-
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
‘క్లీన్స్వీప్’పై భారత్ గురి
బెంగళూరు: టి20 ప్రపంచకప్కు ముందు భారత్ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్... ఈ సిరీస్ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్లే ఉండటంతో పొట్టి ఫార్మాట్లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్ను బాగా సది్వనియోగం చేసుకోవాలి. కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్లో ఉండటం, బౌలింగ్ పదునెక్కడంతో భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్ దృష్ట్యా అఫ్గానిస్తాన్ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్రౌండ్ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది. దూబేను ఆపతరమా... ఈ సిరీస్లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్లో భర్తీ చేయదగ్గ బ్యాటర్లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్కు బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్ ఆర్డర్కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్తో అర్‡్షదీప్, ముకేశ్ కుమార్... స్పిన్తో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
'సూర్య' ప్రతాపం.. టీ20 కింగ్ (ఫోటోలు)
-
INDvsSA : మూడో T20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్తో సొంతగడ్డపై యువభారత్ను నడిపించిన సూర్యకుమార్కు ఈ సిరీస్లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో పలువురు అనుభవజు్ఞలు శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్లు జతవడంతో టీమిండియా క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
సమరానికి సై...
ముంబై: భారత పురుషుల జట్టు ఇటీవల పొట్టి ఫార్మాట్లో ఆ్రస్టేలియాపై అదరగొట్టింది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా అలాంటి ప్రదర్శనే ఇచ్చేందుకు ఇంగ్లండ్తో టి20 సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా బుధవారం ఇక్కడి వాంఖెడె స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ ఏడాది హర్మన్ప్రీత్ కౌర్ బృందం ప్రత్యేకించి టి20 ఫార్మాట్లో రాణించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సహా... బంగ్లాదేశ్ గడ్డపై 2–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. సఫారీ గడ్డపై జరిగిన ముక్కోణపు టి20 సిరీస్లోనూ భారత మహిళల జట్టు మెరుగ్గా రాణించి ఫైనల్లో రన్నరప్గా సంతృప్తి పడింది. అక్కడే జరిగిన టి20 ప్రపంచకప్లో ఒకే గ్రూప్లో ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరాయి. కానీ ప్రత్యర్థుల చేతిలో ఇరు జట్లు ఓటమి చవిచూశాయి. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్తో పేలవమైన గత రికార్డును మరిచేలా చక్కని ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టి20 ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొమ్మిది టి20 మ్యాచ్లాడితే కేవలం రెండు మ్యాచ్ల్లోనే నెగ్గింది. మరోవైపు రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ జట్టు 1–2తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ అనుకూలతలను వినియోగించుకొని ఫామ్లో ఉన్న హర్మన్ బృందం ఈ సిరీస్లో గట్టి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. పురుషులతో పోల్చితే పరిమిత సంఖ్యలో జరిగే మ్యాచ్లతో అమ్మాయిల జట్టు... వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్కు మేటి జట్టుగా బరిలోకి దిగాలని ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన, టాపార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్లో హర్మన్ప్రీత్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. పిచ్, వాతావరణం వాంఖెడె వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. తూర్పు తీరాన్ని తుఫాను వణికిస్తున్నా... ముంబైలో ఆ బెడద లేదు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచితంగా మైదానంలోకి అనుమతి ఇస్తున్నారు. 27 ఓవరాల్గా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 27 టి20 మ్యాచ్లు జరిగాయి. 7 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందగా... 20 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్లో ఈ రెండు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్లు జరిగాయి. 2 మ్యాచ్ల్లో టీమిండియా, 7 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. -
విజయంతో ముగించేందుకు
బెంగళూరు: భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ ఆఖరి మజిలీకి చేరింది. మరో గెలుపుతో సిరీస్ ఆధిక్యాన్ని 4–1కు చేర్చుకోవాలిన టీమిండియా చూస్తుంటే... సిరీస్ ఎలాగూ చేజారింది కాబట్టి విజయంతోనైనా ముగింపు పలికి తిరుగుముఖం పట్టాలని కంగారూ సేన భావిస్తోంది. అయితే జట్ల బలాబలాల విషయానికొస్తే మాత్రం సూర్యకుమార్ సేనే పటిష్టంగా కనిపిస్తోంది. సిరీస్ ఇదివరకే సాధించడం, బౌలర్లు ఫామ్లోకి రావడం ఆతిథ్య భారత్ను దుర్బేధ్యంగా మార్చింది. వన్డే ప్రపంచకప్ సాధించిన ఆసీస్ జట్టు సభ్యుల్లో ఒక్క ట్రవిస్ హెడ్ తప్ప మిగిలిన 10 మంది ఆటగాళ్లంతా కొత్తవారే కావడం, నిలకడ లోపించడం కంగారూను మరింత కలవరపెడుతోన్న అంశం. బౌలింగ్ బలగం గత నాలుగు మ్యాచ్ల్ని నిశితంగా గమనిస్తే భారత్ బ్యాటింగ్ జోరుతో తొలి మూడు టి20ల్లో అవలీలగా 200 పైచిలుకు పరుగులు చేసింది. యశస్వి, రుతురాజ్, కెపె్టన్ సూర్యకుమార్, రింకూ సింగ్ ఇలా వీరంతా మెరిపించినవారే! కానీ బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోరు చేశాక కూడా మూడో టి20లో భారత్ ఓడింది. అయితే నాలుగో మ్యాచ్లో మాత్రం గత మ్యాచ్లకు భిన్నంగా తక్కువ స్కోరు చేసినా టీమిండియా సిరీస్ విజయాన్ని అందుకుంది. దీనికి బౌలింగ్ పదును పెరగడమే కారణం. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ల స్పిన్, దీపక్ చహర్ పేస్లతో భారత్ బౌలింగ్ బలం పెరిగింది. ఇప్పుడు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఏమాత్రం ఒత్తిడి లేని ఆఖరి మ్యాచ్లో గెలవడం కష్టం కానేకాదు. గత మ్యాచ్లో హిట్టర్ జితేశ్ శర్మ కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరి రెండు మ్యాచ్ల కోసం వచ్చిన శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించే పనిలో పడితే మాత్రం భారత్ మరో 200 పరుగుల్ని చేయడం ఇంకాస్త సులువవుతుంది. ఒత్తిడిలో ఆసీస్ నాలుగో టి20లో టాస్ నెగ్గినప్పటికీ ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ ఆర్డర్పై నమ్మకంతో చేజింగ్ ఎంచుకొని భంగపడింది. దీంతోనే సిరీస్నూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియాపైనే సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలనన్న ఒత్తిడి భారంగా మారింది. హెడ్ మెరిపిస్తున్నా... ఫిలిప్, హార్డీ, టిమ్ డేవిడ్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడం బ్యాటింగ్ ఆర్డర్ను ఆందోళన పరుస్తోంది. ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వన్డే జట్టు విజయంతో ఇంటికెళ్లినట్లే... టి20 జట్టు సిరీస్తో కాకపోయినా... ఆఖరి ఫలితంతో సంతృప్తిగా స్వదేశం వెళ్లాలంటే ఆటగాళ్లంతా మరింత బాధ్యత కనబరచాల్సి వుంటుంది. పిచ్–వాతావరణం ఇక్కడి చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్కు బాగా కలిసొచ్చే గ్రౌండ్. ప్రతీసారి కూడా బౌండరీలు, సిక్సర్ల మజాను పంచుతోంది. కాబట్టి టాస్ గెలిస్తే ఏ జట్టయినా ఛేదనకే మొగ్గు చూపుతుంది. ఆటకు వాన ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, అవేశ్ఖాన్, ముకేశ్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), ఫిలిప్, హెడ్, మెక్డెర్మాట్, అరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, షార్ట్, డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, బెహ్రెన్డార్్ఫ, తనీ్వర్ సంఘా/నాథన్ ఎలిస్. -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
హాట్కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్–ఆస్ట్రేలియా టీ20 తొలి మ్యాచ్ టికెట్లు హాట్కేక్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఏసీఏ ఆధ్వర్యంలో పేటీఎం ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ముగించగా శుక్రవారం ఐదు వేల టికెట్లను ఆరు డినామినేషన్లలో కౌంటర్ల ద్వారా విక్రయించారు. వైఎస్సార్ స్టేడియంతో పాటు టౌన్ కొత్తరోడ్, గాజువాకల్లోని మున్సిపల్ స్టేడియాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించారు. కనీస ధర రూ.600 నుంచి గరిష్ట ధర రూ.6000లో పాటు రూ.1500, రూ.2000,రూ.3000,రూ.3500లు టికెట్లను మూడు ప్రాంతాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయాన్ని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్టేడియంలో ప్రవేశానికి ఫిజికల్ టికెట్లుగా మార్చుకునేందుకు ఆయా సెంటర్లలోనే 22వ తేదీవరకు అవకాశం కల్పించగా మ్యాచ్ జరిగే రోజు ఈనెల23న స్టేడియంలోనూ టికెట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్లైన్లో శనివారం సైతం ఆరు డినామినేషన్లలో టికెట్లను ఆయా కౌంటర్ల ద్వారా విక్రయించనున్నామని తెలిపారు. -
ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్..ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం
-
IND vs WI: భారత్పై వెస్టిండీస్ విజయం.. సిరీస్ కైవసం
భారత్, వెస్టిండీస్ మద్య జరిగిన టీ20 మ్యాచ్లో భారత్పై 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. దీంతో టీ20 సిరీస్ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత జట్టు 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత జట్టు.. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్ ముందు మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. గత మ్యాచ్లో చెలరేగిన శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్ సింగిల్ డిజిట్ పరుగులకే వెనుదిరిగారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
PSL 2023: టీ20 మ్యాచ్లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా ఓడిపోయింది. అది కూడా మహిళల టి20 వరల్డ్కప్లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్లు తలా ఒక వికెట్ తీశారు. పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్లో ఒక వికెట్తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం' -
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్కు ఇది రెండో పరాజయం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా ► సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(30 పరుగులు), రిచా ఘోష్(22 పరుగులు) ఇన్నింగ్స్ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సి ఉంది. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 44/3 ► 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక్క పరుగుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే షఫాలీ వర్మ(28 పరుగులు) మూడో వికెట్గా వెనుదిరిగింది. టీమిండియా వుమెన్స్ టార్గెట్ 119 పరుగులు ► టీమిండియా వుమెన్స్తో మ్యాచ్లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్ ► చినెలి హెన్రీ(2) రనౌట్ కావడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ► ఒక్క ఓవర్లోనే వెస్టిండీస్ రెండు వికెట్లను కోల్పోయింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలుత 30 పరుగులు చేసిన క్యాంప్బెల్లె స్మృతి మంధాన అద్భుత క్యాచ్కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి 42 పరుగులు చేసిన టేలర్ ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో వెస్టిండీస్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లలో వెస్టిండీస్ 53/1 ► తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయినప్పటికి వెస్టిండీస్ తన ఇన్నింగ్స్ను నిలకడగా కొనసాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. స్టెఫాని టేలర్ 28, క్యాంప్బెల్లె 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో విండీస్ స్కోరు 15/1 ► 4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసిది. టేలర్ 3, క్యాంప్బెల్లే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ► వెస్టిండీస్తో మ్యాచ్లో పూజా వస్త్రాకర్ టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ హేలీ మాథ్యూస్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. విండీస్ జట్టు ప్రస్తుతం వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న వెస్టిండీస్ వుమెన్స్ ► మహిళల టి20 వరల్డ్కప్లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ ఇండియా వుమెన్స్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్లో విజయం దక్కింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ వెస్టిండీస్ మహిళల తుదిజట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), స్టాఫానీ టేలర్, షెమైన్ కాంప్బెల్లె, షబికా గజ్నాబి, చినెల్లే హెన్రీ, చెడియన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షామిలియా కన్నెల్, రషదా విలియమ్స్ (వికెట్ కీపర్), కరిష్మా రామ్హారక్, షకేరా సెల్మాన్ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించిన భారత్.. వెస్టీండీస్తో మ్యాచ్లో అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ వుమెన్స్తో మ్యాచ్లో విండీస్ ఓటమిపాలైంది. ఇక పాక్తో మ్యాచ్కు వేలిగాయంతో దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విండీస్తో మ్యాచ్కు తిరిగిరావడం బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్లో భారత జట్టు వెస్టిండీస్తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ, వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్లో ఉండటంతో భారత టాపార్డర్కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్, రిచా ఘోష్లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. -
ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్.. దుమ్మురేపిన ఇండియా అమ్మాయిలు ( ఫొటోలు)
-
నీ పని నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు
టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘క్రికెట్ నిబంధనలు తెలియకుండానే ‘స్టార్ బౌలర్’గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు చూసుకోకుండా పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లండ్కు మద్దతుగా నిలవాలనుకుంటే అలాగే చేయొచ్చు.. కానీ అందుకు దీప్తి పేరు ప్రస్తావించాల్సి అవసరం లేదని మండిపడుతున్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్ను దీప్తి శర్మ రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బ్రిటిష్ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో దీప్తి శర్మకు మద్దతు కూడా లభించింది. నిబంధనలకు అనుగుణంగానే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ను ఆమె రనౌట్ చేసిందని పలువురు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో శుక్రవారం నాటి టీ20 మ్యాచ్ సందర్భంగా మిచెల్ స్టార్క్కు.. జోస్ బట్లర్ను రనౌట్ చేసే అవకాశం లభించింది. కానీ అతడు.. ఇంగ్లండ్ సారథికి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ‘‘నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇక ఈ విషయంపై భారత మాజీ ఆల్రౌండర్ హేమంగ్ బదాని స్పందిస్తూ.. ‘‘స్టార్క్ నువ్వింకా ఎదగాలి! నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆటలో భాగంగా దీప్తి చేసిన పని నిబంధనలకు అనుగుణంగానే ఉంది. నువ్వు ఒకవేళ నాన్స్ట్రైకర్ను హెచ్చరించాలని భావిస్తే అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేగానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్ స్టార్క్ను విమర్శించాడు. ఈ మేరకు బదాని చేసిన ట్వీట్కు స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును.. నువ్వు దీప్తిశర్మవు కావు. కాలేవు. ఎందుకంటే నీకు రూల్స్ ఫాలో అయ్యే ధైర్యం లేదు కదా! అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్ను ఏకిపారేస్తున్నారు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ Grow up Starc. That’s really poor from you. What Deepti did was well within the rules of the game. If you only want to warn the non striker and not get him out that’s fine and your decision to make but you bringing Deepti into this isn’t what the cricket world expects of you https://t.co/vb0EyblHB8 — Hemang Badani (@hemangkbadani) October 15, 2022 -
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
రూ.850 టికెట్ ను రూ.11వేలకు విక్రయిస్తుండగా పట్టివేత
-
భారత్ , ఆసీస్ టీ-20 మ్యాచ్ పై భారీగా బెట్టింగులు
-
ఇవాళ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ చివరి టీ20
-
Ind Vs Aus: ఉప్పల్లో నాడు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్! 50 బంతుల్లోనే ఏకంగా..
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్కు హైదారాబాద్లోని ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 12 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపై ఆదివారం(సెప్టెంబరు 25) మరో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు, పిచ్ స్వభావం, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలు తెలుసుకుందాం! మొదటి మ్యాచ్ ఎవరితో అంటే! ►2005లో నవంబర్ 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఈ వేదికపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది. ►2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ►2017లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్కు షెడ్యూల్ ఖారారైనా ఆ మ్యాచ్ రద్దైంది. ►ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఏకైక టీ–20 మ్యాచ్ జరిగింది. ►ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ►ఇక ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55 వేలు ఎవరిది పైచేయి..? ఉప్పల్ వేదికగా జరిగిన 5 టెస్టు మ్యాచ్లలో టీమిండియా నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అదే విధంగా.. ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో... నాడు చెలరేగిన కోహ్లి! ఏకంగా.. వెస్టిండీస్తో జరిగిన టీ–20 మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఇక కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు), నాటి మ్యాచ్లో కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫార్మాట్(ఇంటర్నేషనల్)లో నమోదైన స్కోర్లు: ►అత్యధిక స్కోరు: 209/4- భారత్ ►అత్యల్ప స్కోరు: 207/5- వెస్టిండీస్ ►అత్యధిక పరుగులు సాధించింది(అత్యధిక వ్యక్తిగత స్కోరు): 94- నాటౌట్- విరాట్ కోహ్లి ►అత్యధిక సిక్సర్లు: కోహ్లి- 6 ►అత్యధిక వికెట్లు: యజువేంద్ర చహల్(భారత్), ఖరీ పియర్(వెస్టిండీస్)- చెరో రెండు వికెట్లు ►బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలు: యుజువేంద్ర చహల్(4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు) ►అత్యధిక భాగస్వామ్యం: కోహ్లి- కేఎల్ రాహుల్(100 పరుగులు) పిచ్ స్వభావం పాతబడే కొద్ది నెమ్మదిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. గతంలో ఇక్కడ టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్ సమయం, లైవ్ స్ట్రీమింగ్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- ఆసీస్ మ్యాచ్ ఆరంభం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం. మ్యాజిక్ రిపీట్ చేయాలి! ఇక ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని కింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీలో ఆసీస్ విజయం సాధించగా.. నాగ్పూర్లో రోహిత్ సేన గెలుపొందింది. తద్వారా సిరీస్ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. చదవండి: హైదరాబాద్లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్! Ind Vs Aus 2nd T20: పాక్ రికార్డును సమం చేసిన రోహిత్ సేన! ఇక విరాట్ వికెట్ విషయంలో.. -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ‘ఆఫ్లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement