Ravindra Bharathi
-
జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్–టామ్ ‘వారధి’
సాక్షి, ముంబై: హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జనవరి 27న ‘వారధి’కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్–టామ్) అధ్యక్షుడు గంజి జగన్బాబు తెలిపారు. మూడు రాష్ట్రాల వ్యాపారాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) సంస్థ ప్రారంభోత్సవం, లోగోఆవిష్కరణతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయికుమార్ ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ప్రజలందరూ విచ్చేయాలని జగన్బాబు కోరారు. చదవండి : Birthright citizenship : ట్రంప్ ఆర్డర్ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరటసంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో! -
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..
‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్ ‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్ -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
గన్ఫౌండ్రి (హైదరాబాద్): చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.300 పెన్షన్ ఇస్తోందని అది రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బుచి్చనేని వీరయ్య మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో 40 శాతం వైకల్యానికి ఉచితంగా సహాయ ఉపకరణాలు పంచుతున్నట్లు ప్రకటించారు. అనంతరం వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించిన దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాళ్లులేని దివ్యాంగులకు మంత్రి సీతక్క స్వయంగా కృత్రిమ కాళ్లను తొడిగారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజ, జీఎం.ప్రభంజన్రావులతో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ, పేరిణి నృత్యం (ఫోటోలు)
-
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
29న శివశంకరికి ‘సినారే’ పురస్కారం!
గన్ఫౌండ్రీ: జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి.. -
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కాకతీయం నృత్య రూపకం (ఫొటోలు)
-
నాట్యవిలాసం..
రవీంద్ర భారతిలో అద్భుత నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకున్న నృత్య రీతులు ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేం: ఇంద్రాణీ సుగుమార్ ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాం మలేసియా నాట్యబృందంతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ సాక్షి, సిటీబ్యూరో/గన్ఫౌండ్రీ: నెమలి నాట్యం ఎంత అందంగా ఉంటుందో.. వాళ్లు నృత్యం చేస్తే అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి సైతం అబ్బురపడేలా వారి ప్రదర్శన ఉంటుంది. అమ్మవారి వేషం వేసుకుంటే అమ్మవారే పూనినట్టు అనిపిస్తుంది. రాక్షస సంహార ఘట్టం ప్రదర్శన చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాల్సిందే. సాక్షాత్తూ అమ్మవారే భువి నుంచి దివికి దిగి వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఇటీవల మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చి పలు నృత్య రూపకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించిన నాట్య బృందాన్ని ‘సాక్షి’పలకరించింది. ఇక్కడ వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుంది. కళ్లు చెమర్చాయి... రవీంద్ర భారతిలో మలేసియా సంప్రదాయ నృత్యమైన నెమలి నృత్యం, కళింగ అమ్మాళ్ నృత్య రూపకాలను ప్రదర్శించామని బృందానికి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ ఇంద్రాణీ సుగుమార్ వివరించారు. మొత్తం పది మంది బృందంతో ఇచి్చన అమ్మాళ్ నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చందని తెలిపారు. రాక్షస సంహారం అనంతరం ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చామని, ఇలాంటి స్పందన ఎక్కడా చూడలేదని, ఇక్కడివారి ప్రేమాభిమానాలకు మంత్ర ముగ్ధులమయ్యామని చెప్పారు. ఇక లైటింగ్, సౌండ్సిస్టమ్తో ప్రదర్శన చేస్తుంటే రోమాలు నిక్కబొడిచాయని, అంత అద్భుతంగా స్టేజీని అలంకరించారని చెప్పారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి వేషధారణలో ఉన్న తమకు కొందరు నమస్కరించారని గుర్తు చేసుకున్నారు. ఆడవాళ్లకు చాలా సురక్షితమైన ప్రాంతం మహిళలకు హైదరాబాద్ ఎంతో సురక్షిత ప్రాంతంగా అనిపించిందని చెప్పారు. నిర్వాహకులు తమను ఎంతో బాగా చూసుకున్నారన్నారు. ఇక్కడి ఆతిథ్యం ఎంతో బాగుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. తొలిసారి హైదరాబాద్లో నృత్య ప్రదర్శన ఇచ్చామని, మరోసారి అవకాశం వస్తే ప్రదర్శన చేయాలని ఉందని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ బాగుంది.. చార్మినార్ను సందర్శించామని, ఇక, హైదరాబాద్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందని, అక్కడికి వెళ్లాక చాలా మిస్ అవుతామన్నారు. ఇరానీ చాయ్ కూడా టేస్టీగా ఉందని చెప్పారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఎంతో మర్యాదగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారని తెలిపారు.దేశవిదేశాల్లో ప్రదర్శనలు.. ఏపీలోని వైజాగ్తో పాటు తమిళనాడులోని చిదంబరం దేవాలయం, పుదుచ్చేరిలో ప్రదర్శనలు ఇచ్చామని, చిదంబరంలో 2019లో తాము ప్రదర్శించిన చిదంబరేశ నాట్య కలైమణి ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ‘కల్చరల్ ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్’ కింద అనేక ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు. మలేసియా, సింగపూర్, థాయ్లాండ్, మారిషస్లోని అనేక ప్రాంతాల్లో నృత్య ప్రదర్శన చేస్తుంటామని చెప్పారు. ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా తాము ప్రదర్శనలు ఇస్తుంటామని తెలిపారు. మలేసియాలోని కౌలాలంపూర్ వద్ద ఇంద్రాణీ డ్యాన్స్ అకాడమీ నెలకొల్పి, ఆసక్తి ఉన్న వారికి నృత్యం నేరి్పస్తానని తెలిపారు. భరత నాట్యంలో తాను నిష్ణాతురాలినని, అయితే భరత నాట్యంతో పాటు ఒడిస్సీ కూడా విద్యార్థులకు నేరి్పస్తానని వివరించారు. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు కాళోజీ
గన్ఫౌండ్రీ(హైదరాబాద్): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
కన్నుల పండుగగా 'చండాలిక' డ్యాన్స్
క్రాంతి కూచిపూడి నాట్యాలయ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహా కవి, కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్ డాక్టర్ బోయి భీమన్న 'చండాలిక' డాన్స్ బ్యాలే సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కిషన్ రావు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. 'చండాలిక' పాత్రలో కూచిపూడి నృత్యకారిణి క్రాంతి నారాయణ్ నటించగా ఆనంద గా వీ.ఆర్ విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్), మాలీ గా కిరణ్మయి బోనాల, భటులుగా వినోద్, ప్రశాంత్, దీమాన్స్గా డింపుల్ ప్రియా, జాహ్నవి, రీతూ, తులసి నటించారు. డాక్టర్ బోయి భీమన్న రచించిన 'చండాలిక' డాన్స్ బ్యాలేకు ఫణి నారాయణ సంగీతాన్ని అందించగా క్రాంతి నారాయణ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ జి. పద్మజా రెడ్డి, డాక్టర్ వనజా రెడ్డి, భీమన్న సాహితి నిధి ట్రస్ట్ చైర్మన్ హైమవతి భీమన్న తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 'సృష్టి' ప్రపంచ రికార్డు) -
రవీంద్రభారతిలో ఘనంగా మహిళాసంక్షేమ సంబరాలు (ఫొటోలు)
-
సహజ నటి జయసుధకు ఎన్టీఆర్ పురస్కారం
సహజ నటి జయసుధ ప్రేక్షకలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర మంత్రి టి సుబ్బారామిరెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని సినీ నటి జయసుధకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతకుముందు ఆకునూరి శారద నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఆ కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పికర్ మండలి ఉద్ద ప్రసాద్, సినీ దర్శకుడు ఎ కొదండరామిరెడ్డి, బి గోపాల్, రేలంగి నర్సింహారావు, వైవీఎస్ చౌదరి, వంశఅఈ సంస్థల వ్యవస్థాపకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. -
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
రవీంద్ర భారతి : నమామి గంగే.. ఉత్సాహం ఉప్పొంగే (ఫొటోలు)
-
నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు తెలుగు భాషా అమృతోత్సవాలను జరుపతలపెట్టినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలతో ఇవి ప్రారంభమవుతాయని, తొలిరోజు జరగనున్న కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా లక్ష్మీ పెండ్యాల, పేరి,, ఖాదర్ బాషా, అమరనేని సుకన్య, ఇమ్మడి రాంబాబు, వడ్డేపల్లి విజయలక్ష్మి వ్యవహరిస్తారని వివరించారు. వారం పాటు ప్రతీ రోజూ సాహితీ సదస్సులు, సాహితీ ప్రక్రియలు, కవి సమ్మేళనాలు, కవులకు గౌరవ పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయన్నారు. (చదవండి: బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల) -
రవీంద్రభారతిలో ఘనంగా ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
రవీంద్ర భారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
-
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
కార్మికులకు త్వరలో కొత్త పథకం
గన్ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు. తాను సైకిల్ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంత రం మైహోం గ్రూప్, ఎన్ఎస్ఎన్ కృష్ణవేణి షుగర్స్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎల్ అండ్ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్ అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. పప్పు పహిల్వాన్ రాహుల్ పప్పు పహిల్వాన్గా పేరున్న రాహుల్గాంధీ వరంగల్కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్ అవార్డులు అందజేశారు. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి: రాజేంద్రప్రసాద్
ధనం సంపాదించటమే ముఖ్యం కాదు, ఆర్జించిన సంపద లో కొంత వితరణ కోసం వెచ్చించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ నిర్వహించిన 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో విజయం సాధించిన వారికి రవీంద్ర భారతీలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ లో భాగ స్వాములు కావాలని కోరారు. పిల్లలు ఆట పాటలతో చదువుని ఇష్టంగా నేర్చుకోవాలన్నారు. విద్యార్థులను జాతి నిర్మాతలుగా దీర్చి దిద్దాల్చిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జేవీఆర్ సాగర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుంచి పదివేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మంది కి నేషనల్ ర్యాంక్స్ & రాష్ట్రా స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ , 10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ పొందరాని నిర్వాహకులు తెలిపారు. -
ఫ్రెంచి–తెలుగు నిఘంటువు ఎంతో అవసరం: ప్రొ. డానియెల్
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్లుగా భాష, సంస్కృతులతో అనుబంధం కలిగి ఉన్న ఫ్రెంచ్–తెలుగు మహా నిఘంటువు అవసరం ఎంతో ఉందని ఫ్రెంచి రచయిత, తెలుగు అధ్యయనవేత్త ప్రొఫెసర్ డానియెల్ నెజాక్స్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో రవీంద్రభారతిలో గురువారం సమావేశమైన డానియెల్, నిఘంటువు ప్రచురణకు సహకరించవలసిందిగా కోరారు. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషతో, ప్రజలతో అనుబంధం ఉన్న తాను పారిస్లో తెలుగుపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. ఫ్రెంచి–తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని, ఈ గ్రంథానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. పారిస్లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సంతోషదాయకమని, ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్లతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలుగు–ఫ్రెంచి మహా నిఘంటువు కోసం డానియల్ చేస్తున్న కృషిని జూలూరు అభినందించారు. -
తెలుగు ఔన్నత్యాన్ని అందరూ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష సంస్కృతీ ఔన్నత్యాలను తెలుగువారంతా కాపాడుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగు భాషా సంస్కృతులను దిగజార్చేలా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే తెలుగువాడిగా ఎంతో ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు... ఘంటసాల వంటి మహానుభావులు తెలుగుభాషా సంస్కృతులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, తెలుగు భాష ప్రతిష్టను పెంచారని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. కానీ ప్రస్తుత పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజార్చుకోవడం సరికాదన్నారు. జీవన పోరాటంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరభాషలు నేర్చుకోవడం తప్పనిసరిగా మారినప్పటికీ అందుకోసం మన భాషను తక్కువ చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషాభివృద్ధికి మద్దతు ఇవ్వడం లేదని, ఆంగ్లం నేర్చుకొంటేనే భవిష్యత్తు బాగుంటుందనే అపోహను సృష్టిస్తున్నాయన్నారు. ఈ ధోరణి ఏమాత్రం సరైంది కాదన్నారు. ఇప్పటి నటులకు తెలుగు సరిగ్గా రావట్లేదు.. ఒకప్పుడు సినిమాలు చూసి తెలుగు ఉచ్ఛారణను నేర్చుకున్నామని, తెలుగు భాషకు సినిమాలు పట్టం కట్టాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటి తెలుగు సినీనటులు, గాయనీగాయకులకు తెలుగు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా బాధ్యతగా తెలుగు నేర్చుకోవాలని సూచించారు. సినీరంగమే తెలుగు వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సామాజిక స్పృహగల సినిమాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయని, అలాంటి మంచి సినిమాలు తీయాలంటే భాష, సాహిత్య, సంస్కృతులపై ఎంతో పట్టు ఉండాలన్నారు. గానకోకిలకు ఘన సన్మానం... ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారంతో జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ. లక్ష నగదు, నూతన వస్త్రాలు, శాలువాను ప్రదానం చేశారు. ఘంటసాలతో కలసి వేలాది పాటలు పాడిన తాను ఆయన శతజయంతి సందర్భంగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుశీల చెప్పారు. ఈ సందర్భంగా ఆహూతుల కోరిక మేరకు ఆమె కొన్ని పాటలు పాడి అలరించారు. ఏపీలోనూ నిర్వహిస్తాం... ఘంటసాల శతజయంతి ఉత్సవాలకు ఏడాదిపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఏపీలోనూ ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమానికి ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలో సీనియర్ నటి కృష్ణవేణితోపాటు నటులు మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, మంజుభార్గవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి. గీత, సంగమం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల ప్రారంభంలో జయశ్రీ, శశికళల సారథ్యంలో 100 మంది చిన్నారులు ఘంటసాల పాటలు ఆలపించి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. -
దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా
గన్ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్ పాల్గొన్నారు. -
బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ సంబురాల సందర్భంగా బతుకమ్మ ఆడియో, వీడియో పాటను రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కథ రచయిత విజయ భాస్కర్, రేఖ బోయపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఇటు హరితహారం... అటు హననమా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు చెట్లను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్య క్రమం చేపడుతుండగా.. మరోవైపు రవీంద్రభారతి ఆవరణలో రెండు భారీ వృక్షాలను కొట్టేయడానికి ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుకు సమీపంలో లేకపోగా.. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా కళాభారతి భవనం వెనుక ఉన్న ఈ వృక్షాలను ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించింది. ఆ రెండు వృక్షాలను కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు భారీ వృక్షాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొట్టేయకుండా చూడాలంటూ తాము వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదంటూ అదే ప్రాంత నివాసి, సామాజిక కార్యకర్త డబ్ల్యూ.శివకుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. కళాభారతి భవనం పశ్చిమ భాగంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న 50 ఫీట్లకుపైగా ఎత్తున్న రావిచెట్టు, మలబార్ వేప వృక్షాలు ఉన్నాయని, ఈనెల 18న వీటి కొమ్మలను కొట్టేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డేపల్లి రచన తెలిపారు. ఈ మేరకు పిటిషనర్ అక్కడ సిబ్బందిని ఆరా తీయగా ఈ రెండు చెట్లను కొట్టేస్తున్నట్లు తెలిపారన్నారు. ‘ఈ వృక్షాలు ప్రజల ప్రాణాలకుగానీ, భవనాలకు గానీ నష్టం కల్గించే పరిస్థితి లేదు. భవనాల మధ్య ఉండటంతో భారీ గాలి వీచినా కూలిపోయే పరిస్థితి లేదు. భారీ వృక్షాల కొమ్మలను కొట్టివేయాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి. వృక్షాలను పూర్తిగా తొలగించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా వృక్షాలను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించకుండా ఆదేశించండి’అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. -
ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ
గన్ఫౌండ్రీ: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ప్రజా కవి కాళోజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాళోజీ జీవిత చరిత్రను పొందుపరిచామని, కాళోజి పేరుమీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్/అఫ్జల్గంజ్: తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ రవీంద్రభారతి రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి కూతవేటు దూరంలోని రవీంద్రభారతి సమీపంలో ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీదకు వచ్చిన వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాగులు అనే ఆ వ్యక్తి ఒంటిపై మంటల్ని ఆర్పారు. ఆ వెంటనే అతడిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 63 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్కు చెందిన బైకెలి నాగులు (55) చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పాల్గొనడమే కాకుండా ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నాడు. చాలా కాలం కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. నాగులు కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్కుమార్ ఇద్దరూ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఈసీఐఎల్ పరిధిలోని బండ్లగూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. నాగులు బంజారాహిల్స్ రోడ్నం–2లోని ఎంవీ టవర్స్లో వాచ్మన్గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కాగా, అతను గురువారం ఉదయం ఓ బాటిల్లో పెట్రోల్ పోయించుకొని రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా.. అది ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వమే తన కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకోవాలని నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇదిలా ఉండగా నాగులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అతడి శరీరం దాదాపు 62 శాతం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయని, తెలంగాణ కోసం తన ప్రాణం కూడా ఇస్తానని అనేవాడని నాగులు భార్య స్వరూప తెలిపింది. పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ఉస్మానియాలో గాలిన గాయాలతో ఉన్నాడని చెప్పగానే తట్టుకోలేక పోయానని స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తకు మంచి చికిత్స అందించాలని కోరింది. తన భర్త తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని తరచూ బాధ పడేవాడని, తమ కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మంత్రి ఈటల వాకబు.. అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారని, నాగులుకు మెరుగైన చికిత్స అందించాలని తనకు సూచించారని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. -
రవీంద్ర భారతి వద్ద కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడ్తల్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధిత వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినట్టు, కేసీఆర్ తనకు న్యాయం చేయాలని అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రైవేట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (నల్గొండలో ప్రేమికుల ఆత్మహత్య) రవీంద్ర భారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన నాగరాజుతోపాటు ఆయన భార్యతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. పూర్తి వైద్యం ప్రభుత్వం ద్వారానే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఉస్మానియా సూపరిండెంట్తో మాట్లాడిన మంత్రి.. అధునాతన వైద్యం అందించాలని, తనను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. Reality of New India & New Telangana !! lost his job in unplanned lockdown attempts suicide near by Telangana assembly premises, he is one from the 12.2 cores people who lost jobs in India in Covid-19 lockdown. Do Govt care job loss people? Or only you care about celebrates? pic.twitter.com/9A4xB1RiRW — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 10, 2020 -
అద్భుతంగా సప్తగిరి వైభవం
-
అందరికీ ఆరాధ్యుడు సేవాలాల్ మహారాజ్
గన్ఫౌండ్రీ: సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. బంజారా భవన్, కొమురం భీమ్ భవన్లను నిర్మిస్తున్నట్లు, త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శంకర్ నాయక్, పార్లమెంటు సభ్యులు బీబీపాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్నాయక్, తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోలీసులకు పతకాలు
-
విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తోందన్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో సర్వీస్ మెడల్స్ డెకరేషన్ పురస్కార కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ విధుల్లో విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. పోలీసు అధికారులకు హోంమంత్రి అవార్డులు అందజేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో ప్రావీణ్యం చూపించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందించడం గర్వకారణమన్నారు. రాత్రనక, పగలనక, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన పోలీసు అధికారులకు పతకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టపడి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చారని పోలీసులను ప్రశంసించారు. పోలీసుల సేవకు వారి కుటుంబాలు అందించే ప్రోత్సాహమే కీలకమన్నారు. 400 మందికి పైగా పోలీసు అధికారులకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం రికార్డ్గా మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డులు, పీఎం సర్వీస్ మెడల్స్, ఉత్తమ సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర సర్వోన్నత పోలీసు పతకంతో పాటు పలు మెడల్స్ను పోలీసులు అందుకున్నారు. మొత్తంగా 418 మంది పోలీసు అధికారులకు పతకాలు బహుకరించారు. -
ముగిసిన ఆటా వేడుకలు
గన్ఫౌండ్రీ: అమెరికాలో స్థిరపడి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఆటా వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ముగిశాయి. హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. లక్ష మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి సం ప్రదాయాలను మరిచిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడో నిర్మించిన పాఠశాలల పునరుద్ధరణకోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు భారతీయ సమాజాన్ని చూసి అక్కడి సమాజం సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుందని, కానీ ప్రస్తుత మన సమాజం సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయిందన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్న వారికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నీరజ్ సంపతి (వ్యాపారం, క్రీడలు), శ్రీ కళాకృష్ణ, అశ్వినీరాథోడ్ (కళలు), రాహుల్ సిప్లిగంజ్, కొమండూరి రామాచారి (సంగీతం), సౌదామిని ప్రొద్దుటూరి (మహిళా సాధికారత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవా) రంగాల వారికి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యులు రసమయి బాలకిషన్, బొల్లం మల్లయ్య యాదవ్, ఆటా ప్రతినిధులు అనిల్ బోదిరెడ్డి, పరమేశ్ భీమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విపంచి.. వినోదం పంచి
-
దత్తాత్రేయ అందరి మనిషి
గన్ఫౌండ్రి : హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందరి మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన బండారు దత్తాత్రేయకు శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. బీసీలు ఎదుర్కొంటున్న అసమానతలను దూరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..గవర్నర్ పదవికి దత్తాత్రేయ వన్నె తేవాలని, భవిష్యత్లో మరిన్ని పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ..అందరినీ కలుపుకుపోయే గొప్ప గుణం ఉన్న వ్యక్తి దత్తన్న అని ప్రశంసించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను బీసీ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీ డీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సినీనటుడు సుమన్, జస్టిస్ చంద్రకుమార్ , విశ్రాంత ఐఏఎస్ అధికారి వినోద్కుమార్ అగర్వాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శశిరేఖాపరిణయం
-
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు. తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది. బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ. చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204 -
నృత్య సోయగం
-
అద్భుతం..పేరిణీ నృత్యం
-
రవీంద్రభారతిలో ‘ట్రైబల్ ఆర్ట్ ఫెస్టివల్’
-
నాటక వైభవం
-
మనోహరం.. మంత్రముగ్ధం
-
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
శంకర్ బొమ్మలు అద్భుతం.. చూసిరండి..
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్ వేసిన క్యారికేచర్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నాయని.. రవీంద్రభారతిలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరిట ఏర్పాటు చేసిన ఆయన ప్రదర్శనను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు కార్టూన్ల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను అందులో ఉంచారు. దీంతోపాటు కొన్ని క్యారికేచర్లను షేర్ చేస్తూ.. ‘ఇవి శంకర్ వేసిన అద్భుతమైన చిత్రాల్లో కొన్ని మాత్రమే.. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఆయన ప్రదర్శనను తప్పక తిలకించండి’ అని నెటిజన్లను కోరారు. ఈ ప్రదర్శన ఈ నెల 18 వరకూ కొనసాగనుంది. Some more superb works from the gallery of Sri Shankar Pamarthy Please visit the gallery at Ravindra Bharathi pic.twitter.com/2HbG74mBPb — KTR (@KTRTRS) February 10, 2019 -
కార్టూనిస్ట్ పామర్తి శంకర్ కార్టూన్స్ ప్రదర్శన
-
శంకర్ కార్టూన్స్లో తెలంగాణ ఆకాంక్ష కనిపించేది
-
నేడు కార్టూనిస్ట్ శంకర్ చిత్రాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఆర్టిస్ట్, ‘సాక్షి’కార్టూనిస్ట్ శంకర్ కార్టూన్ చిత్రాల ప్రదర్శన శనివారం రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’పేరుతో నిర్వహించే ఈ 20 ఏళ్ల రాజకీయ చిత్రాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, సూర్యప్రకాశ్, ప్రజా కవి గోరటి వెంకన్న, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు. -
‘పరాశక్తి అమ్మోరు డ్యాన్స్ డ్రామా’
-
రారండోయ్
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘జీవితం ఒక ఉద్యమం’ ఆంగ్లానువాదం ‘లైఫ్ ఈజ్ ఎ మూవ్మెంట్’ ఆవిష్కరణ జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది. అనువాదం: స్వాతి శ్రీపాద. సంపాదకుడు: చింతపట్ల సుదర్శన్. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం. ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు మహబూబ్నగర్లోని రోజ్గార్డెన్ ఫంక్షన్ హాల్(తెలంగాణ చౌరస్తా – బోయపల్లి గేట్ దారిలో)లో జరగనుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. తొలి సెషన్లో జి.హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలమూరు అధ్యయన వేదిక. తంగిరాల సోని కవితాసంపుటి ‘బ్లాక్ వాయిస్’ ఆవిష్కరణ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడ, గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో జరగనుంది. ప్రచురణ: సామాజిక పరివర్తన కేంద్రం. ‘మొదటి పేజీ కథలు’ సంపుటానికిగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు ‘లక్ష రూపాయల’ నగదుతో ‘లక్ష్షీ్మనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కార (2019)’ ప్రదానం జనవరి 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. జాగృతి వారపత్రిక ఓ కార్టూన్ల పోటీ నిర్వహిస్తోంది. చక్కటి హాస్యం ఉండాలి. బ్లాక్ అండ్ వైట్లో ఒకరు ఎన్నైనా పంపవచ్చు. మూడు బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. 500 చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఉంటా యి. ఫిబ్రవరి 28లోగా పంపాలి. ఫోన్: 9959997204 -
ఎన్టీఆర్ కారణజన్ముడు
-
ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం డాక్టర్ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు. -
బాలోత్సవం
-
నాన్నకు ‘నాట్య’ నివాళి
తన తండ్రిపై ఉన్న ప్రేమను నాట్యం ద్వారాచూపించారామె. ఇటీవల మరణించిన న్యాయవాది వీఎల్ఎన్ గోపాలకృష్ణమూర్తి స్మృత్యర్థం ఆయన కూతురు సింధూర కూచిపూడి నాట్యంతో శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో నివాళులు అర్పించారు. సాక్షి, సిటీబ్యూరో: లాస్యప్రియ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన సింధూరమూర్తి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తన తండ్రి, హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ వీఎల్ఎన్ గోపాలకృష్ణ మూర్తి ఇటీవల మరణించగా, ఆయనకు నివాళులు అర్పిస్తూ సింధూర ఈ ప్రదర్శన ఇచ్చింది. సింధూర దివంగత డాక్టర్ ఉమారామారావు శిష్యురాలు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.జగన్నాథరావు, లాస్యప్రియ డైరెక్టర్ డాక్టర్ జ్వాలా శ్రీకళ తదితరులు పాల్గొన్నారు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’లో భాగంగా నవంబర్ 9న సా.6 గం. కు పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్యంపై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగిస్తారు. వేదిక: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేవిప్రియ ‘బహుముఖ’(కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం) ఆవిష్కరణ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు సమాగమం హాల్, రెండో అంతస్తు, ది ప్లాజా, పర్యాటక భవన్, బేగంపేట, హైదరాబాద్లో జరగనుంది. ఆవిష్కర్త: ప్రకాశ్ రాజ్. ఇ–బుక్ ఆవిష్కర్త: పల్లా రాజేశ్వరరెడ్డి. అధ్యక్షత: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: సాహితీ మిత్రులు. పి.సత్యవతి ఇంగ్లిష్ పుస్తకం ‘హేర్ ఐ యామ్’, అనువదించిన పుస్తకం ‘పలు రామాయణాలు’ ప్రచురణ అయిన సందర్భంగా ‘మీట్ టుగెదర్’ నవంబర్ 11న ఉదయం 10:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సీతా సుధాకర్ ‘పూనాలో పూచిన నానీలు’ ఆవిష్కరణ నవంబర్ 11న ఉదయం 10:30కు కొరటాల మీటింగ్ హాల్, బ్రాడీపేట, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. ‘ఈ సంవత్సరం నుండి ఒక్కో సంవత్సరం వరుసగా కథ, కవిత, నవల, సాహిత్య వ్యక్తిత్వం అంశాలపై విశేష ప్రతిభ కనబర్చిన సాహిత్యవేత్తలకు’ ఇవ్వదలచిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని కథా ప్రక్రియకుగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు నవంబర్ 25న వరంగల్లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథులు: కె.శివారెడ్డి, తనికెళ్ల భరణి. కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి గానూ 2015, 16, 17ల్లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానించగా, వచ్చిన వాటిలోంచి డాక్టర్ ఎస్.రఘు ‘సమన్వయ’ ఎంపికైనట్టు కామిశెట్టి సాహిత్య వేదిక (భద్రాచలం) అధ్యక్షులు తెలియజేస్తున్నారు. విజేతకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో రూ.10,116 ప్రదానం చేస్తారు. -
నాటకరంగ వ్యాప్తికి కృషి
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణలో నాటక రంగం మరింత బలపడాలని మా తండ్రి ఖదీర్ అలీ బేగ్ ఎప్పుడూ తలంచేవారు. అందుకోసం 14ఏళ్లుగా ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాం. ప్రతిఏటా థియేటర్ ఫెస్టివల్తో ఆయన్ని గుర్తు చేస్తున్నాం. యాంత్రిక జీవనంతో ఒత్తిడికి గురవుతున్న సిటీజనులకు ఓ మంచి వినోదం అందించాలని ఖదీర్ అలీ బేగ్ తపించేవారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కష్టాలు ఎదురైనా ఫెస్ట్ నిర్వహిస్తున్నామ’ని థియేటర్ ఫెస్టివల్ నిర్వాహకులు, ప్రముఖ నాటక దర్శకుడు మహ్మద్ అలీ బేగ్ ‘సాక్షి’తో చెప్పారు. 2005లో ఏర్పాటు... ‘మా త్రండి హైదరాబాద్ నుంచి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. 1970లో న్యూ థియేటర్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎన్టీహెచ్ స్థాపించారు. సఖరం బైండర్, అధే అడోహోరే, ఖమోష్ అడాలాత్ జారి హై, కెహ్రాన్ కే రాజాన్స్ తదితర నాటకాల్లో నటించారు. ఆనాడు ఆయన వేసిన సెట్లు అందర్నీ ఆకట్టుకునేవి. 2005లో ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ ఫౌండేషన్ను స్థాపించి ఎన్నో థియేటర్ ఫెస్టివల్స్ నిర్వహించాం. మరెన్నో చారిటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామ’ని మహ్మద్ అలీ బేగ్ చెప్పారు. 150 మంది కళాకారులతో... ఈ థియేటర్ ఫెస్టివల్ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 4వరకు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 150 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అస్మిత థియేటర్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తారా హిందీ నాటకం ఆకట్టుకుంది. 2న డ్రీమ్జ్ సెహర్, 3న ‘ల’మెంట్ (దిలవర్), 4న హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ నాటకాల్లో ఒగ్గు డోలు, చిందు యక్షగానం కూడా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. -
‘విశ్వ’ వేడుక
-
పూల సంబరం
-
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
జుగల్..జిగేల్
-
జానపదం.. మంత్రముగ్ధం
-
కేరళ రిలీఫ్ క్యాంప్.. హైదరాబాదీల ఔదార్యం!
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మేమున్నామంటూ హైదరాబాద్లో స్థిరపడ్డ మళయాళీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తమ సోదరులకు తోచిన సాయం అందించేందుకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఓ రిలీఫ్ క్యాంప్ను ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్కు భారీ స్పందన వస్తోంది. మలయాళీలతోపాటు, హైదరాబాదీలూ విపత్తులో చిక్కుకున్న కేరళపై ఔదార్యం చాటారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమవంతు విరాళాలతోపాటు సహాయక సామాగ్రిని అందజేశారు. రవీంద్రభారతీలో ఏర్పాటుచేసిన ఈ క్యాంప్నకు భారీ స్పందన వచ్చిందని, హైదరాబాద్లోని మలయాళీలతోపాటు రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకువచ్చి కేరళకు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారని భాషా, సంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. -
హైదరాబాద్లో కేరళ రిలీఫ్ క్యాంప్
-
తండ్రి సింగర్.. తనయ డ్రమ్మర్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి గాయకుడిగానూ తనదైన మార్కు చూపనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ‘వందేమాతరం’ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సైతం డ్రమ్మర్గా అరంగేట్రం చేస్తుండడం విశేషం. లక్డీకాపూల్లోని సెంట్రల్కోర్టు హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా చంపాలాల్ మాట్లాడుతూ...‘నాకు పాటలంటే ఇష్టం. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లలో పాడేవాడిని. అనంతరం తెలంగాణ వీరుడు కొమురం భీమ్ మీద ఒక పాట రాసి, పాడి విడుదల చేశాను. అయితే ఒక పూర్తిస్థాయి కార్యక్రమంతో గాయకుడిగా పరిచయమవడం మాత్రం ఇదే తొలిసారి. నా ఉద్యోగ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ అభిరుచిని ఆస్వాదిస్తున్నాన’ని చెప్పారు. ఆయన కుమార్తె సోనిక మాట్లాడుతూ... ‘డ్రమ్స్ అంటే ఇష్టం. ముంబై ఐఐటీలో చదువుతుండగా డ్రమ్మర్గా మారాను. ఎలాంటి శిక్షణ పొందకున్నా, ఇంటర్నెట్ సహాయంతో సాధన చేశాను. ప్రస్తుతం ఒక రాక్బ్యాండ్లో సభ్యురాలిని. నాన్నతో కలిసి నగరంలో తొలి ప్రదర్శన ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని’ అన్నారు. ఫ్లూటిస్ట్ నాగరాజు తళ్లూరి, నేపథ్య గాయని మణినాగరాజ్ ఇందులో పాల్గొననున్నారు. -
నాట్య విలాసం...
-
నయనానందం
-
హనుమాన్ ఇన్ లంక
-
మా గొంతు ఇక్కడా వినరా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన కవయిత్రుల ఆవేదన ఇది. కవి సమ్మేళనం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అని నిర్వహకులు చెప్పారు. అక్కడికి వెళ్తే ‘ఇది మగవాళ్లకు మాత్రమే’నన్నారు అక్కడివారు. ‘మరి మాకు వేదిక ఎక్కడ’ అంటే రవీంద్రభారతికి వెళ్లమన్నారు. అక్కడ ‘బాల కవి సమ్మేళనం జరుగుతోంది, మరొక వేదిక మీద అష్టావధానం, మా ఏర్పాట్లలో మీకు వేదిక లేదు’ అన్నారు. ఇది తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం నాటి పరిస్థితి. మహబూబ్నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పలత, తెలుగు ఉపాధ్యాయిని జీవనజ్యోతి, అంబుజ, మరో ముగ్గురు రచయిత్రులకు ఎదురైన చేదు అనుభవం ఇది. ‘ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి రవీంద్రభారతికి వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకే అవకాశమన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే నిన్నటితోనే ముగిసిందంటున్నారు. ఇక్కడ పడిగాపులు కాస్తూ నిర్వహకులను అడగ్గా అడగ్గా ‘రేపు రెండు గంటల సమయమిస్తాం, ఆ టైమ్లోనే ఎంతమంది రచయిత్రులు ఉంటే అందరూ మీ పద్యాలను చదువుకోవచ్చు’ అంటున్నారు. రెండు వందల మంది రచయిత్రులం ఉన్నాం. రెండు గంటల టైమంటే ఒక్కొక్కరికి ఒక్క నిమిషం కూడా ఇవ్వరా? మేము అర నిమిషంలో ముగించాలా? మగవాళ్లకైతే ఏకంగా నాలుగు రోజులు.. రోజుకు ఏడు గంటలా..! మహిళలమని ఇంత వివక్షా! అయినా పద్యానికి, పద్యం రాసిన వాళ్లను కూడా మగ, ఆడ అని వర్గీకరిస్తారా? ప్రపంచ తెలుగు మహాసభలు మగవాళ్లకేనా?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు జీవనజ్యోతి. ఆమె మాటల్లో ఆవేశం వెనుక ఉన్న ఆవేదనలో అర్థముంది. ఆమెది ఆగ్రహం ధర్మాగ్రహమే. సభల నిర్వాహకులూ మీరేమంటారు..! -
ప్రేమ్నగర్
-
మెట్రో నగరాల తెలుగు ప్రముఖులనూ ఆహ్వానిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పెద్ద నగరాల్లో ఉన్న తెలుగువారిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు ఈనెల 4, 5 తేదీల్లో కోర్కమిటీ సభ్యులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. అక్కడి తెలుగు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందించి ఆన్లైన్లో వారుపేర్లు నమోదు చేసుకునేలా చూస్తారని వెల్లడించారు. బుధవారం ఆయన రాష్ట్ర అధి కార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంక టేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణతో కలసి సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సాహితీ సంస్థలు, సాహితీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సహకారా న్ని కోరామన్నారు. రవీంద్రభారతి ప్రాంగణం లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. -
కనకతార
-
అస్సామీ నాటకం.. అదుర్స్
-
సాహిత్య మేధోమథన కేంద్రంగా రవీంద్రభారతి
-
సాహిత్య మేధోమథన కేంద్రంగా రవీంద్రభారతి
► కళాభవన్ను ఆధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి: కేసీఆర్ ► రవీంద్రభారతిలోనే సాహిత్య అకాడమీ కార్యాలయం ► రవీంద్రభారతి ప్రాంగణంలో కలియతిరిగిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర నడిబొ డ్డున ఉన్న రవీంద్రభారతిని సాహితీ–సాంస్కృ తిక మేధోమథన కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ నిరంతర ప్రక్రియలు కొనసాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచించారు. కళాభవన్కు ఆధునాతన సౌకర్యాలతో హంగులు అద్దాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయాన్ని కూడా రవీంద్రభారతిలోని కళాభవన్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం రవీంద్రభారతి ప్రాంగణమంతా కలియ తిరిగారు. సాంస్కృతిక శాఖ కార్యాలయం నిర్వహిస్తున్న బ్లాకును, పరిసర పాంత్రాలను పరిశీలించారు. రవీంద్రభారతిని మరింత గొప్పగా వినియోగిం చేందుకు చేపట్టవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో పచ్చిక బయళ్లు, పార్కింగ్ స్థలాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రవీంద్రభారతి నైరుతీ భాగంలో ఎత్తు పెంచాలని, ఆ భాగంలోని దారిని మూసేయాలని సాంస్కృతిక శాఖ అధికారులకు సీఎం సూచించారు. పెయింటింగ్ ప్రదర్శన తిలకించిన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను వస్తున్నట్లు ఒక రోజు ముందే చెప్పి రవీంద్రభారతికి వచ్చారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చాం బర్ను ఆయన సందర్శించారు. అదే భవన్లో ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాల యాన్ని కూడా పరిశీలించారు. ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న బాతిక్ పెయింటింగ్ ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ సంస్కృ తికి సంబంధించిన పెయింటింగ్ను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలి సాహిత్య అకాడమీకి చెందిన ప్రక్రియ అంతా రవీంద్రభారతిలోనే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య అకాడమీ కృషి చేయాల్సి ఉంటుంద న్నారు. అక్టోబర్లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలని, దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తెలుగు భాషను కాపాడేందుకు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సాహిత్య అకాడమీ సూచనలు చేయాలన్నారు. సీఎం వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదిర్శ బుర్రా వెంకటేశం, టీఎస్టీడీసీ ఎండీ క్రిస్టీనా జెడ్ ఛోంగ్తూ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలర్ఫుల్గా మిస్సెస్ సిల్క్ ఫ్యాషన్ షో
-
నృత్య తరంగం
-
హైదరాబాద్ హెరిటేజ్పై బ్రిటిషర్ల డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్కృతి, చరిత్ర, హెరిటేజ్లపై డాక్యుమెంటరీ తీయటానికి బ్రిటిషర్లు నగరానికి చేరుకున్నారు. గురువారమిక్కడ రవీంద్రభారతి లోని భాషా సాంస్కృతిక కార్యాలయంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణను కలిశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాల గురించి అడిగి తెలుసుకొన్నారు. హరికృష్ణను కలిసిన వారిలో యూకేకు చెందిన స్టేఫ్ని ఫైఫ్, కై ్లమ్ తుల్లో, రెష్మా సైరాలు ఉన్నారు. -
'వాయిస్ ఆఫ్ ఇమేజస్'ఆర్ట్ ఎగ్జిబిషన్