purchase
-
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
మైండ్స్పేస్ చేతికి సస్టెయిన్ ప్రాపర్టీస్
న్యూఢిల్లీ: మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సస్టెయిన్ ప్రాపర్టీస్ను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి సంస్థ విలువను రూ. 2,038 కోట్లుగా లెక్కగట్టి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈక్విటీ వాటా కోసం రూ.613 కోట్లు చెల్లించనుండగా, రూ.1,400 కోట్ల రుణభారం మైండ్స్పేస్ రీట్కు బదిలీ అవుతుంది. ప్రతిగా సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు మైండ్స్పేస్ రీట్లో యూనిట్లు లభిస్తాయి. ఒక్కో యూ నిట్కు రూ. 379.08 రేటు చొప్పున 1,61,68,090 యూనిట్లను సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు జారీ చేసే ప్రతిపాదనకు మైండ్స్పేస్ రీట్ బోర్డు ఆమోదముద్ర వేసింది. మార్చి ఆఖరు నాటికి డీల్ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్తో సస్టెయిన్ ప్రాపర్టీస్కి హైదరాబాద్లో కామర్జ్వన్ రాయ్దుర్గ్ పేరిట ఉన్న 18.2 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్.. మైండ్స్పేస్ రీట్ చేతికి దక్కుతుంది. యూనిట్హోల్డర్లకు మరింత విలువ చేకూర్చేలా ఈ డీల్ ఒక మైలురాయిగా ఉంటుందని మైండ్స్పేస్ రీట్ సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. ఆదాయాలు, కంపెనీ పోర్ట్ఫోలియోలు మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కే రహేజా కార్పొరేషన్ గ్రూప్నకు చెందిన మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ 2020 ఆగస్టులో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
బ్లాక్స్టోన్ చేతికి హల్దీరామ్స్!
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 76%పై కన్ను హల్దీరామ్స్లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్స్టోన్తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి. చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్పూర్ బ్రాంచీల ఎఫ్ఎంసీజీ బిజినెస్ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి. -
‘విద్యుత్’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సైతం ఈ పిటిషన్పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్కో, జెన్కో అధికారులున్నారు. ప్రభాకర్రావును సైతం విచారించింది. కేసీఆర్కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. -
ఐటీసీ ఇన్ఫోటెక్ చేతికి బ్లేజ్క్లాన్
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్కు చెందిన ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా క్లౌడ్ సేవల్లో ఉన్న బ్లేజ్క్లాన్ టెక్నాలజీస్ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.485 కోట్లు. గురువారం ఈ మేరకు ఇరు సంస్థలు వాటా కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి. 6–8 వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఐటీసీ లిమిటెడ్ వెల్లడించింది. మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో తమ క్లయింట్లకు సేవలకై సంస్థ సామర్థ్యం పెంపొందించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని తెలిపింది. -
వికాస్ లైఫ్కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
పోటెత్తిన ఎఫ్పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
త్వరలోనే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది. అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే. -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్స్టార్కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
‘లుపిన్’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్)ను ట్రేడ్మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్హామ్తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది. ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు. -
రూ.కోటి పోర్షే లగ్జరీ కారు కొన్నాడు.. చిల్లర చూసి సిబ్బందికి ఫీజులు ఎగిరిపోయాయ్
Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది. క్రేజీ ఎక్స్వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్స్టర్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు. అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్స్టర్తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్లలో లభిస్తుంది. పోర్షే 718 బాక్స్స్టర్ కన్వర్టిబుల్ రూఫ్టాప్తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు. -
వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్నే ఇల్లుగా..!
ఇంగ్లండ్కు చెందిన క్రిష్, మిషెల్ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంబులెన్స్ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్ కేబినెట్ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్ వాటర్ టబ్ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురుకి లండన్లో ఉద్యోగం) -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్ల్యాండ్ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్ల్యాండ్ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్ల్యాండ్ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్ల్యాండ్పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
APSRTC: కొత్తగా 1500 బస్సులు కొనుగోలుకు ప్లాన్!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసమరైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ సర్దుబాటుతో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన విధానాన్ని రూపొందించాలని తీర్మానించింది. కాగా, విజయవాడ ఆర్టీసీ భవన్లో గురువారం పాలకమండలి సమావేశం జరిగింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు 100 ఈ–బస్సు లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆమో దించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ మల్లి కార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరు మలరావు, డైరెక్టర్ రాజ్రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బలహీనపడిన అల్పపీడనం.. ఇక గట్టి వానలు తగ్గినట్టే! -
స్విగ్గీ చేతికి లింక్స్ లాజిస్టిక్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రిటైల్ పంపిణీ సంస్థ లింక్స్ లాజిస్టిక్స్ లిమిటెడ్(లింక్)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్కో సిమెంట్స్, రామ్కో ఇండస్ట్రీస్ నుంచి లింక్ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్ఫామ్ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది. మరోవైపు లింక్స్ లాజిస్టిక్స్లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్కో సిమెంట్స్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్ టెక్కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను పొందనున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా రామ్కో ఇండస్ట్రీస్ సైతం లింక్స్లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్ టెక్తో షేర్ల సబ్్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్కు చెందిన 22,35,223 సీసీపీఎస్లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్ యూనిట్గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. -
స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్లో ఓ సెల్ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్మాల్.. ఎక్కడో తెలుసా!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్ డోంగువాన్ నగరంలో ఉన్న ఈ మాల్ పేరు ‘న్యూ సౌత్ చైనా మాల్’. దీనిని 2005లో ప్రారంభించారు. మొత్తం 96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిలోని దుకాణాల విస్తీర్ణమే 71 లక్షల చదరపు అడుగులు. తొలి పదేళ్లు ఈ మాల్ దాదాపు 99 శాతం ఖాళీగానే ఉండేది. నిర్మాణంలో మార్పులు చేపట్టాక 2018 నుంచి దీని పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇందులో ఐమాక్స్ థియేటర్లు, విశాలమైన పిల్లల ఆటస్థలం చూడటానికే ఎక్కువమంది వస్తుంటారు. ఈ మాల్లోని ఏడు జోన్లను ప్రపంచంలోని ఏడు అంతర్జాతీయ ప్రాంతాల శైలిలో నిర్మించడం విశేషం. చదవండి: ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే! -
మణిపూర్లో సాధారణ పరిస్థితులు
ఇంఫాల్/న్యూఢిల్లీ: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. మణిపూర్లో పరిణామాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. íగిరిజనేతరులైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ మణిపూర్ హైకోర్టుజారీ చేసిన ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ సమర్పించారు. హింసాకాండపై సమగ్ర దర్యాప్తును కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. -
విప్రో కన్జూమర్ చేతికి బ్రాహ్మిన్స్
న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్జీ కంపెనీ విప్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. -
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది. -
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘36 కొత్త అద్దె బస్సులు తీసుకోబోతున్నాం. వీలైతే కర్ణా టక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సులు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం కొన్ని బస్సులు తీసేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులు కేవలం 221 మాత్రమే ఉన్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిశా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయి. తమిళనాడు, తెలంగాణతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటాం’’ అని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా
-
హైకోర్టు లో కొనసాగుతున్న ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు విచారణ
-
టాఫే చేతికి ఫోరేషియా భారత వ్యాపారం
చెన్నై: అంతర్జాతీయ ట్రాక్టర్ల తయారీ దిగ్గజం టాఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) తాజాగా ఫ్రాన్స్ సంస్థ గ్రూప్ ఫోర్వియాలో భాగమైన ఫారేషియా భారతీయ ఇంటీరియర్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఫోక్స్వ్యాగన్, టాటా మోటర్స్, హ్యుందయ్ తదితర ఆటోమోటివ్ సంస్థలకు సీటింగ్, ఇంటీరియర్స్ మొదలైన వాటి డిజైనింగ్, తయారీ సేవలను ఫారేషియా అందిస్తోంది. డీల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, మహారాష్ట్రలోని చకాన్, తమిళనాడులో ఫారేషియా ప్లాంట్లు టాఫేకు దక్కుతాయి. ఇప్పటికే అనంతపురం, చకాన్ ప్లాంట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని, తమిళనాడు ప్లాంటు లావాదేవీ త్వరలో ముగుస్తుందని కంపెనీ తెలిపింది. తమ ప్లాస్టిక్స్ వ్యాపార విభాగంలో ఫారేషియా ఇంటీరియర్ సిస్టమ్స్ విలీనం ద్వారా కస్టమర్లకు మరింత ప్రయోజనకరమైన సేవలు అందించగలమని టాఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. -
ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్య రహిత ప్రాంతం.. నగరానికి కూతవేటు దూరం.. వెరసి అతితక్కువ ధరకే హెచ్ఎండీఏ లేఅవుట్లో అమ్మకానికి ప్లాట్లు.. అంటూ రియల్ ఎస్టేట్ రంగంలోని కొంతమంది అక్రమార్కులు ప్రకటనలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పిగ్లీపూర్లో ప్లాట్లు కొనుక్కునేందుకు తొందరపడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..! రియల్ ముఠా చీకటి ఒప్పందం..? హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో 20ఏళ్ల కిత్రం చేసిన ప్లాట్లనే కబ్జా చేసి అప్పటి లేఅవుట్ల ఆనవాళ్లు కనిపించకుండా నూతన హంగులతో ముస్తాబు చేస్తు న్న రియల్ మోసగాళ్లు తాజాగా హెచ్ఎండీఏ ప్లాట్లు గా తిరిగి విక్రయించేందుకు తెగబడుతున్నారు. పిగ్లీపూర్ గ్రామంలో కొన్ని రియల్ ముఠాలు కొంతకాలంగా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరో సారి వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఒకప్పడు వివాదరహితంగా ఉన్న పిగ్లీపూర్లోని భూములన్నీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. పిగ్లీపూర్ రెవెన్యూ సర్వే నెం.12, 14, 46, 51లోని పాత లేఅవుట్లను, పార్కు స్థలాలతో పాటు ప్రభు త్వ, భూదాన్భూములు ఆక్రమించుకుంటున్న రియల్ మాఫియా హెచ్ఎండీఏ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చీ కటి ఒప్పందం చేసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. లే అవుట్లలోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డబుల్ లేఅవుట్లు పిగ్లీపూర్లో రెండు, మూడేళ్లుగా హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో చేపడుతున్న లేఅవుట్లన్నీ డబుల్, త్రి బుల్ లేఅవుట్లే. 20, 25 ఏళ్ల కిత్రం చేసిన పంచాయ తీ లేఅవుట్లనే హెచ్ఎండీఏ లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లలోని ప్లాట్లను ప్లాన్ మ్యాప్లో చూపించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నెంబర్లలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత వచ్చి న భూ వివాదాలు, ఫిర్యాదుల కారణంగా హెచ్ఎండీఏ అధికారులు ఎల్పీ నెంబర్ను రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వదిలేశారంటే అక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. చదవండి: Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం ఎక్కువ కమీషన్ ఆశ చూపి.. పాత లేఅవుట్లలోని ప్లాట్లను ఆక్రమించుకుని వాటి ఆనవాళ్లు లేకుండా చేసి నకిలీ పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడం కబ్జాదారుల పని... అనంతరం ఎక్కువ కమీషన్ ఆశచూపి ఈ డబుల్ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించే బాధ్యత మార్కెటింగ్ కంపెనీలకు అప్పగించి చేతికి మట్టి అంటకుండా కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుని పేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్లాట్లు విక్రయాలు పూర్తి అయ్యేంత వరకూ రియల్ మాఫియా ముఠా సభ్యులు ఎక్కడా తమ పేర్లు వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారినే టార్గెట్ చేసుకుని ప్లాట్లు విక్రయిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడి వివాదాస్పద భూముల వల్ల భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ప్లాట్లు కొనేముందు అన్ని విషయాలను పరిశీలించడంతో పాటు ప్లాట్లు చేస్తున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. -
సీఎం జగన్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
-
దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ విక్రయం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ దాల్మియా భారత్కు చెందిన దేశీ రిఫ్రాక్టరీ బిజినెస్ను కొనుగోలు చేస్తున్నట్లు వియన్నా కంపెనీ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా తాజాగా పేర్కొంది. దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్(డీబీఆర్ఎల్)కు చెందిన రిఫ్రాక్టరీ బిజినెస్ కొనుగోలుకి రూ. 1,708 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా సీఈవో స్టీఫెన్ బోర్గాస్ వెల్లడించారు. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియాకు చెందిన షేర్ల మార్పిడి ద్వారా డీల్ను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. డీబీఆర్ఎల్.. తమ బిజినెస్ను దాల్మియా ఓసీఎల్కు బదిలీ చేయనుంది. తదుపరి డీవోసీఎల్ పూర్తి ఈక్విటీని 27 మిలియన్ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేర్ల జారీ ద్వారా వియన్నా కంపెనీ సొంతం చేసుకోనుంది. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేరు జారీ ధర రూ. 632.50తో చూస్తే డీల్ విలువను 20.8 కోట్ల యూరోలు(సుమారు రూ. 1,708 కోట్లు)గా స్టీఫెన్ తెలియజేశారు. -
తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది. వాటినే ఎందుకు? ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది. ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది. నిష్క్రమించినవి 600 కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం -
బ్లాక్స్టోన్ చేతికి ఆర్ సిస్టమ్స్
ముంబై: డిజిటల్ ఐటీ సర్వీసుల కంపెనీ ఆర్ సిస్టమ్స్ను కొనుగోలు చేసినట్లు యూఎస్ పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా పేర్కొంది. ఇందుకు 35.9 కోట్ల డాలర్లు(రూ. 2,904 కోట్లు) చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రమోటర్లు సతీందర్ సింగ్ రేఖీ తదితరులతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 1993లో రేఖి ప్రమోట్ చేసిన కంపెనీ డిజిటల్ ఐటీ సర్వీసులతోపాటు, ప్రొడక్ట్ ఇంజనీరింగ్లో ప్రత్యేకతను కలిగి ఉంది. నోయిడాకు చెందిన ఈ కంపెనీ టెక్నాలజీ, మీడియా, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాలలో 250 కస్టమర్లకు సేవలందిస్తోంది. 4,400 మంది సిబ్బంది ఆర్ సిస్టమ్స్ 4,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దేశ, విదేశాలలో 18 డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ సెప్టెంబర్తో ముగిసిన 12 నెలల కాలంలో కంపెనీ రూ. 1,445 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 36 శాతం వృద్ధికాగా.. రేఖి తదితర ప్రమోటర్లు ప్రస్తుతం కంపెనీలో 52 శాతం వాటాను కలిగి ఉన్నారు. బ్లాక్స్టోన్ షేరుకి రూ. 245 చొప్పున వాటాను కొనుగోలు చేయనుంది. మిగిలిన వాటా కోసం షేరుకి రూ. 246 ధరలో డీలిస్టింగ్ ఆఫర్ను ప్రకటించనుంది. తదుపరి రేఖి నాన్ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలను కొనసాగించనున్నారు. కాగా.. బ్లాక్స్టోన్ ఐటీ, ఐటీ ఆధారిత సేవల దేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ 7 బిలియన్ డాలర్లు పంప్ చేసింది. ఎంఫసిస్, వీఎఫ్ఎస్, టాస్క్యూఎస్, ఐబీఎస్ సాఫ్ట్వేర్, ఇంటెలినెట్, సింప్లిలెర్న్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. బ్లాక్స్టోన్ సొంతం చేసుకోనున్న వార్తల ప్రభావంతో ఆర్ సిస్టమ్స్ కౌంటర్లో భారీ డిమాండ్ నెలకొంది. వెరసి బీఎస్ఈలో షేరు తొలుత 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 281ను దాటింది. చివరికి 16 శాతం జంప్చేసి రూ. 271 వద్ద ముగిసింది. -
సెంబ్కార్ప్ చేతికి వెక్టార్ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ కంపెనీ సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,780 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. దీనితో సెంబ్కార్ప్ భారత్లో పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తమ సామర్థ్యాలను 3 గిగావాట్లకు (జీడబ్ల్యూ) పెంచుకోనుంది. భారత్లో రెన్యువబుల్స్ పోర్ట్ఫోలియోను పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ వాంగ్ కిమ్ ఇన్ తెలిపారు. తమ భారత విభాగంలో పవన విద్యుదుత్పత్తికి అనుబంధంగా సౌర విద్యుదుత్పత్తి వాటాను గణనీయంగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఈవో (దక్షిణాసియా) విపుల్ తులి తెలిపారు. వెక్టార్ గ్రీన్తో కలిపితే స్థూలంగా సెంబ్కార్ప్ రెన్యువబుల్స్ పోర్ట్ఫోలియోలో 1 గిగావాట్ సోలార్ అసెట్లు, 2 గిగావాట్ల పవన విద్యుత్ అసెట్లు (ఇప్పటికే ఇన్స్టాల్ అయినవి, అభివృద్ధి చేస్తున వాటితో కలిపి) ఉంటాయని ఆయన వివరించారు. 2023 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. గ్రూప్ స్థాయిలో సెంబ్కార్ప్ స్థూల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.5 గిగావాట్లకు చేరనుంది. 2025 నాటికల్లా దీన్ని 10 గిగావాట్లకు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. 13 రాష్ట్రాల్లో వెక్టార్ గ్రీన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఇండియా నిర్వహణలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 ఆధ్వర్యంలో వెక్టార్ గ్రీన్ ఎనర్జీ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో 519 మెగావాట్ల సామర్థ్యంతో కార్యకలాపాలు ఉన్నాయి. 64 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అలాగే మరో 1 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి పెట్టుబడులతో సిద్ధంగా ఉంది. టోరెంట్ పవర్ కూడా వెక్టార్ గ్రీన్ ఎనర్జీ కోసం పోటీపడినప్పటికీ అంతిమంగా సెంబ్కార్ప్ దక్కించుకుంది. -
సంచలన వీడియోలు రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్
-
గన్ షాట్ : అమ్ముడు ..కొనుడు ..ఇదేనా నయా రాజకీయం..?
-
ఎడిటర్ కామెంట్ : ఫామ్ హౌస్ వ్యవహారం పై ఆశ్చర్యపోని ప్రజలు ..!
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో ఆడియో టేపు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఏదో తేడా కొడుతుంది..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మిస్టరీ ఒక ప్రహసనంగానే మిగిలిపోతుందా? ఈ ఉదంతం మొత్తం పరిశీలిస్తే టీఆర్ఎస్ తొందరపడిందా అన్న సంశయం వస్తుంది. గతంలో ఓటుకు నోటు కేసులో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ఈనాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్గా పట్టుకున్న ఘటన గుర్తున్నవారందరికి టీఆర్ఎస్ మరో సంచలనం సృష్టించిందని, తనకు సవాల్ విసురుతున్న భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని అనిపించింది. కాని చివరికి ఇది ఒక రాజకీయ క్రీడగానే మిగిలిపోయిందా అన్న భావన కలుగుతుంది. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు! బుధవారం రాత్రి టీవీ చానళ్లలో జరిగిన హడావుడి చూస్తే, ఇదేదో వందల కోట్ల వ్యవహారమని, కోట్ల డబ్బు పట్టుబడిపోయిందని అనిపించింది. కొన్ని చానళ్లు పదిహేను కోట్ల రూపాయల మొత్తం దొరికిందని స్క్రోలింగ్లు ఇస్తే, మరికొన్ని చానళ్లు దానిని వంద కోట్లుగా కూడా ప్రచారం చేశాయి. మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారని సమాచారం రాగానే, ఆ డబ్బును ప్రదర్శిస్తారని అనుకున్నాం. కాని ఆయన పొడి, పొడిగా మాట్లాడి వెళ్లడం సందేహాలకు తావిచ్చింది. ఆయన డబ్బు గురించి కాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయం కాని గట్టిగా ఏమీ చెప్పలేదు. కాకపోతే వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పి వెళ్లిపోయారు. మీడియా వారు డబ్బు దొరికిందా అని మరో పోలీసు అధికారిని ప్రశ్నించినా, ఆయన ఏమీ జవాబు ఇవ్వలేదు. దాంతో ఇందులో తేడా ఉందని అనుకున్నారో, ఏమో కాని టీవీలలో డబ్బు గురించిన ప్రస్తావనను ఆపివేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్నది అభియోగం. ఒక్కొక్కరికి వంద కోట్ల ఆఫర్, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి వచ్చినవారిలో ఒకరు పూజారి కాగా, మరొకరు చిన్న స్థాయి స్వామీజి. ఇంకొకరు ఒక చిన్న వ్యాపారవేత్త. ఒక సమాచారం ప్రకారం వీరేదో చిన్న, చిన్న బ్రోకరేజీలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారట. బీజేపీలోకి వస్తే డబ్బు వస్తుందని చెప్పి, అందులో తమకు ఎంత కమిషన్ ఇస్తారని అడగడానికి వచ్చి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. వీరికి వందల కోట్లు హాండిల్ చేస్తే సత్తా, లేదా స్థోమత ఉందా అన్న డౌటు వచ్చింది. సదరు వ్యాపారికి అటు టిఆర్ఎస్తో, ఇటు బీజేపీతోనూ సంబంధాలు ఉన్నాయట. వీరేదో డీల్ గురించి మాట్లాడినప్పుడు ఆడియోలు ఉన్నాయని పోలీసులు అంటున్నా, వాటిని కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదో తెలియదు. పైగా ఎవరైనా కీలక నేత, వీరితో మాట్లాడిన ఆడియో ఉంటే దానికి విశ్వసనీయత వస్తుంది కాని, సదరు వ్యక్తి తనకు ప్రధాని తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు.. హోం మంత్రి తెలుసు అంటూ మాట్లాడితే, దానిని రికార్డు చేస్తే ఏమి ప్రయోజనం. దానిని ఎవరు నమ్ముతారు. పోసుకోలు కబుర్లుగానే భావిస్తారు తప్ప ఇంకొకటి ఉండదు. కాగా ఇదే సమయంలో మరి కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఎందుకు అన్నారు?. అసలు ముఖ్యమంత్రి కేసీఆరే మీడియా సమావేశం పెడతారని ఎందుకు ప్రచారం జరిగింది?. తమను బీజేపీ కొంటానికి వచ్చిందని చెప్పిన ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదు?. తొలుత టీఆర్ఎస్కు ఇదేదో ఊపు తెస్తుందని అనుకుంటే, చివరికి బూమ్ రాంగ్ అయిన చందంగా పరిస్థితి మారింది. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. వారు దీనిపై సీబీఐ విచారణ లేదా, సిటింగ్ జడ్జి తో విచారణ కోరుతున్నారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈలోగా ఏసీబి కోర్టు డబ్బు చూపకపోతే అవినీతి నిరోధక కేసుకిందకు రాదని స్పష్టం చేయడంతో ఇది మొత్తం వీగిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఓటుకు నోటు కేసు ఘటన జరిగినప్పుడు ఆ వెంటనే పట్టుబడిన డబ్బుతో సహా , రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సంభాషణ వీడియో మొత్తం బయటకు వచ్చేసింది. ఏసీబీ పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకుంది. తదుపరి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోన్ సంభాషణ ఆడియో కూడా బహిర్గతం అయింది. దాంతో కేసీఆర్ సమర్ధతపై ప్రజలందరిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన ఇమేజీ బాగా పెరిగింది. కేవలం ఏభై లక్షలు పట్టుబడితేనే అంత మైలేజీ వచ్చినప్పుడు, వందల కోట్ల ఉదంతంలో ఇంకెంత మైలేజీ రావాలి?. బీజేపీ ఎంతగా బదనాం కావాలి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలో భారీగా డబ్బు వెదజల్లుతోందని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కూడా అలాగే ఏమైనా జరిగిందేమోనని చాలా మంది అనుకున్నారు. తీరా అక్కడ ఏవో బ్యాగులు చూపడం మినహా డబ్బు చూపకపోవడంతో కేసు బలహీనమైపోయింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తరచుగా ఆ పామ్ హౌస్ లో కలుస్తుంటారట. వీరిలో బాలరాజు తప్ప మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరినవారు. అందువల్ల వీరి విధేయత గురించి పెద్దగా చర్చించుకోనవసరం లేదు. మునుగోడులో ఎన్నికల ప్రచారంలో ఉండవలసిన వీరు ఇక్కడ పామ్ హౌస్లో ఎవరితోనో సంప్రదింపులలో ఉన్నారన్న సమాచారం అందడంతో అదేదో బీజేపీ కుట్రేమోనని అనుమానించి పోలీసులను పంపించారా అన్న సందేహం కలుగుతంది. అంటే మిస్ ఇన్ ఫర్మేషన్ వల్ల పోలీసులు అక్కడకు రావడం, అలాగే మీడియాకు కూడా ఈ విషయం తెలియడంతో నానా రచ్చ అయి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు పామ్ హౌస్కు వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా బిత్తరపోయారట. కాని ఆ తర్వాత తేరుకుని తామే ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. ఒకవేళ నిజంగానే బీజేపీ ఇలాంటి ఆపరేషన్ చేయదలిస్తే పొరుగున బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి కాకుండా ఇంత తెలివితక్కువగా ఒక పామ్ హౌస్ ద్వారా ఆపరేట్ చేస్తుందా అన్న ప్రశ్న వస్తుంది. దీనిపై కేసీఆర్ స్పందించలేదు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. యాదాద్రిలో ప్రమాణం చేద్దామని సంజయ్ సవాల్ చేస్తే, మోదీ ఆ ప్రమాణానికి రావాలని టీఆర్ఎస్ ప్రతి సవాల్ చేసింది. విశేషం ఏమిటంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో బీజేపీకే కాదు.. టీఆర్ఎస్కు కూడా రికార్డు ఉంది. గత టరమ్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పి ఎమ్మెల్యేలు పలువురిని తనలో కలిపేసుకుంది. ఈ టరమ్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది ఉంటే పన్నెండు మందిని టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అందువల్ల ఈ విషయాలలో ఎవరిని తప్పు పడదాం? ఏమైనా వర్తమాన రాజకీయాలలో ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలు ఇంత అసహ్యంగా తయారయ్యాయనడానికి ఈ తాజా ప్రహసనం కూడా ఒక ఉదాహరణే అవుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఫామ్హౌస్ డీల్పై కేసు నమోదు
-
ఫాంహౌస్ డీల్పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్రెడ్డి ఫిర్యాదులో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పట్టుబడ ముగ్గురిని ఫౌంహౌస్లోనే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ ముగ్గురి ఫోన్ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ఫామ్ హౌస్లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు? కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీల్లో భాగంగానే స్వామీజీ, నందు, సతీష్ ఫాంహౌస్కు వచ్చారని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్ కేసులు పెడతామని.. ఈడీ,సీబీఐ దాడులు జరుగుతాయని బెదిరించారని రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని డీల్ నడిచినట్లు ఫిర్యాదులో రోహిత్రెడ్డి పేర్కొన్నారు. -
ఫామ్ హౌస్లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్లోని అజీజ్నగర్లో ఉన్న అతడి ఫామ్ హౌస్లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్హౌస్ నుంచి తరలించారు. -
Hyderabad: ఫ్లాట్ నుంచి 'ఇంటి' వైపు!.. ఆ గృహాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత (ఇండివిడ్యువల్) గృహాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. కరోనా అనంతర పరిణామాలు, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అప్పట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపిన కొనుగోలుదారులు.. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్త పచ్చదనంతో, రణగొణధ్వనులకు దూరంగా, ఆహ్లాద వాతావరణం ఉండే ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనాతో మారిన అభిరుచులు కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలతో ప్రజల జీవన విధానంలో, గృహ కొనుగోలుదారుల తీరులో మార్పులు వచ్చాయి. గతంలో ప్రధాన నగరంలో, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే గృహాలను కొనుగోలు చేసేవారు. కోవిడ్ తర్వాత ఒకేచోట ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్తో ఇంట్లో ప్రత్యేకంగా గది, ఓపెన్ జిమ్ వంటివి అవసరమయ్యాయి. దీనివల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యక్తిగత గృహాలు, విల్లాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నరసింహారెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువు కావడం దీనికి మరింత ఊతమిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా.. గతంలో పటాన్చెరు, బెంగళూరు జాతీయ రహదారుల మార్గంలో అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాల్లోనే వ్యక్తి గత గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నలువైపులా కొత్త రోడ్లు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లింక్ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీంతో మెట్రో, 100 ఫీట్ల రోడ్లు ఉన్న మార్గాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ పెరిగింది. శ్రీశైలం హైవే, ముంబై రహదారి, బీజాపూర్ రోడ్, నాగ్పూర్ రోడ్డు, వరంగల్ హైవేలో ఘట్ కేసర్ వరకు కూడా వ్యక్తిగత గృహాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రాంతాల్లో ముందుగా ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వచ్చి.. రద్దీ పెరిగాక అపార్ట్మెంట్ కల్చర్ ప్రారంభమవుతుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ కన్సల్టెన్సీ ఎండీ కళిశెట్టి నాయుడు తెలిపారు. మారిన పరిస్థితులతో.. ఐటీ మినహా ఇతర రంగాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవటం, పలు రంగాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలవుతుండటంతో హైదరాబాద్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా గతంలో తరహాలో గృహ రుణాలను మంజూరు చేయడం లేదు. గతేడాది 7.30 శాతం దాకా తగ్గిన వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి పెరిగాయి. దీనికితోడు నిర్మాణ వ్యయాలూ పెరగడంతో.. ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) ముగింపు నాటికి బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధిక గృహాల ఇన్వెంటరీ (అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 7.85 లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్లోని ఇళ్లే లక్షకుపైగా ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నది హైదరాబాద్లోనేనని తెలిపింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 2,72,960 ఇళ్ల ఇన్వెంటరీతో ముంబై తొలిస్థానంలో ఉందని పేర్కొంది. -
దోచుకున్న సొమ్ముతో విమానాల కొనుగోలు: ఆర్ఎస్ ప్రవీణ్
మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. జాతీయ పార్టీ అవసరాల కోసం కేసీఆర్ సొంత విమానాన్ని కొనుగోలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ ఆయన తన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేశారు. ‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడూ పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు. ఫాంహౌస్ దాటింది లేదు. దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ శుక్రవారం ట్వీట్లో రేవంత్ ఎద్దేవా చేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
రిలయన్స్ సాధారణ బీమాపై కన్ను
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికల్లో ఉన్న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకి ప్రయివేట్ రంగ కంపెనీలు పిరమల్ గ్రూప్, జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ భాగస్వామ్య ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ) ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ భారంతో కుదేలైన రిలయన్స్ క్యాపిటల్ దివాలా చట్ట(ఐబీసీ) చర్యలను ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా సాధారణ బీమా అనుబంధ సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పిరమల్, జ్యూరిక్ విడిగా నాన్బైండింగ్ బిడ్స్ దాఖలు చేశాయి. రెండు సంస్థలూ ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో చెరి సగం(50 శాతం చొప్పున) వాటాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కోసం విడిగా బిడ్ను వేసినట్లు జ్యూరిక్ వెల్లడించింది. రిలయన్స్ సాధారణ బీమా బిజినెస్ విలువను పిరమల్ రూ. 3,600 కోట్లు, జ్యూరిక్ రూ. 3,700 కోట్లుగా మదింపు చేశా యి. అయితే అసలు విలువ రూ. 9,450 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార ప్రణాళికను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి, సీవోసీ బిడ్స్ దాఖలు గడువును అక్టోబర్ 30వరకూ పొడిగించాయి. -
నారాయణ హృదయాలయ విస్తరణ
న్యూఢిల్లీ: హెల్త్కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. -
అదానీ పవర్ చేతికి డీబీ పవర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఛత్తీస్గఢ్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు కలిగిన డీబీ పవర్ను కొనుగోలు చేయనుంది. రూ. 7,017 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు అదానీ పవర్ వెల్లడించింది. డీబీ పవర్ జాంజ్గిర్ చంపా జిల్లాలోగల 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. 923.5 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి మధ్య, దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉంది. పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాతో ఇంధన సరఫరా ఒప్పందాలను సైతం కలిగి ఉంది. నగదు చెల్లించేవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ పేర్కొంది. దీనిలో భాగంగా డీబీ పవర్ మాతృ సంస్థ డిలిజెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. డీబీ పవర్లో డిలిజెంట్ పవర్ మొత్తం ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. 2022 అక్టోబర్ 31లోగా వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో ఛత్తీస్గఢ్లో థర్మల్ పవర్ సామర్థ్యాన్ని విస్తరించుకోనున్నట్లు పేర్కొంది. 2006లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రిజిస్టరైన డీబీ పవర్ గతేడాది(2021–22)లో రూ. 3,448 కోట్ల టర్నోవర్ను సాధించింది. అంతక్రితం ఏడాది(2020–21)లో రూ. 2,930 కోట్ల్ల, 2019–20లో రూ. 3,126 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్క్రాఫ్ట్లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా?
Lions at cheaper rates than buffaloes.. అక్కడ గేదె కంటే తక్కువ ధరలో సింహాలను కొనుగోలు చేయవచ్చు. సింహాలను కొనుక్కోవచ్చంటూ జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్లో ఒక గేదె ధర ఆన్లైన్ మార్కెట్లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి. .@SalmanSufi7 .@sherryrehman .@WWFPak This SALE must not take place, how is this practising conservation ? The Lahore Safari Zoo management hopes to sell as many as 12 of its lions in the first week of August to raise money. Pls Help https://t.co/FfrlVOh1oF — Anika 🐘🦍🦧🦒🐋🐬 (@anikasleem) July 28, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం -
రూ.28 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సైనిక బలగాల పూర్తిస్థాయి యుద్ధసన్నద్ధతకు అవసరమైన ఆయుధ సామగ్రిని రూ.28వేల కోట్లతో కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ.28,732 కోట్లతో ఆర్మీకి స్వార్మ్ డ్రోన్లు, అత్యాధునిక కార్బైన్ తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనున్నారు. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) మంగళవారం ఆమోదం తెలిపింది. నాలుగు లక్షల క్లోజ్–క్వార్టర్ కార్బైన్ తుపాకులతో సంప్రదాయ, హైబ్రిడ్ యుద్ధతంత్రంతోపాటు సరిహద్దులోని తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వీలవుతుందని రక్షణ శాఖ తెలిపింది. ఆత్మనిర్భర్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని చిన్న ఆయుధ ఉత్పత్తి పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి శత్రు స్నైపర్ల నుంచి మన బలగాలకు ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు, సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత సమయాల్లో ఆర్మీకి అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఆధునిక యుద్ధతంత్రంలో సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు అత్యాధునిక డ్రోన్లను కూడా సమకూర్చుకోనున్నట్లు కేంద్రం పేర్కొంది. కోల్కతా క్లాస్ యుద్ధ నౌకల కోసం 1,250 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మెరైన గ్యాస్ టర్బైన్ జనరేటర్ను, ఇంకా 14 ఫాస్ట్ పెట్రోల్ పడవలను కూడా దేశీయంగా సమకూర్చుకుంటామని తెలిపింది. -
టీటీకే ప్రెస్టీజ్ చేతికి అల్ట్రాఫ్రెష్, ఇక ఆ సేవలు కూడా
న్యూఢిల్లీ: అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ సొల్యూషన్స్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు కిచెన్ అప్లయెన్సెస్ దిగ్గజం టీటీకే ప్రెస్టీజ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా రూ. 20 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. తదుపరి మరో రూ. 10 కోట్లు వెచ్చించడం ద్వారా 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు. దీంతో వేగవంత వృద్ధిలో ఉన్న మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో ప్రవేశించేందుకు కంపెనీకి వీలు చిక్కనుంది. మొత్తం కిచెన్ సొల్యూషన్స్ అందించే కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా తాజా కొనుగోలుని చేపట్టినట్లు కంపెనీ చైర్మన్ టీటీ జగన్నాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాడ్యులర్ కిచెన్ మార్కెట్ విలువ రూ. 9,500 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో 25 శాతమే బ్రాండెడ్ విభాగం ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మాడ్యులర్ కిచెన్లోకి అల్ట్రాఫ్రెష్ కొనుగోలు ద్వారా మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చంద్రు తెలియజేశారు. కంపెనీ బిజినెస్కు ఇది అదనపు ప్రయోజనాలను కల్పిస్తుందని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రూ. 1,000 కోట్లు ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తాజా కొనుగోలు దీనిలో భాగమేనని వివరించారు. ప్రస్తుత నాయకత్వంలోనే స్వతంత్ర కంపెనీగా అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రెస్టీజ్ బ్రాండును వినియోగించుకుంటుందని తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో రూ. 23,000 కోట్ల టర్నోవర్ను సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్ట్రాఫ్రెష్ 120 స్టూడియోలతో దేశవ్యాప్తంగా 5,000 కిచెన్లను తయారు చేసినట్లు తెలియజేశారు. -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను టాటా సన్స్లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
బ్రాండెడ్ బియ్యంపై అదానీ విల్మర్ దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ బియ్యం బ్రాండ్లు, ప్రాసెసింగ్ యూనిట్లను కొనుగోలు చేయడంపై కమోడిటీ దిగ్గజం అదానీ విల్మర్ దృష్టి పెట్టింది. ఇందుకోసం దాదాపు రూ. 450–500 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం బాస్మతి బియ్యానికే పరిమితమైన అదానీ విల్మర్.. ఏప్రిల్ నుండి ఫార్చూన్ బ్రాండ్ కింద రోజువారీ వినియోగించే రైస్ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఈ విభాగంలో వేగంగా వృద్ధి చెందాలని నిర్దేశించుకున్నాం. ఇందుకోసం బ్రాండ్లు, రైస్ ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నాం. ముందుగా పశ్చిమ బెంగాల్లో ఖాయిలా పడిన యూనిట్ను తీసుకున్నాం. సాధారణంగా ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెడితే కార్యకలాపాలను ప్రారంభించేందుకు కనీసం రెండేళ్లయినా పట్టేస్తుంది. అదే నేరుగా యూనిట్లు, బ్రాండ్లను కొనుగోలు చేస్తే వేగవంతంగా కార్యకలాపాలు విస్తరించవచ్చు, వృద్ధి సాధించవచ్చు‘ అని ఆయన చెప్పారు. ప్రాంతాలవారీగా ప్రాచుర్యంలో ఉన్న బియ్యాన్ని విక్రయిస్తామని మాలిక్ వివరించారు. -
పెగసస్ స్పైవేర్ను కొన్న చంద్రబాబు సర్కార్: మమతా బెనర్జీ
కోల్కతా: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్వేర్ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు. ‘ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగసస్ సాఫ్ట్వేర్ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. కానీ ఈ స్పైవేర్ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు. 2017లో పెగసస్ సాఫ్ట్వేర్ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్టైమ్స్లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్ను హెచ్పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
పెగసస్ స్పైవేర్ని... కేంద్రమే కొనుగోలు చేసింది
న్యూయార్క్: దేశవ్యాప్తంగా గత ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్ వివాదం మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ స్పైవేర్ను 2017లో ఇజ్రాయెల్ నుంచి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్ స్పైవేర్ని భారత్ కొనుగోలు చేసిందని ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్ స్పైవేర్ కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ అధికారుల, సైబర్ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సహా విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పెగసస్ స్పైవేర్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా గత ఏడాది జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఔననక.. కాదనక! పెగసస్ స్పైవేర్ అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దాదాపు తుడిచిపెట్టినపుడు కూడా కేంద్రంలోని మోదీ సర్కారు చాలా నర్మగర్భంగా సమాధానమిచ్చింది. ఏది జరిగినా... నిబంధనల ప్రకారమే, సంబంధిత చట్టాలకు లోబడి మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు అడిగినపుడు కూడా ఇదే సమాధానం ఇచ్చింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఇంకేమీ చెప్పలేమని బదులిచ్చింది. పెగసస్ నిఘాపై స్వతంత్య్ర కమిటీతో విచారణ జరిపించి నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక సమర్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. అయితే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇందుకు అంగీకరించలేదు. గత ఏడాది అక్టోబరు 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. – నేషనల్ డెస్క్, సాక్షి -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
బాండ్లలోకి.. సేఫ్ రూట్
పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ బ్రోకర్ ద్వారా ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్బీఐ తీసుకొచ్చిన రిటైల్ డైరెక్ట్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం.. స్టాక్ మార్కెట్ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్) షేర్లను ఆఫర్ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్బీఐ బాండ్లను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్స్ తదితర ఇనిస్టిట్యూషన్స్ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి. ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ కాంపిటీటివ్ బిడ్ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్), డేటెడ్ సెక్యూరిటీలు (జీసెక్లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్డీఎల్) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్ జీసెక్లు, ఎస్డీఎల్ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్బీఐ దీన్ని కేలండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్బీఐ వేలం కేలండర్(షెడ్యూల్)ను ప్రకటిస్తుంది. ఆర్బీఐ పోర్టల్ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ► ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్ల వేలం ఈల్డ్ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్లు సాధారణంగా ఈల్డ్ ఆధారితంగానే ఉంటాయి. కూపన్ రేటు ఆధారంగా బిడ్ వేసుకోవచ్చు. వేలం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తక్కువ కూపన్రేటును కటాఫ్ ఈల్డ్గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్లో కటాఫ్ ఈల్డ్ కంటే తక్కువకు కోట్ చేసిన లేదా కటాఫ్ ప్రైస్ కంటే ఎక్కువకు కోట్ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్ ఈల్డ్/ధరల వద్ద కోట్ బిడ్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. సెకండరీ మార్కెట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్) నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–వోఎం) ప్లాట్ఫామ్పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్ కొనసాగుతుంటుంది. టెలిఫోన్ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్ ఆక్షన్ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆర్డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్డీఎస్–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్ మార్కెట్’, ‘ఆడ్ లాట్స్ విభాగం’ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ మార్కెట్లో ఒక లాట్ సైజ్ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్ కోసం ఆడ్లాట్స్ విభాగం పనిచేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు జీసెక్లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్ వేళల్లో https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్ రేటు. జీసెక్ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్డ్ రేటు బాండ్లు కూడా వాటి కూపన్రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్ రేటు బాండ్లు ఎఫ్ఆర్బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్డీఎస్–వోఎం హోమ్పేజీలో ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఆర్బీఐ వద్ద ప్రారంభించే ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్ చేయడం లేదా, ఈమెయిల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. కాలవ్యవధి బాండ్ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్ రేటును ఆఫర్ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఎంపిక చేసుకునే బాండ్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్కే పరిమితం కావడం మంచిది. సెక్యూరిటీ టీబిల్లు, జీసెక్లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మార్గం అనుకూలం. లిక్విడిటీ ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్లాట్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్డీఎస్–వోఎంలో ఆయా బాండ్కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్లలో ట్రేడ్ వ్యాల్యూమ్ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్డీఎల్లలో వ్యాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు.. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
AP: సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి
సాక్షి, అమరావతి: సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయనుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనుంది. ఈఆర్సీ ఆమోదించడంతో త్వరలో సెకితో ఎంవోయూ కుదుర్చుకోనుంది. 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. -
ఆన్లైన్ సేల్స్ అదరహో!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53% మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65% మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుం టే.. 68% మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. -
వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..
కామారెడ్డి (నిజామాబాద్): తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, టపాసులు కొనడానికి కారులో వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిలో.. జగన్ (45), ఆనంద్ (28), శ్రీనివాస్ (52), శశాంక్ ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. కామారెడ్డిలో టపాసులు కొనుగోలు చేసి.. ఎల్లారెడ్డివైపు వెళ్తుండగా కారు ప్రమాదం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
AP: గిరిజన తేనెకు తిరుపతి వెంకన్నే బ్రాండ్ అంబాసిడర్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు కలియుగ దైవం శ్రీనివాసుడు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. ఏడుకొండల స్వామిని అభిషేకించేందుకు గిరిజన తేనెను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదనకు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. గిరిజన తేనె నమూనాలను తీసుకున్న టీటీడీ వాటికి ల్యాబ్లలో నాణ్యత పరీక్షలు చేయించింది. స్వచ్ఛత బాగుందనే ఫలితాలు రావడంతో గోవిందుడి అభిషేకానికి గిరిజన తేనె వినియోగించాలని నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను జీసీసీ శుద్ధి చేసి కిలో రూ.298.77 చొప్పున విక్రయిస్తోంది. టీటీడీకి అవసరమైన తేనెను తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..) ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల కిలోల తేనెను శుద్ధిచేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంత తేనె కావాలనేది టీటీడీ నుంచి ఆర్డర్ రావడమే తరువాయి అని జీసీసీ జనరల్ మేనేజర్ చినబాబు ‘సాక్షి’కి చెప్పారు. తేనెతోపాటు శ్రీవారి నిత్య కైంకర్యాలకు, నైవేద్యానికి వినియోగించే పసుపు, జీడిపప్పును కూడా జీసీసీ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదన చేశామని చినబాబు తెలిపారు.(చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్క్లియర్) విశాఖ మన్యంలోని పాడేరులో గిరిజనుల నుంచి సేకరిస్తున్న పసుపు నాణ్యతలో నంబర్–1 స్థానంలో ఉంది. గిరిజన పసుపు, జీడిపప్పు శాంపిల్స్ను జీసీసీ ఇప్పటికే టీటీడీకి అందించింది. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుపతితోపాటు మరికొన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో గిరిజన తేనె, జీడిపప్పు, ఇతర ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి గిరిజనులకు మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు. -
టాటా గ్రూప్నకు ఎల్వోఐ
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్నకు విక్రయించడాన్ని నిర్ధారిస్తూ కేంద్రం సోమవారం లెటర్ ఆఫ్ ఇంటెంట్ను (ఎల్వోఐ) జారీ చేసిందని∙పాండే తెలిపారు. టాటా గ్రూప్ దీనికి తమ అంగీకారం తెలిపిన తర్వాత వాటాల కొనుగోలు ఒప్పందంపై (ఎస్పీఏ) సంతకాలు అవుతాయి. ‘సాధారణంగా ఎల్వోఐని అంగీకరించిన తర్వాత 14 రోజుల్లోగా ఎస్పీఏపై సంతకాలు జరుగుతాయి. ఇది సాధ్యమైనంత వేగంగా పూర్తి కాగలదని ఆశిస్తున్నాం‘ అని పాండే పేర్కొన్నారు. డిసెంబర్ ఆఖరు నాటికి డీల్ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్పీఏ కుదుర్చుకున్నాక, నియంత్రణ అనుమతులు రావాలని, ఆ తర్వాత ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు. ‘వారు అంగీకార పత్రం (ఎల్వోఏ) సమరి్పంచేటప్పుడు అంచనా విలువలో 1.5 శాతం (సుమారు రూ. 270 కోట్లు) సెక్యూరిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్వోఐతో పాటు బ్యాంక్ గ్యారంటీ రూపంలో పేమెంట్ సెక్యూరిటీని అందించాలి‘ అని పాండే తెలిపారు. ఇక డీల్లో భాగమైన నగదు లావాదేవీ విషయానికొస్తే.. డిసెంబర్ ఆఖరు నాటికి సంస్థను అప్పగించే రోజున జరుగుతుందని వివరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్లో టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్లో ఇది మూడో విమానయాన సంస్థ కానుంది. టాటా గ్రూప్ ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. వీటికి ఎయిరిండియా కూడా తోడైతే టాటా గ్రూప్ మార్కెట్ వాటా 26.9 శాతానికి చేరుతుంది. ఇండిగో తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ఎయిర్లైన్స్గా నిలుస్తుంది. -
బైజూస్ విదేశీ షాపింగ్
న్యూఢిల్లీ: దేశీ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం ఎపిక్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,730 కోట్లు). అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎపిక్ కొనుగోలు తోడ్పడగలదని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్పై అదనంగా 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా రవీంద్రన్ వివరించారు. ఎపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సురేన్ మార్కోసియన్తో పాటు మరో సహ వ్యవస్థాపకుడు కెవిన్ డోనాహ్యూ ఇకపైనా అదే హోదాల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ‘నేర్చుకోవడంపై పిల్లల్లో ఆసక్తి కలిగించాలన్నది మా లక్ష్యం. ఎపిక్, దాని ఉత్పత్తులు కూడా ఇదే లక్ష్యంతో రూపొందినవి. అందుకే ఈ కొనుగోలు ఇరు సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదు‘ అని ఆయన తెలిపారు. తమ లక్ష్యాల సాధానకు బైజూస్తో భాగస్వామ్యం తోడ్పడగలదని మార్కోసియన్ ధీమా వ్యక్తం చేశారు. ఎపిక్ ప్లాట్ఫాంలో 40,000 పైచిలుకు పుస్తకాలు, ఆడియోబుక్స్, వీడియోలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఇరవై లక్షల పైచిలుకు ఉపాధ్యాయులు, 5 కోట్ల దాకా యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. కరోనా వైరస్పరమైన పరిణామాలతో ఆన్లైన్ విద్యాభ్యాసం వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితుల నేపథ్యంలో ఎడ్టెక్ రంగ సంస్థలకు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. జోరుగా కొనుగోళ్లు.. 2015లో ప్రారంభమైన బైజూస్ సర్వీసులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పలు సంస్థలను బైజూస్ వరుసగా కొనుగోలు చేస్తోంది. 2017లో ట్యూటర్విస్టా, ఎడ్యురైట్ను.. 2019లో ఓస్మోను దక్కించుకుంది. గతేడాది కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్ఫాం వైట్హ్యాట్ జూనియర్ను 300 మిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ఇక ఏడాది ఏప్రిల్లో ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను (ఏఈఎస్ఎల్) కొనుగోలు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి బైజూస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్, నాస్పర్స్, చాన్–జకర్బర్గ్ ఇనీషియేటివ్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. -
వ్యాక్సిన్ కొనుగోలులో కేంద్రం వైఖరి బట్టబయలు
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నత్తనడకన వ్యవహరించిందో సమాచార హక్కు చట్టం కింద బట్టబయలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్లో ఆర్భాటంగా ప్రారంభించిన టీకా ఉత్సవ్ సమయంలో ప్రభుత్వం కేవలం 18.60 కోట్ల డోసుల్ని మాత్రమే కొనుగోలు చేసింది. రిటైర్డ్ కమాండర్ లోకేష్ బాత్రా టీకా డోసులపై సమగ్ర వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్రం జనవరి 11, 2021న మొట్టమొదటి కొనుగోలు ఆర్డర్ పంపినట్టు తెలిపింది. జూన్ 8, 2021 నాటికి మొత్తంగా 78.6 కోట్ల డోసులకి ఆర్డర్లు పంపినట్టు వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్ల వయసుకి పైబడిన వారు 90– 95 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ 190 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయి. అంటే ఇంకా 111.4 కోట్ల డోసులు తక్కువున్నట్టు ఈ వివరాలను బట్టి తెలుస్తోంది. మందకొడిగా వ్యాక్సినేషన్దా కోవిన్ పోర్టల్ డేటా ప్రకారం 5 నుంచి 10 జులై మధ్య కాలంలో వ్యాక్సినేషన్ సగటున రోజుకి 37.2 లక్షలు మాత్రమే జరిగింది. అంతకు ముందు వారం రోజుకు సగటున 42 లక్షల డోసులు ఇచ్చారు. జూలైలో రోజుకు 40–45 లక్షల డోసుల్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా జరగాలంటే 12 కోట్ల డోసులు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద 1.54 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
అమెజాన్ చేతికి ఎంజీఎం
న్యూయార్క్: జేమ్స్బాండ్ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎంను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 8.45 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. తద్వారా తమ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. నిత్యావసరాల చెయిన్ హోల్ ఫుడ్స్ను 2017లో 14 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత అమెజాన్కి ఇదే అతి పెద్ద డీల్. మీడియా రంగంలో నెట్ఫ్లిక్స్, డిస్నీప్లస్ వంటి స్ట్రీమింగ్ సేవల సంస్థలతో పోటీపడేందుకు అమెజాన్కి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో పేరిట స్ట్రీమింగ్ సర్వీసులు అందిస్తోంది. దీనికి నికరంగా ఎంత మంది యూజర్లు ఉన్నారన్నది వెల్లడించనప్పటికీ .. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న దాదాపు 20 కోట్ల మందికి ఇది అందుబాటులో ఉంటోంది. ప్రైమ్ వీడియోతో పాటు ఐఎండీబీ టీవీ పేరుతో ఉచిత స్ట్రీమింగ్ సర్వీస్ కూడా అమెజాన్ నిర్వహిస్తోంది. ఎంజీఎం కొనుగోలుతో రాకీ, రోబోకాప్, పింక్ పాంథర్ వంటి పలు హిట్ సినిమాలు, షోలు కంపెనీ చేతికి దక్కుతాయి. అలాగే ఎపిక్స్ అనే కేబుల్ చానల్ కూడా లభిస్తుంది. త్వరలో విడుదలయ్యే జేమ్స్ బాండ్ మూవీ.. ‘నో టైమ్ టు డై’ కూడా ఎంజీఎం నిర్మించింది. మూకీ యుగం నుంచి ఎంజీఎం.. గర్జించే సింహం లోగోతో మూకీ సినిమాల సమయం నుంచి సినీ ప్రేక్షకులకు ఎంజీఎం స్టూడియో చిరపరిచితం. 1924లో దీన్ని ఏర్పాటు చేశారు. సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి అనేక క్లాసిక్ సినిమాలతో పాటు ఇటీవలి షార్క్ ట్యాంక్, ది రియల్ హౌస్వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్ వంటి రియాలిటీ టీవీ షోలను ఎంజీఎం నిర్మించింది. మరోవైపు అమెజాన్కి కూడా సొంత స్టూడియో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. మార్వెలస్ మిసెస్ మెయిజెల్, ఫ్లీబ్యాగ్ వంటి షోలు అవార్డులు గెల్చుకున్నప్పటికీ చాలా మటుకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 1995లో ఏర్పాటైన అమెజాన్ ప్రస్తుతం 1.6 లక్షల కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది. ఆన్లైన్ అమ్మకాల నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాల దాకా పంపిస్తోంది. దీంతో కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించడంపై అమెరికా దృష్టి పెడుతోంది. -
ఇండస్ఇండ్పై కోటక్ కన్ను!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్ డీల్గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎల్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్ కానుంది. కేఎంబీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది. అవకాశాలు పరిశీలిస్తుంటాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా గ్రూప్ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్ఇండ్) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్ చెప్పారు. డీల్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది. -
సోయా కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్
సాక్షి, నిజామాబాద్: సోయా కొనుగోళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది కూడా సోయా సేకరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించిందని మార్క్ఫెడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి సోయా సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర దక్కే అవకాశాలున్నాయి. 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వరి, మొక్కజొన్న తర్వాత జిల్లాలో అత్యధికంగా సోయా పంట సాగవుతుంది. ఈసారి 74,153 ఎకరాల్లో ఈ పంటను వేసుకున్నారు. విస్తారంగా వర్షాలు కురియడంతో దిగుబడులు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల వరకు వస్తే ఈసారి మరో రెండు క్వింటాళ్లు అదనంగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున లెక్కేస్తే 74,153 ఎకరాలకు సుమారు 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంచనా. మార్కెట్ ధరపైనే ఆధారం.. కాగా సోయా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.3,400 వరకు పలుకుతోంది. సోయాలు మార్కెట్కు వచ్చేసరికి ఇదే ధర ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సోయాలను విక్రయిస్తారు. ఏటా అక్టోబర్ మొదటి వారంలో సోయా కోనుగోళ్లు ప్రారంభమవుతాయి. మరో ఇరవై రోజుల్లో సోయాలు మార్కెట్లోకి వస్తాయి. దీంతో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది 16 వేల క్వింటాళ్ల సేకరణ.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో జిల్లాలో 16,525 క్వింటాళ్లు సేకరించారు. 1,027 మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6.13 కోట్లు విలువ చేసే సోయాను కొనుగోలు చేశారు. అయితే ఈసారి మార్కెట్ రేట్ కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాల వారీగా అలాట్మెంట్ ఇస్తాం.. నాఫెడ్ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం జరిగింది. సోయా కొనుగోళ్లకు నాఫెడ్ అంగీకరించింది. రాష్ట్రంలో ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. నాఫెడ్ స్పష్టత ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా సోయా సేకరణకు అలాట్మెంట్ ఇస్తాము. – మార గంగారెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ -
వర్జిన్ ఆస్ట్రేలియాను కొంటాం..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో కుదేలైన వర్జిన్ ఆస్ట్రేలియా (వీఏ) కొనుగోలుపై దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో అతి పెద్ద వాటాదారు అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కసరత్తు చేస్తోంది. వీఏ విక్రయ ప్రక్రియలో పాల్గొనేందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్కు కంపెనీలో అత్యధికంగా 37.8% వాటా ఉంది. మరో ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబానికి 36.64% వాటాలు ఉన్నాయి. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ సహ వ్యవస్థాపకుడిగా 2000లో వర్జిన్ ఆస్ట్రేలియా ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్గా కార్యకలాపాలు ప్రారంభించింది. కొన్నాళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సంస్థ.. ఇటీవల కరోనా వైరస్పరమైన ఆంక్షల కారణంగా మార్చిలో అన్ని సర్వీసులు రద్దు చేయడంతో మరింత కుదేలైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సుమారు 887.60 మిలియన్ డాలర్ల రుణం వస్తుందని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. దీంతో ఏప్రిల్ 21న దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సంస్థలో సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
శాండోజ్ కొనుగోలు ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ జనరిక్ ఫార్మా కంపెనీ శాండోజ్ను కొనుగోలు చేసే ఒప్పందాన్ని అరబిందో ఫార్మా రద్దు చేసుకుంది. అనుకున్న సమయంలోగా యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో ఇరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. నోవార్టిస్ కంపెనీకి చెందిన శాండోజ్ అమెరికాలో జనరిక్ ఔషధాలు, బయోసిమిలర్ ఔషధాల్లో దిగ్గజ కంపెనీగా ఉంది. నోవార్టిస్ డివిజన్గా ఉన్న శాండోజ్ ఐఎన్సీ వాణిజ్య కార్యకలాపాలను, మూడు తయారీ కేంద్రాలను 900 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకునేందుకు అరబిందో ఫార్మా 2018 సెప్టెంబర్లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అమెరికాలో తన సొంత సబ్సిడరీ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఐఎన్సీ ద్వారా శాండోజ్ను సొంతం చేసుకోవాలనుకుంది. ఇది సఫలమై ఉంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఔషధాల పరంగా రెండో అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీగా అరబిందో అవతరించి ఉండేది. -
కరోనా: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా కలకలంతో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలమవుతోంది. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కీలక చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవ డానికి చర్యలు చేపట్టింది. ఓయంవో (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్)ద్వారా పది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనర్తో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్బిఐ తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బెంచ్మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆర్బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా కోవిడ్ -19 రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో కల్లోలకం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో ఆయా సెంట్రల్ బ్యాంకులన్నీ రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా యూఎస్ ఫెడ్ భారీగా రికార్డు స్థాయిలో రేట్ల కోతకు నిర్ణయించింది. ఇదే బాటలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ కూడా రేట్ల కోతకు దిగాయి. చదవండి : కరోనా : ఫేస్బుక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
డొక్కు బస్సులకు చెక్..
ఎప్పుడాగిపోతాయో తెలియదు.. ఎక్కడాగిపోతాయో అంతు బట్టదు. ప్రయాణికులు గమ్యానికి చేరతారో లేదో అంతుబట్టదు. ఆర్టీసీలో ఆలాంటి డొక్కు బస్సులను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలం చెల్లిన బస్సులకు మోక్షం లభించనుంది. సంస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో రూ.వెయ్యి కోట్ల రుణసాయంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి వీలవుతుందని కార్మిక సంఘాలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఆ నిధులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సంస్థ మనుగడ మెరుగుపడుతుంది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ నార్ట్ ఈస్ట్ కోస్ట్ రీజియిన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. ఇంకా సామర్థ్యం ఉంటే పాసింజర్ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. కానీ పాసింజర్ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరంగా నిర్ధేశించారు. ఆ పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. అంతవరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్ప్రెస్లను పాసింజర్ సర్వీసులుగా తిప్పుతారు. తరువాత 12 కిలోమీటర్లు తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు. తాజాగా నెక్ పరిధిలో మొత్తం 789 బస్సుల్లో ఒక్కొక్క డిపోల్లో 8 నుంచి 10 బస్సులను పూర్తి స్థాయిలో సామర్థ్యం లేనివిగా గుర్తించి వాటిని రోడ్డుపైకి పంపుతున్నారు. వాటిలో అధిక శాతం ఎక్స్ప్రెస్ సర్వీసులున్నట్టు వివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విఖాఖ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ రఘు ఇంజనీరింగ్ కాలేజీ జంక్షన్లో ఆగిపోయింది. విశాఖ – విజయనగరం మధ్య జాతీయ రహదారిపై వారానికి కనీసం నాలుగు బస్సులైనా బ్రేక్డౌన్ అవుతూ దర్శనమిస్తాయి. రెండురోజుల క్రితం విజయనగరం నుంచి జామి మీదుగా వెళ్లే రూట్లో పల్లెవెలుగు బస్సు నిలిచిపోయింది.ఔ అయిదేళ్లుగా కాలక్షేపం.. సామర్థ్యం లేని బస్సులను ఏటా గుర్తించి వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు అలాంటి చర్యలేవీ చేపట్టకుండా సామర్థ్యం లేని పాత బస్సులనే కొనసాగించిందన్న విమర్శలున్నాయి. సంస్థ కార్మిక సంఘాలు ఈ విషయాన్ని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ నార్త్ ఈస్టు కోస్ట్ (నెక్) రీజయన్ పరిధిలోని తొమ్మిది డిపోలలో 789 బస్సులున్నాయి. వీటిలో 587 బస్సుల సంస్థవి కాగా మిగిలినవన్నీ అద్దె ప్రాతిపదికన ఉన్నవే. అయితే సంస్థ బస్సుల్లో 208 వరకూ సుమారు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవని సమాచారం. మోటారు చట్టం ప్రకారం 11 నుంచి 12 లక్షల కిలోమీటర్ల మధ్య రవాణా చేసిన బస్సులను సర్వీసుల నుంచి తొలగించాల్సి ఉంది. సంస్థ మెకానికల్ విభాగం ద్వారా తనిఖీ చేశాక వాటి సామర్థ్యం మెరుగ్గా ఉందనిపిస్తే కొన్నాళ్ల వరకూ తిప్పుకొనే అవకాశం ఉంది. కానీ అలాంటి చర్యలేవీ చేపట్టకుండా గత పాలకులు కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా రోజుకు 300 కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన బస్సుల్ని 400 కిలోమీటర్ల వరకూ నడిపిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు, సమయాభావంలేని ప్రయాణం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దూర సర్వీసులలో ఇలాంటి బస్సులే ఏర్పాటు చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కొత్త బస్సులొస్తే మెరుగైన సేవలు.. బస్సుల రవాణా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి సర్వీసులకు పంపుతాం. నెక్ రీజియన్లో సామర్థ్యం లేని 100 బస్సుల వరకూ తాజాగా రద్దు చేసి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేశాం. రద్దు చేసిన బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు నడిచినవి. వాటి స్థానంలో కొత్త బస్సులు వస్తే సంస్థ సేవలు మరింత మెరుగుపడతాయి. సామర్థ్యంలో లేని బస్సులను నిర్వహించడం లేదు. సంస్థకు ప్రభుత్వం ప్రకటించిన రుణసాయం కొత్తబస్సుల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కొటాన శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ, ఆర్టీసీ నెక్ -
‘ఎస్–400’పై అమెరికా కన్నెర్ర
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి మండిపడింది. భారత్ ఈ ఒప్పందం విషయంలో ముందుకెళితే అమెరికా–ఇండియాల రక్షణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ విషయమై అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతున్నంతకాలం రష్యా నుంచి ఎస్–400ను కొనుగోలు విషయంలో భారత్పై ఎలాంటి ప్రభావం ఉండదనడం సరికాదు. క్యాస్టా చట్టం ప్రకారం రష్యా నుంచి ఆయుధాల, ఇతర టెక్నాలజీని కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు అమలవుతాయి. దీనివల్ల భారత్కు భవిష్యత్లో అత్యాధునిక సాంకేతిక సహకారం ఆగిపోతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల ఆ దేశం అనుసరిస్తున్న దుందుడుకు విధానాలకు మద్దతుపలికినట్లు అవుతుంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. నాటో భాగస్వామి అయిన టర్కీతో ఇదే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఎస్–400 వ్యవస్థ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా అత్యుత్తమ టెక్నాలజీ వ్యవస్థలను రష్యన్ ఆయుధ వ్యవస్థలతో కలగాపులగం కానివ్వం’ అని స్పష్టం చేశారు. -
అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా నుంచి 73 వేల రైఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారని అధికారులు వెల్లడించారు. సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. రైఫిళ్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒప్పందం పూర్తయిన సంవత్సరంలో రైఫిళ్లను డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు వివరించారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు.