Surya
-
ఎంపీ తేజస్వి పెళ్లి ఖాయం
బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చెన్నైకి చెందిన గాయకురాలు శివశ్రీ స్కంధ ప్రసాద్తో పెళ్లి ఖాయమైనట్లు తెలిసింది. కొత్త ఏడాది మార్చిలో వివాహ వేడుక జరగనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే మంగళవారం ప్రకటించారు. ఇక, శివశ్రీ.. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ఇక, తేజస్వి సూర్య.. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే.ప్రముఖ సింగర్తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు) ಸಂಸದ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಅವರು ಇದೀಗ ಗಾಯಕಿ, ಭರತನಾಟ್ಯ ಕಲಾವಿದೆಯಾಗಿರುವ ಚೆನ್ನೈ ಮೂಲದ ಸಿವಶ್ರೀ ಸ್ಕಂದಕುಮಾರ್ ಎನ್ನುವವರನ್ನು ವರಿಸಲು ಸಜ್ಜಾಗಿದ್ದಾರೆ. ಮಾರ್ಚ್ 4ಕ್ಕೆ ವಿವಾಹ ನಡೆಯಲಿದೆ#2025Wedding#TejasviSuryaWedding #TejasviSuryabride #sivasriskandaprasad pic.twitter.com/3xmUPRRuPJ— ಎ ಜೆ ಕ್ರಿಯೇಷನ್ಸ್ (@AjUniversal1) December 31, 2024 -
ఫాన్స్ షాక్ ఇచ్చిన పూజ హెగ్డే.. సూర్యతో డీ గ్లామర్ లుక్
-
రోలెక్స్ వచ్చేస్తున్నాడు.
-
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
కంగువ కిక్ ఇచ్చింది: శివ
‘‘సిల్వర్ స్క్రీన్స్ పై కొత్త ప్రపంచాలను, సరికొత్త నేపథ్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆ తరహా సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుంతోంది. ఈ అంశాలే నన్ను ‘కంగువ’ సినిమా చేసేలా ప్రేరేపించాయి. ‘కంగవ’ పూర్తిగా కల్పిత కథ. ప్రతి ఒక్కరి లోపల ఓ యుద్ధం ఉంటుంది. అలాగే బయట పరిస్థితులతోనూ యుద్ధం చేస్తుంటారు. ఈ రెండు యుద్ధాలను బ్యాలెన్స్ చేసిన ఓ యుద్ధవీరుడి కథే ‘కంగువ’’ అని దర్శకుడు శివ అన్నారు.సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం ‘కంగవ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ–‘‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం నాటి పాత్ర కంగువ. ప్రస్తుత పాత్ర ఫ్రాన్సిస్. నాన్స్ –లీనియర్ స్క్రీన్స్ ప్లేతో ఈ కథ రెండు డిఫరెంట్ టైమ్లైన్స్ లో జరుగుతుంది.ఈ రెండు టైమ్లైన్స్, క్రియేటివ్ స్పేస్, కమర్షియల్ అంశాలు.. ఇవన్నీ ‘కంగువ’లో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడం ఓ దర్శకుడిగా నాకు కిక్ ఇచ్చింది. ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద సినిమా చేయగలిగాను. ‘యానిమల్’ సినిమాకి ముందే బాబీడియోల్గారు మా చిత్రంలో భాగమయ్యారు. ఓ షాడో కాప్గా దిశాపటానీ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా దగ్గర కొన్ని కథలున్నాయి. అవకాశం వస్తే తెలుగు హీరోలతో చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. -
ముంబైకి షిఫ్ట్ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య
కోలీవుడ్లో బెస్ట్ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సూర్య చెప్పారు.తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్లో శ్రీకాంత్, కాదల్- ది కోర్, సైతాన్ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది. మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు. -
నవంబరులో స్టార్ట్
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనుంది. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను నవంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్లో ఆర్జే బాలాజీ బిజీగా ఉన్నారు. ఈ కథపై ఆయన ఏడాదిగా వర్క్ చేస్తున్నారు. చిత్రీకరణకు అనువైన లొకేషన్ల సందర్శన కూడా చేస్తున్నారాయన’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్ . -
'కర్ణుడి'గా సూర్య..! బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..
-
కర్ణ ఆగడు
‘‘ఇక ‘కర్ణ’ లేనట్లే... ఆగిపోయింది’’ అంటూ ప్రచారంలో ఉన్న వార్తలకు బ్రేక్ పడేలా ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. సూర్య టైటిల్ రోల్లో రాకేశ్ ఓంప్రకాశ్ ‘కర్ణ’ అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా గురించిన వార్త వచ్చింది. ఆ తర్వాత అప్డేట్ లేకపోవడంతో ‘కర్ణ’ ఆగిపోయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘కర్ణ’ ఆగడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి’’ అని తాజాగా పేర్కొన్నారు ఓంప్రకాశ్. మహాభారతం నేపథ్యంలో రూపొందనున్న ‘కర్ణ’లో కర్ణుడిగా సూర్య నటించనున్నారు.కర్ణుడి భార్యపాత్రకు జాన్వీ కపూర్ని తీసుకోవాలనుకుంటున్నారట. సంగీతదర్శకత్వానికి ఏఆర్ రెహమాన్ని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో చిత్రీకరించి, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి రచయిత ఆనంద్ నీలకంఠన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. హిందీలో సూర్యకి ఇదే తొలి చిత్రం అవుతుంది. -
తమిళ సినిమాని వదిలేస్తున్న సూర్య
-
ప్రభాస్ పాత్రలో సూర్య..?
-
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య!?
-
ఒకే మూవీలో ప్రభాస్, సూర్య..ఇక బాక్సాఫిస్ షేక్ అవ్వాల్సిందే..
-
ప్రతిభ చూపి అమెరికాకు!
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ విద్యలో చూపిన ప్రతిభ కారణంగా అమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని సాధించింది. నిరు పేద కుటుంబానికి చెందిన సూర్యతేజశ్రీ తల్లి నాగమణి.. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. విజయవాడ ఈడ్పుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ అండ్ నీట్ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసింది. గతేడాది అమెరికా ఫీల్డ్ సరీ్వసెస్ సంస్థ(ఏఎఫ్ఎస్) కెన్నెడి లూగర్ యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించింది.12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్లో 17 ఏళ్ల సూర్యతేజశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని హోప్కిన్లో ఏడాది పాటు ఉచితంగా డిప్లమో కోర్సును అభ్యసించేందుకు అర్హత సాధించింది. ఉచిత శిక్షణతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఏఎఫ్ఎస్ సంస్థ భరించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యతేజశ్రీ అమెరికా వెళ్లనుంది. ఏపీ ప్రతినిధిగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ తెలియజేయడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నుంచి రూ.లక్ష నగదు, ల్యాప్టాప్ను సూర్యతేజశ్రీ అందుకుంది. -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య
కోలీవుడ్లో హీరో సూర్యకు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వస్తుదంటే చాలు వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్రెడిట్ను సూర్యకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఏమైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా కట్టకట్టుకుని నిలబడతారు. కోలీవుడ్లో సూర్యకు ఎంత గుర్తింపు ఉందో ఆయన అభిమానులకు కూడా సామన్యప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జులై 23న సూర్య పుట్టినరోజు రానుంది. ఈ క్రమంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.సూర్య పుట్టినరోజు సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని అభిమానులకు సూర్య మాటిచ్చారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా సూర్య కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం మరో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతామని ఆయన ఫ్యాన్స్ తెలిపారు.సుమారు ఏడేళ్ల క్రితం హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ...చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన పిల్లలకు బంగారపు ఉంగరాలను అందించారు. అప్పట్లోనే అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అలా ఆయన అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా ఫ్యాన్స్ నిలిచారు. పరిస్థితులు చక్కపడ్డాక వారందరినీ భోజనానికి సూర్య ఆహ్వానించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగ గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. -
దిష్టి తగిలేంత అందంగా సూర్య - జ్యోతిక.. సూపర్ జోడీ! (ఫొటోలు)
-
దసరాకి కంగువ
దసరా పండక్కి థియేటర్స్కు వస్తున్నాడు ‘కంగువ’. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ అండ్ టైమ్ ట్రావెల్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల చేస్తున్నట్లుగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు సూర్య. రిలీజ్ డేట్ని బట్టి ‘కంగువ’ దసరా పండగ సందర్భంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ‘కంగువ’ సినిమా డిఫరెంట్ టైమ్లైన్స్ లో ఉంటుందని, సూర్య ఐదారు గెటప్స్లో కనిపిస్తారని, ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్తో కలిసి ట్రక్కులో కాశ్మీర్కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
I20 Movie: స్త్రీల గౌరవం పెంచేలా ‘ఐ 20’
సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20", బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మంచి సందేశం ఉన్న చిత్రం. ఈ చిత్రం జూన్ 14న విడుదల అవుతుంది.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మన దేశం లో స్త్రీ లను ప్రత్యేకంగా గౌరవీస్తాం. వాళ్ళ గౌరవం గురించే ఈ చిత్రాని నిర్మించాం. కథ చాలా బాగా వచ్చింది. మంచి రొమాన్స్ ఉంది, కామెడీ అయితే అద్భుతంగా వచ్చింది.ఇప్పటికి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది, మొదటగా జూన్ 7 న విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు నా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి అని జూన్ 14 విడుదల చేస్తున్నం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో ఉంది కావున మా సినిమా పక్కాగా విజయం సాధిస్తుంది" అని అన్నారు. -
పడమ్ బిగిన్స్
కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ఆరంభమైంది.సూర్య కెరీర్లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్ బిగిన్స్’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. -
అండమాన్లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. -
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
-
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్లో 97, గణితంలో 94, ఫిజిక్స్లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్లో 98, సోషల్లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్ఫోన్ టార్చ్లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్ఫోన్లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్లైన్స్లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
Tejasvi Surya Assets: ఎంపీ అయిన ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన ఆస్తులు!
దేశంలో ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు వేసవి తాపం.. రెండు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. పలువురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. తెజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సూర్య తన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్థిరాస్తి లేదని బీజేపీ ఎంపీ వివరించారు. కాగా ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.13 లక్షలుగా చూపించారు. ఇప్పుడు వాటి విలువ 31.5 శాతాన్ని దాటింది. సూర్య మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్లో రూ.1.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.1.79 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో అధికంగా పెట్టుబడులు పెట్టానని, మార్కెట్లో బూమ్ కారణంగా తన సంపద పెరిగిందని సూర్య తన అఫిడవిట్లో వివరించారు. సూర్య ..బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ పూర్వ విద్యార్థి. కర్ణాటక హైకోర్టులో న్యాయవాది. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్ ఎంపీగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్లో ప్రతి వర్కౌట్ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ప్రేమ... నవ్వు... యుద్ధం
‘లవ్... లాఫ్టర్... వార్...’ అంటూ సూర్య కొత్త చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా ప్రకటించిన సందర్భంగా ‘లవ్... లాఫ్టర్... వార్...’ (ప్రేమ.. నవ్వు.. యుద్ధం) అని ఉన్న పోస్టర్ని ఎక్స్లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య తనకు ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన దేశ భక్తి చిత్రం ‘రామ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) . రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 16న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సంపాదించుకుంది. దర్శకుడు మిహిరామ్ వైనతేయకి ఇది తొలి సినిమానే అయినా.. మంచి పేరును తీసుకొచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ‘రామ్’ కథేంటి? హైద్రాబాద్లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న బృందా శివకుమార్కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
సూర్య 'కంగువ' టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్ గ్రీన్ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్-1 ఇదే 2024లోనే విడుదల కానుంది. -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్లో కూడా కాలేజ్కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్స్టర్గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
పుష్పరాజ్ కోసం రోలెక్స్..!
-
అభిమానులతో సూర్య విందు.. ఎందుకో తెలుసా..?
గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా నిలిచిన ఫ్యాన్స్ అందరినీ సూర్య కలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి సహా దక్షిణాది జిల్లాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది సామాన్య ప్రజలు తినేందుకు ఆహారంతో పాటు దుస్తులు లేక తీవ్రమైన అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వం కూడా తక్షణమే అనేక సహాయకచర్యలు ప్రారంభించింది. సామాన్య ప్రజల ఇబ్బందులను చూసి చలించిన కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు వెంటనే రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను తగ్గే వరకు ఆ ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.. ఇవన్నీ చేయాలంటే సరైన వర్కర్స్ కావాలి.. అప్పుడు సూర్య తన ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన అభిమానులు తుపాను తగ్గేవరకు పలు సేవలు చేశారు. అభిమానులు చేసిన సేవను గుర్తించిన సూర్య.. వారందరీని ఒక్కసారి కలుసుకోవాలని ఆహ్వానించి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో తుపాను కారణంగా నష్టపోయిన ప్రజల కోసం పనిచేసిన సూర్య అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ స్వయంగా సూర్య కాల్ చేసి పిలిచారు. వారందరికి శాఖాహార విందును ఆయన ఏర్పాటు చేశారు. తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే వారితో కలిసి ఫోటో దిగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటుడు సూర్య. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య 'కంగువా'లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. -
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
తమ్ముడు తరువాత అన్నయ్యతో అదితి
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నటుడు కార్తీతో జతకట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదితి శంకర్కు అవకాశాలు వరుస కడుతున్నాయి. విరుమాన్ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దివంగత నటుడు మురళి రెండో కొడుకు మురళీ ఆకాశ్తో జత కడుతున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా త్వరలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కార్తీతో నటించిన అదితి శంకర్ తదుపరి ఆయన అన్నయ్యతో జత కట్టనున్నారన్నమాట. అయితే సూర్య సరసన నటించే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్ను తాజాగా మరో అవకాశం వరించింది. శ్రీవారి ఫిలిం పతాకంపై పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలోని నటుడు అధర్వ మురళి కథానాయకుడుగా నటించనున్నారు. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అదితి శంకర్ కథానాయకిగా నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీడియాతో నటుడు అధర్వ పేర్కొంటూ శ్రీవారి ప్రిలిమ్స్ సంస్థ అధినేత పి రంగనాథన్ చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన నిర్మాత, పంపిణీదారుడు అని అన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలను నిర్మించడంలో ఈయనకు అందేవేసిన చెయ్యి అని అన్నారు. అలాంటి నిర్మాత వద్ద పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి జనరంజకమైన కథనం ఎంపిక చేసి, అందుకు అవసరమైన ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. దర్శకుడు ఎం రాజేష్ దర్శకత్వంలో పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలో తాను నటించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు అధర్వ మురళి పేర్కొన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నిరాశ పరచదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో మురళీఆకాష్ సరసన నటిస్తున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య అధర్వ మురళితో జతకట్టబోతున్నారన్నమాట. -
హీరోయిన్పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
RAM Movie Review: ‘రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్టైన్మెంట్ & ఓ ఎస్ యం విజన్ నిర్మాత:దీపికాంజలి వడ్లమాని కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే... హైద్రాబాద్లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు. శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ను ఫుల్ సీరియస్ మోడ్లో నడిపించాడు. క్లైమాక్స్ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరెలా నటించారంటే? రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్కు, సెకండాఫ్కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి. రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
కల్లర్ మ్యాజిక్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్గా, ట్యాన్ అయిన స్కిన్తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్లో కనిపిస్తారు. -
దేశభక్తిని చాటే ‘రామ్’
రిపబ్లిక్ డేకి ప్రతీ ఏడాది బాలీవుడ్ నుంచి పేట్రియాటిక్ సినిమాలు వస్తుంటాయి. మన టాలీవుడ్ నుంచి ఇలాంటి జానర్లు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఓ దేశభక్తి చిత్రం రిపబ్లిక్ డేకి రాబోతోంది. ఈ మేరకు మేకర్లు అధికారికంగా ప్రకటించారు. కమర్షియల్ ఫార్మాట్లో పేట్రియాటిక్ జానర్లో తెరకెక్కించిన రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ మేరకు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓఎస్ఎం విజన్తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అందరిలోనూ అంచనాలు పెంచిన ఇక ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
జీవితం అనేది యుద్ధం
సూర్య అయ్యల సోమయాజుల హీరోగా, మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’. ఇందులో ధన్యా బాలకృష్ణ హీరోయిన్. దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ను డైరెక్టర్ శైలేష్ కొలను విడుదల చేశారు. ‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది’ అనే డైలాగ్స్తో ట్రైలర్ సాగుతుంది. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు... అధికారులది కాదు... రాజకీయ నాయకులది మాత్రమే... మీరు అప్పుడూ బానిసలే... ఇప్పుడూ బానిసలే... ఎప్పుడూ బానిసలే’ అంటూ ‘శుభలేఖ’ సుధాకర్ చెప్పిన డైలాగ్ కూడా ఉంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఏంట్రా ఒక్కదానికేనా?.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్?.. ఆసక్తిగా ట్రైలర్!
సూర్య, ధన్య బాలకృష్ణ జంటగా రాబోతున్న చిత్రం రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి కథాంశంగా ఈ చిత్రాన్ని మిహిరామ్ వైనతేయ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓఎస్ఎం విజన్తో దీపికాంజలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో దేశభక్తి చాటి చెప్పే కథాంశంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. త్రివర్ణ పతాకాన్ని చూపించే గన్ షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
మా గుండెల్లో ఉంటావ్ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
గతేడాది చివర్లో కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్తోనే మొదలైంది. వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్ను గుర్తించిన విజయకాంత్ అతని రోల్ మరింత సమయం ఉండేలా డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్లో 4వ చిత్రంగా వచ్చింది. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్గా మారిన నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు. View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) -
ఆ హిట్ డైరెక్టర్తో స్టార్ హీరో మరో సినిమా.. !
వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్ రాజా యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కంగువ తర్వాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్కుమార్ మంగళవారం తన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మిచౌంగ్ ఎఫెక్ట్.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరోలు!
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. 'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. -
కడపకు కంగువా
కడపకు పయనమవ్వనున్నారట కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువా’. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను కడపలో ప్లాన్ చేశారని, ఈ నెల రెండో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కడపలో జరగనుందట. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్లో విడుదల కానుంది. -
స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్గా ఎవరంటే?
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి స్టార్గా ఎదిగిన వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారాయన. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తండ్రిబాటలోనే పయనించేందుకు ఆయన వారసుడు వచ్చేస్తున్నాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫీనిక్స్' అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్మన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంతో అరసు డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. గతంలో ఆయన ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్గా పనిచేశారు. కాగా.. ఆయన కుమారుడు సూర్య 'నానుమ్ రౌడీ ధాన్'లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. ఆ తర్వాత 'సింధుబాద్'చిత్రంలో సహాయక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విడుతలై పార్ట్ 2'లో సూర్య కనిపించనున్నారు. కాగా... ఈ చిత్రానికి సీఎస్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ అరసు తెలిపారు. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లేదంటున్న క్రేజీ బ్యూటీ
పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా అతి కొద్దిమంది హీరోయిన్లలలో హన్సికా మోత్వాని ఒకరు. ఈ ముంబై బ్యూటీ కథానాయకిగా ఎక్కువ పేరు, డబ్బు గడిచింది మాత్రం తెలుగు, తమిళం భాషా చిత్రాలతోనే. టాలీవుడ్లో దేశముదురు చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టింది. మాప్పిళై చిత్రంతో తమిళంలోనూ కథానాయకిగా రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా హిట్ కొట్టింది హన్సిక. సౌత్లో ఈ రెండు భాషల్లోనూ గట్టి పునాదినే వేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శింబు స్టార్ హీరోల సరసన గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ కలిపి 50 చిత్రాల మైలురాయిని అధిగమించిన హన్సిక గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అందాలను మెరుగు పరచుకోవడంపై ఏమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. మొదట్లో కొంచెం బొద్దుగా ఉండి జూనియర్ కుష్బూగా ముద్ర వేసుకున్న హన్సిక ఆ తర్వాత చాలా స్లిమ్గా తయారైంది. ఇప్పటికీ ఈ అమ్మడు జిమ్లోనే ఎక్కువ సమయం గడుపుతుందట. అందాన్ని కాపాడుకోవడానికి తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా హన్సిక చేతిలో ఇప్పటికీ తెలుగులో 4, తమిళంలో 4 చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉండే విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని అలరిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
మరో సాహసం చేస్తున్న హీరో సూర్య
నటుడు సూర్య ఇటీవల వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్గా మారారనే చెప్పాలి. ఆయన సమీపకాలంలో నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలలో సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కంగువ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చారిత్రక కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక యోధుడుగా సూర్య పాత్ర గానీ గెటప్ గానీ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి కేఈ. జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కాగా విచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై కంగువపై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి నిర్మాతలు చేస్తున్నారు. కాగా నటుడు సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆకాశం నీ హద్దురా వంటి సూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి హిట్ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సూర్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అందులో కొడుకు కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఆయన తనను మలుచుకోవడానికి వర్కౌట్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు గాను ఆయన 20 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడట. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం సూర్యకు మాత్రమే సాధ్యం అని ఆయన ఫాన్స్ చెప్తున్నారు. కాగా మరో ముఖ్య పాత్రలో మలయాళ యువస్టార్ దుల్కర్సల్మాన్ను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా నవంబర్ రెండో వారంలో ఈ చిత్రం సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జీవి ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్న 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తాజా సమాచారం. -
రూ.25 లక్షల కోసం వెళ్లి మర్డర్ కేసులో ఇరుక్కున్నా: సై సూర్య
ఎన్నో సినిమాలు చేస్తే కానీ కొందరికి గుర్తింపు లభించదు. మరికొందరికి మాత్రం తొలి చిత్రంతోనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నటుడు సూర్య రెండో కోవలోకి వస్తాడు. ఇతడు రాజమౌళి సై సినిమాతో నటుడిగా క్లిక్ అయ్యాడు. ఆ నలుగురు చిత్రంతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించాడు. ఆ మధ్య ఓ హత్య కేసులోనూ అతడి పేరు వినిపించడంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. పాతిక లక్షల కోసం వెళ్లి.. తాజాగా సదరు ఘటన గురించి సూర్యంగా వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను కలియుగ అనే సినిమా తీశాను. దానికోసం నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టేశాను. రిలీజ్కు రూ.25 లక్షలు అవసరమయ్యాయి. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేశ్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతడు చిన్న చిన్న సినిమాలకు డబ్బు అప్పుగా ఇస్తుంటాడు. నా సినిమా చూపించి డబ్బు అడిగాను. ఇక్కడేమైందంటే డబ్బులు అవసరమై చిగురుపాటి జయరాం అనే వ్యక్తిని కూడా కలిశాను. ఆ మరునాడే హత్య.. మీడియాలో నా పేరు పది రోజుల్లో డబ్బు సర్దుతానన్నాడు, సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ మరునాడే ఆయన హత్య జరిగింది. ముందు రోజు నేను ఆయనను కలవడంతో నామీద అనుమానపడ్డారు. సినిమా వాళ్ల గురించి ఎలా రాస్తారో తెలిసిందే! ఆ హత్యతో నాకసలు సంబంధమే లేదని రుజువైంది. కానీ అప్పటికే మీడియాలో నా గురించి ఏదిపడితే అది రాశారు. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇకపోతే కలియుగ సినిమా కోసం నా ఇల్లు కూడా ఇమ్మేశాను. ఈ మూవీ వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోంది' అని చెప్పుకొచ్చాడు సూర్య. చదవండి: మహాలక్ష్మిని, నన్ను ఎవరూ వేరు చేయలేరు.. ఎంతైనా తిట్టుకోండి.. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
తెలుగు టాప్ డైరెక్టర్తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?
భారతీయ సినిమా ఇప్పుడు ఎల్లలు దాటి చాలా కాలమైంది. ఇంతకుముందు ఒక భాషలో నిర్మించిన పెద్ద హీరో చిత్రాలు మాత్రమే ఇతర భాషల్లో అనువాదం అయ్యేవి. ఆ తర్వాత ద్విభాషా చిత్రాల ఒరవడి మొదలైంది. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల రూపకల్పన అధికం అవుతోంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని ఒక భాషలో రూపొందిస్తే వర్కౌట్కాని పరిస్థితి. సమీప కాలంలో ద్విభాషా చిత్రాలతో నటుడు కార్తీ, విజయ్, ధనుష్ వంటి వారు సక్సెస్ అయ్యారు. తాజాగా నటుడు సూర్య కూడా ఈ బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు తెలుగులో రక్తచరిత్ర అనే చిత్రంలో సూర్య నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా సూర్య తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ చిత్రం ఏకంగా 10 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఆయన ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ఏంటంటే సూర్య టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఇదేవిధంగా తెలుగులో ధనుష్, విజయ్, కార్తీ వంటి వారు సక్సెస్ అయ్యారు. ఒక్క శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కాగా సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం రూపొందడం నిజమే అయితే అది పక్కా మాస్ మసాలా చిత్రంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. సూర్య 'స్కంద' వరకు ఆగాల్సింది బోయపాటి ప్రాజెక్ట్ను సూర్య ఓకే చేసే విషయంలో తొందర పడ్డాడా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందుకంటే బోయపాటి ఎక్కువగా బాలకృష్ణతో మాత్రమే బ్లాక్బస్టర్లు ఇచ్చారు కానీ వేరే హీరోలతో అతడికి సరైన విజయాలు లేవని చెప్పవచ్చు. అఖండ సినిమాకు ముందు 'వినయ విధేయ రామ' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రామ్తో అతను చేసిన 'స్కంద' కూడా పెద్దగా బజ్ లేదు. బోయపాటి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ట్రైలర్ పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుంది. కానీ స్కంద ట్రైలర్ చూసిన మెజారిటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సినిమా విడుదల తర్వాత అభిప్రాయం మారవచ్చేమో చూడాలి. స్కంద హిట్ అయితే సూర్య సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం అనే వార్తలు కూడా వస్తున్నాయి. -
పలు గెటప్స్లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించే కథలు కొందరు స్టార్స్కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్లో కనిపించడం కమల్హాసన్కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్హాసన్ నాలుగుకి మించి గెటప్స్లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్చరణ్ ఏడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్పైకి వెళ్తుందని సమచారం. -
అష్టదిగ్బంధనం.. ఓ పజిల్
‘‘అష్టదిగ్బంధనం’ పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్లో మంచి సస్పెన్స్ కనపడుతోంది. అలాగే ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి’’ అని ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. సూర్య, విషిక జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఎంకేఏకేఏ ఫిలిం ్ర΄÷డక్షన్స్ సమర్పణలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాబా పీఆర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘సైదులు’.. రెండో చిత్రం ‘అష్టదిగ్బంధనం’. క్రైమ్, యాక్షన్, థ్రిల్, పజిల్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు మనోజ్ కుమార్ అగర్వాల్. ‘‘సినిమా పక్కా హిట్ అని నమ్ముతున్నాం’’ అన్నారు సూర్య. -
వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోలు
వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్. రెగ్యులర్గా వచ్చే ఫైట్స్కి భిన్నంగా సిల్వర్ స్క్రీన్పై ‘వార్’ కనిపిస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్ గురించి ఓ లుక్ వేయండి. దిక్కులెల్ల గెలిచినోడు.. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్ హైలైట్గా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్లో విడుదల కానుంది. ది వారియర్ విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్లాల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్ కొన్ని సీన్స్లో మోహన్లాల్ వారియర్గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది. దీనికి తోడు క్యాప్షన్లో ‘వారియర్’ ప్రస్తావన ఉండటంతో మోహన్లాల్ వారియర్గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్లాల్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బరోజ్’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన. స్వయంభూ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా ‘వార్’ బ్యాక్డ్రాప్లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. -
లిప్లాక్ సీన్కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!
సౌత్ సినీ ప్రపంచంలో త్రిష ఒక అద్భుతమైన తార. సుదీర్ఘ విరామం తర్వాత త్రిష మళ్లీ మళ్లీ యాక్టివ్గా మారింది. త్రిష చివరిగా తెరపైకి వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. సిరీస్లోని రెండు చిత్రాలలో త్రిష తన నటనతో ప్రశంసలు అందుకుంది. త్రిష- విజయ సేతుపతి జంటగా నటించిన 96 సినిమా ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోకి రీమేక్ చేయబడింది. ఈ సినిమా ద్వారా రామ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా జానుగా త్రిష ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష- విజయ్ సేతుపతి తమ నటనతో రామ్- జానుగా గుర్తింపు పొందారు. తమిళ్లో వచ్చిన ఈ సినిమాను చూసిన వారెవరూ వారిద్దరి పాత్రల్ని ఎప్పటికీ మరిచిపోరని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కోలీవుడ్ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు) సినిమా క్లైమాక్స్ సీన్లో అత్యంత హృదయాన్ని హత్తుకునే సన్నివేశం ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు పలికిన సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. ఎయిర్పోర్ట్లో ఆ సీన్ని పరిశీలిస్తే.. త్రిష, విజయ్ సేతుపతిలు ముద్దుల సీన్ లేకుండా కనిపించారు. బదులుగా, వారు తమ ముఖాలపై చేతులు ఉంచారు. అయితే స్క్రిప్ట్ ప్రకారం విజయ్ సేతుపతి, త్రిష ఈ సన్నివేశంలో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. అందుకు త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమాలో మాత్రం ఈ సీన్ మారిపోయింది. దానికి కారణం విజయ్ సేతుపతి. ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ చేయడానికి విజయ్ సేతుపతి సంకోచించాడు. ఆ సీన్ చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు చేయడు. ఇదే విషయాన్ని ఆయన డైరెక్టర్లకు ముందే చెబుతాడట. సేతుపతిలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ వంటి నటులు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి నిరాకరించే నటులే. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తర్వాత విజయ్తో త్రిష నటిస్తున్న చిత్రం లియో కాగా విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం జవాన్ విజయంతో దూసుకుపోతున్నాడు. -
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన శంకర్ కూతురు
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. కాగా తదుపరి రాక్షసన్, చిత్రం ఫేమ్ రామ్కుమార్ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) ఇప్పుడు నటుడు సూర్యతో జతకట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటించిన సూర్య ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. కాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోందనే విషయం తెలిసిందే. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా కార్తీతో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యతో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరో విషయం ఏమిటంటే నటుడు సూర్య దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ రోలెక్స్ పాత్రలో అభిమానులను మెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న లుక్లో కమల్ హాసన్ కనిపించారు. డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్రలో సినిమా చూడాలని సూర్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య.. రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి : పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్!) సూర్య మాట్లాడుతూ..' ప్రస్తుతం నేను కంగువా సినిమాతో బిజీగా ఉన్నా. మేము అనుకున్న దానికంటే వందరెట్లు బాగా వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నా. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. దర్శకుడు వెట్రిమారన్ విడుదలై -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబోలో వాడి వసల్ మొదలవుతుంది. ఇకపోతే లోకేశ్ కనగరాజ్ రోలెక్స్పై కథ చెప్పారు. అది చాలా బాగా నచ్చింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఇరుంభుకై మాయావి చేస్తామని.' అన్నారు. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరోవైపు లోకేశ్ ప్రస్తుతం.. విజయ్తో లియో మూవీ చేస్తున్నారు. కాగా.. సూర్య ప్రస్తుతం నటిస్తోన్న కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. (ఇది చదవండి : చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) -
విశాల్పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్
ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ కాగానే అబ్బాస్పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో అబ్బాస్ కటింగ్ చేయండని సెలూన్ షాపుల్లో యూత్ క్యూ కట్టేవారు. అబ్బాస్ రొమాంటిక్ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా కొన్ని సినిమాలతోనే ఫుల్స్టాప్ పడిపోయింది. ప్రేమదేశం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేదు. చేసేదేమి లేక కుటుంబం కోసం చివరికి సహాయక పాత్రలలో నటించడం ఆయన కొనసాగించాడు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు. (ఇదీ చదవండి: బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్ హీరోయిన్) తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని గడిపాడు. అబ్బాస్ ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు లేకుండా పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఇక్కడ జీవించాడు. విదేశాల్లో పెట్రోల్ పంప్ వర్క్, ట్యాక్సీ డ్రైవింగ్, నిర్మాణం వంటి ఉద్యోగాలు చేశానని అబ్బాస్ బాహాటంగానే చెప్పాడు. తాజాగ ఇండియాకు తిరిగొచ్చిన అబ్బాస్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరోల గురించి అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్, విజయ్, సూర్య, విశాల్ తదితరుల గురించి అబ్బాస్ ఇలా మాట్లాడారు. అజిత్ను వైద్యలు కూడా హెచ్చరించారు కానీ అజిత్కు మంచి వ్యక్తిత్వం ఉందని అబ్బాస్ చెప్పారు. ఒకరకంగా అజిత్ తనలాంటి వాడేనని ఆయన అన్నారు. అజిత్ ఏదైన ఒక విషయంపై మాట్లాడితే అవి కత్తిపై చెక్కర పూసిన మాదిరి ఉండవు. ఎలాంటి టాపిక్పైనా కానివ్వండి సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్ ఇలా పంచుకున్నారు. 'అతను మూర్ఖత్వాన్ని సహించడు. అతనిలో ఏ హీరోలో కనిపించని ఉత్సాహం ఉంది. అతనికి ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించినప్పటికీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు. అతనిలో అభిమానుల పట్ల అచంచలమైన అంకితభావం ఉంది. అందుకే అజిత్ను ఫ్యాన్స్ అంతగా ఇష్టపడుతారు. వారి ప్రేమే అయన్ను ముందుకు నడిపిస్తుంది.' అని అజిత్ గురించి అబ్బాస్ అన్నారు. విజయ్ సినిమాలంటే ఇష్టం లేదు: అబ్బాస్ విజయ్ మృదుస్వభావి... డౌన్టు ఎర్త్గా ఇప్పటికీ ఆలాగే ఉన్నాడు. అతను ఏదైనా అతిగా చేయడు. అయితే మంచి హాస్యం కలవాడని అబ్బాస్ పేర్కొన్నాడు. మొదట్లో విజయ్ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. తన సినిమాలు సమాజానికి మంచి సందేశాలు ఇస్తాయని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. సూర్యను నడిపించే శక్తి ఎవరంటే: అబ్బాస్ సూర్య గురించి, అబ్బాస్ ఇలా అన్నాడు 'సూర్య తన తొలి చిత్రం 'నెరుక్కు నెర్' నుంచి నాకు తెలుసు. సినిమా కెరీయర్ ప్రారంభంలో అతనిలో చాలా సిగ్గు కనిపించేది. కెమెరా ముందుకు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. కానీ రానురాను అతని జీవితంలో అద్భుతమైన పరివర్తనను చూడటం నిజంగా ఆకర్షణీయంగా ఉంది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో సూర్య అద్భుతం, పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య విజయానికి జ్యోతిక సపోర్ట్ పెద్ద కారణం. సూర్య నిస్సందేహంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయినప్పటికీ, అతని విజయం వెనుక జ్యోతిక అనే శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నటీనటులందరికీ ఆయన బెంచ్మార్క్.' అని సూర్య గురించి అబ్బాస్ అన్నారు. విశాల్పై అబ్బాస్ పగ చాలా ఏళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్తో గొడవ జరిగిందని అబ్బాస్ మొదటిసారి రివీల్ చేశాడు. 'నా పట్ల విశాల్ వ్యవహరించిన తీరుతో చాలా కోపం వచ్చింది. అతను చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే హాయ్ అని కూడా చెబుతాను. కానీ విశాల్తో మాత్రం ఎప్పటికీ సన్నిహితంగా ఉండను. సినిమా పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతర లక్ష్యం. కానీ విశాల్ విషయంలో అది జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి దారితీసింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్ రెండో సీజన్లో అతనితో ఒక గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. బహుశా, ఒకరోజు అతను ఈ విషయంపై గ్రహించాడని అనుకుంటున్న. అంతిమంగా, అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం. ఒక కుటుంబంలో విభేదాల రావడం సహజం.' అని అబ్బాస్ పేర్కొన్నారు. -
తమ్ముడిని పక్కన పెట్టిసిన సూర్య.. అసలు ప్లాన్ ఇదేనా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువా. నటి దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున 10 భాషల్లో 3డీ ఫార్మెట్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇటీవలే కంగువా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను విడుదల చేయగా సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కంగువా చిత్రం 2024 సమ్మర్ స్పెషల్గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల.. దుస్తులు తొలగించి ఆపై..) కాగా సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్ళకత్వంలో ఈయన మరోసారి నటించనున్నారు. ఈ కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తాజా సమాచారం. ముందుగా ఇందులో సూర్య, ఆయన సోదరుడు కార్తీ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ తమ్ముడిని పక్కన పెట్టి దుల్కర్ను తీసుకోవాలని సూర్య సూచించారట. దీనికి ప్రధాన కారణం మళయాల పరిశ్రమలో మార్కెట్ పెంచుకునేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) అయితే ఇప్పుడు సూర్యతో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు తెలిసింది ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రాన్ని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నట్లు సమాచారం. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. దీనికి జీవి ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. ఇది ఆయనకు 100 చిత్రం కావడం విశేషం. చిత్ర షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమవుతుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. దీని తర్వాత సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రాన్ని చేస్తారని సమాచారం. -
కార్తీ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్,నిర్మాత ఎవరో తెలుసా?
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు కార్తీ. ఇటీవల సర్ధార్, పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈయన తాజాగా తన 25వ చిత్రం జపాన్ చిత్రాన్ని పూర్తిచేశారు. రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తోంది . ఇప్పుటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లు విడుదలై చిత్రంపై మంచి అంచనాలు పెంచాయి. ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: రజనీ సార్ కాపాడండి.. నా కూతురు నగలు కూడా తాకట్టు పెట్టా: నిర్మాత) కాగా ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీ 27వ చిత్రానికి సంబంధించిన వార్త కూడా వెలువడింది. దీన్ని చిత్ర వర్గాలు ప్రకటించకపోయినా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో కార్తీ 27వ చిత్రానికి తాను ఛాయాగ్రహణం అందించనున్నట్లు చెప్పారు. దీనికి 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ దర్శకత్వం వహించనున్నారని, సూర్య, జ్యోతికల 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ త్వరలో వెలువడించనుందని ఆయన చెప్పారు. కాగా కార్తీ హీరోగా పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్ 2, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రాలు రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇప్పుటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
స్టార్ హీరోలందరూ అలాంటి స్టోరీలతోనే!
ప్రతీకారం కోసం ఒకరు... ఆట కోసం ఇంకొకరు. ప్రేమ కోసమై మరొకరు... ఇలా ఒక్కో కారణం కోసం ఒక్కో స్టార్ తీరప్రాంతాలకు పయనమవుతున్నారు. తీరప్రాంతాల నేపథ్యంలో ఆ తారలు చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. గోవా...కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా గ్లింప్స్ వీడియోను బట్టి ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంతో సాగుతుందని ఊహించవచ్చు. కానీ కథ పరంగా ఈ చారిత్రాత్మక నేపథ్యం సినిమాలో కొంత భాగం వరకే ఉంటుందని, ఈ సినిమా కథ ప్రధానంగా తీరప్రాంతమైన గోవా నేపథ్యంలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో ‘కంగువా’ సినిమా గోవాలో ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక సూర్య, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో ‘కంగువా’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘కంగువా’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది, తొలి భాగం తమిళ సంవత్సరాదికి ఏప్రిల్ 12న విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. గేమ్ స్టార్ట్ సముద్రతీరప్రాంతాల్లో కబడ్డీ ఆడనున్నారట హీరో రామ్చరణ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో దర్శకుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. అలాగే ఈ సినిమా కథ ‘ఉప్పెన’ తరహాలో మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుందట. అందుకే వైజాగ్, కాకినాడ వంటి లొకేషన్స్లో ఈ సినిమా మేజర్ షూటింగ్ని జరిపేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కథ రీత్యా ఈ సినిమాలో రామ్చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ అన్నదమ్ముల్లో ఓ పాత్ర దివ్యాంగుడని భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్న, జాన్వీ కపూర్ వంటివార్ల పేర్లు తెర పైకి వచ్చాయి. వచ్చే ఏడాదిప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తీరప్రాంత దేవర ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రకథ సముద్ర తీరప్రాంతం నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాప్రారంభోత్సవంలో కొరటాల శివ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దేశంలో విస్మరణకు గురైన సముద్ర తీరప్రాంతంవారి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇందులో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఎన్టీఆర్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్గా ఉంటాయని టాక్. అలాగే ‘దేవర’ సినిమాకు సంబంధించిన ఓ షూటింగ్ షెడ్యూల్ గోవాలో జరగనుందని తెలిసింది. కాగా ఈ సినిమా ఆరంభం అయిన దగ్గర్నుంచి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్స్ కెన్నీ బెట్స్, సాల్మోన్, పీటర్ హెయిన్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను డిజైన్ చేశారు. ఈ సన్నివేశాలను ఎక్కువగా సెట్స్లోనే తీశారు. అయితే మేజర్ యాక్షన్ సీన్స్ను తీసిన తర్వాత టాకీ, సాంగ్స్పై ఫోకస్ పెడతారట. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రేమ తీరం ప్రేమ తీరం చేరేందుకు సముద్రంలో బోటు డ్రైవర్గా ప్రయాణం చేయనున్నారట నాగచైతన్య. లవ్స్టోరీస్ సినిమాల్లో ఆడియన్స్ను ఎక్కువగా అలరిస్తుంటారు నాగచైతన్య. ‘ఏ మాయ చేసావె’, ‘ప్రేమమ్’ వంటి ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటికే ఈ విషయాన్ని నాగచైతన్య నిరూపించుకున్నారు. కాగా దర్శకుడు చందు మొండేటి ఇటీవల నాగచైతన్యకు ఓ ప్రేమకథ వినిపించారని, ఇందులో బోటు డ్రైవర్ అయిన మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. సూరత్లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ భోగట్టా. -
కుశలమా!
సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆదివారం(జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కంగువ’ టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులñ ల్ల గెలిచినోడు, ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ‘కుశలమా’ అంటూ సూర్య చెప్పే డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. ‘‘చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ’. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రీడీలో విజువల్ వండర్గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు టీమ్ శ్రమిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య బర్త్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్ని రిలీజ్ చేశాం.. మరో నాలుగు భాషల్లో త్వరలోనే విడుదల చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో ‘కంగువ’ రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏజే రాజా, కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా. -
విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!
హీరో సూర్య పేరుకే తమిళం. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు అనుకోని విషాదం జరిగింది. సూర్య అభిమానులు కరెంట్ షాక్ తో చనిపోయారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ షాక్ కొట్టడంతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ విషయం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తోంది. (ఇదీ చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్) ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలోని మోపువారిపాలెంలో విషాదం నెలకొంది. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా నక్కా వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు.. ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే సడన్గా కరెంట్ పాస్ అవ్వడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుర్రాళ్లు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇకపోతే సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దిశా పటానీ హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీని ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనుండటం విశేషం. సూర్య కెరీర్లోనే ఇది హైయస్ట్ బడ్జెట్ మూవీ. (ఇదీ చదవండి: బిగ్బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) -
మర్వెల్ హీరోలను మరిపించేలా సూపర్ హీరోస్ గా ప్రభాస్, సూర్య
-
సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో కీలక పాత్రలో మెరవనుంది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) సూర్య బర్త్డే జులై 23న ఘనంగ జరగనుంది. అందులో భాగంగానే కంగువ సినిమా తొలి గ్లింప్స్ను జులై 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య పుట్టినరోజు నాడే అభిమానులకు మరో శుభవార్త ఆయన చెప్పనున్నారు. తన తదుపరి చిత్రం వివరాలు ప్రకటించనున్నారు. దానిని ఒక లేడీ డైరెక్టర్కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూర్య 43 సినిమాకు దర్శకురాలు కానుందని టాక్. తను తెలుగులో కూడా వెంకటేశ్తో 'గురు' సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సుధ కొంగర పుట్టింది విశాఖలో అయినా ఆమె చెన్నైలో స్థిరపడింది. సినిమా గురించి సుధ ఏం చెప్పిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధ ఇలా చెప్పింది. ఆకాశమే నీ హద్దురా సినిమా కంటే సూర్యతో భారీ బడ్జెట్లో సినిమా తీయబోతున్నట్లు చెప్పింది. ఆ కథకు భారీగా ఖర్చు అవుంతుందని, అందుకు కొంచెం భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీస్తున్నా బయోపిక్ మాత్రం కాదని పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వనున్నారు. సుధ కొంగరకు సూర్య మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) -
మహాభారతంలో సూర్య
-
ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజినీ సినిమా మీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు మతిమరుపునే కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ ఆసిన్. కల్పనా శెట్టి పాత్రలో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. తమిళం, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది. (ఇది చదవండి: నారాయణతో సుధాకర్కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి) ఆ తర్వాత గజినీతో పాటు రెడీ, హౌస్ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు.. చివరిసారిగా 2015లో ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ను పెళ్లి చేసుకుంది. 2017లో వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పిన భామ.. చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై గజినీ భామ స్పందించింది. తనపై డైవర్స్ వార్తలకు చెక్ పెట్టింది ఆసిన్. వివరణ ఇస్తూ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్సో ఓ నోట్ రాసుకొచ్చింది. తాను ప్రస్తుతం భర్త రాహుల్తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ఆసిన్ ఇన్స్టా స్టోరీలో రాస్తూ..' రాహుల్తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నా. మాపై చాలా వార్తలు పూర్తిగా నిరాధారం. ఈరోజు మేమిద్దరం కూర్చుని బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాం. మేం విడిపోతున్నామనే ఒక బేస్ లెస్ వార్త విన్నా. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. దయచేసి వినండి. ఇప్పుడు దీని కోసం కూడా 5 నిమిషాల అద్భుతమైన సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆసిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టింది గజినీ భామ. (ఇది చదవండి: ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్) రూమర్స్కు కారణమిదే.. అసిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కటి మినహా రాహుల్తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించింది. దీంతో డైవర్స్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా తొలగించింది. ఇన్స్టాలో ఆమె చివరి పోస్ట్ కుమార్తె అరిన్ ఐదో పుట్టినరోజు సందర్బంగా అక్టోబర్ 2022లో చేసింది. ఇంతవరకు ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అంతే కాకుండా ఆసిన్ తన ఇన్స్టాగ్రామ్లో తన భర్తతో ఉన్న ఒక ఫోటోను మాత్రమే ఉంచింది. -
జిమ్లో హీరోయిన్ కసరత్తులు.. ఆశ్చర్యపోయిన భర్త !
నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబయిలో ఉంటోంది. (ఇది చదవండి: 'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ ) తాజాగా జ్యోతిక జిమ్లో చేసిన కసరత్తులను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో స్టన్నింగ్ వర్కవుట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది చూసిన సూర్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మై వండర్ వుమెన్ అంటూ ఇన్స్టా స్టోరీస్లో జ్యోతిక జిమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జ్యోతిక జిమ్లో కసరత్తులు చేస్తూ చెమడ్చోతున్న వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని జిందా పాటను జోడించింది. కాగా.. జ్యోతిక వెంకట్ ప్రభు దర్శకత్వం తెరకెక్కించబోయే దళపతి-68లో విజయ్తో కలిసి నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ జంట 'కుషి', 'తిరుమలై' వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించారు. మరోవైపు రాజ్కుమార్ రావు రాబోయే చిత్రం శ్రీలో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ నటిస్తోన్న థ్రిల్లర్ మూవీలో కనిపించనుంది.ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ షూటింగ్లో బిజీగా ఉన్నాడు సూర్య. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి) View this post on Instagram A post shared by Jyotika (@jyotika)