ బిజీగా ఉంటే నియోజకవర్గంలో ఆమె పర్యటించి ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తుంటారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని నేతలను ఆమె గుర్తుపట్టి పలకరించగలిగేంత సంబంధాలున్నాయి. అయితే, ఈ దఫా పోటీకి ఆమె ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తనకూ ఓ నియోజకవర్గం ఉన్నందున దాన్ని వదులుకుని భర్త ప్రాతినిధ్యం వహించిన స్థానానికి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనే ఆలోచనతో ఆమె పోటీకి నిరాకరిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి కోదాడలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయినా నల్లగొండ లోక్సభ ఎన్నికల్లో తన భర్తకు మంచి మెజార్టీ సాధించిపెట్టారు. హుజూర్నగర్ నుంచి ఆమె పోటీ చేయబోరని ఉత్తమ్ కుటుంబ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి ఎవరు..? ఉత్తమ్ పద్మావతి ఉప ఎన్నిక బరిలో లేకపోతే ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ నేతలకే చాన్సిస్తారా...లేక జిల్లాకు చెందిన బిగ్షాట్స్ను ఎవరినయినా తీసుకువస్తారా.. అన్నది ఇప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గంలో హాట్టాపిక్ అయింది. ఉత్తమ్ కూడా దీనిపై సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కొత్తవారిని బరిలో దింపాల్సి వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఆయన అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయం ఉన్నందున ఉత్తమ్కు ప్రత్యామ్నాయం ఎవరనే విషయం ఇంకా చర్చకు రాలేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్కు కంచుకోట కావడంతోపాటు టీపీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో పద్మావతి చివరకు పోటీకి ఒప్పుకుంటారా... ఉత్తమ్ వారసత్వాన్ని కొత్త నేతలు తీసుకుంటారా.. అన్నది ఉపఎన్నిక నోటిఫికేషన్ తర్వాతే తేలనుంది. -
పార్టీలను విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్లో ఎలా విలీ నం చేస్తారని, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయ పార్టీని అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లో ఎలా కలుపుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. భారత రాజ్యాంగంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం పార్టీల విలీన అధికారం స్పీకర్కు లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి శనివారం ఆయన ఓ లేఖ రాశారు. కాం గ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి వెళుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలతో ఓ సమావేశం నిర్వహించి కాం గ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు తీర్మానిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అలాంటి ప్రక్రియకు రాజ్యాంగం అనుమతి ఇవ్వదని లేఖలో పేర్కొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశాలు జరగడానికి వీల్లేదని తమ పార్టీ రాజ్యాంగం చెబుతోందని, అలాంటి వినతిపత్రాలు తమ దృష్టికి వస్తే ఈ లేఖను కేవియట్గా పరిగణనలోకి తీసుకుని తమకు నోటీసులివ్వడంతో పాటు పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. వారిని అనర్హులుగా ప్రకటించండి.. ‘దశాబ్దాల పాటు ప్రజాసేవలో ఉన్న మీరు స్పీకర్గా ఎన్నికయినప్పుడు ఎమ్మెల్యేలందరూ సంతోషించా రు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మిమ్మల్ని అభినందిం చాయి. మీరు అత్యున్నతమైన స్పీకర్ పదవికి మరిం త వన్నె తెస్తారని ఆశించాయి. దీనిలో భాగంగానే మీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీగా మేము కూడా సహకరించాం. కానీ, రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ, ప్రజాస్వామిక విరుద్ధమైన కొన్ని చర్యల పట్ల మీరు సరిగా స్పందించడం లేదనే భావన వెలిబుచ్చేందుకు నేను బాధపడుతున్నాను. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ టీడీపీ ఎమ్మెల్యే తాము టీఆర్ఎస్లో చేరుతున్నట్లు బహిరంగంగా చేసిన ప్రకటనలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. కాంగ్రెస్కి సంబంధించిన ఈ ఎమ్మెల్యేల ను అనర్హులుగా ప్రకటించాలని మేమిచ్చిన దరఖాస్తు లు మీ దగ్గర పెండింగ్లోనే ఉన్నాయి. ఎవరైనా సరే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ వారు కాంగ్రెస్ టికెట్ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను పరిరక్షించేందు కు గాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ ఎమ్మెల్యేలను మీరు అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నాం. అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉండగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి వాళ్ల పార్టీ బీఫారాలు తీసుకెళ్లడంతో పాటు సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వారంతా కలిసి ఓ సమా వేశం పెట్టుకుని సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని తీర్మానం చేస్తారని తెలుస్తోంది. అలాంటి సందర్భంలో మీరు కొన్ని విషయాలను పరిగణనలో కి తీసుకోవాలని కోరుతున్నాను. రాజ్యాంగం ప్రకా రం ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదు. టీపీసీసీ చీఫ్ అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశం నిర్వహించకూడదు. పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించండి. ఆ నిర్ణయం తీసుకునేంత వరకు వారి నుంచి ఎలాంటి దరఖాస్తులు, వినతిపత్రాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకా రం ఇతర పార్టీల్లో కలిసే అధికారాలు రాష్ట్ర శాఖలకు ఉండవు. ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయకూడదు. మీ సుదీర్ఘ రాజకీయ పయనంలో ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో కలపడం లేదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయ పార్టీని అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లో కలపడం లాంటివి మీరు చూసి ఉండరు. నా లేఖ ను కేవియట్గా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను. సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు, విలీ నం చేస్తున్నట్లు మీకు ఎలాంటి వినతి వచ్చినా మాకు ముందుగా నోటీసులివ్వండి. వాళ్లిచ్చే తీర్మా నం ఆధారంగా నిర్ణయం తీసుకునే అ«ధికారం కూడా మీకు లేదు. మీ దగ్గర పెండింగ్లో ఉన్న పిటిషన్ల ప్రకారం వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి’ అని ఉత్తమ్ స్పీకర్ని కోరారు. -
అత్యంత ఆనందకరం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమని సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యమున్న పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో మార్గం లేదని తీర్మానించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడటానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యమున్న పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాం. గతంలో రాష్ట్రంలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అనుకున్నది అనుకున్నట్లు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతుల తలరాత మార్చే అదృష్టం. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంలో కృషి చేసిన ఇంజనీర్లకు, టెక్నీషియన్లు, వర్కర్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి అభినందించారు. స్పీకర్ హర్షం... కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో పనులను పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. హరీశ్రావు హర్షం... కాళేశ్వరం వెట్ రన్ విజయవంతం కావడంతో కష్టపడిన ఇంజనీర్లకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
రాజకీయ తీవ్రవాదిగా మారిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజకీయ తీవ్రవాదిలా మారారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీ య ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆయన స్వయం గా రాజకీయ తీవ్రవాదిగా మారారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిశారు. అనంతరం గాంధీభవన్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. క్విడ్ప్రోకో కింద సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్లోకి వస్తే భూములు రెగ్యులరైజ్ చేస్తామని, ప్రాజె క్టులు, కాంట్రాక్టులు కట్టబెడతామని, ఆర్థిక సహ కారం అందిస్తామని హామీలిస్తూ ఎమ్మెల్యేలు పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఊరికే వదిలేది లేదని, వారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. ఇందు కోసం రెండు, మూడు రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడతామని, ఈ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వారిపై చర్యలు తీసుకోవాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆయన నివాసంలో కలిసి ఫిర్యాదు చేసినట్లు భట్టి వెల్లడించారు. గతంలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామని, ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు హరిప్రియ, ఉపేందర్రెడ్డి, లింగయ్య, సురేందర్లపై చర్యలు తీసుకుని వారి శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉన్నందున వెంటనే స్పీకర్ ఇందుకు ఉపక్రమించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆలిండియా కిసాన్ సెల్ వైస్చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ అనిల్, తెలంగాణ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు?
సాక్షి, బాన్సువాడ: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభపతి పోచారం శ్రీనివాస్రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మంగళవారం స్పీకర్ను బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్దమని వారు స్పీకర్కు వివరించారు. అనంతరం స్పీకర్ నివాసంలో భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..ఇంతకు ముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్రెడ్డి, జూలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్లో లేకపోవడం వల్ల బాన్సువాడకు వచ్చి కలిసినట్టు పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ను ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేస్తామంటూ.. ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారం అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడూ.. గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేసామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్టు తెలిపారు. డిస్ క్వాలిఫై నోటీసు ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలో ఓ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. -
అంబేడ్కర్కు అసెంబ్లీలో నివాళులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం గాంధీ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి భట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో భట్టి మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇదే దేశంలోని రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసుకుంటూ భవిష్యత్ భారత దేశాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులను కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యాంగంలోని ఫిరాయింపుల చట్టం ప్రకారం నడుచుకోవడం లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని అప హాస్యం చేసేలా పాలిస్తూ, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. విలువలకు తిలోదకాలిస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోండి రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, హర్షవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్లపై రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ బిల్లు ప్రకారం చర్యలు తీసుకోవాలని, వారి శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని పోచారంను కోరామని, ఆయన రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తమకు ఉందని భట్టి చెప్పారు. -
డిప్యూటీ స్పీకర్గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు భట్టి విక్రమార్క తదితరులు పద్మారావుగౌడ్ను స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేం దర్, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, సభ్యులు పద్మా దేవేందర్రెడ్డి, దానం నాగేందర్, కౌసర మోహినుద్దీన్, రాజాసింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ స్పీకర్ పోచారం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కొద్దిసేపు సభ ఆయనకు నివాళులు అర్పించింది. గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు... పద్మారావుగౌడ్ హైదరాబాద్ కార్పొరేటర్గా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన గతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో వివిధ కర్మాగారాలకు కార్మిక నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను డిప్యూటీ స్పీకర్గా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవం కాలేదు. అప్పుడు పోటీలో ఉండా ల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేము సహకరించాం. నేను డిప్యూటీ స్పీకర్గా పనిచేశాను. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఉప సభాపతిగా పనిచేసినా తర్వాత అనేక అవకాశాలు వస్తాయనడానికే ఇలా చెబుతున్నా. – మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత నిబద్ధతతో పనిచేశారు... గత ప్రభుత్వ హయాంలో నిబద్ధతతో పని చేసి పదవులకు అలంకారం తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈ పదవికీ వన్నె తెస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. – కేటీఆర్ ఆప్యాయత ఆయన చిరునామా... ఆయన ఏ హోదాలో ఉన్నా పజ్జన్నగా పిలుచుకునే వాళ్లం. ఆప్యాయతే ఆయన చిరునామా. అన్నారు. గతంలో ఎన్నో పదవులు అలంకరించి వికసించినట్లే ఇప్పుడూ పద్మంలా వికసిస్తారని విశ్వసిస్తున్నా. – హరీశ్రావు అండర్స్టాండింగ్తోనే అలా పోటీ చేశాం 2004 ఎన్నికల్లో నాపై పద్మారావు గెలిస్తే 2008 ఉప ఎన్నికల్లో నేను ఆయనపై గెలిచా. 2009లో సనత్నగర్ నుంచి ఇద్దరం పోటీ చేసి ఓడిపోయాం. 2014 ఎన్నికల్లో మేమిద్దరం అండర్స్టాండింగ్తోనే వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచాం. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నా పెళ్లి చేసింది ఆయనే... ఉద్యమ సమయంలో ఓయూలో ఉన్న మాకు పజ్జన్న వెన్నుదన్నుగా నిలిచారు. 2012లో నా పెళ్లి చేసింది ఆయనే. పెళ్లికి అత్తమామ ఒప్పుకోకపోతే పద్మారావు పెద్ద మనసుతో వారితో మాట్లాడి నా ప్రేమ వివాహానికి ఒప్పించారు. – బాల్క సుమన్ ఆయన ఉద్యమ నాయకుడు పద్మారావుగౌడ్తో గత 20 ఏళ్ల నుంచి నాకు ఉన్న అనుబంధం మరచిపోలేనిది. రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఆయన పదవి వదులుకొని 2001లో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావుగౌడ్. ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శం. పరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి సభ విజయవంతం అయ్యేలా ఆయన కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్ఎస్ విజయంలో ఆయన పాత్ర కీలకం. రాజధానిలో కల్లు దుకాణాలు మూసివేయొద్దం టూ సమైక్య రాష్ట్రంలో పోరాడారు. 2014లో పద్మారావు ఆబ్కారీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరం లో మళ్లీ కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. లక్షలాది ఈత, తాటి మొక్కలను ఆయన నాటిం చారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. – సీఎం కేసీఆర్ స్ఫూర్తివంతంగా సభను నిర్వహిస్తా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం కేసీఆర్తోపాటు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. శాసనసభకు గౌరవ ఉపసభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజ లకు ఉపయోగపడే చర్చలు జరగాలని ఆశిస్తు న్నా. ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా అభిప్రాయం. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. – పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్ -
‘పోచారం’ కొత్త సవారీ!
ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి.. తన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. పలుమార్లు మంత్రిగా పని చేసిన ఆయన.. ప్రస్తుత అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికయ్యారు. శుక్రవారం నుంచి జరగనున్న మొదటి బడ్జెట్ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. పలు శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మెప్పించిన పోచారం.. శాసనసభాపతిగానూ రాణిస్తారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: పంచెకట్టు.. దానికి తగ్గట్టుగా హుందాతనం.. అన్నింటికీ మించి ముక్కుసూటితత్వం ఆయన సొంతం. ఎ దిగిన కొద్దీ ఒదిగే గుణం ఆయనను స్పీకర్ స్థాయికి చేర్చింది. ఆయనే పోచారం శ్రీనివాస్రెడ్డి. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఆయన ఒక్కో మెట్టు ఎదుగు తూ వచ్చారు. పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభు త్వం తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాల ను విజయవంతంగా నిర్వహించి సీఎం మెప్పు పొందారు. సీఎం ఆయనను చాలాసార్లు ‘లక్ష్మీపుత్రుడు’ అని సంబోధించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్న పోచారం శ్రీ నివాస్రెడ్డి.. స్పీకర్గానూ అందని అభిమా నం సంపాదిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. కొత్త సవారీ.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నాలుగు ద శాబ్దాలుగా ఎన్నో పదవులను అలంకరించారు. తొలుత సింగిల్విండో చైర్మన్గా ప నిచేసిన పోచారం.. తొలిసారిగా 1994లో టీడీపీ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొంతకాలానికే మంత్రి అయ్యారు. 1999లోనూ ఆయన విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2004లో మాత్రమే ఆయన పరాజయాన్ని పొందా రు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తరుణంలో ఆయన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2011 లో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ సార«థ్యంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఆయన కీలకమైన వ్యవసా య శాఖ మంత్రిగా పనిచేశారు. రైతుల రుణమాఫీ నుంచి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాల అమలు కోసం ఆయన నిరంతరం శ్రమించారు. మంత్రిగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రా«ధాన్య కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో తనదైన ముద్రవేశారు. మొన్నటి ఎ న్నికల్లో గెలుపొందిన తరువాత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారంను సీఎం కేసీఆర్ స్పీకర్గా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఇంతకాలం మంత్రిగా వివిధ పోర్టుపోలియోలు నిర్వహించి శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పోచారం.. ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులకు, ప్రభుత్వానికి మధ్య ఇరుసుగా పనిచేయబోతున్నారు. స్పీకర్గా కొత్త పాత్ర పోషించనున్నారు. ‘ఆర్డర్ ఆర్డర్’ అంటూ సభను నియంత్రించనున్నారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. గత నెల 18న స్పీకర్ ఎన్నిక తరువాత గవర్నర్ ప్రసంగం, సభ్యుల ప్రసంగాలతో మూడు రోజులకే సభ ముగిసింది. అయితే శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తనకున్న అనుభవంతో స్పీకర్గా కూడా పోచారం సక్సెస్ అవుతారని ఆయన అనుచరులు అంటు న్నారు. రోజూ తన నియోజకవర్గంలో పర్యటించే పోచారం.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం కానున్నారు. -
రేపటి నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసన సభ, శాసన మండలి లో ప్రభుత్వం తాత్కాలిక (ఓటాన్ అకౌంట్) బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆదివారం బడ్జెట్పై చర్చ జరుగనుంది. సోమవారం ద్రవ్యవిని యోగ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. శాసన సభ, శాసన మండలి సమా వేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాం బర్లో జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మ న్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేము ల ప్రశాంత్రెడ్డి, ఎస్టీఎఫ్ డీజీ తేజ్దీప్కౌర్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, హైదరాబాద్ నగ ర పోలీస్ కమిషనర్ అంజనాకుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. పోచారం మాట్లాడుతూ... ‘శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25 వర కు జరుగుతాయి. మొత్తం 3 రోజులు సమావేశాలు సాగుతాయి. అందరి సహకారంతో శా సనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో భేటీకావడం ఆనవాయితీ అని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి అందరి సహకారం అవసరమని చెప్పా రు. శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రశాంత్రెడ్డి అన్నారు. -
ధైర్యంగా ఉండండి
బాన్సువాడ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పోచారం తల్లి పాపమ్మ (107) ఈనెల 5వ తేదీన కన్నుమూసిన విషయం విదితమే. పోచారంను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వచ్చారు. అక్కడి నుంచి వాహనంలో పోచారం గ్రామానికి వెళ్లి పాపమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంటపాటు ఆయన నివాసంలో ఉన్నారు. సీఎం వెంట ఎంపీ కవిత, మాజీ స్పీకర్ మ«ధుసూదనాచారి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చారు. ప్రముఖుల పరామర్శ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తదితరులు పోచారంను పరామర్శించారు. -
ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం లోటస్పాండ్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సుస్థిర వ్యవసాయంపై రాసిన వ్యాసా ల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ధాన్యం పండిందని తెలిపారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ రెండు పథకాలు ప్రపంచ గుర్తిం పు పొందాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో విదేశాల్లో ఉన్న యువకులు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. త్వరలో లక్షా 25 వేల ఎకరాల్లో రెండు పం టలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు. రమేశ్ ఈ పుస్తకంలో చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే పర్యావరణ సహకారం అవసరమని పుస్తక రచయిత చెన్నమనేని రమేష్ అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్కల్లం, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలు గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన అవససరం ఉందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో చైర్మన్ వి.స్వామిగౌడ్, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగమే మూలం. రాజ్యాంగాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి. ప్రకృతి, ఆర్థిక సంపదలకు మానవ వనరులు తోడయితే అద్భుతాలు సాధిం చొచ్చు. దేశంలో పేద, ధనికులు మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. 30% మంది దగ్గరే మొత్తం సంప ద కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అసమానతలను తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే పవిత్రమైన శాసన సభలోనూ రాజకీయాలు మాట్లాడితే అభాసుపాలవుతాం. నేరాలు తగ్గి శాంతిభద్రతలు పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’అన్నారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి, ఎన్.రాంచందర్రావు, ఆకుల లలిత, ఎం.ఎస్.శ్రీనివాస్రావు, బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, బోడికుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తరువాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
ఎమ్మెల్యే క్వార్టర్లను త్వరలోనే ప్రారంభిస్తాం
హైదరాబాద్: సకల వసతులతో నిర్మించిన కొత్త ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని హైదర్గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్ల సముదాయాన్ని సందర్శించారు. క్వార్టర్లలో సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత శాసనసభలో మొత్తం 120 మంది సభ్యులుగా ఉన్నారు. సభ్యులకు అన్ని వసతులతో నివాసాన్ని కల్పించాలని, ఇక్కడ ఉన్న పాత క్వార్టర్లను తొలగించి కొత్త నివాసాలను నిర్మించాం. మొత్తం 4.5 ఎకరాల్లో రూ.166 కోట్లతో 120 క్వార్టర్లను 12 అంతస్తులతో నిర్మాణం చేశాం. దీంతోపాటు 120 సర్వెంట్ క్వార్టర్లు, 36 స్టాఫ్ క్వార్టర్లను కూడా కట్టారు. ఇదే ప్రాంగణంలో క్లబ్ హౌస్, కార్యాలయం, సూపర్ మార్కెట్ కూడా నిర్మించారు. ప్రతి క్వార్టర్ 2,100 చదరపు అడుగులలో 3 బెడ్ రూంలతో ఉంది. 3 అంతస్తుల సెల్లార్లో 240 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో అతిథులతో సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు అందుబాటులో ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పూర్తయి ప్రారంభో త్సవానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తాం. అంతకంటే ముందు ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సూచనలకు అనుగుణంగా సభ్యులకు క్వార్టర్లను కేటాయిస్తాం’’అని స్పీకర్ వివరించారు. స్పీకర్ వెంట అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శాసనసభలో ప్రతి ఎమ్మెల్యేకు తప్ప కుండా మాట్లాడే అవకాశం ఉంటుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ నిబంధనలను అతిక్రమించి గాడితప్పి మాట్లాడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘అసెంబ్లీ సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్తోపాటు అన్ని పక్షాల నేతలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎటువంటి అహంకారం లేదు. మరింత బాధ్యత పెరిగింది. సభలో రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు అన్ని రంగాలపై క్లుప్తంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. భవిష్యత్లో సభ్యులందరు నాతో సహకరిస్తారని, హుందాగా వ్యవహరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ రోజుతో రెండో శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు అభినందనలు. ఇవాళ సభలో నాకు వచ్చిన పదవి వారసత్వంగా వచ్చింది కాదు. తెలంగాణ శాసనసభ గౌరవాన్ని పెంచుతా’ అని స్పీకర్ పోచారం అన్నారు. -
నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలిలో వేర్వేరుగా చర్చ కొనసాగుతుంది. ఉభయ సభలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అసెంబ్లీలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బలపరుస్తారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చర్చను కొనసాగిస్తారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అవకాశం ఇచ్చిన మేరకు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మాట్లాడతారు. చివరగా ప్రభుత్వం తరఫున సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రసంగించడంతో పాటు పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ను బిల్లు రూపంలో సభ ఆమోదానికి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలుపుతుంది. మండలిలో పల్లాతో మొదలు.. ఇటు శాసనమండలిలోనూ అదేరకంగా జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మొదలుపెడతారు. మరో ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని బలపరుస్తారు. తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు ప్రసంగిస్తారు. హోంమంత్రి మహమూద్ అలీ చివరగా ప్రభుత్వం తరుఫున ప్రసంగిస్తారు. మండలి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తుంది. తీర్మానం ఆమోదం అనంతరం రెండు సభలు నిరవధికంగా వాయిదా పడతాయి. పక్షపాతం లేకుండా సభ నిర్వహిస్తా: స్పీకర్ పోచారం శాసనసభను హుందాగా, పక్షపాతం లేకుండా, సజావుగా నడిపించే బాధ్యత తనపై ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సభ నియమ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీల సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనిస్తానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు సూచనలు, సలహాలను స్వీకరించి సభ సంప్రదాయాలను పాటిస్తామన్నారు. స్పీకర్ పోచారం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ, రాజ్యాంగ రచయిత అంబేడ్కర్లను స్పీకర్గా గౌరవించుకోవడం తనకు లభించిన అదృష్టమని అన్నారు. వచ్చే సమావేశాల్లోపు బీఏసీ... శాసనసభ నిర్వహణ వ్యవహారాలను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఏర్పాటుపై జాప్యం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు బీఏసీ ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎన్నికపై ఆ పార్టీ శనివారం సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్కు లేఖ ఇచ్చింది. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారమే ప్రమాణం చేశారు. బీఏసీలో ఉండాల్సిన వారిలో ఇద్దరు ఇంకా ప్రమాణం చేయకపోవడం, సీఎల్పీ నేతలపై శనివారం అధికారికంగా స్పష్టత రావడంతో బీఏసీ ఏర్పాటు కాలేదు. అయితే త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మండలి బీఏసీ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతైంది. దీంతో బీఏసీలో మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణాలతో శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరగలేదు. రాజాసింగ్ ప్రమాణం... బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ (గోషామహల్) శాసనసభలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో రాజాసింగ్తో ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఇటీవల అసెంబ్లీలోని కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఐఎంకు చెందిన అహ్మద్ఖాన్ స్పీకర్ స్థానం లో ఉన్నప్పుడు తాను ప్రమాణం చేయబోనని ప్రకటించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా బాధ్యతలు చేపట్టడంతో ప్రమాణం చేశారు. -
ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ను చేసినందుకు ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటానని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని రాజాసింగ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. -
సభ సజావుగా నడిపించే బాధ్యత నాపై ఉంది
-
నాకు దక్కిన అదృష్టం ఇది : పోచారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శనివారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ఒకరు(గాంధీ) దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు, మరొకరు(అంబేద్కర్) రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు. వాళ్లిద్దరినీ స్పీకర్ స్థానంలో ఉండి గౌరవించుకోవడం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. సభను హుందాగా, పక్షపాతం లేకుండా సజావుగా నడిపించే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. సభ నియమ, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే స్వేచ్ఛను ఇస్తానని, వారి సూచనలు స్వీకరించి సభా సంప్రదాయాలను పాటిస్తానని వ్యాఖ్యానించారు. ఇక మరి కొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా తెలంగాణ రెండో శాసన సభ స్పీకర్గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్ పదవికి శ్రీనివాస్రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పోచారం... 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. -
పోచారం ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్గా బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి శ్రీనివాస్రెడ్డి గురువారం ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమైంది. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ వెంటనే తొలిరోజు ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమం కొనసాగించారు. అనంతరం స్పీకర్ ఎన్నికను ప్రకటించారు. ‘తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పోచారం శ్రీనివాస్రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్ (టీఆర్ఎస్), వి.ఎం.అబ్రహం (టీఆర్ఎస్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ ఎస్), అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల(ఎంఐఎం), మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్) స్పీకర్ పదవికి శ్రీనివాస్రెడ్డిని ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యారు’ అని ప్రకటించారు. స్పీకర్గా శ్రీనివాస్రెడ్డిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. సభానాయకుడు, ఇతర పార్టీల నేతలు కలసి ఈ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ లేచి కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల వద్దకు వెళ్లి ఆహ్వానించారు. అలాగే పోచారం వద్దకు వెళ్లి చేతిలో చెయ్యి వేసి అభినందనపూర్వకంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని స్పీకర్ సీటు వద్దకు తోడ్కొని వెళ్లారు. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ ఒకవైపు, కేసీఆర్ సహా మిగిలిన పార్టీల నేతలు మరోవైపు ఉండగా పోచారం శ్రీనివాస్రెడ్డి ఉదయం 11.10 గంటలకు స్పీకర్ సీటులో కూర్చున్నారు. వెంటనే పోచారం సభా నిర్వహణ ప్రారంభించారు. స్పీకర్ ఎన్నికపై మాట్లాడాలని సభానాయకుడైన సీఎం కేసీఆర్కు సూచించారు. దీంతో కేసీఆర్, మంత్రి మహమూద్ అలీతోపాటు కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్లకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డికి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోనిఅంశాలను సృశిస్తూ మాట్లాడారు. తెలంగాణ శాసనసభకు ఆయన గుర్తింపు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఆయన చేసిన కృషిని అభినందించారు. ఏకగ్రీవానికి అందరూ ఒప్పుకోవడం హర్షణీయం: సీఎం కేసీఆర్ స్పీకర్గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరగానే అంగీకరించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డికి, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్కు, ఎంఐఎం అధినేత ఒవైసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు ఒప్పుకోవడం హర్షణీయం. పోచారం శ్రీనివాస్రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ మంత్రిగా పోచారం హయాంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ మంత్రిగా పోచారం అందించిన సేవలను నేను మరిచిపోలేను. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. పోచారం కాలుమోపిన వేళావిశేషం బాగుంది. అందుకే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయి. రైతు బంధు పథకాన్ని కాలియా అనే పేరుతో ఒడిశాలో ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలును పరిశీలిస్తున్నాయి’ అని కేసీఆర్ తెలిపారు. నా కేబినెట్లో ఆయన లేకపోవడం లోటే... ‘ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో సింగిల్ విండో చైర్మన్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నేను అప్పుడు ఇదే పదవిలో ఉన్నాను. బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అందుకే పోచారం శ్రీనివాస్రెడ్డి లక్ష్మీపుత్రుడని మేము పిలుచుకుంటాం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్రెడ్డి రాజ్యాంగ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడంపై ఆయన సొంత ఊరు పోచారంవాసులు సంబురాలు చేసుకున్నారు. నా కేబినెట్లో ఆయన లేకపోవడం ఒక విధంగా లోటే. పోచారం స్థానంలో సమర్థుడికి బాధ్యతలు అప్పగిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ పోచారం పోరాడారు. పోచారం శ్రీనివాస్రెడ్డికి... నిజాంసాగర్ ఆయకట్టుకు అవినాభవ సంబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ఆయకట్టు తగ్గింది. వంద ఎకరాలు ఉన్న పోచారం ఉమ్మడి కుటుంబ పొలం ఇలాగే తగ్గింది. పోచారం శ్రీనివాస్రెడ్డిదీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. ఆ కుటుంబానికి పెద్దగా శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ఇప్పుడు రాజ్యంగపరంగా పెద్దదైన సభాపతి పదవిని శాసనసభ పెద్దగా నిర్వహిస్తారు. శ్రీనివాస్రెడ్డికి వివాదరహితుడిగా పేరుంది. భగవంతుడు ఆయనకు పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమకారుడికి దక్కిన గౌరవమిది: హరీశ్రావు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే పోచారం మనస్వత్వం గొప్పదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కితాబివ్వగా వ్యవసాయ మంత్రిగా శ్రీనివాస్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన ఈ సభలోనే తెలంగాణ ఉద్యమకారుడు స్పీకర్ కావడం, శ్రీనివాస్రెడ్డి స్పీకర్ స్థానంలో కూర్చోవడం ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యానించారు. హోంమంత్రి మొహమద్ అలీ, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎం. పద్మాదేవేందర్రెడ్డి, వి. శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, నోములు నర్సింహయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గాదరి కిశోర్ కుమార్, బిగాల గణేష్గుప్తా, పువ్వాడ అజయ్ కుమార్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, డి.ఎస్. రెడ్యానాయక్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. జీవన్రెడ్డి, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల సైతం స్పీకర్కు అభినందనలు తెలుపుతూ మాట్లాడారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తా: స్పీకర్ పోచారం తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్గా తనను ఎన్నుకున్నందుకు శాసనసభ్యులకు పోచారం శ్రీనివాస్రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘శాసనసభాపతి పదవి అత్యంత కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తా. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తా. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా (ఎమ్మెల్యేలు) సహకరిస్తారని ఆశిస్తున్నా. అందరం కలసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. వ్యవసాయ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు’ అని పోచారం పేర్కొన్నారు. పోచారం చతురత... స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని అభినందించే క్రమంలో కాంగ్రెస్ సభ్యుడు జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి) చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే క్రమంలో పోచారం సభ్యులందరినీ నవ్వించారు. జాజుల సురేందర్ మాట్లాడుతూ ‘పోచారం శ్రీనివాస్రెడ్డి నాకు తండ్రిలాంటి వారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో స్ఫూర్తిగా నిలిచారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు సహకరించారు’ అని అన్నారు. దీనిపై పోచారం ఒకింత వివరణ ఇస్తూ అందరినీ నవ్వించారు. ‘జాజుల సురేందర్, నేను టీడీపీలో కలసి పని చేశాం. సురేందర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయనకు టికెట్ వచ్చేలా నేను ప్రయత్నించా. మా ఇద్దరిదీ తండ్రీకొడకుల బంధం అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో ఆయన అలా అన్నారు. అంతేగానీ ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి నా సహకారం ఉందని కాదు’ అని అనడంతో సభ్యులందరూ నవ్వారు. -
స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన పోచారం
-
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక
-
వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం బాగా పనిచేశారు
-
స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ శుక్రవారం సభలో అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే పోచారం స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. పోచారంకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి, ఈటల రాజేందర్లు.. ఆయనను స్పీకర్ స్థానం వరకు తీసుకుని వెళ్లారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారందరికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గురువారం స్పీకర్ పదవికి పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. లక్ష్మీపుత్రుడని పిలుస్తాను.. పోచారం స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు. పోచారం అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పలు మంత్రి పదవులు చేపట్టారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నకాలంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెందింది. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రైతు బంధు పథకం ప్రారంభమైంది. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది.. కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయి. శ్రీనివాస్రెడ్డి తనకు పెద్ద అన్న లాంటివాడని, ఆయనను లక్ష్మీపుత్రుడని పిలుస్తాన’ని కేసీఆర్ తెలిపారు. ఊరిపేరే ఇంటి పేరుగా... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ వివరాలు... పూర్తి పేరు: పరిగె శ్రీనివాస్రెడ్డి తల్లిదండ్రులు: పరిగె పాపవ్వ, రాజిరెడ్డి భార్య: పుష్ప సంతానం: ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె -
కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ
-
స్పీకర్గా పోచారమే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పోచారం ఎన్నికపై అసెంబ్లీ సచివాలయం శుక్రవారం అధికారిక ప్రకటన చేయనుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. దీంతో గురువారం పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. పోచారం తరఫున ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం సీనియర్ నేత అహ్మద్ బలాల, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, రేఖానాయక్ సైతం పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యుల వద్ద నామినేషన్ దాఖలు ప్రక్రియ జరిగింది. శాసనసభ స్పీకర్గా పోచారం ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించ నున్నారు. అనంతరం సీఎం కేసీఆర్తోపాటు మిగిలిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలసి పోచారం శ్రీనివాస్రెడ్డిని స్పీకర్ స్థానంలో కూర్చో బెడతారు. అనంతరం స్పీకర్గా పోచారం అధ్యక్షతన శాసనసభ వ్యవహారాలు కొనసాగుతాయి. శాసనసభ ముగిశాక స్పీకర్ అధ్యక్షతన శాసనసభ నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఊరిపేరే ఇంటి పేరుగా... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. కుటుంబ వివరాలు... పూర్తి పేరు: పరిగె శ్రీనివాస్రెడ్డి తల్లిదండ్రులు: పరిగె పాపవ్వ, రాజిరెడ్డి భార్య: పుష్ప సంతానం: ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె -
టీఆర్ఎస్ స్పీకర్ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్గా టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. స్పీకర్ అభ్యర్థిగా పోచారం దాఖలు చేసిన నామినేషన్ల సెట్పై కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంతకం చేశారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరుతూ బుధవారం రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడగా, గురువారం మధ్యా హ్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలోని కాం గ్రెస్ పార్టీ చాంబర్కు వెళ్లి మద్దతు కోరారు. స్పీకర్గా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదిస్తున్నామని, దీనికి మద్దతు తెలపాలని కోరారు. దీంతో ఉత్తమ్ సూచన మేరకు కాంగ్రెస్ తరఫున స్పీకర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భట్టి హాజరై నామినేషన్ల సెట్పై సంతకం చేశారు. అంతకు ముందు జరిగిన సీఎల్పీభేటీలోనూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి స్పీకర్ ఎన్నిక అంశాన్ని ప్రస్తావించగా, తనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మద్దతు అడిగినట్టు ఉత్తమ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించవద్దని, టీఆర్ఎస్ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతివ్వాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. -
శాసనసభాపతిగా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి ఎన్నిక కోసం గురువారం నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా.. గడువు ముగిసేసమయానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. పోచారం శ్రీనివాస్రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన తెలంగాణ రెండో స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాస్ రెడ్డికి స్పీకర్ పదవి రావడంతో బాన్సువాడలో సంబరాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఉదయం పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. స్పీకర్గా పోచారానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. గురువారం ఉదయమే పోచారం పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలపడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనిపై చర్చించడానికి ఉదయం అసెంబ్లీలో కేసీఆర్తో పోచారం భేటీ అయ్యారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. -
స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన పోచారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పదవికి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. స్పీకర్గా పోచారంకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో శాసనసభపతిగా పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఉదయం పోచారం పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలపడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనిపై చర్చించడానికి ఉదయం అసెంబ్లీలో కేసీఆర్తో పోచారం భేటీ అయ్యారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. -
శాసనసభ స్పీకర్గా పోచారం!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని శాసనసభ స్పీకర్గా నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్రెడ్డికి ఉన్న అనుభవం శాసనసభ నిర్వహణకు బాగా ఉపయోగపడుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆంగ్లంపై శ్రీనివాస్రెడ్డికి పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. శ్రీనివాస్రెడ్డిని ఉన్నతమైన పదవిలో నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రోజు దగ్గర పడుతుండటంతో కొత్త స్పీకర్ ఎన్నికపై కేసీఆర్ దృష్టి సారించారు. స్పీకర్ పదవి కోసం పోచారంతో పాటు మరో నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మహిళలకు ఈ పదవిని ఇవ్వాలని భావిస్తే మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్రెడ్డి, బీసీ వర్గాలకు అయితే ఈటల రాజేందర్, ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ వర్గం నుంచి డి.ఎస్. రెడ్యానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపుతున్నారని, చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప శ్రీనివాస్రెడ్డి నియామకం ఖాయమేనని టీఆర్ఎస్ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలిక స్పీకర్ నియామకం ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ను తాత్కాలిక స్పీకర్గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ముంతాజ్ఖాన్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంగళవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహచార్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
రూ.వేల కోట్లతో బాన్సువాడ అభివృద్ధి : పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడ: ‘గత నాలుగున్నరేళ్లలో రూ.వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.., వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్లో ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా పనులు చేయిస్తున్నా.. నిరుపేదలందరికీ వచ్చే ఏడాదిలోగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తా.. సీసీ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రులు ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తా..’ అని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. నియోజకవర్గంలో తాగు, సాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, విద్య, ఉపాధి రంగాల ను మెరుగు పర్చాం. రూ.230 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉచితంగా అందిస్తున్నాం. పారిశ్రా మికాభివృద్ధికి సీఎం కేసీఆర్, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బాలానగర్–మెదక్–బాన్సువాడ–బోధన్–భైంసా వరకు జాతీయ ర«హదారిని మంజూరు చేయించారు. ఇప్పటికే మెద క్ వరకు రూ.500 కోట్లతో రహదారిని విస్తరిస్తు న్నారు. మెదక్ నుంచి రుద్రూర్ వరకు మరో రూ. 600 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తాం. రూ.266 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, రూ.273 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు వేయించాం. నేడు బాన్సు వాడ నుంచి అన్ని మండలాలకు డబుల్ రోడ్లు వేశాం. ఇంటర్, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి రూ. 5.84 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల కోసం రూ.2.77 కోట్లు, రుద్రూర్లో ఫుడ్ టెక్నాలజి కళాశాల కోసం రూ.14 కోట్లు మంజూ రు చేసి నిర్మించాం. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.11.9 కోట్లు, మిషన్ కాకతీయ ద్వారా 65 చెరువుల ఆ«ధునీకరణకు రూ.93.4 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల కోసం రూ.14.5 కోట్లు మంజూ రు చేశాం. నిజాంసాగర్ కాలువ ఆధునీకరణ కోసం రూ.30 కోట్లు, హార్టికల్చర్ కోసం రూ.5.01 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ పనుల కోసం రూ.99.66 కోట్లు, వ్యవసాయ రంగాభివృద్ధికి రూ.11 కోట్లు, గోదాంల నిర్మాణాలకు రూ.10 కోట్లు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు రూ.16 కోట్లు మంజూరు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రులు నిర్మాణాలకు రూ.30 కోట్లు, బాన్సువాడలో వంద పడకల ప్రసూతి ఆస్పత్రి నిర్మాణానికి రూ.17 కోట్లు, పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మం జూరు చేశాం. కొల్లూరు వంతెన నిర్మాణానికి రూ. 2 కోట్లు, బీర్కూర్ శివారులో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.13 కోట్లు మంజూరు చేయించి, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నాం. మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలకు రూ.10కోట్ల వరకు మంజూరు చేయించాం. -
వైఎస్సార్ తర్వాత కేసీఆరే : పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడ టౌన్(బాన్సువాడ): సంక్షేమ పథకా లు అమలు చేయడంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర్రెడ్డి తర్వాత ఆపద్ధర్మ సీఎం కేసీఆరే అని బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు తజ్ముల్ బాన్సువాడలో పోచారంను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో వైఎస్ తర్వాత కేసీఆర్ ముందుంటారని అన్నారు. రైతులకు మేలు చేసిన వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నట్లు ఆయన అన్నారు. టీఆర్ఎస్కు వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వర్ని మండలంలో ఏ సమస్యలున్నా తజ్ముల్కు చెప్పాలని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారిస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పోచారం రవీందర్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బద్యనాయక్ తదితరులు ఉన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కొండని అంజయ్య శ్రీనివాస్రెడ్డికి, టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు తెలిపారు. అలాగే మండలంలోని రాంపూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. -
‘కాళేశ్వరం’తో సస్యశ్యామలం చేస్తాం: పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడరూరల్: టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే గట్టుమీది గ్రామాలకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి బీడుభూములను సస్యశ్యామలం చేస్తామని బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన బాన్సువాడ మండలంలోని బోర్లం, బోర్లంక్యాంపు, తండా, జక్కల్దాని తండా, పులిగుండు తండా, హన్మాజీపేట్, కాద్లాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తె లంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందాయన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పోతు న్నాడని, అందుకే కేసీఆర్ను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నాడన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం మరింత అ భివృద్ధి సాధించాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పో చారం భాస్కర్రెడ్డి, బద్యానాయక్, అంజిరెడ్డి, మోహన్నాయక్, సంగ్రాంనాయక్, ఎజాస్, శ్రీనివాస్రెడ్డి, నర్సింలు, బాల్సింగ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి బాటలో.. బాన్సువాడ
సాక్ష, బాన్సువాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా వేగం పుంజుకుంది. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి బాగా కలిసొచ్చింది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన నేతల్లో ఒకరైన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖ దక్కింది. మంత్రిగా ఆయన నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సా గించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్ కష్టాలు తొలగిపోయేలా రూ.16 కోట్లు వెచ్చించి విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించారు. సుమారు రూ.540 కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ, పంచాయతీరోడ్ల కోసం మంజూరు చేయించారు. నియోజకవర్గంలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. మిషన్ కాకతీయ కింద రూ. 93 కోట్లతో నియోజకవర్గంలోని వందల చెరువులలో పునరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు బాన్సువాడలో వంద పడకల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేయించారు. నియోజవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ కోసం రూ.30 కోట్లు కేటాయించారు. నియోజవర్గంలోని కొల్లూర్ వంతెన నిర్మాణం కోసం రూ.2కోట్లతో పాటు పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 వేల డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చి రూ.25 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. అమలవుతున్న పథకాలు డబుల్ బెడ్రూం ఇళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు, రైతు బీమా, కేసీఆర్ కిట్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు పనిముట్లు, వాహనాల పంపిణీ, యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్ల పంపిణీ ప్రధాన సమస్యలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. స్థానికంగా భారీ పరిశ్రమలు లేవు. వర్ని నుంచి బడాపహాడ్ రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డును నిర్మించాల్సి ఉంది. రూ.10 కోట్లతో నిర్మించిన చందూర్ డీ–ఫ్లోరైడ్ పథకం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. మేజర్ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కోటగిరి, బీర్కూర్ మండల కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మాణం చేపట్టలేదు. కొల్లూరు, హెగ్డోలి, సుంకినీ గ్రామాల్లో రూ.6 కోట్లతో నిర్మించి ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ చేయాల్సి ఉంది. గ్రామాల్లో శ్మాశాన వాటికల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. బీర్కూర్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేదు. చేపట్టిన అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్లు బాన్సువాడ నియోజకవర్గంలో వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 3 వేల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే భైరాపూర్లో ఇళ్ల నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ఇంటింటికీ నీరు ఇచ్చే మిషన్ భగీరథ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇక, రూ.266 కోట్లతో ఆర్అండ్బీ, రూ.273 కోట్ల వ్యయంతో పంచాయతీరోడ్లు నిర్మించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గంలో వివిధ పనులు చేపట్టారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.11 కోట్లు కేటాయించారు. అలాగే, నిజాంసాగర్కాలువల ఆధునికీకరణ కోసం రూ.30కోట్లు మంజూరు చేయించారు. రూ.25 కోట్ల వ్యయంతో ఫుడ్టెక్నాలజీతో పాటు వివిధ కళాశాలలు ఏర్పాటు చేయించారు. లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.14.5 కోట్లు, ఆర్డబ్ల్యూ ఎస్ పనుల కోసం రూ.99.66 కోట్లు, వైద్యారోగ్య శాఖ ఆస్పత్రుల నిర్మాణంకోసం రూ.30 కోట్లు కేటాయించారు. మొత్తం ఓటర్లు 1,73,230 పురుషులు 83,578 మహిళలు 89,638 ఇతరులు 14 ప్రస్తుత పోలింగ్ కేంద్రాలు 223 సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్ మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పోచారం శ్రీనివాస్రెడ్డికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించింది. 2011లో టీఆర్ఎస్లో చేరిన పోచారం ఆ తర్వాత జరిగిన 2011, 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి 2014 వరకు ఆరు సార్లు ఎన్నికలు జరుగగా, 2009 మినహా ఐదుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఎంతో రాజకీయ అనుభవమున్న శ్రీనివాస్రెడ్డికి ఉమ్మడి జిల్లాలో మంచి పట్టుంది. ప్రస్తుతం ఏడోసారి ఎన్నికల బరిలోకి దిగిన పోచారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2014 పోల్గ్రాఫ్ పోచారం శ్రీనివాస్రెడ్డి 65,868 కాసుల బాల్రాజ్ 41,938 మెజారిటీ 23,930 పోలైన ఓట్లు 1,38,854 మొత్తం ఓట్లు 1,79,416 -
అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానం: పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బీర్కూర్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి దీవించారు. బీర్కూర్లో పలు కాలనీలు తిరుగుతు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని గాంధీచౌక్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డప్పు చప్పుల్లతో ప్రచారం నిర్వహించారు. బీర్కూర్ గ్రామ శివారు నుంచి కార్యకర్తలు బైక్లతో స్వాగతం పలిగారు. తిమ్మాపూర్, బీర్కూర్ గ్రామాల్లోని ఆలయాల్లో పోచారం పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు మహిళలతో కలసి కోలాటం ఆడారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కోటగిరి: టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణా సాధ్యమవుతుందని రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బస్వాపూర్, నాగేంద్రపురం, కొత్తపల్లి, కొత్తపల్లితండాల్లో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పోచారం ప్రచారరథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగేంద్రపురంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను సందర్శించిన పోచారం ప్రజలతో మాట్లాడారు. చిన్నారిని చంకలో ఎత్తుకొని ఆడించారు. బీర్కూర్ : మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప స్వాములకు దేశాయ్పేట్ సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు. -
ప్రజలు మా పక్షమే
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ.. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు రూ. 35 వేలు ఖర్చు చేస్తున్నాం. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశాం. పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ను కళకళలాడిస్తాం. ప్రజలు మా పక్షానే ఉన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి ఎన్నికల కోసమే ఏకమైన మహా కూటమికి పరాభవం తప్పదు బాన్సువాడ: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు స్వ చ్ఛందంగా తండోపతండాలుగా విచ్చేసి ఆశీర్వదించారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారని, సంక్షేమ పథకాల్లో దేశంలోనే ఫస్ట్ ఉన్న తమను మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 41ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి సంక్షేమ పథకాలు చూడలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. సమైక్యాంధ్రలో రోడ్ల అభివృద్ధికి మొత్తం 23 జిల్లా రాష్ట్రానికి సంవత్సరానికి రూ. 300 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో ఒక్క బాన్సువా డ నియోజకవర్గానికే రూ. 300 కోట్లతో రోడ్లను మంజూరు చేశారని, ఇదే అభివృద్ధికి నిదర్శనమ ని పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏటా 8,000ను ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుం చి దీనిని రూ. 10వేలకు పెంచుతామని పేర్కొన్నారు. వచ్చే ప్రభుత్వంలో లక్ష రూపాయల వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామన్నారు. పెన్షన్ను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మంది ప్రజలకు రూ. 5,600 కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 36 సంక్షేమ పథకాలకు రూ. 42 వేల కోట్లు కేటాయించామన్నారు. నాయకుడనేవాడు ప్రజల కోసం పని చేయాలని, వారికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలని, ప్రజలకు నచ్చిన పనులు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు. దొంగల కూటమి.. మహాకూటమికి సిద్ధాంతాలు లేవని, ముఖ్యమంత్రిగా ఎవరుంటారో తెలియదని, మొత్తానికి అది దొంగల కూటమిగా మారిందని, దోచుకోదాచుకో అనేదే వారి సిద్ధాంతమని పోచారం విమర్శించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణాలో జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని, డిసెంబర్ 7న టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండని అనుకుంటున్నారన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించనవే కాకుండా పొందుపర్చని పథకాలను కూడా అమలు చేశామన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులను కేసీఆర్ చేసి చూపారని, ముందస్తుగానే పనులు చేసి ఓట్లడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలను మరోసారి ఓటు వేయమని అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్కే ఉందన్నారు. తెలంగాణను అడ్డుకున్న పార్టీతో పొత్తా.. హామీలు ఇచ్చి అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ది అని పోచారం విమర్శించారు. ఏ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమైందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏ సిద్ధాంతమో కోదండరాం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదని మొండిగా అడ్డం పడింది చంద్రబాబు అని, అలాంటి నాయకుని పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఆదర్శ పథకాలు రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రితో కలిసి తాను అనేక పథకాలను ప్రవేశపెట్టానని, వాటిలో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలోని 20 పథకాల్లో గుర్తింపు పొందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పోచారం అన్నారు. రాష్ట్రంలో లక్షలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఇవి పూర్తయితే రైతులకు రూ. వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామన్నారు. దేశంలోనే తెలంగాణలోని రైతులు ధనికులుగా ఉండాలనేదే తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రైతురాజ్యం, రైతు సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో రైతులకు జరిగిన మేలును గుర్తించి ముఖ్యమంత్రి తనను లక్ష్మీపుత్రుడిగా పిలుస్తున్నారన్నారు. వచ్చే ప్రభుత్వంలో మళ్లీ వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్ శాఖకు మంత్రిగా ఉంటారని కేసీఆర్ అన్నారని, ఇది తనకు ఇచ్చిన గుర్తింపునకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి దన్ను.. రాష్ట్ర జనాభాలో 70 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం భారీగా నిధులను కేటాయించామని పోచారం పేర్కొన్నారు. రూ. లక్షాయాభై వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు ఏడాదికి రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు ఏడాదికి రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్లోకి నీటిని మళ్లిస్తామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పంటలకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. గుంట పంట కూడా ఎండకుండా సింగూరు నుంచి నీటిని తీసుకువచ్చామన్నారు. ప్రజల సంక్షేమం కోసం... ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తుండడంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పోచారం అన్నారు. ప్రతి గ్రామంలో సగటున 600 ఓటర్లు ఉండగా, వారిలో 90 శాతం మంది ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందిన వారేనన్నారు. ఒక్కొక్కరు 3, 4 రకాల పథకాలను కూడా పొందినట్లు తాను చేసిన సర్వేలో వెల్లడైందన్నారు. వార్షిక బడ్జెట్ రూ. 1.76 లక్షల కోట్లలో సంక్షేమ రంగానికే రూ.42 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ. 35 వేల కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయనడానికి, వారు స్వచ్ఛందంగా తమకు మద్దతు పలకడమే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరిన్ని మంచి పనులు చేస్తామని పేర్కొన్నారు. -
వచ్చే మృగశిర నాటికి కాళేశ్వరం నీళ్లు.. పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడరూరల్: వచ్చే మిర్గం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టుకింద రెండు పంటలకు సాగునీరు అందిస్తామని బాన్సువాడ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మండలంలోని కొయ్యగుట్ట కాలనీ, కొయ్యగుట్ట తండా, కేవ్లానాయక్ తండా, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికి డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తండాల్లో జగదాంబ సేవాలాల్ మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందిస్తామన్నారు. గిరిజన మహిళలతో కలిసి కాసేపు నృత్యం చేశారు. బద్యానాయక్, అంజిరెడ్డి, నార్లసురేష్, మోహన్నాయక్, గోపాల్రెడ్డి, శ్రీధర్, బన్సీనాయక్, అంబర్సింగ్, ప్రేమ్సింగ్ పాల్గొన్నారు. -
కల్లు తాగండోయ్.. నల్లమందు మానండోయ్
సాక్షి, బాన్సువాడరూరల్: స్వచ్ఛమైన ఈత కల్లు ఆరోగ్యానికి మంచిదని, నల్లమందుతో అనారోగ్యంతో పాటు జేబుకు చిల్లేనని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనాపూర్ గ్రామానికి వచ్చిన పోచారం శ్రీనివాస్రెడ్డికి గౌడ కులస్తులు ఈతకల్లు లొట్టిని బహుకరించారు. కాస్తరుచి చూసిన ఆయన దాన్ని మరికొందరికి ఇలా పంచుతూ ఆకట్టుకున్నారు. అంతకు ముందు సోమ్లా నా యక్ తండాలో గిరిజన మహిళల కోరిక మేరకు వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. -
మంత్రికి కిడ్డీ బ్యాంకు బహూకరించిన చిన్నారి
సాక్షి, నస్రుల్లాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం అంకోల్ తండాకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకుని మంత్రికి బహుమతిగా ఇచ్చింది. అంకోల్ తండాకు చెందిన తార్యానాయక్ కూతురు సుస్వర తాను దాచుకున్న డబ్బులను ఎలక్షన్ ఫండ్గా అందించడంతో ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద మనస్సు తల్లి నీది అని మంత్రి పోచారం ఆశీర్వదించారు. -
రేపు ఆర్మూర్లో సీఎం కేసీఆర్ సభ
సాక్షి, ఆర్మూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (గురువారం) ఆర్మూర్కు రానున్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించునున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. సభ ఏర్పాటు పనులను, హెలీప్యాడ్ను ఎంపీ కవిత, టీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని ఆర్మూర్ సీఐ రాఘవేందర్కు సూచించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత కూటమి మాయం సాక్షి, బాన్సువాడ: మహాకూటమి అధికార దాహంతో అడ్డదారులు తొక్కుతున్నది. ఈ కూటమికి దశాదిశా లేదు. కూటమికి మేనిఫెస్టో కూడా లేదు. దాన్ని అమలు చేసే వారు దిక్కు లేరు.. ఎన్నికల తర్వాత ఈ కూటమి మాయమై పోతది.. ఆ కూటమితో జనాలకు ఒరిగిందేమీ లేదు... నాలుగేళ్లలో మేం ఎన్నో అద్భుతాలు చేసి చూపించినం. వచ్చే ఐదేళ్లలో ఇంకా చాలా అద్భుతాలు చేయాల్సి ఉంది. చివరకు మా లక్ష్యం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే... కోటగిరి మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పోచారం వ్యాఖ్యలు -
105 సీట్లలో గెలుస్తాం
సాక్షి,ఎల్లరెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 105 సీట్లలో గెలుపొందుతుందని, సీఎం కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం పరిశీలించిన ఆయన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. 60 ఏళ్లలో కాంగ్రె‹స్, టీడీపీ పాలనలో జరగని అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో చేశారని, మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రవేశపెట్టారని ప్రశంసించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్య సమితి గుర్తించిందని, పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సమాచారం వచ్చిందని పోచారం తెలిపారు. తక్కువ సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించేందుకు రంగం సిద్ధమవుతోందని చెప్పారు. తమ పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు.కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేస్తామని కల్లిబొల్లి మాటలను చెబుతున్నారని విమర్శించారు. కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్పై లేదని, కేవలం టీఆర్ఎస్పై మాత్రమే నమ్మకం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్రెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, గాంధారి జెడ్పీటీసీ తానాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంలో కూరలు అమ్మిన పోచరం
-
ప్రజా నాయకులకే పట్టం కట్టండి
సాక్షి, నస్రుల్లాబాద్: రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి, బాన్సువాడ నియెజక వర్గ టిఆర్ఎస్ పార్టి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మిర్జాపూర్,నాచుపల్లి, నెమ్లి, కాంశెట్టి పల్లి, బొమ్మన్ దేవ్ పల్లి, నాచుపల్లి తండా, రాముల గుట్ట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోను నాయకులు,ప్రజలు టపాకాయలు పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు దుర్కి గ్రామం నుండి మిర్జాపూర్ గ్రామం వరకు మండల నాయకులు, భాస్కర్ రెడ్డి యువసేన భారీ బైక్ ర్యాలీ తీశారు. మిర్జాపూర్ గ్రామంలోని ఎస్సి కమ్యునిటి భవనంలో మహిళలతో ముచ్చటించారు. అనంతరం నెమ్లి గ్రామంలోని మహిళలతో బతుకమ్మ ఆడారు. నిజాంసాగర్ ఆయకట్టు క్రింద ఉన్న పంట పొలాల్లో ఒక్క గుంట కూడా ఎండనివ్వమన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను వివరించాలని పేర్కొంటూ ఈ నెల 21, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలోని వ్యవసాయ విభాగ ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా పిలుపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లెల మీనా, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజి జెడ్పిటిసీ ద్రోణవల్లి సతీష్, మండల టీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా మాజి గ్రంథాలయ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, నాయకులు పురం వెంకటి, గంగారం, శ్యామల తదితరులున్నారు. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు.