pollution control board
-
కాలుష్య భూతం: ముందు నోటీసులు.. ఆ తర్వాత చర్యలు!
దాదర్: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం అప్రమత్తమైంది. పరిస్ధితులు మరింత చేయి దాటకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయనుంది. అంతేగాకుండా భవన నిర్మాణాలు జరిగేచోట కూలీలు సామూహికంగా వంట చేసుకోవడం, రాత్రుళ్లు చలి కాచుకునేందకు మంటలు వేసుకోవడాన్ని కూడా నిషేధించనుంది. పరిస్థితి చేయి దాటకముందే... దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంవల్ల ఏస్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే గత కొద్దిరోజులుగా ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కారణాలేవైనా రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ముంబై సహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో అనేక చోట్ల నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని నివాస భవనాలు కాగా మిగతావి షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్లు వంటి నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాల వద్ద వాయు కాలుష్య నివారణకు సంబంధించిన నియమాలు పాటించడం లేదని బీఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో నియమాలు పాటించనివారికి మొదటి హెచ్చరికగా ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఇచ్చిన గడువులోపు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సైట్కు సీలువేసి పనులు నిలిపివేస్తారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లపై తగిన చర్యలు తీసుకుంటారు. పలుకారణాలతో వాయుకాలుష్యం.. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వేలాది మంది కూలీలు, కార్మికులు పనులు చేస్తారు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఉదయం, రాత్రుళ్లలో అక్కడే వంట చేసుకుంటారు. ఇందుకోసం వీరు కిరోసిన్ స్టౌ లేదా వంట గ్యాస్ సిలిండర్లను వాడరు. సైటువద్ద వృథాగా పడి ఉన్న కలపను వినియోగిస్తారు. ఈ కలప నుంచి భారీగా వెలువడే పొగ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. చలి బారి నుంచి తట్టుకునేందుకు నగరంలోని మురికివాడల్లో, ఫుట్పాత్లు, రోడ్లపక్కన నివసించే పేదలు చలిమంట కాచుకుంటారు. చెత్త కాగితాలు, నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ చెత్త, కట్టెలు, గడ్డి తదితర సామాగ్రిని ఈ మంటలో వేస్తారు. వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాకుండా వాయునాణ్యత క్షీణించేందుకు ఇవి కూడా కారణాలవుతున్నాయి. అదేవిధంగా నగరంలో దాదాపు 50 వేలకుపైగా పాత కాలం నాటి బేకరీలున్నాయి. అందులో 24 గంటలు బ్రెడ్లు, పావ్లు, కేక్లు తయారవుతూనే ఉంటాయి. వీటి తయారీకి బేకరీ నిర్వాహకులు కలపనే వినియోగిస్తారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగ గాలి స్వచ్చతను దెబ్బతీస్తోంది. ప్రతీ వార్డులో వాటర్ స్ప్రింక్లర్... ఈ నేపథ్యంలో బీఎంసీ నూతన నిర్మాణాలు జరుగుతున్న చోట దుమ్ము, ధూళీ వెలువడకుండా చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లేదనని హెచ్చరించింది. ఇందుకోసం ప్రతీ వార్డులో 5 నుంచి 9 వేల లీటర్ల నీరు వెదజల్లే వాటర్ స్ప్రింక్ర్లను అందుబాటులో ఉంచింది. ఈ స్ప్రింక్లర్లు రోడ్లపై గాలిలో ఎగురుతున్న దుమ్ము, ధూళిని నియంత్రిస్తాయి. ఫలితంగా కొంత శాతం కాలుష్యం నియంత్రణలోకి వస్తుందని బీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేసే యోచనలో కూడా ఉంది. వాయు కాలుష్య నివారణ కోసం కొత్తగా అమలు చేయనున్న నియమాలు నిర్మాణ పనులు జరుగుతున్న భవనం చుట్టూ 35 అడుగుల ఎత్తున్న ఇనుప రేకులతో ప్రహరీ గోడను నిర్మించాలి.భవనానికి ఏర్పాటు చేసిన వెదురు బొంగుల కంచెకు జూట్ వస్త్రం లేదా ఆకుపచ్చ బట్ట చుట్టాలి. నిర్మాణాలు జరుగుతున్న సైట్ల వద్ద వాటర్ స్ప్రింక్లర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. రోజుకు 4 లేదా5 సార్లు నీటిని స్ర్పింకిల్ చేయాలి.కూలీలు, కార్మికులు కచ్చితంగా ముఖానికి మాస్క్, కళ్లద్దాలు ధరించాలి. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కాపలగా ఉండే సెక్యూరిటీ గార్డులు చలికాచుకునేందుకు ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి కొనివ్వాలి. -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
మోత మోగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.వాయునాణ్యత కాస్త మెరుగు..గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది. ఇతర కాలుష్యాలూ ఎక్కువే..ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు. -
కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. బాణా సంచాపై నిషేధం
ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లోకి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు. -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్లో ఏప్రిల్లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్పూర్లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 401కి చేరింది. మరోవైపు.. శనివారం జహంగీర్పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైమరీ స్కూల్స్ను నవంబర్ 10వ తేదీ మూసివేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అలాగే, 6-12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. "As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP — ANI (@ANI) November 5, 2023 మరోవైపు.. ఢిల్లీలో గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. #WATCH | Delhi: ANI drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 9:15 am today. The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/6yfIjGq0kV — ANI (@ANI) November 5, 2023 #WATCH | The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). (Visuals from Chanakyapuri area, shot at 8:40 am) pic.twitter.com/aWTVUauThG — ANI (@ANI) November 5, 2023 -
రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్
ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ల వివరణ కోరింది. ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారించింది. ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్ బాబాన్ టికే, ఆనంద్ ఝా మరియు సంజయ్ సర్వే – తమ వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్ఎస్ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్రెడ్డి -
‘గుట్టలు గుల్ల’కు ఇక చెల్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వడాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో స్థానికులు, బీజేపీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా బట్టాపూర్లో గుట్టలను తొలిచేయడంపై గతేడాది ’సాక్షి’ప్రదాన సంచికలో ‘గుట్టలు గుల్ల’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్రెడ్డి హైకోర్టులో ‘పిల్’దాఖలు చేశారు. దీనిపై గత నెల 16న ‘బట్టాపూర్ గుట్ట మింగివేతపై పిల్’అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్’(ఎల్రక్టానిక్ టోటల్ సర్వే) గుట్టలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో క్వారీ, క్రషర్ను సీజ్ చేయాలని చెప్పిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 13 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, మోర్తాడ్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీంగల్ మండలాల్లో ఫ్లెక్సీలు కట్టారు. గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను వాటిపై ముద్రించారు. మరోపక్క గురువారం బట్టాపూర్ గుట్ట వద్ద బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. -
కాలుష్యంతో ఊళ్లన్నీ ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, కామారెడ్డి / భిక్కనూరు : కాలుష్యం కోరలు చాస్తోంది. పీల్చే గాలి, తాగేనీరు కలుషితమవుతోంది. జనం రోగాల బారిన పడుతున్నారు. విషవాయువులు పల్లెల్ని కమ్మేస్తుండడంతో భరించలేకపోతున్నారు. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ఉపాధి ఏమోగాని రోగాలు వెన్నాడుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, తలమడ్ల, తదితర గ్రామాల పరిసరాల్లో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్తో పాటు ఇతర పరిశ్రమలు, కోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. అయితే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని, ఆఖరుకు భూ గర్భజలాలు కూడా దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నెలకొల్పిన ఓ ఫార్మా కంపెనీతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ కాచాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 57 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు పొరుగున ఉన్న పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్, మాందాపూర్, అంతంపల్లి తదితర గ్రామాల ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. వ్యర్థాలతో తామూ ఇబ్బంది పడుతున్నామని పే ర్కొంటూ వారితో జతకలిశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భజలాలు కూడా కలుషితమై, ఆ నీళ్లు తాగిన వారంతా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల వ్యర్థాలన్నీ పంట చేలగుండా కాలువలు, వాగుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువులోకి వ్యర్థాలు వెళ్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. మొక్కుబడి తనిఖీలు.. పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూలంగా తాము పడుతు న్న ఇబ్బందులపై 57 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పీసీబీ అధికారులు ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలంలో అడుగుపెట్టగానే ఆయా పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వాసనలతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాల అద్దాలన్నీ మూ సి ఉంచినా దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
అమరరాజాకిచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు పాటించలేదంటూ అమరరాజా బ్యాటరీస్కు ఇచ్చిన షోకాజు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఈ మేరకు సవరించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అమరరాజా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పదేపదే తనిఖీల పేరిట ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు జారీచేశారని చెప్పారు. పిటిషనర్ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అని, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాల జోలికి వెళ్లొద్దని సూచించింది. తనిఖీలు తప్పేంకాదని, షోకాజు నోటీసులకు స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐఐటీ–మద్రాస్ ఇచ్చిన నివేదిక కూడా పట్టించుకోలేదని రోహత్గి తెలిపారు. షోకాజు నోటీసులకు స్పందించామని పేర్కొన్నారు. ఏపీపీసీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. షోకాజు నోటీసులకు స్పందించారని, అయితే పదేపదే వాయిదాలు కోరారని, అంతకు మించి ఏమీలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించారనిపిస్తే తొలిసారే చర్యలు తీసుకోవాల్సిందని ధర్మాసనం పేర్కొంది. షోకాజు నోటీసుకు స్పందించడానికి పలుసార్లు సమయం ఇచ్చామని నాదకర్ణి తెలిపారు. ఇలా సమయం అడుగుతూనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తమ చేతులు కట్టేసిందని చెప్పారు. అనంతరం ధర్మాసనం షోకాజు నోటీసులపై తామెలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అథారిటీకి ఉందని తెలిపింది. ‘షోకాజు నోటీసులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అమరరాజా సంస్థ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలి. ఆ వాదనలపై మండలి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఆ నిర్ణయాన్ని నాలుగు వారాలపాటు నిలుపుదల చేయాలి. తదుపరి ఏమైనా ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవడానికి వాదప్రతివాదులకు స్వేచ్ఛనిస్తున్నాం..’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంటూ పిటిషన్పై విచారణను ముగించింది. -
Amara Raja: చట్ట ప్రకారమే ముందుకెళ్లండి: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్ రాజాకు సూచించింది న్యాయస్థానం. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. -
ఏపీ: మూడు నెలల్లో నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి చెక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిషేధిత ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ వినియోగాన్ని మూడు నెలల్లో పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరంలో బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి. మానవాళికి హాని కలిగించేలా, పర్యావరణంకు విఘాతం ఏర్పడేలా కాలుష్యంను విడుదల చేస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా పరిశ్రమలు వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయకుండా, వాటిని శుద్దిచేసి, హానికర రసాయనాలను పూర్తిగా తొలగించిన తరువాతే బయటకు వదిలేలా చూడాలని కోరారు. అందుకు అవసరమైన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లను పరిశ్రమలు సిద్దం చేసుకోవాలని అన్నారు. దాదాపు రూ.20.30 కోట్ల జరిమానా రాష్ట్ర వ్యాప్తంగా 17 కేటగిరిల్లోని 307 పరిశ్రమలు ఇప్పటికే AP PCB పరిధిలో నిత్యం కాలుష్య నియంత్రణ ప్రమాణాలపై ఆన్ లైన్ ద్వారా సమాచారంను అందిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏ పరిశ్రమలో అయినా కాలుష్యం ప్రమాణాలకు భిన్నంగా వెలువడితే వెంటనే పీసీబీ అధికారులు సదరు పరిశ్రమలను అప్రమత్తం చేయడానికి వీలవుతోందని తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని పరిశ్రమలకు వర్తింపచేయాలని అన్నారు. ఇప్పటికే ఇండస్ట్రియల్ పొల్యూషన్ మానిటరింగ్, హజార్డ్ వేస్ట్, బయోవేస్ట్, ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వేస్త్, బ్యాటరీ వేస్త్, ఫ్లైయాష్ విభాగాల్లో పీసీబీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రమాణాలను పాటించని సంస్థలపై జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.20.30 కోట్లను జరిమానాలుగా విధించడం జరిగిందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఏపీ పీసీబీ పనిచేస్తోందని అన్నారు. వివిధ కేటగిరిల్లోని వ్యర్థాల నిర్వహణపై ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలకు నివేదికలను సమర్పిస్తున్నామని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై నేరుగా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తోందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారాయాన. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) కింద రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యంను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గాలి కాలుష్యంపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఐఐటి తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ, ఎన్ఎఆర్ఎల్, సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ, ఐఐటి మద్రాస్ ల ద్వారా రాష్ట్రంలోని పలుచోట్ల గాలి కాలుష్యంపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. హాట్ స్పాట్ లను గుర్తించడం, కాలుష్యానికి కారణాలను పరిశీలించి, వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 42.90 కోట్లతో పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో బయో వ్యర్థాల నిర్వహణ సగ్రమంగా జరగాలని, బయోవేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఇస్తున్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపించే బయో వ్యర్థాలను నిర్థిష్టమైన ప్రమాణాల మేరకు డిస్పోజ్ చేస్తున్నారో లేదో పరిశీలించే విధానాలను రూపొందించాలని కోరారు. ఈ సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ పార్కుల్లో ఎస్టీపీలు తప్పనిసరి.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా... నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది. చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి.. నగరంలో జాతీయ పార్క్లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► జాతీయ పార్క్ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు. ► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు. ► ఆయా పార్క్లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు. ► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి. ► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి. ► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి. -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
పరిశ్రమల్లో తనిఖీలకు మూడు టాస్క్ఫోర్స్లు
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు. -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్
సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది. సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ► జమైకా 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు. ► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. ► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► న్యూజిలాండ్ దేశం 2019లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్ చేయదగిన ప్యాకేజింగ్ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్ 52.2 శాతం, స్విట్జర్లాండ్ 49.7 శాతం రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఢిల్లీదే అగ్రస్థానం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2020–21 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు బీహార్లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తున్నాయి. 12 శాతమే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్ సంచులు, బయో డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్తో కొన్ని నష్టాలివీ.. ► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది ► క్లోరినేటెడ్ ప్లాస్టిక్తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి. ► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. ► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలను కూడా కనుగొన్నారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ► ప్లాస్టిక్లో బిస్ఫినాల్–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దేశానికి సిక్కిం ఆదర్శం ప్లాస్టిక్ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను నిషేధించింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. -
వాయు కాలుష్యాన్ని30% తగ్గించడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ రెండు నగరాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఇప్పటికే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.. ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు నగరపాలక సంస్థలు ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాయు కాలుష్య పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఐదు చొప్పున, 11 మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్గా చూపించడం అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధిచేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదకర వ్యర్థాలను వినియోగించుకునేందుకు 10సిమెంట్ కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఒకే ఒక భూమి (ఓన్లీ ఒన్ ఎర్త్) పేరుతో నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 8,953 పరిశ్రమల్లో సెస్టెంబర్ నాటికి 33% మొక్కలతో పచ్చదనాన్ని వృద్ధి చేయాలని కోరాం. – ఎ.కె.పరిడ, చైర్మన్, కాలుష్య నియంత్రణ మండలి -
‘రామగుండం’లో ఉత్పత్తి ఆగలేదు
ఫెర్టిలైజర్ సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)లో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. ఉత్పత్తిని ఆపాలని కాలుష్య నియంత్రణ మండలి శనివారం ఆదేశించింది. కానీ కర్మాగారంలో ఆదివారం కూడా 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. ఈ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాల్సిందిగా శనివారం కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం సోమవారం మండలి అధికారులతో సమావేశమైంది. దేశవ్యాప్తంగా యూరియాకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. కర్మాగారంలో ఉత్పత్తి ఆపితే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం ఇబ్బందిగా మారుతుందని తెలిపింది. అమ్మోనియా గ్యాస్, వ్యర్థ జలాల కాలుష్యంపై వివరణకు సమయం ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన అధికారులు ఎరువుల ఉత్పత్తిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ కమిషనర్ ఎం. రఘునందన్రావు తెలిపారు. -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్గా, ఎన్సీసీ క్యాడెట్గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
సాక్షి, అమరావతి/నూజివీడు/ముసునూరు/లబ్బీపేట/భవానీపురం: బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురి మృతికి కారణమైన ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం 1974లోని 33ఏ, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981ను అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. విద్యుత్ కనెక్షన్ను కూడా తొలగించారు. బుధవారం రాత్రి 10.55 గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో గురువారం సాయంత్రం వరకు ఆరుగురు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు పర్యావరణానికి సైతం నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సీఎఫ్వో నిబంధనలు పాటించకపోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైనట్టు గుర్తించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమపద్ధతిలో తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎ.కె.పరీడా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. గ్యాస్ లీక్ వల్లే మంటలు ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తయారయ్యే ఈ ఫ్యాక్టరీలోని డీబ్లాక్లో ఉన్న 3కేఎల్ సామర్థ్యం గల స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తిని విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో నలుగురు బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిది అక్కిరెడ్డిగూడెం కాగా మరొకరిది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప. ఈ ప్రమాదంలో ఉదురుపాటి కృష్ణయ్య (34), అవదేష్ రవిదాస్ (30), కారు రవిదాస్ (25), మనోజ్కుమార్ (25), సువాస్ రవిదాస్ (32), బొప్పూడి కిరణ్ (32) మృతి చెందారు. వీరిలో కృష్ణయ్య కెమిస్ట్గా పని చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడ్డ 12 మందిని తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. గురువారం కంపెనీ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇక్కడ రోష¯Œ (30), సుధీర్ రవిదాస్ (30), రవి (36), వరుణ్దాస్ (30), మునారక్ (30), సుధీర్కుమార్ (35), జోసెఫ్ (30), వికారి రవిదాస్ (30)తో పాటు స్థానిక గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు(30), ముల్లపూడి నాగరాజు (35), ఎస్కే సుభానీ(30) ఉన్నారు. వీరిలో ఏడుగురు బిహార్కు చెందిన వారు. సీహెచ్ రాజీవ్ (38)కు 5% గాయాలే కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇంటికెళ్లాడు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ గురువారం స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు, డీఐజీ పాల్రాజు, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తదితరులు ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించనున్నట్టు తెలిపారు. వాల్వ్ సరిగా లేనందునే ప్రమాదం! ఫ్యాక్టరీ దుర్ఘటనకు గ్యాస్ లీకే కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఫ్యాక్టరీ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ ‘సాక్షి’కి వెల్లడించారు. రియాక్టర్ వద్ద వాల్వ్ సరిగా కట్టకపోవడం వల్ల గ్యాస్ లీక్ కావడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రియాక్టర్ పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సేకరించిన వస్తువులను తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపామని, నివేదిక వచ్చాక వాస్తవ కారణాలు తెలుస్తాయన్నారు. పాలిమర్స్ గ్రాన్యూల్స్ తయారీలో వినియోగించే 4ఎంపీఐ పౌడర్ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 4వ రియాక్టర్లో 1,500 కేజీలకుపైగా పాథలిక్ ఎన్హైడ్రేడ్ అనే కెమికల్ కాంపౌండ్ తయారీలో భాగంగా మిథేల్మెన్ అనే రసాయనాన్ని పంపుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్ పేలినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన బిహార్ వాసుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ప్రధాని మోదీ సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని రాజ్భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
మూసీ.. కాస్త మెరిసీ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ జీవనరేఖ.. చారిత్రక మూసీ నది నీటి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. మూసీ నీటిలో హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడైంది. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. మార్చి చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. మానవ మల, మూత్రాదుల్లో ఉన్న హానికారక కోలిఫాం బ్యాక్టీరియా ఉనికి కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమితులకు లోపలే ఉన్నట్లు తేలింది. కారణాలివే.. గతేడాది సీజన్లో భారీ వర్షాలు కురియడంతో మూసీ మురికి వదిలింది. ఎగువ ప్రాంతంలో ఉన్న హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల గేట్లను వర్షాకాల సీజన్లో సుమారు పది సార్లు వదిలి వరద ప్రవాహాన్ని దిగువనకు వదిలిపెట్టారు. దీంతో వ్యర్థ జలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతోన్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తోన్న 22 ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. మూసీ కష్టాలివే.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్ప్లాన్ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
‘మురుగు’.. తప్పితేనే మెరుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి తాగునీరిచ్చే జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట)లను మురుగు ముప్పు వెంటాడుతోంది. సమీపంలోని 11 గ్రామాల నుంచి, చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వస్తున్న మురుగునీటితో రిజర్వాయర్లు కలుషితం అవుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్సాగర్లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు జల మండలి పరిశీలనలోనే వెల్లడైంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేయాలని, అందుకోసం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఏర్పాటు చేసుకోవాలని.. గతంలోనే గ్రామ పంచాయతీలు, కాలేజీలకు జలమండలి, కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చాయి. ఎస్టీపీలను నిర్మించుకోవాలని, జలాశయాలు కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు కూడా కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఫలితం లేదు. పంచాయతీల నిర్లక్ష్యానికితోడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటి చేరికను ఆపడం, శుద్ధి చేయడం ద్వారా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగుపర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఐదేళ్లుగా పైసా లేదు.. సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామా లు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న మురుగు నీరంతా జలాశయాల్లోకి చేరుతుండటంతో.. మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మిం చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. అందులో రూ.27.50 కోట్లను పంచాయతీ రాజ్ శాఖ, మరో రూ.13 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేయాలని సూచించింది. ఇది జరిగి ఐదేళ్లయినా ఆయా విభాగాల నుంచి పైసా నిధులు విడుదల కాలేదు. మురుగు నీరు నేరుగా జలాశయాల్లో కలుస్తూ.. ఆర్గానిక్ కాలుష్యం పెరిగిపోతోంది. తాఖీదులు ఇచ్చినా.. జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టీపీలు నిర్మించుకోవాలంటూ గతంలోనే తాఖీదులిచ్చామని పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ తరఫున రూ.13 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ పంచాయతీరాజ్ విభాగం నుంచి రావాల్సిన రూ.27.50 కోట్లను విడుదల చేయడం లేదని ఓ అధికారి చెప్పారు. అయితే దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే.. ►జంట జలాశయాల్లో కాలుష్యం చేరకుండా తీసు కోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ►సమీప గ్రామాల మురుగునీరు చేరకుండా తక్షణం ఎస్టీపీలు నిర్మించాలి. వాటిలో శుద్ధిచేసిన నీటిని కూడా జలాశయాల్లోకి వదలకుండా గార్డెనింగ్, పంటలకు వినియోగించాలి. రిజర్వాయర్లలోని నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ►వరదనీరు చేరే ఇన్ఫ్లో చానల్స్ను ప్రక్షాళన చేయాలి. జలాశయాల ఎగువన, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించాలి. ఇసుక మాఫియాను కట్టడిచేయాలి. ►ఈచర్యల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. మురుగు కాలుష్యం ప్రమాదకరం మురుగు చేరిక వల్ల మంచినీటి జలాశయాల్లోకి పురుగు మందుల అవశేషాలు, షాంపూలు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, ఇతర రసాయనాలు చేరుతున్నాయి. గృహ, వాణిజ్య వ్యర్థ జలా ల్లో ఉండే హానికర మూలకాలతోనూ ప్రమాదం ఉంటుంది. మానవ, జంతు వ్యర్థాలతో కూడిన మురుగులో కొలిఫాం, షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈకొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మురుగునీటితో యుట్రిఫికేషన్ చర్య జరిగి గుర్రపు డెక్క ఉద్ధృతి పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గినపుడు దోమల లార్వాలు ఉద్ధృతంగా వృద్ధి చెందుతాయి. సమీప ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు, అవసరమైన సామర్థ్యం ఇదీ.. ఉస్మాన్సాగర్ పరిధిలో.. వట్టినాగులపల్లి - 8 లక్షల లీటర్లు చిలుకూరు - 7 లక్షల లీటర్లు ఖానాపూర్ - 6 లక్షల లీటర్లు జన్వాడ - 6 లక్షల లీటర్లు హిమాయత్నగర్ - 3 లక్షల లీటర్లు అప్పోజిగూడ - లక్ష లీటర్లు బాలాజీ ఆలయం - లక్ష లీటర్లు హిమాయత్సాగర్ పరిధిలో.. ఫిరంగినాలా - 29 లక్షల లీటర్లు అజీజ్నగర్ - 9 లక్షల లీటర్లు కొత్వాల్గూడ - 3 లక్షల లీటర్లు హిమాయత్సాగర్ - 2.5 లక్షల లీటర్లు -
ఉమ్మడి తనిఖీలకు అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: తమ కంపెనీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్పీసీబీ), జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరీ)లకు చెందిన ప్రతినిధులతో ఉమ్మడి తనిఖీలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని అమరరాజా బ్యాటరీస్ హైకోర్టుకు నివేదించింది. కాలుష్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అందువల్ల తనిఖీలకు తాము అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. అమరరాజా ప్రతిపాదనపై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర పీసీబీ సభ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై తాజాగా జస్టిస్ శేషసాయి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అమరరాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఉమ్మడి తనిఖీల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉద్యోగుల రక్తంలో సీసం స్థాయిలు పరిమితులకు లోబడే ఉన్నాయన్నారు. రాష్ట్ర పీసీబీ న్యాయవాది సురేందర్రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో వాదనలు విన్న తరువాత ఉమ్మడి తనిఖీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
తనిఖీలు నిల్లు.. నిబంధనలకు నీళ్లు!
సాక్షి హైదరాబాద్: పారిశ్రామిక వాడల్లో అపరిమిత కాలుష్యం వెదజల్లుతున్నవి, నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీల భరతం పట్టే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) టాస్క్ఫోర్స్ బృందాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. మహా నగరానికి ఆనుకొని ఉన్న పది పారిశ్రామిక వాడల్లో ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తరచూ ఆనవాళ్లు బయటపడడంతో పాటు పలు పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు భరించలేని ద్రవ, ఘన, వాయు కాలుష్యం వెదజల్లుతున్నా.. టాస్క్ఫోర్స్ బృందాలు చోద్యం చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్టుగా కార్యకలాపాలు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామికవాడలున్నాయి. ఆయా వాడల్లో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు కొలువుదీరాయి. వీటిలో బల్క్డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఏం ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమల ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా ఉండదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపలేం జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతుండడం గమనార్హం. నిబంధనలివీ.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రె డ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమ లు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సు మారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టూపక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్వో) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. ∙దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందాలి. నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాల, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమవుతుండడం గమనార్హం. ఇలాంటి కంపెనీలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేసి కట్టడి చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
Hyderabad: స్వచ్ఛ సాగర్గా హుస్సేన్సాగర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్ను స్వచ్ఛ సాగర్గా మార్చేందుకు మార్చి నెల నుంచి మహానగరాభివృద్ధి సంస్థ, పీసీబీ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనుంది. ఏటా వేసవిలో ప్రధానంగా నాచు, నైట్రోజన్, పాస్పరస్లు భారీగా పెరిగి జలాల నుంచి దుర్గంధం పెద్ద ఎత్తున వెలువడుతుండడంతో స్థానికులు, వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణమైన నాచు (ఆల్గే) ఉద్ధృతిని తగ్గించేందుకు జలాల్లో పర్యావరణహిత ఏరోబిక్ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా బయోరెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించనుంది. ఇందుకోసం ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. గతంలో కెనడాకు చెందిన ఓ సంస్థ ఈ ప్రక్రియ చేపట్టడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తాజాగా మరోసారి బయో రెమిడియేషన్కు సిద్ధమవుతుండడం గమనార్హం. మార్చి నుంచి జూన్ వరకు.. ►వచ్చే నెల నుంచి వర్షాలు కురిసే జూన్ వరకు ఈ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా 4.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హుస్సేన్సాగర్ క్యాచ్మెంట్ పరిధి సుమారు 240 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ జలాశయంలోకి నాలుగు నాలాల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ►ప్రధానంగా కూకట్పల్లి నాలాలో ప్రవహించే 400 మిలియన్ లీటర్ల రసాయనిక వ్యర్థ జలాలు సాగర్కు శాపంగా పరిణమించాయి. ఈ నీరు సాగర్లోకి చేరకుండా గతంలో డైవర్షన్ మెయిన్ ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ బల్క్డ్రగ్, ఫార్మా, రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థజలాలు కూకట్పల్లి నాలా ద్వారా సింహభాగం సాగర్లో చేరుతున్నాయి. ►దీంతో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి కారణంగా ఏటా వేసవిలో నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధం వెలువడుతోంది. బయో రెమిడియేషన్తో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదును ప్రతి లీటరుకు 4 మిల్లీ గ్రాములు, బీఓడీని 36 మిల్లీగ్రాముల మోతాదు ఉండేలా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జలాల్లో వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ సాధ్యపడుతుందని చెబుతున్నారు. చదవండి: (ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్గా మార్పు! ఇక నుంచి) అడుగున ఉన్న వ్యర్థాల శుద్ది ఎప్పుడో? సుమారు నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామిక వ్యర్థ జలాల చేరికతో సాగర గర్భంలో రసాయనిక వ్యర్థాలు టన్నుల మేర అట్టడుగున పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలను ఇజ్రాయెల్,జర్మనీ దేశాల్లో ఉన్న సాంకేతికత ఆధారంగా తొలగించి.. ఈ వ్యర్థాలను మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ ఆనకట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా మిషన్ హుస్సేన్సాగర్కు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ స్వచ్ఛ సాగర్ ఇప్పటికీ సాకారం కాలేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. -
పుడమి సాక్షిగా.. పచ్చదనమే లక్ష్యం
మధురానగర్(విజయవాడ సెంట్రల్)/తిరుపతి రూరల్: కృష్ణా జిల్లా విజయవాడ, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆదివారం సాక్షి మీడియా గ్రూప్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షిగా..’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ పడవల రేవు సెంటర్ నుంచి మధురానగర్ జంక్షన్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించగా, చంద్రగిరి నియోజకవర్గం వకుళాపురంలో వందలాది మంది విద్యార్థులతో మొక్కలు నాటారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు బంగారు భవిష్యత్తని మంత్రులు చెప్పారు. భూ తాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సాక్షి మీడియా రెండేళ్లుగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు అభినందించారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సాక్షి మీడియా గ్రూప్తో కలిసి.. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, గతేడాది పుడమి సాక్షిగా కార్యక్రమం తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటినట్లు చెవిరెడ్డి చెప్పారు. కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, విజయవాడ సీపీ టీకే రాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరేంద్ర, ఎండీ రుహుల్లా, సాక్షి డీజీఎం కేఎస్ అప్పన్న, కృష్ణా జిల్లా బ్యూరో ఇన్చార్జ్ ఓ.వెంకట్రామిరెడ్డి, సాక్షి టీవీ బ్యూరో చీఫ్ వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఎన్.సతీష్, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ర్యాలీలో ఆకర్షణగా నిలిచారు. -
హైకోర్టు ఉత్తర్వులా.. డోంట్ కేర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికార వ్యవస్థలను కనీసం ఖాతరు చేయని అమర్రాజా సంస్థల యాజమాన్యం చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. టీడీపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న అమర్రాజా ఫ్యాక్టరీల విష కాలుష్యంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల కిందట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమర్రాజా ఫ్యాక్టరీల్లోని కార్మికులకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా మంగళగిరి ఎయిమ్స్కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది. వేచిచూసి వెనుదిరిగిన వైద్యులు దీంతో 20 మంది ఎయిమ్స్ వైద్యుల బృందం సోమవారం ఉదయం 9 గంటలకు తిరుపతికి సమీపంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో గల అమర్రాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్యుల బృందం కూడా విచ్చేసింది. కానీ ఒక్కరంటే ఒక్క కార్మికుడిని కూడా వైద్యుల వద్దకు ఫ్యాక్టరీ యాజమాన్యం పంపించలేదు. ఉదయం షిఫ్ట్లో వెయ్యిమందికి పైగా కార్మికులున్నా వైద్యులు ఉన్న రూమ్ వైపునకు ఎవరూ పోలేదు. కార్మికులను పంపాలంటూ వైద్యులు ఎన్నిసార్లు అడిగినా ఫ్యాక్టరీ సంబంధీకుల నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది. పరీక్షలకు కార్మికులెవరూ రానంటున్నారని.. కావాలంటే వాళ్లు పనిచేస్తున్న మిషినరీ వద్దకు వెళ్లి అడగాలని వైద్యులకు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘అలా చేస్తే కార్మికుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని యాజమాన్యం ఆలోచించింది. అందువల్ల మేం వైద్య శిబిరం వద్దే వేచి చూశాం’ అని ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు. దీంతో సాయంత్రం 5.30 గంటల వరకు వేచిచూసిన తాము చేసేది లేక వెనుదిరిగామని వైద్యులు చెప్పుకొచ్చారు. -
హరిత టపాసులతో కాలుష్యానికి చెక్
సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది. అన్నిచోట్ల అందుబాటు తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు. చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్లైన్లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్లోగో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి. – అశ్వినీకుమార్ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ -
జూలై నుంచి ప్లాస్టిక్పై నిషేధం
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ఎంతో హాని చేసే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడవేసేవి) వస్తువుల వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. వచ్చే ఏడాది జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందని తెలిపింది. దీన్ని అంతా పాటించాలని అందుకోసం దశల వారీగా వాటిని వినియోగించడం మానివేయాలని కోరింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ ప్లాస్టిక్ వస్తువుల తయారీదారులపై జరిమానా విధించే అధికారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కల్పించినట్లు తెలిపింది. వాడకూడనివి ఇవే.. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల నిబంధనల ప్రకారం అలంకరణ కోసం వాడే థర్మాకోల్, స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాకెట్లలో వాడే ప్యాకింగ్ ఫిల్ములు, ప్లాస్టిక్ స్టిక్స్ ఉండే ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్ ఐస్క్రీం పుల్లలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ లేదా ప్లాస్టిక్ బ్యానర్లు వాడకూడదు. ప్రత్యామ్నాయాలివే.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బదులుగా సేంద్రీయ పత్తి, వెదురు, చెక్క, మట్టి, పింగాణీ, త్వరగా ప్రకృతిలో కలిసిపోయే (కంపోస్టబుల్) ప్లాస్టిక్స్తో చేసిన వస్తువులు వాడాలి. మట్టిపాత్రలు, పింగాణీ పాత్రలను ఆహారం నిల్వ చేయడానికి వాడవచ్చు. చెత్త బుట్టలో వాడే సంచులు, కాగితపు కప్పులకు వాడే పైపూత, దుకాణాల్లో వాడే సంచులు, పండ్లు, ఆహార పదార్థాలను కప్పి ఉంచే పారదర్శక కవర్లు, ప్యాకేజింగ్, పంట పొలాల్లో మట్టిని కప్పడానికి వాడే కవర్లను కంపోస్టబుల్ ప్లాస్టిక్స్తో తయారు చేయవచ్చు. -
వాయు కాలుష్య నియంత్రణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. ఇప్పుడున్న వాయు కాలుష్యాన్ని ఐదేళ్లలో కనీసం 30% తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. గాలిలో పీఎం10(పర్టిక్యులర్ మ్యాటర్/చిన్న ధూళి కణాలు), పీఎం 2.5(సూక్ష్మ ధూళి కణాలు) 60కి మించి ఉండకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 70 నుంచి 80 వరకూ ఉంటున్నాయి. రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం వాహనాలు. వాటి నుంచి వెలువడే పొగ వల్లే గాలిలోకి ప్రమాదకర కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. దేశంలో వాయు కాలుష్యం పెరుగుతున్న 142 నగరాల్లో రెండు(విశాఖ, విజయవాడ) మన రాష్ట్రంలో ఉన్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. వీటితో పాటు మిగిలిన 11 జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు: ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అక్కడి మున్సిపల్, రవాణా, పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఇంప్లిమెంటేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ నగరాల్లో ఉన్న పీఎం 10, పీఎం 2.5 ఎంత ఉందో తెలుసుకుని దాన్ని 60కి తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీలు నిర్ణయించి అమలు చేస్తుంది. ఆ కేంద్రాల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్న హాట్ స్పాట్స్ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి దానికి బాధ్యుల్ని నియమించింది. నగరాల్లో కార్యాచరణ ప్రణాళికలు, హాట్ స్పాట్స్లో సూక్ష్మ ప్రణాళికలను అమలు చేసేందుకు రూ.639 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థానిక సంస్థలు, పరిశ్రమల సీఎస్ఆర్ ఫండ్స్ను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. మిగిలిన గ్యాప్ ఫండింగ్ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. మొత్తం సొమ్ములో రూ.274 కోట్లు విశాఖలో, రూ.232 కోట్లు విజయవాడలో వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేస్తారు. మిగిలిన సొమ్ముతో 11 నగరాల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. జిల్లా కేంద్రాల్లో కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు నిరంతర వాయు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల(యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు నగరాల్లోనే ఇవి ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో తొలిసారిగా ప్రతి జిల్లాకూ ఒక స్టేషన్ ఏర్పాటు కానుంది. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఒక్కో నగరంలో నాలుగైదు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం క్లీన్ ఎయిర్ ఏపీ కింద పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారం తీసుకుంటున్నారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ నగరాల్లో వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో కాలుష్య నియంత్రణ మండలి ఒప్పందం చేసుకుంది. తిరుపతి, విజయవాడ, గంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు సంబంధించి తిరుపతి ఐఐటీ సహకారం తీసుకోనుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు నగరాలకు సంబంధించి తిరుపతిలోని నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చి లేబొరేటరీ సహకారం తీసుకుంటారు. పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు.. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. సిటీ స్థాయి ప్రణాళిక, ఎక్కువ కాలుష్యం విడుదలయ్యే చోట్ల సూక్ష్మ ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అవసరమైన నిధులిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని ఆయన నిర్దేశించారు. మొట్టమొదటిసారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తెలుసుకునే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాయు కాలుష్యంపై ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు త్వరలో ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. – అశ్వినికుమార్ పరిడ, చైర్మన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి -
Hussain Sagar: ఈ ఏడాది కాలుష్యం తగ్గింది
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది గణేష్ నిమజ్జనంతో పోలిస్తే.. ఈ ఏడాది హుస్సేన్సాగర్లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. కాలుష్యంపై బుధవారం తుది నివేదిక విడుదల చేసింది. ఇందులో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, అనంతరం సాగర జలాలను నాణ్యతను పరిశీలించి నివేదికను వెలువరించింది. ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి నీటి నాణ్యతను ప్రయోగశాలలో పరిశీలించారు. నిమజ్జనం సమయంలో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పట్టిందని, కరిగిన ఘనపదార్థాల మోతాదు పెరిగిందని, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని, భార లోహాల మోతాదు సైతం పెరిగిందని వెల్లడించింది. నిమజ్జనం అనంతరం భారీగా వర్షాలు కురవడంతో.. సాగరంలో భారీగా వరద నీరు చేరి ఆయా కాలుష్యాల మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సాగర్ జలాల నాణ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల మేరకే ఉన్నట్లు తెలిపింది. -
కాలుష్య నియంత్రణకు రూ.639 కోట్లు
సాక్షి, అమరావతి/సత్యవేడు (చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్లో కాలుష్య నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.639 కోట్లు ఇవ్వనుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ అశ్విన్కుమార్ పరీదా వెల్లడించారు. వీటిలో రూ.274 కోట్లు విశాఖపట్నానికి, రూ.232 కోట్లు విజయవాడకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఏపీ చాప్టర్ ‘ఉత్తమ విధానాలు అనుసరించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి’ అనే అంశంపై గురువారం వర్చువల్ సదస్సును నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పరీదా మాట్లాడుతూ.. యువత, వివిధ సంఘాలు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ భారీఎత్తున పర్యావరణ అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు 13 జిల్లా కేంద్రాల్లో కాలుష్య నియంత్రణకు ఏపీపీసీబీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అలాగే, రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పరీదా చెప్పారు. తొలుత విజయవాడ, విశాఖ నగరాలతో పాటు మొత్తం 13 మునిసిపాల్టీల్లో స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ స్వచ్ఛ గాలి కార్యక్రమంలో స్థానిక సంస్థలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. సదస్సులో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న వివిధ పారిశ్రామికవాడల్లో నీటిని తిరిగి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో గ్రీన్ రేటింగ్స్ చాలా కీలకంగా మారనున్నాయన్నారు. ఫ్యాక్టరీల డైరెక్టర్ డి. చంద్రశేఖర్ వర్మ, ఎన్విరాన్మెంట్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీఎస్ నారాయణరాజు, గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కౌన్సిల్ చైర్మన్ ప్రదీప్ ధోబలే తదితర పరిశ్రమల ప్రతినిధులు కూడా మాట్లాడారు. -
వామ్మో.. ‘మోత’ మోగిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాలోని పలు ప్రాంతాల్లో ధ్వని, వాయు కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో శబ్దాల సమస్య మితిమీరుతుంటే, కొన్ని జిల్లాలు, పట్టణాల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్లో గతంలో ఉన్న వాయు కాలుష్య సమస్య కొంత తగ్గుముఖం పట్టగా జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో వాయు నాణ్యత తక్కువగా నమోదవుతోంది. వేసవిలో సెకండ్వేవ్ సందర్భంగా లాక్డౌన్ అమలు, తర్వాత వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్లో వాయు కాలుష్యం తగ్గిందని, చలికాలం వచ్చేటప్పటికి మళ్లీ కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) గత 3 నెలల (మే, జూన్, జూలై) వెల్లడించిన గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది. శబ్ద ప్రమాణాలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత శబ్ద ప్రమాణాల ప్రకారం వివిధ ›ప్రాంతాల వారీగా పగలు, రాత్రి సమయాల్లో వెలువడే ధ్వనులు కింద సూచించిన మేర ఆయా స్థాయిలు పగటిపూట (ఉదయం 6 నుంచి రాత్రి 10 లోపు), రాత్రి సమయాల్లో (రాత్రి 10 నుంచి ఉదయం 6 లోపు) డెసిబుల్స్ లోబడి ఉండాలి. ఇవీ సీపీసీబీ వాయు నాణ్యతా ప్రమాణాలు.. సీపీసీబీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను బట్టి వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 0–50 పాయింట్ల మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్లు, ఈ పరిమితిలో ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నం కావు. ► 50–100 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలున్న వారికి గాలి పీల్చుకోవడంలో, ఇతరత్రా సమస్యలు ఎదురవుతాయి. ► 101–200 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్థమా, గుండె సంబంధిత జబ్బులున్న వారికి గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ► వాయు నాణ్యత మరింత తగ్గి 200 పాయింట్ల ఏక్యూఐని మించిన గాలిని దీర్ఘకాలం పాటు పీలిస్తే అనారోగ్యం, శ్వాసకోశ సంబంధిత, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై తీవ్ర ›ప్రభావం పడుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత 3 నెలల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు ఇలా (ఎక్యూఐ పాయింట్లలో) మల్టీ హారన్స్ వల్లే.. హైదరాబాద్లో శబ్దకాలుష్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ రకాల వాహనాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి పనులు, ఇతర రూపాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ప్రమాణాలకు మించి పెరుగుతున్న ధ్వనులు ఈ పరిస్థితికి కారణం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వివిధ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణీత ప్రమాణాల కంటే శబ్దాలు ఎక్కువగా నమోదు కావడానికి మల్టీహారన్స్ వినియోగం ప్రధాన కారణంగా గుర్తించాం. అంతర్రాష్ట్ర బస్సు, లారీ సర్వీసులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా మల్టీ హారన్స్ వినియోగంతో ఈ సమస్య పెరుగుతోంది. దీని నియంత్రణకు పోలీసు, రవాణా శాఖలు తగిన చర్యలు చేపడుతున్నాయి. – టీపీసీబీ ధ్వని, కాలుష్య నియంత్రణ అధికారులు వినికిడి శక్తికి ప్రమాదం.. ప్రజల ఆరోగ్యం, వారి వివిధ అవయవాలు, శరీర భాగాలపై వాయు, నీరు, ధ్వని ఇతర రూపాల్లోని కాలుష్యాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె ఇతర ముఖ్యమైన భాగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. శబ్ద కాలుష్యం వినికిడి, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తోంది. రోజూ 8 గంటల పాటు 85 డెసిబుల్స్ ఉన్న ధ్వనికి గురైతే వినికిడి సమస్యలు మరింత పెరుగుతాయి. 90కు మించి డెసిబుల్స్తో వెలువడే శబ్దాలకు చెవులు, 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలకు కర్ణ భేరి దెబ్బతిని, వినికిడి శక్తి కోల్పోతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, రాజకీయ పార్టీల ప్రచారాల్లో మోగించే డీజే సౌండ్లు అనేక అనర్థాలకు కారణమవుతు న్నా యి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. – డా.ఎం.మోహన్రెడ్డి, చీఫ్ ఈఎన్టీ స్పెషలిస్ట్, నోవా హాస్పిటల్ -
ఈ నగరానికి ఏమైంది.. ఆ సమస్యని పట్టించుకోరా?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ కలకలంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని బల్క్డ్రగ్, ఫార్మా రంగంలోని పరిశ్రమలకు ప్రభుత్వం నిత్యం 24 గంటలపాటు ఉత్పత్తుల తయారీకి అనుమతించింది. ఇదే సమయంలో కొన్ని పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణమవుతున్న ఉద్గారాలను వదిలిపెడుతున్నాయి. పర్యావరణ హననానికి పాల్పడుతున్నాయి. ఈ విషయంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కాలుష్య పరిశ్రమలను కట్టడి చేసే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీపీ) ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ఇటీవల జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, పటాన్చెరు, పాశమైలారం తదితర ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై పీసీబీకి వందకుపైగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా పరిశ్రమలను తనిఖీ చేసే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలివే ►ఆయా బల్క్డ్రగ్, ఫార్మా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టీపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. ►గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ►ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రధానంగా మల్లాపూర్, ఉప్పల్, కాటేదాన్, కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. ►ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. గతంలో ఎన్జీఆర్ జరిపిన సర్వేలోనూ బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది. కాగితాల్లోనే తరలింపు.. ►మహానగరానికి ఆనుకొని భయంకరమైన కాలుష్యం వెదజల్లుతున్న రెడ్, ఆరెంజ్ విభాగానికి చెందిన 1,160 పరిశ్రమలను సిటీకి దూరంగా తరలించే విషయంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కాలుష్య మేఘాలు మహానగరాన్ని కమ్మేస్తున్నాయి..సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ►గ్రేటర్ పరిధిలో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, వార్నిష్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ పరిశ్రమలున్నాయి. వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో ఇప్పటికే సుమారు 100 కాలుష్య కాసారాలుగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్య కాసారాలుగా మారాయి. -
కాలుష్యంపైనా ద్వంద్వ ప్రమాణాలా!
కొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు విడుదలైన సందర్భంగా ఆ సంస్థను వెంటనే మూసివేయా లని ఏపీ ప్రతిపక్ష టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ అమర్రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నివారణపై నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో... ఉత్పత్తిని ఆపివేయమని ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలిస్తే ఇదే టీడీపీ గగ్గోలు పెడుతోంది. దక్షిణాదిలో ఇతర నగరాల్లోని పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ‘కాలుష్య కాసారం’ పేరుతో గతంలో వరుస కథనాలు దంచిన ఇదే మీడియా... ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీకి చెందిన పరిశ్రమపై చేయివేస్తే ఊరుకోనంటూ ఎగిరెగిరిపడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అన్నది ప్రశ్న.కొన్ని నెలల క్రితం విశాఖ సమీపంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి కాలుష్యం విడుదల అయిన ఘటనలో పదమూడు మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గుర్తు చేసుకోండి. ఆ సంస్థతో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, అందుకే దానిని మూసివేయడం లేదని ఆరోపించే కథనాలు ఎక్కువగా వచ్చాయి. ఆ కంపెనీ రసాయనాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తుంటే కూడా చాలా యాగీ చేశాయి. ప్రతిపక్ష టీడీపీ ఆ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ సంస్థ లైసెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదని, రకరకాల ఆరోపణలు టీడీపీ నేతలు సాగించారు. సీఎం జగన్ వెంటనే ఎల్జీ పాలిమర్స్ సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థ ఉన్నతాధికారులనూ అరెస్టు చేయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అది అప్పటి సంగతి. తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న సీసం వంటి కాలుష్య పదార్థాలు ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో వెల్లడైంది. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కాలుష్యమండలి ఆదేశించింది. కానీ సంస్థ యాజమాన్యం స్పందించలేదన్నది అభియోగం. దాంతో మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. అదే హైకోర్టు.. కాలుష్య మండలి కాలుష్య నివారణకు చేసిన సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈలోగా అమరరాజా సంస్థ తన కొత్త యూనిట్ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు. ఇంకేముంది, ఒక పరిశ్రమ వెళ్లిపోతోందని ఆ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచన తప్ప, తెలుగుదేశం పార్టీని జాకీలు వేసి లేపాలన్న ఉద్దేశం తప్ప ఇంకో ఆలోచనతో వీరు పనిచేయడం లేదు. మరి అమరరాజా బాటరీస్ సంస్థ ద్వారా కాలుష్యం ఏర్పడుతోందా? లేదా? అనేక మందిని పరీక్షించినప్పుడు ఎక్కువమందిలో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు గుర్తించారా? లేదా? అలా సీసం కారణంగా ఉద్యోగులు, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఆ సంస్థ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా? లేదా? అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఆ సంస్థపై ఎవరైనా చర్య తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఒకవేళ కాలుష్య నియంత్రణ మండలిపై ఏవైనా అనుమానం ఉంటే, వేరే స్వతంత్ర సంస్థతో పరీక్షలు జరిపించి ఆ ఫలితాలను వెల్లడి చేయవచ్చు కదా? ఇలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా ఆ పరిశ్రమవారు వెళ్లిపోతామని బెదిరిస్తే ఏమి చేయాలి? ఈ ఒక్క కంపెనీకి మాత్రమే నోటీసు ఇస్తే ఆలోచించవచ్చు. మరో 54 కంపెనీలకు కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మూసివేయవలసి వస్తుం దని హెచ్చరించిందా? లేదా? అమరరాజా సంస్థ టీడీపీ వారిది కాకపోతే ఒక వర్గం మీడియా ఈ కాలుష్యంపై ఎలాంటి వార్తలు ఇచ్చేది? దేశంలో ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటు అయ్యాయి.1980వ దశకంలో భోపాల్లో యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి వెలువడ్డ విషవాయువులు ఎన్ని వేలమందిని బలిగొన్నది, ఎన్నివేలమంది శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు గురైంది ఈ మీడియాకు గుర్తు ఉండాలికదా? అంతదాకా ఎందుకు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మందుల పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందంటూ టీడీపీనే ఆందోళనకు దిగింది కదా? విశాఖలోని కొన్ని సంస్థలు విడుదల చేసే వాయువుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో రొయ్యల పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. తుందుర్రు అనే గ్రామంలో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఆందోళనకారులను మహిళలని కూడా చూడకుండా గత ప్రభుత్వం అరెస్టు చేసింది. తమిళనాడులో స్టెరలైట్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ పరిశ్రమను మూసివేయాలని న్యాయస్థానమే ఆదేశించింది. అప్పుడు ఈ మీడియా కాని, టీడీపీ వంటి పార్టీలు కాని, ఆ పరిశ్రమను ఎలా మూసివేస్తారని ప్రశ్నించలేదు. ఇక తాజాగా అక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారు? ఇక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారని ఒక మీడియా కథనాలు ఇస్తుంటే, తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ కాలుష్యమే సృష్టించడం లేదంటూ మరో మీడియా ప్రచారం ఆరంభించింది. నిజంగానే రాజకీయ కోణంలోనే అమరరాజాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరాదు. అదే సమయంలో ఆ సంస్థలో కాలుష్యం ఉంటే దానిని ఎవరూ సమర్థించరాదు. ఏ పరిశ్రమ అయినా ప్రజలకు ఉపాధి కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు సహకరించాలి. కావాలని ఏ పరిశ్రమనూ వేధించరాదు. అలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తే ప్రభుత్వ నేతలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు తప్పు లేదు. కానీ అదే సమయంలో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం తప్పు కాదు. 13 వేలమందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోం దని చెబుతున్నారు. మంచిదే. అదే సమయంలో అందుకు రెట్టింపు మంది ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఆ సంస్థ వ్యవహరిస్తే ఏమి చేయాలి? దానిని నిరోధించడం ప్రభుత్వ బాధ్యత. గతంలో హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో కూడిన నీరు, వాయువులతో అనేక మంది చర్మవ్యాధులకు గురయ్యేవారు. అప్పట్లో ఈ వర్గం మీడియానే ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య కాసారం పేరుతో అనేక కథనాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయా కంపెనీలను వేరేచోటుకు తరలించవలసి వచ్చింది. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే మీడియా కాలుష్యాన్ని సమర్థిస్తూ వార్తలు ఎందుకు ఇస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ తాము అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తమిళనాడుకు వారి యూనిట్ను తీసుకు వెళ్లినంత మాత్రాన, అక్కడి ప్రభుత్వం ఎలాంటి కాలుష్యాన్ని అయినా భరించడానికి ఒప్పుకుం టుందా? నిజంగానే పరిశ్రమను తరలిస్తే, అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయకుండా ఉండడానికి ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా? తమిళనాడుకు వందల కోట్లు వ్యయం చేసి తరలించే బదులు కాలుష్య నియంత్రణమండలి చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ దిశలో ఆ కంపెనీని ఒప్పించే యత్నం చేయాలి. ఎల్.జి. పాలిమర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పిస్తోంది. అయినా అప్పుడు ఆ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేసినవారు, ఇక్కడ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. కనుక ప్రభుత్వం అయినా, పరిశ్రమ అయినా బాధ్యతగా వ్యవహరించడం అవసరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యమే. ఉపాధి ముఖ్యమే. అలాగే కాలుష్య నివారణ కూడా అంతకన్నా ముఖ్యం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ తెలిపారు. ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్లోని ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్లో లెడ్ ఒకటని తెలిపారు. -
అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్ వేశామని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం అవాస్తవమని స్పష్టం చేశారు. అవాస్తవాలు రాసిన ఆ పత్రికకు లీగల్ నోటీసు ఇస్తామని, పరువు నష్టం దావా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి విజయకుమార్ ఇంకా ఏం చెప్పారంటే.. గడువు ఇచ్చినా కాలుష్యాన్ని నియంత్రించ లేదు రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వాటిని సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా కొంత సమయం అడిగింది. అందుకు 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉత్పత్తిని నిలిపివేసి, తప్పుల్ని సరి చేసుకున్నాక మళ్లీ పునఃప్రారంభం చేసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ నోటీసు ఇచ్చాం. దీనిపై వారి వాదన వినిపించేందుకు రెండుసార్లు (లీగల్ హియరింగ్)కు అవకాశం ఇచ్చాం. అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాం. ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్ లెవెల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్న క్రమంలో కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. ఈ విధంగా ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చాం. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్ ఆర్డర్ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం. ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది అమరరాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) చేయకుండా నేరుగా లెడ్ కలిసిన నీటిని ఎస్టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలిసింది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల లెడ్ ఉంది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3,159 మిల్లీగ్రాములు ఉంది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్ వెళుతోంది. అక్కడి మొక్కల్లోకి వెళ్లి వాటినుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీంలోకి లెడ్ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. భూమి, నీరు, ఇతర రకరకాల శాంపిల్స్ని విశ్లేషించాం. ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్ని హైదరాబాద్లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. పరిశ్రమ మెయిన్ గేటు దగ్గర ఉన్న బోర్ వెల్ శ్యాంపిల్ తీసుకుని ఈపీటీఆర్ఐకి పంపితే అందులో లీటర్కి 0.08 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. వాస్తవానికి ఇది 0.01కి మించి ఉండకూడదు. ఎల్వీఆర్ఎల్ఏ స్టోర్స్ అనేచోట తీసుకున్న శాంపిల్లో 200 శాతం ఎక్కువ లెడ్ ఉంది., మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర లీటర్కి 0.3 మైక్రో గ్రాములు లెడ్ ఉంది. పరిశ్రమకు దగ్గరున్న గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడీ చెరువులో 90 శాతం, నాయుడుచెరువులో 1,200 శాతం ఎక్కువ లెడ్ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్లో బ్లడ్ లెవెల్స్ డెసిలేటర్కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. పర్యావరణాన్ని దెబ్బతీస్తే మానవ జాతికి ఇబ్బంది ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దాన్ని ఎంతో కొంత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పాం. జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని, పరిసర గ్రామాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసి.. పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మానవ జాతి మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. -
మీరు నియమిస్తారా, మేం నియమించాలా: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలి అప్పీలేట్ అథారిటీ (పీసీబీఏఏ) చైర్మన్ ఎంపికలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టకపోతే ప్రభుత్వ అధికారాలను లాక్కొని తాము నియమించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని, ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసి గెజిట్ నోటిఫికేషన్ను సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే పర్యావరణ విభాగం కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. పీసీబీ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, రెండు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. -
శబ్ద కాలుష్యానికి పాల్పడితే తప్పదు భారీమూల్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా శబ్ద కాలుష్యం బారిన పడేవారికే గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నగరాల్లో జీవించేవారు శబ్దకాలుష్యం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఢిల్లీ వంటి నగరాల్లో శబ్ద కాలుష్యం మరీ అధికంగా ఉంటుంది. కాగా, ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శబ్ధ కాలుష్యానికి పాల్పడితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. శబ్ధ కాలుష్యాని పాల్పడే వారిపై సుమారు రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ సూచించింది. వేడుకలు, ర్యాలీల్లో బాణాసంచా కాలిస్తే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సైలెంట్ జోన్లలో బాణాసంచా పేలిస్తే రూ.20వేల జరిమానా విధించాలని కమిటీ సూచించింది. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. Delhi Pollution Control Committee revises penalty for violation of noise rules: Rs 10,000 for noise through loudspeakers/public address systems, Rs 1 Lakh for Diesel Generator sets of over 1000 KVA; Rs 50,000 for sound-emitting construction equipment. The equipment will be seized pic.twitter.com/YvY2PxK3jT — ANI (@ANI) July 10, 2021 -
మైనింగ్ ఆధారిత పరిశ్రమలపై హేతుబద్ధ ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖనిజాధారిత పరిశ్రమలపై శాస్త్రీయంగా హేతుబద్ధమైన ఫీజులు విధించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సూచించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో మంగళవారం ఇంధన, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పరిశ్రమలు పనిచేసేందుకు సహకరించాలన్నారు. మైనింగ్ పరిశ్రమలకు అనుమతులు, నిర్వహణ సందర్భంగా విధిస్తున్న సీఎఫ్ఓ, సీఎఫ్ఈ ఫీజుల పెంపు హేతుబద్ధంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మైనింగ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారో పరిశీలించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన ఫీజులు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని మైనింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అందించాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రులు, ల్యాబ్ల నుంచి పెద్దఎత్తున వస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తగిన జాగ్రత్తలతో నాశనం చేయాలని ఆదేశించారు. పీసీబీ చైర్మన్ ఏకే ఫరీడా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమర రాజా బ్యాటరీస్ మూసివేతకు ఆదేశం
సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న పరిశ్రమలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీ పీసీబీ) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్కు చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దాంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న రెండు పరిశ్రమలనూ మూసివేయాలంటూ ఏపీ పీసీబీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని కాలుష్య ఉద్గారాలకు యాజమాన్యాలు అడ్డుకట్ట వేయగలిగేలా చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తారు. గాలి, నేల, నీరు కాలుష్యమే.. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో ఫిబ్రవరి 25, 26, మార్చి 8, 9, 25, 26 తేదీల్లో ఏపీ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతి జారీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణాలతో పోలిస్తే వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు తేలింది. క్యూబిక్ మీటర్ వాయువు(గాలి)కి నిబంధనల మేరకు లెడ్ (సీసం) 1 మైక్రో గ్రాము ఉండాలి. కానీ.. ట్యాబులర్ బ్యాటరీస్ ఉత్పత్తి చేసే విభాగంలో 1.151, ఆటోమొబైల్ బ్యాటరీస్ విభాగంలో 22.2 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేలడంతో పర్యావరణ అనుమతిలో పేర్కొన్న నిబంధనలను అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఉల్లంఘించినట్టు ఏపీ పీసీబీ అధికారులు తేల్చారు. పరిశ్రమ అవసరాల కోసం రోజూ వినియోగించే నీటి ద్వారా వచ్చే 2,186 కిలో లీటర్ల వ్యర్థ జలాలను సక్రమంగా శుద్ధి చేయకుండానే గ్రీన్ బెల్ట్లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్రీన్ బెల్ట్లోని పలుచోట్ల మార్చి 9న మట్టి నమానాలను సేకరించిన ఏపీ పీసీబీ అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక కిలో మట్టిలో కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల సీసం ఉండాలి. కానీ 295.5 మిల్లీ గ్రాముల సీసీం ఉన్నట్టు తేలింది. ఉద్యోగులు, ప్రజల రక్తంలోనూ సీసం పరిశ్రమలో పనిచేసే 3,533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను సేకరించిన తనిఖీ బృందం వాటిని పరీక్షించింది. రక్త నమూనాల్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమ పరిసర గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు రూఢీ అయింది. దీంతో ఏప్రిల్ 6న అమర రాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ పీసీబీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఏప్రిల్ 20న అమర రాజా సంస్థ సమాధానం ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 22న ఎక్సటర్నల్ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) సమావేశమై సమగ్రంగా చర్చించింది. పర్యావరణ అనుమతిని ఉల్లంఘించిన అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ పీసీబీకి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద గల రెండు పరిశ్రమలనూ మూసివేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: అమరరాజా ‘ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సైన్యం, ఆస్పత్రులు, టెలికాం రంగాలకు బ్యాటరీల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. కోవిడ్ విపత్తు వేళ సున్నిత రంగాలకు సరఫరా దెబ్బతినకుండా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు అమర రాజా సుదీర్ఘకాలంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు అవార్డులను కూడా సాధించింది. మేం తీసుకుంటున్న అన్ని చర్యల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వివరించాం’ అని అమర రాజా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
రూ.5 వేలు జీతంతో మాజీ జడ్జిని అవమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ చైర్మన్గా నియమితులయ్యే హైకోర్టు పూర్వ న్యాయమూర్తి గౌరవ వేతనం రూ.5 వేలుగా నిర్ణయించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా న్యాయవాదిగా ఎన్రోల్ అయిన యువ న్యాయవాది కూడా ఆ వేతనానికి విధులు నిర్వహించడని మండిపడింది. సర్కారు ఇచ్చే రూ.5 వేల కోసం పూర్వ హైకోర్టు న్యాయమూర్తులు ఎదురు చూస్తుంటారని భావిస్తున్నారా అంటూ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ తరహా చర్యలు పూర్వ న్యాయమూర్తులను అవమానపర్చడమేనంటూ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. అప్పీల్ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించేందుకు పూర్వ న్యాయమూర్తి పేరు సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అయితే అందులో గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. ఈ లేఖను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధమైన సంస్థల చైర్మన్లుగా నియమితులయ్యే పూర్వ న్యాయమూర్తులకు... వారు సర్వీసులో ఉన్నప్పుడు పొందిన చివరి వేతనాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. ఈ నెల 27లోగా అప్పిలేట్ అథారిటీ చైర్మన్గా నియమించే వారికి కొత్త వేతనాన్ని నిర్ణయిస్తూ జీవో జారీచేయాలని స్పష్టం చేసింది. ఈ జీవో ఆధారంగా పూర్వ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలంటూ మరోసారి లేఖ రాయాలని అడ్వొకేట్ జనరల్ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. చదవండి: బరాబర్ ఆ నీళ్లు మావే! చదవండి: ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం -
రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ బయటికి తరలించాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం అవుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు, పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ విభాగాల మధ్య సమన్వయ లోపంతో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలున్న ప్రాంతా లు, ఆ చుట్టుపక్కల నివసించే లక్షలాది మంది కాలుష్యంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కింద హడావుడి హైదరాబాద్ సిటీలో ఉన్న కాలుష్య పరిశ్రమలను దశల వారీగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల అవతలి ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రెండేళ్ల కింద హడావుడి చేసింది. రెడ్, ఆరంజ్ కేటగిరీల కిందికి వచ్చే అత్యంత కాలుష్య కారక 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించాలని.. మరో 600 బల్్కడ్రగ్, ఫార్మా, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలో ఏర్పాటుచేస్తు న్న ఫార్మాసిటీకి మార్చాలని నిర్ణయించింది. ఏడాది కింద జహీరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల తరలిం పు కోసం అవసరమైన స్థలాలను గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ప్రకటించాయి. కానీ అడుగు ముందుకుపడలేదు. ఏయే ప్రాంతాల్లో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా బల్క్ డ్రగ్, ఆయిల్, ఇంటరీ్మడియెట్స్, ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండటంతో జల వనరులన్నీ కాలుష్య కాసారంగా మారాయి. సిటీ పరిధిలో సుమారు 100 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరినట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే తొలుత ఆయా పారిశ్రామికవాడల్లోని కాలుష్య కారక కంపెనీలను తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన సుమారు 1,100 కంపెనీల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయని.. వాటిల్లో సమీప ప్రాంతాలకు చెందిన వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. వాటిని ఒకేసారి నగరానికి దూరంగా తరలిస్తే.. కార్మికులకు ఉపాధి దూరమవుతుందని, అటు పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల గాలి, నీళ్లు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్, సల్ఫర్ ఉద్గారాలతో కొన్ని ప్రాంతాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో సిటీలోని వందల చెరువులు, కుంటలు విషపూరిత రసాయనాలతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, ద్రవరూప వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్ వంటి భార లోహాలు, మూలకాలు, విషపూరిత రసాయనాలు నేలలోకి చేరుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. కాలుష్యానికి కళ్లెం వేసేదిలా? పరిశ్రమల కలుషితాలను నియంత్రించేందు కు పలు నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. దీనిపై పర్యావరణ నిపుణులు కూడా పలు సూచనలు చేశారు. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట, నాలాలు, చెరువులు, కుంటల్లో పారబోస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. సంబంధిత పరిశ్రమలను మూసేసేందుకు ఆదేశాలివ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు తప్పనిసరిగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వాటిని ఏర్పాటు చేయకుంటే అనుమతులు ఇవ్వొద్దు. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ కార్యాలయాలకు అనుసంధానించి నిఘా పెట్టాలి. హైదరాబాద్ సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. మార్గదర్శకాల ప్రకారం నడుచుకోని కంపెనీల మూసివేతకు ఆదేశాలిస్తున్నాం. – పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట ఇదీ.. సిటీ నుంచి కాలుష్య పరిశ్రమలను వికారాబాద్, జహీరాబాద్, ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో ఏడాదిలోగా ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. – పరిశ్రమలశాఖ వాదన ఇదీ.. పరిశ్రమలను తరలించేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే తరలింపు పూర్తవుతుంది. – టీఎస్ఐఐసీ అభిప్రాయమిదీ.. -
ఏపీ.. నో పొల్యూషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కాలుష్య ప్రాంతాలు లేవని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో అత్యధికంగా 23 కాలుష్య ప్రాంతాలతో ఒడిశా తొలి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ (21), ఢిల్లీ (11) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాగా, తెలంగాణలో రెండు.. నూర్ మహ్మద్ కుంట లేక్ (కాటేదాన్), పటాన్చెరు (మెదక్) కాలుష్య ప్రాంతాలని నివేదిక తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రమాదకరమైన, ఇతర వ్యర్థాల వల్ల అనేక కలుషితమైన డంపింగ్ ప్రదేశాలు ఏర్పడ్డాయంది. వీటివల్ల భూగర్భ, ఉపరితల జలాలు కలుషితమై ప్రజారోగ్య, పర్యావరణ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పేర్కొంది. అశాస్త్రీయ పద్ధతిలో లేదా నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించి పారిశ్రామిక వ్యర్థాలను పారవేయడం వల్ల కలుషిత ప్రాంతాలు రూపొందుతున్నాయని తెలిపింది. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై నియంత్రణ లేనప్పుడు కాలుష్య ప్రాంతాలుగా మారుతున్నాయని వివరించింది. కాలుష్య నివారణ ఖర్చు సామర్థ్యానికి మించి ఉండడంతో చాలా ప్రాంతాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయని వెల్లడించింది. -
కోకాకోలా, బిస్లేరి, రామ్దేవ్బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఢిల్లీకి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది. ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. -
కమ్మేసిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్ : కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ము, ధూళి, పొగ ఇతర రూపాల్లో విస్తరిస్తోన్న కాలుష్యంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ప్రజానీకం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంది. గత జూలై నుంచి దశలవారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో వివిధ కార్యకలాపాలు మొదలయ్యాయి. దీంతో వాయునాణ్యత క్రమంగా తగ్గుతోంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ద్విచక్రవాహనాలు, కార్లు ఇతరత్రా అన్నీ కలిపి 60 లక్షలకుపైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్యంతో ‘యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ’ దెబ్బతింటోంది. అదే సమయంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత తగ్గిపోతోంది. నిజానికి 2018లోనే దేశంలోని 287 నగరాల్లో, పట్టణాల్లో వాయు నాణ్యతను గ్రీన్పీస్ ఇండియా అంచనావేసింది. అందులోని 231 నగరాల్లో (తెలంగాణలోని హైదరాబాద్ సహా 9 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి) గాలిలో పీఎం–10 (పార్టిక్యులేటివ్ మ్యాటర్) సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమైంది. అప్పటికీ ఇప్పటికీ వాయునాణ్యత మరింత దెబ్బతిన్నట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) తాజాగా ఈ ఏడాది సెప్టెం బర్లో లెక్కగట్టిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ పరిధిలో నమోదైన పీఎం–10 కాలుష్యస్థాయిలను మించి ఈ నవంబర్ 1–7 తేదీల మధ్య నమోదు కావడం సమస్య తీవ్రతను చాటుతోంది. చలికాలంలో వాతావరణంలో దుమ్ము కణాలు, వాయు కాలుష్యం సులభంగా గాలిలో కలిసిపోకుండా మంచు అడ్డుకోవడం వాయునాణ్యత మరింత పడిపోవడానికి కారణమని టీపీసీబీ చెబుతోంది. గ్రీన్పీస్ నివేదిక ఏం చెబుతోంది? వాహన కాలుష్యం, ఇతరత్రా కారణాలతో హైదరాబాద్తో పాటు కొత్తూరు, రామగుండం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, పటాన్చెరు, ఆదిలాబాద్లో వాయునాణ్యత గణనీయంగా పడిపోతోందని గ్రీన్పీస్ ఇండియా నివేదిక తేల్చింది. 2018లో దేశంలోని 287 నగరాల్లో, పట్టణాల్లోని వాయునాణ్యతను పరిశీలించిన ఈ సంస్థ.. ఇటీవల ఆ వివరాలను ‘ఎయిర్పొకలిప్స్’ శీర్షికతో విడుదలచేసిన ఫోర్త్ ఎడిషన్ నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పీఎం–10 సూక్ష్మకణాలు పరిమితికి మించి వెలువడుతున్నట్టు తేలింది. నల్లగొండ, నిజామాబాద్ ప్రాంతాలు కూడా ఈ పరిమితికి దగ్గరలో ఉన్నాయి. మనిషి వెంట్రుక పరిమాణంలో పదోవంతు సైజులో ఉండే పీఎం–10 కాలుష్య కారకం సులభంగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సంబంధిత రోగాలకు కారణమవుతుంది. వాహనాలతోనే అధిక కాలుష్యం.. వాయునాణ్యత తగ్గుదలకు ప్రధానంగా వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, దుమ్ము, ధూళి కారణమవుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో కొంతకాలం పూర్తిగా ఇళ్లకే పరి మితమైన జనం ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు. కరోనా వైరస్ సోకుతుందనే భయం, ముందుజాగ్రత్తలతో సొంత వాహనాలనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీంతో వాహన కాలుష్యం పెరిగి వాయునాణ్యత క్షీణిస్తోంది. పీఎం–10, పీఎం–2.5 సూక్ష్మకణాల వ్యాప్తికి 50 శాతం వాహన కాలుష్యమే కారణం. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి రేగడం వంటి కారణాలతో 33 శాతం కాలుష్యం వెలువడుతోంది. ఇక భవన నిర్మాణ కార్యకలాపాలు, ఇళ్ల కూల్చివేత, ఇతర కార్యక్రమాలతో 11 శాతం సూక్ష్మకణాలు వెలువడి వాయునాణ్యతను దెబ్బతీస్తున్నాయి. 3 జోన్లుగా కాలుష్యం లెక్కలు.. రాష్ట్రాన్ని హైదరాబాద్ (ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో కలిపి), వరంగల్, రామచంద్రాపురం జోన్లుగా విభజించి.. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పీఎం–10, పీఎం–2.5, అమ్మోనియా, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్ కాలుష్య విలువలను లెక్కగడుతున్నారు. హైదరాబాద్లోని హెచ్సీయూ, సనత్నగర్, జూపార్క్, పాశమైలారం, బొల్లారం, ఇక్రిశాట్ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో ఎప్పటిప్పుడు వాయునాణ్యత సూచీని పరీక్షించి వాస్తవ సమయంలో కాలుష్య స్థాయిలను నమోదు చేస్తున్నారు. వరంగల్ జోన్ పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వరంగల్, హన్మకొండ, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలున్నాయి. రామచంద్రాపురం జోన్లో ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన మేరకు నేషనల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (ఎన్ఏఏక్యూఎస్) ప్రకారం.. పీఎం–10 (పది మైక్రాన్ల కంటే తక్కువ సూక్ష్మమైన కాలుష్య కణాలు) సగటున ఏడాదికి 60 మైక్రోగ్రాములు మించకూడదు. పీఎం–2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ సూక్ష్మమైన కాలుష్య కణాలు) సగటున ఏడాదికి 40 మైక్రోగ్రాములు మించకూడదు. అయితే, రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో నేషనల్ ఇవి 60 మైక్రోగ్రాములకు మించి నమోదవుతున్నాయి. వాయునాణ్యత లెక్కింపు ఇలా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయంలో పరిశీలించి ‘సమీర్ యాప్’ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది. – ఏక్యూఐ 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్ఛమైన వాతావరణంతో పాటు నాణ్యమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. – 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు. – 100 పాయింట్లు మించి నమోదైతే ఆయా స్థాయిలను బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పట్టణీకరణ, వాహనాల పెరుగుదలతోనే.. రాష్ట్రంలోని వివిధ ›ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు వాహనాల వినియోగం గణనీయంగా పెరగడం వాయుకాలుష్యానికి కారణమవుతోంది. హైదరాబాద్లో ఐదారేళ్లలో వాయునాణ్యత ప్రమాణాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాం. రాష్ట్రస్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రణాళికను ప్రతీ 3 నెలలకోసారి సమీక్షిస్తున్నాం. ‘సిగ్నలింగ్ ఫ్రీ ట్రాఫిక్ ఐలాండ్స్’ దిశగా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్ల విస్తరణ, కూడళ్లలో గ్రీనరీ పెంచడం, ఫుట్పాత్లపై దుమ్ము, ధూళి నిలిచిపోకుండా టైలింగ్, మున్సిపల్, ఇతర చెత్తాచెదారం బహిరంగంగా తగులబెట్టకుండా చూడడం వంటివి చేపడుతున్నాం. రియల్టైమ్లో వాయు కాలుష్యం ఏ మేరకు ఉందో హైదరాబాద్లోని కూడళ్లలో డిస్ప్లే చేస్తున్నాం. రెండోదశలో రాష్ట్రంలో కాలుష్యం పెరుగుతున్న ఇతర నగరాలు, పట్టణాల్లోనూ వీటినిæ ఏర్పాటుచేస్తాం. ఎక్కడెక్కడ ఏ రకమైన కాలుష్యం ఎంత పెరుగుతుందన్నది పరిమిత గణాంకాలతో కాకుండా ఏడాదిలో నమోదైన విలువలతో బేరీజు వేయాలి. దాన్ని అంతకుముందు ఏడాదితో పోల్చిచూస్తే కాలుష్యం పెరిగిందా తగ్గిందా అన్న దానిపై స్పష్టత వస్తుంది. – తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చలికాలంలో కాలుష్యంతో జాగ్రత్త వాతావరణ మార్పులు, చల్లని గాలులకు తోడు కాలుష్యం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తిరబెడతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు, షుగర్, ఆస్తమా, బ్రాంకటీస్, కీళ్లవాపుల సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. తుమ్ములు, ముక్కు కారడం, ఛాతీ భారంగా అనిపించడం, నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం, గాలి పీల్చేపుడు పిల్లికూతలు వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికాలమంటేనే వైరల్ ఇన్ఫెక్షన్ల సీజన్. అన్నిరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు వ్యాపించేందుకు అనుకూల సమయం. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు న్యూమోనియాకు దారితీయకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా న్యూమోకోల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది. దూరప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు. పొద్దుటే, మంచు ఉండగానే వాకింగ్కు వెళ్లకపోవడం శ్రేయస్కరం. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కిమ్స్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
అమెజాన్, ఫ్లిప్కార్ట్కు ఎన్జీటీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇ-కామర్స్ సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి జరిమానాను వసూలు చేయాలని ఎన్జీటీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి (సీపీసీబీ) ఆదేశాలిచ్చింది. ఈ కామర్స్ సంస్థలనుంచి సరైన రీతిలో జరిమానా వసూల్ చేయడం లేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ట్రిబ్యునల్ చర్య తీసుకున్ననివేదికను అక్టోబర్14లోగా సమర్పించాలని కోరింది. ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లను తమ ప్యాకేజింగ్లో అధిక ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలంటూ ఆదిత్య దుబే య(16) దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఆడిట్, తగిన నష్టపరిహారాన్ని వసూల్ చేయాలని ఎన్జీటీ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్యాకేజీల కోసం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ సేకరిస్తున్నారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016 ప్రకారం బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందని, తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ వల్ల ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీపీసీబీ ఇంతకు ముందే ఎన్జీటీ తెలిపింది. ప్రొవిజన్ 9(2) ప్రకారం.. ప్యాకింగ్ చేసిన సంస్థలే మళ్లీ వ్యర్థాలను సేకేరించాలని పేర్కొంది. కాగా సరుకుల ప్యాకేజింగులో అధికంగా ప్లాస్టిక్ వాడడాన్ని ఆపేలా అమెజాన్ ఫ్లిప్కార్ట్లను ఆదేశించాలని ఆదిత్య దుబే తన లీగల్ గార్డియన్ ద్వారా ఎన్జిటిని అభ్యర్థించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణానికి తీరని నష్టం ఏర్పడుతోందన్నారు. ఇది చాలా తక్కువ శాతంలో రీసైకిల్ అవుతున్న కారణంగా భూమి ప్లాస్టిక్కు పెద్ద డంపింగ్ గ్రౌండ్గా మారుతోందన్నారు. తద్వారా ఏర్పడిన మైక్రోప్లాస్టిక్స్ భూమిని, నీటిని తీవ్రంగా కలుషితం చేస్తోందని దుబే వాదించారు. -
కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా పకడ్బందీ చర్యలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టి నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు దాదాపు రెండు టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్ల ద్వారా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు. గత మార్చి 19 నుంచి ఇప్పటివరకు 281.8 టన్నుల వేస్టేజ్ను సేకరించి, నిర్వీర్యం చేసినట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఈ సందర్భంగా పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19 బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేస్తోంది. అన్ని రకాల కాలుష్య సమస్యలనూ అధిగమించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను కాల్చి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భారీగా జరిమానాలను విధించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. (కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు) -
చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి
సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు ఆది గురువైన సిద్ధి వినాయకుని పండుగ వచ్చేస్తోంది. వినాయక పండుగ నాడు మీరు పుస్తకాలు పూజలో ఉంచి.. గణపతికి ఇష్టమైన, మధురమైన పిండి వంటలు ఆరగింప జేసి.. మీ కోరికలు కోరే సమయం ఆసన్నమైంది. మీరు పూజించాల్సిన వినాయకుణ్ని మీరే మీ చిట్టిచేతులతో తయారుచేస్తే ‘గణాధిపతి’ ఎంతో సంతషించి వరాలనిస్తాడు. మాకు విగ్రహం తయారు చేయడం రాదని చింతించకండి. ‘‘పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహం...’’ తయారు చేసే విధానం గురించి సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో.. ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈనెల 21(ఆగస్టు 21)వ తేదీన జరిగే మట్టి వినాయక విగ్రహం తయారీ ఆన్లైన్ శిక్షణలో 6 నుంచి 18 సంవత్సరాల వారందరూ ΄ాల్గొనవచ్చు. దీనికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నుంచి 12ఏళ్ల వయసు గల వారు మొదటి కేటగిరీగా... 13 నుంచి 18 సంవత్సరాల వయసుగల వారిని రెండో కేటగిరీగా పరిగణిస్తారు. ప్రతి కేటగిరీలో మొదటి మూడు బహుమతులతో΄ాటు ఐదు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకోవచ్చు. రిజిస్టర్ ఇలా:దిగు వ ఇచ్చిన వాట్సప్/ఈ మెయిల్ ఐడీకి మీ పేరు, తండ్రి పేరు, తరగతి, ΄ాఠశాల/ కళాశాల పేరు, పుట్టిన తేది, వయసు, అడ్రస్, జిల్లా, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలు పంపి రిజస్టర్ చేసుకోవాలి. మట్టి గణపతి కిట్:రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల(ఆగస్టు) 18,19 తేదీల్లో నిర్దేశించిన సాక్షి ఆఫీసు ద్వారా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మట్టి గణపతి కిట్(బంకమట్టి, విత్తనాలు, శానిటైజర్) అందజేస్తారు. ఆన్లైన్ శిక్షణ: ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం గం.12:30 ని.లకు అనుభవజ్ఞులైన టీచర్ ద్వారా మట్టి వినాయకుణ్ని తయారు చేసే విధానాన్ని సాక్షి టీవీ, యూ ట్యూబ్ లింక్లో ప్రసారం చేస్తారు. ఆ ప్రసారం ద్వారా మీరు మట్టి విగ్రహం తయారీని నేర్చుకోవచ్చు. అలా తయారు చేసిన విగ్రహాన్ని ఫోటో తీసి.. అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు రిజస్టర్ చేసుకున్న వాట్సప్ నెంబర్కు, ఈ మెయిల్ ఐడీకి పంపించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆన్లైన్ శిక్షణలో ΄ాల్గొని.. మీ చేతులతో తయారు చేసిన మట్టి విగ్రహాన్ని పండుగ రోజున పూజించడంతో΄ాటు బహుమతులూ అందుకోండి!! రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేది : 17–08–2020 మీ పేరు రిజిస్టర్ చేసుకునేందుకు వాట్సప్/ఈ–మెయిల్ ఐడీ:9666283534, a.venkatarakesh@sakshi.com -
పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం
75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చాం. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. స్థానికంగానే నైపుణ్యమున్న మానవ వనరులు లభిస్తాయి. వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడాలి. అలా వారి కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేదోడుగా నిలవాలి. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పది కాలాల పాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా.. అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే. ఇందులో మరో మాట ఉండకూడదు. గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు అసలే వద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పోటీలో మనం గెలుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట మేరకు అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా పారిశ్రామిక విధానం ఉండాలని, పెట్టుబడుల్లో డీ రిస్కింగ్ ద్వారా పరిశ్రమలకు పెద్ద ఊతం ఇవ్వాలని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు, క్లస్టర్లకు పెద్ద పీట వేయాలని, ఆ నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ)పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రఖ్యాత సంస్థలతో పీసీబీని టై అప్ చేయాలి ► పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణ పద్ధతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. ఇందులో కనీసంగా నలుగురు సభ్యులు ఉండాలి. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)ను టై అప్ చేయాలి. ► పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే, ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా ఇదివరకే టై అప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. ► ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని వివరించి అవగాహన కల్పిస్తారు. ► పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్ఐపీసీ పరిశీలించి, ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్ఐపీబీ ముందుకు వస్తుంది. ఎస్ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజెంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. ► ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటు చేయడంలోనే కాకుండా, తర్వాత కాలంలో కూడా అండగా నిలుస్తాం. ఏం చేయగలమో అదే చెప్పాలి ► ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారి పట్ల ప్రో యాక్టివ్గా ఉంటుంది. ► పరిశ్రమలు పెట్టే్ట వారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలి. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక, ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలి. కనికట్టు మాటలొద్దు ► పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పింది. పరిశ్రమలకు రూ.4 వేల కోట్ల ఇన్సెంటివ్లను బకాయి పెట్టింది. ఆ బకాయిలను తీర్చడానికి ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ► ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే ఒక విడతలో సగం బకాయిలు చెల్లించాం. మిగిలిన సగం డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ► సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గాలి ► ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గుతుంది. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. పరిశ్రమలకు, ప్రజలకు మేలు జరిగేలా ఈ విధానం ఉంటుంది. ► భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యం. పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశం. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ► ఇండస్ట్రియల్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీని వల్ల వారికి భవిష్యత్తులో కార్యకలాపాల పరంగా గానీ, పర్యావరణం పరిరక్షణ పరంగా గానీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నడుపుకోవచ్చు. -
వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్లైన్’ వేదిక
సాక్షి, అమరావతి: ఇక నుంచి వ్యర్థాల నిర్వహణ కోసం పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేదు. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) వ్యర్థాల బదలాయింపునకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను నిర్వహించనుంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్ఫామ్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. (త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ) ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారు. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్ఫామ్ దేశంలోనే ఇది మొదటిది కావడం గమనార్హం. (గ్యాంగ్ వార్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు ) -
పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం
న్యాయనిపుణులను భాగస్వామ్యం చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలి. ప్రతి కంపెనీ ఏటా పీసీబీ సూచనల అమలుపై ఒక రిపోర్టు ఇచ్చేలా చూడాలి. వాటిని థర్డ్ పార్టీ ఆడిటర్ ద్వారా సమీక్షించే విషయాన్ని పరిశీలించాలి. థర్డ్ పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన అంశాలపై పీసీబీ దృష్టి సారిస్తూ.. ఆ నివేదికలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వ్యర్థాలు, కాలుష్య కారకాలు, జలాలను పద్ధతి ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది వస్తుంది. శాస్త్రీయ విధానాలతో కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుంది. అందువల్ల కొంత మొత్తాన్ని కంపెనీలు చెల్లించేలా విధానం ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్మెంట్ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. (23 నుంచి 30 వరకు వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు) ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్మెంట్ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ ► రెడ్, ఆరెంజ్ జాబితాలో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)కు నిరంతరం రియల్ టైం డేటా రావాలి. అయితే వస్తున్న డేటాను విస్మరించడం అనేది మన వ్యవస్థల్లో పెద్ద లోపంగా ఉంది. ఈ డేటా ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. సత్వర చర్యలు అవసరం. ► రసాయనాల నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, ప్రమాదకర రసాయనాలు.. తదితర అంశాలపై ఎప్పటి కప్పుడు డేటాను స్వీకరించాలి. దీంతో పాటు.. ప్రఖ్యాత, విశ్వసనీయ సంస్థకూ ఈ డేటా పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలి. ► నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్య కారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ కావాలి. ఈ హెచ్చరికలు ఎవరెవరికి వెళ్లాలన్న దానిపై ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలి. కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్లాలి. ► హెచ్చరికలు జారీ అయ్యాక తగిన చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి జరిగిన నష్టం మేరకు జరిమానా విధించాలి. నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే షాక్ కొట్టేలా మరింత జరిమానా విధించాలి. ఈ ప్రక్రియలో ఎక్కడా అవినీతికి చోటు ఉండరాదు. ► ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (పోలవరం పనులు వేగవంతం ) పర్యావరణ పరిరక్షణ కోసం హరిత నిధి ► ఒక పక్క పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూనే మరో పక్క పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఫండ్ (హరిత నిధి)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమలు ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ► రెడ్, ఆరంజ్ విభాగాల్లోని పరిశ్రమల్లో కాలుష్యాన్ని కొలిచే అన్ని రకాల పరికరాలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ సమాచారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అనుసంధానం అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. స్వల్ప నిబంధనలు ఉల్లంఘించినా భారీ పెనాల్టీ భరించాల్సి ఉంటుంది. ► ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాంపెన్సేషన్ (ఈడీసీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడం తోపాటు పాత పరిస్థితులను తీసుకురావడానికి అయ్యే వ్యయాన్ని ఈడీసీ అంచనా వేస్తుంది. ఆ మొత్తాన్ని గ్రీన్ ఫండ్లో జమ చేసి పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలి. -
కరోనా వేస్ట్ ట్రాకింగ్కు యాప్!
కరోనా పాజిటివ్ రోగులు, అనుమానితులకు సంబంధించిన వైద్య వ్యర్థాల సేకరణ, నిర్వహణ, రవాణా, శుద్ధి ప్రక్రియలు, నిర్మూలన వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ రోగులు, అనుమానితుల జీవ వ్యర్థాల నుంచి కూడా వైరస్ సోకుతుందే మోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఈ వ్యర్థాల సురక్షిత నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఈ యాప్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) రూపొందించింది. ప్రస్తుతం కరోనా విస్తృతి కొనసాగుతున్నం దున, ఈ బయో మెడికల్ వేస్ట్ పర్యవేక్షణ పకడ్బందీగా చేసేందుకు త్వరలోనే ఈ యాప్ను ఉపయోగంలోకి తీసుకు రానున్నారు. ఈ జీవ వ్యర్థాల సేకరణ మొదలు, వేరు చేయడం, రవాణా, నిర్మూలన వరకు సురక్షితంగా చేపట్టేలా ఈ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించి ప్రతి ప్రక్రియను జియో ట్యాగింగ్ చేయ డంతో, ఈ వివరాలను కామన్ ఫ్లాట్ఫారంలో సబ్మిట్ చేస్తారు. ఇప్పటివరకు రోజూ రాష్ట్రంలో సేకరించే జీవ వ్యర్థాల పరిమాణం లెక్కింపు నకు బార్కోడింగ్ వ్యవస్థ ఉపయోగిస్తూ వచ్చారు. ఇకపై ఈ యాప్ ద్వారా కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థలో భాగంగా ట్రాకింగ్ చేస్తారు. ఇందుకు ఒక కొత్త సాఫ్ట్వేర్ను విని యోగించడంలో భాగంగా ఈ యాప్లో వ్యర్థాల ఉత్పత్తిదారులు, దీన్ని రవాణా చేసే వారు, ట్రీట్మెంట్ చేసేవారు రిజిస్టర్ చేసుకుని, పసుపు, ఎరుపు బ్యాగుల్లోని చెత్త ఎంత పరిమాణంలో ఉందో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరోనా వేస్ట్పై పీసీబీ మార్గదర్శకాలు.. ► వార్డుల్లో చెత్తబుట్టలు/ సంచులు/ కంటైనర్లను ఉంచి జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు వాటిని వేరు చేసి నిర్వహించాలి. ► ఎర్ర రంగు సంచిలో వాడిన గాగుల్స్, ఫేస్ షీల్డ్, యాప్రాన్, ప్లాస్టిక్ కవర్లు, హాజ్మెట్ సూట్, గ్లోవ్స్ వంటి వస్తువులు వేయాలి. ► పసుపు రంగు సంచిలో వాడిన మాస్క్ లను, హెడ్–కవర్/క్యాప్, షూ కవర్, డిస్పో జబుల్ లైనిన్ గ్లోవ్స్, నాన్–ప్లాస్టిక్ లేదా సెమీ ప్లాస్టిక్ కవర్లు వేయాలి. ► కరోనా వార్డులకు సంబంధించిన జీవ, వైద్య వ్యర్థాలను తరలించే సంచులు, కంటై నర్లపై ‘కరోనా వ్యర్థాలు’ అని పేర్కొనాలి. వీటికి ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే తరలించేందుకు.. చూడగానే గుర్తు పట్టడానికి వీలుగా ఏర్పాటు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థలు అందచేసే పసుపు రంగు సంచుల్లో క్వారంటైన్ కేంద్రాల నుంచి లేదా వైద్య శిబిరాల నుంచి జీవ వైద్య వ్యర్థాలను విడిగా తరలించాలి. ► స్వీయ నిర్బంధం పాటిస్తున్న ఇళ్లు లేదా ఇతరత్రా ఇళ్ల నుంచి వాడేసిన మాస్కులు, గ్లోవ్స్ను సాధారణ చెత్తలాగా నిర్మూలించేం దుకు ముందు కనీసం 72 గంటల పాటు కాగితపు సంచుల్లో ఉంచాలి. ► ఎర్ర రంగు సంచులను.. కరోనా సోకినవారి నుంచి నమూనాలు సేకరించే కేంద్రాలు, ప్రయోగశాలలు, నమూనాలను సేకరించేం దుకు, తరలించేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ సీసాలను, ట్యూబ్లను, పిప్పెట్లను ఉంచడానికి వాడాలి. చేయకూడని పనులు.. ► కరోనా వ్యర్థాలను ఇతర వ్యర్థాలతో కలపకూడదు. తగినంత వ్యక్తిగత రక్షణ ఏర్పాట్లు లేకుండా కరోనా వ్యర్థాల దగ్గరకు వెళ్లకూడదు. వ్యర్థాలను 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు. ► అనారోగ్య లక్షణాలున్న ఏ ఒక్క కార్మికుడిని విధి నిర్వహణకు అనుమతించొద్దు. -
బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, కార్యకలాపాలు ప్రారంభించడానికి నిబంధనలకు విరుద్ధంగా గత చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏకపక్షంగా అనుమతులు ఇచ్చింది. ప్రమాదకరమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిద్దామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించినా, నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ విస్తరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పలు అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని పెందుర్తి మండలం ఆర్ ఆర్ వెంకటాపురంలో 213 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. 415 టీపీడీ సామర్థ్యంతో ఉన్న ఫ్యాక్టరీని రూ.168 కోట్ల వ్యయంతో 655 టీపీడీ సామర్థ్యానికి విస్తరించాలని యాజమాన్యం 2016లో నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది. కాగా ప్రమాదకరమైన రసాయన వాయువులతో ముడి పడిన ఈ పరిశ్రమ విస్తరణ అంశాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయపడింది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉన్నతాధికారులు భావించారు. ఆ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భేటీ మినిట్స్లోనూ నమోదు చేశారు. ఫ్యాక్టరీని తరలించాలని నిపుణుల డిమాండ్ ► ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు సన్నద్ధమవుతుండటంతో విశాఖలోని నిపుణులు అభ్యంతరం తెలిపారు. పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు. ► ఈ ఫ్యాక్టరీని 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ మిగులు భూముల్లో నెలకొల్పిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బదులుగా వేరే చోట భూములు కేటాయించి తరలించాలని డిమాండ్ చేశారు. విస్తరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా పట్టుబట్టారు. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని అప్పట్లో డిమాండ్ చేశారు. మనమే అనుమతి ఇచ్చేద్దాం.. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు, కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఇ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్(సీఎఫ్వో)కు తాజాగా 2018 డిసెంబర్ 27న అనుమతులు జారీ చేసింది. ఇవి 2025 డిసెంబర్ 26 వరకు అమలులో ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చి చేతులు దులిపేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణకు 2023 ఏప్రిల్ వరకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం 2018 జూన్లో ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేవని ఒప్పుకున్న ఎల్జీ పాలిమర్స్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఇంకా తమకు మంజూరు కాలేదని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే స్వయంగా పేర్కొంది. ఈ మేరకు 2019 మే 8న (అప్పటికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది) ఆ కంపెనీ ఓ అఫిడవిట్ను సమర్పించింది. ► ఈ పరిస్థితిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని, ఎలాంటి అపరాధ రుసుము అయినా చెల్లిస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. టీడీపీ హయాంలో తూతూమంత్రంగా తనిఖీలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి భూ పందేరం చేయడమే కాకుండా.. దాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఆ కంపెనీలో లోటుపాట్లను కనీస మాత్రంగానైనా పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే విస్తరణకు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు.. సదరు సంస్థ ఉత్పత్తిని పెంచుకునేలా అడ్డగోలు అనుమతులిచ్చింది. అప్పటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలను సైతం తూతూమంత్రంగా నిర్వహించి, మొక్కుబడి నివేదికలు సమర్పించింది. 2016 సెప్టెంబర్ 16న, 2017 మార్చి 21న, 2017 అక్టోబర్ 27న, 2018 ఏప్రిల్ 23న, 2018 అక్టోబర్ 12వ తేదీన.. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఎటువంటి సూచనలు, ఆదేశాలు గానీ జారీ చేయలేదు. బాబుకు ఆది నుంచి ప్రత్యేక ఆసక్తి ► ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ అని పిలుస్తున్న ఈ ఫ్యాక్టరీని 1961లో ‘హిందుస్థాన్ పాలిమర్స్’ పేరుతో స్థాపించారు. అప్పట్లో విశాఖకు దూరంగా ఉన్న ఆర్.ఆర్.వెంకటాపురంలో నెలకొల్పారు. హిందుస్థాన్ పాలిమర్స్ను 1978లో యూబీ గ్రూప్నకు చెందిన మెక్డోనాల్డ్స్ కంపెనీ టేకోవర్ చేసింది. ► 1997లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీని యూబీ గ్రూప్ నుంచి దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కొనుగోలు చేసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు యూబీ గ్రూప్నకు డీలర్గా ఉండేవారు. ఆ గ్రూప్ చైర్మన్ విజయ మాల్యాకు ఆదికేశవులు వ్యాపార భాగస్వామి. ► ఎల్జీ కంపెనీ ప్రమోటర్లు 1997లో అప్పటి సీఎం చంద్రబాబు, డీకే ఆది కేశవుల ద్వారానే కథ నడిపించి యూబీ గ్రూప్ నుంచి ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఎల్జీ కంపెనీ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. ► 1961లో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం విశాఖపట్నం నగరానికి దూరంగా ఉండేది. కానీ 2017 నాటికి జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లో 1998లో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. నేను అప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నాను. కంపెనీని తరలించాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ శివాజీ రావు నాకు లేఖ రాశారు. నేను ఆ లేఖ విషయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరించాను. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. – మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి అప్పన్న భూములను కట్టబెట్టిన బాబు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న భూముల్లో 162.75 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందినవి. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి దేవస్థానం ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ 162.75 ఎకరాల్లోని 128.24 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఎల్జీ పాలిమర్స్కు అనుకూలంగా 2015 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 34.51 ఎకరాల గురించి కూడా నెలరోజుల్లో తేల్చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైమాటే. అంటే రూ.1,620 కోట్ల విలువైన భూమిని ఎల్జీ పాలిమర్స్ పరమయ్యాయన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇంతటి ప్రమాదకరమైన పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం ప్రమాదకరం. ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందలేదు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంతటి ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రమోటర్లపై కేసు నమోదు చేయాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి -
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను పాటించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సముద్రాలు, నదులు, కాలువలు.. అన్నీ కలుషితం అవుతున్నాయని, అందరూ చెత్తను వాటిలో వేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలను సేకరించి కాలుష్య రహితంగా మార్చాల్సిన బాధ్యత ప్రత్యేక కార్పొరేషన్కు అప్పగించాలన్నారు. వ్యర్థాల సేకరణ, ట్రీట్మెంట్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సమగ్రమైన.. సమర్థమైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ రూపొందించుకోవాలని సూచించారు. ప్రమాణాలు పాటించే పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదని, అదే సమయంలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు పంపించాలని ఆదేశించారు. ఎవరెవరు ఏయే ప్రమాణాలు పాటించాలో సూచించే బోర్డులను ఆయా పరిశ్రమల్లో, సంబంధిత వ్యవస్థల్లో ఉంచాలని ఆదేశించారు. సీఎం ఏమన్నారంటే.. - కాలుష్య నియంత్రణకు విజిల్ బ్లోయర్ వ్యవస్థలను ప్రోత్సహించాలి. - కాలుష్యం వెదజల్లే సంస్థలు, వ్యక్తులపై సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచాలి. వారికి బహుమతులు ఇవ్వాలి. - మున్సిపాల్టీలు, పట్టణాల్లో కాలుష్య నివారణపై శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలి. - పర్యావరణ రక్షణ దిశగా మనం తీసుకుంటున్న చర్యల ఫలితాలు మూడేళ్లలో కనిపించాలి. కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి కనిపించకూడదు. - సీఎం ఆదేశం మేరకు పరిశ్రమలు, ఆస్పత్రుల సహా వివిధ సంస్థల నుంచి వచ్చే ఘన వ్యర్థ పదార్థాలను సేకరించి ట్రీట్మెంట్ చేయడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులు కార్పొరేషన్ పనితీరు, విధి విధానాలను ఆయనకు వివరించారు. -
కాలుష్యానికి కళ్లెం ఏదీ?
సాక్షి, సిటీబ్యూరో: కాలుష్య కారకపరిశ్రమలను కట్టడి చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రేక్షక పాత్రకేపరిమితం అవుతోంది. పర్యావరణపరిరక్షణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ..చాలా విషయాల్లో వెనుకంజ వేస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చట్టాలను అమలు చేయడం, చట్టాలు ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించేవిషయంలో చేష్టలుడిగి చూస్తోందని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి, నీటి కాలుష్య నివారణ చట్టాల అమలుకు..పీసీబీని ఏర్పాటు చేసినప్పటికీ సంబంధితవిషయ పరిజ్ఞానం ఉన్న వారిని కీలకపదవుల్లో నియమించకపోవడంతోఆయా చట్టాలు కాగితాలకే పరిమితంఅవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా నీటి కాలుష్య నివారణచట్టం సెక్షన్– 4, గాలి కాలుష్య నివారణ చట్టం–సెక్షన్ 5 ప్రకారం పీసీబీ అధ్యక్షులకు..పర్యావరణంపై పూర్తి అవగాహన, చట్టాలు ఉల్లంఘించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అపారమైన అనుభవం ఉండాలని పీసీబీ చట్టం పేర్కొంటోంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. అలాగే సంస్థ సభ్యకార్యదర్శికి అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం, అపార అనుభవం, శాస్త్రీయ, సాంకేతిక, పరిపాలన అనుభవం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. కానీ ఈ నిబంధనలకు పక్కనపెట్టి సంబంధిత అంశాలపై అనుభవం లేని వారిని కీలక పదవుల్లో నియమిస్తుండటంతో పీసీబీ నిర్వీర్యం అయ్యిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. 2001లో కోయంబత్తూర్లో జరిగిన పీసీబీ సమావేశంలో సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు నిపుణులు చేసిన సూచనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2005లో జారీచేసిన మార్గదర్శకాలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం పీసీబీ అధ్యక్షులుగా.. విశ్రాంత ప్రధాన కార్యదర్శిని నియమించడం శోచనీయమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆక్షేపించారు. ఇతర సభ్యుల నియామకంలోనూ ఇలాంటి పొరపాట్లు చేయడంతో పీసీబీ విశ్రాంత అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. 2017లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పీసీబీలో పర్యావరణ అంశాలపై పట్టున్న వారినే నియమించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో అవసరమైనంత మంది ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పలు పరిశ్రమలు ఇష్టారాజ్యంగా కాలుష్యానికి పాల్పడుతూ గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీ చేస్తుండడంతో వందలాదిగా నూతన పరిశ్రమలు ఏర్పాటవుతున్నప్పటికీ... కాలుష్య నివారణకు అవసరమైన నిఘా లేకపోవడం శోచనీయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తుండటం గమనార్హం. గ్రేటర్లో రోజురోజుకూ పెరుగుతోన్న కాలుష్యం.. వాయుకాలుష్యం: నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ఇందులో కాలంచెల్లిన వాహనాలు సుమారు 15 లక్షల వరకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో పలు ప్రమాదకర వాయువులున్నాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయుకాలుష్యంతో సిటీజన్లకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమవుతోంది. జలాశయాల కాలుష్యం: నగరంలో సుమారు 185 చెరువులుండగా..ఇందులో 100 చెరువులు ఆర్గానిక్ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నిత్యం వెలువడుతోన్న కాలుష్య ఉద్ఘారాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణం హననం అవుతోంది. నేల కాలుష్యం: బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, తోలు, లెడ్, బ్యాటరీ కంపెనీల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో నేల కలుషితమవుతోంది. కాలుష్య పరిశ్రమల ఆగడాలిలా.. ♦ ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ♦ ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. ♦ గాఢత అధికంగా ఉన్న వ్యర్థజలాలను జీడిమెట్ల, పటాన్చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ♦ ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ♦ ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ♦ ప్రధానంగా మల్లాపూర్,ఉప్పల్,కాటేదాన్,కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లితదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. ♦ మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నారు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ♦ ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అటు వైపు రాకుండా 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. ♦ వ్యర్థాల డంపింగ్తో కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామివాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ♦ ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. -
నగరం..ఊపిరిపీల్చుకుంది
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి మెజార్టీ సిటిజన్లు సొంతూరు బాటపట్టారు. రోడ్లెక్కే వాహనాలు తగ్గడంతో దుమ్ము, ధూళి కాలుష్యం కూడా సగానికంటే ఎక్కువగానే తగ్గింది. ఈసారి పండుగకి సుమారు 25 లక్షల మంది నగరం నుంచి సొంతూళ్లకు ప్రయాణం కావడంతో.. ప్రధాన రహదారులపై వాహనాల సంచారం అరకొరగానే కనిపించింది. గ్రేటర్ పరిధిలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతుండగా.. మంగళ, బుధవారాల్లో ఆ సంఖ్య 15 లక్షలకు మించకపోవడం గమనార్హం. దీంతో దుమ్ము, ధూళి కాలుష్యంతో పాటు మోటార్ వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ రెండు రోజులు నగరం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంది. కాలుష్యం తగ్గింది ఇలా... కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ప్రతి ఘనపు మీటర్ గాల్లో ధూళి కణాలు 60 మైక్రో గ్రాములకు మించి ఉండరాదు. కానీ సాధారణ రోజుల్లో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూళి కాలుష్యం నమోదవుతోంది. భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా మంగళ, బుధవారాల్లో వాయు కాలుష్యం సగానికంటే తక్కువ నమోదవడం విశేషం. మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు కూడా.. సగానికంటే తక్కువ మోతాదులో నమోదు కావడం విశేషం. నగరవాసులు సైతం పండగ వేళ ఇళ్లకే పరిమితం కావడంతో వాహనాల సంచారం గణనీయంగా తగ్గడం కాలుష్య ఉద్గారాలు పడిపోవడానికి మరో కారణం. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడాదికేడాది వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమెందుకని మండిపడింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజల ప్రాణాలు కోల్పోనిస్తారా ? దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకువెళతారా అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. బుధవారం సుప్రీం కోర్టు ఎదుట కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పంట వ్యర్థాల దహనం ఎందుకు ఆపలేకపోతున్నారు ? పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టడాన్ని నిరోధించడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలం చెందుతోందని ప్రశ్నించింది. పంట వ్యర్థాల్ని తగలబెట్టడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 7 వేల ప్రాంతాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టారని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ఇక అధికారులకు శిక్షపడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. ‘హరియాణా చర్యలపై కాస్త సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం పంజాబ్ ప్రధాన కార్యదర్శిపై నిప్పులు చెరిగింది. ‘కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతి ఇదా? పంజాబ్కి ప్రధాన కార్యదర్శిగా మీరేం చేస్తున్నారు. రైతులు పంట వ్యర్థాల్ని తగులబెట్టకుండా ఆపడం మీ వైఫల్యమే. ఇదే కొనసాగితే అధికారుల్ని సస్పెండ్ చేస్తాం’ అంటూ హెచ్చరించింది. ‘ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని చూసి గర్వపడతామా?’అని సుప్రీం జడ్జీలు నిలదీశారు. చైనా, పాక్ విష వాయువులు లీక్ చేస్తున్నారేమో: బీజేపీ నేత ఆరోపణలు ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనా కారణమని యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్ అగర్వాల్ ఆరోపించారు. పొరుగు దేశాలు మనపై విషవాయువులతో దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బహుశా అది పాక్, చైనాల పని అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పంట వ్యర్థాల్ని తగులబెట్టడం వల్లే కాలుష్యం అధ్వాన్నంగా మారిందన్న విమర్శల్ని తప్పు పట్టారు. దేశానికి వెన్నెముకలాంటి రైతుల్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. రైతులకు క్వింటాల్కు 100: సుప్రీం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్య పరిస్థితికి కారణమైన పక్క రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా, పంజాబ్లో గడ్డిని తగులబెట్టని రైతులకు క్వింటాల్కు రూ. 100 ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అందుకే రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. గడ్డిని తగులబెట్టకుండా ఉండేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాలని చెప్పింది. సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాన్ని 3 నెలల్లోగా తీసుకురావాలని హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించింది. -
రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి నుంచి కాలుష్య తీవ్రత ప్రమాదకరస్ధాయికి చేరడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్య ఎమర్జెన్సీని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కాలుష్య స్ధాయి ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. శీతాకాలంలో క్రాకర్స్ కాల్చడాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధించింది. మరోవైపు కాలుష్యం ఎమర్జెన్సీ దశకు చేరుకోవడంతో స్కూళ్లలో చిన్నారులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్రీతింగ్ మాస్క్లను పంచారు. ఢిల్లీ నగరం గ్యాస్ ఛాంబర్గా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణా, పంజాబ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో ఈ సీజన్లో పంట వ్యర్ధాలను రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీని కాలుష్యం ముంచెత్తుతోందని ఆయన ఆరోపించారు. కాగా వాయు నాణ్యత ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. పాఠశాలలకు సెలవలు ప్రకటిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక వాహనాలకు సరి బేసి స్కీమ్ అమలు చేయడంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్ధాయికి చేరడంతో ఢిల్లీలో మార్నింగ్ వాక్కు, కార్యాలయాలకు వెళ్లే స్ధానికులు మాస్క్లు ధరించి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. -
దీపావళి రాకముందే...
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు రెండు రోజుల ముందే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వానంగా మారింది. ప్రస్తుత సీజన్కు సంబంధించి శుక్రవారం నాడు అత్యల్ప గాలి నాణ్యత నమోదైంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 311గా ఉండగా.. శుక్రవారం 284 నుంచి 315 మధ్య నమోదైంది. గాలి కదలికలో వేగం మందగించడంతో కాలుష్యం తీవ్రత పెరిగింది. ముఖ్యంగా నెహ్రూ నగర్, అశోక్ విహార్, జహంగీర్పురి, రోహిణి, వాజీర్పూర్, బావన, ముండ్కా, ఆనంద్ విహార్ ప్రాంతాల్లోనూ ఇదే తీరుందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. చుట్టు్టపక్కలున్న బాఘ్పట్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, నోయిడాల్లోనూ ఇలాగే ఉంది. మరోవైపు ఢిల్లీ, శాటిలైట్ టౌన్లలో శనివారం నుంచి బుధవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు మూసివేయాలని ఆదేశించింది. -
‘ఎకో’దంతుడికి జై!
ఏకదంతుడు.. క్రమంగా ‘ఎకో’దంతుడవుతున్నాడు..మట్టి గణపతికి జై..రంగు ప్రతిమలకు బై.. అంటున్నారు భక్తులు. మట్టి విగ్రహాలకే మొక్కుతున్నారు..నీటి వనరుల కాలుష్యాన్ని పెంచుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) మోజు నుంచి బయటపడుతున్నారు. నాలుగైదేళ్లుగా మట్టి విగ్రహాల వైపు భక్తజనం దృష్టి సారిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలపై ప్రత్యేక కథనం.. - సాక్షి, హైదరాబాద్ సాగర్ నిమజ్జనంలో 43 శాతం మట్టివే.... గతేడాది నగరంలోని హుస్సేన్సాగర్లో నిమజ్జనమైన విగ్రహాల్లో 43 శాతం మట్టివేనని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కలు తేల్చింది. ఈసారి ఆ సంఖ్య 55 శాతాన్ని దాటుతుందని అంచనా. ప్రజల్లో అవగాహన మెరుగుపడిందన్న స్పష్టమైన సంకేతాలున్నాయని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్కుమార్ చెప్పారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవగాహన పెరిగిందన్నారు. ఎకోఫ్రెండ్లీ గణపతి ఐడియాలు కొన్ని.. చెరకు గణపతి... తమిళనాడులో 20 మంది కార్మికులు రెండు టన్నుల చెరకుతో భారీ గణపతిని తయారుచేశారు. ఆ తరువాత నిమజ్జనానికి బదులు ఆ చెరకుగడలను తీసి, భక్తులందరికీ పంచిపెట్టడంతో ఇప్పుడు చాలా చోట్ల చెరకు గణపతులు వెలుస్తున్నారు. తద్వారా వేస్టేజ్ ఉండదు, భక్తులకు ఉపయోగకరంగానూ ఉంటుంది. గోబర్ గణేషుడు... హిందువులు ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యికీ, పేడకూ అంతే పవిత్రత ఉంది. పేడ నీటిలో త్వరగా కరిగిపోతుంది. అందుకే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆవుపేడని కలిపి వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలుతో పాటు పవిత్రతకి పవిత్రతా చేకూరుతుంది. చేప మిత్రుడిగా... నిమజ్జనం చేసే నీటిలో ఉన్న చేపలకి ప్రమాదకరంగా మారకుండా ఉండడమే కాకుండా ఫిష్ ఫ్రెండ్లీ గణపతులను ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ ఎన్జీవో తయారుచేస్తోంది. ఆనంద్ పెంధార్కర్ అనే పర్యావరణ వేత్త ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుల తయారీని పరిచయం చేశారు. ఇలాంటి గణపతి విగ్రహాలు చేపలకు హానిచేయకపోవడమే కాదు, చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే చేపలు తినే పదార్థాలతోనే ఈ గణేషులను తయారుచేస్తారన్నమాట. తీపి గణపతి... వినాయకచవితికి కొంత మధురంగా మలచాలనుకున్న ముంబైకి చెందిన రింటూ రాథోడ్ 50 కేజీల చాక్లెట్ గణేషుడిని తయారు చేసింది. దీన్ని నీటిలో నిమజ్జనం చేయకుండా ఆ చాక్లెట్నంతా తీసి పిల్లల నోళ్లు తీపిచేశారు. అంతేనా పాలల్లో నిమజ్జనం చేసి మిల్క్షేక్ని భక్తులకు పంపిణీ చేశారు. గణపతిని విత్తుకోండిలా... ముంబైకి చెందిన దత్తాద్రి కొత్తూర్ ఓ సరికొత్త గణపతిని తయారుచేశారు. విత్తగణపతి అన్నమాట. అన్ని గణపతి విగ్రహాల్లా దీన్ని నీటిలో ముంచక్కర్లేదు. కుండీలో పెట్టుకుని కొద్దిగా నీరు పోస్తుంటే చాలు పండుగ రోజులు పూర్తయ్యేనాటికి మీ యింట్లో మీకు నచ్చిన కూరగాయ మొక్కల్ని ప్రసాదించేస్తాడు ఎకోఫ్రెండ్లీ వినాయకుడు. విత్తనాలేవైనా మీ యిష్టం, ధనియాలో, బెండకాయ, తులసి విత్తనాలో ఏవైనా మీకు కావాల్సిన విత్తనాలను మట్టితో కలిపి గణేషుడిని తయారుచేయడమే. తలా ఓ చేయి... పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు,ప్రభుత్వ విభాగాల అధికారులు ఈసారి మట్టి విగ్రహాలపై ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రసార మాధ్యమాలు కూడా తోడవడంతో జనంలో మార్పు కనిపిస్తోంది. - మట్టి విగ్రహాలపై దేవాలయాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. - గతేడాది 40 వేల మట్టి విగ్రహాలను రూపొందించి ఉచితంగా అందజేసిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఈ సారి ఆ సంఖ్యను 60 వేలకు పెంచింది. - వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నీటి వనరులకు చెడుపు చేయకుండా సహజ రంగులతో విగ్రహాలు తయారు చేశారు. - నగరంతోపాటు జిల్లాల్లో ఉన్న కొన్ని కుమ్మరి సంఘాలు కూడా మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. - కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, భక్త మండళ్లు, మహిళా మండళ్లు కూడా మట్టి విగ్రహాలకే జైకొట్టాయి. -
‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’
సాక్షి, విజయవాడ : పర్యావరణ హిత వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. విజయవాడలోని మెఘల్ రాజపురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణా శిబిరం కార్యక్రమాన్నిశనివారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్, బోర్డు కార్యదర్శి వివేక్ యాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ...రసాయన రంగులతో కూడిన గణపతి విగ్రహాలు వినియోగించడం వల్ల పర్యావరణానికి హానికరం అన్నారు. విగ్రహాల తయారిలో రసాయన రంగులను వాడి మంచి నీటి జలాశయాలను కలుషితం చెయవద్దని విఙ్ఞప్తి చేశారు. రంగు రంగుల పెద్ద విగ్రహాలను వాడి నిమజ్జనం చేసి కాలుష్యానికి కారకులు కాకుండా, మట్టి విగ్రహాలను వాడాలని సూచించారు. అదే విధంగా నిమజ్జనానికి ముందు ప్లాస్టిక్, ఇతర కరగని ఆభరణాలను తొలగించాలని పేర్కొన్నారు. బోర్టు సెక్రెటరీ వివేక్ యాదవ్ మాట్లాడుతూ..చిన్నపిల్లలకు కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల బంగారు భవిత వీరిదే కాబట్టి మట్టి వినాయకుల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
భూగర్భ జలాల అధ్యయనం; ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది. యురేనియం కార్పొరేషన్ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా.. లేదా అన్న విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఇక నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్జీఆర్ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఏపీ మైన్స్ మరియు జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను నియమించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ విషయంపై సత్వరమే నివేదిక అందించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడురోజుల్లోగా నియామకాలు పూర్తిచేసి...10 రోజుల్లోగా కమిటీ నివేదిక అందించనుంది. కాగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రమాణాలను పాటించడంలేదని, టెయిల్ పాండ్ నిర్మాణంలో సరైన డిజైన్, ప్రణాళిక లేదంటూ జూన్ 21,2018లో కడప ఎంపీ అవినాష్రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ కె.బాబురావు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన బోర్డు సదరు సంస్థకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అయితే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు మార్గదర్శకాలను పట్టించుకోకపోగా.. తాము ఇదివరకు తీసుకున్న చర్యలు సరిపోతాయని తెలిపింది. దీంతో ఆగస్టు 7న బోర్డు షోకాజ్ నోటీసు జారీచేసింది. తాజాగా ఈ విషయమై ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. -
ఒకవైపు ధూళి.. మరోవైపు పొగ..
సాక్షి, హైదరాబాద్: దేశంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయట.. అవి పెరిగాయంటే అర్థం.. వాయు కాలుష్యం కూడా బాగా పెరిగినట్లే.. ఎందుకంటే.. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బంధం ఫెవికాల్ అంత గట్టిది. మన నగరం పరిస్థితీ ఇంతే.. ఈ కాలుష్యం వల్ల ఆస్తమా, సైనస్, బ్రాంకెటీస్ వంటి వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమితికి మించిన కాలుష్యం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు ఇలాంటి కారణాలు అనేకం. అసలు కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రమాణాల ప్రకారం పరిమితి ఎంత ఉండాలి.. నగరంలో వాయు కాలుష్యం ఎంత ఉంది అన్నది తెలియాలా.. ఓసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. -
కాలుష్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోజు రోజుకీ పెరుగిపోతున్నకాలుష్యంపై కాలుష్య నియంత్రణ సంస్థ, జీహేచ్ఎంసీతో పాటు 13 విభాగాలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారిచేసింది. హైదరాబాద్లో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యంపై న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, జీహేచ్ఎంసీతో పాటు 13 విభాగాలకు నోటీసులు జారీ చేసింది. కాలుష్యంపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం నోటీసుల్లో పెర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
విజయవాడ: గగనతరమైన స్వచ్ఛ గాలి
విజయవాడలో కాలుష్యకారకాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. తినే తిండి ఎలాగూ కలుషితమైపోగా.. చివరకు పీల్చే గాలిలో కూడా హానికర పరిస్థితులున్నాయంటూ కాలుష్య నియంత్రణ మండలి లెక్కలుగట్టి మరీ హెచ్చరిస్తోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఈ సంస్థ సేకరించిన గణాంకాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడను కాలుష్య భూతం కమ్మేసింది. ఇక్కడ సూక్ష్మధూళి కణాల పరిమాణం రోజురోజుకీ అధికమవుతోంది. దీంతో స్వచ్ఛమైన గాలి గగనమైంది. వాహనాల రణ, గొణ ధ్వనులు.. వాయు కాలుష్య ఉద్గారాలు నిత్యం పెరుగుతుండడమే ఇందుకు కారణం. ఫలితంగా నగరంలో పలు ప్రాంతాలు ధూళిమయమవుతున్నాయి. మొక్కల పెంపకం తగ్గిపోవడం.. అడవుల విస్తీర్ణం క్రమంగా క్షీణిస్తుండడం.. వాహనాలు అంతకంతకు పెరుగుతుండడం.. చెత్త, ప్లాస్టిక్ తగులబెడుతుండడం వంటి చర్యలతో నగరంలో కాలుష్య కణాలు మితిమీరిపోతున్నాయి. విజయవాడ కాలుష్య పూరితమే.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 10 సూక్ష్మదూళి కణాల వార్షిక సగటు ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించి ఉండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకైతే 20 మైక్రో గ్రాములకు దాటకూడదు. అంతకు మించిచే ఆ ప్రాంతంలో గాలి కాలుష్య పూరితమే. గాలిలో పీఎం 10 పరిమాణం వార్షిక సగటు చూస్తే విజయవాడ నగరంలో పీఎం 10 తీవ్రత ఎక్కువగానే ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం చూస్తే.. నగరంలో ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ ఆందోళనకర స్థాయిలో విడుదల అవుతోంది. ఇది గాలిలో 2 శాతం ఉంటోంది. గాలిలో ధూళి కణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్య కూడళ్లలో పీఎం 10 ప్రమాణాలు (సూక్ష్మ ధూళి కణాలు) వందకు 80 వరకు నమోదవుతున్నాయి. పీఎం 2.5 (అతి సూక్ష్మ ధూళి కణాలు) గణాంకాలు కూడా ఇదే రీతిలో ఉంటున్నాయి. గాలిలో సన్నటి ధూళిని ఈ ప్రమాణం సూచిస్తుంది. ఇది 60కు 58 వరకు ఉంటోంది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలోని వీటీపీఎస్ తాప విద్యుత్తు ఉత్పత్తిలో భాగంగా వెలువడే ఉద్గారాలు వాయు కాలుష్యానికి మరింత జతకడుతున్నాయి. శబ్ద కాలుష్యం అధికమే.. కృష్ణా జిల్లాలో మొత్తం 11.36 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో రవాణా వాహనాలు 1.33 లక్షలు, రవాణేతర.. 10.02 లక్షలు ఉన్నాయి. ఎక్కువగా విజయవాడ నగర పరిధిలోనే 88,210 రవాణా, 5.93 లక్షల రవాణేతర వాహనాలు ఉన్నాయి. అలాగే ఆసియాలోనే అతిపెద్ద ఆటో మొబైల్ హబ్గా విజయవాడ గుర్తింపు పొందింది. దాదాపు 175 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటైంది. ఇందులో 500 పెద్ద, చిన్న పరిశ్రమలు వచ్చాయి. ఇవి కాకుండా 4 వేలకు పైగా సర్వీస్ యూనిట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఎక్కువగా ప్లాస్టిక్ పరిశ్రమలు, ఆయిల్ కంపెనీలు, లూబ్రికెంట్లు, పరుపుల తయారీ యూనిట్లు నెలకొల్పారు. నట్లు, బోల్టుల తయారీ పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటి నుంచి విడుదలవుతున్న రసాయనాలు, వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో నగరంలో కొన్ని వ్యాధుల విస్తృతి పెరిగిపోయింది. ప్రత్యేకించి ఆస్తమా, క్యాన్సర్, కళ్ల ఎలర్జీ, దగ్గూ, జలుబు బారిన పడటం సాధారణమైపోయింది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఏదో ఒక వ్యాధితో తరచూ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన ప్రాంతాల్లో కాలుష్య స్థాయి ఇదీ.. విజయవాడ నగరంలో కాలుష్య నియంత్రణ మండలి పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని కొలిచే యూనిట్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఈ ఏడాది నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.. వాయు కాలుష్యంతో పెనుముప్పు.. రాజధాని నగరంలో వాయు కాలుష్యం పెనుముప్పుగా మారింది. శ్వాస ద్వారా అధిక విష వాయువులను పీలుస్తున్నాం. దీంతో శ్వాస కోశ, చర్మ సంబంధిత వ్యాధులతోపాటు హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయి. కాలుష్య కారకాలను పీలుస్తుండటం వల్ల దూమపానం చేయని వారు సైతం లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. న్యూరో లాజికల్ వ్యాధులూ పెరుగుతున్నాయి. వాయుశబ్ధ కాలుష్యంతో మానసిక వ్యాధులతోపాటు రక్తనాళలపై ప్రభావం చూపి గుండె జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు సోకుతున్నాయి. – డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వైద్య నిపుణులు -
కేటీపీఎస్లో కాలుష్య నియంత్రణ ప్లాంట్
పాల్వంచ: విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొత్తగా నిర్మాణం చేస్తున్న కర్మాగారాల్లో ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ (ఎఫ్జీడీ) నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కేంద్రంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నా రు. ఈ మేరకు టీఎస్ జెన్కో అధికారులు స్థల సేకరణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులను సుమారు రూ.300 కోట్లతో బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. దీని వల్ల కర్మాగారం నుంచి వెలువడే పొగలో హానికర వాయువులను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ డిమాండ్ దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్ 7వ దశ (800మెగావాట్లు), మణుగూరు వద్ద బీటీపీఎస్ (1080 మెగావాట్లు), నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ (4వేల మెగావాట్లు) నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 2018 డిసెంబర్ 26న సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేశారు. అప్పటి నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి నిరంతరాయంగా వస్తోంది. భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉత్పత్తి సాధిస్తున్న కేటీపీఎస్ 7వ దశ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కేంద్రంగా కాలుష్య నియంత్రణ కోసం ఇప్పుడు పాటిస్తున్న ప్రమాణాలతో పాటు కొత్తగా ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మించి కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపడుతుండటం గమనార్హం. దీని ద్వారా బొగ్గు మండినప్పుడు వచ్చే సల్ఫర్ వాయువు (పొగ)లో నార్మల్ మీటర్ క్యూబ్ 50 మిల్లి గ్రామ్స్కు మించకుండా ఈ ప్లాంట్ ఉపయోపడుతుంది. దీని వల్ల హానికర వాయువులు తగ్గుతాయి. స్థల సేకరణకు యాజమాన్యం కసరత్తు బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందుకు గాను కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో స్థల సేకరణ పనుల్లో జెన్కో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 420 ఎకరాల్లో కేటీపీఎస్ 7వ దశను నిర్మించగా పక్కనే ఉన్న సెక్యూరిటీ కాలనీని ఎఫ్జీడీ ప్లాంట్ కోసం కేటాయించారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం సెక్యూరిటీ కాలనీలో నిర్మించిన క్వార్టర్లలో సిబ్బందిని ఖాళీ చేయించారు. వెంటనే వాటిని నేలమట్టం చేసే పనులు చేపట్టారు. 16 బ్లాక్లు(92 క్వార్టర్లు) గతంలో చాలా వరకు శిథిలావస్థకు చేరడంతో వీటిని తొలగించి నిర్మిస్తే మేలనే నిర్ణయంతో వీటిని తొలగిస్తున్నారు. క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల సమీప జీవరాశులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉండటంతో ఎఫ్జీడీ ప్లాంట్తో పాటు ఆంబియస్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల (ఎఎక్యూఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. కేటీపీఎస్ 7వ దశ పరిధిలో గల సురారం, పునుకుల, పుల్లాయిగూడెం, పాత ప్లాంట్, కూలింగ్ టవర్, బొల్లేరుగూడెం ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గాలిలో వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దీనిని ఇక్కడి అధికారులతో పాటు ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లో ఉండే పొల్యూషన్ సెంట్రల్ బోర్డు అధికారులు కూడా మానిటరింగ్ చేయనున్నారు. ఎఫ్జీడీ ప్లాంట్తో కాలుష్య నియంత్రణ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో వెలువడే కాలుష్యాన్ని ఎఫ్జీడీ ప్లాంట్ నియంత్రిస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు కొత్తగా ఈ ప్లాంట్ నిర్మాణం తప్పక చేయాలని పొల్యూషన్ బోర్డు అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి రూ.300కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. సెక్యూరిటీ కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖర్చు అధికమైనా ఈ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నాం. జె.సమ్మయ్య, సీఈ కేటీపీఎస్ ఓఅండ్ఎం, 7వ దశ -
పర్యావరణ కలుషితం హత్య లాంటిదే..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితం పేరుతో నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేసినట్టు ఇసుక తవ్వకాలు జరిగితే ఎలా అని ప్రశ్నించింది. పర్యావరణాన్ని కలుషితం చేయడం హత్య లాంటిదేనని అభిప్రాయపడింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించాలని, అది చూసి తప్పు చేయాలనుకొనే వారు భయపడాలని సూచించింది. నూతన రాజధాని రూపుదిద్దుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు, జల కాలుష్య నివారణకు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ఎన్జీటీ శుక్రవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఢిల్లీ పిలిపించుకొని చర్చించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ కె.రామకృష్ణన్, జస్టిస్ డా. ఎన్.నందలతో కూడిన బెంచ్ ముందు సీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణకు పలు సూచనలు చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల విషయమై ఈ నెల 4న జరిమానా విధించామని గుర్తు చేసింది. నష్ట పరిహారం వసూలు జరగడం లేదు.. పర్యావరణాన్ని కలుషితం చేయడం కూడా నేరమేనని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ఒక హత్య వల్ల ఒక మనిషి చనిపోతాడు. పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఇది కూడా మర్డర్ లాంటిదే’ అని పేర్కొంది. కానీ పర్యావరణానికి జరుతున్న నష్టానికి సమానంగా నష్టపరిహారం వసూలు జరగడం లేదంది. అసలు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చలేమని వ్యాఖ్యానించింది. నదులను ఇష్టానుసారం తవ్వేయడం వల్ల ప్రవాహ దిశలు మారిపోవడం, వరదలు రావడం, నీటి ఎద్దడి, భూగర్భ జలాలు అడుగంటడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. తద్వారా ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సరైన ప్రణాళికతో వెళ్లడం లేదని, వారి వద్ద ఉన్న నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల వందల కోట్లు మిగిలిపోతున్నాయని తెలిపింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఈ రోజుల్లో సరిగ్గా అంచనా కూడా వేయలేకపోతున్నామని, కొన్ని విషయాల్లో ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇస్తే.. తద్భిన్నంగా తాము పంపే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయని వివరించింది. సీఎస్ వచ్చినా హాజరుకాని ఏజీ, ప్రభుత్వ న్యాయవాది.. ఎన్జీటీలో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరైనా అడ్వకేట్ జనరల్ (ఏజీ) మాత్రం హాజరు కాలేదు. కనీసం ఢిల్లీలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కూడా ట్రిబ్యునల్తో సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం. మీరే దగ్గరుండి పర్యవేక్షించండి.. పర్యావరణ పరిరక్షణ అన్నది తమ ప్రధాన ఎజెండా అని, అది దేశంలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక్కటే అని బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే చర్చించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించి పిలిపించినట్టు తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని, విశాఖలో వ్యర్థాలన్ని సముద్రంలో కలుస్తున్నాయని, కొల్లేరు 14 రకాల హానికారక క్రిములతో నిండి ఉందని, తూర్పుగోదావరి, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని వివరించింది. దీనిపై దృష్టి సారించాలని, పర్యావరణ పరిరక్షణను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎస్కు సూచించిన ట్రిబ్యునల్.. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంది. సీఎస్ స్పందిస్తూ తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, నిబంధనల మేరకు అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక క్లçస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి మరో ఆరు నెలల తరువాత సమావేశమవుదామని తెలిపింది. -
ఏపీ సర్కారుకు రూ.100 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్కుమార్ గోయల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ మ్యాన్గా ప్రసిద్ధి గాంచిన తరుణ్ భారత్ సంఘ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్సోనీ, అనుమోలు గాంధీ, సత్యనారాయణ బొలిశెట్టి గత ఏడాది అక్టోబర్లో రాసిన లేఖను పిటిషన్గా పరిగణిస్తూ ఎన్జీటీ ఈ కేసును విచారించింది. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయిన ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నారు. తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. పర్యావరణ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ, వేలాది ట్రక్కుల్లో తరలిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తమతో చెప్పారని లేఖలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలను వ్యతిరేకించినందుకు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు తమపై దాడులకు సైతం పాల్పడ్డారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి, స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇసుక దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ స్వరూపం ప్రమాదంలో పడుతోందని, పర్యావరణం దెబ్బతిన్నదని వివరించారు. భారీ ట్రక్కుల వల్ల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్రయవిక్రయాల్లో నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వ్యతిరేకించే రైతులపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడుతోందన్నారు. అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసేందుకు గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ లేఖను ఎన్జీటీ పిటిషన్గా స్వీకరించి, విచారించింది. చర్యలపై నెల రోజుల్లోపు నివేదిక సమర్పించాలని డిసెంబరు 21న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)ని ఎన్టీజీ ఆదేశించింది. జరిమానా విధించడం సబబే... తాజాగా పిటిషన్ గురువారం విచారణకు రాగా, పిటిషనర్ల తరపున న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు. 2015 నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని, గతంలోనే రేలా స్వచ్ఛంద సంస్థ తరపున పిటిషన్ కూడా దాఖలు చేశామని నివేదించారు. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనాలు ఉన్నాయన్నారు. ఇక పిటిషన్లో ఉన్న అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీపీసీబీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అనుమతి లేని ఇసుక తవ్వకాలను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతంలోని ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటుంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీపీసీబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్–ధన్బాద్ ప్రతినిధులతో కూడిన కమిటీ సంయుక్తంగా తనిఖీ చేసి, ఇప్పటివరకు జరిగిన ఇసుక తవ్వకాలు, నదులకు జరిగిన నష్టం, ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. జరిగిన నష్టంపై శాఖాధితిపతులను బాధ్యులను చేయాల్సి ఉంటుంది. అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుంది’’ అని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఇచ్చే ముందు ఏపీపీసీబీ తరపు న్యాయవాది ధనుంజయ్ తొలుత ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని కోరారు. పిటిషన్లోని అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ నివేదిక ఉన్నందున ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. -
గోదావరికి ఊపిరి!
సాక్షి, హైదరాబాద్: కాలుష్య కాసారంగా మారిన గంగానదిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నడుం బిగించినట్లే.. దక్షిణ గంగగా పేరున్న గోదావరిని పవిత్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర పరీవాహకంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరికి పునరుజ్జీవం పోసి కొత్త ఊపిరిలూదే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసింది. బాసర మొదలు భద్రాచలం వరకు 500 కిలోమీటర్ల మేర నదిని శుద్ధి చేసి, దాన్ని మున్ముందు పవిత్రంగా ఉంచేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కేంద్ర సూచనల నేపథ్యంలో గోదావరిని కలుషితం చేస్తున్న మురుగు, పరిశ్రమల కాలుష్యం, ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్పెట్టి పునరుజ్జీవం చేయనుంది. నీటి నాణ్యత దయనీయం.. గోదావరి నది తీరం పొడవు 1,495 కిలోమీటర్లు కాగా, దీని పరీవాహకం 3.12లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో బాసర నుంచి భద్రాచలం వరకు 500 కి.మీ.ల మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉప నదులు, 54 నాలాలు కలుస్తున్నాయి. నది పరీవాహక ప్రాంతంలో ఉన్న 19 ప్రధాన పట్టణాల నుంచి గోదావరిలో అవ్యవస్థీకృత వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కలుస్తోంది. ఐటీసీ కాగితపరిశ్రమ నుంచీ కలుషిత జలాలు వస్తున్నాయి. మంచిర్యాల పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా గోదావరిలో చేరుతోంది. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్కు 3 గ్రా. మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 గ్రాములు/లీ. వరకు ఉంది. దీంతో నదిలోని నీటిని తాగేందుకు కానీ, స్నానాలకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు జలచరాలకు తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తడంతో పాటు సాగు అవసరాలను తీర్చడం గగనంగా మారనుంది. మురుగు ముంచేస్తోంది.. నది పరీవాహకంలోని 54 మురుగు కాల్వల ద్వారా మురుగు గోదావరిలోకి ప్రధానంగా వచ్చి చేరుతోంది. మొత్తం పరీవాహక ప్రాంతంలో 54 ప్రధాన పట్టణాల్లో 22.57 లక్షల మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తున్నారు. అందులో 199.96 ఎంఎల్డీ మురుగు నదిలో చేరుతోంది. ఇందులో 10 ఎంఎల్డీ కన్నా ఎక్కువగా తుంగిని (34.58 ఎంఎల్డీ), మంచిర్యాల (25.22 ఎంఎల్డీ), సింగారెడ్డిపల్లి (25.02ఎంఎల్డీ), బొర్నాపల్లి(16.83 ఎంఎల్డీ), బూర్గంపాడ్ (16.9 ఎంఎల్డీ), కోటిలింగాల (11.59 ఎంఎల్డీ) వంటి నాలాల ద్వారా నదిలోకి పెద్ద ఎత్తున మురుగునీరు చేరుతోంది. రోజుకు 6,75,586 కేజీల ఘన వ్యర్థాలు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంబడి ఉన్న 244 పరిశ్రమల ద్వారా 8,825 కేఎల్డీల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. మార్గం చూపిన కేంద్రం.. దేశవ్యాప్తంగా కాలుష్యం బారిన పడుతున్న నదులు 351 వరకు ఉండగా అందులో గోదావరి ఒకటని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. ఈ నదిలో ప్రమాణాలకు అనుగుణంగా నీటి నాణ్యత లేదని, ఈ దృష్ట్యా శుద్ధి చేయని వ్యర్ధాలు, ఘన వ్యర్థాలు రాకుండా చూడాలని, పరీవాహకంలో అక్రమాలను నిరోధించి, అక్రమ మైనింగ్ను అడ్డకుని నదికి పునరుజ్జీవం పోయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటి పారుదల శాఖ, పర్యావరణ, అటవీ శాఖలు సంయుక్తంగా గోదావరి పునరుజ్జీవనానికి ప్రణాళికలు రూపొందించాయి. బాసర దగ్గరలోని కందుకుర్తి నుంచి భద్రాచలం దగ్గరున్న బూర్గంపహాడ్ వరకు నది తీర ప్రాంతాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మొదటి దశలో నది కాలుష్య కారకాల గుర్తింపు, రెండో దశలో సమస్యకు తగిన పరిష్కారం చూపడం, దాన్ని అమలుచేయాలని, మూడో దశలో నది సంరక్షణ చర్యలు చేపట్టి, దాని అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించాయి. ప్రస్తుతం పరీవాహక పట్టణాల్లో మొత్తం 73 ఎంఎల్డీ సామర్థ్యమున్న మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఉండగా, మరో 19 చోట్ల కొత్తగా ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించాయి. వీటితో పాటు కాలుష్య నియంత్రణకు కొన్ని నిబంధనలను రూపొందించి, వాటిని కచ్చితంగా పాటించేలా మార్గదర్శకాలు తయారుచేశాయి. వీటిని కచ్చితంగా అమలు చేసేలా ఆయా శాఖలు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించాయి. రూపొందించిన మార్గదర్శకాలు - పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - పారిశ్రామిక వ్యర్థాలను తీవ్రత ఆధారంగా వర్గీకరించి, శుద్ధి చేయాలి. - నది పరీవాహక ప్రాంతాలను గుర్తించి గృహ వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేయాలి. బహిరంగ మల విసర్జనతో పాటు,బహిరంగ చెత్త వేయడాన్ని నివారించాలి. - ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాలు,గ్రామాలను గుర్తించి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. - నది వ్యర్థాలు కలిసే చోట ఈటీపీలు ఏర్పాటు చేయాలి. - ఎన్టీపీసీ, టీఎస్జెన్కోలు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారాల నుంచి వెలువడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి. - ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో వారి పరిసరాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. ఇలా శుద్ధి చేసిన నీళ్లను పూల తోటల పెంపకానికి పునర్వినియోగించాలి. - గోదావరి పరీవాహకంలోని పరిశ్రమలన్నీ భూగర్భ జల వనరుల శాఖ అనుమతిలేనిదే యథేచ్ఛగా వ్యర్థాలు విడుదల చేయొద్దు. - పట్టణాలు, గ్రామాల నుంచి ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింVŠ æచేయాలి. లేదంటే సమీపంలోని పవర్ప్లాంట్లకు లేదా బట్టీలకు పంపాలి. - నది పరీవాహకం వెంబడి ఎస్టీపీల పనితీరును, సరస్సుల పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించాలి. ప్రతి విద్యా సంస్థ విద్యార్థులకు నది కాలుష్యంపై బోధించాలి. - వరద జలాలు శుద్ధి జరిగాకే నదుల్లో కలిసేలా చూడాలి. -
జీహెచ్ఎంసీ ప్రణాళిక బాగుంది..
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాలుష్యానికి మురికివాడల్లో ఉండే నిరుపేదలు కారణమని అందరూ అనుకుంటుంటారు. వాస్తవానికి అది తప్పు. దేశం కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి బీఎండబ్ల్యూ, బెంజ్ కారుల్లో తిరిగే ధనవంతులే కారణం. వారే చెత్త విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరించేది. క్యారీ బ్యాగుల్లో చెత్తను తీసుకొచ్చి ఎక్కడపడితే అక్కడ వేసేది ధనవంతులే. – హైకోర్టు ధర్మాసనం జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణలో భాగంగా చెరువుల్లోకి మురుగు నీటిని తీసుకొచ్చే మార్గాలను మూసివేసే విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రణాళిక అమల్లో చట్టపరమైన ఇబ్బందులతో పాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకెళ్లే విషయంలో జీహెచ్ఎంసీకి సహకారం అందించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు సూచనలు, సలహాలను జీహెచ్ఎంసీకి ఇవ్వాలని పీసీబీకి స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయబోతున్నారో తెలియచేయాలని హెచ్ఎండీఏ, సీవరేజీ బోర్డు, పీసీబీ తదితరులను ఆదేశించింది. చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్ టెక్నాలజీతోపాటు ఇతర సాంకేతిక పద్ధతుల వినియోగంపై ఓ నిర్ణయం తీసుకోవాలంది. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువు ను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం బుధవా రం మరోసారి విచారించింది. చెరువుల్లోకి మురుగునీటిని తీసుకొస్తున్న మార్గాలను మూసివేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఓ కార్యాచరణ ప్రణాళికను జీహెచ్ఎంసీ కమిషనర్ ధర్మాసనం ముందుంచారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, గత ప్రణాళికతో పోలిస్తే, ఇది బాగుందంటూ సంతృప్తి వ్యక్తం చేసింది. జియో ట్యూబ్ టెక్నాలజీతో పాటు ఇతర టెక్నాలజీలను పరిశీలిస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పగా, ఇందులో పరిశీలించడానికి ఏముందని ప్రశ్నించింది. నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా, నెల రోజులు పడు తుందని ఏజీ చెప్పారు. నెల రోజుల గడువుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేస్తూ, అంత సమయం ఎందుకు? ఇది షాపుల వెంట తిరిగి తెలుసుకోవాల్సిన విషయం కాదు కదా? ఐకియా టౌన్కి వెళ్లి పరిశీలించాల్సిన విషయం అంతకన్నా కాదు.. ఉన్న టెక్నాలజీ ఏమిటి..? దేని వ్యయం తక్కువ వంటివి తెలుసుకుంటే చాలు. వీటిని తెలుసుకునేందుకు 30 రోజులు ఎందుకంటూ ప్రశ్నించింది. -
ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శ్కుమార్ గోయెల్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది. జనావాసాల్లో నెలకొల్పిన స్టీల్ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది. ‘ఆలిండియా లోకాధికార్ సంఘం’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్పై విచారించిన ట్రైబ్యునల్ ఈ తీర్పునిచ్చింది. కాగా, ఢిల్లీ మాస్టర్ప్లాన్-2021 ప్రకారం నిషేదించబడిన ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయనీ, వాటిని నియంత్రించాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (డీపీసీసీ)కు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ జరిమానా తప్పలేదు.