breaking news
Singer
-
ఎలక్ట్రిక్ కారు కొన్న శంకర్ మహదేవన్.. ధర ఎంతంటే?
సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్ 9 ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో శంకర్ మహదేవన్.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.కారుఎంజీ ఎమ్9 మోడల్లో సీట్ మసాజ్, డ్యుయెల్ సన్రూఫ్, హీటింగ్, వైర్లెస్ చార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 548 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.సింగర్గా, సంగీత దర్శకుడిగా..శంకర్ మహదేవన్ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
ప్రపంచ కుబేరురాలు పార్క్బామ్?
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. పార్క్బామ్ గతంలో చేసిన పోస్ట్ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.పార్క్బామ్ గతంలో పని చేసిన ఏజెన్సీ వైజీ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యున్ సుక్ (Yang Hyun Suk) తనను భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె దాదాపు 4.5 క్వాడ్రిలియన్ డాలర్లు (రూ.4,500 లక్షల కోట్లు-Quadrillion - ఒకటి తర్వాత 15 సున్నాలు) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఒక లీగల్ డాక్యుమెంట్ స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. ఈ మొత్తం దాదాపు ప్రపంచ జీడీపీకి 41 రెట్లతో సమానం. దాంతో అందులో తెలిపిన మొత్తం చాలా అసాధారణంగా ఉండడంతో ఈమేరకు పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి.Breaking: Park Bom is expected to become the richest person in the world if she wins the case, surpassing Elon Musk.Park Bom of 2NE1 has reportedly sued YG Entertainment for a demure amount of 1002003004006007001000034'64272e trillion won. pic.twitter.com/tCIUS60kGB— World updates (@itswpceo) October 23, 2025ఈ వివాదంలో పార్క్బామ్ ఈ భారీ మొత్తాన్ని నిజంగా గెలిస్తే ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా, తొలి ట్రిలియనీర్గా, ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ను అధిగమించిన తొలి మహిళగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
దివాళీ మోడ్లో సింగర్ శ్రియా ఘోషల్ (ఫోటోలు)
-
పల్సర్ బైక్ సాంగ్కు ఎన్ని లక్షలు వచ్చాయంటే?
సినిమా పాటల్ని సైతం వెనక్కు నెడుతూ జానపద పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నవే.., ఆడనెమలి.., సీమదసర సిన్నోడు.. ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్లో మోత మోగిస్తున్నాయి. పల్సర్ బైక్ (Pulsar Bike Song) కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ పాట రిలీజైన కొత్తలో.. ఏ ఫంక్షన్లో చూసినా ఈ సాంగే మోగేది. 2018లో ఇండస్ట్రీకి..ఇక ఈ ఒక్క పాటతోనే ఫుల్ సెన్సేషన్ అయ్యాడు సింగర్ రమణ (Singer Ramana). ఈ సాంగ్ను రవితేజ ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత పాపులారిటీ వచ్చింది. తాజాగా ఈ పాట గురించి రమణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 'నేను 2018లో ఈ ఇండస్ట్రీకి వచ్చాను. 2022లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. జీవితంలో ఊహించనంత పాపులారిటీ వచ్చింది. ఆ రోజుల్లో ఒక ఆడియో సాంగ్ చేయాలంటే రూ.15-20 వేలల్లో అయిపోయేది.పల్సర్ బైక్కు ఎంతొచ్చిందంటే?కానీ, ఆ రూ.20 వేలు కూడబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈవెంట్కు వెళ్తే రూ.2-3 వేలు మిగిలేవంతే! ఎక్కువ డబ్బు వచ్చేది కాదు. పల్సర్ బైక్ ఆడియో సాంగ్ రూ.5-10 వేలల్లో అయిపోయింది. వీడియో సాంగ్ కూడా కలుపుకుంటే రూ.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. కానీ ఈ పాట మేము ఊహించని స్థాయిలో రూ.40-50 లక్షల డబ్బు తెచ్చిపెట్టింది' అని రమణ చెప్పుకొచ్చాడు.చదవండి: అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా -
ఆ దివ్య తోటలోనికి ఆమె తరలి వెళ్లింది
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.ఈ వేళ పొద్దున్నే ఫేస్బుక్లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది. చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –చలి గాలి వీచింది – తెరవారబోతోందిఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు. ‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు. మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’. ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు. ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.– ప్రసూన బాలాంత్రపు -
ప్రఖ్యాత తెలుగు సింగర్ బాల సరస్వతి దేవి(97) కన్నుమూత
-
తొలి తెలుగు సింగర్ ఇక లేరు
చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్సింగర్ బాల సరస్వతీదేవి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. 'తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ట్వీట్ చేశారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025సింగర్ జర్నీబాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు. ఆరో ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు. చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
మనిషిలా మాత్రమే జీవిస్తా
గువాహటి: అసోంలోని గువాహటిలో గాయకుడు జుబీన్ గార్గ్కు దహన సంస్కారాలు జరిపి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు.. ‘ఇకపై కేవలం మనుషులా మాత్రమే జీవిస్తా. కులమతాల ప్రస్తావన వదిలేస్తా’అంటూ తన జంధ్యాన్ని తెంపి, చెత్తలో పడేశాడు. సన్ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు.. ఇకపై గార్గ్ నడిచిన బాటలోనే నడుస్తానని తెలిపాడు. కులమతాల అడ్డుగోడలను పగులగొట్టాలన్నాడు. ‘పుట్టుకతో నా కులం బ్రాహ్మణ. ఇప్పుడిక నాకు కులం, మతం అంటూ ఏదీ లేదు’అంటూ తన దుస్తుల్లోపలున్న జంధ్య తీసి, మీడియా చూస్తుండగానే తెంచి చెత్తలోకి వేశాడు. నా సోదరుడు జుబీన్ సాక్షిగా చెబుతున్నా. జంధ్యం మళ్లీ ధరించను. ఇటీవల సోషల్ మీడియాలో హిందూముస్లింలకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా వస్తున్నాయి. హిందువుల్లోనూ చాలా కులాలున్నాయి. శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు. ఇలాంటి ఆచారాలు, విశ్వాసాలు ఎన్నో. అందుకే జబీన్ దా సాక్షిగా వాటన్నిటినీ వదిలేస్తున్నా. ఆరేళ్ల నా కుమారుడికి కూడా జంధ్య వేయను. మనుషుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. మానవత్వం అన్నిటికీ మించింది’అని పేర్కొన్నాడు. కాగా, బ్రాహ్మణ కుటుంబంలో జి»ొన్ బొర్తాకుర్ పేరుతో జని్మంచిన జుబీన్ గార్డ్ కూడా తనకు కులం–మతం లేదంటూ ప్రకటించుకున్నారు. జంధ్యాన్ని దోమ తెర కట్టేందుకు తాడు మాదిరిగా వాడుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు. -
జీవన తాత్వికతను ప్రతిబింబించిన అమర స్వరం
‘జిందగీ కా సఫర్ కోయి సమ్ ఝా రహ’... ‘ముసాఫిర్ హు యారో న ఘర్ హై నా ఠికాన’... ‘మేరే నైనా సావన్ బాధో ఫిర్ భి మేరా మన్ ప్యాసా’... ‘ఘుంఘురూ కి తరా బజ్ థా హి రహా హూ మై’... ఆ బరువైన స్వరం వినగానే విషాదంలో కూరుకొనిపోయిన వారికి ఉపశమనం కలుగుతుంది. జీవన సమరంలో ఓడిపోయిన వారికి పోరాడే ధైర్యం వస్తుంది. నిరాశ నిస్పృ హలో కొట్టు మిట్టాడినవారికి ఆశలు చివురిస్తాయి.పల్లవులను చూడగానే ఆ స్వరం ఎవరిదో తెలిసిపోతుంది... ఆ పల్లవులను వింటే చాలు, రాసిన రచయితలకంటే, సంగీతం అందించిన స్వరకర్తల కంటే ముందుగా సాక్షాత్కరించే గాన గంధర్వుడెవరన్నది... అది నాలుగు దశాబ్దాలుగా తన నవరసభరిత గాత్రంతో బాలీవుడ్ సినీ రంగాన్ని శాసించిన అపురూప, అరుదైన గాయకుడు కిషోర్ కుమార్దేనని. అందరూ ప్రేమగా పిలుచుకొనే ‘కిషోర్ దా’ భౌతికంగా దూరమై, మూడున్నర దశాబ్దాల పైనే అవుతోంది.‘నీవు లేవు నీ పాట వుంది’ అని తిలక్ అన్నట్లు కిషోర్ దా మన మధ్య లేకున్నా ఆయన పాటలు స్వర స్మరణీయలుగా మన హృదయాలను స్పృశించడానికి కారణం ఆయన స్వరంలోని జీవశక్తి... ఆయన గాత్రంలోని జీవన తాత్వికత... కవి హృదయాన్ని అవగతం చేసుకొని కథా సన్నివేశాన్ని, పాత్రల మనోభావాలను మమేకం చెంది, సంగీత దర్శకుని బాణీలను ఇంప్రో వైజ్ చేసి, స్వీయ అనుభవాలను మిళితం చేసి, అనుభూతి చెంది పాడ డం వల్ల కిషోర్ స్వరం భాస్వరంలా ప్రజ్వరిల్లింది.ఆయన గాత్రంలోని జీర, బరువు, స్థాయి, మధురిమ, డైనమిక్స్ అన్నీ పంచామృతమై గానధారలుగా రస ప్లావితం చేసింది. ఆ శైలీ ప్రభంజనంలో పడిపోయిన వేలాది గాయకులు జూనియర్ కిషోర్ కుమారులై వేదికల మీద పాడుతూ మురిసిపోతున్న మాట వాస్తవం..కిషోర్ కుమార్ నటుడు కావాలనుకున్నాడు కానీ గాయకుడయ్యాడు. ‘జిద్దీ’ (1948) చిత్రంలో ఖేమ్ చంద్ర ప్రకాశ్ తొలి పాటను పాడించాడు. కానీ ఆయనలోని ప్రతిభను, చిలిపితనాన్ని, వలపుతనాన్ని గుర్తించింది ఎస్.డి. బర్మన్. యాభైలలో రఫీ ప్రభంజనం ఉన్న రోజుల్లో కిషోర్కు మంచి పాటలిచ్చి ్రపోత్సహించాడు.1960 దశకం ప్రారంభంలో ఆయన సినిమాలు విఫలమైన తరుణంలో ఎస్.డి. బర్మన్ కొడుకు ఆర్.డి. బర్మన్ ‘పడోసన్’లో ‘మేరే సామ్ నె వాలే ఖిడ్ కీ మే’ పాటనిచ్చి కిషోర్ గొంతులోని రొమాంటిజాన్ని ఆవిష్కరించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు.కిషోర్ జీవితంలోని ‘ఆరాధన’ (1969) పెద్ద మలుపు. ఆ చిత్ర స్వరకర్త ఎస్.డి. బర్మన్... రఫీతో రెండు పాటలు రికార్డు చేశాక జబ్బు పడడంతో ఆర్.డి. కిషోర్తో ‘రూప్ తేరా మస్తాన...’ పాడించి హిట్ చేయడంతో కిషోర్ ప్రభంజనం మొదలైంది. ఆ పాటలతో హిందీ సినీ గీతాల దిశ కూడా మారింది.కిషోర్ యువతీ యువకుల పాలిట రొమాంటిక్ సింగర్ అయ్యాడు. అయితే కిషోర్ మరోవైపు జీవన తాత్వికతను తెలిపే బరువైన పాటలూ పాడాడు. ఆ పాటలే ఆయనను సమున్నత స్థానానికి చేర్చాయి. నిజానికి విషాద గీతాలను పాడి మెప్పించడం చాలా కష్టమని ప్రసిద్ధ గాయకులు చెప్పే మాట... కానీ కిషోర్ దా పాడిన ప్రతి విషాద గీతం కంటతడి పెట్టిస్తుంది. ఆయన గొంతులోని మార్దవం మనల్ని ఓదారుస్తుంది.‘యే జీవన్ హై... ఇస్ జీవన్ కా యహీహై యహీహై రంగ్ రూప్... ‘పియా కా ఘర్’ (1972) లోని ఈ పాట అర్థం తెలిస్తే మనం ఎంతో ఉపశమనం ΄÷ందుతాం... ఇందులో ‘జీవితం కొంత సుఖం... కొంత కష్టం... బతుకుతో పంతం వద్దు’ అని చెబుతుంది. ఈ పాట కిషోర్కు ఎంతో ఇష్టమైనది. ఇదే ఆనంద్ భక్షి రాసిన ‘చింగారి కోయీ భడ్ కే, తొ సావన్ ఉసే భుజాయే, సావన్ జొ అగన్ లగాయే, ఉసె కౌన్ భుజాయె’ (నిప్పును వర్షం చల్లారుస్తుంది, అయితే వర్షంలోనే నిప్పు పుడితే ఎవరు చల్లారుస్తారు) అని ‘అమర్ ప్రేమ్’లోని పాట ఆద్యంతం మనకు విధి నిర్ణయాలలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. కిషోర్ ఈ పాటను ఎంతో నెమ్మదిగా... మంద్రంగా పాడాడు. ‘మేరా జీవన్ కోరా కాగజ్ కోరా హి రహ్ గయా... జో లిఖాథా ఆంసు వోంకె సంగ్ బహ్ గయా’ (నా జీవితం ఓ తెల్ల కాగితం... ఏదైనా రాస్తే అదంతా కన్నీటితో తుడచుకుపోయింది) అని ‘కోరా కాగజ్’ చిత్రంలోని ఈ పాట కంట తడి పెట్టిస్తుంది. జీవితంలో అంతా కోల్పోయిన వారు వేదాంతిలా మారిపోతారు, లేదా జీవించే ప్రయత్నం చేయక మరణాన్నే ప్రేమిస్తుంటారు. ‘ఘుంఘురూ కీ తరహా బజ్ థా హూ రహా హు మై’ (చోర్ మఛాయే షోర్) మొదలైన పాటలు ఇందుకు ఉదాహరణలే.జీవన వైచిత్రిని, జీవన సత్యాన్ని తెలిపే గీతాలకు కిషోర్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.జిందగీ కా సఫర్ ... హై యే కైసా సఫర్కోయి సమ్ ఝా నహి కోయి జానా నహిహై యే కైసే డగర్... చల్ తె హై సబ్ మగర్... (ఈ జీవిత పయనం ఎవరికీ తెలియదు.. ఎవరికీ అర్థం కాదు. అందరం ఏ తోవన వెళుతున్నామో తెలియకున్నా వెళుతూనే వున్నాం). ‘సఫర్’ (1970) చిత్రంలోని ఈ పాట అందర్నీ కదిలిస్తుంది...అలాగే ‘ఆప్ కి కసమ్‘ సినిమా (1974)లో జీవితంలో గడచిన క్షణాలు, సంఘటనలు మళ్ళీ రావు అనే సత్యాన్ని ఆరు రుతువులతో పోలుస్తూ రాసిన గీతాన్ని కిషోర్ హృద్యంగా పాడారు.‘జిందగీ కా సఫర్ మై గుజర్ జాతే హై జో మఖామ్... వో ఫిర్ నహీ ఆతీ... వో ఫిర్ నహీ ఆతీ’... (ఇందులో శిశిరంలో రాలిన పూలు వసంతంలో చిగురిస్తాయని అనుకోవద్దని, ఒక్కసారి దూరమైన వ్యక్తులు మరల చేరువ కారని మనిషికి అనుమానం ఉంటే అది పెనుభూతమవుతుందని, జీవితం అశాంతిమయమనే) భావనతో రాసిన గీతాన్ని కిషోర్ ఎంతో గంభీరంగా పాడాడు. ‘అందాజ్’ (1971) చిత్రంలోని ‘జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్ నే జానా’ ఆల్ టైం హిట్గా నిల్చింది. (రేపు ఏమవుతుందో తెలియదు. మృత్యువు అనుక్షణం వెంటా డుతుంటుంది. అనుభవించేదేదో ఈ క్షణమే అనుభవించు) అనే భావంతో ఈ పాట సాగుతుంది. ‘అమర్ ప్రేమ్’ (1972) లోని ‘కుఛ్ తో లోగ్ కహేంగే... లోగోంక కామ్ హై కహనా’ (ప్రజలు ఎప్పుడు ఏవో మాట్లాడుతూ వదంతులు సృష్టిస్తూనే వుంటారు... ఆ మాటలను పట్టించుకోవద్దు... సీతమ్మ వారినే నిందించింది లోకం... మనం లోకానికి జవాబుదారు కాము) గీతాన్ని ఎంతో అనునయంగా పాడాడు కిషోర్...‘కాలా పత్తర్’ (1979) చిత్రంలోని ‘ఎక్ రాస్ థా హై జిందగీ’ గీతాన్ని కిషోర్ పాడిన తీరు మనల్ని కట్టి పడేస్తుంది..కిషోర్ వ్యక్తిగత జీవితమూ రక రకాల గతుల్లో పయనించింది. ఆయన జీవితంలో నలుగురు స్త్రీలు ప్రవేశించి కొన్నాళ్ల తరువాత నిష్క్రమించారు. తొలుత రూమాదేవి 1950ల్లో తరువాత మధుబాలను, తరువాత 1970ల్లో యోగితా బాలిని, చివరికి 1980ల్లో లీనా చందా వర్కర్ను వివాహమాడాడు... వీరందరూ ప్రసిద్ధ నటీమణులే... కిషోర్ వాయిద్యాలతో, సంగీత దర్శకులతో ట్యూన్ అయ్యాడు కానీ ఆయన భార్యలు మాత్రం ఆయనతో ట్యూన్ కాలేదు. కారణం ఆయన నిలకడ లేనితనం, చిన్నపిల్లాడి తత్వమే! 1969లో మధుబాల మరణంతో కిషోర్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. తరువాత చాలా కాలానికి యోగితా బాలి ఆయన జీవితంలో ప్రవేశించింది. ఆ తర్వాత లీనా చందా వర్కర్... కిషోర్ జీవితంలో చివరివరకున్నది... కిషోర్ ఉమనైజర్ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం తెగిన గాలి పటమైంది. కానీ ఇవేవీ ఆయన స్వర జీవితంపై ప్రభావం చూపలేదు..కిషోర్ తరచూ గుండె నొప్పి అని, అందర్నీ ఆట పట్టించేవాడు. అక్టోబర్ 13న (1987) కూడా అలాగే అంటే భార్య లీనా జోక్ కాబోలనుకుంది... కానీ మరుక్షణంలోనే డాక్టర్ను పిలిపించింది... డాక్టర్ వచ్చే లోపే కిషోర్ తుది శ్వాస వదిలాడు. అప్పుడు ఆయన వయసు 58 యేళ్ళు... కిషోర్ లేడు అనుకోగానే... ‘మౌత్ ఆయేగీ ఆయేగీ ఎక్ దిన్... జాన్ జాయేగీ జాయేగీ ఎక్ దిన్’ కిషోరే పాడిన పాట గుర్తుకు వస్తుంది... కానీ కిషోర్ మాత్రం తనకు ఎన్నడు వీడ్కోలు ఇవ్వద్దని వెళుతూ మరీ చె΄్పాడు.‘చల్ తే చల్ తే మేరే యే గీత్... యాద్ రఖ్ నా కభి అల్ విద నా కహనా’ (చల్ తే చల్ తే)... అవును.. కిషోర్ దా గాత్రానికి మరణం లేదు.. అది అజరం, అమరం.– డా. వి.వి. రామారావు (గాయకుడు, రచయిత, వ్యాఖ్యాత) -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
35 ఏళ్లకే కోట్ల సంపాదన, బైక్స్ పిచ్చి...నమ్మలేని నిజాలు
పంజాబీ గాయకుడు(Punjabi Singer) రాజ్వీర్ జవాండా (Rajvir Jawanda) అకాల మరణం యావత్ సంగీత ప్రపంచానికి కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,35 ఏళ్ల వయసులో అనంత లోకాలకు చేరుకోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఒక రత్నాన్ని కోల్పోయామంటూ సంగీతాభిమానులు, పెద్దలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని, ఇంకా మరింత బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఆయన మరణం అత్యంత విషాదకరం. రాజ్వీర్ జవాండా ఆస్తుల విలువ(Net worth) ఎంత అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.ఆస్తి ఎంత అంటే?రాజ్వీర్ జవాండా సంగీతం, పలు మూవీల్లో నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లు , ఇతర పెట్టుబడుల ద్వారా భారీ సంపదను కూడబెట్టాడు. పంజాబీ సంగీత రంగంలో ప్రముఖ వ్యక్తిగా, రాజ్వీర్ జవాండా తన పాటల బహుళప్రజాదరణ పొందాడు. భారీ ఆదాయాన్ని సంపాదించాడు. సర్దారీ, కంగాని , మేరా దిల్తో సహా అనే పాటలు అనేక ప్లాట్ఫాంలలో మోత మోగిపోయాయి. మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్ సాధించాయి. దీనికి రాయల్టీ కూడా భారీ మొత్తంలోనే సంపాదించాడు. వీటితోపాటు కెనడా,యూకే, యూఎస్ వంటి దేశాలలో అంతర్జాతీయ పర్యటనలు, లైవ్ షోలు మరో ప్రధాన ఆదాయ వనరు. దీనికి సోషల్ మీడియా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజ్వీర్ ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ డీల్స్ తో సంపాదన కూడా తక్కువేమీ కాదు. అలా అక్టోబర్ 8, 2025 నాటికి, రాజ్వీర్ నికర విలువ రూ. 4–5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.సంగీతంతో పాటు,సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్ జాన్ , మిండో తసీల్దార్ని లాంటి పంజాబీ చిత్రాలలో నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాజ్వీర్. అలాగే ముందు చూపుతో ఇతర ఇతర వెంచర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!పంజాబ్లోని లూధియానాలో 1990లో జన్మించిన రాజ్వీర్ జవాండా పాఠశాల విద్య తరువాత జగ్రాన్లోని డీఎవీ కళాశాల నుండి పట్టభద్రు డయ్యాడు. తరువాత పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి థియేటర్ అండ్ టెలివిజన్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తండ్రి కరం సింగ్ బాటలో నడుస్తూ 2011లో పంజాబ్ పోలీస్లో కానిస్టేబుల్గా చేరాడు. అయితే, ఆయన సంగీతం పట్ల తనకున్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే సైడ్ కెరీర్గా పాటలు రికార్డ్ చేయడం , తన షిఫ్ట్ల తర్వాత ప్రదర్శన ఇచ్చేవారు. మంచి పాపులారిటీ రావడంతో పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టేందుకు అందువల్ల, 2019 లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.2020-21లో ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన జరిగినప్పుడు, రాజ్వీర్ కూడా రైతులకు మద్దతుగా వచ్చాడు. నిరసన తెలుపుతున్న రైతుల కోసం వేదికపై ఉచితంగా పాడేవాడు. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా, ఒక ప్రదర్శన సమయంలో తన తండ్రియ చనిపోయారు. ఈ వార్త తెలిసినా కూడా వేదికపై పాటను పూర్తి చేసి, అంత్యక్రియల కోసం బయలుదేరాడు.రాజ్వీర్కు బైక్లంటే పిచ్చిరాజ్వీర్ జవాండాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం. అతను తరచుగా తోటి బైకర్లతో కలిసి కొండలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. ఈ పర్యటనల సమయంలో, అతను హోటళ్లలో బస చేయకుండా రోడ్డు పక్కన క్యాంప్ చేసేవాడు. రాజ్వీర్ కొన్ని నెలల క్రితం రూ. 27 లక్షల విలువైన కొత్త BMW బైక్ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు , దానిని ఒక పాటలో కూడా ఉపయోగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఈ BMW బైక్ను నడుపుతున్నాడు. బైకింగ్కు అవసరమైన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అతన్ణి మృత్యువు వీడలేదు.చదవండి: Rajvir Jawanda పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్రాజ్వీర్ జవాండా కుటుంబంరాజ్వీర్ తాత సౌదాగర్ సింగ్. అమ్మమ్మ సుర్జిత్ కౌర్ తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ కరం సింగ్ . తల్లి పరమ్జిత్ కౌర్ ఈమె మాజీ సర్పంచ్. జవాందా, భార్య అశ్విందర్ కౌర్తో పాటు, ఇద్దరు పిల్లలు కుమార్తె హేమంత్ కౌర్ చ కుమారుడు దిలావర్ సింగ్. జవాందాకు కమల్జిత్ కౌర్ అనే సోదరి కూడా ఉంది. -
జుబీన్గార్గ్ మృతి కేసు...బంధువైన డీఎస్పీ అరెస్టు
గువాహటి: ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన సమీప బంధువు, పోలీస్ డీఎస్పీ సందీపన్గార్గ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేసినట్లు సీఐడీ డీజీపీ మున్నాప్రసాద్ గుప్తా తెలిపారు. సందీపన్ను కామపుర మెట్రోపాలిటన్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సీజేఎం) ముందు హాజరుపర్చగా, ఆయనకు న్యాయమూర్తి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్టు మున్నాప్రసాద్ వెల్లడించారు. సందీపన్తో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మతోపాటు జుబీన్ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు శేఖర్జ్యోతి గోస్వామి, అమృత్ప్రభ మహంతను అరెస్టు చేశారు. జుబీన్ సింగపూర్లో గత నెల 19న సముద్రంలో మునిగి మరణించిన సమయంలో ఈ ఐదుగురు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2022లో అస్సాం పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన సందీపన్గార్గ్.. ఈడబ్ల్యూఎస్ కోటాలో డీఎస్పీగా ఎంపికయ్యారు. -
కాబోయే భార్యతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)
-
పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్వీర్ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్గార్గ్కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెలలో సింగపూర్లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025గత నెలలో సింగపూర్లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
బరిలో ప్రముఖ సింగర్.. బీజేపీ నేతలతో భేటీ
న్యూఢిల్లీ: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. పార్టీలలో ఉత్సాహం పెరిగింది. టిక్కెట్ల ఆశావహులు వివిధ పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్లను కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్భంగా నుండి బీజేపీ టికెట్పై పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.వినోద్ తావ్డే తన ‘ఎక్స్’ హ్యాండిల్లో మైథిలి ఠాకూర్తో సమావేశం అయిన ఫొటోలను షేర్ చేశారు. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో బీహార్ను విడిచిపెట్టిన మైథిలి ఠాకూర్ కుటుంబం రాష్ట్ర పురోగతిని చూసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు తావ్డే ఆ పోస్ట్లో తెలిపారు. కాగా మైథిలి ఠాకూర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘బీహార్ అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.जो लोग बिहार के लिए बड़े सपने देखते हैं, उनके साथ हर बातचीत मुझे दूरदृष्टि और सेवा की शक्ति की याद दिलाती है। हृदय से सम्मानित और आभारी हूँ। 🙏✨श्री नित्यानंद राय जी एवं श्री विनोद श्रीधर तावड़े जी 🙏 https://t.co/o6PBAVJaEJ— Maithili Thakur (@maithilithakur) October 5, 2025మైథిలి ఠాకూర్ బీహార్లోని మధుబనిలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె, బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ను అందుకున్నారు. ఆమె తన ఇద్దరు సోదరులతో పాటు, తాత, తండ్రి నుండి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. రాబోయే ఎన్నికలు ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ మధ్య పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. -
జుబీన్ గార్గ్పై విషప్రయోగం
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామకాను మహంత.. గార్గ్కు విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పీటీఐకి అందిన అత్యంత కీలక పత్రం ప్రకారం.. గార్గ్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ జరిగిందని కూడా గోస్వామి పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. మహంత, అతని సంస్థ నిర్వహించిన 4వ ఈశాన్య భారతదేశ ఉత్సవంలో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ ఆగ్నేయాసియా దేశానికి వెళ్లారు. ‘గార్గ్ మునిగిపోతూ.. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న విపత్కర సమయంలో ’జబో దే, జబో దే’ (వదిలెయ్, వదిలెయ్) అని శర్మ అరిచాడని, గార్గ్ నిపుణుడైన ఈతగాడని, అతనే తనకీ, నిందితుడికీ ఈత నేర్పించాడు కాబట్టి మునిగిపోయే అవకాశం లేదని.. సాక్షి గోస్వామి స్పష్టం చేసినట్లు రిమాండ్ నోట్ పేర్కొంది. ‘శర్మ, మహంత.. జుబీన్కు విషం ఇచ్చారని, తమ కుట్రను దాచడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ వేదికను ఎంచుకున్నారని గోస్వామి ఆరోపించారు. -
జుబీన్ మృతిపై జ్యుడీషియల్ కమిటీ
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా సారథ్యంలో కమిషన్ ఏర్పాటవుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఈ మేరకు గౌహతి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారన్నారు. జుబీన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులు, కారణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఈ కమిషన్కు అందివ్వవచ్చని సీఎం అన్నారు. జుబీన్ వెంట ఉన్న అసోం అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ సభ్యులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19వ తేదీన జుబీన్ చనిపోవడం తెల్సిందే. ఆయన అక్కడ జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతా, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆ కార్యక్రమ బ్యాండ్ సభ్యులైన శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్ప్రభ మహంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఈత కొడుతుండగా జుబీన్కు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పడవలో వీరిద్దరూ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. జుబీన్ హత్యపై 10 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లయింది. జుబీన్ గార్గ్ మృతిపై నమోదైన 60కి పైగా కేసులను సీఐడీ విచారిస్తోంది. సింగపూర్ ఆస్పత్రిలో చేపట్టిన జుబీన్ గార్గ్ పోస్టుమార్టం నివేదికను ఆయన భార్య గరిమాకు అందించామని, గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి చేపట్టిన పోస్టుమార్టం నివేదిక శనివారం అందాక ఆమెకే ఇస్తామని, వాటిని బహిర్గతం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు. శ్యాంకను మహంతా కుంభకోణంపై ఈడీ, ఐడీ దృష్టిసారించాయి. మహంతా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, బినామీ పేర్లను ఆస్తులను కూడబెట్టారంటూ వచి్చన ఆరోపణలను ఈడీ, ఐడీ పరిశీలిస్తున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి కారణంగా ఆరోపణలున్న మహంతాను ఇప్పటికే అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసులు శ్యాంకను మహంతా గత 20 ఏళ్లుగా పాల్పడుతున్న ఆర్థిక అవకతవకలను గుర్తించారు. వీటి వివరాలను ఐడీ, ఈడీ అధికారులు ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వెళ్లి తెల్సుకున్నారు. -
కాబోయే భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్ను అనుసరించింది. సింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్
ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్లోని అతడి అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.సింగర్ అనుమానాస్పద మృతిసింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.ఎవరీ జుబీన్ గార్గ్?జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పాటతల్లికి పెద్దకొడుకు
గోరటి వెంకన్న(GoratiVenkanna) సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కర లేని పేరు. ఆట పాటలతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. ‘హంస’ అవార్డు గ్రహీత. ‘కాళోజీ పురస్కార’ సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ వంటి పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలవు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటీ చెప్పనక్కర లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలి విడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్ అది. ‘వాగు ఎండిపాయెరో’, ‘నల్లతుమ్మ’, ‘సంత’, ‘అద్దాల అంగడి’, ‘కంచెరేగి తీపివోలె’, ‘యలమంద’, ‘గల్లీ సిన్నది గరీబోల్ల కత పెద్దది’, ‘ఇద్దరం విడిపోతె’, ‘తరమెల్లిపోతున్నదో’... ఇత్యాది పాటలన్నీ ప్రతి శ్రోతకూ కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసు కుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న! దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్ – అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. అమెరికన్ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్ జి. బ్రౌన్ వ్యాఖ్యానించినట్టు ఆయన పాటలు లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొక చేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తం లేని రాజయోగిలా ఉండు / ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.తాను పుట్టి పెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలు కొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ’క్వాట్రైన్స్ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘన కవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తుకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశారు.అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహు మతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితో పాటు సరికొత్త వస్తువునూ జోడించి, ఎపిక్ హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో!– డా.బెల్లి యాదయ్య(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘గౌరవ డాక్టరేట్’ అందుకుంటున్న సందర్భంగా) -
చిన్ని అద్భుతం రాబోతోంది : స్టార్ సింగర్, ఫోటోలు వైరల్
-
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. సోషల్ మీడియాలో పోస్ట్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బెన్నీ బ్లాంకోను పెళ్లాడింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్లో స్నేహితులు, సన్నిహితులు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టేలర్ స్విఫ్ట్, పారిస్ హిల్టన్, మార్టిన్ షార్ట్, ఆష్లే పార్క్ లాంటి హాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. తాజాగా సింగర్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.కాగా.. సింగర్ సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఈ జంట గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 12న ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోలు తెగ వైరలయ్యాయి.బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) -
తల్లి కాబోతున్న సింగర్, మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ వైరల్
ఇండియన్ ఐడల్ స్టార్ సాయిలి కాంబ్లే తల్లి కాబోతోంది. ఈ గుడ్ న్యూస్ను తన భర్త ధవాల్తో కలిసి అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితాల్లోకి అద్భుతం రాబోతోందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు దీనిక సంబంధించి బేబీ షవర్ ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. త్వరలోనే ఈ స్టార్ సింగర్ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు అందించారు.మెటర్నిటీ ఫోటో షూట్లో సాయిలి సాంప్రదాయ మహారాష్ట్ర స్టైల్లో ఆకుపచ్చ. నారింజ రంగు చీరలో మెరుస్తూ కనిపించింది.లుక్ను పూర్తి అందమైన రాణిహార్, కమర్బంధ్, మాంగ్ టీక చెవిపోగులతో తన లుక్మరింత అందంగా మల్చుకుంది. భార్యకు తగ్గట్టుగా ధవల్ తనదైన శైలిలో ముస్తాబయ్యారు. View this post on Instagram A post shared by Sayli Kamble Patil (@saylikamble_music)"మా హృదయాలు ఆనందం మరియు నిరీక్షణతో ఉప్పొంగిపోతున్నాయి! మా చిన్న అద్భుతం రాబోతోంది. చాలా సంతోసం. జీవితంలో అత్యంత అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభిస్తున్నాం. మరింత ద్విగుణీకృతమైన ఆనంద క్షణాలను అనుభవించేందుకు ఎదురు చూస్తున్నాం. 'కొంచెం స్టార్డస్ట్, కొంచెం స్వర్గం , జీవితానికి సరిడా ప్రేమ మా దారిలోకి వస్తున్నాయి.’ అంటూ పోస్ట్ చేశారు. కాగాఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ. సాయిలీ తన చిరకాల ప్రియుడు ధవల్ను 2022, ఏప్రిల్లో వివాహం చేసుకుంది.చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
తల్లయిన సింగర్ లిప్సిక.. కూతురు పుట్టింది (ఫొటోలు)
-
వారి గుండె అస్సాం కోసమే కొట్టుకుంది
ఒక గాయకుడు మరణిస్తే జనం సముద్రంలా పోటెత్తడం జుబీన్ గార్గ్ అంతిమ యాత్రలో దేశం చూసింది. ఎవరీ జుబీన్ గార్గ్ అని ఆరా తీసింది. అతడు అస్సాం గొంతుక, అస్సాం సంగీతానికి గుండెకాయ. అభిమానులు ‘కింగ్ ఆఫ్ హమ్మింగ్’ అని పిలుచుకునే జుబీన్ గార్గ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ గర్వపడే సంగీత సముద్రం. గాయకుడు, సంగీత కారుడు, వాద్యకారుడు, సామాజిక సేవకుడు, దాత... ఇంకా మరెన్నో. ఇప్పటికి దాదాపు పదివేలకు పైగా పాటలు పాడి, రికార్డు చేసి స్థానిక గీతాలకు గొంతుకనిచ్చాడు. అంతేకాదు ప్రజల తరఫున అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వెనుకాడలేదు. అందుకే అతణ్ణి జనం గుండెల్లో పెట్టుకున్నారు.చని పోతే గుండెలు పగిలేలా ఏడ్చారు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘యాలీ... రహమ్ వాలీ’ పాట జుబిన్ పాడిందే.జుబీన్ మెహతా అంతటి వాడు కావాలని...జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నాడు. గార్గ్ అతని గోత్రనామం. తల్లి గాయని కావడం, తండ్రి కవి కావడంతో వారిద్దరి అంశతో వాగ్గేయకారుడు అయ్యాడు. క్షణాల్లో పాట కట్టి పాడగలడు. అందులో అస్సామీ సంస్కృతిని చూపిస్తాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ తదితర భాషల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాల స్థానిక భాషల్లో కూడా పాడాడు.సింగపూర్లో జరుగుతున్న నార్త్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబిన్ సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. అతని పార్థివదేహం భారత్కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు అతన్ని ఆఖరిసారి చూసేందుకు ఎయిర్ పోర్ట్కు తరలి వచ్చారు. సెప్టెంబర్ 23న జరిగిన అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అతని స్మారక స్థూపం కోసం మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.అతని ప్రేమకథజుబీన్ గార్గ్కు వేలాది మంది అమ్మాయిలు ఫాన్స్గా ఉన్నారు. వారిలో ఒకమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గరిమా సైకియా. జుబిన్ ఆల్బమ్స్ ‘అనామిక’, ‘మాయ’ విని గరిమ ఆయనకు అభిమానిగా మారారు. ఆ సమయంలో ఆమె ముంబయిలో ఉన్నారు. ఇంటి నుంచి దూరంగా ఉంటూ, హోమ్సిక్ అనుభవిస్తున్న ఆమెకు ఆ పాటలు ప్రశాంతతను అందించాయి. తన అభిమానాన్ని ఓ ఉత్తరం రూపంలో రాసి ఆయనకు పంపారు. జుబీన్ తన అభిమానులకు ఎప్పుడూ ప్రత్యుత్తరం రాయలేదు. మొదటిసారి గరిమ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం రాశాడు.వారి ప్రేమకు అక్కడే బీజం పడింది. ఆ తర్వాత కొంతకాలం ఉత్తరాల ద్వారా ప్రేమ బలపడింది. అయితే అన్ని ప్రేమకథల్లాగే వీరి ప్రేమకూ ఆటంకాలు తప్పలేదు. గరిమ కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఆమె తండ్రి ససేమిరా అన్నారు. గరిమ సైతం జుబీన్ ప్రవర్తనతో కొంత విసిగి పోయారు. ఆయనకు దూరంగా ఉండటమే మంచిదని భావించి దూరంగా వెళ్లారు. ఆ తర్వాత జుబీన్ పరిస్థితి తలకిందులైంది.దేని మీదా ఏకాగ్రత నిలవలేదు. ఆ ప్రభావం అతను చేస్తున్న పని మీద పడింది. పాటల్లో పస ఉండటం లేదని అభిమానులు పెదవి విరిచారు. డిప్రెషన్ చుట్టుముట్టింది. ఇదంతా విన్నాక గరిమ మనసు కరిగింది. ఒకరినొకరు విడిచి ఉండలేరని ఇద్దరికీ అర్థమై 2002 ఫిబ్రవరి 4న వివాహం చేసుకున్నారు. 23 ఏళ్లుగా వారి బంధం పటిష్ఠంగా ఉంది. ఉన్నట్టుండి జుబీన్ లేక పోవడాన్ని గరిమ జీర్ణించుకోలేక పోతున్నారు. వారిద్దరి ప్రేమ గురించి తెలిసినవారంతా కన్నీరు పెడుతున్నారు. సమాజం కోసం కలిసి నడిచారుజుబీన్ గార్గ్–గరిమ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ 15 మంది నిరుపేద పిల్లల్ని వారు దత్తత తీసుకొని, వారి ఆలనా పాలనా చూశారు. వీరిలో ‘కాజలి’ అనే పాప వారిద్దరికీ ఎంతో ప్రియమైన బిడ్డ. ఓరోజు జుబీన్ కారులో ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఓ చిన్నారి కనిపించింది. చిన్నవయసులో కూలి పనులు చేస్తూ యజమాని చేత తిట్లు తింటోంది. వెంటనే స్పందించిన జుబీన్ ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. తన బిడ్డగా దత్తత చేసుకున్నారు. అనంతరం ఆ పాపకు చదువు, పోషణ బాధ్యతంతా తానే తీసుకున్నారు. ఈ విషయంలో గరిమ ఆయనకు చేదోడుగా నిలిచారు. అలా తమ వద్దకు వచ్చి చేరిన 15 మంది పిల్లల్ని సొంత తల్లిలా పెంచుతున్నారు. ఇది మాత్రమే కాదు, అస్సామ్ వరదలు వచ్చినప్పుడు బాధితులకు సాయం అందించారు. కోవిడ్ సమయంలో జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి, తమ ఇంటినే చికిత్సాలయంగా మార్చారు. ఎంతోమందికి వ్యక్తిగతంగా సాయం అందించారు. తన కళతోనే కాక, తన మంచి గుణాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జుబీన్ లేరన్న విషాద వార్త అందర్నీ కలచివేసింది. మళ్లీ అలాంటి వ్యక్తి పుట్టబోరంటూ ఆయన అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
జుబీన్ కడసారి చూపునకు లక్షలాదిగా జనం
గౌహతి: ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ కడసారి చూపు కోసం ఆదివారం అసోంలోని గౌహతికి లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఉదయానికే అక్కడికి చేరుకున్న జనం ఎండ తీవ్రతను, ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాన్ని సైతం జనం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. అభిమానులు జుబీన్ చిత్రాలున్న కటౌట్లను చేబూని, ఆయనకిష్టమైన పాటలు పాడారు. జుబీన్ గార్గ్ శుక్రవారం సింగపూర్లోని సముద్రంలో ఈదుతూ చనిపోవడం తెల్సిందే. సింగపూర్ నుంచి జుబీన్ మృతదేహాన్ని విమానంలో శనివారం అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకువచ్చారు. మరో విమానంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి గౌహతికి మృతదేహం చేరుకుంది. గౌహతి విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని కహిలీపారలో ఉన్న జుబీన్ నివాసం వరకు దారి పొడవునా వేలాది మంది ఆఖరిసారిగా చూసుకునేందుకు రహదారిపైకి చేరారు. దీంతో ఆరు గంటల సమయం పట్టింది. మృతదేహం స్టేడియంకు చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది. అప్పటికే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వేదికపై గాజు శవ పేటికలో ఉంచిన జుబీన్ మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు జనం క్యూ కట్టారు. రాత్రయినా అభిమానుల తాకిడి కొనసాగుతోంది. దీంతో, అభిమానుల సందర్శనార్ధం మృతదేహాన్ని రాత్రంతా అక్కడే ఉంచుతామని, ఉదయం కూడా అక్కడే ఉంటుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తన భర్త కోసం తరలివచి్చన అసంఖ్యాక అభిమానులకు జుబీన్ భార్య, ప్రముఖ డిజైనర్ గరిమ కృతజ్ఞతలు తెలిపారు. -
శోకసంద్రంలో సింగర్ భార్య: ఆ తప్పిదమే ప్రాణాలు తీసింది!
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మికమరణం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.సింగపూర్లో శుక్రవారం జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. అయితే జుబీన్మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లనే అతని చనిపోయినట్టు తెలిపారు. జుబీన్ గార్గ్ను లైఫ్గార్డులు లైఫ్ జాకెట్ ధరించమని కోరినా వినలేదని, ఈ విషయాన్ని జుబీన్ సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తనకు చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించారు. యాచ్ సిబ్బంది , గార్డులు గార్గ్ దానిని ధరించాలని పట్టుబట్టారు. గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించాడు, కానీ కొన్ని సెకన్ల తర్వాత, దాని సైజ్ సరిపోకపోవడంతో అతనికి ఈత కొట్టడం కష్టంగా ఉందని పేర్కొంటూ దానిని తీసివేసాడట. దీంతో గార్గ్తో సహా 18 మంది స్కూబా డైవింగ్ వెళ్లారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించని జుబీన్మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాడు. లైఫ్గార్డ్లు వెంటనే CPR ఇచ్చి, గార్గ్ను సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారని,అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. గాయకుడితో పాటు వచ్చిన వారిని సింగపూర్ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గార్గ్ భార్యకు, కుటుంబానికి సంతాపం తెలిపారు. জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025కన్నీరుమున్నీరుగా భార్యసంగీత పరిశ్రమకు జుబీన్ అందించిన సేవలు, కృషి సాటిలేనిది. హిందీ, బెంగాలీ , అస్సామీ భాషలలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జుబీన్ అభిమాని అయిన గరిమా 2002లో అతణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రమాదంలో జరగకపోయి ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అకాల మరణం అభిమానుల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. జుబీన్ భార్య గరిమా సైకియా శోకం వర్ణనాతీతం. ఆయన పెంపుడుకుక్క కూడా విషణ్ణ వదనంతో కనిపించింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్మీడియాలో అభిమానులను మరింత విషాదంలోకి నెట్టేశాయి. -
సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత
గౌహతి: ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్(52) కన్నుమూశారు. సింగపూర్లో శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు సహచరులు సీపీయూ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ జుబీన్ తుదిశ్వాస విడిచినట్లు నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్కానూ మహంత వెల్లడించారు. ‘యా అలీ’గా ప్రసిద్ధుడైన జుబీన్ గార్గ్ ఈ వేడుకలో పాల్గొనడం కోసమే బుధవారం ఇండియా నుంచి సింగపూర్ చేరుకున్నారు. స్థానికంగా స్థిరపడిన అస్సాం ప్రజలతో కలిసి స్కూబా డైవింగ్ కోసం పడవలో బయలుదేరారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రారంభమైన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మూడు రోజులపాటు జరగాల్సి ఉండగా, జుబీన్ గార్గ్ మృతి నేపథ్యంలో ఈ వేడుకలు రద్దు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. జుబీన్ గార్గ్కు భార్య ఉన్నారు. ఆయన 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించడం గమనార్హం. అస్సామీ భాషలో తన పాటలతో అలరించారు. అనామిక, మోనోర్ నిజానోత్, మాయ, ఆశా, ముజాలిర్ ఎజోనీ సువాలీ తదితర అల్బమ్లు విడుదల చేశారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు. గదర్, దిల్ సే, డోలీ సజా కే రఖ్నా, ఫిజా, కాంటే, జిందగీ తదితర హిందీ చిత్రాల్లో ఆయన తన గళం వినిపించారు. అస్సాం సంస్కృతికి ప్రతీకగా నిలిచారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పలు సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగస్వామి అయ్యారు. కళాగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకున్నారు. గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగంలో ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్లాఘించారు. జుబీన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. జుబీన్ మృతికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!
'ఓ హసీన్దర్ద్దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్చీజ్క్యా హై ఆప్మేరీ జాన్లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!అదే 'మేరా కుఛ్ సామాన్... తుమ్హారే పాస్ పడా హై' సాంగ్ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్ అనే పాట!ఈ పాట లిరిక్స్నిజంగానే పైకి ప్లెయిన్గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!1933లో సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్జాన్లోని ‘ఇన్ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. హెలెన్కోసం ‘పియా తూ అబ్తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్గ్రీన్హిట్సే! ఏ మేరా దిల్ యార్కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్నంబర్స్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా? ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?-శాంతి ఇశాన్ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా) -
దారుణంగా మోసపోయా.. నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు.. సింగర్
సుచీ లీక్స్తో కోలీవుడ్లో వైరలైన వివాదాస్పద సింగర్ సుచిత్ర. గతంలో ఆమె పలువురు స్టార్స్పై తీవ్రమైన ఆరోపణలు చేసి కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. ఈ వివాదంలోకి హీరో ధనుష్ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సింగర్ సుచిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు కాబోయే భర్త షణ్ముగరాజ్ మోసం చేశాడంటూ ఆరోపించింది. అంతేకాకుండా తన ఇంటితో పాటు డబ్బులను లాక్కున్నాడని వీడియోను రిలీజ్ చేసింది. అతనితో తనకు నిశ్చితార్థం అయిందని.. ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహ హింసకు అనుభవించానని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. షణ్ముగరాజ్ పెద్ద మోసగాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.గతంలో తనను చెన్నై నుంచి వెళ్లగొట్టారని సింగర్ సుచిత్ర పోస్ట్ చేసింది. అందుకే ముంబైకి వెళ్లి ఉద్యోగం దొరికిన తర్వాత అక్కడే స్థిరపడినట్లు తెలిపింది. సుచీ లీక్స్ వివాదం తర్వాత.. నా జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రావని అనుకున్నా.. కానీ మళ్లీ నా లైఫ్లో అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నేను 48 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాను.. నా జీవితంలో ఎప్పుడూ జరగకూడదనుకున్నవన్నీ జరిగాయని బాధను వ్యక్తం చేసింది. ఈ వయసులో గృహ హింసను ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అతను ఒక రెజ్లర్ లాగా కొట్టేవాడని.. నన్ను బూట్లతో తన్నేవాడని.. ఒక రోజంతా ఏడుస్తూ మూలన కూర్చున్నేదాన్ని అని వాపోయింది.అతను తన మొదటి భార్య కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనేవారని సింగర్ తెలిపింది. కానీ అతను విడాకులు తీసుకోలేదని నాకు తరువాత తెలిసిందని.. ఈ విషయంలో తనతో అబద్ధం చెప్పాడని వెల్లడించింది. ఒక రోజు అతని మొదటి భార్య వచ్చి అతన్ని విడిచి పెట్టాలని నన్ను వేడుకుందని వీడియోలో మాట్లాడింది. నేను నిజంగా ప్రేమలో పడడం వల్లే డబ్బులు ఇచ్చానని.. లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేదాన్నికాదని.. నా ప్రతి పైసా తిరిగి చెల్లించే వరకు పోరాడతానని అంటోంది సుచిత్ర. మరో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అతని ఫోటో, ఆధార్ కార్డుతో సహా వివరాలను పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suchi (@suchislife_official) -
సింగర్తో తిరుమలకు జయం రవి.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు. తాజాగా తిరుమలలో సందడి చేశారు.జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. జయం రవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్ను చెన్నైలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన 'కరాటే బాబు', సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతో రూమర్స్ మరింత ఊహందుకున్నాయి.ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో తమిళ హీరో జయం రవి (రవి మోహన్), సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. @iam_RaviMohan @kenishaafrancis #tirumala #tirupatiupdates #Tirupati #TTD #jayamravi #RaviMohan #KenishaaFrancis #tamilhero pic.twitter.com/k5K8tLXKLZ— Tirupati Updates (@TirupatiUpdates) August 25, 2025 -
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
-
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే యువతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రాహుల్ జంట డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత..కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వేదికపై రాహుల్.. కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్బ్యాగ్ను బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా రాహుల్ కన్యాకుమారి వెళ్లాడు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.సింగర్గా..1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తిని తండ్రి గమనించాడు. గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూ, మరోపక్క తండ్రికి బార్బర్ షాప్లో సాయం చేసేవాడు. రానురానూ కోరస్ పాడే అవకాశాలొచ్చాయి. జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా పాట పాడే అవకాశం వచ్చింది. వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్ సాంగ్, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సాంగ్స్ పాడాడు. యూట్యూబ్లో మంగమ్మ, పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా అనేక ప్రైవేట్ సాంగ్స్తో తెగ వైరల్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్లో పాడిన నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Flashoot (@weareflashoot) చదవండి: కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు -
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)
-
గ్రాండ్గా మధు ప్రియ సిస్టర్ పెళ్లి వేడుక.. ఫోటోలు పంచుకున్న సింగర్!
టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్ ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేసింది సింగర్. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.కాగా.. సింగర్ మధు ప్రియ తన సిస్టర్ శృతి ప్రియ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వేడుక వరకు తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది. నిశ్చితార్థం వేడుక రోజు ఫోటోలను అభిమానులతో పంచుకుంది.కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Ramu Rathod (@ramurathod__official) -
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే తాను దగ్గరుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయారు. తాజాగా తన చెల్లెలు శ్రుతిప్రియ పెళ్లి వేడుక సంబురాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ నిర్వహించిన హల్దీ వేడుక వీడియోలను పోస్ట్ చేశారు. చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.(ఇది చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్)కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. అయితే 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
ప్రముఖ సింగర్పై వైద్యురాలి ఫిర్యాదు.. ఇన్స్టాతో పరిచయం ఆపై..
మలయాళంలో ప్రముఖ ర్యాపర్ వేదన్ (Vedan)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ వైద్యురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదుచేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు వివిధ ప్రదేశాలలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు వేదన్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది. త్రిక్కకర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో మాదకద్రవ్యాల కేసులో వేదన్ అరెస్టు అయి, బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. అతని అపార్ట్మెంట్లో గంజాయి, రూ.9 లక్షల నగదును గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై చిరుత దంతాలతో తయారైన గొలుసు కూడా అతని వద్ద ఉండటంతో అటవీ శాఖ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఇన్ని కేసులు ఉండగా ఒక వైద్యురాలు అతని ట్రాప్లో ఎలా చిక్కుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019లో “Voice of the Voiceless” అనే ఆల్బమ్తో కేరళలో బాగా ప్రాచుర్యం పొందాడు. సామాజిక అంశాలపై గళమెత్తిన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. -
యాక్సిడెంట్.. పక్షవాతం రావొచ్చన్నారు, అప్పుడు తమన్..: సింగర్ సాకేత్
సిత్తరాల సిరపడు, దిమాక్ ఖరాబ్.. వంటి పాటలతో సెన్సేషన్ అయ్యాడు సింగర్ సాకేత్ (Singer Saketh Komanduri). ఎప్పుడూ చలాకీగా ఉంటూ, హుషారుగా పాటలు పాడే సాకేత్కు గతంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానంటూ ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు. సింగర్ సాకేత్ మాట్లాడుతూ.. శ్రీరామనవమిరోజు భద్రాచలంలో ఓ షోకి వెళ్లినప్పుడు పట్టపగలే రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఇండికేటర్ వేయకుండా సడన్గా టర్న్ తీసుకుంది.యాక్సిడెంట్దాన్ని తప్పించుకోవడానికి మా కారుని కుడివైపు తిప్పాం. హమ్మయ్య అనుకునేలోపు ఎదురుగా మరో కారు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చెల్లి కాలు ఫ్రాక్చర్ అయింది, నా వెన్నెముకకు బలమైన గాయం తగిలింది. అక్కడ దగ్గర్లో ఆస్పత్రికి వెళ్తే నా కండీషన్ చూసి హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. పక్షవాతం కూడా రావొచ్చేమోనని చెప్పారు. సింగర్ శ్రీకృష్ణ అన్నకు ఫోన్ చేసి.. మా ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది, రాలేము. వేరే సింగర్స్ను షోకి పంపించమన్నాను.తమన్ నా వెంటే ఉండి..ఆయన ఉన్నచోట ఉండక తన పక్కనే ఉన్న తమన్కు విషయం చెప్పాడు. వెంటనే అతడు తన కంపోజింగ్ మధ్యలో ఆపేసి ఆస్పత్రికి వచ్చారు. హాస్పిటల్లో తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఎటువంటి సమస్యా లేదన్న తర్వాత రాత్రి 10.30 గంటలకు వెళ్లిపోయారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా వారంరోజులపాటు బెడ్పైనే ఉన్నాను. లేచి నిలబడలేకపోయాను. అప్పుడు నాకు పెద్ద హోటల్ నుంచి కొన్నిరోజులపాటు కిచిడీ తెప్పించారు.బిగ్బాస్కి వెళ్తా..మనసు బాగోలేదని చెప్తే ఐదు నిమిషాల్లో గోవా టికెట్లు బుక్ చేశారు. వీల్చైర్లోనే గోవా వెళ్లాను. బీచ్ చూసుకుంటూ కొంత ప్రశాంతంగా గడిపాను. అందుకే తమన్ అంటే నాకు అభిమానం, ఇష్టం అని పేర్కొన్నాడు. ఇక బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఎంట్రీ ఇస్తున్నావా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. వెళ్లను అని చెప్పను, వెళ్తున్నా అని కూడా చెప్పను. ప్రస్తుతానికైతే బిగ్బాస్ 9వ సీజన్కు వెళ్లడం లేదు. కానీ, ఎప్పుడో ఒకసారి తప్పకుండా వెళ్తా.. కెరీర్లో ఇంకో అడుగు ముందుకు వేశాక బిగ్బాస్ గురించి ఆలోచిస్తాను అని సింగర్ సాకేత్ చెప్పుకొచ్చాడు.చదవండి: రైలు కింద పడేందుకు ట్రై చేసిన హీరోయిన్.. కాపాడిందెవరంటే? -
కేన్సర్తో కన్నుమూసిన నటి, ప్రముఖ గాయని, కన్నీటి సంద్రంలో అభిమానులు
ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్ పోరాడి, పోరాడి తనువు చాలించింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 50 ఏళ్ల వయసులో పేగు క్యాన్సర్ తో పోరాడి, చికిత్స పొందుతూ,న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురుప్రముఖుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.ప్రేటా గిల్ బ్రెజిలియన్ సంగీత పరిశ్రమలో పేరుగాంచిన మహిళ ప్రెటా. 2023 జనవరిలో ఆమెకు పేగు కేన్సర్ నిర్ధారణ అయింది. కేన్సర్తో పోరాటం గురించి బహిరంగంగా చర్చించేది. రెండేళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, కఠినమైన తన పోరాటంలో అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. 2024లో శస్త్రచికిత్స జరిగింది.కణితిని, గర్భాశయాన్ని కూడా తొలగించారు. కీమోథెరపీ , రేడియోథెరపీతో చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా, చాలా ఆశావహ దృక్పథంలో ఉండేది. తన పోరాటంలో అనేక సవాళ్ల గురించి ఆత్మస్థైర్యంతో మాట్లాడేది. తద్వారా తనలాంటి కేన్సర్ రోగులకు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేది.సంగీత కారుడు, రాజకీయవేత్త గిల్బర్టో గిల్ కుమార్తెప్రేటా. 'ప్రేటా' అంటే పోర్చుగీస్ భాషలో 'నలుపు' అని అర్థం. తన కుమార్తెకు ఈ పేరు పెట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాడట.గిల్బర్టో గిల్ తన కుమార్తె ప్రేటా గిల్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.lutou até o fim. tentou, foi forte, foi guerreira. lidou com abandono, traição em plena descoberta da doença e em nenhum momento parou de sorrir. descanse em paz, preta gil. você é amor 🤍 pic.twitter.com/T6ddwBpPcY— mari (@ahcamilas) July 20, 2025 పేగు కేన్సర్, లేదా పెద్ద పేగు కేన్సర్, పెద్దప్రేగు లేదా మలనాళంలో ఏర్పడే కేన్సర్. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది, కానీ ఇటీవల యువతలో కూడా ఈ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.లక్షణాలు:మలంలో రక్తంమలబద్ధకం లేదా అతిసారం వంటి ప్రేగు అలవాట్లలో మార్పుబలహీనత, అలసట, బరువు తగ్గడంకడుపు నొప్పి, తిమ్మిరి, లేదా ఉబ్బరంపేగు కదలిక తర్వాత ప్రేగులు పూర్తిగా ఖాళీ అవ్వడం లేదనే భావన కారణాలు: 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.పేగు కేన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం.శారీరక శ్రమ లేకపోవడం.సిగరెట్లు, మద్యపానం. -
ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్బర్డ్స్ ప్రేమ, ప్రపోజల్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు. ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని అమేయా ఇలా వివరించారు. అజయ్ భాయ్ పిరమల్, స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు. "రేపు మీరు మహాబలేశ్వర్ రావాలి అని రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్హౌస్లో ఉంటారు. వారికోసం బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే థీమ్పై ఒక కచేరీ చేయాలి’ అని అడిగారు. ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ కుటుంబాల కలయిక కాబట్టి, బాలీవుడ్ కూడా పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు. అన్నట్టు, వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ వాళ్ల ఫ్యావరెట్ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.సింగర్ : అమేయ డబ్లీకానీ ఈ వేడుకు ఆనంద్, ఇషాల ప్రపోజల్గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్, ఇషా ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 2016 నుంచి డేటింగ్లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన పిరమల్ ఎంటర్ప్రైజెస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా ఉన్నారు.ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది! -
స్వరాల తోటలో...ఎవరీ గిని
ఇండియన్ పాప్లో తనదైన స్టైల్ సృష్టించుకొని దూసుకు పోతోంది పందొమ్మిది సంవత్సరాల గిని. ‘ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్’గా కూడా ప్రశంసలు అందు కుంటోంది.... తండ్రి ఉద్యోగ రీత్యా, గిని కుటుంబం ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండేది కాదు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆమెతో స్థిరంగా ఉన్నది మాత్రం సంగీతమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నప్పుడు కుటుంబం మొత్తం కారులో వెళ్లేది. కారులో నాన్స్టాప్గా మ్యూజిక్ ప్లే అయ్యేది. భూపెన్ హజారిక నుంచి హరిహరన్ వరకు ఎంతో అద్భుతమైన గొంతులను వినే అవకాశం వచ్చేది. View this post on Instagram A post shared by Molfa Music (@molfamusic) కారు బ్యాక్ సీట్లో కూర్చున్న గిని పాట ప్లే అవుతున్నప్పుడు వారితో గొంతు కలిపేది. అలాపాటలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత గానం ప్రాణమై పోయింది. మొదట్లో ప్రముఖ గాయకులను అనుకరించినా, ఆ తరువాత మాత్రం గానంలో తనదైన శైలిని సృష్టించుకుంది. కాలిగ్రఫీ, ఒరిగామి, గుర్రపు స్వారీ, కోడింగ్... ఏదైనా సరే, నేర్చుకోవాలనే ఆలోచన వస్తే పట్టుదలగా నేర్చుకునేది. యూట్యూట్ వీడియోలు చూస్తూ గిటారు ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాయడంలో, కంపోజ్ చేయడంలో తన టాలెంట్ నిరూపించుకుంది. -
మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి (Ravuri Sravana Bhargavi)- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.తప్పు చేస్తున్నామా?తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.హేమచంద్రతో ప్రేమపెళ్లిటాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. ‘గబ్బర్సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిలింలో జంటగానూ నటించారు.చదవండి: రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న నటుడు -
'అమేయ డబ్లి' పాన్ ఇండియా టూర్.
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్తో పాటు భారత్లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. ప్రదర్శనలో 25 శాతం వారికే.. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. అనాది నుంచి హైదరాబాద్కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది. – సింగర్ అమేయ డబ్లి -
స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?
స్టార్ సింగర్ కేఎస్ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ (10వ సీజన్) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్ ప్రవస్తి. తన ఎలిమినేషన్ ఎపిసోడ్కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ, రీసెంట్గా ఆ ఎలిమినేషన్కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవగా.. అందులో ముగ్గురు జడ్జిలు (సునీత, చంద్రబోస్, కీరవాణి) చప్పట్లు కొడుతూ కనిపించారు.ఇంత అనైతికంగా..దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్ చూసి చాలా షాకయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్లు చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదు. ఎడిట్ చేస్తారని తెలుసు. ఎలాగంటే అక్కడక్కడా ముక్కలు అతికిస్తారనుకున్నా.. కానీ, ఇంత అన్ప్రొఫెషనల్గా చేస్తారని మాత్రం ఊహించలేదు.మోసం చేయొచ్చనిమీరే చాలామంది రియలైజ్ అయి నాకు మెసేజ్లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే.. చాలా ఎడిట్ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధనిపించింది. నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడమ్ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్ సర్ లేనే లేరు. కీరవాణి సార్.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. అది ఎడిటింగ్లో లేపేశారు.ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో..కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్ చేశారు? అనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎలిమినేట్ అవడమే బెటర్ఎందుకంటే, ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్ అవడమే బెటర్ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆరోజే నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్ చేయలేదు. ద్వేషం లేదుసేవ్ అయినవాళ్లను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్ అయ్యాం అని గిల్ట్ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై నాకెలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్లకు నచ్చినవారే గెలుస్తారు అని చెప్పుకొచ్చింది. చదవండి: క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్! -
ప్రముఖ సింగర్కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ది క్రియేటివ్ స్కూల్లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రకటించారు.కాగా.. పంజాబ్కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది 'చమ్కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు. -
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
సంగీత ప్రపంచంలో గాయణీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ‘గాన కోకిల’లకు మంచి డిమాండ్ ఉంది. మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్లు, ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్పై ఓ లుక్కేద్దాం.1. శ్రేయా ఘోషాల్: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీ శ్రేయా ఘోషాల్. ఈమె ఒక్కో పాటకు సుమారు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్లకు రూ. 40-45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 'బర్సో రే', 'దేవసేనా' వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకీ..(పుష్ప 2), హైలోస్సో..(తండేల్), నానా హైరానా..(గేమ్ ఛేంజర్) లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి.. తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.2. సునిధి చౌహాన్సునిధి ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారట. నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ఢూమ్ మచాలే', 'బీడీ జలైలే' వంటి పాటలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు.ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయ్ సినిమాలో ఆమె ఆలపించిన ‘సరదాగా చందమామనే..’ పాట సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు.3. కనికా కపూర్ బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు 18-22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుదని సమాచారం.4. నేహా కక్కర్యూత్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్. ఆమె ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్లకు రూ. 25-30 లక్షలు తీసుకుంటారు. 'మైల్ హో తుమ్', 'గర్మీ' వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్తో ఆమె ట్రెండ్సెట్టర్గా మారారు.5. అల్కా యాగ్నిక్: 90లో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు. 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీఛే' వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు6. నీతి మోహన్బాలీవుడ్ ప్రముఖ సింగర్స్లో నీతి మోహన్ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8-10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది.7. తులసి కుమార్మెలోడీ సాంగ్స్తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు. 'తుమ్ జో ఆయే', 'లవ్ హో గయా' వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు.8. ఆషా భోస్లేదిగ్గజ గాయనీమణి ఆషా ఒక్కో పాటకు రూ.5-8 లక్షలు, ఈవెంట్లకు రూ. 10-15 లక్షలు ఛార్జ్ చేస్తారు. 'దమ్ మారో దమ్', 'పియా తు అబ్ తో ఆజా' వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది.9. శిల్పారావుతనగాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు 5-10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవర సినిమాలో ‘చుట్టమల్లే..’, జైలర్ లో కావాలయ్యా అనే పాట పాడింది ఈ సింగరే.10. మోనాలీ ఠాకూర్బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఒక్కో పాటకు రూ.5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు. 'జరా జరా టచ్ మీ', 'సావర్లూన్' వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు. -
Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. సడన్గా ఎందుకీ మార్పు?మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ప్రమాదాలే గుర్తు చేస్తాయిఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమించండివారిని ఎంత స్పెషల్గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.విమానయానం విషాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. View this post on Instagram A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా ప్రభంజనం..
ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని తన రాప్ సింగింగ్ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్ సింగర్ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్ షోస్ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్ అయ్యి పేరు సంపాదించారు. ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.గిరిజన కోయిలమాహి పూర్తి పేరు మధుర యశ్వంత్ ఘనె. అయితే ర్యాపర్గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్ కండెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు. వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్ పాడే ర్యాప్ సాంగ్స్ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.అడవి పాట ఇచ్చిందికోవిడ్ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.హక్కుల కోసం పాటమాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్యూ స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి. ‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్ తక్... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
సింగర్గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ
నటి దేవయాని (50) చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్ ఇండియాలో పాపులర్ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్, టీ రాజేందర్, కార్తీక్ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్లో మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్లో ఆమె నటించనున్నారు. View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh) -
జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది. -
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
అద్నాన్ సమీ (Adnan Sami).. పాకిస్తాన్ ఈ సింగర్ స్వదేశాన్ని కాదనుకుని భారత్పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.తల్లి చనిపోయిందని తెలిసినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్ పాక్లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్ అందుకు అంగీకరించినా.. పాక్ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.భారత్ సొంతిల్లుగా ఎలా మారిందంటే?1998లో నేను కొన్ని పాటలు రిలీజ్ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.ఆమె సలహా వల్లే..సింగర్ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్లో రికార్డ్ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్లో వర్కవుట్ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.కెరీర్..అద్నాన్ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్ దాదా ఎంబీబీఎస్), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్ ఆలపించాడు.చదవండి: రీరిలీజ్లో ఆల్టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ! -
రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు జన్మించారు. మా రెండో బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు.ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు అభినందనలు చెబుతున్నారు. దియా మీర్జా, అదితి శర్మతో పాటు పలువురు సినీతారలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. 13 ఏళ్ల క్రిత జాంకీ పరేఖ్.. నకుల్ మెహతాను పెళ్లాడింది.బుల్లితెర నటుడైన నకుల్ మెహతా 'ఇష్క్బాజ్', 'బడే అచ్చే లగ్తే హై 2' వంటి ప్రముఖ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బుల్లితెర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నకుల్ మెహతా నటించారు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) -
జయం రవి విడాకుల కేసు.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన సింగర్!
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. అయితే ఇటీవలే జయం రవి భార్య ఆర్తి పలు ఆరోపణలు చేసింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోవాల్సి వస్తోందని ఓ లేఖను విడుదల చేసింది. ఎందుకంటే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్లో ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది.అయితే ఇటీవల తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు అలాంటి సందేశాలు పంపుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు ఆమె టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.కెనీషా పరువుకు భంగం కలిగించేలా సందేశాలు పంపినా, బెదిరించినా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన సందేశాల వల్ల ఆమె మానసికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అలాంటి మెసేజ్లు పంపితే ఆ స్క్రీన్షాట్లను ఆధారంగా చేసుకొని నోటీసులు పంపుతామని వెల్లడించింది. ఇలాంటి పనులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పంపే నోటీసులను సింగర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) -
ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..
ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. సేఫ్టీ, దృఢమైన నిర్మాణం వంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడుతుంటారు. కానీ.. పంజాబీ సింగర్ అండ్ యాక్టర్ 'గిప్పీ గ్రెవాల్' (Gippy Grewal) మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు.నిరాశ కలిగించే ఎక్స్పీరియన్స్ అంటూ.. ''దయచేసి సాయం చేయండి అని మహీంద్రా రైస్, ఆనంద్ మహీంద్రాలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నా టీమ్ కోసం రెండు స్కార్పియో ఎన్ కార్లను కొనుగోలు చేసాను. అయితే వాటిలో ఎప్పుడూ టెక్నీకల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూనే ఉన్నాయి. డీలర్షిప్ సిబ్బంది కూడా సరైన పరిష్కారం చూపించడం లేదు'' అని రెండు స్క్రీన్షాట్లను షేర్ చేశారు.నేను ఇండియన్ బ్రాండ్కు పెద్ద అభిమానిని. ఈ కారణం చేతనే రెండు 'స్కార్పియో ఎన్' కార్లను కొనుగోలు చేసాను. కార్లలో సమస్యలు తలెత్తినప్పుడు.. సర్వీస్ సెంటర్కు తీసుకెళ్తే, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సర్వీస్ సెంటర్కు వాహనాలు ఎన్నిసార్లు వచ్చాయో చూపించడానికి డీలర్షిప్ తమ వాహనాల ఎంట్రీ & ఎగ్జిట్ లాగ్ల కాపీని ఇవ్వడానికి కూడా నిరాకరించిందని సింగర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..మొదటి వాహనంలో.. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది, తరచుగా ఫోన్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. డీలర్షిప్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. రెండవ వాహనం కూడా ఇలాంటి సమస్యలే.. బూట్ స్పేస్ కూడా సమస్య కూడా ఉంది. ఇది తయారీ లోపం కావచ్చని గిప్పీ గ్రేవాల్ మెయిల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించలేదు. తప్పకుండా తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.Disappointing experience @MahindraRise @anandmahindra, please help, Bought 2 Scorpio-Ns for my team, but facing persistent tech issues & poor dealership experience. Requesting immediate resolution & investigation into Raj Vehicles, Mohali. @MahindraScorpio Mail Screenshot… pic.twitter.com/TJ7ZVWDPbs— Gippy Grewal (@GippyGrewal) May 23, 2025 -
నాట్య కళాకారిణితో ర్యాప్ సింగర్ పెళ్లి..
సౌత్ ఇండియా గాయకుడు విఘ్నేశ్ త్వరలో పెల్లి చేసుకోనున్నాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో పలు సాంగ్స్తో గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన సంగీత దర్శకుడు, గీత రచయిత కూడా.. ముఖ్యంగా ర్యాప్ పాటల సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళంలో హారీష్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు.అదే విధంగా డి.ఇమాన్,సత్య సీ, తమన్, శ్యామ్ సీఎస్ జస్టిన్ ప్రభాకరన్ వంటి సంగీత దర్శకుల చిత్రాలకు సౌండ్ ట్రాక్స్ పాడారు. ముఖ్యంగా విఘ్నేశ్ తెలుగులో చాలా పాటలు పాడారు. కాగా ఈయనకు ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. శ్వేత ఆనంద్ అనే భరత నాట్య కళాకారిణిని వివాహమాడబోతున్నారు. ఈమె చెన్నైలో పుట్టి, కెనడాలో నివశిస్తున్న భారతీయ సంతతికి చెందిన యువతి అన్నది గమనార్హం. శ్వేత ఆనంద్ భరతనాట్య కళాకారిణి మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్, గాయనీ,మృదంగ కళాకారిణి, వయోలిస్ట్ కూడా. కాగా విఘ్నేశ్, శ్వేత ఆనంద్ల వివాహం జూన్ నెల 5న చైన్నె సముద్రతీరంలోని దక్షిణ చిత్ర సాంస్కృతిక కళా ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది. -
మూడేళ్లుగా డేటింగ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కకర్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్గానే ఉంచుతానని సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది.వచ్చే ఏడాదిలో తామిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ప్రకృతి కాకర్ వెల్లడించింది. తన కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందినవారు కాదు.. అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతాడని తెలిపింది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని.. అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని పేర్కొంది. తమ రిలేషన్ను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నట్లు సింగర్ వివరించింది.తన ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. "మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు కావడానికి లండన్ వెళ్లాం. అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసిన వేడుకలో నాకు ప్రపోజ్ చేశారు. మా బంధువుల వివాహంలో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని నా సిస్టర్స్తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు. నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడూ కలలు కనే విషయం.. చాలా అద్భుతంగా జరిగింది,' అని తెలిపింది. -
కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)
-
జాక్పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.కాగా.. సింగర్ రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్లో రాణిస్తున్నారు. అతని కెరీర్లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్బాస్ సీజన్ -14 రన్నరప్గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్పై పదుల సంఖ్యలో కేసులు
లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్ సింగర్పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్ విషాదంపై కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్పై చర్యలకు సిద్దమైంది. -
పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
పాకిస్తానీయులు భారత్ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని కేంద్రం రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురూ తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్కు పయనమైపోయారు. అది సరే.. మరి బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) వంతు ఎప్పుడంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు.ఈ దద్దమ్మకెలా అర్థమవుతుంది?దశాబ్దం క్రితమే భారతీయ పౌరసత్వం తీసుకున్న అద్నాన్ సమీ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఈ చదువురాని దద్దమ్మకు ఎవరు చెప్తే అర్థమవుతుంది? అని కౌంటర్ ఇచ్చాడు. అద్నాన్ సమీ పేరెంట్స్ పాకిస్తానీయులు. వీరు ఇంగ్లాండ్లో సెటిలయ్యారు. అద్నాన్ సమీ అక్కడే పుట్టి పెరిగాడు. తర్వాత భారత్కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. 2015 డిసెంబర్లో భారత పౌరసత్వం తీసుకున్నాడు. ఈ విషయంలో తనను చాలామంది ట్రోల్ చేశారంటూ.. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.మతం మార్చేస్తారు!అద్నాన్ సమీ మాట్లాడుతూ.. నువ్వు భారతీయుడివి అయిపోయావా? అయితే నీ మతం కూడా మార్చేస్తారు. ఇక నువ్వు ఏ స్వామివో అయిపోవాల్సిందే అంటూ నానారకాలుగా కామెంట్లు చేసేవారు. వాళ్లన్న మాటలే నిజమైతే.. అమెరికాలో ఉన్న పాక్ ప్రజలందరూ క్రిస్టియన్లు అయిపోవాలి లేదా ఇంగ్లాండ్లో ఉన్నవాళ్లందరూ నిరసనకారులుగా మారిపోవాలి. నేను మతం మారాలని చెప్పడానికి వాళ్లెవరు? దేశం మారితే మతం మారాలన్న రూల్ ఏం లేదు' అని చెప్పుకొచ్చాడు.సినిమాఅద్నాన్ సమీ.. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్, ఏ రాస్తే హై ప్యార్ కే, ఢమాల్, 1920, ఛాన్స్ పె డ్యాన్స్, ముంబై సాల్సా, ఖుబ్సూరత్, శౌర్య చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశాడు. Who’s going to tell this illiterate idiot!!😂 https://t.co/OoH4w5iPQ3— Adnan Sami (@AdnanSamiLive) April 25, 2025 చదవండి: 30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్బాస్ విన్నర్ -
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్ కెరీర్కు ఫుల్స్టాప్తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్.టాలెంట్తోనే ఆన్సర్..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పాడా.. బెస్ట్ పర్ఫామెన్స్ గెలుచుకున్నా! ఛాలెంజ్లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్ గురించి మేనేజ్మెంట్ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్ అన్నారు.నాకు ఛాన్స్ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్ ఇచ్చింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్తో కలిసి వెనకాల కోరస్ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే -
ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే చితకబాదేవాడిని!
అభిమానులతో సెల్ఫీలు దిగుతారు, ఆటోగ్రాఫ్లు ఇస్తారు.. కానీ ఈ సింగర్ మాత్రం ఏకంగా వారికి ముద్దులు పెట్టేశాడు. అతడే ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్. ఆ మధ్య ఈయన ఓ షోలో.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన మహిళా అభిమానులకు ముద్దులు పెట్టడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంపై సింగర్ అమిత్ టండన్ (Amit Tandon) స్పందిస్తూ.. ఉదిత్కు వయసుతో పాటు వంకర బుద్ధి కూడా పెరిగిందని వ్యాఖ్యానించాడు.ఆయనది వక్రబుద్ధిఅమిత్ మాట్లాడుతూ.. ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయనకు వంకర బుద్ధి ఉంది. ఇలా చెప్పొచ్చే, లేదో నాకు తెలీదు కానీ, ఏ పరిస్థితినైనా ఆయన అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. నేను కూడా చాలా షోలు చేశాను. అభిమానులు నాకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించేవారు. వారిని మనం ఎంత దగ్గరకు రానివ్వాలి? ఎక్కడ ఉంచాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే లిమిట్లోనే ఉండాలి.హద్దుల్లో ఉంటే బెటర్ఒకవేళ నేనే గనక నా ప్రియురాలు లేదా భార్యతో అతడి షోకు వెళ్లాననుకోండి. నా పార్ట్నర్ ఆయనతో ఫోటో తీసుకుంటుంటే దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని ముద్దు పెడితే మాత్రం ఊరుకునేవాడిని కాదు. కచ్చితంగా అతడిని చితకబాదేవాడిని. అయితే గాయకుడిగా మాత్రం నాకు ఆయనపై విపరీతమైన గౌరవం ఉంది. కాకపోతే మనకంటూ కొన్ని పరిమితులు గీసుకుంటే మంచిది. హద్దులు దాటకుండా ఉంటేనే అందరికీ ఉత్తమం.తండ్రి అలా.. కొడుక్కేమో యాటిట్యూడ్ఉదిత్ కుమారుడు అదిత్ నారాయణ్ ఓ షోలో జనాలపైకి మైక్ విసరడం చూశాను. ఏదేమైనా సరే హుందాగా ప్రవర్తించాలే తప్ప ఇలా యాటిట్యూడ్ చూపించకూడదు. అదిత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు.. బహుశా అతడు మంచివాడు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో చూస్తున్న విజువల్స్లో మాత్రం తనకు యాటిట్యూడ్ ఉందని ఇట్టే అర్థమవుతోంది అని అమిత్ చెప్పుకొచ్చాడు.చదవండి: పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్ -
ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!
-
ఎలిమినేట్ అయినందుకే ఆరోపణలు చేస్తున్నారా..?
-
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
సింగర్ ప్రవస్తి చేసిన సంచలన ఆరోపణలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత స్పందించారు. పాడుతా తీయగా సింగింగ్ షో సమయంలో తనను మెంటల్గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. సునీతతో పాటు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్పై కూడా విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత ఈ అంశంపై మాట్లాడారు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వ్యక్తిత్వం అనేది ఇలాంటి రూమర్స్పై నిర్మించబడలేదు..అంతేకాదు వాటి వల్ల మన ఖ్యాతి కూడా దెబ్బతినదు.. ఊహాగానాల కంటే నిజం గెలుస్తుందని మేము నమ్మకంగా ఉన్నామని పోస్ట్ చేసింది.సునీత మాట్లాడుతూ..'నమస్కారం. నిన్నంతా ఒకటే చర్చ.. అదే సింగర్ ప్రవస్తి.. రకరకాల ఛానెల్స్లో రకరకాలుగా వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానెల్స్కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. తాను మొత్తానికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఛానెల్స్ వాడిన భాష.. తాను ఎక్స్పోజ్ చేయాలని చేసింది కాబట్టే ఆ పదం వాడాల్సి వస్తోంది. డైరెక్ట్గా సునీత అని నా పేరు చెప్పినందువల్లే ఈ వీడియో చేస్తున్నా. సింగర్ ప్రవస్తి.. నిన్ను అందరిలాగే నేను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. నీకు 19 ఏళ్లు కదా.. ఇప్పుడు నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా? చిన్నప్పుడు చాలా బాగా పాడావ్ అనేకంటే.. చాలా ముద్దుగా పాడావ్? అనేవాళ్లం నీకు గుర్తుందో లేదో? చిన్నప్పుడు పాడినట్టే 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా ప్రణీత, మా గాయత్రి అని మీ పేర్లు ఎక్కువగా చెప్పుకుని మురిసిపోయే పిచ్చివాళ్లం మేము' అని అన్నారు.మీలో ఎవరైనా బాగా పాడితే ఉప్పొంగిపోయి, కన్నీళ్ల పర్యంతమైపోయి ఏడ్చేసినా సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇవన్నీ చూడలేదేమో.. మిస్సయ్యావ్ అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి.. రోడ్డుమీద నిలబడి తన బాధను వెళ్లగక్కుకుని..మా గురించి చర్చించే స్థాయికి ఎదిగిందంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావ్.. ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. పాడుతా తీయగా కాంపీటీషన్ మాత్రమే కాదు.. విభిన్నమైన ఛానెల్స్లో కూడా పాల్గొన్నావ్ కదా? నీకు పద్ధతి గురించి తెలియదా అమ్మా? సింగర్ సెలెక్షన్స్, సింగర్స్ పంపించే పాటల విషయంలో కొన్నింటికీ మాత్రమే రైట్స్ ఉంటాయి. ఈ విషయం నీకు తెలుసో.. తెలియదో నాకు తెలియదు కానీ.. చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి కూడా మాట్లాడు.. ఆ సాంగ్ సెలెక్షన్స్లో ఛానెల్కున్న నిబంధనల గురించి మాట్లాడమ్మా? నేను కూడా సంతోషిస్తాను. ఏ ఛానెల్కైనా మ్యూజిక్ వాడుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అన్ని పాటలకు ఉండదు. సింగర్స్ ఇచ్చే సాంగ్స్ లిస్ట్లో ఎన్నిసార్లు ఆ పాట రిపీట్ అయింది అనేది కూడా యాజమాన్యం చూస్తుంది. ఇదంతా నీకు మళ్లీ వివరిస్తారు. నేను ఏ పాట ఇచ్చినా వాళ్లు వద్దంటున్నారు అనే మాటనే ఎక్కువసార్లు వినిపించావ్. దానికి రీజన్ ఇది అని మీకు తెలియదు కదా? అందుకే నేను చెబుతున్నా. నిన్ను కొరకొరగా చూశానని చెప్పావ్. నిన్ను అలా చూడాల్సిన అవసరమేంటో నాకర్థం లేదు. నేను, కీరవాణీ, చంద్రబోస్ గారు నిన్నే టార్గెట్ చేశారన్నావ్? కనీసం ఆ ఆలోచన కూడా నాకు రావడం లేదు.సునీత మాట్లాడుతూ..' నువ్వు మర్చిపోయిన కొన్ని విషయాలు నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. క్లాసికల్ రౌండ్లో నీ దగ్గరికి వచ్చి మరి అందరి మధ్యలో నీకు మాత్రమే చెప్పాను. నువ్వు పాడేటప్పుడు మృదంగం అటు ఇటు అయినా కూడా అప్సెట్ కావాల్సిన అవసరం లేదమ్మా..నువ్వు ఎలా పాడావో మా అందరికీ తెలుసు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ..మిగిలిన వాళ్లు గుర్తు పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ల పేరు నువ్వు బయటికీ తీస్తున్నావ్ కానీ.. వీళ్లంతా మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి.. నిహాల్ గారు మీకు గురువు.. అష్టలక్ష్మీ స్తోత్రం పాడేటప్పుడు నేను ఒక్కదాన్నే ఆ వీడియో షూట్ చేయొచ్చు తల్లీ.. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావ్ కదా? నువ్వు, మీ మదర్ ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా పంపించాం కదా? అవన్నీ ఎలా మర్చిపోయావ్ తల్లీ? అని ప్రవస్తిని ప్రశ్నించింది.ప్రవస్తి నేను మీ అమ్మగారిని నువ్వు అని సంభోధించినందుకు నీకు బాధేసింది? ఎలిమినేషన్ తర్వాత మీ అమ్మ స్టేజిపైకి వచ్చి.. నీ చేతులో ఉండాల్సిన ట్రోఫీ కాదని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు. నువ్వే మోసం చేశావ్? అని నన్ను మాట్లాడినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అక్కడ అన్ని రికార్డ్ అయ్యాయి. అవన్నీ బయటపెట్టొచ్చు. కానీ మీ అమ్మగారు, నువ్వు ఆవేశంలో ఉన్నారు. అప్పుడు కీరవాణి, చంద్రబోస్ గారు బయటికి వెళ్లిపోయారు. కానీ సునీత గారు నీ ఎలిమినేషన్ చూసేందుకే ఉన్నారని చాలా తప్పు మాట్లాడవమ్మా.. ఎవరైనా ఎలిమినేట్ అయితేనో.. ఎవరన్నా ఓడిపోతేనో సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నువ్వు ఎలిమినేట్ అయితే నేను పార్టీ ఇచ్చానని మాట్లాడుతున్నావ్.. అది నాకర్థం కావడం లేదు. నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను. నువ్వు ఒకదాన్ని ఇంకొదానికి ఆపాదించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఓ పోటీలోనైనా ఒక్కరే గెలుస్తారు. మా గురువులకు మాకు అదే నేర్పించారు. కానీ ఈ జనరేషన్లో మారాల్సి ఉంది. పిల్లలకు తల్లిదండ్రులే మంచి, చెడు నేర్పాలి. ఆ తర్వాతే గురువు. ప్రవస్తి నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా.. కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడు. నేను ఎప్పటికీ నీ మంచినే కోరుకుంటా అంటూ ' సునీత మాట్లాడారు.' View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్.. మూడో భారతీయ సింగర్గా రికార్డు!
మలయాళ ర్యాపర్, సింగర్ హనుమాన్కైండ్ (Hanumankind) సరిహద్దులు దాటుకుని ఇంటర్నేషనల్ లెవల్కు వెళ్లిపోయాడు. అంతర్జాతీయంగా పాపులర్ అయిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్ (Coachella Music and Arts Festival 2025)లో భాగమయ్యాడు. ఇప్పటివరకు ఈ ఉత్సవంలో కేవలం ఇద్దరు భారతీయ సింగర్లు మాత్రమే భాగమయ్యారు. దిల్జిత్ దోసాంజ్, ఏపీ ధిల్లాన్ తర్వాత కోచెల్లాలో భాగమైన మూడో భారతీయ సింగర్గా హనుమాన్కైండ్ రికార్డు సృష్టించాడు. విజయ్ చివరి సినిమా అయిన జననాయగన్లో హనుమాన్కైండ్ ఓ స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.హాలీవుడ్లోనే కెరీర్..అలాగే ఈ సంగీత ఫెస్టివల్లో కె. షానన్ ఎంట్రీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సింగర్ కుమార్ సాను కూతురే షానన్. ఈమె పుట్టింది ముంబైలో అయినా చదివింది, కెరీర్ను కొనసాగిస్తోంది మాత్రం అమెరికాలోనే! హాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు సాంగ్స్ పాడింది. ఆమె పాడిన గివ్ మి యువర్ హ్యాండ్ బిల్బోర్డ్ మ్యాగజైన్లోనూ ప్రదర్శితమైంది. ఇదే పాటను కోచెల్లా ఫెస్టివల్లోనూ ఆలపించి సంగీతప్రియులను ఉత్సాహపరిచింది. కోచెల్లా ఫెస్టివల్ ఏప్రిల్ 20న ముగియనుంది. View this post on Instagram A post shared by hanumankind (@hanumankind) చదవండి: దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే! -
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) -
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) తనయుడు చరణ్ సింగర్ మాత్రమే కాదు నిర్మాత, నటుడు కూడా! ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్: లవ్ యువర్ ఫాదర్. తండ్రిపై ప్రేమతో చరణ్ తన పేరును SPB చరణ్ (SPB Charan)గా మార్చుకున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చరణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో గెలుపు, ఓటమి.. రెండూ చూశాను. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో అనుకుంటాను.. రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఓ సినిమా నిర్మిస్తే అంతా కోల్పోయాను.20 ఏళ్ల కిందటే విడాకులునా కుటుంబ విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఓ అమ్మాయిని ప్రేమించాను. తనను ఇంట్లో పరిచయం చేశాను. అందరి ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు జాహ్నవి, మయూక అని కవలపిల్లలు సంతానం. న్యూయార్క్లో చదువుకుంటున్నారు. తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. నాకు, నా భార్యకు 2005లో విడాకులయ్యాయి. ప్రతి ఏడాది న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా పిల్లలతో కాలక్షేపం చేస్తుంటాను.డిప్రెషన్లోకి వెళ్లిపోయా..అయితే నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నేను కెరీర్లో స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో నాన్నను పనికి పంపించి నువ్వు దున్నపోతులా పడుకుంటున్నావేంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు తగిలాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. అలా సీరియల్ ఆడిషన్కు వెళ్లి అందులో యాక్ట్ చేశాను. అక్కడైన పరిచయాలతో నిర్మాతగా మారిపోయాను.హీరో అజిత్, నేను క్లోజ్..నిజానికి నేను చదువుకునే రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. అదెలాగంటే.. అజిత్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఐదారేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసంత్ ఆశై సినిమా కోసం మా నాన్నను సంప్రదించాడు. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా స్నేహితుడు అజిత్ పేరు సూచించాడు. అలా ఆశై అజిత్ చేయడం.. అది బ్లాక్బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప పెద్దగా టచ్లో లేము అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చాడు.సినిమా పాటలుఎస్పీ చరణ్.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., నేను నేనుగా లేనే.., ఒక తోటలో ఒక కొమ్మలో.., తెలుగు భాష గొప్పదనం, మెల్లగా కరగనీ.., అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే.., చాలు చాలు చాలు.., ఉయ్యాలో ఉయ్యాల.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: గంట లేటైందని సెట్లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్ -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు
సెలబ్రిటీలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కామన్. అలా అని పొరపాటు చేస్తే అభిమానించే వాళ్లు కూడా తిడతారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఇండియన్ స్టార్ సింగర్ కి ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈమెని ఏడిపించేశారు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)హిందీ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్న నేహా కక్కర్ (Neha Kakkar).. 'ఇండియన్ ఐడల్' షోకి జడ్జిగా ఇంకా ఫేమస్. జడ్జిమెంట్ ఇస్తూ అప్పుడప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇదంతా డ్రామా అని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే తాజాగా ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఈమె స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.కాకపోతే సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చి పాటలు పాడింది. అది కూడా గంట మాత్రమే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని షో చూసేందుకు వచ్చిన కొందరు ఈమెని 'గో బ్యాక్' (తిరిగి హోటల్ కి వెళ్లిపో) అని కామెంట్ చేశారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne showShe also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu— Redditbollywood (@redditbollywood) March 24, 2025 -
ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన సింగర్ ‘విద్యా వోక్స్’ (ఫొటోలు)
-
ఐపీఎల్ ఆరంభం.. తెలుగు పాటతో అదరగొట్టిన శ్రేయా ఘోషల్
క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ కొత్త సీజన్ (IPL 2025) మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మొదటగా స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్రసంగించాడు. అనంతరం సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అందరినీ మైమరిపించింది. బ్లాక్బస్టర్ హిందీ సాంగ్స్తో ఆడియన్స్లో జోష్ నింపింది. అలాగే అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ మూవీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ.. పాటను తెలుగులో పాడి అదరగొట్టింది.టాప్ సింగర్..శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. ఈమె ఏ భాషలోనైనా ఇట్టే పాటలు పాడగలదు. తెలుగులో.. నువ్వేం మాయ చేశావో గానీ.. (ఒక్కడు), నమ్మిన నా మది.. (రాఘవేంద్ర), కోపమా నాపైనా.. (వర్షం), నీకోసం నీకోసం..(నేనున్నాను), అందాల శ్రీమతికి (సంక్రాంతికి), పిల్లగాలి అల్లరి (అతడు), జలజలజలపాతం నువ్వు.. (ఉప్పెన), సూసేకి అగ్గిరవ్వమాదిరి (పుష్ప 2), హైలెస్సో హైలెస్సా.. (తండేల్).. ఇలా చెప్పుకుంటూ పోతే వందలకొద్దీ పాటలు పాడింది.చదవండి: నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా -
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్స్టాగ్రామ్లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్ప్రైజ్కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
ఆ గానానికి గమ్యం – శ్రీహరి సన్నిధే!
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు. దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు. పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి -
అసత్య ప్రచారాలు.. మహిళా కమిషన్కు కల్పన ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సింగర్ కల్పన (Kalpana Raghavendar) మహిళా కమిషన్ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. తనపై తప్పుడు ప్రచారం చేసినటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కల్పన ఫిర్యాదుపై నేరెళ్ళ శారద స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్ను హెచ్చరించారు.ఏం జరిగింది?సింగర్ కల్పన ఇటీవల తన ఇంట్లో అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న కల్పన.. తాను చనిపోవడానికి ప్రయత్నించలేదని, కేవలం మంచి నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకున్నానని తెలిపింది. అయితే మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానని, అది భర్త సహకారంతోనే సాధ్యమైందని వివరించింది.చదవండి: అమ్మపై దాడి చేసి రూ.4.50 లక్షల బంగారం దోచేశారు.. నాకు 3 కిలోల బంగారం మిగిల్చింది: సింగర్ కుమారుడు -
కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు
కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది లెజెండరీ సింగర్ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్రాజు పలు సినిమాల్లో డ్యాన్స్మాస్టర్గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్ అయ్యారు.ఏడేళ్లకే గాయనితాజాగా అనిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్ బాలచందర్ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. ఆ మాటలు బాధించేవిఅయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్ అనే గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.3 కిలోల బంగారండ్రైవర్ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.నేను హిజ్రా..నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్స్టిక్ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్కి ఊహించని ఓపెనింగ్స్! -
Journalist Bharadwaj: సింగర్ కల్పన అనుభవిస్తున్న బాధలు
-
కల్పన వ్యవహారం.. పోలీసులకు అసలు విషయం చెప్పిన సింగర్
సింగర్ ఆత్మహత్యాయత్నం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని పోలీసులకు తెలిపింది. కేవలం తన కూతురితో వచ్చిన మనస్పర్థల వల్లే నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిపింది. చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని తన కూతురిని అడిగానని.. తాను రానని చెప్పడంతోనే మనోవేదనకు గురైనట్లు వివరించింది. మనస్తాపంతోనే ట్యాబ్లెట్లు వేసుకున్నానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించింది. దీంతో ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్బీ పోలీసులు ప్రెస్నోట్ విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.కాగా.. అంతకుముందు కల్పన కూతురు కూడా మాట్లాడారు. నా తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు. కేవలం వైద్యుల సూచన మేరకే నిద్రమాత్రలు వేసుకున్నారని పేర్కొన్నారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కల్పనా రాఘవేందర్ క్లారిటీ ఇచ్చింది.అయితే సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే అసలు విషయం ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం కల్పనా తన భర్త దయ ప్రసాద్తో కలిసి నిజాంపేట్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. -
Singer Kalpana: మా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇది
-
Singer Kalpana: కూతురి వల్లే ఆత్మహత్య యత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
-
నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం
-
'దయచేసి ఎవరూ కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు'.. అభిమానులకు సింగర్ విజ్ఞప్తి
ఇటీవల సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో పలువురి సినీతారల అకౌంట్స్ను హ్యాకింగ్ గురైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా సింగర్ వెల్లడించింది. దాదాపు రెండు వారాలైనా తన ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎవరూ కూడా తన ట్విటర్ ఖాతా నుంచి వచ్చే పోస్టులు, లింక్స్ను క్లిక్ చేయొద్దని అభిమానులకు సూచించింది.తన ఇన్స్టాలో శ్రేయా ఘోషల్ రాస్తూ..' నా అభిమానులు, స్నేహితులకు ఒక్కటే విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. దీనిపై ఎక్స్ బృందాన్ని సంప్రదించేందుకు శతవిధాలా ప్రయత్నించా. కానీ ఆటో జనరేటెడ్ రెస్పాన్స్ల ద్వారా నాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. నా ఖాతాను డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయలేకపోతున్నా. కనీసం నా ఖాతా లాగిన్ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్లను ఎవరూ కూడా క్లిక్ చేయొద్దు. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేసేజులు, లింకులను క్లిక్ చేయొద్దు. నా ఖాతా రికవరీ అయిన వెంటనే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా' అని సింగర్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) -
ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ మికా సింగ్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ బీటౌన్లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్లో ఫేమస్ సింగర్గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్ను షారూఖ్ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్ ఖాన్కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు. -
'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్తో కలిసి.. ఎవరీ వైశాలి?
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్ను దాటేందుకు సిద్ధమైంది.ఛావా కోసం కష్టపడ్డ హీరోమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట పాడిందెవరో తెలుసా?ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.మిలియన్ల వ్యూస్ఈ పాట విన్న ఆడియన్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది. చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే? -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ సింగర్.. భార్య పేరును మాత్రం దాచిపెట్టాడు!
ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో కొత్త బంధంలోకి పలువురు సినీతారలు అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ గేయ రచయిత, సింగర్ అనుప్ జైన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబతున్నారు.ప్రముఖ సింగర్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో నూతన వధూవరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న 2025న ఢిల్లీలో జరిగింది. కాగా.. అనువ్ జైన్ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలైన హృది నారంగ్ను వివాహం చేసుకున్నారు. అయితే అనువ్ తన భార్య పేరును మాత్రం ఫోటోల్లో వెల్లడించలేదు. అయితే ఓ అభిమాని మాత్రం ఆమె పేరును కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేశాడు. ఇక నుంచి అనుప్ జైన్ వివాహం చేసుకున్నందున బ్రేకప్ సాంగ్స్ పాడటం ఆపేస్తాడని కొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేశారు.కాగా.. సెప్టెంబర్ 2022లో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనువ్ జైన్.. తాను రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. అనువ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి చాలా దూరంగా ఉంటరు. బాలీవుడ్ పలు చిత్రాలు పాటలు ఆలపించిన అనువ్.. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బారిషేన్, గుల్, అలాగ్ ఆస్మాన్ వంటి పాటలు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. -
స్టైలిష్ లుక్ లో ఫోజులు కొడుతున్నా సింగర్ మంగ్లీ (ఫోటోలు)
-
సింగర్ గీతామాధురి తనయుడి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య
భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, నరక కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మాహుతి చేసుకుంటున్న భార్యాబాధితులెందరో! ఈ మధ్య అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాకటలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్తాన్లో డాక్టర్ అజయ్కుమార్, ఢిల్లీలో పునీత్ ఖురానా.. ఇలా రోజుకో ఉదంతం బయటకు వచ్చింది. విషం తాగి..తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సింగర్, ర్యాపర్ (Odia Rapper) అభినవ్ సింగ్ (Abhinav Singh) చేరినట్లు తెలుస్తోంది.. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్ తండ్రి బిజయ్ నందా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య వేధింపుల వల్లే?దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి అభినవ్.. భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. కాగా అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్తో ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ సాంగ్తో మరింత పాపులర్ అయ్యాడు. ఇతడు అర్బన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్ను స్థాపించాడు.చదవండి: డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
'భవతారిణి చివరి కోరిక ఇదే'.. జయంతి రోజున ఇళయ రాజా ఎమోషనల్
వెండితెరపై సంగీత విద్వాంసుడిగా ఇళయరాజా (Ilayaraja) గొప్ప పేరు సాధించారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు దాదాపు 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె భవతారిణి సింగర్గా రాణించారు. తమిళంతో పాటు తెలుగు చిత్రాలకు సైతం తన గాత్రం అందించారు. అయితే గతేడాదిలో ఆమె క్యాన్సర్తో కన్నుమూశారు.అయితే ఈ ఏడాది భవతారిణి (Bhavatharini) జయంతి సందర్భంగా ఆమె తండ్రి ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆల్-గర్ల్స్ ఆర్కెస్ట్రా పేరుతో ఈవెంట్ను నిర్వహించాలన్నది తన కుమార్తె చివరి కోరిక అని ఇళయ రాజా వెల్లడించారు. తాను మరణించే ముందు తనను చివరి కోరిక కోరిందని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరెన్, దర్శకుడు వెంకట్ ప్రభు కూడా హాజరయ్యారు. తన జయంతి రోజు ఫిబ్రవరి 12న స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలికలతో ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించాలనుకుంటున్నానని భవతారిణి నాకు చెప్పింది. అదే ఆమె చివరి కోరిక కూడా. రెండు రోజుల క్రితమే నేను మలేషియాలో ఉన్నప్పుడు నా ముందు ప్రదర్శన ఇచ్చిన యువతులతో కూడిన అనేక బృందాలను కలిశాను. వారిని చూసినప్పుడు నాకు భవతారిణి చివరి కోరిక గుర్తుకు వచ్చింది. అందుకే తన పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఆర్కెస్ట్రాలో భాగమవుతారు" వెల్లడించారు.అనంతరం మాట్లాడుతూ.." ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సరైన సమయంలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తాను. యువతులు ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి నమోదు చేసుకుని ఆడిషన్ ఇవ్వవచ్చు. ఆర్కెస్ట్రా భవతారి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని వ్యాపింపజేయాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు, భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకున్నారు. అప్పడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగచి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు. కాగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నేపథ్య గాయని, స్వరకర్త భవతారిణి . ఆమె తమిళ చిత్రం భారతిలోని మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట ద్వారా ఫేమ్ పొందింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత భవతారిణి జనవరి 25, 2024న 47 ఏళ్ల వయసులోనే మరణించింది. భవతారిణికి ఇద్దరు సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా ఉన్నారు. Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE— venkat prabhu (@vp_offl) February 12, 2025 -
రెండు రోజుల క్రితమే వివాదంలో సింగర్.. అంతలోనే మరో వీడియో వైరల్!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చేసిన పని ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఏకంగా ముద్దులు ఇవ్వడంతో పలువురు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఈ వయసులో ఇలాంటి పనులేంటని సింగర్ను నిలదీశారు. అభిమానంతో ఫోటోలు దిగితే అందరిముందే అలా ప్రవర్తించడం ఏంటని ఉదిత్ నారాయణ్ను ప్రశ్నించారు.అయితే ఈ సంఘటన జరగకుముందే మరో వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఓ మ్యూజిక్ కన్సర్ట్లో మహిళకు ముద్దు పెడుతూ కనిపిచంారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది కొత్త వీడియోనా.. గతంలో జరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కాగా.. గతంలో ఉదిత్ నారాయణ్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు. ఏదేమైనా అనుమతి లేకుండా మహిళ అభిమానులతో అలా ప్రవర్తించడంపై ఆయనపై విమర్శలొస్తున్నాయి.(ఇది చదవండి: 'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్)కాగా.. ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది.Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025 -
చంద్రికకు గ్రామీ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బం ‘త్రివేణి’తో ఆమెకీ గుర్తింపు దక్కింది. లాస్ ఏంజెలెస్లోని క్రిప్టో డాట్ కామ్ అరెనాలో ఆదివారం గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది. ‘ఈ గుర్తింపుతో సంగీతమంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. సంగీతం మనందరి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తుంది. విషాద వేళల్లోనూ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది’అని ఆమె ఇన్స్టాలో పేర్కొన్నారు. చంద్రికా టాండన్ ప్రముఖ బిజినెస్ లీడర్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయీకి స్వయానా తోబుట్టువు కావడం విశేషం. చెన్నైలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్ 2009లో ‘సౌల్ కాల్’అనే ఆల్బమ్కుగాను మొట్టమొదటి గ్రామీ గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్మన్, మట్సుమొటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్ట్లో విడుదలైంది. -
'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన మహిళ అభిమానులకు ముద్దులు పెట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా ఓ మహిళ అభిమానికి ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడంతో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని నిలదీస్తున్నారు. గతంలోనూ ఆయన చాలాసార్లు అలానే ప్రవర్తించారు. గతంలోనూ ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. అభిమానులతో అలా ప్రవర్తించినందుకు తనకేలాంటి బాధలేదని అంటున్నాడు. సోషల్మీడియాలో వచ్చిన వీడియోల్లో మీరు చూసింది మా మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. దీనిపై చింతించాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదంటున్నాడు. వారు నన్ను అభిమానించడం వల్లే నా ప్రేమను తెలియపరిచానని వెల్లడించారు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదన్నారు.(ఇది చదవండి: అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?)ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ..'నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకువచ్చే పని ఎప్పుడూ చేయలేదు. సోషల్మీడియాలో వీడియోల్లో కేవలం అభిమానులపై నేను చూపిస్తున్న ప్రేమ. వాళ్లు నన్ను ఏలా ప్రేమిస్తున్నారో..అలాగే వారిని కూడా ప్రేమిస్తున్నా. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఎక్కడుంది? నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నేను వారి వల్లే మరింత ఫేమస్ అయ్యా' అని అన్నారు.కాగా.. ఉదిత్ కొన్నిరోజుల క్రితమే లైవ్ కన్సర్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఉదిత్ నారయణ్ వారికి ముద్దులు పెట్టాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.ఉదిత్ నారయణ్ తెలుగులో పలు చిత్రాలకు పాటలు పాడారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది -
అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈయన ఏకంగా లిప్కిస్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.లైవ్ షోలో..తాజాగా వైరలవుతున్న వీడియోలో ఉదిత్.. స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇంతలో ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఫోటో తీసుకోవడంతో పాటు సింగర్ చెంపను ముద్దాడింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఉదిత్.. ఏకంగా ఆమె పెదాల్ని ముద్దాడాడు. ఊహించని చర్యతో అభిమాని నోరెళ్లబెట్టింది. ఈ వయసులో ఇదేం పని?69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని జనాలు మండిపడుతున్నారు. కూతురి వయసున్నవారితో ఇలాగేనా ప్రవర్తించేంది? నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్.. ఛీ, ఇంత చీప్ అనుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మొదట ఆ అమ్మాయే తనంతట తానుగా సింగర్ దగ్గరకు వెళ్లిందని.. ఇందులో ఆమె తప్పు కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అటు సింగర్కు, ఇటు షోలో అతడి దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు సిగ్గు లేదని తిట్టిపోస్తున్నారు.ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది. Can't believe veteran Singer Udit Narayan behaving so lewd in a live concerts show 😔 But my question is Who's more disgusting - Female Audiences or the Artist #UditNarayan? #shameless pic.twitter.com/W6epY8Nmr4— Filmi Woman (@FilmiWoman) February 1, 2025చదవండి: క్యూట్ గెటప్లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్!
సింగింగ్ సెన్సేషన్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ ఇలా పలు భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే గాయనీమణి ఆమె. ఎన్నో జాతీయ అవార్డులు. ఏ భాషలో పాడినా అత్యంత సహజంగా తన గానమాధుర్యంతో అలరించడం ఆమె స్పెషాల్టీ. అందుకే కోట్లాదిమంది సినీ సంగీతా భిమానులకు, మరెంతోమంది గాయకులకు ఆరాధ్యదైవం. తాజాగా శ్రేయా ఘోషల్ లవ్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. సింగర్ శ్రేయ భర్త ఎవరు? ఆయనను తొలిసారి ఎక్కడ చూసింది, ఎవరు ప్రపోజ్ చేశారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.శ్రేయ ఘోషాల్ ప్రేమకథ (Love Story అద్భుతమైన సినిమా స్టొరీ కంటే తక్కువేమీకాదు. శ్రేయా ఘోషల్ భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ (Shiladitya Mukhopadhyaya). ఖ ట్రూకాలర్ గ్లోబల్ హెడ్. వీరి వివాహం 2015, ఫిబ్రవరి 5న జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకు 2021లో వీరికి కుమారుడు దేవయాన్ జన్మించాడు.శ్రేయా ఘోషల్, శిలాదిత్య ప్రేమకథపాఠశాల విద్యార్థులగా ఉన్నప్పటినుంచే వీరి మధ్య ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 10 ఏళ్ల డేటింగ్ తరువాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే తనకు లవ్ ప్రపోజ్ చేయడానికి శిలాదిత్య పడిన కష్టాలను ఒక సందర్భంగా శ్రేయా స్వయంగా వెల్లడించింది. శిలాదిత్య తన స్నేహితుడి వివాహంలో శ్రేయాకు ప్రపోజ్ చేశాడట. చాలా రోజులుగా ఇద్దరి మనస్సులో ఉన్నప్పటికీ వ్యక్తం చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఇద్దరూ కలిసి స్నేహితుడి పెళ్లి పెళ్లారు. ఈ సందర్భంగానే ఎలాగైనా తన మనసులోని మాటను చెప్పేయాలని శిలాదిత్య ప్లాన్ చేసుకున్నాడు. కానీ విషయం అస్సలు శ్రేయాకు తెలియదు. ఇద్దరూ ఒక చోట కూర్చుని ఉండగా, అదిగో ఉడుత అని తన దృష్టి మళ్లించి, మోకాలిమీద కూర్చుని రింగ్తో ప్రపోజ్ చేశాడు. నిజంగానే నవలల్లో చదివినట్టుగా, సినిమాలో చూపించినట్టుగానే జరిగింది..అస్సలేమీ అర్థం కాలేదు అంటూ తన మూడో వివాహ వార్షికోత్సవం (గతంలో) సందర్భంగా వెల్లడించింది.కాగా శ్రేయా ఘోషల్ 1984లో మార్చి 12,న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. రాజస్థాన్ కోట సమీపంలోని రావత్భట అనే చిన్న పట్టణంలో పెరిగింది. నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ వాయిద్యం, హార్మోనియం నేర్చుకుంది. గురువు మహేష్ చంద్ర శర్మ నుండి సంగీత పాఠాలు నేర్చుకుంది. శ్రేయ తొలి స్టూడియో ఆల్బమ్ 1998లో బెంధెచ్చి బీనా పేరుతో విడుదలైంది. సరేగమా టీవీ రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. 16 ఏళ్ల వయసులో సంజయ్ లీలా భన్సాలీ రొమాంటిక్ మూవీ దేవదాస్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాకే జాతీయ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. అప్పటినుంచి సినీ సంగీత లోకాన్ని ఏలుతోంది. 2012లో భారత దేశంలోని ప్రముఖుల ఆదాయం, ప్రజాదరణ ఆధారంగా రూపొందించిన 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో చోటు సంపాదించుకుంది. తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు, అనేక జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో చేరాయి. 2017లో, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారతీయ విభాగంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి గాయకురాలు కూడా శ్రేయా ఘోషల్ కావడమ విశేషం. గాయనిగా, ప్రదర్శకురాలిగా, ప్లేబ్యాక్ సింగర్గా, సంగీత కంపోజర్గా రాణిస్తున్న ఆమె ఆదాయం సుమారు రూ. 240కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇక ఆమె భర్త శిలాదిత్య ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ట్రూకాలర్ కంటే ముందు ఆయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేశారని సమాచారం.ఇదీ చదవండి : Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
తిరుమల శ్రీవారి సేవలో సింగర్ సునీత (ఫోటోలు)
-
సీఎం నితీష్, మాజీ సీఎం లాలుపై అసభ్య పాటలు... గాయకుడు అరెస్ట్
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్పురి గాయకుడు సూరజ్ సింగ్ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్పురి పాటలు బీహార్లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా భోజ్పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్
ఒక మనిషి లావుగా ఉండటానికి, సన్నగా ఉండటానికి వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. జన్యువులు చేసే మ్యాజిక్, ఆహారం, జీవనశైలి, ఇతర అలవాట్లు లాంటివాటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటారు. మరికొంతమంది చాలా సులువైన పద్దతుల ద్వారా తమ బరువును నియంత్రణలో ఉంచుకుంటారు. అది బహుమతిగా కూడా ఉంటుంది. బరువు తగ్గడం అనేది కొంతమందికి నెలలు పట్టవచ్చు. మరికొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నపుడు మాత్రం ఆ ఆనందం చెప్పనలవికాదు. యూఎస్ పాపులర్ సింగర్ ఈ ఆనందంలో మునిగితేలుతోంది. ఇంతకూ ఈ సింగర్ ఎవరు? తెలుసుకుందా పదండి! అమెరికన్ గాయని, ర్యాపర్ లిజ్జో ప్రపంచ సంగీత ప్రియులకు సుపరిచితమైన పేరు. చాలా కష్టపడి ఎట్టకేలకు తన బరువును తగ్గించుకుంది. 2014 నుండి కష్టపడి ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకుంది. పదేళ్ల తరువాత తన బరువును చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. దృఢ సంకల్పం , పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు లిజ్జో ఉదాహరణ.తన సంతోషాన్ని గర్వంగా సోషల్మీడియాలో షేర్ చేసింది. తన ఫిగర్ ఫోటోను పోస్ట్ చేసింది. వెయిట్-ట్రాకింగ్ యాప్ స్క్రీన్షాట్ను కూడా పంచుకుంది. ‘‘ఈరోజు నేను నా బరువు తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకున్నాను. 2014 నుండి ఈ నెంబర్లు సంఖ్యను చూడలేదు!’’అని తెలిపింది. అలాగే అనుకున్న లక్ష్యం చేరేందుకు పట్టుదల ముఖ్యఅని గుర్తు పెట్టుకోండి అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తూనే తన కొత్త లక్ష్యాలకు టైమ్ వచ్చింది అంటూ బరువు తగ్గే విషయంలో కొత్త టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పకనే చెప్పింది. ఈమె స్టోరీ ఇపుడు ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అద్భుతం అభినందనలు అంటూ ఫాలోయర్లు తెగ పొగిడేస్తున్నారు. (రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో) View this post on Instagram A post shared by Lizzo (@lizzobeeating) లిజ్జో వివరాలను పోస్ట్ చేసింది. బరువు తగ్గించుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పటినుంచి లిజ్జో బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని 10.5 తగ్గించుకోగలిగింది. బాడీలో ఫ్యాట్ 16శాతం తగ్గడం విశేషం.2024,సెప్టెంబరులో ఈ ప్రయాణం గురించి టిక్ టాక్ పోస్ట్లో చెప్పుకొచ్చింది. ఎవరెన్ని కమెంట్స్ చేసినా తాను మాత్రం లక్ష్యంపై దృష్టి సారించానని ఆమె వెల్లడించింది. అప్పటినుంచి అనేక అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. అలాగే టైప్-2 డయాబెటిస్కు ఓజెంపిక్ వాడుతోందన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. కాగా యుఎస్ పాప్ స్టార్ లిజ్జోపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. తమను వేధిస్తోందని, ముగ్గురు మాజీ డ్యాన్సర్ల ఆరోపించారు. అయితే వీటిని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేసింది కూడా. -
ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే (Zanai Bhosle)తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.సోషల్మీడియా వేదికగా మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇలా పేర్కొన్నాడు. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని తన ఇన్స్టా స్టోరీలో తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒకరు' అని సిరాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ రూమర్స్పై రియాక్ట్ అయింది. సిరాజ్ అంటూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
ప్రముఖ సింగర్తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్..!
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
వివాదంలో సింగర్ మధు ప్రియ.. అసలేం జరిగిందంటే?
'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని' అనే సాంగ్తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ. తన మధురమైన వాయిస్తోనే ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రైవేట్ ఆల్బమ్ కోసం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో మధు ప్రియ సాంగ్ను షూట్ చేశారు. అది కూడా ఆలయం గర్భగుడిలో కావడంతో వివాదానికి దారితీసింది. దీంతో మధు ప్రియ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గర్భగుడిలో సింగర్ మధు ప్రియ ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరపడంపై మధుప్రియపై విమర్శలు చేస్తున్నారు. గర్భగుడిలో షూట్కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ పాడిన మధుప్రియ.. కాగా.. సింగర్ మధు ప్రియ ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్ను ఆలపించారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్లో రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ మేల్ వాయిస్ను రమణ గోగుల పాడగా.. ఫీమేల్ వాయిస్ మధు ప్రియ పాడారు. ఈ సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్ - అనిల్ రావిపూడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రాణిస్తోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం లో అపచారం.వీడియొ షూటింగ్ చేసిన సింగర్ మధు ప్రియ,ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మండి పడ్డ భక్తులు. pic.twitter.com/lbsGMllaSP— Telangana Maata (@TelanganaMaata) January 23, 2025 -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన సింగర్
సింగర్ మోనాలి ఠాకూర్ (Monali Thakur) ఆస్పత్రిపాలైంది. లైవ్ షోలో పాడుతున్న ఆమెకు ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 21న పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిఈ వీడియోలో లైవ్ షోలో పాడుతున్న గాయనికి ఉన్నట్లుండి ఏదో ఇబ్బందిగా అనిపించి తలపట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆమె పాట పాడటం ఆపలేదు. ఎలాగోలా సాంగ్ పూర్తి చేసింది. కానీ తర్వాత షోను కొనసాగించలేకపోయింది. నాకు ఈ రోజు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. కాబట్టి షో ముగించేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని స్టేజీపైనే క్షమాపణలు చెప్పింది. షో రద్దు చేసిన వెంటనే ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.సింగర్ మాత్రమే కాదు, నటి కూడా!ఈ నెల ప్రారంభంలోనూ మోనాలి ఠాకూర్ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్ఫామెన్స్ మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు తన సిబ్బందిని వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. మోనాలి ఠాకూర్.. సవార్ లూన్, జర జర టచ్ మీ, చమ్ చమ్, తేర ఇంతేజర్, మమ్మీ కసమ్.. వంటి పాటలు ఆలపించింది. తెలుగు దర్శకుడు నగేశ్ కుకునూర్ హిందీలో తెరకెక్కించిన లక్ష్మి సినిమాలో కీలక పాత్ర పోషించింది. చదవండి: బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే
అమెరికా 47వ అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో గాయని, పాటల రచయిత్రి క్యారీ అండర్వుడ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ ను ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో క్యారీ అండర్వుడ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.క్యారీ అండర్వుడ్.. అమెరికన్ గాయని, నటి, రచయిత. ఆమె 1983 మార్చి 10న ఒక్లహోమాలోని పిల్ల్స్బోరోలో జన్మించారు. ఆమె సంగీత ప్రస్థానం 2005లో ‘అమెరికన్ ఐడల్’ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన అనంతరం ప్రారంభమైంది. క్యారీ అండర్వుడ్ అద్భుతమైన గాయనిగా పేరొందారు. దీనికి తోడు ఆమె పలువురి అభినందనలను అందుకున్నారు. సంగీతం పరంగా ఆమె పలు రికార్డులను సృష్టించారు.క్యారీ ఇప్పటివరకూ ఏడు ఆల్బమ్స్ విడుదల చేశారు. అందులో మొదటిది ‘Some Hearts’. ఇది 2005లో విడుదలకాగా, ఎనిమిది మిలియన్లకు మించిన కాపీలు విక్రయమయ్యాయి. ఆమె మొదటి నాలుగు సింగిల్స్ హిట్ కావడంతో ఆమె మరింత గుర్తింపును పొందారు. క్యారీ అండర్వుడ్.. తన కంట్రీ మ్యూజిక్లో అత్యంత ప్రభావవంతమైన రెండవ వ్యక్తిగా నిలిచారు.అమెరికా పాటగా గుర్తింపుగా నిలిచిన ‘అమెరికా ది బ్యూటిఫుల్’కు ఆమె ప్రదర్శన తోడవడంతో ఆ పాటకు మరింత ప్రధాన్యత ఏర్పడిందంటారు. ఈ పాటు దేశభక్తి, నేషనలిజం, సమానత్వం తదితర అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదర్శన 2021లో జరిగిన బైడెన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలోనూ ప్రదర్శితమయ్యింది. క్యారీ అండర్వుడ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లో నిలిచింది. ఆమె మైక్ ఫిషర్ అనే హాకీ క్రీడాకారుడిని 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమెరికా ది బ్యూటిఫుల్ ప్రదర్శనలో క్యారీ అండర్వుడ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అండర్వుడ్ పలువురు యువ కళాకారులకు, అభిమానులకు స్ఫూర్తినిస్తున్నారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి -
స్నేహితురాలిని పెళ్లాడిన జెర్సీ మూవీ సింగర్.. పోస్ట్ వైరల్
ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.దర్శన్ కెరీర్..దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్ను అలపించారు దర్శన్ రావల్. View this post on Instagram A post shared by Darshan Raval (@darshanravaldz) -
సింగర్ జయచంద్రన్ మృతి
ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిసూర్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 3న కొచ్చిలో జన్మించిన జయచంద్రన్ 1965లో వచ్చిన ‘కుంజలి మరక్కర్’ అనే సినిమాలోని ‘ఒరు ముల్లప్పుమలమే..’పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. 1967లో విడుదలైన ‘కలితోజన్’ చిత్రంలోని ‘మంజలైల్ ముంగి తోర్తి’పాట ఆయన కెరీర్లో ఒక మైలురాయి. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 16 వేలకుపైగాపాటలుపాడారాయన.జయచంద్రన్ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్డేలు (సుస్వాగతం)’ వంటిపాటలు సూపర్ హిట్గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిపాట. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ , ఎం.ఎం. కీరవాణి, విద్యాసాగర్, కోటి వంటి సంగీత దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగాపాటలుపాడారు. హిందీలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘అదా: ఎ వే ఆఫ్ లైఫ్’ అనే ఒకే ఒక మూవీలోపాడారు జయచంద్ర.అదేవిధంగా తన మాతృ భాష మలయాళంలో ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ వంటి సినిమాల్లో అతిథిపాత్రల్లో మెరిశారాయన. అంతేకాదు.. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఐదు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు. -
గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్
పాపులర్ సూఫీ సింగర్ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్ అయిన బిస్మిల్, షిఫాఖాన్తో జీవితాన్ని పంచుకున్నాడు. డిజైనర్ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్ లుక్లో ఫ్యాన్స్ను మురిపించారు. వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్ ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్లో, బిస్మిల్ షిఫా ఖాన్ (ఇపుడు భార్య)తో కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు. అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకున్నాడు స్టన్నింగ్ బ్రైడల్ లుక్ వధువు షిఫా ఖాన్ డార్క్ రెడ్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో పెళ్లికూతురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్, విలాసవంతమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఎలిగెంట్ లుక్ నిచ్చాయి. లెహెంగాకు మ్యాచింగ్, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది. ఇంకా డైమండ్స్, పచ్చలు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు, ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్తో కూడిన గాజులతో అద్భుతంగా కనిపించింది. నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్ లుక్క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్, వైట్ షేడ్స్లో మెరిసే రాళ్లతో రూపొందించిన బంగారు బ్రూచ్తో అందంగా మెరిశాడు బిస్మిల్. వజ్రాలు పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్ వాచ్మరింత విలాసాన్నిచ్చింది. అందమైన ఫోటోలుస్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం, నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు, వేలిముద్రలు ఫోటోలను కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Bismil (@bismil.live) -
అందమైన చీరలో బ్యూటీ విత్ టాలెంట్.. ఎవరీమె?
-
ఏఆర్ రెహమాన్కు సమయపాలన లేదు.. సింగర్ ఫైర్
దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)కు సమయపాలన లేదంటున్నాడు సింగర్ అభిజీత్ భట్టాచార్య. చెప్పిన సమయానికి పని పూర్తి చేయడంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా అభిజీత్ భట్టాచార్య (Abhijeet Bhattacharya) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ ఊపందుకున్న సమయంలో ఏ నజ్నీన్ (Ae Nazneen Suno Na..) పాట ఆఫర్ ఇచ్చారు. చెప్పిన సమయానికి వెళ్లాను. కానీ అక్కడ నన్ను గంటలకొద్దీ వెయిట్ చేయించారు. తీరా రెహమాన్ వెళ్లిపోవడంతో నన్ను రాత్రికి అదే హోటల్లో ఉండిపోమన్నారు. మరుసటి రోజు సాంగ్ రికార్డ్ ఉంటుందని చెప్పారు. సరేలేనని నేను నిద్రకుపక్రమించాను. ఇంతలో అర్ధరాత్రి రెండు గంటలకు స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది.నిద్రపోతున్న సమయంలో..త్వరగా వచ్చి పాట పాడమని అడిగారు. ఉదయం రెండు గంటలకు సాంగ్ రికార్డింగ్ ఏంటని ఒప్పుకోలేదు. నేను ఇప్పుడే నిద్రపోతున్నాను.. ఈ సమయంలో ఎలా కుదురుతుందని చెప్పి.. తెల్లారాక స్టూడియోకు వస్తానన్నాను. తీరా వెళ్లేసరికి రెహమాన్ అక్కడ లేడు. అతడి అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్లు ఓ పద్ధతి ప్రకారం పని చేయరు. ఎప్పుడు పడితే అప్పుడే పని చేస్తున్నారు. నేనేమో ఏదైనా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటాను. సమయపాలన పాటిస్తాను. క్రియేటివిటీ పేరు చెప్పి ఉదయం మూడున్నర గంటలకు సాంగ్ పాడమనడమేంటో నాకిప్పటికీ అర్థం కాదు.(చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు)సినిమా ఫ్లాప్.. సాంగ్స్ హిట్ఆ రోజు స్టూడియోలో ఏసీ ఎక్కువ పెట్టడం వల్ల నాకు జలుబైంది. ఆ విషయం చెప్పినా సరే వాళ్లు వినిపించుకోలేదు. ఏం పర్లేదని పాడమన్నారు. పాట పాడటం పూర్తయ్యాక రెహమాన్ గురించి అడిగితే సరైన స్పందనే లేదు. అలా ఆయన్ను కలవకుండానే అక్కడి నుంచి వెనుదిరిగాను. నేను ఎన్నో సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమాలకు హిట్ సాంగ్స్ పాడాను. అందులో ఒకటే ఇది కూడా! ఈ సినిమా ఎవరూ చూడలేదు. కానీ పాటలు మాత్రం వైరలయ్యాయి. దానికి క్రెడిట్ అంతా రెహమాన్కే వచ్చింది. ఎన్నో సార్లు రెహమాన్ను కలవాలని ప్రయత్నించాను. కానీ నాకు అవతలివైపు నుంచి సరైన స్పందన రాలేదు. ఇలా ఒకరిని వెయిట్ చేయించడం వల్ల ఎవరూ గొప్పోళ్లు అయిపోరు.సినిమా..199లో వచ్చిన దిల్ హై దిల్ మే సినిమా (Dil Hi Dil Mein)లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఏ నజ్నీన్ సునో నా.. పాటను అభిజీత్ ఆలపించాడు. తర్వాత రెహమాన్తో ఎన్నడూ అభిజీత్ జత కట్టలేదు. దిల్ హై దిల్ మే సినిమా విషయానికి వస్తే ఇందులో కునాల్ సింగ్ హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది కానీ అభిజీత్ పాడిన పాట మాత్రం బాగా హిట్టయింది. పర్సనల్ లైఫ్ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ గతేడాది తన భార్యతో విడిపోయాడు. 29 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న రెహమాన్-సైరా భాను జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిద్దరికీ 1995లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. గతేడాది నవంబర్లో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు -
Armaan Malik: ప్రియురాలిని పెళ్లాడిన 'బుట్టబొమ్మ' సింగర్ (ఫోటోలు)
-
ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ అర్మాన్ మాలిక్
ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు ఆష్న ష్రాఫ్(Aashna Shroff)ను వివాహమాడాడు. గురువారం ఉదయం తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఇరుకుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే జరిగిన ఈ వివాహంలో ఆష్న ఆరెంజ్ లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. 2023లో నిశ్చితార్థంప్రియురాలికి మ్యాచ్ అయ్యేలా అర్మాన్ పేస్టల్ షేడ్ కలర్ షేర్వాణి ధరించి రాయల్గా కనిపించాడు. ఇక ఈ సడన్ సర్ప్రైజ్ చూసిన అభిమానులు.. ఓ మైగాడ్, మీ పెళ్లికోసం ఎంత ఎదురుచూశామో.. మొత్తానికి ఒక్కటయ్యారు, కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మాన్, ఆష్నా ఆరేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాక 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది జరిగిన రెండేళ్లకు వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బుట్టబొమ్మతో తెలుగులో సెన్సేషన్ఈయన పాటల విషయానికి వస్తే తెలుగులో హలో (హలో), నిన్నిలా నిన్నిలా.. (తొలి ప్రేమ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో), ఓ ఇషా.. (మేజర్) ఇలా ఎన్నో పాటలు పాడాడు. కచ్చాలింబో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. అర్మాన్ మాలిక్ తల్లి జ్యోతి తెలుగువారే కావడం విశేషం. View this post on Instagram A post shared by ARMAAN MALIK (@armaanmalik) చదవండి: 15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్ లవ్ స్టోరీ -
ప్రముఖ సింగర్తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫోటోలు)
-
స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.లతా మంగేష్కర్ రూ.368 కోట్లుతులసి కుమార్ రూ.210 కోట్లు శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు నేహా కక్కర్ రూ.104 కోట్లు ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లుపలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లుఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు. -
కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనను ఎందుకు బ్లాక్ చేశాడో ఇప్పటికీ తెలియడం లేదంటున్నాడు ప్రముఖ సింగర్, బిగ్బాస్ కంటెస్టెంట్ రాహుల్ వైద్య. ఇంతవరకు ఆయన్ను పొగడటమే తప్ప విమర్శించిందే లేదని చెప్తున్నాడు. తాజాగా రాహుల్ వైద్య (Rahul Vaidya) మాట్లాడుతూ.. ఇన్స్టాగ్రామ్లో విరాటో కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు. కారణమేంటన్నది నాకిప్పటికీ తెలియదు. బహుశా దానివల్లేనేమో!మన దేశంలోనే ఆయన బెస్ట్ బ్యాట్స్మన్. నన్నెందుకు బ్లాక్ చేశాడన్నది అంతు చిక్కడం లేదు అని చెప్పుకొచ్చాడు. ఇతడి కామెంట్లు విన్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ పిల్లలు అనుకోకుండా అతడి ఫోన్తో ఆడుకుంటూ అనుకోకుండా రాహుల్ను బ్లాక్ చేసి ఉండొచ్చు అని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు వామిక, అకాయ్ సంతానం. ఈ మధ్య కోహ్లి తన కుటుంబంతో లండన్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఎవరీ రాహుల్?రాహుల్ వైద్య విషయానికి వస్తే.. ఇండియన్ ఐడల్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. అప్పుడప్పుడూ కొత్త పాటల ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. హిందీ సినిమాల్లో ఎన్నో పాటలు ఆలపించాడు. 2020లో హిందీ బిగ్బాస్ 14వ సీజన్ రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ షో (Bigg Boss)లో కంటెస్టెంట్ దిశా పార్మర్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ఈ జంటకు నవ్య అనే కూతురు కూడా పుట్టింది.చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా? -
2024 అమేజింగ్ డేస్ : అప్సరసలా మెలోడీ క్వీన్
-
వారసుడిని రెడీ చేస్తున్న సింగర్ శ్రేయా ఘోషల్ (ఫొటోలు)
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
స్టార్ డైరెక్టర్పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయని అరెస్ట్
టెహ్రాన్: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్ అధికారులు అరెస్ట్ చేశారు. సారి నగరంలో శనివారం అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్ మిలాద్ చెప్పారు. ఆన్లైన్ కచేరీలో ఆమె హిజాబ్ ధరించలేదు. భుజాలు కనిపించే నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఆమె అరెస్ట్కు కారణాలను, ఎక్కడ నిర్బంధంలో ఉంచిందీ అధికారులు వెల్లడించలేదు. కచేరి సమయంలో ఆమెతో కనిపించిన కళాకారుల్లో సొహైల్ నసిరీ, ఎహ్సాన్ బెయిరగ్ధార్లనూ అరెస్ట్ చేశారు. న్యాయ శాఖ అధికారులతో మాట్లాడి, నిర్బంధం గురించి తెలుసుకుంటామని లాయర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా సోలోగా పాడటాన్ని ఇరాన్ నిషేధించింది. హిజాబ్ ధరించకుండా కనిపించిన అమినీ అనే యువతి పోలీసు నిర్బంధంలో ఉండగా చనిపోవడం 2022లో ఇరాన్ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీయడం తెలిసిందే. -
హైదరాబాద్ నగరానికి పాప్ కింగ్ బ్రియాన్ ఆడమ్స్..
సాక్షి, హైదరాబాద్: సో హ్యాపీ ఇట్ హర్ట్స్ అంటూ నగరవాసుల హృదయాలను టచ్ చేయనున్నారు కెనడియన్ రాక్ స్టార్ బ్రియాన్ ఆడమ్స్. ప్రపంచవ్యాప్త టూర్లో భాగంగా మన దేశానికి వచ్చి గత 10న షిల్లాంగ్లో ప్రదర్శనతో ఇండియా టూర్ ప్రారంభించారు. బ్రియాన్ ఆడమ్స్ (Bryan Adams) గుర్గ్రామ్, ముంబయి, బెంగళూర్ల తర్వాత మన నగరంలో ఈ నెల 16న జరిగే ప్రదర్శనతో యాత్ర ముగించనున్నారు. ఇది కేవలం ఒక గాన ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాదని, అహూతులతో సంపూర్ణ సంగీత యాత్ర చేయిస్తుందని నిర్వాహకులు అంటున్నారు.‘సమ్మర్ ఆఫ్ 69, ఎవ్రీ థింగ్ ఐ డూ ఐ డూ ఇట్ ఫర్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, రన్ టూ యూ, 18 టిల్ ఐ డై...తదితర తన సూపర్ హిట్ ఆల్బమ్స్తో పాటు తాజాగా వస్తున్న సో హ్యాపీ ఇట్ హర్ట్స్’ లతో శ్రోతలను అలరించనున్నాడు ఈ సింగర్ అండ్ రైటర్. నగరంలో ఎయిర్పోర్ట్లోని జీఎంఆర్ ఎరీనాలో ఈ సంగీత ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాక్ సంగీత ప్రియులు బుక్ మై షో ద్వారా ఎంట్రీ పాస్లను కొనుగోలు చేయవచ్చు. చదవండి: 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలిఇకపై డిజిటలైజ్డ్.. కాన్ఫరెన్స్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సమావేశాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయని డిజిటల్ మీటింగ్స్ ఊపందుకోనున్నాయని ఆడియో, వీడియో నిపుణులు స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక ఆడియో ఉత్పత్తులకు పేరొందిన సెన్హీజర్, క్రెస్ట్రాన్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో కాన్ఫరెన్స్లు– ఆడియో, వీడియో టెక్నాలజీ అంశంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల అత్యాధునిక పరికరాల పనితీరును వీడియో సహితంగా వివరించారు. నగరానికి చెందిన వందలాది మంది ఆడియో వీడియో పరికరాల నిపుణులు, వినియోగదారులు హాజరయ్యారు. -
శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు ఏ పాటైనా వెన్నెలా రాగమే..!
బాలీవుడ్ సినిమా ‘స్త్రీ–2’లోని ‘ఆజ్ కీ రాత్; పాట ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉంది. ‘బిల్బోర్డ్’ చాట్లో టాప్లో ఉంది. మధుబంటి బాగ్చీ ఆలపించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ బెంగాలీ సింగర్, కంపోజర్ గురించి తెలుసుకుందాం. హిందుస్థానీ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ ఆగ్రా ఘరానాలతో పరిచయం ఆమె ఆస్తి. మన శాస్త్రీయ సంగీతం నుంచి పాశ్చాత్య పాప్ వరకు ఆమె గొంతులో అలవోకగా వినిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘూట్ ఆమె స్వస్థలం. తండ్రి ప్రొఫెసర్. తల్లి వ్యాపారవేత్త. కోల్కత్తాలోని ‘హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిగ్రీ, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీ నుంచి లేజర్ అండ్ ఆప్టికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసింది. బెంగాలీ మ్యూజిక్ బ్యాండ్ ‘మృతిక’తో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగాలీ చిత్రం ‘అమీ ఆర్ అమర్ గర్ల్ఫ్రెండ్స్’తో చిత్రరంగంలోకి అడుగుపెట్టింది. (చదవండి: ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్గా..!) -
ప్రియుడితో ప్రముఖ సింగర్ రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్ను ఆమె పెళ్లాడింది. సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్కు హాజరయ్యారు.కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్గా మాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Anju Joseph (@anjujosephofficial) -
'కిస్సిక్' సాంగ్ పాడింది ఈమెనే.. ఇన్ స్టాలో రీల్స్ నుంచి సినిమా పాటల వరకు (ఫొటోలు)
-
వావ్.. పదహారేళ్ల పడతిలా అబుదాబీ బీచ్లో స్టార్ సింగర్
-
మ్యూజిక్ వరల్డ్: విష్ జోష్
రియా దుగ్గల్(రి), సిమ్రాన్ దుగ్గల్(సిమ్), జో సిద్దార్థ్ (జో), సుచితా షిర్కే(సుచి)లతో కూడిన ‘విష్’ మ్యూజిక్ బ్యాండ్ కొత్త తరం ఆకాంక్షాలు, ప్రతిభ, కలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘ప్రపంచ వేదికపై మన టాలెంట్ ఏమిటో చూపాలి’ అనే లక్ష్యంతో దూసుకుపోతుంది. పాపులర్ కె–పాప్ స్ఫూర్తితో ప్రయాణం ప్రారంభించిన ‘విష్’ తనదైన స్టైల్ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ‘విష్’ సభ్యులలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సంగీతానికి సంబంధించి తమదైన ప్రత్యేక శైలి ఉంది.చెన్నైకి చెందిన ‘జో’ తన హస్కీ వాయిస్తో సౌత్ ఫ్లెవర్ను వినుల విందు చేస్తుంది. ముంబైకి చెందిన రి, సిమ్ సిస్టర్స్ వాయిస్ ‘మాకు మాత్రమే ప్రత్యేకం’ అనేలా ఉంటుంది. ఈ బ్యాండ్లో అతి పిన్న వయస్కురాలైన సుచీ స్వీట్ వాయిస్కు మరోపేరు. ఈ బ్యాండ్ ఫస్ట్ సింగిల్ ‘లాజీజ్’‘లాజీజ్’ అంటే ఉర్దూలో ‘రుచికరమైనది’ అని అర్థం. స్త్రీ సాధికారత, స్త్రీ స్వాతంత్య్రం.... మొదలైన అంశాలను ప్రస్తావించే ‘లాజీజ్’కు మంచి స్పందన వచ్చింది. (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్
పిల్లల్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దుఃఖం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అతి పెద్ద విషాదం రెండో కొడుకుని కోల్పోవడమే అంటున్నాడు సింగర్ బి ప్రాక్. నా కొడుకు మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడని బాధపడుతుంటాను.సమాధి చేశాం..చనిపోయిన శిశువును ఒక్కసారి చూస్తానని నా భార్య మీరా అడిగింది. తన బాధ రెట్టింపు చేయడం ఇష్టం లేక అందుకు ఒప్పుకోలేదు. తనకు చూపించకుండానే సమాధి చేశాం. ఇప్పటికీ ఈ విషయంలో తను నాపై కోప్పడుతూనే ఉంటుంది.. అని కన్నీళ్లుపెట్టుకున్నాడు.కెరీర్..కాగా బిప్రాక్, మీరా 2019 ఏప్రిల్ 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2020లో అదాబ్ అనే కుమారుడు జన్మించాడు. 2022లో మరో శిశువు జన్మించగా.. పురిట్లోనే కన్నుమూసింది. కాగా ప్రాక్.. పంజాబీ, హిందీ భాషల్లో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా, సింగర్గా పని చేశాడు. ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు. కేసరి సినిమాలో తేరి మిట్టి పాటకుగానూ ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: ప్రియుడితో సినిమాకు.. కాబోయే అత్త కూడా వెంటే వచ్చేది: హీరోయిన్ -
ఖరీదైన అభిమానం.. సింగర్కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్!
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.బెంగాల్కు చెందిన ఇండియన్ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్ ఇటీవల యూఎస్లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ మికా సింగ్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..మికా సింగ్కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్ బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్తో ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మా అక్కను చూశాక పెళ్లంటేనే భయమేస్తోంది: నటి
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అదృష్టం కూడా ఉండాలితర్వాత బెయిల్పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి. పెళ్లి అంటేనే భయంపెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
50 వేల పాటలు పాడిన సుశీలకు ఇప్పటికీ ఆ పాట విషయంలో బాధే (ఫొటోలు)
-
సింగర్గా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. 'కంగువా'లో (ఫోటోలు)
-
‘స్వర కోకిల’ శారదా సిన్హా కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. సోమవారం శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఆమెను బీహార్కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. బుధవారం పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్తో ఇటీవలే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇటీవలే శారదా సిన్హాకు బోన్ మ్యారో క్యాన్సర్ సోకింది. నాటి నుంచి ఆమె ఎయిమ్స్లోని ఆంకాలజీ మెడికల్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ ఒకటిన బీహార్లోని సుపాల్ జిల్లాలోని హులాస్లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.శారదా సిన్హా మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ఇలా రాశారు ‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతితో నేను చాలా బాధపడ్డాను. ఆమె పాడిన మైథిలి, భోజ్పురి జానపద పాటలు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW— Narendra Modi (@narendramodi) November 5, 2024ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
మలయాళ రాక్స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
Tamara Dsouza: లవ్ తమారా
తమారా డిసూజా గురించి సింపుల్గా ఒక్కమాటలో చెప్పలేం! ఆమె.. ప్రతిభా గని! యాక్ట్రెస్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గాయని, ఉకులెలె ప్లేయర్ కూడా!ఆ గుర్తింపు తమారా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో నటననే ఫుల్టైమ్ జాబ్గా ఎంచుకుంది. ఆమె తాజా చిత్రం ‘లవ్ సితారా’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.తమారా తన నటనతోనే కాదు గాత్రంతోనూ ఆకట్టుకుంటోంది. ప్రీతమ్, షాన్, నీతీ మోహన్, ఏఆర్ రెహమాన్ లాంటి మహామహులతో కలసి పాడుతోంది. నటన, సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్లతో క్షణం తీరికలేని షెడ్యూల్స్లో ఎప్పుడన్నా సమయం చిక్కితే సోలో ట్రావెల్కి వెళ్లిపోతూ, ఉకులెలె ప్లే చేస్తూ ఆస్వాదిస్తోంది.తమారా .. ముంబైలో పుట్టి, పెరిగింది. కామర్స్ అండ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పుచ్చుకుంది.చదువైపోగానే ‘రెయిన్ డ్రాప్ మీడియా’ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. విద్యా బాలన్, శ్రుతి హాసన్, ఫరా ఖాన్, బొమన్ ఇరానీ లాంటి యాక్టర్స్ కోసం పనిచేసింది. అంతేకాదు రేస్ 2, వికీ డోనర్, హౌస్ఫుల్ 2 లాంటి సినిమాలకు పీఆర్ ఈవెంట్స్నూ నిర్వహించింది.ఏడాది తర్వాత ఆమె ఖీఐ్క ఇండస్ట్రీస్ లిమిటెడ్లో చేరింది.. మార్కెటింగ్, ప్రమోషన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా. ఆమె పనితీరుకు ముచ్చటపడిన వైకింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సద్వినియోగం చేసుకుంది తమారా. ఇందులో ఉన్నప్పుడే ఆమె చురుకుదనం, సమయస్ఫూర్తికి మెచ్చి పలు యాడ్ ఏజెన్సీలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసే చాన్స్నిచ్చాయి. అలా తమారా.. తనిష్క్, టైటాన్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్లో కనిపించింది.ఆ కమర్షియల్ యాడ్సే తమారా వెబ్స్క్రీన్ ఎంట్రీని ఖరారు చేశాయి. మేడిన్ హెవెన్, లిటిల్ థింగ్స్, హెలో మినీ లాంటి వెబ్ సిరీస్లలో నటించే అవకాశాన్నిచ్చాయి. ఆమె నటనకు సిల్వర్స్క్రీన్ కూడా స్పేస్ ఇచ్చింది. ‘క్లాస్ ఆఫ్ 83’ , ‘అటాక్’ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.యాడ్స్, వెబ్, సినిమా.. ఈ మూడిట్లో నటించే అవకాశం.. నాకు యాదృచ్ఛికంగా అందిన వరమని చెప్పుకోవచ్చు! సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వగైరా వగైరా.. నేను ఇష్టపడి, నేర్చుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే సాధించినవి. కానీ నటన విషయం అలాకాదు. నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. కంటిన్యూ అవుతోంది. – తమారా డిసూజా -
USA Presidential Elections 2024: కమలా హారిస్కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు మద్దతు పలికారు. క్లీవ్లాండ్లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఫ్రెండ్స్తో పార్టీ.. రూ.38 లక్షల బిల్లు కట్టా: సింగర్
చేతిలో డబ్బున్నంతవరకు ఖర్చుచేయడం చాలామందికి దురలవాటు. ఇలాంటి చెడు అలవాటు ఒకప్పుడూ తనకూ ఉండేదంటున్నాడు ప్రముఖ సింగర్ హనీ సింగ్. పార్టీల పేరుతో దుబారా ఖర్చు చేసేవాడినంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా జీవితంలో ఎక్కువ డబ్బు పార్టీలకే వెచ్చించాను. జేబులో ఉన్నదంతా బిల్లు కట్టేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేవాడిని. అప్పట్లో చాలా కాస్ట్లీఅలా 2013లో ఓసారి ఎనిమిది మంది ఓ క్లబ్లో పార్టీ చేసుకున్నాం. అప్పట్లో దుబాయ్లో ఉండాలంటే చాలా డబ్బులు వెచ్చించాలి. ఇప్పుడలా లేదనుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్ అందరం కూర్చుని తాగాం. మా టేబుల దగ్గరకు అమ్మాయిలు కూడా వచ్చారు. 23 మంది అమ్మాయిలను మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం. రూ.38 లక్షల బిల్లుఫుల్లుగా తాగాం, తిన్నాం. కట్ చేస్తే రూ.38 లక్షల బిల్లు కట్టమన్నారు. ఒక్క రోజుకు లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు క్రెడిట్ కార్డులు వాడాను అని చెప్పుకొచ్చాడు. హనీసింగ్ ఈ మధ్యే గ్లోరీ ఆల్బమ్ రిలీజ్ చేశాడు. మీర్జా, తు మేరా 22 మై తేరా 22, ద ఎక్స్పోజ్, జొరావర్ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్కు ముందే ఆ రికార్డ్ క్లోజ్ -
స్వీయ వివాహం చేసుకున్న హాలీవుడ్ పాప్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు నాతో నాకే పెళ్లి జరిగింది. మీకిది తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం అని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.మూడు పెళ్లిళ్లు పెటాకులుకాగా బ్రిట్నీస్పియర్స్ మొదటగా చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ను పెళ్లాడింది. 2004లో వీరి వివాహం జరగ్గా కొద్ది రోజులకే విడిపోయారు. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్, నటుడు కెవిన్ ఫెడెర్లైన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు. దీంతో 2007లో విడిపోయారు. అనంతరం బ్రిట్నీ.. 2016లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ చేసింది. 2022లో వీరు పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోయారు. ఈ మధ్యే విడాకులు సైతం మంజూరయ్యాయి.చదవండి: అప్పుడేమో సినిమాలతో బిజీ.. ఇప్పుడేమో పిల్లలుంటే బాగుండని ఫీలవుతున్న నటుడు -
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
కొరియన్ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు
‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కనిపించాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు. (చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్చేస్తే నేడు ఆమె..!) -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్లైట్లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
సింగర్ గీతామాధురి కొడుకుని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)


