viral videos
-
Mahakumbh 2025:‘మోనాలీసా’, ‘ఏంజలీనా జోలీ’ డస్కీ బ్యూటీ ఫోటోలు
-
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఓ విద్యార్థి విన్యాసం
-
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
సూపర్ క్యాచ్.. వైరల్ వీడియో
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. తోయమ్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్కు వేదికైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు షాన్ మార్ష్ ఆడిన భారీ షాట్ను టైగర్స్ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్లో పెరీరా ఈ క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.A great juggling catch by Angelo Perera in the LLC. 😄 pic.twitter.com/t5GyFNJ4hb— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. హైదరాబాద్ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్ను గెలిపించాడు.చదవండి: డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్ -
IND vs BAN: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్ను ఆదుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.నిప్పులు చెరిగిన బుమ్రానాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024రోహిత్ సూపర్ క్యాచ్నాలుగో రోజు తొలి సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్నవారంతా షాక్కు గురయ్యారు.• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq— V. (@was_fairytale) September 30, 2024కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్లుగా మలిచారు. షకీబ్ క్యాచ్ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్లకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..? -
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..
-
రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వైరల్ వీడియో
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా-బి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. నవ్దీప్ బౌలింగ్లో పంత్ లెగ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్ క్యాచ్గా మలిచాడు. పంత్ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పంత్ పట్టుకున్న క్యాచ్ ఇండియా-ఏ బ్యాటర్ ఆవేశ్ ఖాన్ది. Flying Rishabh Pant with a terrific catch. 🙇♂️pic.twitter.com/kmwmextgKx— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఈ మ్యాచ్లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్ ఖాన్కు (181) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్ ఖాన్, నవ్దీప్ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్లు పట్టుకున్నాడు.275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్.. పంత్కు ఫ్యూజులు ఔట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ ఆటగాడు శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆఫ్ దిశగా ఇండియా-బి ఆటగాడు రిషబ్ పంత్ ఆడిన షాట్ను గిల్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. గిల్ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్లో పంత్ కేవలం ఏడు పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.SHUBMAN GILL - THE STAR. ⭐- What a brilliant catch by Shubman Gill. 🔥pic.twitter.com/cKHuLPvG0k— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా ముషీర్ ఖాన్ (97), నవ్దీప్ సైనీ (21) ఆదుకున్నారు. మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీకి చేరువయ్యాడు. నవ్దీప్.. ముషీర్కు సరైన సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజంతా ఆడగలిగితే ఇండియా-బి గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది.ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.ఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-సి, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో (13) కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) ఔట్ కాగా.. బాబా ఇంద్రజిత్ (13), అభిషేక్ పోరెల్ (19) క్రీజ్లో ఉన్నారు. -
Hundred League: దీప్తి శర్మ సిక్సర్.. వైరలవుతున్న వీడియో
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్ ఫైనల్లో వెల్ష్ ఫైర్పై లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్గా అవతరించింది. ఈ మ్యాచ్లో వెల్ష్ ఫైర్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. 98వ బంతికి ముందు లండన్ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్ బాది మ్యాచ్ను గెలిపించింది. దీప్తి సిక్సర్ కొట్టేప్పుడు లండన్ డగౌట్లో కనిపించి ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. దీప్తి సిక్సర్ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన హావభావాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.The reaction of London Spirit dugout when Deepti Sharma smashed the six. 😄👌pic.twitter.com/x1uKDjSSes— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్లో జెస్ జోనాసెన్ (54), బేమౌంట్ (21), హేలీ మాథ్యూస్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లండన్ బౌలర్లలో ఈవా గ్రే, సారా గ్లెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టారా నోరిస్, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్.. జార్జియా (34), హీథర్ నైట్ (24), డేనియెలా గిబ్సన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 98 బంతుల్లో విజయతీరాలకు చేరింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా డేవిస్, జార్జియా డేవిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో మరో అత్యద్భుత క్యాచ్ ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్లో జరిగిన ఓ ఛారిటి మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్కు వేదికైంది. వివరాలు పూర్తిగా తెలియని ఓ మ్యాచ్లో సోమర్సెట్ క్లబ్కు ఆడిన బెంజమిన్ స్లీమన్ నమ్మశక్యం కాని రీతిలో కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. బెంజమిన్ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్ను చూసిన వారు ఔరా అంటున్నారు. నేటి ఆధునిక క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్లు చూసుంటాం. ఈ క్యాచ్ వాటన్నిటిలో ప్రత్యేకమనకుండా ఉండలేం.THAT'S A SCREAMER... BENJAMIN SLEEMAN...!!! 🤯pic.twitter.com/H2RvoD8Rou— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2024ఈ వీడియోలో లెగ్ స్పిన్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ బౌలర్ తలపై నుంచి గాల్లోకి భారీ షాట్ ఆడాడు. లాంగ్ ఆన్లో ఉన్న బెంజమిన్ అమాంతం గాల్లో ఎగురుతూ సిక్సర్గా వెళ్లాల్సిన బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న బ్యాటర్ అయితే తలపై చేతులు పెట్టుకుని ఇదెక్కడి క్యాచ్ రా సామీ అని ఎక్స్ప్రెషన్ పెట్టాడు. -
IND VS SL 2nd ODI: శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో.. నమ్మశక్యంకాని రీతిలో రనౌట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్.. క్రీజ్లో కుదురుకున్న కమిందు మెండిస్ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. -
లక్నో ఎయిర్పోర్టును ముంచెత్తిన వర్షాలు.. వరదనీటిలో రన్వే
లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్లో రన్వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. మరోవైపు కోల్కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్పూర్లో భారీ వర్షం కురుస్తోంది. 📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational. However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు. -
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఫన్నీ సీన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఫన్నీ సీన్ జరిగింది. మధురై పాంథర్స్-చెపాక్ గిల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టగా.. బంతి స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బంతిని తీసుకుని తిరిగి ఉచ్చేందుకు నిరాకరించాడు. ఇవ్వను పో ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు ఆ వ్యక్తి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.A must watch moment in TNPL. 😀👌- Peak gully cricket vibe when an outsider took the ball & not giving it back...!!! pic.twitter.com/N5iah4NmUT— Johns. (@CricCrazyJohns) July 29, 2024కాగా, ఆ మ్యాచ్లో చెపాక్ గిల్లీస్పై మధురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన చెపాక్ గిల్లీస్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 55 పరుగులు చేసి పాంథర్స్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన లోకేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ప్రదోష్ రంజన్ పాల్ (52) పోరాడినప్పటికీ.. చెపాక్ను గెలిపించలేకపోయాడు. కార్తీక్ మణికందన్ 3 వికెట్లు తీసి చెపాక్కు దెబ్బకొట్టాడు. -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్లో ఆండీ మెక్బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించాడు. టెస్ట్ల్లో ఐర్లాండ్కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250, సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో వెస్టిండీస్పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, రెండో ఇన్నింగ్స్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్
-
ముచ్చుమర్రి బాలిక కేసులో పోలీసుల సీన్ రికన్ స్ట్రక్షన్ తేలిన నిజాలు
-
జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
-
110 మీటర్ల భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX— Mano (@manoj_tweezz) July 14, 2024ఈ మ్యాచ్లో సంజూ ఈ సిక్సర్తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరు..!
లంక ప్రీమియర్ లీగ్లో భాగంగా డంబుల్లా సిక్సర్స్తో జరిగిన మ్యాచ్లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఓ అద్భుత విన్యాసం చేశాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు. GLENN PHILLIPS IS NEXT LEVEL. 🤯- Probably the greatest athlete from New Zealand. 🫡 pic.twitter.com/DIheKFMVCn— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరని నెటిజన్లు జేజేలు పలుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. అద్భుతమైన క్యాచ్తో అబ్బురపరిచిన ఫిలిప్స్ ఈ మ్యాచ్లో బ్యాట్తోనూ రాణించాడు. అయినా ఈ మ్యాచ్లో అతను ప్రాతినిథ్యం వహించిన కొలొంబో టీమ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. ఫిలిప్స్ (52), ఏంజెలో పెరారీ (41), గుర్బాజ్ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. కుశాల్ పెరీరా (80), రీజా హెండ్రిక్స్ (54) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీకరాలకు చేరింది. -
కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర
-
ఇకపై అలా చేస్తే భారీ జరిమానా: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్!
ఐపీఎల్-2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై మైదానంలో ఉన్నపుడు.. మ్యాచ్లకు సంబంధించిన ఫొటోలు, లైవ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఐపీఎల్ ఫ్రాంఛైజీలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జట్ల యజమానులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల సోషల్ మీడియా టీమ్లను ఉద్దేశించి ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు బోర్డుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు గానీ షేర్ చేయకూడదు. ఒక్కోసారి కొంతమంది కామెంటేటర్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినపుడు, మైదానం ఉన్నపుడు ఫొటోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో గనుక ఒక మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే అప్పుడు బ్రాడ్కాస్టర్లకు ఒక రకంగా అది నష్టమే. నిజానికి ఐపీఎల్ జట్లు సైతం లైవ్ మ్యాచ్ల వీడియోలు షేర్ చేయకూడదు. కొన్ని ఫొటోలు, లైవ్ మ్యాచ్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ ఫ్రాంఛైజీకి జరిమానా పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది ఆటగాళ్లు సైతం మ్యాచ్ డేకు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారని.. వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా తాము ఆదేశించినట్లు సదరు అధికారి వెల్లడించారు. కాగా ఐపీఎల్ 2023-2027 ప్రసార హక్కులను స్టార్ ఇండియా(టెలివిజన్- రూ. 23,575 కోట్లు), వయాకామ్ 18(డిజిటల్- రూ. 20,500 కోట్లు- జియో సినిమా) దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో మాత్రమే మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఐపీఎల్ టీమ్ గనుక లైవ్ గేమ్ను షేర్ చేస్తే రూ. 9 లక్షల మేర బోర్డు ఫైన్ విధించనున్నట్లు సమాచారం. -
Ashish Chanchlani: టాలెంట్తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్కి వెల్నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్ అతడు కదా: సెహ్వాగ్
#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్కేను చాంపియన్గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్ కెప్టెన్ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్-2024 సీజన్కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా. ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్కే కెప్టెన్గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్లో కెప్టెన్గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ధోని రుతురాజ్కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో ఈ వికెట్ కీపర్ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్ దృష్ట్యా కెమెరామెన్ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్ చేయడం విశేషం. Just a reminder: 𝙏𝙝𝙖𝙡𝙖 𝙣𝙚𝙫𝙚𝙧 𝙢𝙞𝙨𝙨𝙚𝙨 😉#CSKvsRCB #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/KMhidAc9Sp — JioCinema (@JioCinema) March 22, 2024 అతడు ఇప్పుడు కెప్టెన్ ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్. ఏంటో.. ఈ కెమెరామెన్ ఎప్పుడూ ధోని ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో కెప్టెన్గా రుతురాజ్కు మంచి మార్కులే పడ్డాయి. Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 రుతురాజ్ కెప్టెన్సీ బాగుంది భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఓపెనర్గా రుతురాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్తో దుమ్ములేపారు. జోష్గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్కు సిద్ధమయ్యారు. -
ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి?
-
చేపలెందుకు ఒడ్డుకు వచ్చేశాయి?
-
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతడు ఇచ్చిన క్యాచ్ను శుబ్మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. -
భారతదేశంలో క్రికెట్ అంటే చాలా క్రేజ్...మరి ఇంతనా..?
-
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్లో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
పండగ వైరల్
ఇంటింటా ముగ్గుల పాఠశాల ఒకప్పుడంటే ముగ్గులు వేయడం అనే కళను అమ్మ నుంచో నానమ్మ, అమ్మమ్మ, ఇరుగింటి, పోరిగింటి అత్తయ్యల నుంచో నేర్చుకునేవారు అమ్మాయిలు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. ఇంటర్నెట్టేవారికి పాఠశాల. సంక్రాంతి రోజుల్లో ముగ్గుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్లో ఆన్లైన్ ముగ్గుల ట్యుటోరియల్స్ హల్చల్ చేస్తున్నాయి. ‘బ్యూటీఫుల్ ఫ్రీ హ్యాండ్ స్క్వేర్ రంగోలి డిజైన్ ట్యుటోరియల్’ ‘సింపుల్ రంగోలి డిజైన్ 9 డాట్స్ చుక్కల ముగ్గులు’ ‘స్టెప్ బై స్టెప్ రంగోలి ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ విత్ 5 డాట్స్’ ‘క్రియేటివిటీ 3్ఠ3 డాట్స్ ముగ్గులు’... మొదలైనవి వాటిలో కొన్ని. ఇక ఇన్స్టాగ్రామ్లో ‘మై రంగోలి వరల్డ్’ పేరుతో వీడియోలు కనిపిస్తున్నాయి. పందెం కోడి రెండున్నర లక్షలు ‘ఎత్తర కోడి తిప్పర మీసం’అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు.తూ.గో, ప.గో జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం.ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా.మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, కాకి, సేవల, నల్లబోర, ఎర్రపోడ... ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు... కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు.థాయ్లాండ్లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి.ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. క్యూఆర్ కోడ్ హరిదాసులు తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజంపై తంబుర, కాళ్లకు గజ్జెలు, రామదాసు కీర్తనలతో వీధుల వెంట నడిచొచ్చే హరిదాసులను చూస్తుంటే భక్తి భావం పోంగిపోర్లుతుంది. అయితే కాలంతో పాటు హరిదాసులు కూడా మారుతున్నారు అని చెప్పడానికి బైక్లపై వీధుల్లో తిరుగుతున్న హరిదాసులే నిదర్శనం. ‘మోడ్రన్ హరిదాసులు’ ‘హైటెక్ హరిదాసులు’ పేరుతో ఈ వీడియోలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కొందరు హరిదాసుల తంబూరలపై పేటీయం క్యూఆర్ కోడ్లు కనిపించడం విశేషం. మకర సంక్రాంతి పంచదార నగలు మహారాష్ట్రలో నూతన వధూవరులు తొలి మకర సంక్రాంతిని పంచదార నగలు ధరించి ఆహ్వానిస్తారు. దీని తాలూకు వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. ‘హల్వియాచే దాగినే’ అని పిలిచే ఈ నగలను పంచదార, నువ్వులు, సగ్గు బియ్యం ఉపయోగించి తయారు చేస్తారు. హల్వా అంటే తీపిదనం, దాగినే అంటే నగలు అని అర్థం. ఒక తరం నుంచి మరో తరానికి పరంపరగా ఈ ఆచారం వస్తోంది. ఈ నగలు ధరిస్తే కొత్త సంవత్సరంలో తీపిదనం, ఆనందం చేకూరుతాయని నమ్మకం. ఒకప్పుడు ఇండ్లలోనే వీటినే తయారు చేసుకునేవారు. ఇప్పుడు షాప్లలో కూడా వీటిని అమ్ముతున్నారు. కైట్ మానియా సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో తేలియాడే గాలిపటాలు ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అంటాయి. వాటి సంబరం మాట ఎలా ఉన్నా గాలిపటాల దారాలు పక్షుల పాలిట మృత్యు ద్వారాలు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆగ్మెంట్ రియాలిటీ (ఏఆర్ ) బేస్డ్ కైట్ గేమ్ల వైపు మొగ్గుచూపుతున్నారు కొందరు పక్షి ప్రేమికులు. అమెరికన్ మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్చాట్’ గత సంవత్సరం ‘కైట్ మానియా’ పేరుతో లాంచ్ చేసిన ఏఆర్ బేస్డ్ కైట్ గేమ్కు మంచి స్పందన లభించింది. దీనిలో యూజర్లు తమ సొంత కైట్ను క్రియేట్ చేసి ఎగరేయవచ్చు. -
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్బాల్ స్టార్ అలన్ విలియమ్స్తో కలిసి బాస్కెట్బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత
జమ్మూకశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో కశ్మీర్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్మార్గ్లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైందికొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను అధికారులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం, రాత్రిపూట భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని వారు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాత హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి సమయాల్లో భారీగా మంచు కురిసే అకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. #WATCH | Jammu and Kashmir: Gulmarg receives season's first snowfall. pic.twitter.com/xGHbRm46Wa — ANI (@ANI) November 10, 2023 -
ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్లో సాంట్నర్ పట్టగా (బెయిర్స్టో).. రెండోది సౌథీ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ (మొయిన్ అలీ) అందున్నాడు. సాంట్నర్ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్ను పట్టుకున్న ఫిలిప్స్ అత్యద్భుతం. Some catch 👏 Jonny Bairstow is forced to depart early...#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hrB15EWVgt — England Cricket (@englandcricket) September 10, 2023 మొయిన్ అలీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ ఈ క్యాచ్ను అందకున్నాడు. రిస్క్తో కూడుకున్న ఈ క్యాచ్ను పట్టుకుని ఫిలిప్స్ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ క్యాచ్ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. Glenn Phillips ... Flying bird ...#ENGvNZ pic.twitter.com/Y1h08pWRE8 — Manikanta Aravind (@MA_Aravind) September 10, 2023 ఈ రెండు క్యాచ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్ క్యాచ్తో పోలిస్తే ఫిలిప్స్ క్యాచ్కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్ను ఫ్లయింగ్ బర్డ్తో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లివింగ్స్టోన్ (95 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఇంగ్లీష్ బౌలర్లు డేవిడ్ విల్లే (3/34), రీస్ టాప్లే (3/27), మొయిన్ అలీ (2/30), అట్కిన్సన్ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
డాన్స్ అనేది వైరల్ అని ఎందుకంటారంటే..
-
టైటానిక్ ఇల్లు కట్టుకున్న రైతు
-
కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..
ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్కి గర్వకారణమని, అతను చాలా స్కిల్ఫుల్గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్) -
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
మధ్యతరగతి కుటుంబం.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! ఒక్కో వీడియోతో
గత సంవత్సరం టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్గా యూ ట్యూబ్ ప్రకటించిన వారిలో 22 ఏళ్ల అపర్ణా టాండలే ఉంది. మన దేశంలో ఇంటింటా తెలిసిన పని మనిషి పాత్రను చీపురు పట్టి హాస్యం చిలికేలా పోషించడమే అపర్ణా సక్సెస్కు కారణం. ఆమె చేసే ‘కామ్వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 3 కోట్ల వ్యూస్ అపర్ణ చేసిన ‘బారిష్ మే భీగ్నా’ (వానలో తడవడం) అనే మూడు నిమిషాల వీడియోకు 3 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. అపర్ణ పరిచయం. పని మనిషి అప్పుడే ఇల్లు తుడిచి మొత్తం శుభ్రం చేసి ఉంటుంది. అంతలో కాలింగ్బెల్ మోగుతుంది. ‘బారిష్ మే భీగ్నా’ తలుపు కన్నం నుంచి చూస్తే వానలో పూర్తిగా తడిసి వచ్చిన అమ్మగారూ, అయ్యగారూ. పని మనిషి గతుక్కుమంటుంది. ‘అమ్మో.. ఇప్పుడు వీళ్లు ఇంట్లోకి వస్తే ఇల్లంతా నీళ్లు, బురదా. మళ్లీ పనంతా చేయాలి’ అనుకుంటుంది. అంతే. తలుపుకు ఇంకో బోల్టు పెట్టేస్తుంది. అమ్మగారు కాలింగ్ బెల్ నొక్కితే బోల్ట్ తీస్తున్నట్టుగా నటిస్తూ ‘అమ్మా... బోల్ట్ స్ట్రక్ అయ్యింది’ అని లోపలి నుంచి అరుస్తుంది. బయటి నుంచి అమ్మగారి పిలుపులు... లోపలి నుంచి తలుపు రావడం లేదని పని మనిషి అరుపులు. తడిసి వచ్చిన అమ్మగారిని, అయ్యగారిని ఇంటి బయటే గంట సేపు కూచోబెట్టి ఈ లోపు హాయిగా టీవీ చూస్కుంటూ వాళ్లు పూర్తిగా ఆరారు అని తేల్చుకున్నాక అప్పుడు తలుపు తీస్తుంది పని మనిషి. ఇది అపర్ణా టాండాలె తీసిన మూడు నిమిషాల‘బారిష్ మే భీగ్నా’ షార్ట్ వీడియో. సూపర్హిట్ అయ్యింది. మూడు కోట్ల వ్యూస్ వచ్చాయి. పూణె అమ్మాయి పూణెకు చెందిన 22 ఏళ్ల అపర్ణ టాండాలె 2022లో యూట్యూబ్లో ఒక టాప్ కంటెంట్ క్రియేటర్గా నిలిచింది. ఆమె షార్ట్ వీడియోస్ కోసం చేసే పాత్ర పేరు షీలా దీదీ. సిరీస్ పేరు ‘కామ్వాలీ బాయి’. కామ్వాలీ అంటే పని మనిషి. ∙∙ పనిమనిషి లేని మధ్యతరగతి ఇల్లు ఉండదు. పని మనిషితో పేచీ పడని ఇల్లాలూ ఉండదు. పని సరిగ్గా చేయడం లేదని అమ్మగారు సణిగితే, పని ఎక్కువైందని పనిమనిషి గొణుగుతుంది. స్మార్ట్ పనిమనిషి పాత్ర బాగా తెలివైన పని మనిషైతే ‘స్మార్ట్ వర్క్’ చేసి పనిని తగ్గించుకోవడమో, తప్పించుకోవడమో చేస్తుంది. అపర్ణా టాండాలె తన సిరీస్లో ధరిస్తున్నది ఈ స్మార్ట్ పనిమనిషి పాత్రనే. ఎప్పుడూ ఆకుపచ్చని చీర, మేచింగ్ బ్లౌజ్, కొప్పు వేసిన జుట్టు, మెడలో నల్ల పూసలు, చేతిలో చీపురు... ఇది పనిమనిషి షీలా ఆహార్యం. ఆమె పని చేసేది ఒక యువ జంట ఇంట్లో. చేయాల్సిన పని చేస్తుంటుంది గాని ఒక్కోసారి తేడా వచ్చిందంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ట్రిక్సే ఒకటీ ఒకటిన్నర నిమిషాల వీడియోలుగా మనం చూస్తుంటాము. – ఒక వీడియోలో యజమాని ఒకసారి బోల్డన్ని ఇండోర్ ΄్లాంట్స్ తెస్తుంది. ‘దీనికి స్ప్రే చేస్తే చాలు. దానికి అరగ్లాసు నీళ్లు చాలు. ఈ దానికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి’... ఇలా పది కుండీల లెక్క చెబుతుంది అమ్మగారు. పని మనిషి షీలా ఇంత పని చేస్తుందా? ఒక రోజు పెద్ద బకెట్టు నిండా నీళ్లు మొక్కలకు పోయబోతూ అమ్మగారికి కంగారు పుట్టిస్తుంది. మరోరోజు మొక్కల దగ్గర ఒళ్లు గీరుకుంటూ ‘నాకు మొక్కలంటే ఎలర్జీ’ అంటుంది. మరోరోజు అమ్మగారి మీదే తుమ్ముతూ ‘మొక్కలకు నీళ్లు పోస్తే తుమ్ములు’ అంటుంది. దెబ్బకు మొక్కలకు నీళ్లు పోసే పని అయ్యగారు తీసుకుంటాడు. ఇదంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది. మామూలుగా కాదు మరో వీడియోలో అమ్మగారు అల్మారాలోని తన బట్టలన్నీ సర్దమంటే ఒక్కదాన్నే చేయాలా అనుకున్న పని మనిషి ‘అమ్మగారూ... పొరుగింట్లో ఏమయ్యిందో తెలుసా?’ అని అమ్మగారిని పిలిచి మాటల్లో పెట్టి ఆమె చేతే మొత్తం బట్టలు మడత పెట్టిస్తుంది. ఇంకో వీడియోలో స్టోర్రూమ్ సర్దమంటే ‘బాబోయ్ ఎలుక...’ అని అరిచి యజమానిని పిలిచి ‘అటు పోయింది... ఇటు పోయింది’ అంటూ మొత్తం సామాను అతడే సర్దేలా చేస్తుంది. ఈ వీడియోలు చూసే ప్రేక్షకులు యజమానుల్లో తమని, షీలా పాత్రలో తమ పని మనిషిని చూసుకోవడం వల్ల ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. ∙∙ పూణెకు చెందిన యూ ట్యూబర్ అపర్ణ టాండాలెకు ‘షార్ట్స్ బ్రేక్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. అందులో ‘కామ్ వాలీ బాయి’ సిరీస్ చేస్తుంది. ఈ ఒక్క యూ ట్యూబ్ చానల్ కాకుండా ‘టేక్ ఏ బ్రేక్’, ‘మ్యాడ్ ఫర్ ఫన్’ అనే ఇంకో రెండు మూడు చానల్స్ నడుపుతోంది అపర్ణ. మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అపర్ణకు బాల్యం నుంచి నటి కావాలనే కోరిక. స్కూల్, కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు వేసేది. 2018 నుంచి యూ ట్యూబ్లో షార్ట్ వీడియోలు మొదలెట్టింది. పలుచటి శరీరంతో చురుగ్గా కదులుతూ హుషారైన ముఖ కవళికలతో ఆకట్టుకుంటుంది అపర్ణ. ‘ప్రతి ఇంట్లో ఇంటి పని ఉంటుంది. అలాగే పని మనిషి కూడా కావాల్సిందే. ఆ పాత్రను తీసుకుంటే ఎంతో హాస్యం పండించవచ్చు. బాధగా ఉన్నవారు కూడా నా వీడియోలు చూసి నవ్వాలి’ అంటుంది అపర్ణ. అలా నవ్వుతున్నారు కనుకనే ఆమెకు పాపులారిటీ. సృజనాత్మక ఐడియాలు ఉంటే భారీగా పాపులర్ కావచ్చనేదానికి అపర్ణే ఒక పెద్ద చీపురంత ఉదాహరణ. View this post on Instagram A post shared by Aparna Tandale (@aparna_tandale) View this post on Instagram A post shared by Shorts Break (@shortsbreak) -
చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..
కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్7 డ్రాగన్ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరోనా లెక్కలు వెల్లడించకుండా దాచేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది. దీంతో చైనా కేసులు, మరణాలు వివరాలు బయటికి రావడం లేదు. చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇక రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాకు సంబంధించి చైనా నుంచి వెలువుడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి కొన్ని భయంకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ కోవిడ్ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్ హోమ్స్) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు జరిపేస్తున్నారు కుటుంబ సభ్యులు. చదవండి: భారత్లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? I've seen quite a few similar videos, but haven't posted any until now. Given what we learned from other sources about how difficult & expensive to cremate a body in a #crematorium in #CCPChina, I'm not surprised if someone in the countryside chose to do this.#ChinaCovidDeaths pic.twitter.com/hxhGdhPriS — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 ‘ఓ వ్యక్తి వాళ్ల తండ్రి కరోనాతో మృతిచెందాడు. శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయడం ఖరీదుతో కూడుకుంది.దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను భరించలేక అతను తన తండ్రి మృతదేహాన్ని బహిరంగ స్థలాన్ని ఎంచుకొని అంత్యక్రియలు జరిపించాడు. ఇకపై అన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధానాన్ని ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ స్థానికులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. This is not a #BlackFriday rush. This is at #Suzhou Funeral Home, at 6am on Dec 30, 2022, people rushed to get a number as soon as the Funeral Home opened for registration. These ppl had been waiting since 9:00 pm on the previous night. #ChinaCovidSurge #ChinaCovidDeaths pic.twitter.com/vsh6h4HFOL — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 At Zhangjiagang, Suzhou City crematorium. Early in the morning, long line of funeral cars queuing. This is already 1 km away from the crematorium. #CCPChina #ChinaCovidCases #ChinaCovidDeaths #ChinaCovidSurge pic.twitter.com/LHM1Yko8Z0 — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 -
Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ 'బాంబ్ సైక్లోన్' విధ్వంసం సృష్టిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా క్రిస్మస్ పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. A drone has captured incredible footage of entire houses encased in ice after a bomb cyclone hit the US and parts of Canada. Read more: https://t.co/jMSLhhH6kY pic.twitter.com/wdLzJUuUJA — Sky News (@SkyNews) December 28, 2022 #bombcyclone2022 #snowstorm #BombCyclone ravages East America,death toll rises to 60 The worst damage was in the #Buffalo area of #NewYork.Severe impact on electricity services. Due to the blizzard,nearly 200,000 residents eastern #USA haven't Electricity in the extreme cold pic.twitter.com/GFhGbitYGA — Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) December 28, 2022 మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 70 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు. That’s happened during a Historic Bomb Cyclone after a Decades. pic.twitter.com/uy10cJFfSM — Adeel Ali (@AdeelAl03137938) December 25, 2022 Bomb Cyclone Light house, Michigan City, 🇺🇸 pic.twitter.com/0BUQWIgMFR — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. స్టోర్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు. దొరికిన కాడికి నగదు, వస్తువులు దోచుకెళ్లారు. Bomb Cyclone Buffalo, NY, 🇺🇸 Many stores were under theft pic.twitter.com/rT0E0mGToJ — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 అమెరికాలో మంచు తుఫాన్కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. The view out my parents garage in Prince Edward County. The drift is up to their second story patio #ONstorm #BombCyclone pic.twitter.com/ocbD9KPuZF — Smith (@RileyZSmith) December 25, 2022 Shouldn't laugh but..........#ice #blizzard #WinterStorm #BombCyclone #Elliott #wind #snow #Ice #WeatherBomb video:@kayokayla pic.twitter.com/jJyswxJDkd — Volcaholic (@CarolynnePries1) December 24, 2022 Bomb Cyclone ! Ashtoshing Scenas, Drone Camera Work , Shows Hudge Snow Mountains in NY. Buffalo, NY, 🇺🇸 #BombCyclone #BombCylonebyDrone #BuffaloNY #BuffaloStorm2022 pic.twitter.com/LxKa0oKM5b — Top Viral Videos (@ManojKu40226010) December 26, 2022 Amid plunging temperatures, one person in Montana decided to throw some boiling water in the air and make more snow. The huge winter storm pummelling the US has intensified into a "bomb cyclone", with 60% of the population under a winter weather warning.https://t.co/4DalHHz9Lj pic.twitter.com/ADu80WBRKP — Sky News (@SkyNews) December 24, 2022 Snow plows at work as Mammoth winter storm unleashes chaos in #Vancouver Extremely Dangerous travel conditions, due to freezing rain @TranBC @MainroadLM#BritishColumbia #BCStorm #Canada #Elliott #ColdWave #BombCyclone #Weather #Climate #GlobalWarming #BCSnow #PortMannBridge pic.twitter.com/ZGyHRQejuP — Earth42morrow (@Earth42morrow) December 23, 2022 చదవండి: రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం -
తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి
స్కూల్స్లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్స్పెక్షన్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఒక పోలీస్టేషన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్చేసి చూపించమంటే సదరు సబ్ఇన్స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. సదరు ఉన్నతాధికారి ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్స్పెక్టర్పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
క్యాచ్కు కనీస ప్రయత్నం చేయని సుందర్.. బండ బూతులతో విరుచుకుపడిన కెప్టెన్
బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్.. మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. మెహిది హసన్, ముస్తాఫిజుర్ చివరి వికెట్కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM — Tanay Vasu (@tanayvasu) December 4, 2022 ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు బంగ్లాదేశ్ పాలిట వరాల్లా మారాయి. అంతవరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు సైతం ఫీల్డర్ల చెత్త ప్రదర్శనతో ఒక్కసారిగా ఢీలా పడిపోయి, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బంగ్లా విజయానికి 51 పరుగులు అవసరం కాగా.. టీమిండియా బౌలర్లు తమ విజయానికి అవసరమైన ఒక్క వికెట్ను పడగొట్టలేకపోయారు. భారత ఫీల్డర్లు.. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్ విజయానికి దోహదపడ్డారు. pic.twitter.com/ZJTDLWahM3 — Rahul Chauhan (@ImRahulCSK11) December 4, 2022 కీలక సమయంలో (42.3వ ఓవర్లో, అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది) కేఎల్ రాహుల్.. మెహిది హసన్ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారణం కాగా, ఆతర్వాతి బంతికి క్యాచ్ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయని సుందర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే పలు బౌండరీలు వదిలేసిన సుందర్పై కోపంగా ఉన్న రోహిత్.. క్యాచ్కు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంతో సహనం కోల్పోయి, బండ బూతులతో విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా.. రాహుల్, సుందర్ ఇచ్చిన లైఫ్ల తర్వాత చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది బంగ్లాదేశ్ను గెలిపించాడు. -
దారుణం: పెళ్లి భోజనం చేశాడని.. ప్లేట్లు కడిగించారు
వైరల్: పిలవని పెళ్లికి వెళ్లిన ఓ హాస్టల్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రీగా తిన్నాడని అతనితో బలవంతంగా ప్లేట్లు కడిగించారు అక్కడున్న కొందరు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రీగా తింటే దానికి శిక్ష ఏంటో తెలుసా?.. మీ ఇంట్లోలాగే ఇక్కడ ప్లేట్లు సరిగ్గా కడుగు అంటూ అతని ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తూ ఉండగా.. వీడియో రికార్డు అయ్యింది. ఎందుకు వచ్చావ్? అసలు ఎవడు పెళ్లికి పిలిచాడు నిన్ను.. ఫ్రీగా తినడానికి వచ్చావా?.. ఇదే నీకు సరైన శిక్ష అంటూ వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో. బాధిత యువకుడిది జబల్పూర్(మధ్యప్రదేశ్)గా తేలింది. భోపాల్కి చదువు కోసం వచ్చాడట. ‘‘ఎంబీఏ చదువుతున్నావ్. నీ తల్లిదండ్రులు నెల నెలా డబ్బు పంపడం లేదా?. నువ్వు ఇలా చేయడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంటూ అతన్ని మందలిస్తున్నారు మరికొందరు. दो तस्वीर… pic.twitter.com/T8uG6l4te1 — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 కొసమెరుపు ఏంటంటే.. తీరా ప్లేట్లు కడిగాక ‘ఎలా అనిపిస్తోంది’ అంటూ కొందరు అతన్ని అడిగారు. ఫ్రీగా తిన్నప్పుడు.. ఏదో ఒక పని చేయాల్సిందే కదా అంటూ సమాధానం ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఇలా పిలవని ఫంక్షన్లకు, కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయడం మామూలు కావొచ్చు. కానీ, దానికే ఇలా ప్లేట్లు కడిగించి మరీ వీడియోలు తీయడం, ఆ విద్యార్థిని అలా అవమానించడం సరికాదంటున్నారు చాలామంది. ఇదిలా ఉంటే.. అదే సమయంలో మరో వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. బీహార్లో ఇలాగే పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేసిన ఓ హాస్టల్ విద్యార్థి.. ఏకంగా పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే.. ఆ విద్యార్థి బాధను అర్థం చేసుకున్న ఆ పెళ్లి కొడుకు.. పర్వాలేదని, మరికొంత భోజనం హాస్టల్లో ఉన్న అతని స్నేహితులకు సైతం తీసుకెళ్లమని సూచిస్తాడు. God Bless You.❤️ pic.twitter.com/0Cu0rDdZoI — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 ఇదీ చూడండి: పేగుబంధం పక్కన పెట్టి.. కొడుకును పోలీసులకు పట్టించింది -
Viral Video: గుజరాత్ లో కేజ్రీవాల్ కోసం వికలాంగుడి ప్రచారం..
-
వైరల్ వీడియో: పిల్ల సింహం గర్జన ఎలా ఉంటుందో తెలుసా ..!
-
రాహుల్ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్.. ఫోటోలు, వీడియోలు వైరల్
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారంతో 71వ రోజుకి చేరింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. రాహుల్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు సైతం యాత్రలో పాల్లొంటున్నారు. జోడో యాత్ర అకోలా నగరంలో కొనసాగుతున్న సందర్భంగా బాలీవుడ్ నటి రియా సేన్ రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యారు. రాహుల్తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచారు.రాహుల్, రియా సేన్ కలిసి నడుస్తున్న ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు రియా సైతం రాహుల్ని కలిసిన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. సినీ నటిగా మాత్రమే కాకుండా గర్వించదగిన పౌరుడిగా ఈ యాత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. #BharatJodoYatra में शामिल हुई अभिनेत्री रिया सेन। अब सड़कें इंक़लाब की गवाह बन रही है। pic.twitter.com/U1PJ3ouRh4 — Congress (@INCIndia) November 17, 2022 కాగా రియా.. ఝంకార్ బీట్స్, నౌకదుబి వంటి సినిమాలతో పాపులారిటీ సాధించారు. ఇంతకుముందు నటి పూజాభట్ రాహుల్ గాంధీకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్లో జోడో యాత్ర కొనసాగిన క్రమంలో రాహుల్తో కలిసి నడిచారు. ఇక సెప్టెంబర్ 7న బారత్ జోడో యాత్ర పేరుతో కన్యకుమారి నుంచి రాహుల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 9న నందేడ్ జిల్లా ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించింది. लोग जुड़ रहे हैं...डर मिट रहा है...नया सूरज उगने ही वाला है। आज #BharatJodoYatra में अभिनेत्री रिया सेन शामिल हुईं। pic.twitter.com/1XSFtXBAQj — Congress (@INCIndia) November 17, 2022 -
వైరల్ వీడియో : ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తున్న జర్మనీ కోడలు ..
-
అది వందకు వంద శాతం ఫేక్ ఫీల్డింగ్.. తప్పే.. అయితే: భారత మాజీ ప్లేయర్
T20 WC 2022 Ind Vs Ban- Virat Kohli: ‘‘ఐసీసీ ప్రాథమిక నిబంధన ప్రకారం.. మైదానంలో ఫీల్డర్.. తన సమీపంలో బంతి లేనప్పటికీ ఫేక్ త్రో ద్వారా గానీ.. డైవ్ చేస్తున్నట్లు గానీ నటించి బ్యాటర్ల దృష్టిని మరల్చేలా చేయడం ముమ్మాటికీ తప్పే. బ్యాటర్ల దృష్టిని సదరు ఫీల్డర్ ఆకర్షించాడా లేడా అన్న విషయం పక్కన పెడితే.. ఫేక్ ఫీల్డింగ్ జరిగినట్లు అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందే. ఏదైనా జరిగి ఉండేది ఒకవేళ ఈ మ్యాచ్లో ఆ ఐదు పరుగులు ఇచ్చి ఉంటే.. బంగ్లాదేశ్ బ్యాటర్లు తీసిన పరుగు కూడా కౌంట్లోకి వచ్చేది. ఒకవేళ దానిని డెడ్బాల్గా ప్రకటిస్తే.. మరుసటి బంతికి ఎవరు స్ట్రైక్ తీసుకోవాలా అన్న విషయం గురించి బంగ్లా ఆలోచించుకునేది. ఈ ఘటన తర్వాత మ్యాచ్లో ఏదైనా జరిగి ఉండేది. అయితే, అక్కడేం జరిగిందంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఈ విషయాన్ని గమనించలేదు. ఫేక్ ఫీల్డింగ్ అన్న విషయం అసలు వాళ్ల దృష్టికే రాలేదు. మైదానంలో ఎవరూ దీనిని గురించి పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం అంపైర్లు ఇలాంటి వాటిని గమనించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఉండాల్సింది. ఒకవేళ థర్డ్ అంపైర్ పరిధిలో గనుక ఈ అంశం ఉండి.. నిబంధనలకు లోబడి.. జోక్యం చేసుకునే వీలుంటుంది. వందకు వంద శాతం నిజం చెప్పాలంటే అది వందకు వంద శాతం ఫేక్ ఫీల్డింగే! తన సమీపంలో బంతి లేకున్నా అతడు బంతిని విసిరినట్లుగా నటించాడు. ఒకవేళ అంపైర్ ఈ విషయాన్ని గమనించి ఉంటే మనకు ఐదు పరుగుల పెనాల్టీ పడేది. అయినా మనం ఐదు పరుగుల తేడాతో గెలిచేవాళ్లం. ఈసారికైతే తప్పించుకోగలిగాం. కానీ తదుపరి మ్యాచ్లలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే అంపైర్లు తప్పక గమనించాలి. వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి బంగ్లా జట్టు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? అవును కచ్చితంగా వాళ్లు సరిగ్గానే చెప్పారు. అయితే, ఆ విషయాన్ని మైదానంలో ఎవరూ గమనించలేదు కాబట్టి మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? తమతో మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ బంగ్లాదేశ్ చేసిన ఆరోపణలను సమర్థించాడు. కాగా ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను డక్వర్త్ లూయీస్ ప్రకారం 16 ఓవర్లకు కుదించి 151 పరుగుల టార్గెట్ విధించారు. ఈ క్రమంలో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే.. బంగ్లా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కోహ్లి తన దగ్గర బంతి లేకపోయిన్పటికీ త్రో చేసినట్లుగా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం స్పందించిన బంగ్లా ఆటగాడు నూరుల్ హసన్.. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపించాడు. బంగ్లా ఫ్యాన్స్ సైతం ఇదే తరహాలో టీమిండియా గెలుపును తక్కువ చేసి చూపేలా ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లి వల్ల బ్యాటర్ల దృష్టి మరలలేదు.. కాబట్టి పెనాల్టీ విధించాలనడం సరైంది కాదని కొంతమంది టీమిండియాను సపోర్టు చేస్తున్నారు. ఆయన అలా... ఈయన ఇలా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం ఈ అంశంపై తన స్పందన తెలియజేస్తూ.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. బంగ్లాను సమర్థించే విధంగా మాట్లాడుతునే టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలిచేదంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇందుకు బదులుగా టీమిండియా ఫ్యాన్స్ ఈ కామెంటేటర్పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బంగ్లా ఫ్యాన్స్ మాత్రం సరిగ్గా చెప్పారంటూ ఆకాశ్కు మద్దతు పలుకుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన కోహ్లి (64- నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్ దిగ్గజం.. అయితే! T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్పై ఘన విజయం.. సెమీస్కు చేరిన న్యూజిలాండ్! Kohli Fake Fielding: డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు -
చెన్నైలో వాన బీభత్సం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం, శివారు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివరాలు.. రాష్ట్రంలోకి గత నెల 29వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి నుంచి చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాలను వరుణుడు వణికించాడు. దీంతో ఆయా జిల్లాల్లో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు 4వ తేదీ వరకు కొనసాగుతాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. Pathetic condition of Chennai just after single day rain. Searching for naysayers who kept ranting about Bengaluru rains few months back. #chennairains pic.twitter.com/NeLlXl5bqU — G Pradeep (@pradeep_gee) November 1, 2022 ఒక్క రాత్రి వానకే చెన్నై.. చెన్నైలో వరద ముంపును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కొన్ని నెలల ముందుగానే అప్రమత్తమైంది. అయితే వర్షపు నీటి కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా, సోమవారం రాత్రి భారీ వర్షానికి నగరం జలమయమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన మార్గాలపై వరద పోటెత్తింది. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్, మైలాపూర్, టీనగర్, వడపళని, గిండి, వేళచ్చేరి, కీల్పాక్కం, కోయంబేడు, మదురవాయల్, పోరూర్, కుండ్రత్తూర్, మీంజూరు, పొన్నేరి, పుళల్, చోళవరం, రెట్టేరి, తాంబరం, గూడువాంజేరి పరిసరాల్లో భారీ వర్షం పడింది. ఇక్కడున్న లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరాయి. మంగళవారం కూడా వర్షాలు కొనసాగడంతో చెన్నై, తాంబరం, ఆవడి కార్పొరేషన్ల అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రోడ్లపై నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించారు. గాలి కారణంగా 5 చోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనుండడంతో ముందు జాగ్రత్తలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా చెన్నై రిప్పన్ బిల్డింగ్లో సహాయక చర్యల నిమిత్తం అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. @cmrlofficial this is the condition of St.Thomas Mount metro station today at 10:30. Parking has been closed since water logging inside is more than that of the road. The situation is the same as it was last year. Can't even sustain even 1 day rain. Poor#chennairains pic.twitter.com/JcABUyMNuZ — Navin (@navinnova) November 2, 2022 కార్పొరేషన్ మేయర్ ప్రియ, కమిషనర్ గగన్దీప్ సింగ్ బేడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక్క రాత్రి వానకే నగరం జలమయం కావడంతో.. మున్ముందు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు ఎక్కువకాలం నిల్వవున్నా, ఇతర సహాయక చర్యల కోసం 1919, 044–25619206, 25619207, 25619208 నంబర్లను సంప్రదించాలని చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ తెలిపారు. For past one hour no rain. But situation in perambur Cooks road and jamalia road are looks very worst. Chennai mayor Priya madam's residence is near by 1 km from this location. #NortheastMonsoon #ChennaiRain #chennairains #ChennaiCorporation @chennaicorp pic.twitter.com/mZCDMuU02f — Prakash Narasimman (@Prakash_2803) November 2, 2022 రిజర్వాయర్లలో.. చెన్నైకు తాగునీటి అందించే చెరువులు, రిజర్వాయర్లలోకి ఇన్ ఫ్లో పెరిగింది. 3,300 మిల్లియన్ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన పుళల్ రిజర్వాయర్లోకి సెకనుకు 967 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 21 అడుగులు కలిగిన ఈ రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరుకుంది. 3,645 మిల్లియన్ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన చెంబరంబాక్కం రిజర్వాయర్కు నీటి రాక పెరిగింది. కందన్కోట సేరువాయ్ కండ్రిగ రిజర్వాయర్ నిండింది. ఇందులో నుంచి సెకనుకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చెన్నై, పూండి రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ప్రవహిస్తున్న కూవం నదిలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఈ నది తీరంలోని నేల వంతెన రోడ్డు మార్గాన్ని కూలి్చవేశారు. ఇద్దరి మృతి చెన్నైలో వర్షం కారణంగా విద్యుదాఘాతానికి ఒకరు, ఇంటి బాల్కని కూలి మరొకరు మృతి చెందారు. వ్యాసర్పాడికి చెందిన దేవేంద్రన్(55) సోమవారం ఈబీ కాలనీలోని నివాసానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మరణించాడు. పుళియాంతోపు, ప్రకాశ్రావు కాలనీకి చెందిన కబాలి, శాంతి (45) దంపతులు ఓ బహుళ అంతస్థుల భవనంలో నివాసం ఉన్నారు. అది పాత భవనం కావడంతో మంగళవారం ఉదయం తొలి అంతస్తు భవనం బాల్కని కూలి శాంతిపై పడింది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన తిరువళ్లూరు: వర్షపునీటి నిల్వ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి నాజర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆవడిలోని పరుత్తిపట్టు, శ్రీరామ్నగర్ల్లోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి నాజర్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆవడి ప్రాంతంలో వర్షపు నీటికాలువల నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందన్నారు. నీరు నిలిచిన వెంటనే మోటార్ల ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మేయర్ ఉదయకుమార్ ఉన్నారు. 23 చోట్ల వరద ముప్పు వేలూరు: వేలూరు జిల్లాలో మొత్తం 23 చోట్ల వరద ముప్పు ఉన్నట్లు ఎస్పీ రాజేష్ కన్నన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వేలూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. వేలూరు నేతాజీ మైదానంలో పోలీసులు, అగి్నమాపక సిబ్బందికి వరద ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, రోడ్లపై చెట్లు పడిన వెంటనే వాటిని తొలగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వారికి అవసరమైన పరికరాలను ఎస్పీ అందజేశారు. వరద సమాచారాన్ని అందించేందుకు 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెల్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ఆయా తాలుకా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య రుతు పవనాల ప్రభావం తీవ్రం కావడంతో అధికారులను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అప్రమత్తం చేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నివాసం నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్ రామచంద్రన్, సీనియర్ ఐఏఎస్లు ఎస్.కె.ప్రభాకర్, కుమార్ జయంత్ కూడా హాజరయ్యారు. చెన్నై, శివారుల్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నీటి తొలగింపు పనుల వివరాలను తెలుసుకున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక శిబిరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, హెచ్చరిక బోర్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి దురైమురుగన్, సీఎస్ ఇరై అన్బు, సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్షం పాతం వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెన్నైలో నీరు నిల్వ ఉండకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. -
కోహ్లి మిస్ చేసిన రనౌట్! తలలు పట్టుకున్నారు.. తర్వాత నవ్వేశారు! ఈ వీడియోలు చూశారా
T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli: టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఆదివారం నాటి పోరు క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన సంగతి తెలిసిందే. రన్మెషీన్ విరాట్ కోహ్లి తన కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకోగదగ్గ ఇన్నింగ్స్ ఆడి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. కింగ్ కోహ్లితో ఇట్లా ఉంటది మరి అన్నట్లు ఆకాశమే హద్దుగా(53 బంతుల్లో 82 పరుగులు- నాటౌట్) చెలరేగి టీమిండియాకు మరోసారి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ముగిసి గంటలు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మ్యాచ్కు సంబంధించిన మరపురాని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మిలియన్స్ కొద్దీ లైకులు.. వేలల్లో షేర్లతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ షేర్ చేసిన వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి. ఆ బెస్ట్ మూమెంట్స్ చూసి ఆనందించండి! (చదవండి: Virat Kohli: అప్పుడు మాటలు పేలావు! తట్టుకోలేరన్నావు! ఇప్పుడు తుస్సుమన్నావు! మ్యాచ్కే హైలైట్గా..) పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను గోల్డెన్ డక్ చేసిన అర్ష్దీప్ సింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) కోహ్లి మిస్ చేసిన రనౌట్! View this post on Instagram A post shared by ICC (@icc) షమీ బౌలింగ్లో అశ్విన్ అద్భుత క్యాచ్ View this post on Instagram A post shared by ICC (@icc) పాపం రాహుల్.. బట్ వెల్ ట్రైడ్ View this post on Instagram A post shared by ICC (@icc) హార్దిక్ పాండ్యా చేసెను అద్భుతం View this post on Instagram A post shared by ICC (@icc) పాండ్యా హైలైట్ సిక్స్ View this post on Instagram A post shared by ICC (@icc) కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇదేనేమో.. బట్లర్, లివింగ్స్టోన్ కళ్లు చెదిరే క్యాచ్లు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రుజువు చేసింది. టీ20 వరల్డ్కప్ గ్రూప్-1 సూపర్-12 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్లు అందుకుని మ్యాచ్ను గెలిపించారు. క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ముందుగా లివింగ్స్టోన్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఆఫ్ఘన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన భారీ షాట్ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లివింగ్స్టోన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్స్టోన్ ముందుకు పరిగెడుతూ సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక జోస్ బట్లర్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ లెగ్ గ్లాన్స్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ బట్లర్ను క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షిలా తన లెఫ్ట్ సైడ్కు డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తప్పక క్యాచ్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్స్టోన్, బట్లర్ పట్టిన క్యాచ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇవే కాక.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్లో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్ అనుకుంటే మరో రెండు క్యాచ్లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-1లో ఇవాళ జరిగిన మ్యాచ్ల్లో న్యూజిలాండ్.. ఆసీస్పై, ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
వైరల్ వీడియో : నాటు నాటు సాంగ్.. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ...
-
Ind Vs SA: రాంచీకి చేరుకున్న టీమిండియా; అక్కడ ప్రాక్టీసులో రోహిత్ సేన!
India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు.. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. లక్నో వేదికగా గురువారం(అక్టోబరు 6) జరిగిన మ్యాచ్లో ప్రొటిస్ చేతిలో ధావన్ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుబడింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలు గెలిచి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఈ క్రమంలో రెండో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి చేరుకుంది. జార్ఖండ్లోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఆదివారం (అక్టోబరు 9) ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ధావన్ సేనకు ఘన స్వాగతం ఇందుకోసం రాంచీకి చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులకు హోటల్ సిబ్బంది బొట్టుపెట్టి ఆహ్వానించగా.. అభిమానులు ఆటగాళ్లను విష్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Touchdown Ranchi 📍#TeamIndia | #INDvSA pic.twitter.com/HCgIQ9pk0M — BCCI (@BCCI) October 8, 2022 ప్రాక్టీసులో తలమునకలైన రోహిత్ సేన ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న విషయం తెలిసిందే. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది కూడా! ఇలా భారత ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్నారు. అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం లభించనుంది. చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై.. #TeamIndia had a light training session yesterday at the WACA. Our strength and conditioning coach, Soham Desai gives us a lowdown on the preparations ahead of the @T20WorldCup pic.twitter.com/oH1vuywqKW — BCCI (@BCCI) October 8, 2022 -
వామ్మో.. సప్తవర్ణాల పైథాన్తో సరదాగా...!
-
ఇంట్లోకి చొరబడిన చిరుత
-
సోనియా షూ లేస్ కట్టిన రాహుల్.. వీడియో వైరల్
మాండ్యా: దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సుదీర్ఘ కాలం తర్వాత సోనియా గాంధీ పబ్లిక్ ఈవెంట్కు హాజరైన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్తో పాటు యాత్రలో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో అరుదైన సంఘటన జరిగింది. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు రాహుల్ గాంధీ. పాదయాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్ ఊడిపోవటంతో.. స్వయంగా రాహుల్ గాంధీనే సరి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. తన తల్లి షూ లేస్ కడుతున్న రాహుల్ గాంధీ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తల్లి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షూ లేస్ సరిచేసిన తర్వాత పాదయాత్రను కొనసాగించారు నేతలు. సోనియాతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్యలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తనయుడి వెంట.. భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
వైరల్ వీడియో : భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త
-
‘కండోమ్’ వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశం!
పాట్నా: శానిటరీ పాడ్లపై ఓ విద్యార్థి ప్రశ్నకు వెటకారంగా ‘కండోమ్’లు పంచమని అడుగుతారేమో అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం నితీశ్ కుమార్ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారిని ప్రవర్తన ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా అదనపు చీఫ్ సెక్రెటరీ ర్యాక్ ఆఫీసర్, బిహార్ మహిళా, శిశు సంక్షేమ కమిషన్ హెడ్గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘సాశక్త్ భేటీ.. సమృద్ధ బిహార్’ పేరుతో యూనిసెఫ్ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 27న పాట్నాలో రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని లేచి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు, యూనిఫాం ఇస్తున్నప్పుడు శానిటరీ పాడ్లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి ఐఏఎస్ అధికారిని వెటకారంగా సమాధానం ఇచ్చారు. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా.. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఇదీ చదవండి: వీడియో: శానిటరీ పాడ్స్పై ప్రశ్న.. ఐఏఎస్ అధికారిణి వివరణతో షాక్ తిన్న విద్యార్థినులు -
ఇచ్చుకుంటూ పోతే.. రేపు ఫ్రీగా కండోమ్లు పంచాలంటారు!
వైరల్: ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. అదీ మహిళాశిశు సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. స్కూల్ స్టూడెంట్స్ అందునా అమ్మాయిలు చేసిన విజ్ఞప్తికి ఆమె స్పందించిన తీరుపై మండిపడుతున్నారంతా. ఊరకుంటే.. కండోమ్లు కూడా ఫ్రీగా పంచాలని అడుగుతారంటూ విద్యార్థులను ఉద్దేశించి వెటకారంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కంపరం పుట్టిస్తున్నాయి. బీహార్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దీనికి ఆ ఐఏఎస్ అధికారిని ఇచ్చిన వివరణలు, ఆ అమ్మాయితో పెట్టుకున్న వాగ్వాదం.. ఆమెను చిక్కుల్లో పడేసింది. సాశక్త్ భేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో యునిసెఫ్ మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం సాయంత్రం పాట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి డబ్ల్యూసీడీసీ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. అయితే.. కార్యక్రమానికి హాజరైన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో మొదలైన వ్యవహారం.. వాడీవేడిగా సాగింది. ఉచిత ప్రకటనలు చేసే ప్రభుత్వం.. రూ.20-30 ఖర్చు చేసి ఉచితంగా శానిటరీ పాడ్లు అందించలేదా? అని స్టూడెంట్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారిణి-విద్యార్థినులకు మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. -
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్నిగంధ బాక్స్ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
వైరల్ వీడియో : జూ కీపర్పై దాడి చేసిన మొసలి
-
ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25,000 రివార్డ్!
డెహ్రాడూన్: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ‘నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్. ముస్సోరీ కిమాడి మార్గ్లో రోడ్డ మధ్యలో టెబుల్ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్ సింగ్. ఇదీ చదవండి: స్పైస్జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
Ind Vs Pak: దంచికొట్టిన రోహిత్, కోహ్లి! మరీ ఇంత హైప్ వద్దన్న హిట్మ్యాన్!
Asia Cup 2022 India Vs Pakistan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు భారత బౌలర్లతో ప్రాక్టీసు సెషన్లో పాల్గొన్నాడు హిట్మ్యాన్. యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్ల బౌలింగ్లో తనదైన షాట్లతో అలరించాడు. సిక్సర్లు, ఫోర్లు బాదాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి రంగంలోకి దిగాడు. భారీ షాట్లతో సొంత జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి ప్రాక్టీసుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా ఆసియా కప్-2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో దాయాది చేతిలో 10 వికెట్ల తేడాతో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 🔊 Sound 🔛#TeamIndia captain @ImRo45 & @imVkohli get into the groove ahead of the first clash against Pakistan.#AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/GNd8imnmM3 — BCCI (@BCCI) August 25, 2022 అయితే, పాకిస్తాన్ మీద, ఆసియా కప్ టోర్నీలో కూడా కోహ్లికి అద్బుత రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో పాక్తో మ్యాచ్లో అతడు ఫామ్లోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి సారథ్యంలో భారత్ ఆడనున్న తొలి మేజర్ టోర్నీ ఇదే. మరింత ప్రతిష్టాత్మకం! హైప్ అవసరం లేదు! దీంతో ఈ ఈవెంట్ హిట్మ్యాన్కు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా.. రోహిత్ కిక్ స్కూటర్పై గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆగష్టు 28న భారత్- పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని తెలుసు. అలాంటప్పుడు ఒత్తిడి సహజమే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మా ఆటగాళ్లపై ఆ ఒత్తిడి పడకుండా చూసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్తో ఇంతవరకు ఆడని ఆటగాళ్లకు.. మిగతా అన్ని జట్లలాగే ఇది కూడా! పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని చెప్పాను’’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్కు మరీ ఎక్కువ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. Vroooming 🛴 into the end of practice session - Captain @ImRo45 style 👌 👌#TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/OqF9eksgCP — BCCI (@BCCI) August 25, 2022 చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు Shaheen Afridi: నేనూ నీలాగే ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టాలనుకుంటున్నా పంత్: పాక్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సల్మాన్ ఖాన్ లుక్లో అర్ధ నగ్నంగా రైల్వే ట్రాక్ పై హల్చల్
ఇటీవలకాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపిచ్చి వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. సందేశాత్మకంగా లేకపోయినా పర్వాలేదు గానీ ఇబ్బంది పెట్టేవిగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉండకూడదు. సోషల్ మాధ్యమాల్లో పెట్టే వీడియోలుకు కూడా కొన్నినిబంధనలు ఉంటాయి. చాలామంది వాటిని విస్మరించి అసభ్యకరంగా వీడియోలు షూట్ చేసి జైలు పాలవ్వుతున్నారు. అచ్చం అలానే చేసి ఇక్కడోక వ్యక్తి కూడా జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...లక్నోకి చెందిన అజమ్ అన్సారీ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేందుకని ఒక అసభ్యకరమైన వీడియో చేశాడు. అతను సల్మాన్ఖాన్ మాదిరి అర్ధ నగ్నంగా రెడీ అయ్యి రైల్వే ట్రాక్పై ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో అతను రైల్వే ట్రాక్ పై పడుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. పైగా ఈ వీడియోని సల్మాన్ చిత్రం తేరే నామ్లో హిట్ పాట తేరే నామ్ హమ్మే కియా హై అనే పాటతో రూపొందించాడు. దీంతో లక్నో రైల్వే పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే నిందితుడు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలానే ఘంటాఘర్ వద్ద వీడియో తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!) -
పిల్లలతో ఇంటింటికి తిరుగుతూ ఫుడ్ డెలివరీ.. నెటిజన్లు ఫిదా!
అవాతంరాలను దాటుకుంటూ కుటుంబ పోషన కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న పలువురి వీడియోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి. అలాంటి వీడియోనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘ఆయనను చూడంటం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒకవ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి.’ అంటూ రాసుకొచ్చారు సౌరభ్. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆర్డర్ను డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఆ వెనకాలే అతడి కుమారుడు తిరుగుతూ కనిపిస్తున్నాడు. పిల్లలతో కలిసి డెలివరీ చేసేందుకు రావటంపై ఆ వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. జొమాటో స్పందన.. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ‘ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. మరోవైపు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Saurabh Panjwani (@foodclubbysaurabhpanjwani) ఇదీ చదవండి: ప్లాస్టిక్లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
సెక్యూరిటీ గార్డ్ను చితకబాదిన మహిళ.. వీడియో వైరల్!
లక్నో: వీధి శునకాలపట్ల క్రూరంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డ్పై ఆగ్రహంతో ఊగిపోయింది ఓ మహిళ. పెద్ద కర్రతో కొడుతూ తిట్ల వర్షం కురిపించింది. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియో పోలీసులకు చేరటంతో మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. వీడియోలోని ఆ యువతి తాను జంతు హక్కుల కార్యకర్తగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ వీడియోలో.. 20 ఏళ్లుపైబడిన ఓ మహిళ సెక్యూరిటీ గార్డుపై ఆగ్రహంతో ఊగిపోతోంది. పెద్ద కర్ర తీసుకుని చితకబాదుతూ తిట్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా వీధి శునకాల పట్ల కూర్రంగా ప్రవర్తించావని భాజపా ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఆ మహిళ. ఈ సంఘటనపై ఆగ్రా నగర ఎస్పీ వికాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ‘సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కర్రతో కొడుతున్న వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో ఆధారంగా మహిళపై చట్టపరమైన చర్యలు చేపట్టారు ఆగ్రా పోలీసులు.’ అని తెలిపారు. మరోవైపు.. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న బాధితుడు అఖిలేశ్ సింగ్ తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యూఆగ్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ విక్రమ్ సింగ్. వైరల్ వీడియోలో ఉన్న మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న క్రమంలో అటుగా వచ్చిన వీధి కుక్కలను తరిమేసేందుకు షూను వినియోగించినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. తాను ఎక్స్ సర్వీస్మెన్గా తెలిపాడు బాధితుడు. Shocking video from UP's #Agra! Woman thrashes, abuses society security guard over 'bad behavior' with dogs. pic.twitter.com/XrDSIbT43V — Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022 ఇదీ చదవండి: ఓలా డ్రైవర్పై రెచ్చిపోయిన గ్యాంగ్.. అరగంట ఆలస్యమైనందుకు దాడి.. రౌడీల్లా రాత్రంతా బంధించి.. -
వైరల్ వీడియో: ఎంత మోసం.. పెట్రోల్ పోయించుకుంటే..
-
వైరల్ వీడియో: బంగారాన్ని దొంగలిస్తున్న చీమలు.. అట్లుంటది మరి వాటితోని!
ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. చిన్న ప్రాణులైనా తలుచుకుంటే ఏదైనా చేయగలవని చాలా సార్లు నిరూపితమైంది కూడా. ఇక చీమలంటే చక్కెరనో, లేదా అవి తినేందుకు ఏవైనా పదార్థాలనో ఎత్తుకెళ్తుంటాయి. అవి సైజులో చిన్నవి కాబట్టి అవి మోసుకెళ్లే వస్తువులు కూడా చిన్నవిగా ఉండి మోయడానికి వీలుగా ఉంటే వాటినే తీసుకెళ్తుంటాయి. ఇక్కడ వరకు మనకు తెలిసినదే, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా. అయితే ఈ వీడియోలో ఏకంగా వాటి సైజుకు మించి, బంగారపు గొలుసుని దొంగలిస్తున్నాయి. అందుకే చీమలను కూడా చీప్గా చూడకూడదంటారు. చీమలు బంగారపు గొలుసు ఎత్తుకెళ్లడమేంటి, వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు చైన్ను ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కామెంట్ చేశారు. చాలా వరకు ఆ చీమల గుంపు బంగారం గొలుసుని ఎత్తుకెళ్లడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Tiny gold smugglers 😀😀 The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv — Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022 -
ఇది చూసి నవ్వాపుకోలేకపోతున్నా...
కరోనా తెచ్చిన సంక్షోభం ఆ వెంటనే వచ్చిన సరఫరా వ్యవస్థలో అవాంతరాలు ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన ముడి సరుకుల కొరత కారణంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో వేగం మందగించింది. ముఖ్యంగా చిప్సెట్ల మీద ఆధారపడ్డ పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా టెన్షన్ ఫ్రీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో ముందు వరుసలో ఉంటారు హార్ష్గోయెంకా, ఆనంద్ మహీంద్రాలు. తాజాగా నెట్టింట వైరల్గా మారిన ఓ ఫన్నీ వీడియోను హార్ష్ గోయెంకా ట్విటర్లో షేర్ చేశారు. I laughed so much 😂😂pic.twitter.com/vyWm8X0xJA — Harsh Goenka (@hvgoenka) June 17, 2022 చదవండి: ఓన్లీ ఇన్ ఇండియా - ఆనంద్ మహీంద్రా -
Hybrid Bharatham: 20 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి..
శ్రద్దాశక్తులతో శ్రమటోడిస్తేగానీ భరతనాట్యం రాదు. అంతటి కష్టమైన భంగిమలకు వెస్ట్రన్ హిప్హప్ను జోడించి ఆడియెన్స్ను అలరిస్తోంది ఉషా జే. సంప్రదాయ చీరకట్టులో భరతనాట్యానికి వెస్ట్రన్ డ్యాన్స్∙జోడించి చేస్తోన్న వీడియోలు నెటిజన్లచేత ఔరా అనిపిస్తున్నాయి. శ్రీలంకకు చెందిన 25 ఏళ్ల ఉషా జే కొరియోగ్రాఫర్. శ్రీలంకలో జరిగిన సివిల్ వార్ నేపథ్యంలో ఉషాజే కుటుంబం పారిస్కు వలస వెళ్లింది. దీంతో ఉషాజే అక్కడే పుట్టి పెరిగింది. పారీస్లో ఉన్నప్పటికీ తమిళ సంప్రదాయాలను గౌరవిస్తూ పెరిగిన అమ్మాయి. ఓరోజు స్కూల్లో జరుగుతోన్న వార్షికోత్సవంలో నాట్యం చేసింది. అది చూసిన వారంతా ‘ఇక ఆపు, ఇలా కాదు కొత్తగా ఏదైనా ప్రయత్నించు’ అని చెప్పారు. వారి మాటలను సీరియస్గా తీసుకున్న ఉష ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. హిప్హప్తో.. అప్పటిదాక హిప్హప్ డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకోని ఉష..తన స్నేహితులు హిప్హప్ నేర్చుకుంటున్నారని తను కూడా వాళ్లతోపాటు నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఒకపక్క వెస్ట్రన్ నేర్చుకుంటూనే తన సంప్రదాయ నృత్యం భరతనాట్యం కూడా నేర్చుకోవడం మొదలు పెట్టింది. అందరూ చాలా చిన్నవయసులో నేర్చుకునే భరతనాట్యాన్నీ, ఉషా ఇరవై ఏళ్ల వయసులో నేర్చుకోవడం మొదలు పెట్టింది. దీంతో నాట్య భంగిమలు తనకి బాగా కష్టంగా అనిపించేవి. అయినప్పటికీ భరతనాట్యాన్ని ఔపోసన పట్టింది. తొలి వీడియోకు .. లక్షల్లో వ్యూస్ ‘‘సంప్రదాయ నృత్యాలన్నింట్లోకి భరతనాట్యం కాస్త కష్టమైనది. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేగానీ పర్ఫెక్ట్ స్టెప్పులు రావు. ఇలాంటి భరతనాట్యానికి వెస్ట్రన్ స్టెప్పులను జోడిస్తే బావుంటుంది’’ అన్న ఆలోచనతో సరికొత్తగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది ఉష. భరతనాట్యానికి హిప్హప్ స్టెప్పులను జోడించి చేసిన డ్యాన్స్ వీడియోలను ‘హైబ్రిడ్ భరతం’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2019 డిసెంబర్ 27న తొలి వీడియోను పోస్టు చేయగా వీడియోకు ముఫ్పైలక్షల వ్యూస్ వచ్చాయి. మంచి స్పందన లభించడంతో..ఈ డ్యాన్స్ వీడియోలను మరిన్ని రూపొందించేదుకు వర్క్షాపులు నిర్వహించి, తనలాంటి డ్యాన్సర్లను తన టీమ్లో చేర్చుకుంది. ఇలా తన టీమ్తో ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ పాటలకు ౖహె బ్రిడ్ డ్యాన్స్ వీడియోలను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పోస్టుచేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. ఆడియెన్స్ ఇస్తోన్న సలహాలు, సూచనలతో తన డ్యాన్స్ను మెరుగుపరుచుకుంటూ పోతోంది. ఇటీవల ఉషా విడుదల చేసిన వీడియోలో ఆమెతోపాటు మితుజా, జనుషా చీరకట్టులో స్టెప్పులేస్తున్నారు. వీరి హైబ్రిడ్ డ్యాన్స్ వీడియోకు ఇప్పటిదాకా నలభైలక్షల వ్యూస్ వచ్చాయి. లక్షల వ్యూస్తో దూసుకుపోతున్న ఉష భరతనాట్యానికి సరికొత్త ట్రెండ్ సెట్టర్గా నిలిచేలా కనిపిస్తోంది. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 -
Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు..
Urfi Javed Wear Broken Glass Dress Weighing 20 Kgs Video Viral: హిందీ బిగ్బాస్ ద్వారా చాలా ఫేమస్ అయింది ఉర్ఫీ జావేద్. బిగ్బాస్ తర్వాత బయటకొచ్చిన ఉర్ఫీ విభిన్నమైన, విచిత్రమైన డ్రెస్టింగ్ స్టైల్స్తో సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్ స్పాట్డ్ వేర్లో కనిపించిన ఉర్ఫీ జావేద్ మరోసారి సరికొత్త డ్రెస్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఉర్ఫీ పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్ను వేసుకుంది. ఈ పోస్ట్కు 'అవును, నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను. ఇది అద్భుతంగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు. నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి. కానీ నన్ను నేను చూసుకోడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయి.' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోకు నటి రాఖీ సావంత్ ఫైర్ ఎమోజీని కామెంట్ పెట్టగా, పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. ఇన్స్టా గ్రామ్లో 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో చిన్న పార్టీ ఏర్పాటు చేసింది ఉర్ఫీ జావేద్. ఆ పగిలి గాజు ముక్కల డ్రెస్ వల్ల గాయాలు అవుతుండటంతో దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ డ్రెస్ 20 కేజీల బరువు ఉంటుందని ఉర్ఫీ జావేద్ తెలిపింది. చదవండి: 👇 ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్షాట్ షేర్ చేసిన ఉర్ఫీ View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు
Shark Jumping Unbelievably High To Grab The Chopper: ప్రముఖులు, సెలబ్రెటీలు వైరల్ వీడియోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. లేదంటే నెటిజన్ల ట్రోలింగ్కి గురవ్వాల్సిందే. అచ్చం అలానే ఒక సినిమాలో సీన్ని వైరల్ వీడియో పోస్ట్ చేసి నెటజన్ల ఆగ్రహానికి గురయ్యారు మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీ. అసలేం జరిగిందంటే...ఒక షార్క్ చేప సముద్రంలోంచి పైకి ఎగిరి హెలికాప్టర్ పై దాడి చేస్తున్న వైరల్ వీడియోని మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఈ వీడియోకి నేషనల్ జియోగ్రాఫిక్ ఒక మిలియన్ డాలర్లు చెల్లించిందని కూడా ట్వీట్ చేశారు. నిజానికి ఇది 2017లో వచ్చిన ఫైవ్ హెడ్డ్ షార్క్ ఎటాడ్ చిత్రంలోని సన్నివేశం. దీంతో నెటిజన్లు ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్కి గురై ఆమెను దారుణంగా ట్రోల్ చేయడవ మొదలుపెట్టారు. అంతేకాదు అత్యంత మేధావులైన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ఫేక్ వీడియోని పోస్ట్ చేయడం ఏంటని ఒకరు, అయినా అసలు అదేలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా ఈ వీడియోని పోస్ట్ చేశారంటు మరోకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో కిరణ్ బేడి స్పందించడమే కాకుండా మళ్లీ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికంటే అసలు అలా చేయాలనే ఊహ రావడం గ్రేట్ అని అన్నారు. అయినా ఇలాంటి సాహసోపేతమైన సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన తట్టినందుకు మనం ప్రశంసించాలి అంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఐతే ఆమె గతంలో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోలింగ్కి గురయ్యారు. Watch this 🥹🥺🙄😳😲 pic.twitter.com/Io0PQb567U — Kiran Bedi (@thekiranbedi) May 11, 2022 (చదవండి: వైరల్ వీడియో: సింహాన్ని తరిమిన శునకం) -
IPL 2022: గెలిచి నిలిచిన రోహిత్.. సై అంటున్న పంజాబ్.. షమీ సెలబ్రేషన్స్!
IPL 2022 Trending Videos: ఈద్ సందర్భంగా చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంఛైజీ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై షేర్ చేసింది. EIDhu Namma Kondattam! 💛 Celebrating the festivities the SuperKings way🦁#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/HecryvhKVn — Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2022 ఇక దీనితో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇతర ఐపీఎల్ జట్ల మరికొన్ని ఫొటోలు, వీడియోలు మీకోసం.. సహచర ఆటగాళ్లతో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న షమీ గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ సహచర క్రికెటర్లతో కలిసి రంజాన్ పండుగ జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్తో కలిసి ఫొటోలు దిగాడు. Eid Mubarak #Eid_Mubarak #mshami11 @rashidkhan_19 @RGurbaz_21 pic.twitter.com/ziFWauCyip — Mohammad Shami (@MdShami11) May 3, 2022 జిమ్లో చెమటోడుస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు కోచ్ శంకర్ బసు మార్గదర్శనంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు జిమ్లో కఠిన వర్కౌట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆటగాడికి తన అవసరాలకు తగ్గట్టుగా ఫిట్నెస్ సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు బసు పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) సహచర ఆటగాళ్లను ఓడించిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ క్రికెటర్ల ఆట విడుపు వీడియోను ఫ్రాంఛైజీ షేర్ చేసింది. బ్రెవిస్, బాసిల్ థంపి, ఆర్యన్ తదితరులతో కలిసి గేమ్ ఆడిన రోహిత్ వాళ్లందరినీ ఎలిమినేట్ చేసి తాను విజేతగా నిలిచాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) గుజరాత్తో పోరు సిద్ధమవుతున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. Lines drawn, game 🔛 ⚔️#SaddaPunjab #PunjabKings #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #GTvPBKS pic.twitter.com/e6NhX0rFqw — Punjab Kings (@PunjabKingsIPL) May 3, 2022 వైరల్ అవుతున్న తిలక్ వర్మ ప్రాంక్ వీడియో సహచర ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రిలే మెరిడిత్లను ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ సరదాగా ఆటపట్టించాడు. పేస్ట్ బిస్కట్లు తినిపించి వారిని బోల్తా కొట్టించాడు. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) చదవండి👉🏾Rinku Singh: తొమ్మిదో క్లాస్లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });