priya
-
నవ్విస్తూనే ఆలోచింపజేసే చిత్రం ‘తకిట తదిమి తందాన’
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘తకిట తదిమి తందాన’(Thakita Thadhimi Tandana). రాజ్ లొహిత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆదిత్య (ఘన ఆదిత్య) నకిలీ సర్టిఫికెట్స్తో ఓ పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. సాలరీ అంతా జల్సాల కోసం ఖర్చు చేస్తాడు. ఇక పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవుదామనుకునే సమయంలో ఉద్యోగం ఊడిపోతుంది. దీంతో క్రెడిట్ కార్డులను వాడేసి పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని అబద్దం చెప్తాడు. చాన్నాళ్ళపాటు ఉద్యోగం రాక ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చుని ఉద్యోగం కోసం వెతుకుతాడు. అదే సమయంలో లోన్ యాప్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి. ఒకవైపు ఉద్యోగం లేదు..మరోవైపు అప్పు కట్టమని బెదిరింపులు.. మరి ఆదిత్య ఏం చేశాడు? తన తప్పుడు నిర్ణయాలు తన జీవితాన్ని ఎలా మార్చాయి? అనేదే ఈ సినిమా కథ. జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసే చిత్రమే తకిట తధిమి తందాన. ఓవర్ కాన్ఫిడెన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ.ఎప్పటికీ ఇలాగే పెద్ద మొత్తంలో నెలనెలా జీతం అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుందనే భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు కొంతలోకొంత కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.స్వయంగా కథ - సంభాషణలు సమకూర్చుకున్న రాజ్ లోహిత్... రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా... దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యగా... హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో... ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం "స్విగ్గి బాయ్" అవతారం ఎత్తడం వంటి సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి.రామ్ గోపాల్ వర్మ "మర్డర్"తోపాటు... "సమ్మేళనం" అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యువతరానికి ప్రతినిధిలా తన పాత్రలో ఒదిగిపోయాడు. తనను తాను ఇంకొంచెం సానబెట్టుకుంటే ఈ కుర్రాడికి హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి "ప్రియ కొమ్మినేని"కి కూడా. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. హావభావాలపై మరి కాస్త దృష్టి పెడితే, ఈ అచ్చ తెలుగమ్మాయికి కూడా ప్రేక్షకులు కచ్చితంగా పట్టం కడతారు. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా... కథకు/సినిమాకు చాలా హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. యూత్ ఫుల్ చిత్రం అనగానే.. అనవసరమైన అసభ్యతను చొప్పించే నేటి కాలంలో... హీరోహీరోయిన్ల నడుమ వచ్చే రొమాంటిక్ సీన్స్.. శృతి మించకుండా, పొయిటిక్ గా తెరకెక్కించడం యూత్ కూడా ఇష్టపడేలా ఉన్నాయి. -
జల్సాల కోసం అప్పులు చేస్తే..‘తకిట తధిమి తందాన’
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘తకిట తదిమి తందాన’(Thakita Thadhimi Tandana). రాజ్ లొహిత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈసందర్భంగా నిర్మాత చందన్ కుమార్ కొప్పుల మాట్లాడుతూ... "నేను స్వతహా సినిమా పిచ్చోడ్ని. ఇంచుమించుగా అన్ని సినిమాలు చూస్తుంటాను. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైమ్ లో నేను చూసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి చెరగని ముద్ర వేసే సినిమా చేయాలనే సంకల్పంతో నిర్మాతగా మారాను. ఆ క్రమంలో రాజ్ లోహిత్ పరిచయం కావడం, తను చెప్పిన కథతో నేను కనెక్ట్ కావడంతో రంగంలోకి దిగాను. ఫస్ట్ కట్ చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది" అన్నారు. "తకిట తధిమి తందాన" రాజ్ లోహిత్ ప్రతిభకు అద్దం పడుతుందని, జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వినోదాత్మకంగా చెప్పామని" చందన్ తెలిపారు.ఇంకా ఆయన మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తాను విజయవంతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండడంతో తన కుటుంబ సభ్యుల మోరల్ సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. "తకిట తధిమి తందాన" చిత్రాన్ని విడుదల చేయడంలో సినేటేరియా వెంకట్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన ఈ నూతన నిర్మాత... హరి శంకర్ ఎడిటింగ్, నరేన్ రెడ్డి మ్యూజిక్, రాజ్ లోహిత్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని పేర్కొన్నారు. హీరో ఘన ఆదిత్య, తెలుగమ్మాయి ప్రియలకు ఉజ్వల భవిష్యత్ ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
తకిట తదిమి...
ఘన ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విడుదల చేసి, ‘‘మంచి కంటెంట్ ఉన్న ఫీల్గుడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ‘‘సినెటేరియా మీడియా వర్క్స్ వెంకట్ బులెమోని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చందన్కుమార్ తెలిపారు -
అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్మెంట్’లో ట్విస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్మెంట్ మాత్రం కాలేదన్నారు.పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి ‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్ ఈ సందర్భంగా తెలిపారు. విధ్వంసకర ఇన్నింగ్స్తో వెలుగులోకిమరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్(IPL)లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కుర్రాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్. భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడిన రింకూ సింగ్... నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.ఆ ఫొటోలతో బలపడిన ప్రచారంఅయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్ చేసింది. తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో రింకూ ఎంగేజ్మెంట్ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్ అయ్యాయి.యువ ఎంపీగా ప్రస్థానంఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా ప్రియా సమాజ్వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కేరాకట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్మెంట్ గురించి స్పందించడంతో వదంతులకు చెక్ పడింది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 View this post on Instagram A post shared by Neha ❤️ (@_neha_singh_0700) -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్పై పంచులు
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్లో ఉన్నవారికి కూడా గేమ్పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గానూ తన టాలెంట్ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్లో 70 రకాల టెస్ట్లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్లో ఉన్నవారు క్లినిక్స్కు రారు. స్లమ్స్లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
స్టార్ జంటను ఫాలో అవుతున్న అట్లీ దంపతులు!
కోలీవుడ్లో నయనతార, విఘ్నేశ్ శివన్లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు. తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్కు వెళుతూ బాద్షా షారూఖ్ఖాన్ హీరోగా జవాన్తో అట్లీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా -
టీడీపీ నేత నారాయణపై పొంగూరు ప్రియ ఫైర్
-
తండ్రిని కాదని బుల్లితెర నటుడితో పెళ్లి.. చివరికి ఏమైందంటే?
సినీ ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడిపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారిపోయింది. తాజాగా మరో సినీ నటుడికి అతని భార్య విడాకులిచ్చింది. గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె.. విడిపోయినట్లు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అంతే కాకుండా తన దత్త తండ్రి, నటుడు రాజ్ కిరణ్కు క్షమాపణలు చెప్పింది. జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నా. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. మేం విడిపోయి కొన్ని నెలలైంది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న' అంటూ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మునీష్ రాజాతో జీనత్ ప్రియ వివాహం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్ మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్కుమార్ అన్నారు. దీంతో రాజ్కుమార్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్కిరణ్పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. స్పందించిన రాజ్ కిరణ్ అయితే ఈ విషయంపై నటుడు రాజ్ కిరణ్ స్పందించారు. జీనత్ ప్రియ తన దత్తపుత్రిక అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మునీష్ రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని రాజ్కిరణ్ ఆరోపించారు. తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం యత్నించాడని ఆయన ఆరోపించారు. -
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ -
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
రెడ్ డ్రెస్లో హాట్ హాట్ గా నటి ప్రియా హెగ్డే (ఫోటోలు)
-
Actress Priya Home Tour: నటి ప్రియ ఇల్లు చూశారా? ఎంత అందంగా ఉందో! (ఫోటోలు)
-
Priya Varadarajan: ప్రతి స్త్రీ దుర్గ వలే...
ప్రతి స్త్రీలో ఒక దుర్గ ఉంటుంది. కాని ఆ దుర్గను అదిమి పెట్టేలా కుటుంబం, సమాజం ఆమెను తీర్చి దిద్దుతాయి. దాంతో తన మీద ఏ అన్యాయం జరిగినా చెప్పలేని స్థితికి చేరుతుంది. ‘నువ్వు దుర్గవి. పోరాడు’ అని చెప్తారు బెంగళూరులోని ‘దుర్గ ఇండియా’ టీమ్ సభ్యులు. ప్రియా వరదరాజన్ అనే యాక్టివిస్ట్ ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ స్త్రీలను కుటుంబ హింస నుంచి... లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పని చేస్తోంది. వారి పోరాటానికి శక్తినిస్తోంది. ‘ప్రతి ఒక్కరూ మార్పు కోసం ఎదురు చూస్తారు. మనమే మార్పు కోసం ప్రయత్నిద్దామని ఎందుకు అనుకోరు... ఎదురు చూస్తూ కూచుంటే మార్పు వస్తుందా?’ అంటారు ప్రియా వరదరాజన్. బెంగళూరులో ‘దుర్గ ఇండియా’ అనే సంస్థ స్థాపించి స్త్రీల సమస్యలపై పని చేస్తున్న ప్రియ ఇటీవల బెంగళూరు మాల్లో ఒక వ్యక్తి స్త్రీలను అసభ్యంగా తాకడం గురించి ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ ప్లేసుల్లో– బహిరంగ ప్రదేశాల్లోగాని ఆన్లైన్లోగాని స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై చర్య తీసుకునేందుకు ఆ బాధిత మహిళకు అండగా నిలవడం మేము చేసే పని. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు, మహిళా పోలీసులు ఎందరు ఉన్నా మహిళలకు సాటి మహిళ అండగా ఉంటే కలిగే ధైర్యం వేరు. తోటి మహిళలతో వారు చెప్పుకునేవి వేరు. అలాంటి వారికి యోగ్యులైన కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ చేయించి దిలాసా ఇప్పిస్తాము. అంతే కాదు బాధితులను వెంటబెట్టుకొని– ఆ స్టేషన్కుపో ఈ స్టేషన్కు పో అనే బాధ లేకుండా బెంగళూరులో వన్ స్టాప్ సెంటర్స్లో ఫిర్యాదు చేయిస్తాము. తోడుగా మేమొస్తే బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకరు. ఎటొచ్చీ వారికి తోడు నిలిచే స్త్రీల బృందాలు అన్నిచోట్లా ఉండాలి’ అంటుంది ప్రియ. ఐ యామ్ ఎవ్రి ఉమన్ పదేళ్ల క్రితం ప్రియా వరదరాజన్ ‘ఐ యామ్ ఎవ్రి ఉమన్’ పేరుతో ఒక బ్లాగ్ రాయడం మార్పు కోసం ఆమె వేసిన మొదటి అడుగు. ఆ బ్లాగ్కు క్రమంగా చాలామంది మహిళా ఫాలోయర్లు వచ్చారు. వారు తమ అనుభవాలను ప్రియతో పంచుకోసాగారు. ‘అందరిదీ ఒకే కథ. అందరూ మరొక స్త్రీ లాంటి వారే అని నాకు అర్థమైంది. స్త్రీల కోసం పని చేయాల్సిన అవసరం తెలియజేసింది. స్త్రీల కోసం పని చేయడం అంటే వారి పట్ల భావజాలాన్ని మార్చడమే’ అంటుంది ప్రియ. మగాడు ఎందుకు అలా చేస్తాడు? ‘గతంలో సమాజంలో స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చి ఆమె బయటకు చెప్పినప్పుడు– ఆమెలో ఏ దోషం ఉందో అన్నట్టుగా నిందను ఆమె మీదే వేసేవారు ఉండేవారు. వారి భావజాలాన్ని మార్చడమే చేయవలసింది. స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మగాడు ఆమెతో అలా ఎందుకు చేశాడు అని ఆలోచించేలా చేస్తే సగం మార్పు వచ్చినట్టే. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో స్త్రీలు ఆత్మాభిమానంతో ఉండాలంటే మగాళ్లు మారాలి. అందుకు ఒకరోజు సరిపోదు. ఒకరు పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక మేరకు పని చేయాల్సిందే’ అంటుంది ప్రియ. అందరినీ ‘దుర్గ’లుగా మారుస్తూ అన్యాయం జరిగితే వెరవకుండా ప్రతిఘటించమని ప్రియ ఆధ్వర్యంలో ‘దుర్గల’ బృందం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో తిరుగుతూ స్త్రీలకు తమ హక్కులను, చట్టపరమైన రక్షణను, సహాయం చేసే బృందాలను తెలుపుతుంది. ‘నేను ఒంటరిదాన్ని కాను అని స్త్రీ అనుకుంటే చాలు... ఆమె పోరాడగలదు’ అంటుంది ప్రియ. ఇంత ప్రయత్నం చేసే ప్రియ లాంటి వారి సంఖ్య ఎంత పెరిగితే దుర్గలకు అంత శక్తి పెరుగుతుంది. -
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో అడుగుపెట్టి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ.. వెండితెరపై హీరోయిన్గా, సైడ్ ఆర్టిస్ట్గా ఇలా చాలా పాత్రలను పోషించింది. కానీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా చెప్పింది. ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దీంతో రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్ కూడా సేఫ్గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్లోకి వస్తాను.' అంటూ శ్వేతా వర్మ తెలిపింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ప్రియ రియాక్ట్ అయ్యారు.. 'నేను ఎప్పుడూ నీ కోసం ప్రార్థిస్తుంటాను శ్వేతా' అని ఆమె తెలిపింది. శ్వేతా అభిమానులు కూడా శ్వేతా వర్మ గురించి రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
ఏపీ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసిన పొంగూరు ప్రియ
-
టీడీపీ నారాయణ బండారం బయట పెట్టిన ప్రియా పొంగూరు
-
పసిడితో మెరిసిన ప్రియా మాలిక్.. రెండో భారత రెజ్లర్గా
అమ్మాన్ సిటీ (జోర్డాన్): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది. భారత్కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), సవిత (62 కేజీలు), అంతిమ్ కుందు (65 కేజీలు) కూడా ఫైనల్కు చేరడంతో భారత్ ఖాతాలో మరోమూడు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాగా ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్గా ప్రియా నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా -
‘మిస్టేక్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టేక్ నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు నిర్మాణ సంస్థ: ఏఎస్పీ మీడియా హౌస్ నిర్మాత: అభినవ్ సర్దార్ స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి సంగీతం: మణి జెన్నా సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి ఎడిటర్:విజయ్ ముక్తావరపు విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘మిస్టేక్’ కథేంటంటే.. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు. ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్లైన్లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
నార్కో టెస్ట్కు నేను రెడీ : పొంగూరు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తనకు అనారోగ్యంగా ఉన్నా.. ఓపిక చేసుకొని రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు పోలీసులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు ప్రియ సోమవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. తాను జనసేన పార్టీకి, పవన్కళ్యాణ్కు వీరాభిమానినని తెలిపారు. తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని, ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాను చెప్పిన వాటిల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కో టెస్ట్కు సిద్ధమని, తనది తప్పని తేలితే నారాయణ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరతానని చెప్పారు. నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నారాయణ వైద్యశాలలో సుప్రసిద్ధులైన మహిళా డాక్టర్లు చాలా మంది నారాయణ లైంగిక వేధింపులు తాళలేక అక్కడ ఉద్యోగాలు మానేసి వెళ్లిన వాస్తవాలు ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయన్నారు. సాటి మహిళల పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వారి పేర్లను చెప్పడంలేదని తెలిపారు. -
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో వైరల్గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అకృత్యాలపై ఆయన మరదలు ప్రియ ఇన్స్టాగామ్లో మరో వీడియో విడుదల చేశారు. నారాయణ ఆయన పరువు కోసం తనను అణచివేశారని ఆమె ఆరోపించారు. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కళ్ల ముందు చెడు జరుగుతోంది కాబట్టి బయటపెట్టేందుకు సిద్ధమయ్యాను. ముందు నా విషయం వెలుగులోకి తెస్తాను. తర్వాత విద్యా సంస్థల విషయాలు బయటపెడతా. పరువు అంటున్నారు. మహా అంటే పది మంది ఫోన్ చేస్తారు. అంతే కదా. ఇది నా జీవితం. 29 ఏళ్లు కష్టపడ్డా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను మాట్లాడతా. విద్యా సంస్థల్లో పిల్లల ఆత్మ హత్యల విషయం క్లియర్గా మాట్లాడతా. నేను ఫిజి కల్గా క్యాన్సర్ పేషంట్ను కావచ్చు. మెంటల్గా వీక్ కాను. ఒక స్త్రీ తలచుకుంటే శక్తి అవుతుందని నారాయణకు తెలియజేస్తా. నేను బతుకుతానో లేదో తెలియదు. నాకు డబ్బులివ్వరు. అయినా నా ఆస్తులమ్మైనా ట్రీట్మెంట్ చేయించుకుంటా. నేను చనిపోయే లోపు వాస్తవాలు బయటపెడతా’అని ప్రియ ఆ వీడియోలో చెప్పారు. సంచలనంగా ప్రియ వీడియోలు రెండు రోజుల క్రితం ప్రియ సోషల్ మీడియాలో మొదటి వీడియో రిలీజ్ చేశారు. బావ అయిన మాజీ మంత్రి నారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల్లో, రాజకీయ వర్గాల్లో, నారాయణ విద్యాసంస్థల్లో చర్చనీయాంశమైంది. దీంతో నారా యణ తన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. ప్రియతో రాజీకి ప్రయత్నించారు. అయితే గంటా ప్రయత్నా లు విఫలమయ్యాయి. ప్రియ మరో వీడియో విడు దల చేసి, అందులో మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది మరింత సంచలనమైంది. సోదరుడి సతీమణినే నారాయణ లైంగికంగా వేధించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రియ జనసేన వీరమహిళ పొంగూరు ప్రియ జనసేన సభ్యురాలు. ఆ పార్టీ వీరమహిళగా గుర్తింపు పొందింది. తన బావ టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానిని అని ఆమె వీడియోలో వెల్లడించింది. తన కుమారుడు పుట్టిన రోజున పవన్తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఓటు కూడా జనసేనకే వేశానని తెలిపింది. తన పార్టీ వీర మహిళగా ఉన్న ప్రియ లైంగిక వేధింపులతో నరకం చూశానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినా జనసేన పార్టీ నుంచి స్పందన లేకపోవడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాలపై మాట్లాడుతున్న వవన్ కళ్యాణ్ సొంత పార్టీలోని మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు కేసులు.. మరో వైపు పరువు ఓ వైపు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు, మరో వైపు అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాల కేసుల్లో ఉన్న నారాయణకు తాజాగా సొంత మరదలు ప్రియ చేస్తున్న ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. తన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న చీకటి కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తానని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్డ్రింక్లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రైన స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అట్లీ ఇన్స్టాలో షేర్చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. They were right 😍 There’s no feeling in the world like this ♥️ And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today! Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc — atlee (@Atlee_dir) January 31, 2023 View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
హీరోయిన్ ప్రియాహెగ్డే బ్యూటిఫుల్ ఫోటోలు
-
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
టీఎన్పీఎస్సీ కోచింగ్.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి..
వేలూరు (తమిళనాడు): బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును పోలీసులు చేధించారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ తాతయ్యతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 23వ తేదీన సమీపంలోని బావిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..) పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా స్విచ్ఛాఫ్లో ఉన్న మృతురాలి సెల్ఫోన్ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువకుడు కొరియర్ కంపెనీలో పనిచేసే మహేంద్రన్గా తెలిసింది. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి అనంతరం బయటకు తెలియకుండా ఉండేందుకు గొంతు నులిమి మృతదేహాన్ని బావిలో వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
వంటింటికి ఊరట.. రైతు బజార్లలో వంటనూనె విక్రయాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్ఫెడ్ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే. అది మరింత ‘ప్రియ’ం ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి. రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యమైన నూనె ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్ఫ్లవర్, వేరు శనగ, రైస్బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వంటనూనెలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి. –చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు నాణ్యత బాగుంది.. రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది. –వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ ఎంతో ఊరట.. మార్కెట్లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. –వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ -
చెన్నై తొలి దళిత మహిళా మేయర్: ఆమెకు అభినందనలు
నార్త్ చెన్నై అంటే తమిళ సినిమాల్లో రౌడీల పుట్టిల్లుగా చూపిస్తారు. మురికివాడలు.. ఇరుకు గల్లీలు పంపుల దగ్గర స్త్రీల బాహాబాహీ అలాంటి చోట నుంచి ఇప్పుడు 29 ఏళ్ల ఆర్.ప్రియ మేయర్గా నగరాన్ని పాలించడానికి వచ్చింది. తమిళనాడు సి.ఎం. స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాలలో వచ్చిన ప్రియ చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించింది. చెన్నైకు ఆర్.ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది. చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్గా ప్రమాణ స్వీకారం చేసింది. ‘చెన్నైకి మేయర్గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు. ‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది. ‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ. ఆమె నిర్ణయాలు చెన్నైకి మేలు చేస్తాయని ఆశిద్దాం. నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు. – ఆర్.ప్రియ -
కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ప్రియ, షాక్లో ప్రియాంక!
Bigg Boss 5 Telugu, Transgender Priyanka Singh about Actress Priya: ప్రియ, ప్రియాంక.. పేర్లే కాదు.. వారి అభిరుచులూ కలిశాయి. అందుకే బిగ్బాస్ హౌస్లో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా మిగతా ఒకరు తల్లడిల్లిపోయేవారు. అంతలా క్లోజ్ అయ్యారిద్దరూ. తాజాగా ప్రియాంకసింగ్కు మర్చిపోలేని బహుమతిచ్చింది నటి ప్రియ. ఎంతో ఖరీదైన డైమండ్ రింగ్ను ఆమెకు గిఫ్ట్గా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్యూ, లవ్ యూ అక్కా.. అంటూ డైమండ్ రింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. దీని గురించి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రియక్కలో అమ్మను చూసుకున్నా.. ఆమె మనసు వెన్నలాంటిది. దుబాయ్ నుంచి బావగారు అక్కకోసం డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. కానీ అక్క ఈ ఉంగరం నీకోసమే, నువ్వే పెట్టుకో అని నాకు బహుకరించింది. ఆ డైమండ్ రింగ్ కన్నా ప్రియ అక్క నాకు పెద్ద డైమండ్..' అంటూ ప్రియతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది పింకీ. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
బిగ్బాస్ 5: శ్రీరామ్ చంద్రకు షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి మద్దతు
బిగ్బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఫినాలే టికెట్ సాధించడానికి ఇంటి సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వారికి దశల వారిగా టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్లో పెట్టిన ఐస్ గేమ్తో ఇంటి సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఐస్ టబ్బులో కాళ్లు పెట్టి ఉండాలని.. మధ్యలో కాళ్లు బయటకు తీయవచ్చని సూచించాడు బిగ్బాస్. కానీ హౌస్మేట్స్ మొండితనంతో ఐస్లోనే కాళ్లు పెట్టి ఉంచడంతో చివరికి కాళ్లు కదపలేని స్థితికి చేరుకున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి కాళ్లు వాపులు వచ్చాయి. అయితే గేమ్ తర్వాత వెంటనే ఎవరు వేడి నీళ్లు ఉపయోగించకూడదని బిగ్బాస్ ముందుగానే హెచ్చరించాడు. కానీ అవేం పట్టించుకోకుండా ప్రియాంక.. శ్రీరామచంద్రకు సహయం చేయడానికి వచ్చి వేడి నీళ్లు అతడి కాళ్లపై చల్లింది. అంతేగాక నూనేతో మర్దన చేసింది. కాళ్లకు వేడినీళ్లు చల్లడంతో శ్రీరామచంద్ర పూర్తిగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని మెడికల్ రూంకు తీసుకెళ్లి .. కాళ్లకు కట్లు కట్టి పంపించాడు బిగ్బాస్. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! అనంతరం పవన్ కల్యాణ్ తీన్మార్ మూవీలోని ‘గెలుపు తలుపూలే తీసే..’ పాట ప్లే చేయడంతో శ్రీరామచంద్ర కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే శ్రీరామచంద్ర పరిస్థితి చూసి సన్నీ కూడా బాధపడ్డాడు. ఎప్పటికప్పుడు శ్రీరామచంద్రకు సహాయంగా ఉంటూ అతడిని నవ్విస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర పరిస్థితి చూసి ప్రేక్షకులకు సైతం కళ్లు చెమ్మగిల్లకమానవు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శ్రీరామ్ పరిస్థితి చూసి బిగ్బాస్ మాజీ కంటెస్టేంట్స్తో పాటు ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. చదవండి: థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ, రంగంలోకి పోలీసులు తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లతో పాటు కొందరూ సెలబ్రెటీలు ‘సంగీతం మాస్టర్’కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ ప్రియురాలు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయన శ్రీరామ్కు సపోర్ట్ ఇవ్వడం విశేషం. ‘మోర్ పవర్ టూ యూ’ అంటూ దిప్తీ, శ్రీరామ్కు మద్దతు ప్రకటించింది. అలాగే ప్రియ సైతం ఇన్స్టాలో స్టోరీ షేర్ చేస్తూ ‘ఇంట్లో జెన్యూన్ పర్సన్ , రామ్ నీకోసం మేమంతా ఉన్నాము.. ప్లే స్ట్రాంగ్.. నీకోసం ప్రార్థిస్తుంటాను త్వరగా కోలుకోవాలి’అని శ్రీరామ్కు అండగా నిలిచింది. వీరితో పాటు అఖిల్ సార్థక్, దేత్తడి హారికా, నోయల్ సైతం ‘మోర్ పవర్ టూ యూ.. గెట్ వెల్ సూన్’ అంటూ మద్దతు ఇస్తున్నారు. -
ప్రియ ఇంట పెళ్లి వేడుకలు, హాజరైన బిగ్బాస్ కంటెస్టెంట్లు
సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ షోలో వాలిపోయింది. అక్కడ ఇతర కంటెస్టెంట్లను, వారి గేమ్ను అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గేమాడింది ప్రియ. కెప్టెన్సీ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను కొల్లగొట్టింది. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సైతం సుసాధ్యం చేస్తూ ఐదో వారం కెప్టెన్గా అవతరించింది. కానీ సన్నీతో వైరం కొనితెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. టాస్క్లో అతడిని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ హెచ్చరించడంతో సోషల్ మీడియాలోను ఆమెను ట్రోల్ చేశారు. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. View this post on Instagram A post shared by Priya (@priyaartist) ఇదిలా వుంటే నేడు(నవంబర్ 21న) ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్బాస్ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 'మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ' అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది. View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) -
ఒక ట్రాన్స్ జెండర్ తో ఎలా అనుకున్నా... కానీ ప్రియాంక మాత్రం!
-
బిగ్బాస్: ప్రియ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా?
Bigg Boss 5 Telugu, Eliminated Contestant Priya Remuneration: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ ఏడు వారాలకే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియ వారానికి ఎంత తీసుకుంది? ఏడు వారాల్లో ఎన్ని లక్షలు పోగు చేసింది? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ నటికి ఒక్క వారానికే 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్బాస్ నిర్వాహకులు ఇంత మొత్తాన్ని ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే షోలో ఆమె చేసిన ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని వీళ్లు ముందుగా అనుకున్న డీల్ కంటే మరింత ఎక్కువే ఇచ్చే ఆస్కారమూ లేకపోలేదు. ఇక బిగ్బాస్ కోసం తన ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ వచ్చినందుకు ఆమాత్రం ఇవ్వడంతో తప్పు లేదంటున్నారు ప్రియ అభిమానులు. అంతేకాకుండా టీఆర్పీకి అవసరమయ్యే కంటెంట్ కూడా ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. -
'రవి కన్నింగ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేస్తున్నాడు'
Bigg Boss 5 Telugu, Priya Elimination Interview: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పాపులర్ కంటెస్టెంట్ ప్రియ. అదరకుండా, బెదరకుండా గేమ్ ఆడే ప్రియ ఒకే ఒక్క గొడవతో ఎలిమినేట్ అయిపోయింది. ఒక టాస్కులో సన్నీని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ నోరు జారడం, అనవసరంగా కయ్యం పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనను బిగ్బాస్ ప్రేక్షకులు సమ్మతించలేకపోయారు. ఫలితంగా అప్పటిదాకా ఓటింగ్లో టాప్లో దూసుకెళ్లిన ప్రియ ఆ ఒక్క ఎపిసోడ్తో కిందకు పడిపోయింది. వెరసి.. ఏడోవారం బిగ్బాస్ హౌస్కు గుడ్బై చెప్పేసింది. తాజాగా ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. యాంకర్ రవి గురించి చెప్తూ.. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయగలడని తెలిపింది. 'రవితో కలిసి గేమ్ ఆడినవాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నారో, మరేంటో తెలీదు కానీ నెక్స్ట్ వీక్ వాళ్లు పక్కా ఎలిమినేట్ అవుతున్నారు, ఎందుకు?' అని ప్రశ్నించింది అరియానా. దీనికి ప్రియ బదులిస్తూ.. అందుకే అతడిని వెరీ కన్నింగ్, వెరీ స్మార్ట్ అంటుంటాను. 'ఎవరెవరు స్ట్రాంగో, వాళ్లను పంపించే ప్లాన్లో ఉన్నాడు రవి' అని అతడి గేమ్ను బయటపెట్టింది. కాజల్ గేమ్ప్లాన్కు అందరూ భయపడాల్సిందేనన్న ప్రియ ఆమె టాప్ 5లో ఉండకూడదని కోరుకోవడం గమనార్హం. 'ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే వారి అంతు చూసేంతవరకు వదలరా?' అని అరియానా సూటిగా ప్రశ్నించగా 'అది నా గేమ్ ప్లాన్' అంటూ తెలివిగా బదులిచ్చింది ప్రియ. స్టేజీమీద షణ్ముఖ్ను ఆకాశానికెత్తేసిన ప్రియ ఇంటర్వ్యూలో మాత్రం అతడు భయంకరమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. అతడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని పేర్కొంది. సిరి మాట్లాడేదంతా ఫేకే అని, ఆమె మాటలేవీ తనకు నచ్చవని చెప్పింది. సిరి గేమ్ కోసం ఏదైనా చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రియాంకను దూరం పెడితే ప్రేక్షకులు ఏం అనుకుంటారోనని మానస్ ఆమెను భరిస్తున్నాడా? అని అరియానా క్వశ్చన్ చేయగా.. అదంతా ఫేక్ అని తేల్చే పారేసింది ప్రియ. మొత్తానికి ఈ ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రియ బిగ్బాస్ స్టేజీపై మాట్లాడినదానికి, బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడినదానికి పొంతనే లేదంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. -
దీప్తి సునయనకు ఆ మాట చెప్తానన్న ప్రియ, దండం పెట్టిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, 7th Week Priya Eliminated: కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్లు కూడా పెద్ద దెబ్బ తీస్తాయి. నటి ప్రియ విషయంలో అదే జరిగింది. ఓటింగ్లో టాప్లో ఉండే ఆమె ఈ వారం ఎలిమినేట్ అవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే! కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో సన్నీతో పెట్టుకున్న కయ్యమే ఆమె కొంప ముంచింది. చెంప పగలగొడతానని తిట్టడం, సన్నీని టార్గెట్ చేసి రెచ్చగొట్టడం చాలామందికి నచ్చలేదు. అప్పటివరకు ఆమెకు సపోర్ట్గా ఉన్నవాళ్లు కూడా ఆమె ప్రవర్తన చూసి సడన్గా మిగతావాళ్లకు ఓటేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ గొడవ ఆమె ఎలిమినేషన్కు కారణమైంది. ఫలితంగా మరికొద్ది రోజులు హౌస్లో కొనసాగేందుకు ఆస్కారం ఉన్న ప్రియ ఏడోవారంలోనే బిగ్బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలి ఎలిమినేషన్ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగ్. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది. ఎవరూ హర్ట్ అవ్వకుండా, నువ్వు హర్ట్ కాకుండా గేమ్ ఆడంటూ విశ్వకు కూడా 5 మార్కులిచ్చింది. బాగా ఆడుతున్నాడంటూ రవికి 7 మార్కులు వేసింది. షణ్ముఖ్కు ఎనిమిదిన్నర మార్కులేస్తూ ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలంది. షణ్ను వండర్ఫుల్ పర్సన్ అని, అతడు బ్రెయిన్తో గేమ్ ఆడుతున్నాడని మెచ్చుకుంది. ఆమెను చూడటంతోనే రోజు స్టార్ట్ చేస్తాను: ప్రియ సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులిచ్చింది. రాత్రి పడుకునేటప్పుడు సిరి త్వరగా తన దగ్గరకు రాదని ఆరోపించింది. శ్రీరామ్ తనకు ఎక్కువ కనెక్ట్ అవలేదంటూనే 8 మార్కులేసింది. బయటకొచ్చాక పాట నేర్పిస్తానన్న విషయం గుర్తు చేయడంతో అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడో పాట పాడమని కోరాడు నాగ్. దీంతో శ్రీరామ్.. 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలోని 'నీ చూపులే..' పాటందుకుని అక్కడున్న అందరినీ కొద్ది క్షణాలపాటు మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. తర్వాత ప్రియ.. తనకు ఎంతగానో క్లోజ్ అయిన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసింది. పొద్దున లేవగానే పింకీని చూస్తానని, ఆమెను చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది. నా గర్ల్ఫ్రెండ్కు అలా చెప్పొద్దు: దండం పెట్టిన షణ్ను జీవితంలో ఎన్నో చూశారు, కానీ అందరినీ నమ్మేస్తారంటూ యానీకి 10, బాగా ఆడుతున్నాడంటూ జెస్సీకి 8 మార్కులేసింది. నీ గర్ల్ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని ప్రియ అడగ్గా ఆ మాట చాలంటూ సంతోషించాడు షణ్ను. అయితే దీప్తిని మర్చిపోయి హాయిగా ఉంటున్నావని ఆమెకు చెప్తానని ప్రియ ఉడికించడంతో వణికిపోయాడు షణ్ను. అలా చెప్పొద్దంటూ దండం పెట్టేశాడు. మా ఇంట్లో కూడా భయపడను, కానీ ఆ అమ్మాయికి భయపడతానన్నాడు. మానస్ బంగారుకొండ, ఆ హక్కు సన్నీకే ఉంది ముందు బాగా ఆడావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో, ఏ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నావనేది ముందే పసిగడుతున్నాం, అది జరగకుండా చూస్కో అంటూ కాజల్కు 7 మార్కులేసింది ప్రియ. మానస్.. బంగారుకొండ అంటూ అతడికి 10 మార్క్స్ వేసింది. చిన్న వయసులోనే అతడికి చాలా మెచ్యూరిటీ ఉందని మెచ్చుకుంది. చివరగా సన్నీకి 9 మార్కులేస్తూ నా ప్లేటులో తినే రైట్, నా కప్పులో తాగే హక్కు నీకు మాత్రమే ఉందని చెప్పి వీడ్కోలు తీసుకుంది. -
ప్రియ అవుట్, కన్నీరుమున్నీరుగా విలపించిన ప్రియాంక
Bigg Boss 5 Telugu, Priya Eliminated: బిగ్బాస్ షోలో స్టేజీమీదకు వచ్చీరావడంతోనే నాగార్జున ఇంటిసభ్యులతో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి కాస్త డిఫరెంట్గా గేమ్లో గెలిచినవారికి బిగ్బాస్ షీల్డ్తో పాటు ఓ స్పెషల్ పవర్ దక్కుతుందన్నాడు. ఇక ఈ గేమ్లో కొన్ని లెవల్స్ ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ రౌండ్లో 'పట్టుకోండి చూద్దాం' గేమ్ ఆడించాడు. ఇందులో గుండ్రటి వలయంలో ఉన్న పిల్లోస్ను ఇంటిసభ్యులు దక్కించుకుని కాపాడుకోవాలి. ఈ గేమ్లో పిల్లో సాధించలేకపోయిన సిరి.. షణ్ను దగ్గరున్న దిండు ఇవ్వమని బతిమాలుకుంది. దొరికిందే ఛాన్స్ అనుకున్న షణ్ను.. ఆమెతో 10 సార్లు సారీ చెప్పించుకుని పిల్లో త్యాగం చేసేశాడు. చివరగా ఈ ఆటలో షణ్ను, కాజల్ ఓడిపోయారు. నీళ్లు-కన్నీళ్లు.. ఓడిపోయిన రవి, లోబో రెండో రౌండ్లో 'చలనచిత్ర వీర' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ అడిగే సినిమా ప్రశ్నలకు ముందుగా బెల్ కొట్టి సమాధానాలు చెప్పిన వారు తర్వాతి రౌండ్కు అర్హులవుతారు. ఇందులో తప్పు సమాధానాలు చెప్పి జెస్సీ, ప్రియాంక, మానస్ అనర్హులవగా మిగిలినవారు నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. మూడో రౌండ్లో నాగ్ 'నీళ్లు-కన్నీళ్లు' గేమ్ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లు జగ్గులు పట్టుకుని స్విమ్మింగ్ పూల్లోని నీళ్లను వారి క్యాన్లో నింపాలి. ఈ రౌండ్లో రవి, లోబో ఎలిమినేట్ అయ్యారు. అనంతరం నాగ్.. లోబో సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ నాలుగో రౌండ్లో యానీ, విశ్వ, శ్రీరామ్, సన్నీ, సిరి మ్యూజికల్ చెయిర్ ఆడారు. ఇందులో సిరి, సన్నీ అవుట్ అయ్యారు. ఐదో రౌండ్ 'పట్టుపట్టు రంగే పట్టు' గేమ్లో నాగ్ ఏ కలర్ చెప్తే ఆ కలర్లో ఉన్న వస్తువులను హౌస్లో నుంచి తీసుకురావాలి. ఈ గేమ్లో శ్రీరామ్ అవుట్ అయ్యాడు. ఆటల పోటీలో మిగిలిన ఇద్దరిలో విశ్వకు రవి, లోబో, కాజల్, శ్రీరామ్ సపోర్ట్ చేయగా యానీకి మిగిలినవారంతా మద్దతు తెలిపారు. ఇందులో అవతలి టీమ్ విశ్వ టోపీని ముందుగా పడగొట్టడంతో అతడు ఓడిపోగా యానీ గెలిచింది. దీంతో ఆమెకు పవర్ ఉన్న బిగ్బాస్ షీల్డ్ దక్కింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు నాగ్. అనంతరం బిగ్బాస్ హౌస్లో మిమ్మల్ని అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ అయ్యాడని తెలిపాడు. అందరికీ గుడ్బై చెప్పిన యానీ, ప్రియ నామినేషన్స్లో మిగిలిన ఇద్దరు ప్రియ, యానీలను హౌస్మేట్స్కు గుడ్బై చెప్పమని ఆదేశించాడు నాగ్. దీంతో ఎవరికి వారు తమ ఎలిమినేషన్ ఖాయం అనుకుంటూ అందరికీ భారంగా వీడ్కోలు చెప్పారు. అనంతరం ఇద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సు తెరిచి చూడొచ్చని నాగ్ చెప్పగా ఇంటిసభ్యులు ఎంతో ఆతృతగా వాటిని ఓపెన్ చేశారు. కానీ రెండు బాక్సుల్లోని ఇద్దరూ మాయం అవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్ అవుతారేమోనని నాగ్ అనడంతో మరింత ఆందోళన చెందారు. గుక్క పెట్టి ఏడ్చిన పింకీ, ఓదార్చిన మానస్ ప్రియ వెళ్లిపోతుందేమోనని గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడ్చేయగా మానస్ ఆమెను ఓదారచ్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ పింకీ అతడి భుజంపై వాలిపోయి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మరోవైపు యానీ హౌస్లోకి రావడంతో సన్నీ ఆమెను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. కానీ పింకీ మాత్రం రోదిస్తూనే ఉండగా ఆమెను ఓదార్చడం మానస్ వల్ల కూడా కాలేదు. ఇక స్టేజీ మీదకు వచ్చిన ప్రియ బిగ్బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానంది. -
హౌస్లో నుంచి మాయమైన ప్రియ, యానీ! డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్
Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: సండే అనగానే బిగ్బాస్ కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలవుతుంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్లో ఉన్నవారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామోనని భయంతో వణికిపోతుంటారు. ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, కాజల్ను నాగ్ శనివారం ఎపిసోడ్లో సేవ్ చేశారు. సిరి, రవి, యానీ, ప్రియ, జెస్సీ, లోబో ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో యానీ, ప్రియ తప్ప అందరూ సేవ్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవనున్నట్లు కనిపిస్తోంది. వీళ్లిద్దరినీ హౌస్మేట్స్కు గుడ్బై చెప్పమని ఆదేశించాడు నాగ్. అనంతరం వారిని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, యానీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సులపై ఉన్న లైట్స్ ఆఫ్ అవగా ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని తెరిచి చూశారు. కానీ వాటిలో ఉన్న ప్రియ, యానీ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో షాకైన ఇంటిసభ్యులు ఎవరూ లేరేంటని అయోమయానికి లోనయ్యారు. వారిని మరింత టెన్షన్కు గురి చేస్తూ నాగ్.. ఇద్దరూ స్టేజీ మీదకు వస్తారేమో అంటూ డబుల్ ఎలిమినేషన్ ఉందన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పటికే లీకువీరులు ప్రియ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో దండోరా వేసేశారు కాబట్టి నాగ్ మాటలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. 'డబుల్ ఎలిమినేషన్ అనగానే నమ్మేస్తాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, ప్రియ తట్టాబుట్టా సర్దేసుకుందని మాకు తెలిసిపోయిందిలే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వరస్ట్ అన్న సన్నీ.. గాల్లో ముద్దులు పంపిన ప్రియ
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సందడి చేసే వీకెండ్ ఎపిసోడ్స్ బిగ్బాస్ షోను మరింత రసవత్తరంగా మారుస్తాయి. అందుకే చాలామంది వారంలో ఏ ఎపిసోడ్ మిస్ అయినా నామినేషన్, ఎలిమినేషన్ను మాత్రం అస్సలు మిస్సవరు. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ వారాంతాల్లో వచ్చే ఎపిసోడ్లను కన్నార్పకుండా చూస్తారు. తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. ఈ వారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఆదేశించాడు. దీంతో సిరి.. నిర్మొహమాటంగా కాజల్ పేరు చెప్పింది. శ్రీరామ్... మానస్ను వరస్ట్ పర్ఫామర్గా పేర్కొన్నాడు. స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నాను, కానీ కాదనిపిస్తోందన్నాడు. అతడి మాటలతో ఏకీభవించని మానస్.. తాను సొంతంగా ఆడట్లేదంటే ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో వైల్డ్గా ఆడుతున్నాడని ప్రియ విశ్వ పేరు సూచించింది. అయితే విశ్వ.. తాను నెట్టలేదని పేర్కొన్నాడు. లేదు, అతడు తనను నెట్టేశాడంటూ వాదించింది ప్రియాంక. దీంతో ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది క్లారిటీ ఇచ్చేందుకు వీడియో చూపిస్తానన్నాడు నాగ్. ఇక సన్నీ.. ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. ఈ మాటకు ఆవేశపడాల్సింది పోయి ప్రియ సన్నీని ప్రేమగా పిలుస్తూ గాల్లో ముద్దులు పెట్టింది. -
బిగ్బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్
Bigg Boss Telugu 5, Episode 46: కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశ్వకు స్పెషల్ పవర్ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. అయితే దాని కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్ను కూడా ఇచ్చాడు బిగ్బాస్. విశ్వతో పాటు ఆయన ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీంతో కాజల్ని తన పోటీదారునిగా ఎంచుకున్నాడు విశ్వ. ఇద్దరు పోటా పోటీన దుస్తులు ధరించారు. ఈ టాస్క్లో సన్నీ.. కాజల్కి హెల్ప్ చేశాడు. ఆమె చేతఎక్కువ దుస్తులు ధరింపజేయాలని ఇంటి సభ్యుల లోదుస్తులతో సహా అన్ని పట్టుకొచ్చాడు. అవి చూసి ప్రియాంక ‘ఛీ’అంటూ తెగ నవ్వేసింది. ఈ టాస్క్లో మొత్తంగా విశ్వ 106 దుస్తులు ధరించి కాజల్(79 దుస్తులు)పై గెలిచాడు. దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియాంక ‘అది కూడా తీసేయ్’అని అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు. జస్వంత్కి సీక్రెట్ టాస్క్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్లో భాగంగా జెస్సీకి బిగ్బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని, ఈ సీక్రెట్ టాస్క్లో గెలిస్తే నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికవుతారని చెప్పాడు. ఈ టాస్క్లో సహాయకులుగా ఒకర్ని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చాయిస్ ఇచ్చాడు. దీంతో సిరి సహాయం తీసుకున్నాడు జెస్సీ. వీరిద్దరు కలిసి.. షణ్ముఖ్, ప్రియ, ప్రియాంక దగ్గర ఎగ్స్ లేకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. షణ్ణ్నూ దగ్గరకు వెళ్లిన సిరి.. అతని దగ్గర ఉన్న ఎగ్స్ని ఇచ్చేయడానికి ఒప్పించింది. ఆ తరువాత ప్రియాంక దగ్గరకు వెళ్లి నాపై నమ్మకం పెట్టుకుని నీ దగ్గర ఎక్స్ ఏమీ పెట్టుకోకు.. తరువాత నువ్వే హ్యాపీ ఫీల్ అవుతావు అని చెప్పింది. దీంతో ప్రియాంక కూడా ఎగ్స్ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చింది. ఆ తర్వాత ప్రియను కూడా ఒప్పించారు. జెస్సీ గుడ్లు నొక్కేసిన సన్నీ అందరూ పడుకున్న తరువాత సన్నీ గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు. జెస్సీ దాచుకున్న గుడ్లను కొట్టేసి మానస్కి ఇచ్చాడు. అయితే ఇది కామెడీగానే చేశాడు సన్నీ. కానీ అదే వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. సన్నీ గుడ్లు తీసిన విషయాన్ని ప్రియ పసిగట్టి సిరికి చెప్పింది. ఈ విషయంపై జెస్సీ, సన్నీల మధ్య మాటల యుద్దం జరిగింది. చెప్ప పగిలిపోద్దన్న ప్రియ.. దమ్ముంటే కొట్టమన్న సన్నీ ‘బంగారు కోడిపెట్ట’టాస్క్లో భాగంగా సన్నీ ఒక్కో గుడ్డును ఏరుకొని తన బుట్ట దాచుకుంటే.. వాటిని నొక్కేసే ప్రయత్నం చేసింది ప్రియ. ఈ క్రమంలో సన్నీ, ప్రియల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకానొక దశలో ఫిజికల్ అటాక్ వరకు వెళ్లింది. బుట్టలోని గుడ్లను దొంగిలించడానికి ప్రియ ప్రయత్నించగా.. ప్లీజ్ ప్రొటక్షన్ అంటూ ఆమెను పక్కకి తోసేశాడు సన్నీ. దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియ.. అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు.. చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి.. నా మీదికి వస్తే చెంపపగిలిపోద్ది అని పదే పదే అనడంతో.. దమ్ముంటే కొట్టు అని సన్నీ మీది మీదికి వెళ్లాడు. ఇంటి సభ్యులు కలగజేసుకొని వారిద్దరిని శాంతింపజేశారు ప్రియ.. కాజల్ వెకిలి నవ్వులు సన్నీని టార్గెట్ చేసిన ప్రియ.. చేసిందంతా చేసి.. మళ్లీ తనపై ఫిజికల్ అటాక్ చేశాడంటూ ఎడ్వడం మొదలెట్టింది. అంతేకాదు ఆడు ఈడు అని మాట్లాడలేదని, ఒకవేళ తనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే అలా కూడా అంటానని తనను తాను సమర్థించుకుంది. చేసేదంతా చేసేసి ఈ సింపథీ డ్రామాలేంటి? అని సన్నీ మిగతా సభ్యులతో అన్నాడు. ఇక కాజల్ మధ్యలో కలగజేసుకొని మా బుట్టలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడగ్గా.. మిమ్మల్నే టార్గెట్ చేస్తానని ప్రియ ముఖం మీదే చెప్పేసింది. దీంతో కాజల్ వెతకారంగా నవ్వగా.. ప్రియ కూడా అలానే నవ్వేసింది.వీరిద్దరి వెకిలి నవ్వులు చూసిన యానీ మాస్టర్ నవ్వును ఆపుకోలేకపోయింది. సిరితో రవి డీల్ బంగారు కోడిపెట్ట టాస్క్లో తొలిరోజే సిరి స్టిక్కర్స్ని కోల్పోయిన విషయం తెలిసిందే కదా. అయితే సిక్టర్స్ ఇస్తే.. గుడ్లు ఇస్తావా అని డీల్ కుదుర్చుకున్నాడు. నాలుగు గుడ్లు ఇచ్చింది. శ్రీరామ్కు స్పెషల్ బ్లూ ఎగ్.. బట్ నో యూజ్ టాస్క్లో భాగంగా శ్రీరామ్కు స్పెషల్ బ్లూ ఎగ్ లభించింది. దీని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందుకోసం ఒకరిని ఎంచుకొని ఆ వ్యక్తితో గేమ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో శ్రీరామ్ తెలివిగా తనకంటే పొట్టిగా ఉన్న యానీ మాస్టర్ని ఎంచుకున్నాడు. దీంట్లో భాగంగా ఇద్దరి సభ్యులకు ప్రభాకర్, దివాకర్ అనే బాతు బొమ్మలను ఇచ్చాడు బిగ్బాస్. ఆ బొమ్మను చేతుల్లో పట్టుకొని.. కింద పడిపోకుండా ఎవరు కాపాడుకుంటారో వారికే ఐదు గుడ్లు లభిస్తాయి. ఈ గేమ్లో యానీ మాస్టర్ గెలిచి, ఐదు గుడ్లను స్వంతం చేసుకుంది. -
బిగ్బాస్: అలా చేస్తే చెంప పగిలిపోద్ది.. సన్నీకి ప్రియ వార్నింగ్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంతా కలిసి ఉండడం ఇష్టపడని బిగ్బాస్.. కొత్త కొత్త టాస్కులు ఇచ్చి హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన ‘బంగారు కోడిపెట్ట’అనే కెప్టెన్సీ టాస్క్ హౌస్మేట్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ముఖ్యంగా.సన్నీ- ప్రియా మధ్య మాటల యుద్దమే జరిగింది. అయితే నేడు ఆది కాస్త హద్దు దాటి ఫిజికల్ అటాక్కు దారి తీసినట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ప్రియ.. మళ్లీ సన్నీ గుడ్లను దొంగిలిస్తూ కనిపించింది. ఈ క్రమంలో సన్నీ ఆమెను పక్కకు తోసేశాడు. (చదవండి: మొన్న కూతురు, ఇప్పుడు తల్లి బిగ్బాస్ను వీడక తప్పదా!) దీంతో అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు.. చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి బుట్టను చించేసింది. ఈక్రమంలో సన్నీ ఏయ్ అన్నడంతో.. ప్రియా ఏయ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యింది. చేతకాని మొహాలు వస్తారు ఇక్కడికి.. అంటూ సన్నీ అనడంతో.. చెంప పగిలిపోద్ది అని ప్రియా అంది. దాంతో కోపంతో రగిలిపోయిన సన్నీ దమ్ముంటే కొట్టి చూడు అంటూ ప్రియా మీదకు వెళ్ళాడు. మొత్తమీద ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా ఉండనుందని అర్ధమవుతుంది. -
సన్నీ మీదకు చేయెత్తిన ప్రియ, చెంప పగలగొడతానని వార్నింగ్!
Bigg Boss Telugu 5, Episode 45: బిగ్బాస్ హౌస్లో ఏడోవారం జరిగిన నామినేషన్స్ కంటెస్టెంట్లు కాకుండా సన్నీ ఒక్కడే చేసినట్లు ఉందన్నాడు మానస్. ఈ మాట హౌస్మేట్స్ అంటున్నారని సన్నీతో చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సన్నీ.. ప్రియ రవిని నామినేట్ చేసింది, దాన్ని నేను ఓకే చేశానంతే అని సింపుల్గా చెప్పేశాడు. నామినేషన్స్లో సిల్లీ రీజన్స్ చెప్తారా? వాళ్లాడితే గేమ్, నేనాడితే క్రైమా? అని అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా టాస్కుల్లో ఫ్రెండ్షిప్ చూపిస్తే ఓడిపోయినట్లేనని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక నామినేషన్స్ మంట నుంచి ఇంకా బయటపడని ప్రియాంక.. దమ్ముంటే గేమ్ ఆడు, సేఫ్ గేమ్ కాదంటూ కాజల్నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె డ్రామా క్వీన్ అని పేరు పెట్టింది. ఆఖరికి తనను మానస్ కూడా అర్థం చేసుకోవట్లేదంటూ ఏడ్చేసింది. అతడిని ఇంత ఇష్టపడుతాను కదా, అతడికి నా మనసేంటో అర్థం కాలేదా? నన్నెందుకు దూరం పెడుతున్నాడు అంటూ యానీ మాస్టర్ దగ్గర తన గోడు వెల్లబోసుకుంది. ఇంతలో మానస్.. ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అంతేకాదు, ఆమె కోరికమేరకు గోరుముద్దలు తినిపించాడు. దీంతో అప్పటిదాకా ముఖం మాడ్చుకున్న పింకీ ముఖం మానస్ రాకతో సంతోషంతో విప్పారింది. తను కూడా ఒక కెమెరా అని, నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందని మానస్ను హెచ్చరించింది. నామినేషన్స్లో సన్నీ తప్పు చేసి ఒప్పుకోడేంటని రవి చిరాకు పడుతుండగా.. వాడు తప్పు చేశాడంటే నేను ఒప్పుకోనని తెగేసి చెప్పింది కాజల్. దీంతో వారిద్దరూ ఈ విషయంపై కాసేపు చర్చోపచర్చలు చేసుకోగా చివరికి రవికి సారీ చెప్పింది కాజల్. అనంతరం బిగ్బాస్ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఏ ఇంటిసభ్యుడు ఎక్కువ గుడ్లను అందుకుని వాటిపై తమ ముఖం ఉన్న స్టిక్కర్స్ పెడతారో వారే కెప్టెన్సీకి పోటీపడతారు. నేను అందరి గుడ్ల జోలికొస్త, దొంగతనం చేస్తా, ఎవరేం చేసుకుంటరో చేసుకోండి, అదే నా స్ట్రాటజీ అని ముందుగానే హౌస్మేట్స్ను హెచ్చరించింది ప్రియ. దీంతో ముందు జాగ్రత్తగా సన్నీ తన గుడ్లను కాపాడమంటూ కాజల్ సాయం కోరాడు. అయితే ఇది ఇండివిడ్యువల్ టాస్క్ అని, సన్నీ, కాజల్ కలిసి ఆడటం వల్ల ఈ టాస్క్ రద్దయ్యే అవకాశం ఉంటుందని రవి దగ్గర అనుమానం వ్యక్తం చేసింది యానీ. ఇక సన్నీ బుట్టలోని గుడ్లను అదును చూసి మాయం చేసింది ప్రియ. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో స్పందించిన ప్రియ ఆ గుడ్లను తానే దోచుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ఆమెను ఏమనాలో అర్థమవక సతమతమైన సన్నీ.. చేతగానోళ్లలాగా ఒక మూలన కూచోవడం కాదు, మంచిగా గేమ్ ఆడు అని సూచించాడు సన్నీ. నేను బరాబర్ దొంగతనం చేస్తానని కౌంటరిచ్చింది ప్రియ. తనను రెచ్చగొట్టడంతో ఆవేశపడ్డ సన్నీ అక్కడున్న కడ్డీని కొట్టాడు. దీంతో కామన్ సెన్స్ వాడంటూ మరింత రెచ్చిపోయింది ప్రియ. ఇదిలా వుంటే మానస్ ప్రియ దగ్గరకు వెళ్లి, ఆమె ఇచ్చిన గుడ్లు తీసుకోవడం గమనార్హం. ఈ టాస్క్లో లోబో ఆడితే మస్త్ మజా వచ్చేదని గుర్తు చేసుకున్నారు సన్నీ, రవి. ఇది చూసి సీక్రెట్ రూమ్లో ఉన్న లోబో ఫుల్ ఖుషీగా ఫీలయ్యాడు. చివర్లో సన్నీ, కాజల్ బుట్టల్లోని గుడ్లను సిరి, శ్రీరామ్ లేపేశారు. ఇంతటితో ఫస్ట్ రౌండ్ ముగియగా ఈ రౌండ్లో అత్యధికంగా మానస్ దగ్గర 32 గుడ్లు ఉన్నాయి. అయితే పింకీ అతడికి తన గుడ్లన్నీ ఇచ్చేసిందని, పైగా మానస్ ప్రియ దగ్గర కూడా తీసుకున్నాడని విమర్శించింది యానీ. షణ్ముఖ్, సిరి మరోసారి లొల్లి పెట్టుకోగా సిరి ఏడ్చేసింది. అటు మానస్.. సన్నీ దగ్గరకు వెళ్లి ఏడ్చేశాడు. దీంతో అతడిని దగ్గరకు తీసుకున్న సన్నీ.. మనం బయటకెళ్లాక లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటామంటూ ఓదార్చాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియ- సన్నీల గొడవ తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రియ సన్నీ బుట్ట మీద కన్నేయగా అతడు వెంటనే వచ్చి తన బుట్టను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీదకు చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్ ఇచ్చింది. కొట్టుకునేంతవరకు వెళ్లిన వీరిద్దరినీ ఆపడం ఇంటిసభ్యుల వల్ల కావట్లేదు. మరి ఈ గొడవ చల్లారుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
చేతగాని వాళ్లలా ఆడకు, నా జోలికి వస్తే వదిలిపెట్ట: సన్నీ వార్నింగ్
Bigg Boss Telugu 5 Promo: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీ, ప్రియకు అస్సలు పడదన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. వారిద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! ప్రతివారం ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ వీళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్నారు. నేను ఎవ్వడి జోలికి వెళ్ల, నా జోలికి వస్తే వదిలిపెట్టను అని హెచ్చరించాడు సన్నీ. 'నేనందరి జోలికొస్త, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి' అంటూ పవన్ కల్యాణ్ స్టైల్లో సమాధానమిచ్చింది ప్రియ. నా జోలికొస్తే ఊరుకోనని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు సన్నీ. అయినా పట్టించుకోని ప్రియ.. దమ్ముంటే దోచుకోమని సవాలు విసిరింది. 'చేతగాని వాళ్లలాగా ఆడకు, కొంచెం మంచిగా ఆడు' అంటూ సన్నీ కౌంటరివ్వగా.. 'బొమ్మలు దొబ్బేసి నేను తీయలే అంటారు చేతగానోళ్లు' అని పరోక్షంగా అతడికే రివర్స్ కౌంటర్ ఇచ్చిందీ నటి. చేతనయినోళ్లు దొంగతనం చేసి చెప్తారని చిటికేసి మరీ చెప్పింది. ఆమె తీరుతో చిర్రెత్తిపోయిన సన్నీ 'నా నిజ స్వరూపం చూపిస్తా' అని సమయం కోసం ఎదురు చూస్తుండగా 'మస్తు చూశేశిన..' అంటూ అతడిని కరివేపాకులా తీసిపారేసింది ప్రియ. ఇదంతా విన్న కాజల్.. మాటలు గుర్తుపెట్టుకో, వీకెండ్లో తీద్దాం అని సూచించింది. ఇక ప్రియ.. తన గుడ్డును మానస్కు ఇవ్వడం గమనార్హం. ఇదిలావుంటే సరదాగా ఆడుకుంటున్న శ్రీరామ్, సిరిని చూసి ఓర్వలేకపోయాడు షణ్ముఖ్. వీళ్లిద్దరూ మళ్లీ మొదలెట్టారని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంలో సిరితో మరోసారి వాదులాటకు దిగినట్లు కనిపిస్తోంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ఇప్పటివరకు మానస్, విశ్వ గెలిచినట్లు సమాచారం. మరి వీరితో పాటు ఎవరెవరు కెప్టెన్సీకి పోటీపడతారన్నది ఆసక్తికరంగా మారింది! -
బిగ్బాస్: నామినేషన్స్లో 8 మంది!
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్ల సంఖ్య తగ్గేకొలదీ హౌస్మేట్స్ మధ్య పోటీ ఉత్కంఠగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్స్ రోజు వారి నిజస్వరూపాలు బయటకు వస్తాయి. అయితే ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియను వెరైటీగా నిర్వహించాడు బిగ్బాస్. ముగ్గురు వేటగాళ్ల చేతిలో నామినేషన్ ప్రక్రియను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ చిందులు తొక్కుతోందీ ప్రియాంక. ఆరు వారాల నుంచి నామినేట్ అవుతున్నానని, ఈసారికి వదిలేయమని సన్నీని వేడుకున్నాడు రవి. ఇక సిరి.. మానస్ను, షణ్ముఖ్... యానీ మాస్టర్ను నామినేట్ చేయగా కాజల్.. ప్రియ పేరు చెప్పింది. ఇది విన్న ప్రియ.. ఇది ఊహించిందేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్, ప్రియ, యానీ, రవి, కాజల్, జెస్సీ, సిరి నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
లోబోను ఎలిమినేట్ చేసిన నాగ్, షాక్లో రవి!
Bigg Boss 5 Telugu, Episode 42: వరస్ట్ పర్ఫామర్గా ఎంపికై జైల్లో బందీ అయిన శ్వేత శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. ఇంతలో రవి ఆమె దగ్గరకు వెళ్లి.. నా ఐడియా ఫాలో అవమని నీకు చెప్పలేదని పేర్కొన్నాడు. కానీ శ్వేత మాత్రం.. నువ్వు కుషన్స్ కట్ చేయమని నాకు కూడా చెప్పావని తెలిపింది. తర్వాత ఇంటిసభ్యులు వారికి పంపించిన కాస్ట్యూమ్స్ వేసుకుని రెడ్ కార్పెట్పై హొయలొలికిస్తూ నడిచారు. అనంతరం కాజల్, రవి ఫ్రెండ్షిప్ హగ్గిచ్చుకుని కలిసిపోయారు. రవి గడ్డి తినమంటే తింటావా? ఇక నాగార్జున వచ్చీరావడంతోనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో కుషన్స్ పాడు చేసింది ఎవరని గరమయ్యాడు. దీంతో లోబో నీళ్లు నములుతూ మొదట తనే దూది తీశానని తెలిపాడు. హౌస్ ప్రాపర్టీ ధ్వంసం చేయకూడదని తెలీదా? అని నాగ్ నిలదీయగా అమాయకంగా ముఖం పెట్టి తెలీదంటూ అడ్డంగా తలూపాడు లోబో. కుషన్స్ కట్ చేయమని నీకు రవి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయావు, రవి గడ్డి తినమంటే తింటావా? అని ఫైర్ అయ్యాడు. యాక్టర్స్ అంటే చిన్నచూపా? సంచాలకులుగా ఉన్నప్పుడు కంటెస్టెంట్లు చెప్పేది కూడా వినాలని సిరికి సలహా ఇచ్చాడు నాగ్. ఇక యానీ అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదని, అందరి మీదా ఒట్టేయాల్సిన పని లేదని చురకలంటించాడు. అయితే సిరి యాటిట్యూడ్ నచ్చకే అలా ప్రవర్తించాననింటూ ఆమెకు సారీ చెప్పింది యానీ. ఇక నువ్వు నీలా ఉంటేనే అందరికీ నచ్చుతావని శ్రీరామ్కు సూచించాడు నాగ్. అయితే నామినేషన్స్లో అంత దురుసుగా మాట్లాడావు, యాక్టర్స్ అంటే చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో తప్పు అంగీకరించిన శ్రీరామ్ తల దించుకుని సారీ చెప్పాడు. సన్నీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చిందన్న నాగ్ ఇదే ఆటను కంటిన్యూ చేయమని చెప్పాడు. అందరూ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా నువ్వు మాత్రం అవ్వడం లేదని షణ్నుని మెచ్చుకున్నాడు నాగ్. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి ఇక శ్వేత.. తను రెండుసార్లు కుషన్స్ కట్ చేశానని చెప్తూ బోరుమని ఏడ్చేసింది. ఆ ఐడియా ఇచ్చిన మనిషి మాత్రం చేయలేదంటూ రవి మీద కౌంటరేశాడు నాగ్. ఇదంతా చూస్తుంటే నటరాజ్ చెప్పిందే కరెక్ట్(గుంటనక్క) అనిపిస్తోందని రవిని ఘోరంగా అవమానించాడు. తన మీద పడ్డ నిందను చెరిపేసుకునేందుకు ప్రయత్నించిన రవి.. లోబో, నేను మాత్రమే ఈ ఐడియా డిస్కషన్ చేశామన్నాడు. బిగ్బాస్ పంపిన కాటన్, కుషన్స్లో ఉన్న దూది సేమ్ ఉన్నాయన్నాడు. దీంతో సంచాలకులు ఆ రెండురకాల దూదిలను పరీక్షించి అవి ఒకేలా లేవని చెప్పడంతో మరోసారి రవి అడ్డంగా దొరికిపోయాడు. ఇక శ్వేత తీసిందని తనకు తెలీదని రవి పదేపదే చెప్పడంతో మధ్యలోనే అడ్డుపడ్డ శ్వేత.. రవికి ఈ విషయం ముందే తెలుసంటూ అందరి ముందే క్లారిటీ ఇచ్చింది. రవి ఇన్ఫ్లూయెన్స్ చేసి పక్కవారి గేమ్ చెడగొడుతున్నాడు తర్వాత నాగ్ ఇంటిసభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి హౌస్లో ఉండేందుకు అర్హత లేని వాళ్ల పేర్లను చెప్పమన్నాడు. ముందుగా మానస్.. వేరేవాళ్ల మాటలను పట్టించుకుంటూ శ్రీరామ్ అన్నింటా వెనకడుగు వేస్తున్నాడన్నాడు. సన్నీ మాట్లాడుతూ.. టాస్కుల్లో 100% ఇవ్వడం లేదంటూ ప్రియ పేరు చెప్పాడు. కాజల్.. ఇద్దరికి అర్హత లేదనిపిస్తూనే ప్రియ పేరు చెప్పింది. ఆమె కనిపించేంత స్వీట్గా ఉండరని పేర్కొంది. యానీ మాస్టర్, శ్వేత, సిరి, షణ్ముఖ్.. సొంతంగా ఆడలేకపోతున్నాడంటూ లోబో పేరు సూచించారు. శ్రీరామ్.. రవి పేరు చెప్పాడు. ప్రియ, ప్రియాంక.. ఎవరికి గొడవలవుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజల్ అన్ఫిట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ.. పక్కవాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ వారి గేమ్ చెడగొడుతున్న రవి వెళ్లిపోవాలని కోరుకున్నాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ లోబో వీడ్కోలు రవి.. అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్న కాజల్ హౌస్లో అనర్హురాలు అని చెప్పాడు. విశ్వ.. తప్పు చేస్తే ఒప్పుకోకుండా, సమర్థించుకునే ప్రియ అన్ఫిట్ అని అభిప్రాయపడ్డాడు. చివరగా వచ్చిన లోబో.. ప్రియ బిగ్బాస్ హౌస్కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ ప్రక్రియలో లోబోకు, ప్రియకు సమానంగా 4 ఓట్లు పడటంతో నాగ్ ఓ పరీక్ష పెట్టాడు. హౌస్మేట్స్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తే వారు సేఫ్ అని చెప్పాడు. రవి, సన్నీ, విశ్వ.. ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిలబడగా మిగిలిన అందరూ ప్రియకు మద్దతిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో రవి షాకయ్యాడు. ఇక విశ్వ అయితే చిన్నపిల్లాడిలా గుక్క పెట్టి మరీ ఏడ్చాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ ఏడుస్తూ వీడ్కోలు తీసుకున్నాడు. వారం రోజులపాటు సీక్రెట్ రూమ్లో! స్టేజీ మీదకు వచ్చిన లోబోతో నాగ్ థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ ఆడించాడు. సన్నీ బుర్ర, తన బుర్ర ఒకటేనన్న లోబో ఇకపై మారిపోమని సూచించాడు. కాజల్కు ఏ వేలూ చూపించలేదని మరోసారి స్పష్టం చేశాడు. కంటెస్టెంట్లు అందరికీ థంబ్స్ అప్ చూపించాడు. తర్వాత అతడిని పంపించినట్లే పంపించేసి తిరిగి రమ్మన్నాడు నాగ్. నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్షకులకు మాత్రమే ఉందని చెప్పడంతో లోబో నేలపై మోకరిల్లి ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాలని ఓటేసినందున వచ్చేవారం నేరుగా నామినేషన్స్లో ఉండబోతున్నావని చెప్పాడు. కాకపోతే నువ్వు హౌస్లోకి కాకుండా సీక్రెట్ రూమ్లోకి వెళ్తున్నావని వెల్లడించాడు. -
బిగ్బాస్ వీక్షకులకు బ్రేకింగ్ న్యూస్: నాగార్జున
బిగ్బాస్ హౌస్లో ఈ వారం జరిగిన గొడవలను తిరగదోడుతున్నాడు నాగార్జున. తప్పొప్పులను ఎత్తిచూపుతూ కంటెస్టెంట్లతో పంచాయితీ పెడుతున్నాడు. ఇదంతా పక్కనపెడితే రేపు జరగాల్సిన ఎలిమినేషన్ను ఈరోజే జరిపించేలా ఉన్నాడు నాగ్. తాజాగా రిలీజైన ప్రోమోలో అందరికీ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాననంటూ సస్పెన్స్ పెట్టాడు. ఈ హౌస్లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పండి? అంటూ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరీ అడిగాడు. ఈ క్రమంలో అందరూ తలా ఒకరి పేరు చెప్పారు. ఫైనల్గా ప్రియకు, లోబోకు ఇద్దరికీ 4 ఓట్లు పడ్డాయి. దీంతో నాగ్.. వీరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో వారి పక్కన నిల్చోమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. మరి మెజారిటీ హౌస్మేట్స్ ఎవరిని సేవ్ చేసే అవకాశం ఉంది? ఎవరిని హౌస్లో నుంచి పంపించేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కు పంపించినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. కావాలంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టండని సూచిస్తున్నారు. ఇక ప్రోమో ఈ రేంజ్లో ఉన్నప్పటికీ ప్రియ, లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే లేనట్లే కనిపిస్తోంది. ఇలా అర్ధాంతరంగా వారిని హౌస్లోంచి వెళ్లగొట్టే సాహసం చేయరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ్ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ చెప్తాడా? లేదా జనాలను ప్రాంక్ చేస్తాడా? అన్నది చూడాలి! -
అర్ధరాత్రి దుప్పటి తీసి మానస్కు బొట్టు పెట్టిన పింకీ!
Bigg Boss Telugu 5, Episode 40: దొంగతనాలు, కొట్లాటలు, గుంజుకోవడాలు, అరుచుకోవడాల మధ్య ఎట్టకేలకు బొమ్మల కొలువు టాస్క్ ముసిగింది. ఏ టీమ్ ఎన్ని బొమ్మలు చేసిందో చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో కాజల్ మరోసారి కౌంటింగ్ మొదలు పెట్టగా మొదటి నుంచి కౌంటింగ్ అవసరం లేదంటూ గొడవకు దిగింది సిరి. సంచాలకురాలిగా నీ పవర్ను వృధా చేస్తున్నావని కాజల్ను హెచ్చరించాడు రవి. అయినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికి తిరుగులేదు అన్నట్లుగా వ్యవహరించింది. మరోసారి లెక్కించి రెడ్ టీమ్ దగ్గర 17, గ్రీన్ టీమ్ 24 ఉన్నట్లు ప్రకటించింది. దీంతో సిరి కూడా ఇక తప్పదన్నట్లుగా మరోసారి లెక్కపెట్టి బ్లూ టీమ్ 17, ఎల్లో టీమ్ 14 బొమ్మలు చేసినట్లు తెలిపింది. సిరి కన్నీరు, ఓదార్చిన షణ్ముఖ్ అయితే రెడ్ టీమ్ తమకు లభించిన స్పెషల్ బొమ్మ ద్వారా ఎల్లో టీమ్లోని సగం బొమ్మలను చెత్త బుట్టలో పడేసింది. అనంతరం బిగ్బాస్ హౌస్మేట్స్ మీద గరమయ్యాడు. శ్వేత, లోబో బిగ్బాస్ ఇంట్లోని కుషన్స్ను కట్ చేసి అందులోని దూది తీసి పాడు చేశారని ఆగ్రహించాడు, సంచాలకులైన కాజల్, సిరి దీన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారిని కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో అనర్హులుగా ప్రకటించారు. దీంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందేనని సిరి కన్నీరుపెట్టుకోగా షణ్ముఖ్ ఆమెను ఓదార్చాడు. కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించిన సంతోషంలో బ్లూ టీమ్లోని మానస్ యానీ మాస్టర్ను ఎత్తుకుని తిప్పాడు. నీ మీదున్న ప్రేమ కంటే మానస్ మీదే ఎక్కువ ప్రేమ నీకు నీ మీదున్న ప్రేమ కంటే మానస్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ప్రియాంక గురించి ఆమెతోనే చెప్పుకొచ్చింది కాజల్. మానస్ కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోందని చెప్పింది. దీంతో ఆలోచనలో పడిన పింకీ.. మానస్ విషయంలో తను చేస్తోంది తప్పా? అని అడిగింది. దానికి కాజల్ తప్పేం కాదని ఆన్సరిచ్చింది. ఇక విశ్వ సెల్ఫిష్ అని, అటెన్షన్ సీకర్ అని అభిప్రాయపడింది ప్రియ. మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు: షణ్ముఖ్ ప్రియాంకకు గెలుపు పాఠాలు నేర్పిన జెస్సీ మీద ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. మిగతావాళ్లకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని నొక్కి చెప్తూ జెస్సీకి ఉచిత సలహా ఇచ్చాడు. అయితే ఇది ఇద్దరికీ(జెస్సీ, షణ్ను) వర్తిస్తుందని కౌంటరిచ్చింది సిరి. మేము చెప్తే అసలు వినదు ఈ పుడుంగి, పెద్ద చెప్పడానికి వచ్చింది అంటూ ఆమె మీద కౌంటరేశాడు షణ్ను. దీంతో హర్టయిన సిరి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో తనను రమ్మని పిలువురా అంటూ జెస్సీని రాయబారం కోరాడు షణ్ను. అందుకు జెస్సీ నో చెప్పడంతో చేసేదేం లేక అతడే స్వయంగా వెళ్లి సారీ చెప్పి ఆమె కోపాన్ని చల్లార్చాడు. ఇక సన్నీ వల్ల మానస్ లాభపడుతున్నాడని అభిప్రాయపడ్డాడు షణ్ను. మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొన్నాడు. పింకీని గెలిపించిన మానస్, సన్నీ మరోవైపు కాజల్.. నీ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నారని మానస్తో ముచ్చట్లు పెట్టింది. పింకీతోపాటు ప్రియ నీ విషయంలో పొజెసివ్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది, కానీ మూడో వ్యక్తి ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. అనంతరం రెడ్, బ్లూ టీమ్లోని ప్రియాంక సింగ్, యానీ మాస్టర్, ప్రియ, మానస్, సన్నీ, విశ్వలకు ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ గేమ్లో విశ్వ విజేతగా నిలిచి హౌస్కు కెప్టెన్గా అవతరించాడు. షన్ మేనేజర్ పోస్టు కోసం పోటీపడ్డ మానస్, ప్రియాంక, సన్నీలకు డబ్బాల ధమాకా అనే టాస్క్ ఇచ్చాడు. అయితే సన్నీని గెలవద్దని అతడి కాళ్ల మీద పడినంత పని చేశాడు విశ్వ. దీంతో అతడి అభ్యర్థనకు ఓకే చెప్పి ఆటను తూతూమంత్రంగా కానిచ్చాడు. మొత్తానికి ఇందులో ఎక్కువ క్యారేజీలను సరిగా అమర్చి పింకీ గెలిచింది, కాదు మిగతా ఇద్దరు గెలిపించారు. నీకు మానస్ అన్నయ్య అవుతాడు: పింకీ అర్ధరాత్రి దుప్పటి కప్పుకుని పడుకున్న మానస్కు నుదుటన బొట్టు పెట్టేసింది పింకీ. ఇది చూసి అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. పింకీ మనసులోని భావాలను పాటల రూపంలో బయటపెట్టారు. మానస్ క్యూట్ ఉంటాడంటూ పింకీని మరింత ఉడికించింది సిరి, అయితే అతడి వైపు కన్నెత్తి చూడగానే ఆమెను కిందకు నెట్టేసి పడుకోమని హెచ్చరించింది పింకీ. నీకు మానస్ అన్నయ్య అవుతాడని చెప్పగా సిరి మాత్రం.. కానే కాదని, తను నా ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. -
Bigg Boss: ఇదేందిరా భయ్.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా..సన్నీ ఫైర్
బిగ్బాస్ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఓ రేంజ్లో కష్టపడుతున్నారు. బిగ్బాస్ ఇచ్చే బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ కోసం కంటెస్టెంట్స్ నానా పాట్లు పడుతున్నారు. నాలుగు టీమ్లుగా విడిపోయి.. బద్ధ శత్రువుల్లా కొట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకురాలైన సిరిపై యానీ ఒంటికాలిపై లేచింది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నాలుగు టీమ్ల సభ్యులు. కన్వేయర్ బెల్ట్పై నుంచి వచ్చే రా మెటీరియల్ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ’అని సన్నీ ఊగిపోగా.. ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి’అని సిరి డిమాండ్ చేసింది. దీన్ని తేలిగ్గా తీసుకున్న సన్నీ.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ‘నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మరోవైపు కాజల్.. సంచాలకురాలిగా తనకు వచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ‘మేం పెట్టిన రూల్ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి’ అంటూ రూల్ పెట్టింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ విభేదించింది. అంతేకాదు ‘ నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు’ అంటూ ప్రియ సీరియస్ అయింది. ఈ సమయంలో సన్నీ విజిల్స్ వేస్తూ ‘అటు బస్సూ.. ఇటు బస్సూ ’అనే పాట పాడాడు. మరోవైపు బాగా డిస్టర్బ్ అయిన సిరిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు షణ్ముఖ్. సిరిపై సన్నీ ఎందుకు ఫైర్ అయ్యాడు? కాజల్ అలాంటి రూల్ ఎందుకు పెట్టింది? తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
మీరు ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటా: సన్నీ వార్నింగ్
Bigg Boss Telugu 5, Sixth Week Nominations: వారమంతా కలిసే ఉంటారు. కానీ సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడలేని కోపాలు ప్రదర్శిస్తుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ నానారభస చేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య వైరం పెరిగేది, మిత్రువులు కూడా శత్రువులుగా మారేది ఈ 'మండే' రోజే. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్తో భగభగ మండిపోతోంది బిగ్బాస్ హౌస్. ప్రతిసారి ఎధవ రీజన్లతో నామినేట్ చేస్తారంటూ తెగ చిరాకు పడింది ప్రియాంక సింగ్. టాస్క్లో నా జేబులో నుంచి కాయిన్లు దొంగతనం చేశాడంటూ లోబో జెస్సీని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణం విన్న జెస్సీ వెటకారంగా నవ్వుతూ తాను గేమ ఆడటానికి వచ్చానని, నమ్మకంతో పని లేదంటూ కౌంటరిచ్చాడు. అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్ చేశాడు శ్రీరామ్. అలాగే షణ్ముఖ్ను సైతం నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నామినేషన్ను జీర్ణించుకోలేకపోయిన షణ్ను... బిగ్బాస్ హౌస్కు నువ్వో దేవుడివి, నువ్వేది చెప్తే అదే మేం పాటించాలి! అంతేనా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వీరిద్దమరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ప్రియ ఉన్నన్ని రోజులు తప్పకుండా ఆమెనే నామినేట్ చేస్తానన్నాడు సన్నీ. అతడి మాట విని అవాక్కైన ప్రియ.. వార్నింగ్ ఇస్తున్నావా? అంటూనే అతడి ఫొటోను మంటల్లో వేసింది. మొత్తానికి వాడివేడిగా సాగనున్న ఈ నామినేషన్స్లో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. -
త్వరలో నీ గేమ్ బెడిసికొట్టే రోజొస్తుంది: రవికి కాజల్ వార్నింగ్
Bigg Boss Telugu 5, Episode 35: ఐదు రెట్ల ఫన్, ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే ఐదు వారాలు ముగిశాయి. ఈ వారం నామినేషన్లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వీరిలో నాగార్జున ఎవరిని సేవ్ చేశారు? ఎవరికి చీవాట్లు పెట్టారు? అనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 09) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రవి అందరికీ బ్రెయిన్వాష్ చేస్తున్నాడు.. ఇంటిసభ్యులందరూ కలిసి తనను జైల్లో వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది కాజల్. ఈ క్రమంలో ఆమెను ఊరడించాల్సింది పోయి అగ్గిపుల్ల గీకాడు మానస్. నువ్వు సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావని యాంకర్ రవి తనతో అన్నాడంటూ కాజల్తో చెప్పుకొచ్చాడు. అతడు హౌస్లో అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇది విన్న కాజల్ తన వెనక ఇంత కుట్ర జరుగుతోందా? అని ఓ లుక్కిచ్చింది. సిరికి క్లాస్ పీకిన నాగ్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హాయ్ చెప్పిన నాగార్జున వచ్చీరాగానే శ్రీరామ్కు ఇబ్బందికర ప్రశ్న విసిరాడు. బిగ్బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్ బిగ్బాస్ టైటిల్ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని మన్మథుడిలా నవ్వేసిన నాగ్.. నీ కెప్టెన్సీ బాగుందంటూనే, ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్ పీకాడు. రోజంతా పక్కవాళ్ల గురించి మాట్లాడటమే పనా? అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం చేయమని కౌంటరిచ్చాడు. దీంతో సిరి సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. రకుల్ను ప్రేమించావా?: వైష్ణవ్కు నాగ్ సూటి ప్రశ్న తర్వాత 'కొండపొలం' సినిమా టీమ్ బిగ్బాస్ స్టేజీపై సందడి చేసింది. ఈ క్రమంలో నాగ్.. ఇంత చిన్నవయసులోనే రకుల్ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్తేజ్ తెగ సిగ్గుపడ్డాడు. తర్వాత క్రిష్.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్, రవి, మానస్, శ్రీరామ్ టాప్ 5లో ఉంటారని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించిన అనంతరం వైష్ణవ్ తేజ్, క్రిష్ బిగ్బాస్ స్టేజీకి వీడ్కోలు పలికారు. కావాలని వేలు చూపించలేదు: లోబో ఎవరైనా మిడిల్ ఫింగర్ చూపించారా? అని నాగ్ కాజల్ను ప్రశ్నించగా ఆమె అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్. అందులో లోబో మిడిల్ ఫింగర్ చూపించినట్లు స్పష్టమైంది. అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం నాగ్.. హౌస్మేట్స్తో రూలర్ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్ రూలర్, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్.. హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్ రూలర్, షణ్ముఖ్ బానిస అని పేర్కొన్నాడు. ఇన్ఫ్లూయెన్స్ చేసే రవి బానిస: కాజల్ కాజల్.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్గా, అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలైంది. రవి.. మానస్ను రాజుగా, ప్రియాంక సింగ్ను బానిసగా తెలిపింది. సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్.. తన బెస్ట్ ఫ్రెండ్కు కిరీటం ధరించాడు. శ్రీరామ్తో ఎక్కువ కనెక్ట్ అయి, గేమ్కు డిస్కనెక్ట్ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు. ఈ వారం హమీదా కనిపించనేలేదు: షణ్ను సన్నీ.. మానస్ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్గేమ్ ఆడిన రవి కింగ్ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు. ఇక హమీదా.. మానస్ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్ఫ్లూయెన్స్ చేసే కాజల్ రాణి, ఇన్ఫ్లూయెన్స్ అయ్యే మానస్ బానిస అని అభిప్రాయపడింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజు.. జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా కీర్తించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని మెచ్చుకున్నాడు. కెప్టెన్ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. 9 మంది నామినేషన్లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్ చేయకపోవడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం హమీదా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి, -
బెడిసి కొట్టిన ప్లాను.. హమీదా త్యాగంతో కెప్టెన్గా ప్రియ!
Bigg Boss Telugu 5, Episode 33: ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్కు జీవితంలోనే మర్చిపోలేని కానుకను అందించాడు బిగ్బాస్. ఆమె ట్రాన్స్జెండర్గా మారిన విషయాన్ని తండ్రి స్వాగతించిన వీడియోను ప్లే చేసి చూపించాడు. 'అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు. నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు' అంటూ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె తెగ ఎమోషనల్ అయింది. ఆమెను మరింత సంతోషపెడుతూ బిగ్బాస్ ఆమెకు చీర, పూలు, గాజులు, స్వీట్లు పంపించాడు. నాన్నను పట్టుకుని ఏడవాలనుంది: పింకీ ఈ సందర్భంగా తను పడ్డ కష్టాలను గుక్కపెట్టి చెప్పుకుంటూ ఏడ్చేసింది పింకీ. పండగకు ఇంటికి వెళ్లినా కూడా దొంగచాటుగా వెళ్లేదాన్నని, అలాంటిది మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది. ఇక తను బిగ్బాస్ నుంచి ఏ వారం వెళ్లిపోయినా సరే, కానీ వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. అనంతరం పింకీ అందంగా ముస్తాబవగా.. ఆమె యానీ మాస్టర్, సన్నీ, మానస్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో హమీదా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడవడంతో శ్రీరామ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఇక కంటెస్టెంట్లు ఏ రాజుకు సపోర్ట్ చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో బిగ్బాస్ ఫైనల్గా రాజుల దగ్గరున్న నాణాల సంఖ్యను వెల్లడించమని ఆదేశించాడు. సన్నీ దగ్గర 30, ఆయన రాజ్యంలోని మానస్ దగ్గర 240, షణ్ముఖ్ దగ్గర 220, జెస్సీ దగ్గర 209 నాణాలున్నాయి. రవి రాజు దగ్గర 50, అతడి రాజ్యంలోని యానీ మాస్టర్ దగ్గర 176, హమీదా దగ్గర 60, విశ్వ దగ్గర 10, శ్రీరామచంద్ర దగ్గర 52 నాణాలున్నాయని తెలిపారు. నాణాల లెక్కింపు తర్వాత బిగ్బాస్ ఇంటిసభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు.. ఇప్పటికీ కంటెస్టెంట్లు వారి యువరాజుకు సపోర్ట్ ఉపసంహరించుకోవచ్చని, లేదా వేరే రాజుకు మద్దతు తెలపవచ్చని ఛాన్స్ ఇచ్చాడు. మొత్తంగా టాస్క్ ముగిసే సమయానికి రాకుమారుడు సన్నీ దగ్గర ఆరుగురు, రవి దగ్గర ఏడుగురు ప్రజలు ఉన్నట్లు కెప్టెన్ శ్రీరామ్ బిగ్బాస్కు విన్నవించాడు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున యువరాజు రవి నేరుగా కెప్టెన్సీకి పోటీపడతాడని ప్రకటించగా.. ఇంటిసభ్యులు అతడికి పట్టాభిషేకం జరిపించారు. అంతేకాకుండా ఓడిపోయిన రాకుమారుడితోపాటు అతడి ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్బాస్. దీంతో జెస్సీ, షణ్మఖ్, సిరి, కాజల్లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి. షణ్ముఖ్ను ప్రాధేయపడ్డ రవి.. అయినా పట్టించుకోలే అయితే షణ్ముఖ్ సరిగా మాట్లాడట్లేదని తెగ ఫీలయ్యాడు రవి. మనసులోనుంచి మాట్లాడురా అని నోరు తెరిచి అడిగినప్పటికీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజైన రవి.. ఆయన వెన్నంటే ఉండి రాజుగా గెలిపించిన ముగ్గురిని సమానంగా ధనాన్ని పంచి కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించమని ఆదేశించాడు బిగ్బాస్. దీంతో రవి.. యానీ మాస్టర్, హమీదా, శ్వేతను పోటీదారులుగా పేర్కొన్నాడు. ఇంతలో బిగ్బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ప్రియ కోసం వెనక్కు తగ్గిన హమీదా ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. అంతేకాకుండా ఆమె కెప్టెన్గా గెలిస్తే ఈ సీజన్లో అందరిలాగే కెప్టెన్గా పోటీచేసే అర్హత తిరిగి లభిస్తుందని చెప్పాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్ పోటీ నుంచి వెనక్కు తగ్గిన హమీదా.. తన స్థానాన్ని ప్రియకు ఇచ్చింది. అనంతరం బిగ్బాస్ 'పదివేలు సరిపోవు సోదరా' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్ ట్యాంకులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయో వారే గెలిచినట్లు లెక్క! అని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ పోటీపడగా... ఫైనల్గా ప్రియ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అదెంతవరకు నిజమనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది! -
బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి! అనర్హత వేటు ఉన్న ఆమె కెప్టెనా?
Bigg Boss 5 Telugu Promo: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో కెప్టెన్సీ పోటీ జరుగుతోంది. హౌస్లో ఎవరు కెప్టెన్ అవుతారన్నదానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు యువరాజులైన రవి, సన్నీ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కసితో రగిలిపోతున్నారు. వీరిద్దరిలోని ఏ రాజ్యంలో ఎక్కువ నాణాలు ఉంటే ఆ ఆస్థానంలోని ప్రజలే కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో యువరాజు రవి టీమ్ గెలిచిందట! దీంతో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ కెప్టెన్సీకి పోటీపడ్డట్లు సమాచారం. హమీదా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరగా ప్రియ పోటీలో గెలిచి కెప్టెన్గా ఎంపికైనట్లు లీకులు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో హమీదాకు ఓ పవర్ లభించింది. దీనిద్వారా ఆమె ఎంపిక చేసుకునే కంటెస్టెంట్ ఎప్పటికీ కెప్టెన్ కాలేరని బిగ్బాస్ వెల్లడించాడు. ఇందుకు హమీదా.. సీనియర్ నటి ప్రియ పేరు సూచించింది. దీంతో ఈ సీజన్ మొత్తంలో ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశమే లేదని, దాని వల్ల లభించే ఇమ్యూనిటీ కూడా ఆమెకు దక్కదని ప్రకటించాడు బిగ్బాస్. కానీ తాజాగా ప్రియ కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్బాస్ చరిత్రలోనే ఈ కెప్టెన్సీ రికార్డుకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్బాస్ ఆమెను కెప్టెన్గా ఒప్పుకోకపోతే ఆ పదవిని ప్రియ వేరే ఎవరికైనా అప్పగించే అవకాశమూ లేకపోలేదు! -
ప్రియపై మండిపడ్డ లోబో, అరవద్దంటూ నటి వార్నింగ్
బిగ్బాస్ షోలో కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడేది నామినేషన్లోనే. ఈ ప్రక్రియలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ తగవులు తారాస్థాయికి చేరుకోవడంతోపాటు వీకెండ్లో నాగార్జున వచ్చి సర్ది చెప్తే కానీ ఆ కొట్లాటలకు కళ్లెం పడదు. మొత్తానికి బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో నాలుగోవారం నామినేషన్కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇందులో విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. 'బయట యాక్టింగ్ చేస్తావు, అదే యాక్టింగ్ హౌస్లోనూ చేస్తున్నావు అని చెప్పడానికి నువ్వెవరు?' అని సూటిగా ప్రశ్నించాడు విశ్వ. దీనికి నటరాజ్ మాస్టర్ బరాబర్ అలాగే మాట్లాడతానని దురుసుగా సమాధానమిచ్చాడు. శ్రీరామచంద్ర.. శ్వేత తనకు వెన్నుపోటు పొడుస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇక లోబో ప్రియను నామినేట్ చేస్తూ చెప్పిన కారణం చాలామందికి మింగుడు పడటం లేదు. తొలి ప్రేమ సంగతులు చెప్పమని బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో లోబో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. అయితే ప్రియ దాన్ని సినిమా స్టోరీలా ఉందని కామెంట్ చేయడం అతడికి నచ్చలేదు. ఇదే విషయాన్ని నామినేషన్లో ప్రస్తావిస్తూ ఆమెపై ఒంటికాలిపై లేచాడు. తన మీదకు అరవద్దంటూ ప్రియ హెచ్చరిస్తున్నా అతడు మాత్రం నేను ఇలానే అరుస్తానంటూ ఆమె మీదకు వెళ్లాడు. అంతలా చిందులు తొక్కిన లోబో చివర్లో ఏడ్చేయడంతో రవి వచ్చి ఓదార్చాడు. ఇదంతా చూసిన ప్రియ.. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దు అని చురకలు అంటిస్తూనే ఎమోషనల్ అయింది. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. యాంకర్ రవి, లోబో కలిసి గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేట్ అవుతున్న ప్రతి కంటెస్టెంటు సిరి, షణ్ను కలిసి ఆడుతున్నారంటున్నారు గానీ ప్రతిసారి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూనే మళ్లీ కలిసిపోతున్న యాంకర్ రవి, లోబో కలిసి గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవిని ఏమైనా అంటే లోబోకు కోపం వస్తుందని, అందుకే ప్రియను నామినేట్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నేటి నామినేషన్లో ఇంకా ఏయే కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజుకుందనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
బిగ్బాస్: ప్రియ సేఫ్, లహరి ఎలిమినేట్!
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో కంటెస్టెంట్ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, మానస్ భారీ ఓట్లతో ఓటింగ్లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరకడంతో పాటు ఎలాంటి నెగెటివిటీ కూడా లేకపోవడంతో ఈ ముగ్గురూ ఈవారం సేఫ్ అయినట్లే! మిగిలిందల్లా లహరి, ప్రియ. నిజానికి ప్రియ నామినేషన్స్లోకి వచ్చిన రోజే ఆమె ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారంతా! ఒక అమ్మాయి గురించి అందరి ముందు బ్యాడ్గా మాట్లాడటంతో ప్రియపై నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కూడా ఒక మహిళే కదా, అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది? రాత్రిపూట హగ్గులంటూ బూతుగా ఎలా చిత్రీకరించగలిగింది? అని ఆక్రోశించారు నెటిజన్లు. కానీ ఎప్పుడైతే రవి.. ఇంట్లో సింగిల్మెన్ (పెళ్లికానివాళ్లు) ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది. రవి వల్లే ప్రియ అలా మాట్లాడాల్సి వచ్చిందని పలువురూ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ ఇద్దరు చేసిన తప్పులకు లహరి బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వారం లహరి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ లేడీ అర్జున్రెడ్డికి నేడు బిగ్బాస్ హౌస్లో ఆఖరి రోజు కానుంది. -
యాంకర్ రవి నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్
బిగ్బాస్ హౌస్లో మూడోవారం జరిగిన నామినేషన్స్ వల్ల ఈసారి ఎలిమినేషనే తలకిందులయ్యేలా ఉంది. ప్రియ, యాంకర్ రవి వల్ల లహరి బ్యాడ్ అయింది. యాంకర్ రవి ఆడిన డబుల్ గేమ్ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్ రవి.. ప్రియతో నామినేషన్స్ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. 'ఆమె యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది. కానీ 'సింగిల్ మెన్'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అని వాపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ లహరి మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్రూమ్ దగ్గర హగ్ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ 'నువ్వు మగాళ్లతోనే బిజీ' అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. నువ్వు అన్నావు కదా అని ప్రియ నిలదీసినప్పటికీ తను మాత్రం అనలేదని బుకాయించాడు. ప్రియ తనను బ్యాడ్ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్ మెన్ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే 'అన్నాను సర్' అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్ అని చెప్పింది. తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి నాగ్.. లహరికి ఆమె గురించి రవి బ్యాడ్గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు. -
బిగ్బాస్: ఆ ఇద్దరు చేసిన తప్పుకు లహరి బలి కానుందా?!
Bigg Boss 5 Telugu, 3rd Week Elimination: బిగ్బాస్ హౌస్లో మూడోవారం జరిగిన నామినేషన్స్ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నామినేషన్స్లో ప్రియ చేసిన కామెంట్ల మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కేవలం లహరి తనతో ఉండట్లేదన్న బాధతో.. ఆమె అబ్బాయిలతో బిజీగా ఉందని, అలాంటప్పుడు అమ్మాయిలతో ఉండటానికి టైం ఎక్కడుంటుందని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అదీకాకుండా రాత్రిపూట వాష్రూమ్ దగ్గర యాంకర్ రవికి హగ్గివ్వడం కళ్లారా చూశానంటూ దాన్నో పెద్ద బూతుగా చిత్రీకరించింది. అనాల్సిందంతా అన్నాక తాను చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ లహరికి సారీ చెప్పి చేతులు దులిపేసుకుంది. అయితే ఇక్కడ ప్రియ ఒక్కరిదే తప్పు కాదు, యాంకర్ రవిది కూడా ఉంది. నామినేషన్స్ కన్నా ముందు అతడు ప్రియ దగ్గర లహరి గురించి కొంత బ్యాడ్గా చెప్పాడు. లహరి యాంకర్ అవడానికి ప్రయత్నిస్తోందని, అందుకే తన పనులన్నీ చేసి పెడుతోందని, ఇంట్లో సింగిల్ మెన్ (పెళ్లికాని అబ్బాయిలు) ఉన్నా కూడా తన వెంటే తిరుగుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ప్రియ దగ్గర వాపోయాడు. కానీ తర్వాత మాత్రం సింగిల్ మెన్ అనే మాటే తన నోటి నుంచి రాలేదంటూ ప్లేటు ఫిరాయించాడు. అటు ప్రియ కూడా.. వీరిద్దరి వ్యవహారాన్ని పెద్ద ఇష్యూ చేసి మిడ్నైట్ హగ్గు అంటూ ఓ అమ్మాయి గురించి దారుణంగా మాట్లాడి పెద్ద తప్పే చేసింది. అయితే రవి, ప్రియ చేసిన తప్పులకు లహరికి శిక్ష పడేలా కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్లో మానస్, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రతో పాటు ప్రియ, లహరి నామినేషన్స్లో ఉన్నారు. ప్రతి సమస్యను ఎంతో కూల్గా డీల్ చేస్తున్న మానస్కు బాగానే ఓట్లు పడుతున్నాయి. అటు శ్రీరామ్కు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరకుండా ఉంటున్న ప్రియాంక సింగ్కు కూడా బాగానే ఓట్లు గుద్దుతున్నారు. మిగిలిందల్లా ప్రియ, లహరి. నామినేషన్స్ జరిగినరోజు ప్రియ మీద తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కానీ రవి.. లహరి గురించి బ్యాడ్గా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ప్రియపై కాస్త నెగెటివిటీ తగ్గింది. ఎటొచ్చీ లహరికి అంతగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఆమె డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ లహరికి సానుభూతి ఓట్లు పడితే మాత్రం ఆమె కచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓటర్లు ప్రియకు సపోర్ట్ చేస్తారా? లేదా లహరిని హౌస్లో కొనసాగనిస్తారా? అన్నది ఇంట్రస్టింగ్గా మారింది. -
లోబో అసభ్యంగా తాకాడు, వెంటనే డ్రెస్ మార్చుకున్నా: ప్రియాంక సింగ్
Bigg Boss 5 Telugu, Episode 17: నామినేషన్స్తో హౌస్లో కార్చిచ్చు రగిల్చాడు బిగ్బాస్. ఈ నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్ల మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసేందుకు వినోదాత్మకమైన టాస్క్ ఇచ్చాడు. అయినప్పటికీ హౌస్లో నెలకొన్న అశాంతి ఛాయలు పూర్తిగా కనుమరుగైనట్లు కనిపించలేదు. మరి నేటి(సెప్టెంబర్ 21) నాటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. నామినేషన్లో ఐదుగురు జెస్సీ.. మానస్, నటరాజ్ మాస్టర్ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో మాస్టర్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్ను; కాజల్.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియను నామినేట్ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ప్లేటు ఫిరాయించిన రవి, ఏడ్చేసిన ప్రియ 'యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తుంది, అందుకని నాతో ఉంటుంది. కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట' అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలుసుకుందామని రవితో భేటీ అయింది లహరి. 'నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు. తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?' అని నిలదీసింది. దీనికి రవి అడ్డంగా తలూపుతూ అబ్బే ఆ మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. కానీ ప్రియ మాత్రం.. 'లహరి సింగిల్గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది, నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు' అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది. అయితే రవి మాత్రం తను ఆ మాటే అనలేదని కరాఖండిగా చెప్పాడు. నిజంగానే నువ్వు ఆ మాట అన్నావు బ్రో, అది నేను విన్నానంటూ ప్రియ వెక్కివెక్కి ఏడ్చేసింది. సడన్గా వచ్చి చేయి పెట్టాడు: పింకీ మరోవైపు ప్రియాంక సింగ్.. లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కాజల్, సిరి దగ్గర వాపోయింది. 'నిన్న హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది కొంచెం అన్ కంఫర్టబుల్గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్ నేను చేసుకుంటున్నాను. అంతలో సడన్గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను' అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్ హగ్ ఇచ్చి వెళ్లాడు. కుమిలి కుమిలి ఏడ్చిన ప్రియ హౌస్లో అందరూ తనను టార్గెట్ చేయడంతో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చింది ప్రియ. 'నువ్వేదైతే నేర్పించావో అలాగే ఉన్నానమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు' అంటూ తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది. ఆ తర్వాతి రోజు ప్రియ.. తన గుండెలోని భారాన్ని దింపేసుకుంటూ లహరికి సారీ చెప్పింది. మీ అందరి రియాక్షన్ చూశాక నేను తప్పు విధానంలో చెప్పానని అర్థమైందని ప్రాయశ్చిత్తపడింది. ఫన్ టాస్క్ ఇచ్చిన బిగ్బాస్ తర్వాత బిగ్బాస్.. హౌస్మేట్స్కు 'హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్ ఇచ్చాడు. హైదరాబాద్ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది. అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా, విశ్వ అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్ మ్యారేజ్ బ్రోకర్గా, లోబో ఈవెంట్ మేనేజర్, శ్వేత లోబో అసిస్టెంట్, హమీదా.. అబ్బాయి ఎక్స్గర్ల్ఫ్రెండ్, మానస్ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు. ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ కానుంది. -
Bigg Boss 5 Telugu: అసలు బిగ్బాస్లో ఏం జరుగుతోంది?
అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్బాస్ 5’లో కంటెస్టెంట్లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్బాస్లో ఏం జరుగుతోంది? ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్గా పని చేస్తున్న ‘బిగ్బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్లో కంటెస్టెంట్లు రవి, కాజల్లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా. (చదవండి: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) బిగ్బాస్ హౌస్లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్లు హౌస్కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి. ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్లోని అందరూ హతాశులయ్యారు. బిగ్బాస్ హౌస్లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు. -
బిగ్బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్
బిగ్బాస్ హౌస్లో ప్రియ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. లహరిని నామినేట్ చేసిన ప్రియ.. రవి, లహరి అర్థరాత్రి సమయంలో రెస్ట్ రూమ్లో హగ్ చేసుకున్నారని, ఆమె ఎక్కువగా మగాళ్లతోనే తిరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అది నార్మల్ హగ్గేనని, రవిని నేను బ్రో అని పిలుస్తానని , మా మధ్య వేరే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది లహరి. రవి కూడా అలాంటి రాంగ్ స్టెట్మెంట్స్ ఎలా ఇస్తావంటూ ప్రియపై ఫైర్ అయ్యాడు. (చదవండి: రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్) తన కూతురికి ఈ విషయం అర్థమయితే ఎలా ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇక లహరి కూడా ఒక నేషనల్ మీడియాలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రియ మాత్రం తాను చూసిందే చెప్పానంటూనే రవి, లహరిలకు సారీ చెప్పింది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రియ ఎందుకు ఆ కామెంట్ చెప్పిందో వివరించింది. గొడవ జరగడానికి ముందు రవి తనకు ఎం చెప్పాడో ఆ విషయాన్ని లహరితో షేర్ చేసుకుంది ప్రియ. లహరి బిగ్ బాస్ తరువాత యాంకర్గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుందని.. అందుకే నా వెంట పడుతుందనే అనుమానం ఉందని ప్రియతో అన్నాడు రవి. అంతేకాదు హౌస్లో అంతమంది పెళ్లి కాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని.. ఎక్కడికి వెళ్లినా తనతో వస్తుందని.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ రవి తనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా లహరికి వివరించింది ప్రియ. దీంతో లహరి డైరెక్ట్గా వచ్చి రవిని నిలదీసింది. దీంతో షాకైన రవి.. ‘అక్కా నేను అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.. నేను నీతో అలా చెప్పలేదు’ అని ప్రియతో వాదనకు దిగాడు. అయితే ప్రియ మాత్రం నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ తరువాత తనని బ్యాడ్ చేయడానికే ప్రియ ఇలా అంటుందంటూ లహరికి చెప్పాడు రవి. Lol 😂😂😂#BiggBossTelugu5 https://t.co/vAyUID78MD pic.twitter.com/TB0edqWllg — S. (@sahithi_123) September 21, 2021 అయితే లహరి గురించి ప్రియతో రవి చెప్పిన మాటలు నిజమేనని నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరి అర్థమవుతంది. తాజాగా లహరి గురించి రవి మాట్లాడిని మాటలకు తాలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందో రవి నిజంగా లహరిపై బ్యాడ్ కామెంట్స్ చేశాడు. అయితే అతని ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ప్రియతో అలా చెప్పడం, ప్రియ అదే విషయానికి కొంచెం మసాలా దట్టించి నామినేషన్ ప్రక్రియలో అందరి ముందు నోరు విప్పడం.. వివాదానికి దారి తీసింది. అయితే నిన్నటి వరకు ప్రియని తిట్టుకున్న వాళ్లంతా తాజా వీడియో చూసి రవిని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మిడ్నైట్ హగ్ గొడవ ఎక్కడి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
లహరి సింగిల్, రాత్రి రెస్ట్ రూమ్లో యాంకర్ రవికి హగ్గిస్తూ..: ప్రియ
Bigg Boss 5 Telugu,Episode 16: కంటెస్టెంట్ల అసలు రంగును బయటపెట్టేది నామినేషన్సే. ఈ నామినేషన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఈ ప్రక్రియ వాడివేడిగానే జరిగింది. నామినేట్ చేసే క్రమంలో ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగారు. కొందరైతే నోరు కూడా జారారు. వాళ్లెవరు? నేటి(సెప్టెంబర్ 20) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం.. డబ్బులు లేక స్కూల్లో జాయిన్ చేయించలేకపోయా: విశ్వ సన్నీ మంచోడే కానీ పని దొంగ, అటు హమీదా పని చేయదు కానీ ఆర్డర్లు వేస్తుంది అని చిరాకు పడ్డాడు మానస్. నాగార్జున ఆదేశం మేరకు మటన్ బిర్యానీకి అవసరమైన సరుకులన్నింటినీ బిగ్బాస్ హౌస్లోకి పంపించాడు. కానీ అది కాజల్ మాత్రమే వండాలని మెలికపెట్టడంతో ఆమె గరిటె పట్టక తప్పలేదు. విశ్వ బిగ్బాస్ హౌస్కు వచ్చేముందు లాక్డౌన్లో తన పరిస్థితి ఎలా ఉందో షణ్ముఖ్ దగ్గర గోడు వెల్లబోసుకున్నాడు. భార్య, కొడుక్కు ఏమైనా కొందామంటే డబ్బుల్లేవని, నాలుగు నెలల అద్దె కూడా కట్టలేదని ఎమోషనల్ అయ్యాడు. కొడుకును స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తే డబ్బులు తక్కువున్నాయని సీట్ రాలేదు అని ఏడ్చాడు. దీంతో షణ్ముఖ్ అతడిని ఓదార్చాడు. 21 సార్లు స్విమ్మింగ్ పూల్లో మునకేసిన షణ్ముఖ్ హౌస్లో షణ్ముఖ్ పట్టపగలు నిద్రపోవడంతో కెప్టెన్ విశ్వ అతడికి కఠిన శిక్ష విధించాడు. స్విమ్మింగ్ పూల్లో 21 సార్లు దూకాలని చెప్పడంతో షణ్ను తనకు విధించిన శిక్షను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు వాళ్లు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పేరును టైల్ మీద ముద్రించి దాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా శ్రీరామ్.. మానస్, రవిని; సిరి.. శ్వేత, లహరిని నామినేట్ చేశారు. మీరన్న మాట తీసుకోలేకపోయానంటూ సన్నీ.. ప్రియను నామినేట్ చేయగా వాటే సేఫ్ ప్లే అంటూ చప్పట్లు కొట్టింది. తర్వాత సన్నీ.. కాజల్ను నామినేట్ చేశాడు. నేను రిలేషన్ కోసం రాలే, సరిగ్గానే ఆడుతున్నా: జెస్సీ కౌంటర్ అనంతరం నటరాజ్ మాస్టర్ వంతు రాగా.. గేమ్లో నా వీపు మీదెక్కి కూర్చుందని, ముఖం మీద కూడా గట్టిగా ప్రెస్ చేసింది, అంతేకాకుండా చాలాసార్లు వాడు, వీడు అని మాట్లాడటం విన్నానంటూ సిరిని, సెల్ఫిష్ అంటూ కాజల్ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటూ శ్రీరామ్, మానస్లను నామినేట్ చేసింది. యాంకర్ రవి.. చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపిస్తూ ఇంత మంచి ప్లాట్ఫామ్ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందని, ఇప్పటికైనా గేమ్ ఆడంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దీనికి అతడు రియాక్ట్ అవుతూ తాను పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతున్నానని, ఎలాంటి రిలేషన్ కోసం రాలేదని కౌంటరిచ్చాడు. నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు అనంతరం లహరి.. ప్రియను నామినేట్ చేయగా ఇది కదా సేఫ్ గేమ్ అని ఆమె పెదవి విరించింది. అసలు మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని లహరి అడగ్గా.. ఎందుకంటే నువ్వు హౌస్లో అందరు అబ్బాయిలతో బిజీ కాబట్టి! అబ్బాయిలతో నీకు ఏ ప్రాబ్లమ్ లేదు, కానీ అమ్మాయిలతోనే అసలు ప్రాబ్లమ్ అని వెటకారంగా ఆన్సరిచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. తర్వాత ప్రియ శ్రీరామ్ పేరున్న ప్లేట్ను పగలగొట్టింది. నువ్వు అబ్బాయిలతో బాగా బిజీ: ప్రియ లోబో.. ప్రియాంక సింగ్, శ్రీరామ్ను; ప్రియాంక సింగ్.. లోబో, జశ్వంత్ను; మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశారు. ప్రియ.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లహరి కోసం చూశానని, కానీ ఆమె నా దగ్గరకు రాలేదని, ఎందుకంటే ఇంట్లో మగవాళ్లతో బిజీగా ఉందని మరోసారి అదే మాటను నొక్కి చెప్పింది. ఒకసారైతే రాత్రి రెస్ట్ రూమ్లో రవికి హగ్గిస్తూ కనిపించావంది. దీంతో చిర్రెత్తిపోయిన లహరి.. జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి అని మండిపడింది. మిడ్నైట్ హగ్గు అనడం ఎంతవరకు కరెక్ట్: మండిపడ్డ రవి రవి బ్రదర్ బర్త్డే కోసం షర్ట్ పంపించమని కెమెరాల దగ్గర రిక్వెస్ట్ చేశానని, అతడు తనకు బ్రో మాత్రమేనంటూ ఏడ్చేసింది లహరి. తర్వాత రవి మాట్లాడుతూ.. మిడ్నైట్ హగ్గు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. నేను లహరి కంటే సిరి, కాజల్తో ఎక్కువగా ఉంటాను, అప్పుడు లేని సమస్య లహరి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుంది? మమ్మల్ని అందరినీ దోషులుగా చూపిస్తున్నావు అని కడిగి పారేశాడు. దీనికి ప్రియ బదులిస్తూ.. ఆమె సింగిల్, ఏదైనా చేయగలదు అని మరోసారి ఆమె క్యారెక్టర్ను నిందించేలా కామెంట్ చేయడంతో లహరి ఆవేశంతో ఊగిపోయింది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. మనిషికి హగ్గిస్తే బూతు కాదు: సన్నీ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయని, రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావంటూ ప్రియ మీద ఒంటికాలిపై లేచాడు రవి. నా బిడ్డకు ఈ స్టేట్మెంట్ అర్థమైతే ఎలా ఉంటుంది? మీకూ పిల్లలు ఉన్నారు కదా! అని ఆవేదన చెందాడు. ఈ గొడవతో మరింత హీటెక్కిపోయిన ప్రియ.. లహరి పేరును టైల్పై ముద్రించి దాన్ని కసితీరా పగలగొట్టింది. తర్వాత సన్నీని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా సన్నీ.. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు. అలా హగ్గివ్వడం తప్పని తాను అనలేదని, కేవలం చూసింది చెప్పానంటూ ప్రియ గొంతు చించుకుని అరిచినా ఆమెను పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారు. ఈ నామినేషన్ రచ్చ రేపటి ఎపిసోడ్లోనూ కొనసాగనుంది. -
లహరి మీద ప్రియ అభాండం! మగాళ్లతో బిజీ కదా అంటూ నీచంగా..!
Bigg Boss Telugu 5, Nominations: బిగ్బాస్ మూడోవారం 'వాల్ ఆఫ్ షేమ్' అనే నామినేషన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవరైతే ఈ షోలో కొనసాగడం అనవసరం అనుకుంటారో వారి పేరును బద్ధలు కొడుతూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ పోటాపోటీగా నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ల పేర్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ క్రమంలో లహరి.. ప్రియను నామినేట్ చేసింది. మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రియకు వార్నింగ్ ఇచ్చిన రవి ఆమె సమాధానం విని షాకైన లహరి.. ఎవరితో ఉన్నానో చెప్తారా? అని అడిగింది. ఇందుకామె రవి, మానస్తో బిజీగా ఉన్నావని చెప్పింది. ప్రియ మాటలు విని షాకైన రవి.. సిరిన ఉదాహరణగా చెప్తూ.. ఆమెను ఒక ఫ్రెండ్లాగా, సోదరిలాగా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మధ్యలోనే అడ్డుకున్న ప్రియ.. ఇప్పుడు మీరు అందరి దగ్గరా సపోర్ట్ ఆశించకండి అని కౌంటరిచ్చింది. ఆమె మాటలతో తల పట్టుకున్న రవి.. అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్రెడ్డి యాంగిల్ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది. ప్రియ కంటే ఉమాదేవి నయం! ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ప్రియలో సెకండ్ యాంగిల్ బయటపడింది, అప్పుడు సన్నీ, ఇప్పుడు లహరి మీద తన అక్కసు వెళ్లగక్కింది, ఈవిడ కంటే ఉమాదేవి 100 రెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. బహుశా ఆమె చెప్పింది నిజమే కావచ్చేమో కానీ చెప్పిన విధానం బాగోలేదంటున్నారు మరికొందరు. ప్రియ ఇలాగే ఇతర కంటెస్టెంట్లను చులకన చేస్తే మాట్లాడితే ఈ వారం వెళ్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసిపోతారా? లేదా ప్రియ, లహరి మధ్య వైరం కొనసాగనుందా? అనేది చూడాల్సిందే! -
ఆమె బిగ్బాస్ షోకు పనికి రాదు: ఉమా దేవి
ప్రతి సీజన్లో అందరి మీదా నోరు పారేసుకునే కంటెస్టెంట్ ఒకరుంటారు. చీటికీమాటికీ గొడవ పడుతూ, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ నానా రభస చేస్తుంటారు. అయితే ఇలా ఆవేశం స్టార్లను బిగ్బాస్ త్వరగానే బయటకు పంపించివేస్తుంటాడు. అలా ఈ సీజన్లో పెద్ద గొంతేసుకుని అందరినీ ఓ ఆటాడేసుకుంది ఉమాదేవి. అంతేకాదు, నోటికొచ్చినట్లు చెడామడా తిట్టేసి తనకు బూతులు కూడా వచ్చని నిరూపించుకుంది. ఈ బూతులే ఆమె కొంప ముంచాయి. ఆమెను తన ఇంటికి చేర్చాయి. బిగ్బాస్ బజ్లో రెచ్చిపోయిన ఉమాదేవి అయితే ఇలా బూతులు మాట్లాడటం తప్పని తెలుసుకుని తన ప్రవర్తన మార్చుకుని మంచి దారిలో నడవాలనుకుంది ఉమాదేవి. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం! అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన తప్పులు సరిదిద్దుకున్నా, అందరితో కలిసి ఉన్నా, కామెడీ చేసి జనాలను నవ్వించినా రెండోవారంలో ఎలిమినేట్ కాక తప్పలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ బజ్లో పాల్గొంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల నిజస్వరూపాలను బయటపెట్టింది. యాంకర్ రవి నాకు ఆ ఛాన్స్ఇవ్వలేదు ముందుగా సిరి, షణ్ముఖ్ల గురించి మాట్లాడుతూ.. 'వాళ్లిద్దరూ ఫ్రెండ్సేంటి? నాకర్థం కాదు. ఫ్రెండ్షిప్ కోసమే ఆడటానికి వచ్చారా? అదేదో వాళ్లింట్లో ఆడుకోవచ్చు కదా! సిరి ఉంటే షణ్ను ఉండాలి. మంచాలు కూడా పక్కపక్కనే వేసుకుంటారా ఎవరైనా? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా? బయటకొచ్చాక కూడా వాళ్లిద్దరి మధ్య ఇదే ప్రేమ ఉంటుందా? ఆమె పనులు ఆమెకు, ఇతడి పనులు ఇతడికి ఉంటాయి. షణ్ముఖ్.. సిరి మాటలు వింటే కనుక ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తాడు. యానీ మాస్టర్ చాలా కన్నింగ్. ఫాల్తూ గేమ్ ఆడుతోంది. యాంకర్ రవితో గట్టిగా గొడవపడాలి అనుకున్నా, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియ బిగ్బాస్ షోకు పనికిరాదు' అంటూ ఉమాదేవి సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. -
బిగ్బాస్: మూడో వారం నామినేషన్స్లో ఐదుగురు!
Bigg Boss Telugu 5, 3rd Week Nominations: బిగ్బాస్ హౌస్లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్గా మారింది. -
మరోసారి మంట పెట్టిన బిగ్బాస్, వరస్ట్ పర్ఫామర్ అతడేనట!
Bigg Boss Telugu 5 Promo: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి ఎపిసోడ్కు 18 టీఆర్పీ వచ్చింది. ఈ లాంచింగ్ ఎపిసోడ్కు అతిథులెవరూ రాకపోయినా, సినిమా హీరోయిన్ల డ్యాన్సులు లేకపోయినా, కంటెస్టెంట్లలో చాలావరకు కొత్తముఖాలున్నా కింగ్ నాగార్జున మాత్రం తనదైన హోస్టింగ్తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్ అన్నట్లుగా హౌస్లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్ను రఫ్ఫాడిస్తున్నారు. తాజాగా ఇంటిసభ్యులకు బిగ్బాస్ 'బాల్ పట్టు, లగ్జరీ బడ్జెట్ కొట్టు' టాస్క్ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లెవరూ బంతిని పట్టుకోలేకపోయినట్లు చూపించారు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్బాస్ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో వరస్ట్ పర్ఫామర్ను ఎంచుకోవాలని ఆదేశించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆ వరస్ట్ పర్ఫామర్ సన్నీ అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అతడి అభిమానులు బిగ్బాస్ను దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగా ఆడేవాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా, హౌస్మేట్స్ అందరూ కలిసి అతడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు హౌస్లో మరోసారి కాజల్ గొడవపడింది. ఏదో విషయం గురించి ఆమె ప్రియతో మాట్లాడగా అది కాస్తా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అబద్ధం కూడా చాలా అందంగా చెప్తావంటూ కాజల్ను నిందిస్తూ ప్రియ ఆమెకు చేతులెత్తి మొక్కింది. అసలు వీళ్ల మధ్య గొడవెందుకు మొదలైంది? నిజంగానే సన్నీ వరస్ట్ పర్ఫామరా? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
Bigg Boss 5 Telugu: నటి ప్రియ ఫోటోలు
-
ఆమె ఒక ఫైటర్, తనకే ఫుల్ సపోర్ట్ అంటున్న అఖిల్ సార్థక్
Akhil Sarthak Supports Priya: బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో తన ప్రవర్తనతో ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు అఖిల్ సార్థక్. అలాగే మోనాల్తో నడిపిన లవ్ ట్రాక్ కూడా అతడిని బాగానే ఫేమస్ చేసింది. అఖిల్-సోహైల్-మెహబూబ్ల ఫ్రెండ్షిప్కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది బిగ్బాస్ షోలో రన్నరప్గా నిలిచిన అఖిల్.. దీని ద్వారా వచ్చిన క్రేజ్తో ఓ వెబ్ సిరీస్తో పాటు 'ఫస్ట్ టైమ్' అని ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా వుంటే అఖిల్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్బాస్ ఐదో సీజన్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సీజన్లో తను ఏ కంటెస్టెంట్కు సపోర్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. శైలజా ప్రియ... అదేనండీ నటి ప్రియకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమెకు సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టాడు. 'ఈ సీజన్ మొత్తానికి తను కెప్టెన్ కాలేకపోయినా టాస్కుల్లో మాత్రం తన బెస్ట్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మీరు ఫైటర్ అన్న విషయం తెలుసనుకోండి.. అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ..' అంటూ మద్దతు పలికాడు. నటి ప్రియకు ఓట్లేయమంటూ అభిమానులకు పిలుపునిస్తున్నాడు. -
బిగ్బాస్: లీకైన రెండో వారం నామినేషన్ లిస్ట్!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
ఆమె స్ట్రాంగ్, అతడు సింపతీ ప్లే చేస్తున్నాడు: నటి ప్రియ
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే గదిలో నిద్రిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలిసే ఉంటూ, కలిసే పని చేస్తూ, కలిసే తింటున్నప్పుడు ఒకరి గురించి మరొకరికి ఏదో ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది. ఎవరు ఎలాంటివాళ్లు? ఎవరు మామూలుగా ఉన్నారు? ఎవరు నటిస్తున్నారు? ఎవరు పక్కా ప్లానింగ్తో షోలోకి వచ్చారు? అన్న విషయాలను ముందే పసిగడుతుంటారు. నటి ప్రియ కూడా కంటెస్టెంట్ల గురించి రివ్యూ ఇచ్చింది. అన్సీన్ వీడియోలో ఉమాదేవి, లహరితో కలిసి ముచ్చట్లు పెట్టిన ప్రియ కంటెస్టెంట్లందరి గురించి చెప్పుకొచ్చింది. అతడికి ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలుసు మొదటగా.. సన్నీ గురించి చెప్తూ 'తనకు అన్నీ తెలుసనుకుంటాడు, కానీ కొంతే తెలుసు. మానస్ సైలెంట్గా అందరినీ గమనిస్తూనే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు గట్టిగా రియాక్ట్ అవుతాడు. నటరాజ్ మాస్టర్.. అందరూ తన మాట వింటున్నాడని ఫీలవుతాడు. కానీ కొన్నే వింటాం.. ఇక లోబో విషయానికి వస్తే.. సడన్గా నిద్ర లేచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రవికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది తెలుసు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఇక కాజల్.. ఆమెకు అన్నీ తెలుసేమో అనుకున్నా ఇక్కడ అవేమీ పని చేయవు. తను మెచ్యూర్డ్ అనుకుంటుంది కానీ అస్సలు కాదు' అని చెప్పింది ప్రియ. మచ్చిక చేసుకోవాలనుకుంటోంది '26 ఏళ్ల వయసున్న సిరి చాలా స్మార్ట్. యానీ మాస్టర్కు పంతం ఎక్కువ. అవసరం లేని విషయాల్లో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎవరైతే డేంజర్ అనుకుంటుందో వాళ్లతో మరోలాగా ఉంటుంది. శ్వేత వర్మ.. ఎవరేం అడిగినా కాదనుకుండా చేసి పెడుతుంది. అందరినీ మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అది ఆమె స్వభావమో, ఏమో తెలియదు. ఆటలో మాత్రం ఆమె చాలా స్ట్రాంగ్' సరయూ స్ట్రాంగ్, హమీదా తెలివైంది 'ప్రియాంక చాలా మంచి అమ్మాయి. గేమ్ ఎలా ఆడాలి? ఎవరితో ఎలా సర్దుకుపోవాలి? అనేది బాగా తెలుసు. అన్ని ఆటుపోట్లు తట్టుకుని ఇక్కడిదాకా వచ్చింది. విశ్వ.. సింపతీ గేమ్ ప్లే చేస్తున్నాడనిపిస్తుంది. సరయూ మంచి అవగాహనతో, స్ట్రాంగ్గా ఇక్కడికి అడుగుపెట్టింది. హమీదా చాలా తెలివైంది' అని పేర్కొంది. అందరి మీదా రివ్యూ ఇచ్చిన ప్రియ ఈ అభిప్రాయాలు ఏ క్షణమైనా మారే అవకాశముందని చివర్లో ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. -
దమ్ముంటే మానస్ ముందు నాకు లైనేయ్: ప్రియాంక సింగ్
బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్లు మహాముదుర్లులా ఉన్నారు. చాలామంది పక్కా ప్రణాళికతో హౌస్లో అడుగు పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తే కెమెరాల్లో కనిపిస్తాం? ఎలా వ్యవహరిస్తే ఆడియన్స్ను బుట్టలో వేసుకోవచ్చు అన్న విషయాల్లో పీహెచ్డీ చేసినట్లు కనిపిస్తున్నారు. అందుకే హౌస్లో ఇలా అడుగు పెట్టారో లేదో అప్పుడే గొడవలు షురూ చేశారు. కొందరైతే కావాలని కన్నీళ్ల కుళాయిని విప్పుతూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నార జనాలు. ఇక ఇప్పటికే హౌస్లో లవ్ యాంగిల్ను కూడా పరిచయం చేశాడు బిగ్బాస్. అందరినీ అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంకసింగ్(పింకీ) మానస్ను మాత్రం అలా పిలవలేనని బాహాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటిది పింకీని ఓరగా చూశాడు లోబో. ఈ మేరకు గురువారం ఓ ప్రోమో రిలీజైంది. నువ్వు నన్ను చూస్తున్నావని మానస్కు ఫిర్యాదు చేస్తాను. నీకు దమ్ముంటే మానస్ ముందు లైనేయ్ అంది ప్రియాంక. దీంతో షాకైన లోబో.. నేను ప్రియాంకు ప్రపోజ్ చేద్దామనుకుంటే ఆమె ముందు నీతో మాట్లాడమంది అని చెప్తూ మానస్కు దండం పెట్టేశాడు. ఇక పవర్ యాక్సెస్ టాస్క్లో విశ్వ, మానస్, సిరి తర్వాత హమీదా గెలుపొందింది. అయితే తనకు బిగ్బాస్ టఫ్ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల్లో ఒకరు ఎప్పటికీ కెప్టెన్ కాకుండా ఎంచుకోవాలన్నాడు. దీంతో అయోమయంలో పడిపోయిన హమీదా నటి ప్రియ పేరు చెప్పినట్లు లీకైంది. అసలే కెప్టెన్సీ అనేది ఓ ఆపన్నహస్తం వంటిది. ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి దీన్ని మించిన అస్త్రం లేదు. అలాంటిది ఎప్పటికీ కెప్టెన్ అవలేరు అంటే అది నిజంగానే భారీ మైనస్గా మారనుంది. -
బిగ్బాస్ అరాచకం.. రవి, ప్రియల ఒంటిపై దుస్తులతో సహా అన్ని లాక్కెళ్లాడు
బుల్లితెరపై బిగ్బాస్ ఐదో సీజన్ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్లోకి ఏకంగా 19 మందిని పంపి షాకిచ్చాడు బిగ్బాస్. తొలి రోజు మూడు టాస్కులు ఇచ్చి గేమ్ స్టార్ట్ చేసిన బిగ్బాస్.. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియతో ముగించాడు. ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. ఇక అసలు కథ ఈ రోజు నుంచే మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. గేమ్లో భాగంగా తొలిసారి పవర్ రూమ్ని పరిచయం చేశాడు బిగ్బాస్. దీని కోసం ఓ గేమ్ పెట్టగా, అందులో విశ్వ గెలిచాడు. అయితే ఇక్కడ విశ్వకి ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. తాను ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్పాడు. దీంతో యాంకర్ రవి, ప్రియలను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి దుస్తులలతో పాటు అన్ని వస్తువులు లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. యాంకర్ రవి లేడీస్ డ్రెస్ ధరించగా, ప్రియ అబ్బాయి డ్రెస్లో కనిపించి షాకిచ్చింది. ఇక అమ్మాయి డ్రెస్లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ. మరోవైపు ప్రియాంక సింగ్ ఏమో మానస్ని తనదైన శైలీలో ఆటపట్టించింది. రవిని, విశ్వని అన్నయ్య అని పిలుస్తా కానీ, మోనస్ని మాత్రం అలా పిలవలేనని చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. మరి ఇంకా బిగ్బాస్ ఇంట్లో ఎలాంటి సందడి జరిగిందో తెలియాలంటే నేటి సాయంత్రం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. -
బిగ్బాస్ 5: ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అంటున్న ప్రియ
Actor Priya In Bigg Boss 5 Telugu: ప్రియ అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. 1998లో వచ్చిన మాస్టర్ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ప్రియసఖి సీరియల్కు నంది అవార్డు అందుకుంది. హీరోహీరోయిన్లకు అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని.. ఇలా పలు సహాయక పాత్రల్లో ఒదిగిపోయిన ప్రియ సుమారు 60 సినిమాల్లో నటించింది. బుల్లితెర, వెండితెర.. కాదేదీ వినోదానికి అనర్హం అన్నట్లుగా రెండుచోట్లా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియ ఇప్పటివరకు ఎలాంటి వివాదంలో తలదూర్చకపోవడం ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెప్తోంది. 2002లో కిషోర్ను పెళ్లాడిన ఆమెకు నిశ్చయ్ అనే కుమారుడున్నాడు. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అంటోంది ప్రియ. గొడవలకు దూరంగా ఉండే ఈ నటి బిగ్బాస్ హౌస్లో కూడా అదే నియమాన్ని పాటిస్తుందా? తన సహనంతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంటుందా? అన్నది చూడాల్సిందే. -
Timber Depot: ‘టేక్’ఓవర్ చేసింది
తిండిలేని పరిస్థితి నుంచి ఉన్నత పారిశ్రామికవేత్తగా ఎదిగారు నాడు ఛీ అన్నవారు నేడు ఆమె అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్ డిపో యజమానిగా ఎదిగారు ప్రియ అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు ముళ్ళబాటను రెండు దశాబ్దాలలో పూలబాటగా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ తయారీలతో వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు. ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్గా లేడీ లెజెండ్ అవార్డును అందుకున్న ప్రియ అడపా విజయగాథ ఆమె మాటల్లోనే... మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలం. నేను మూడో అమ్మాయిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో, మా అమ్మమ్మ దగ్గర ఏలూరులో ఏడాదిపాటు పెరిగాం. అక్కడ ఎక్కువ కాలం ఉండటం ఇబ్బంది కావటంతో నా పదమూడో ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ వచ్చాను. కొంతకాలానికి ఒక టింబర్ డిపోలో ఐదు వేల రూపాయల జీతానికి రిసెప్షనిస్టుగా చే రాను. ఆ తర్వాత అదే టింబర్ డిపోకు ఇన్చార్జి బాధ్యతలు కూడా చేపట్టాను. ఉద్యోగం చేస్తూనే, బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. క్రమేపీ నా జీతం లక్ష రూపాయలకు చేరింది. మా డిపోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది. కొంతకాలానికి ఆ యజమాని విదేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో డిపో మూసేద్దామనుకున్న సమయంలో 2013 లో నేను ఆ కంపెనీని కొన్నాను. అదే అప్పుడు ‘ఎకో నేచురల్’ అనే నా బ్రాండ్. నా వయస్సు 24 సంవత్సరాలు. అంతకాలం నేను దాచుకున్న డబ్బుతో గుడ్ విల్ కింద రూ. 8 ల„ý లు చెల్లించాను. స్నేహితుల సహకారంతో.. కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏడాది పాటు సమస్యలు ఎదుర్కొన్నాను. నాకున్న అనుభవం తో వాటిని అధిగమించాను. స్నేహితుల సహకారంతో ఓపెన్ స్పేస్లో షెడ్ వేసి, లైసెన్స్ కొనుక్కుని కంపెనీని విస్తరించాను. ఒక అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్ చేస్తుందా అని కొందరు, అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అని కొందరు, ఆడపిల్ల కనుక మోసం చేయదని కొందరు... ఇలా అందరూ అమ్మాయి అనే అంశం మీదే మాట్లాడినా, ఆర్డర్లు ఇస్తున్నారు. మా టింబర్ డిపోలో నాణ్యమైన టేకు చెక్క మాత్రమే సప్లయి చేస్తున్నాను. టేకు చెక్కతో చాలా సమస్యలు ఎదురవుతాయి. టేకు లోపల గుల్లగా ఉంటే బావుండదు. నా అనుభవాన్ని ఉపయోగించి, వాటితో చిన్న చిన్న ఇంటీరియర్స్ చేయటం ప్రారంభించాను. దాంతో నష్టాల నుంచి బయటకు వచ్చాను. నేను స్వయంగా ఒక ఎకరంలో పూర్తిగా టేకు చెక్కతో ఫామ్ హౌస్ కట్టాను. లొంగిపోకూడదు.. ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆశలు చూపిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ఆశలు కొంతకాలం వరకే ఉంటాయి. పదిరోజుల ఆనందం కోసం ఎదురు చూస్తే, జీవితాంతం బాధపడాలి. నాకు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చూపించారు. వేటికీ లొంగకుండా, వ్యక్తిత్వంతో నిలబడ్దాను. ఉన్నత స్థాయికి ఎదిగాను. అందరికీ ఇప్పుడు నేను కొనుక్కున్న కారు, ఇల్లు కనిపిస్తాయి. ఈ స్థాయికి రావడం వెనుక 20 సంవత్సరాల స్ట్రగుల్ ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో ఎదురైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ కుంగిపోకూడదు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయడం మొదలు పెడితేనే ఎదగడానికి అవకాశం వస్తుంది. అమ్మాయిగా పుట్టినందుకు కూడా చాలా గర్వంగా భావిస్తాను. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బ్యాగు పోగొట్టుకుని, పది రోజుల పాటు తిండి లేకుండా ఫుట్పాత్ మీదే గడిపాను. ఆ సమయంలో ఒక కుటుంబం చేసిన సహాయం నా ఎదుగుదలకు బాటలు వేసింది. ఇప్పుడు ‘ఎకో నేచురల్’ అంటే ఒక బ్రాండ్. నాకు గుర్తింపు తెచ్చిన పేరు. నా ఎదుగుదలకు చిరునామా. – వైజయంతి పురాణపండ -
అమ్మాయికి చెప్పు.. ఎందుకీ రాజకీయాలు
బిహార్ రాజకీయాల్లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. ఒక కొత్త పార్టీతో వచ్చింది. తనే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. ఆమె పేరు పుష్పం ప్రియా చౌదరి. ఆమె పెట్టిన పార్టీ పేరు ‘ప్లూరల్స్’. ఈ ఏడాది అక్టోబర్లో జరగబోతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు (ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ), ఆర్జేడీ (ప్రతిపక్షంలో ప్రధాన పార్టీ) లను ఢీకొని మరీ.. ముఖ్యమంత్రిని కాగలననే ఆమె నమ్ముతోంది. జెడి(యు) నాయకుడు వినోద్ చౌదరి కూతురు ప్రియ. ఆ పార్టీలో ఆమె పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలని బయటికి వస్తోంది. ‘లవ్ బిహార్, హేట్ పాలిటిక్స్’.. ఇదీ ఆమె ట్విట్టర్ హ్యాండిల్లోని నినాదం. తన వెబ్సైట్లో బిహార్ ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాసింది. ప్రపంచం ముందుకు వెళుతుంటే.. మనమెందుకు ఇక్కడే ఉండిపోయాం! కారణం మన రాజకీయ నాయకుల విధానాలు’’ అని ఆ లేఖ సారాంశం. ఈ మార్చి 8న మహిళా దినోత్సవం రోజు రాజకీయాల్లోకి వచ్చారు ప్రియ. బిహార్లోని దర్భంగా ఆమె జన్మస్థలం. చిన్న చదువులన్నీ అక్కడే. పెద్ద చదువుల కోసం లండన్ వెళ్లారు. డెవలప్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకో మాస్టర్స్ డిగ్రీ. ప్రియ తండ్రి మాజీ ఎమ్మెల్సీ. ‘‘అమ్మాయికి చెప్పి చూడవయ్యా.. ఎందుకీ రాజకీయాలు’’ అని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారని అప్పుడే వార్తలు బయటికి వచ్చేశాయి. ప్రియ ఆగేలా లేదు. రాజకీయాల్ని ప్రక్షాళన చేయకుండా వదిలే లానూ లేదు. -
కాలేజ్కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్
‘కాలేజ్ కుమార్’ చిత్రంలో కాలేజ్కి వెళ్లేది నేనే. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన కథల్లో ఈ కథ కూడా ఒకటి. కథా బలం ఉండి దాన్ని ఎంటర్టైన్మెంట్గా చెప్పగలిగితే ప్రేక్షకులకు బాగా చేరవవుతుంది. ఈ కథకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి.. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో తెరకెక్కించారు డైరెక్టర్ హారి సంతోష్. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎమ్ఆర్ పిక్చర్స్ పతాకంపై ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా టీజర్ని రేఖ విడుదల చేశారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి కొడుక్కి వాళ్ల నాన్నే హీరో. శివకుమార్ అనే కొడుక్కి నేల మీద నిలబడి సమాజాన్ని ఎలా చూడాలో శశికుమార్ అనే తండ్రి నేర్పిస్తాడు.. ఆ క్రమంలో వారద్దరి మధ్య జరిగే కథే ‘కాలేజ్ కుమార్’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రాహుల్తో పాటు ఇందులో పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు స్టంట్ మాస్టర్ విజయ్.‘‘ఈ సినిమాని తెలుగులో నిరి్మంచడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఎల్. పద్మనాభ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ నార్ల, ప్రియ వడ్లమాని, నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడారు.