Yashmi Gowda
-
తన తప్పే లేదంటున్న యష్మి.. నిఖిల్పై ఫీలింగ్స్ గురించి..
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో యష్మి గౌడ పన్నెండోవారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా బిగ్బాస్ బజ్లో అడుగుపెట్టింది. ఇక్కడ అంబటి అర్జున్.. యష్మి అనే నేను, అన్నీ నిజాలే చెప్తానంటూ తనతో ప్రమాణం చేయించాడు. ఎందుకు బయటున్నావని ఆలోచించావా? అని అడగ్గా.. హౌస్లో నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూసే జనాలకు అది ఫ్లిప్పులా అనిపిస్తుందేమో అని యష్మి సమాధానమిచ్చింది. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? ఈ ప్రవర్తనను ఉడుకుబోతుతనం అంటారని అర్జున్ సెటైర్ వేశాడు. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? నామినేషన్స్లో గ్రూప్గా చర్చించుకుని నామినేట్ చేశారా? లేదా? అని వరుస ప్రశ్నలు సంధించాడు. నిఖిల్పై నీ ఫీలింగ్ ఏంటనగా.. అతడు తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది యష్మి.నేను ఏం చేసినా ఫీలింగ్స్ ఉన్నాయంటారుమీకు ఫీలింగ్స్ లేనప్పుడు గౌతమ్ టీషర్ట్ వేసుకుని నిఖిల్కు జెలసీ తెప్పించాలని ఎందుకనుకున్నావ్? అని క్వశ్చన్ చేశాడు. అందుకు యష్మి సమాధానం దాటవేస్తూ.. ఇప్పుడిదంతా జరిగింది కాబట్టి.. నేను కొంచెం నవ్వినా సిగ్గుపడుతుంది, ఫీలింగ్స్ ఉన్నాయంటారు. దానికి నేనేం చేయలేను అంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్పై వచ్చిన కంప్లైంట్స్..అన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్పై బిగ్బాంబ్ వేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్పై రాయాలన్నాడు బిగ్బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..క్యారెక్టర్లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్కార్డ్స్ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్ అయిందట! సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా యష్మిని ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. సంచాలక్ అంటే అంపైర్ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఈ టాస్క్ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్ బయటకు రాక తప్పలేదన్నమాట!చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది! -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్మేట్స్లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో యష్మి సంచాలక్గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీని ఓడించిన రోహిణి.. దెబ్బ అదుర్స్ కదూ!
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి. మొదట అందరూ ఎవరి ఆటపై వారు దృష్టి సారించారు. అయితే విష్ణుప్రియ.. అవతలివారు ఆటలో ముందుకు పోకుండా తన తెడ్డుతో ఆ గ్లాసుల్ని పడగొట్టింది. గలీజ్ గేమ్దీంతో యష్మి.. ఇలా గలీజ్ ఆట ఆడాలంటే మొదటి నుంచే ఆడొచ్చు అని అసహనానికి లోనైంది. ఇక ఇప్పటివరకు పెట్టిన గేమ్స్లో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న ముగ్గురికీ చివరి టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ టాస్క్లో తేజ, పృథ్వీ, రోహిణి పాల్గొన్నారు. ఇసుక కూజాల్ని కింద పడకుండా హోల్డ్ చేయాలి. ఈ గేమ్లో తేజ ఓడిపోగా చివర్లో పృథ్వీ, రోహిణి మిగిలారు.పృథ్వీని ఓడించిన రోహిణినువ్వు పరిగెత్తగలవా? అంటూ హేళన చేసిన పృథ్వీపై రోహిణి విజయం సాధించి మెగా చీఫ్ అయినట్లు సమాచారం. ఇది తెలిసిన అభిమానులు దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పరాభవాన్ని పృథ్వీ తట్టుకుంటాడా? తన ఇగో హర్ట్ అయిందా? అనేది ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నిఖిల్కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్బాస్కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టార్గెట్.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్బాస్కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా ఉండే నిఖిల్ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్గా ఉండే ఆడవారిని టార్గెట్ చేస్తున్నావని, వారిని గేమ్ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్తో డ్యాన్స్ చేయాలనుంది, నిఖిల్తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్పై ఇష్టం చూపించింది. జీవితంలో క్షమించనన్న నిఖిల్వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్లో సీత.. ఆడవారి ఎమోషన్స్తో ఆడుకుంటావ్ అని నిందేయడంతో నిఖిల్ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.నిఖిల్కు సింపతీబిగ్బాస్ హౌస్లో ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్ ప్రక్రియతో నిఖిల్పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్ రేస్లో గౌతమ్ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్బాస్ తాజాగా హౌస్లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్గా రోహిణి!బిగ్బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్.. నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్బాస్లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టిన శోభా శెట్టి)తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్గా ఉండిపోయాడు.రెండో నామినేషన్ నబీల్కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్కి విడాకులు ఇచ్చేసిన భార్య)అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు) -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్పై ప్రేరణ కుళ్లు
బిగ్బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్లో జరుగుతోంది అని నబీల్తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్గా మొదలుపెట్టి వైల్డ్గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్కు సలహాఅతడి లవ్ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్పై మండిపడింది. నిఖిల్తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్కు పెద్ద మైనస్
నిఖిల్ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని నిఖిల్ క్లియర్గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్ షర్ట్ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.ముసుగులో గుద్దులాటఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్ను ఎప్పుడో కట్ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్కు ఈ ఎపిసోడ్ కొంత మైనస్గా మారేట్లు కనిపిస్తోంది.పురుగుల్ని చూసినట్లు చూస్తావుఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆర్జే శేఖర్ బాషా.. ప్రేరణను నామినేట్ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్లో నిఖిల్ నిన్ను, యష్మిని రఫ్గా హ్యాండిల్ చేశాడు. ఆ పాయింట్తో నువ్వు నిఖిల్ను నామినేట్ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ను ఎందుకు నామినేట్ చేశావు? అని ప్రశ్నించాడు.నిఖిల్కు లేని బాధ నీకెందుకు?అటు యష్మిని సైతం నామినేట్ చేస్తూ.. అవినాష్.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్ను నామినేట్ చేశాడు. అక్కడ నిఖిలే లైట్ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్ చేశాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్తో నామినేషన్ఇక నిఖిల్ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్ను హౌస్మేట్స్కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్మేట్స్కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్ను పంపించమని బిగ్బాస్ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మికి హింట్ ఇచ్చిన తండ్రి.. ఆ తప్పు చేయొద్దంటూ..
మగళై.. ఈ పదం వింటే చాలు యష్మి ఒళ్లు పలకరించిపోతుంది. తండ్రి తనను ముద్దుగా మగళై అని పిలుస్తాడని యష్మి చెప్పినప్పుడు ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. తండ్రి పంపిన లెటర్ కొన్ని క్షణాలపాటు కళ్లముందు కనిపించి మాయమైనప్పుడు కన్నీళ్ల వరద పారింది. అలాంటిది తండ్రి తన కళ్లముందుకు నడుచుకుంటూ వస్తే.. ?ఆనందభాష్పాలుఫ్యామిలీ వీక్లో భాగంగా యష్మి తండ్రి హౌస్లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే యష్మిలో ఎమోషన్స్ కట్టలు తెంచుకున్నాయి. పప్పా అని గట్టిగా అరిచి నాన్నను ఆప్యాయంగా హత్తుకుంది. ఆయన కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని తన తప్పులు సరిదిద్దుతూ కొన్ని హింట్లు ఇచ్చాడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. బయట బ్యాడ్ అవుతున్నావు. నువ్వు ఇన్నిరోజులు ఉండి ఇంతవరకు వచ్చావు.. నిన్ను ఫినాలే స్టేజీపై చూడాలనుంది అని చెప్పాడు. కూతురి తరపున సారీహౌస్మేట్స్తో కూడా.. నా కూతురు ఆవేశంలో ఏమైనా అంటే తప్పుగా తీసుకోకండి.. అని కోరాడు. కూతురి కోసం తండ్రి క్షమాపణ చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు. ఎంతైనా తండ్రీకూతుర్ల అనుబంధం అన్నింటికంటే గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నిఖిల్ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్మేట్స్కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్ను పాము నోట్లో వేసింది.అవినాష్పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్లోకి రావట్లేదంటూ అవినాష్ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్ను పాము నోట్లో వేశాడు.నబీల్కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్: ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన ఓరుగల్లు బిడ్డ
ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్లో ఉన్నవారిని సేవ్ చేయడానికి బిగ్బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్ షీల్డ్ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్అయితే ఎవిక్షన్ షీల్డ్కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్లో నుంచి తీసేయాలని మెగా చీఫ్ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్ చేసేసింది. మిగిలిన హౌస్మేట్స్ షీల్డ్ కోసం పోటీపడ్డారు.ఎవిక్షన్ షీల్డ్ఈ క్రమంలో నబీల్.. యష్మిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్ షీల్డ్ చివరకు నబీల్ను వరించినట్లు తెలుస్తోంది. నబీల్కు మైనస్?అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్ అయ్యేట్లు లేదు. నామినేషన్లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్మేట్స్కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్ బ్యాంక్ పడిపోయే ఆస్కారం ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాపై ఎవరూ ఇంత సీరియస్ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు
బిగ్బాస్ హౌస్లో కంటెండర్షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.సారీ చెప్పువేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.ఇకపై పృథ్వీకి దూరంగా?ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.అక్కా అని పిలవకుఇక బిగ్బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్తో అందరూ నవ్వేశారు. బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్షిప్ కోసం హౌస్లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్షిప్ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్షిప్ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్కేస్లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్బాస్ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్కేసుకు బదులుగా మిస్టరీ సూట్కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్కేసును గౌతమ్కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అనడం తప్పన్న నిఖిల్, ఫ్రెండ్ను కాపాడిన అవినాష్
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది. తెలుగులో కొత్త బూతు 'అక్క'అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.నువ్వే ఆ ఛాన్సిచ్చావువిష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.చప్పట్లు కొట్టిన గంగవ్వగంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్షిప్ గేమ్లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది. బిగ్బాస్కు గౌరవం ఇవ్వలేదుగౌతమ్ వంతు రాగా.. టీమ్లీడర్గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్బాస్ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.ఆమెను సేవ్ చేసిన అవినాష్యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్ చేసిన పనికి షాక్లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్మేట్స్కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్లో అగ్రెసివ్గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్మేట్స్ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్గా క్రష్, సడన్గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్లో తన రెడ్ టీమ్లో గౌతమ్ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అంటే నీకేమైనా సమస్యా? యష్మిని నిలదీసిన నాగ్
వచ్చీరాగానే మెగా చీఫ్ అయి తన సత్తా నిరూపించుకున్నాడు గౌతమ్. కానీ ఏమైంది? వచ్చినవారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయిపోయేవారు. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల అతడు హౌస్లో ఉండగలిగాడు. ఒకసారి దెబ్బ తగలడంతో తన ఆట, మాట అన్నింటినీ ఓసారి రీచెక్ చేసుకున్నాడు.క్రష్ను అక్క అనేసిన గౌతమ్యష్మితో క్రష్ అంటూ లవ్ ట్రాక్ నడపడం జనాలకు నచ్చలేదేమో అని రియలైజ్ అయ్యాడు. ఆమెను కూడా అందరితో సమానంగా చూశాడు. ఈ క్రమంలో నామినేషన్స్లో ఆమెతో గొడవపడేటప్పుడు అక్కా అనేశాడు. అయితే అక్కా అని పిలవద్దని యష్మి తోకతొక్కిన తాచుపాములా లేచి బుసలు కొట్టింది.రెండు బూతు పదాలు తెలుసుకున్నాకట్ చేస్తే నయనితో గొడవ జరిగినప్పుడు కూడా గౌతమ్ ఆమెను అక్కా అన్నాడు. దీంతో ఆమె కూడా అక్కా అనొద్దంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దీని గురించి నాగ్ తాజా ప్రోమోలో చర్చించాడు. కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి, ఒకటి అక్క, రెండోది బ్రదర్ అని నాగ్ సెటైర్లు వేశాడు. అక్కా అంటే ప్రాబ్లం ఏంటని యష్మిని అడిగాడు. మధ్యలో ఎందుకు మాట్లాడావ్?నామినేషన్స్లో గౌతమ్ విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరావని ప్రశ్నించాడు. మరింత క్లారిటీ కోసం వీడియో కూడా చూపించాడు. అందులో గౌతమ్ అక్కా అనగానే యష్మి తమ్ముడు అనేసింది. సడన్గా క్రష్ అని, సడన్గా అక్కా అనేసరికి తీసుకోలేకపోయానని యష్మి బదులిచ్చింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ మ్యాచ్ఫిక్సింగ్.. బిగ్బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్బాస్ హౌస్లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్మేట్స్కు వీడియో మెసేజ్ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్తో డీల్నిన్న బిగ్బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్కు వచ్చావు.. స్ట్రాంగ్గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్మేట్స్ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్బాస్ సడన్గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నాకంటే కూడా నువ్వే ఎక్కువ.. సిగ్గు విడిచి చెప్పిన విష్ణు
బీబీ ఇంటికి దారేది టాస్కులో కొట్లాటలు పుష్కలంగా ఉన్నాయి. అన్నింటికీ మించి కన్నడ టీమ్ మధ్యలోనే ఎక్కువ పోట్లాటలు జరుగుతూ ఉండటం గమనార్హం. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పానీపట్టు యుద్ధం గెలిచిందెవరంటే?బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్లో భాగంగా ఇచ్చిన పానీపట్టు యుద్ధం టాస్క్ కొనసాంగిపుతో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ గేమ్లో బ్లూ టీమ్ సైడ్ అవగా తర్వాత రెడ్ టీమ్ ఓడిపోయింది. చివరి రౌండ్లో ఎల్లో టీమ్పై గ్రీన్ టీమ్ విజయం సాధించింది. వీరు బ్లూ టీమ్కు ఎల్లో కార్డ్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ టీమ్ లీడర్ నబీల్ రెండుసార్లు డైస్ వేసి ఒక పాయింట్ను తేజకు, మూడు పాయింట్లను తనకు ఇచ్చుకున్నాడు.నిఖిల్తో యష్మి వాదనపానీపట్టు యుద్ధం గేమ్లో తనను విసిరేయడాన్ని గుర్తు చేస్తూ నిఖిల్తో గొడవకు దిగింది యష్మి. సంచాలకుడు ఆపేయమని చెప్తున్నా నువ్వు నన్ను వదిలేయలేదు.. అక్కడ నీ శక్తి వాడాల్సిన అవసరం లేదు అని గద్దించి చెప్పింది. దీంతో చిరాకు పడ్డ నిఖిల్.. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. కానీ ఆ కోపం కాసేపటికే బాధగా కరిగిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండుయష్మి హగ్ చేసుకోవడానికి వస్తే కూడా నిరాకరించాడు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఉన్నన్ని రోజులు నేను సోలోగానే ఆడతా.. త్వరగా వెళ్లిపోతే బాగుండనిపిస్తోంది. రిలేషన్షిప్ ఏదైనా ఉంటే బయటకు వెళ్లాక చూసుకుందాం అని కఠినంగా చెప్తూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి మాటలకు బాధపడ్డ యష్మి సారీ చెప్పి ఒక్కసారిగా ఏడ్చేసింది.నా కన్నా నువ్వే ముఖ్యంమరోవైపు అన్నీ తెలిసిన పృథ్వీ.. నన్నెందుకు నామినేట్ చేయవు అని విష్ణును అడిగాడు. అందుకామె.. నా దృష్టిలో నాకన్నా నువ్వే ఎక్కువ అని బదులిచ్చింది. మరి నేనెందుకు నిన్ను నామినేట్ చేయను? అని అడిగాడు. నువ్వు చేయగలవు, ఎందుకంటే నీకు నువ్వే ముఖ్యం, నేను కాదు.. అని విష్ణు తెలిపింది. అందుకతడు అవునని తలాడిస్తూనే అయినా నేను ఇప్పటికీ నిన్ను నామినేట్ చేయలేదని నవ్వాడు. అందుకు విష్ణు.. అది నీ గ్రేట్ పర్సనాలిటీ అని పొగడ్తలతో ముంచెత్తింది.మళ్లీ ఏడ్చేసిన నయనితర్వాత బిగ్బాస్ స్లీపింగ్ రేస్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో గెలిచిన బ్లూ టీమ్ గ్రీన్ టీమ్కు ఎల్లో కార్డ్ ఇచ్చింది. హరితేజ డైస్ వేయగా వచ్చిన ఐదు పాయింట్లను నిఖిల్కు, మూడు పాయింట్లను అవినాష్కు ఇచ్చాడు. ఇకపోతే స్లీపింగ్ రేస్లో ఫౌల్ గేమ్ ఆడావంటూ నయనిని పక్కకు తీసుకెళ్లి చెప్పింది రోహిణి. మన టీమ్వాళ్లే ఇలా మాట్లాడితే బాధగా ఉంటుందంటూ వెంటనే కన్నీళ్ల ట్యాప్ ఓపెన్ చేసింది.తేజపై విష్ణు చిరాకుఆమె రియాక్షన్ చూశాక రోహిణి.. ఇదంతా కావాలని చేస్తున్నట్లుందని అభిప్రాయపడగా.. ఏదో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తోందని ప్రేరణ కూడబలికింది. ఇక అవినాష్, తేజ సరదాగా పొట్టతో గేమ్ ఆడుతుంటే అందుకు విష్ణు ఒప్పుకోలేదు. ఇలాంటి గేమ్స్ వల్ల తేజ ఎనర్జీ పోతుందని, అయినా వినకుండా ఆడతానంటే నెక్స్ట్ గేమ్లో తేజను పంపించనని చెప్పింది. సరదాగా ఆడుకుంటే అందులో తప్పేముంది? అంత పెద్ద మాటలనాల్సిన అవసరమేంటని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు.గంగవ్వ అవుట్బిగ్బాస్ పాయిజన్ యాపిల్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో రెడ్ టీమ్ గెలుపొందింది. వీరికి బిగ్బాస్ రెండు ఎల్లో కార్డ్స్ ఇవ్వగా ఆ రెండింటినీ బ్లూ టీమ్కు ఇచ్చారు. దీంతో వాళ్లు తమ టీమ్లోని గంగవ్వను రేసులో నుంచి తీసేశారు. ఇక యష్మి డైస్ వేయగా వచ్చిన ఒక పాయింట్ను గౌతమ్కు, రెండు పాయింట్లను ప్రేరణకు ఇచ్చింది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.. ఏడ్చేసిన నిఖిల్
బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్.. కొట్లాటలకు దారి చూపింది. ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా నిఖిల్.. యష్మి, ప్రేరణను పక్కకు లాగేశాడు. వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా వాళ్లను విసిరేస్తూ అరాచకం సృష్టించాడు. అమ్మాయిలతో ఇలాగేనా ప్రవర్తించేదని గౌతమ్ నిలదీయగా అతడితో గొడవకు దిగాడు. ఇంత గొడవ జరిగిన టాస్క్ పేరు పానీపట్టు యుద్ధం. ఈ యుద్ధం నేటి ఎపిసోడ్లోనూ ఇంకా కొనసాగనుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.నిఖిల్ను తప్పుపట్టిన యష్మిప్రోమో ప్రకారం గేమ్ చివర్లో కేవలం ఎల్లో, గ్రీన్ టీమ్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్లు నీటిని ట్యాంకులో నుంచి పోకుండా ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మరోవైపు నిఖిల్, యష్మి ఇంకా గొడవపడుతూనే ఉన్నారు. సంచాలకుడికి గౌరవం ఇవ్వలేదని యష్మి నిఖిల్ను తప్పుపట్టింది. గేమ్లో అంత శక్తి వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అందుకు నిఖిల్.. నా శక్తి వాడుంటే మీరు వాటర్ ట్యాంక్ దగ్గర ఉండేవాళ్లు కాదని బదులిచ్చాడు.అవసరం లేదుతర్వాత నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో యష్మి ఓదార్చేందుకు ప్రయత్నించింది. అయితే తన దగ్గరకు రావద్దని నిఖిల్ అనడంతో ఒక ఫ్రెండ్గా వచ్చానని యష్మి చెప్పింది. అయినా అవసరం లేదని అతడు కరాఖండిగా చెప్పేశాడు. తనకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: నిఖిల్ వయలెన్స్.. అమ్మాయిలని కూడా చూడకుండా
ఈసారి బిగ్బాస్ షోలో కాస్తోకూస్తో కూల్గా, స్ట్రాటజీతో ఆడుతున్నది నిఖిల్ ఒక్కడే. ఫైనల్ రేసులో ఉన్న ఇతడు.. ఇప్పుడు వయలెంట్ అయిపోయాడు. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా అమ్మాయిలని కూడా చూడకుండా కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు. గేమ్ కోసమే అయ్యిండొచ్చు కానీ మరీ ఈ రేంజ్లో అరాచకం చూపించడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇంతకీ తాజాగా(అక్టోబర్ 29) హౌస్లో ఏమేం జరిగిందనేది 58వ రోజు హైలైట్స్లో చూద్దాం.రెండు కాదు ఒక్కటే క్లాన్గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, యష్మి ఈ వారం నామినేషన్స్లో ఉండటంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. రాయల్, ఓజీ క్లాన్స్ కాదు ఇకపై అందరూ బీబీ క్లాన్లోనే ఉంటారని బిగ్బాస్ చెప్పడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఈసారి కెప్టెన్ కంటెండర్షిప్ కోసం 'బీబీ ఇంటికి దారేది' అనే గేమ్ పెడుతున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇందుకోసం హౌస్మేట్స్ని నాలుగు టీమ్స్గా విడగొట్టారు. టీమ్ రెడ్లో గౌతమ్-ప్రేరణ-యష్మీ.. టీమ్ బ్లూలో అవినాష్-నిఖిల్-హరితేజ.. టీమ్ గ్రీన్లో తేజ-విష్ణుప్రియ-నబీల్.. టీమ్ ఎల్లోలో రోహిణి-పృథ్వీ-నయని పెట్టారు. గంగవ్వని ఏదో ఓ జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. దీంతో ఆమెని బ్లూ టీమ్ తీసుకుంది.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)తొలి టాస్క్ బ్లూ టీమ్దేఒక్కో టీమ్లో హరితేజ, పృథ్వీ, నబీల్ని లీడర్లుగా ఎంచుకున్నారు. ఇక తొలి టాస్క్ మంచు మనిషిని తయారు చేయడం. ఇందులో భాగంగా టీమ్స్లోని ముగ్గురు సభ్యులు ఒకే స్కీ బోర్డ్ని ఉపయోగించి బొమ్మకి రూపు తీసుకురావాలి. ఇందులో గెలిచిన టీమ్.. రెండు డైస్ని రోల్ చేసే అవకాశంతో పాటు ఓడిపోయిన మిగిలిన టీమ్ నుంచి ఓ టీమ్కి ఎల్లో కార్డ్ ఇవ్వొచ్చు. ఎప్పుడైతే ఓ టీమ్కి రెండు ఎల్లో కార్డ్స్ వస్తాయో ఆ టీమ్ లీడర్ తమ టీమ్ నుంచి ఓ సభ్యుడ్ని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది. తొలి పోటీలో గెలిచిన బ్లూ టీమ్.. టీమ్ రెడ్కి ఎల్లో కార్డ్ ఇచ్చింది. డైస్ రెండు సార్లు రోల్ చేయగా.. 6,3 పడ్డాయి. దీంతో 6 పాయింట్లని హరితేజ తీసుకుంది, 3 పాయింట్లని అవినాష్కి ఇచ్చింది.నీళ్ల ట్యాంక్ తెచ్చిన తంట'పానిపట్టు యుద్ధం' అని రెండో టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా చిన్నసైజు ట్యాంకుల్లో ఉన్న నీటిని ఆయా టీమ్స్.. బజర్ మోగేంతవరకు కాపాడుకోవాలి. నీటి ఎత్తు తగ్గిన టీమ్.. పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు బజర్ మోగిన తర్వాత ట్యాంక్లోని నీటిని తగ్గించేందుకు అపోజిట్ టీమ్స్ నుంచి ఒక్కొక్కరు ప్రయత్నించొచ్చు. అయితే ఈ గేమ్ సాఫీగా సాగిపోతే బాగుండేది కానీ నిఖిల్.. అందరితో గొడవ పెట్టుకోవడం రచ్చ రచ్చ అయింది.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ)నిఖిల్ టీమ్కి కలిసిరాలేదుతొలిసారి బజర్ మోగగానే నబీల్, నిఖిల్ లైన్ దాటి లోపలికి వచ్చారు. దీంతో నీటిని తగ్గించే అవకాశం వీళ్లకు ఇచ్చింది సంచాలక్ గంగవ్వ. తర్వాత ఛాన్స్.. నబీల్-పృథ్వీకి రాగా వీళ్లిద్దరూ కలిసి బ్లూ టీమ్ని టార్గెట్ చేశారు. ఓసారి బజర్ ఆగిపోయిన తర్వాత బ్లూ టీమ్ ప్లగ్గులని పృథ్వీ విసిరేశాడు. దీంతో నిఖిల్-పృథ్వీ మధ్య కాసేపు డిష్యూం డిష్యూం జరిగింది. మూడోసారి పృథ్వీ, గౌతమ్కి ఛాన్స్ వచ్చింది. హరితేజని పక్కకు లాగిన గౌతమ్.. బ్లూ టీమ్ ట్యాంక్లోని నీరంత పోయేలా చేశాడు. దీంతో బ్లూ టీమ్ గేమ్ నుంచి ఔట్ అయిపోయింది.అమ్మాయిలపై నిఖిల్ అరాచకంతర్వాత ఛాన్స్ నిఖిల్కి వచ్చింది. తమని గేమ్ నుంచి తప్పుకొనేలా చేసిన గౌతమ్ ఉన్న టీమ్ రెడ్ని టార్గెట్ చేశాడు. వాటర్ దగ్గర అడ్డుగా ఉన్న యష్మి-ప్రేరణని పక్కకి లాగేశాడు. అటు ఇటు విసిరేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఇలా చేయకూడదని రూల్స్లో ఉందా అని ఉల్టా గౌతమ్తోనే గొడవ పెట్టుకున్నాడు. నిఖిల్ అరాచకం దెబ్బకు హౌస్మేట్స్ చాలా హెచ్చరించాడు. అయినా సరే అమ్మాయిలిద్దరినీ కాస్త కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు.గౌతమ్ పాయింట్స్బజర్ మోగి ఈ రచ్చ అంతా ఆగిపోయిన తర్వాత.. అక్కడ అమ్మాయి ఉందనే సెన్స్ లేదా అని గౌతమ్, నిఖిల్తో గొడవ పెట్టుకున్నాడు. నీకుందా అని నిఖిల్ కూడా గౌతమ్పై రెయిజ్ అయ్యాడు. ప్రేరణ కూడా ఏదో తిట్టడంతో మైండ్ యూ ఆర్ వర్డ్స్ అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకరిపై ఒకరు వచ్చి కొట్టేసుకుంటారా అన్నంతలా హడావుడి చేశాడు. చివరకు హౌస్ అంతా వీళ్లని విడదీయడంతో ఎపిసోడ్కి ఎండ్ కార్ట్ పడింది.(ఇదీ చదవండి: మా ఆయన కోసం సినిమా చూడండి: హీరో కిరణ్ అబ్బవరం భార్య) -
బిగ్బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్ను హాస్పిటల్కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్ను చేయడంతో పాటు విలన్ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్మేట్స్కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్ను పంపించాడు. తర్వాత బజర్కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని అక్కా అనేసిన గౌతమ్, నామినేషన్స్లో ఐదుగురు
అటు ఓజీలు(పాత కంటెస్టెంట్లు) విష్ణుప్రియను కంటెండర్గా సెలక్ట్ చేస్తే రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఏకంగా ఆమెను మెగా చీఫ్గా సెలక్ట్ చేశారు. గేమ్లో కనిపించట్లేదన్నవారితో సహా దాదాపు అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అందుకేనేమో బిగ్బాస్ ఈసారి నామినేషన్స్ విష్ణుకు టఫ్గా ఉండేలా పెట్టాడు.దీంతో ఆమె గౌతమ్, తేజ, హరితేజలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో గౌతమ్, యష్మికి మధ్య వాదులాట జరిగింది. నువ్వు ఆగు అక్కా.. అని గౌతమ్ అనగా.. నన్ను అక్కా అనకు, యష్మి అని పిలువు అని అరిచేసింది. ఒకసారి క్రష్, ఒకసారి అక్కా అని పిలవకు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక గౌతమ్, పృథ్వీ దమ్ము చూపించుకుందాం రా అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఈ వారం యష్మి, గౌతమ్, నయని పావని, హరితేజ, తేజ నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్లో బిగ్బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్మేట్స్ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్తో జోష్ నింపింది. ప్రైజ్మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్మేట్స్ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్కు వెళ్లి మళ్లీ హౌస్లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రయాంగిల్ లవ్స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్ప్రైజ్
గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్ అది కేవలం ప్రాంక్ అని బయటపెట్టాడు. ప్రైజ్మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్ 26) ఎపిసోడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా మారాడు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..ఇవే తగ్గించుకుంటే మంచిదిఘోస్ట్ ప్రాంక్లో గంగవ్వ యాక్టింగ్కు ఇంప్రెస్ అయిన నాగ్ ఆమెను కన్ఫెషన్ రూమ్కు పిలిచి మరీ సీక్రెట్గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్.. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్ కొట్టాడు. నీ వల్ల అరలక్ష గోవిందా..ప్రైజ్మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్కు నొక్కి చెప్పాడు. గౌతమ్ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్? నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతర్వాత నిఖిల్- యష్మి - గౌతమ్ల ట్రయాంగిల్ లవ్స్టోరీని నాగ్ బయటపెట్టాడు. హౌస్లో జరిగిన టీ షర్ట్ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తానని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్ టీషర్ట్ కావాలని యష్మి అడిగింది. నిఖిల్ టీషర్ట్ లేదు కాబట్టి గౌతమ్ది వేసుకుంది. అప్పుడు నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.యష్మికి గడ్డి పెట్టిన నాగ్రాయల్ టీమ్లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్, మళ్లీ గేమ్కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు కెమెరామన్, ఇప్పుడు డైరెక్టర్ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్ అని.. ఈ ఐడియా అవినాష్, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్. తర్వాత కంగువా ప్రమోషన్స్ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.సూర్య కోసం వచ్చేందుకు రెడీసూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్మేట్స్ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్ వేసి అతడిని సర్ప్రైజ్ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్ అడగ్గా తప్పకుండా వస్తాను సర్ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్ డైలాగ్ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.డ్యాన్స్ రిహార్సల్స్లో గొడవఅయితే డ్యాన్స్ రిహార్సల్స్లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్ పార్ట్నర్ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్గా లేము బిగ్బాస్. పార్ట్నర్స్ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్బాస్ నిఖిల్ -యష్మిని విడదీశాడు. నిఖిల్తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్ చేయాలన్నాడు.బిత్తరపోయిన విష్ణుఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్గా నిలిచింది. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్లో ప్రేరణను కంటెండర్గా ప్రకటించారు. రాయల్స్ టీమ్లో మెహబూబ్ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్గా ఎన్నుకునే బాధ్యతను హౌస్మేట్స్పై వేశాడు. మెగా చీఫ్కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మధ్యలో ఎందుకు దూరుతున్నావ్? యష్మిపై గౌతమ్ ఫైర్
వైల్డ్కార్డులు వచ్చినప్పటినుంచి ప్రతి టాస్కు గెలుస్తూ పాత కంటెస్టెంట్లపై పైచేయి సాధించారు. మెగా చీఫ్ పోస్టును కూడా రెండువారాలపాటు తమదగ్గరే ఉంచేసుకున్నారు. ఇప్పుడు ఓజీ(పాత కంటెస్టెంట్లు) టీమ్ వంతు వచ్చింది. టాస్కులు భయంకరంగా ఆడి గెలిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టాస్కు ఫలితాల్లో గౌతమ్కు ఏదో తేడా కొట్టి ప్రేరణతో మాట్లాడాడు.ఇక్కడి నుంచి వెళ్లిపోమీరేమైనా చేసుకోండి.. కానీ ముందు నేను చెప్పే పాయింట వినండి అని ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఇంతలో యష్మి మధ్యలో దూరడంతో గౌతమ్ ఆగ్రహించాడు. మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని అరవడంతో యష్మి సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంది.ఆటలోనే భరించలేముఇక చీఫ్ కంటెండర్లు కావాలంటే కండబలం, బుద్ధిబలం ఉపయోగించేలా టాస్కులు పెట్టిన బిగ్బాస్ చీఫ్ పోస్టుకు మాత్రం బలమైన టాస్క్ రాసుకోనేలేదు. హౌస్మేట్స్ నిర్ణయానికే వదిలేశాడు. పృథ్వీని ఆటలోనే భరించలేము, చీఫ్గా వారమంతా భరిస్తామా? అని హరితేజ అభిప్రాయపడింది. మొత్తానికి విష్ణుప్రియ ఈ వారం మెగా చీఫ్గా నిలిచింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్ను పొందడానికి బిగ్బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్లో నుంచి నిఖిల్ను మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్మేట్స్ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్ను మార్కెట్కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్గా మారి హౌస్మేట్స్తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్లైన్స్ను బోర్డ్పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్లైన్స్ కరెక్ట్గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్ను చూసి హౌస్మేట్స్కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్తో హౌస్లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్బాస్ మణికంఠతో హౌస్మేట్స్కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్మేట్స్లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠకు భార్య నుంచి సర్ప్రైజ్.. దక్కనివ్వని యష్మి
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెలరోజులైపోయింది. అయినవాళ్లను వదిలేసి వచ్చిన హౌస్మేట్స్కు ఇంటి మీద ఆల్రెడీ బెంగ మొదలైంది. ఈ బెంగను ఎంతోకొంత తీర్చేందుకు బిగ్బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచిరకమైన భోజనం తెప్పించాడు. అలాగే ప్రియమైనవారి లేఖలు సైతం వచ్చాయని గుడ్న్యూస్ చెప్పాడు.ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్..కానీ అంతలోనే మరో బ్యాడ్న్యూస్ చెప్పాడు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్.. తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను, మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు. వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్బాస్ తెలిపాడు.మణికంఠ టెన్షన్అయితే మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. నిఖిల్కే ఇస్తానంది. దీంతో మణి.. విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకొచ్చేసిందో అర్థం కావట్లేదు, ఈ షో వల్ల ఏమైనా జరిగుంటుందా? అని ఏడ్చేశాడు. అటు మణికంఠకు పృథ్వీ, యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోమన్నాడు.సోనియాను మర్చిపోని నిఖిల్అందుకు మణి.. పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం విని యష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? అని నిఖిల్ను ప్రశ్నించగా అతడు సోనియా పేరు చెప్పాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనాన్ని ఆస్వాదించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్బాస్ హౌస్కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్లకు బిగ్బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్బాస్ మిడ్వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్మేట్స్ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిట్టుకుని మరీ ఏడ్చిన యష్మి, పృథ్వీ.. మణి పరిస్థితి ఇలా అయిందేంటి?
హౌస్మేట్స్ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఈ గేమ్లో ఎవరు గెలిచారు? ఎవరు చీఫ్ అయ్యారు? మళ్లీ ఎలాంటి రభస జరిగిందనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మార్నింగ్ మస్తీ..బిగ్బాస్ ఇంటిసభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్.. కలర్.. విచ్ కలర్? అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు. మధ్యమధ్యలో హౌస్మేట్స్తో డ్యాన్సులు కూడా చేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్బాస్ వెల్లడించాడు. ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీమ్ నుంచి ఒకర్ని నేరుగా చీఫ్ కంటెండర్గా సెలక్ట్ చేయమని బిగ్బాస్ ఆదేశించాడు.ఏడ్చిన యష్మి, పృథ్వీదీంతో యష్మి, పృథ్వీ.. తాను కంటెండర్ అవుతానంటే తాను అవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ.. నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా? అని నెగెటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మతోడు అలా అనలేదని దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినగా కనిపించే ఇద్దరూ కంటతడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు.పప్పీ గేమ్పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కళుక్కుమంది. నువ్వు రోజూ దిష్టి తీయించుకో అంటూ అతడిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్.. పృథ్వీని చీఫ్ కంటెండర్గా సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద ఇంటిసభ్యుల పేర్లుంటాయి. ప్రతిఒక్కరూ తమపేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలక్ట్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కు కొత్త సంచాలక్పప్పీని చివరగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్తో పాటు పప్పీ మెడలోని ట్యాగ్పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరూ డేంజర్ జోన్లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్లో మణి, యష్మి.. డేంజర్ జోన్లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ.. యష్మిని గేమ్లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేసు నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీలయ్యాడు. మణిని టార్గెట్ చేశారా?రెండో రౌండ్లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి.. యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా.. తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతాడు, పోరా.. నీకయితే చీఫ్ అయ్యే అర్హతే లేదు. నువ్వు ఎలా ఆడతావో చూస్తా.. అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణి శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతడిపైకి గట్టి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది.విష్ణు అవుట్ దీంతో మణి అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చడం విశేషం. సీతూ అంటే ఇష్టం.. తనను తప్పుగా అర్థం చేసుందని ఎమోషనల్ అవడంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడో రౌండ్లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి.. విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. అతడే చీఫ్ఐదో రౌండ్లో నైనిక తన పప్పీ తనే తెచ్చేసుకోవడంతో గేమ్లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్రెడీ నబీల్ చీఫ్ కంటెండర్గా, ఆ తర్వాత చీఫ్గానూ సెలక్ట్ అయ్యాడట! ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెచ్చగొట్టిన యష్మి.. ఛాలెంజ్ చేసిన మణికంఠ
బిగ్బాస్ హౌస్లోకి ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తుఫానులా రాబోతున్నాయంటూ కంటెస్టెంట్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. మంచి కంటెంట్ లేకపోవడంతో బోర్గా ఫీలవుతున్న బిగ్బాస్ ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఇక హౌస్లో కొత్త చీఫ్ కోసం బిగ్బాస్ ఓ పోటీ పెట్టాడు. పోయిన సీజన్లోని టాస్కునే మళ్లీ రిపీట్ చేశాడు. మొత్తం 10 మంది పేర్లు ఉన్న కుక్కబొమ్మలుంటాయి. బజర్ మోగగానే వాటిని తీసుకొచ్చి వాటికి కేటాయించిన హౌస్లో పెట్టాలి. ఫెయిల్ అయినట్లేగా?ఎవరైతే పప్పీని చివరగా తీసుకొస్తారో, ఆ సభ్యుడు.. అలాగే పప్పీ మెడలో ఎవరి పేర్లైతే ట్యాగ్ ఉందో ఆ సభ్యుడు.. ఇద్దరూ డేంజర్ జోన్లో నిలబడాల్సి ఉంటుంది. అలా మణికంఠ, యష్మి డేంజర్ జోన్లో నిలబడగా.. పృథ్వీ.. యష్మికి సపోర్ట్ చేసి మణిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావంటూ యష్మి.. అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అందరూ కలిసి తనను కార్నర్ చేస్తున్నారని మణి ఆవేదన వ్యక్తం చేశాడు.మణికి దొరకని సపోర్ట్తర్వాత ప్రేరణ, యష్మి.. డేంజర్ జోన్లో నిలబడ్డారు. తనకు చీఫ్గా మళ్లీ ఛాన్స్ వస్తే తనను కరెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుందని యష్మి చెప్పింది. దీంతో మణికంఠ.. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటాను అంటున్నావంటే ఇంతకుముందు చీఫ్గా ఫెయిలయ్యావా? అని సూటిగా అడిగాడు. ఆల్రెడీ చీఫ్ అని నన్ను రేసు నుంచి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? అని యష్మి అడగ్గా.. యష్మి గేమ్లో నుంచి అవుట్ అని మణికంఠ తన నిర్ణయం చెప్పాడు. సవాల్మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. ఈ హౌస్కు చీఫ్ అయ్యే అర్హతే ఇతడికి లేదనేసింది. ఏదో ఒకరోజు నేను చీఫ్ అయి చూపిస్తానని మణి సవాల్ చేయగా.. అవ్వరా అవ్వు, ఎట్లా ఆడతావో నేనూ చూస్తానంటూ సవాలు చేసింది. మొత్తానికి చీఫ్ అవ్వాలన్న మణి ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఇకపోతే నబీల్ కొత్త చీఫ్గా ఎంపికయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు
బిగ్బాస్ 8లో ఐదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ లిస్టులో ఉన్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు బిగ్బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు. పోటీల సంగతేమో గానీ యష్మి ఓవరాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. నబీల్, మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని గుర్తుచేస్తున్నాయి. ఇంతకీ మంగళవారం (అక్టోబరు 01) ఎపిసోడ్లో ఏం జరిగింది?మణికంఠ చాలా డేంజరస్నామినేషన్స్ తర్వాత యష్మి-ప్రేరణ మాట్లాడటంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటకెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా అని ప్రేరణ, యష్మిని అడిగింది. అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటారు. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాను. ఎదుటివాళ్ల ఎమోషన్స్తో ఆడుకుంటూ, నమ్మించి మోసం చేయడం.. ఇదే గేమ్ రా.. ఆయన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది అని యష్మి తెగ రెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావారా అని ప్రేరణ అడగ్గా.. ఫ్రెండ్ అని పాపం నమ్మాను. నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని చూశా. కానీ చాలా డేంజరస్, క్రిమినల్ ఫేస్ ఉందని అనుకోలేదు అని యష్మి లోపలున్నదంతా బయటకు కక్కేసింది.గేమ్స్ షురూమంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు 'తాళం విడిపించు.. టైంని నడిపించు', 'జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావ్', 'రోల్ బేబీ రోల్' అని మూడు గేమ్స్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్లో తాళం విడిపించి టైర్లు తీయాలని పెట్టిన తొలి గేమ్లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీ పడ్డారు. కానీ టైంలోపు పూర్తి చేయలేకపోయారు. రెండో గేమ్లో మణికంఠ, యష్మి తలపడ్డారు. ఇందులో గెలిచేసరికి యష్మి తెగ ఓవరాక్షన్ చేసింది. మూడో పోటీలో నబీల్, ఆదిత్య పోటీ పడగా.. ఆదిత్యనే విజయం వరించింది. అలా శక్తి క్లాన్ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపేసింది.నబీల్ బక్వాస్ గేమ్మూడో గేమ్లో నబీల్ ఓడిపోయిన తర్వాత యష్మి అతడి గురించి నోటికొచ్చినట్లు మాట్లేడేసింది. 'గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబీల్. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్గా ఆడాడు' అని ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది. రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున అడిగితే నబీల్ గురించి యష్మీ తెగ పొగిడేసింది. ఇప్పుడేమో ఒక్క గేమ్లో ఈమె గెలిచేసరికి బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతూ ఓవరాక్షన్ చేస్తోంది.మణికంఠ, సీత ఔట్ఇక గేమ్స్లో ఓడిపోయిన తర్వాత 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్' నుంచి ఒకరిని తీసేయాలని చెప్పగా తొలుత కాంతార క్లాన్ అంతా డిసైడ్ చేసుకుని మణికంఠని సైడ్ చేశారు. ఇక రెండోసారి శక్తి క్లాన్కి అవకాశమివ్వగా సీతని సైడ్ చేశారు. అలా రాబోయే గేమ్స్లో వీళ్లిద్దరూ పోటీ పడకుండా అయిపోయింది. గేమ్స్ ఆడదామని టీమ్ మారినా సరే మణికంఠని బ్యాడ్ లక్ వరించింది. ఇలా ఈ రోజు పెట్టిన మూడు టాస్కుల్లో రెండింట్లో నిఖిల్ టీమ్ గెలవగా మరో టాస్కులో ఎవరూ గెలవలేదు.సోనియాలా యష్మి ప్రవర్తనఇన్నాళ్లు సోనియా ప్రవర్తన చూసి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అనుకున్నారు. ఆమె ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని అనుకున్నారు. దీంతో ఆడియెన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది. దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యష్మి తీసేసుకుందా అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్లో నబీల్, మణికంఠ గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపించింది. -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్లో ఎవరంటే?చివర్లో హౌస్మేట్స్కు బిగ్బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!
ఎంతోమంది బిగ్బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ముందే ఊహించిన సోనియాఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతార టీమ్ గెలిచింది. సోనియా టాక్సిక్అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత.. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్.. నిఖిల్ సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్ చేస్తాడన్నాడు.కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్ యష్మి.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తర్వాత నాగ్ ప్రేరణను, ఆదిత్యను సేవ్ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్.జైలుకు మణికంఠఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: సోనియా ఎలిమినేషన్కు కారణాలివే!)నేనెవరికీ నచ్చనుస్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్.. సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్బాస్ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్ 5న) వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అటెన్షన్ సీకర్ అంటూ పృథ్వీని కొట్టిన యష్మి, నిఖిల్ సేఫ్ ప్లే!
బూతులు మాట్లాడుతూ అతిగా ఆవేశపడే పృథ్వీ తన తీరు మార్చేసుకుని ఈ వారం హీరో అయ్యాడు. పోయినవారం సోనియాను నిర్భయంగా ఢీకొట్టి హీరోగా నిలిచిన యష్మి.. మణికంఠపై చేసిన చులకన కామెంట్ల వల్ల తన స్థాయి తగ్గించుకుంది. అటు విష్ణుప్రియ సైతం.. నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది.మీకే అంకితం..దీంతో ఆడాళ్ల నోటిదురుసు ఎక్కువవుతోందని భావించిన నాగ్ దానికి కళ్లెం వేయమని వార్నింగ్ ఇచ్చాడు. శనివారం ఎంత కోప్పడ్డా సరే సండే రోజు మళ్లీ మామూలు స్థితికి వచ్చేసి ఫన్ గేమ్స్ ఆడిస్తుంటాడు. ఈ క్రమంలోనే మీకే అంకితం అన్న గేమ్ ఆడించాడు. అలాగే ఏదైనా అంకితం ఇచ్చేటప్పుడు చెంపదెబ్బ కొట్టాలన్నాడు. హౌస్లో లౌడ్ స్పీకర్ విష్ణుప్రియ అని, మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడని, పృథ్వీ అటెన్షన్ సీకర్ అని చెప్తూ మిగతా కంటెస్టెంట్లు వారిని గట్టిగా కొట్టారు.పృథ్వీ అటెన్షన్ సీకర్ఏ లక్ష్యం లేనివారు? ఎవరు? అన్న చీటి నిఖిల్కు రాగా.. దాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. దీనికి బదులుగా ఇంకో చీటి తీసుకుంటానన్న నిఖిల్.. తీరా మరో చిట్టీ తీశాక.. దానికంటే మొదటిదే నయమన్నాడు. ఇక్కడ కూడా సేఫ్ ప్లే అని నాగ్ సెటైర్లు వేశాడు. ఈరోజు హౌస్మేట్స్ అందరూ రెట్రో లుక్లో కనిపించడం విశేషం -
నాగ్తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూరలో కరివేపాకులా మణికంఠ.. యష్మి, నిఖిల్ చిన్నచూపు!
హౌస్ అంతా ఒకవైపు.. నిఖిల్, సోనియా, పృథ్వీ ఒకవైపు.. ఎవరూ తన టీమ్లోకి రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో నిఖిల్ షాక్ తిన్నాడు. కానీ దాని ద్వారా నేర్చుకుందేమైనా ఉందా? అంటే జీరో! అందరితో బాగానే ఉండే నిఖిల్ తనకు తానే ఏదేదో ఊహించుకుంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? అనేది తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..జీవించేసిన మణికంఠమణికంఠ ఎమోషన్స్తో ఓ స్కిట్ వేయించింది సోనియా. నీ కూతుర్ని చాలా మిస్ అవుతున్నావు. తనను నీ దగ్గరికి రమ్మని ఎలా పిలుస్తావో యాక్టింగ్ చేయమని మణికంఠకు ఆర్డర్ వేసింది. అందుకాయన కూతుర్ని తలుచుకుని రా బంగారుతల్లి అంటూ కంటనీరుపెట్టుకుని ఏడుస్తూ జీవించేశాడు. అతడి యాక్టింగ్కు అందరూ చప్పట్లు కొట్టారు.ఆదిలోనే హంసపాదుఇకపోతే శక్తి (నిఖిల్), కాంతార(సీత) టీమ్స్లో దేనికి వెళ్తారో సెలక్ట్ చేసుకోమని బిగ్బాస్ చెప్పాడు. సోనియా, పృథ్వీ తప్ప విష్ణు, నైనిక, నబీల్, ఆదిత్య, యష్మి.. నలుగురూ కాంతార టీమ్నే ఎంచుకున్నారు. దీంతో చివర్లో ప్రేరణ, నాగమణికంఠ మాత్రమే మిగిలారు. వీళ్లకు సైతం కాంతార టీమ్కే వెళ్లాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. కానీ మరో ఆప్షన్ లేకపోవడంతో శక్తి టీమ్లోకి వెళ్తున్నానని నాగమణికంఠ అన్నాడు.ప్రేరణ కోసం యష్మి త్యాగంప్రేరణ.. తనకు బదులుగా ఎవరైనా శక్తి టీమ్కు వెళ్లమని కోరడంతో యష్మి ముందుకు వచ్చింది. తాను ఎక్కడున్నా గేమ్ ఆడతానంటూ లేచి నిలబడింది. అలా శక్తి టీమ్లో నిఖిల్, పృథ్వీ,సోనియా, యష్మి, మణికంఠ చేరారు. తన టీమ్లోకి రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదు, ఇప్పుడైనా ఇది నిఖిల్కు అర్థం అయితే బాగుండు అని సీత ఫీలైంది. కానీ నిఖిల్కు ఇదంతా మరోలా అర్థమైంది. హౌస్ అంతా ఒక్కటైందని, వాళ్లందరితో మనం ముగ్గురం ఫైట్ చేయాలని సోనియా, పృథ్వీకి నూరి పోస్తున్నాడు. తన టీమ్కు వచ్చిన యష్మి కూడా మనసులో ఏదో దురుద్దేశంతోనే వచ్చిందని ఊహించుకున్నాడు.12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తర్వాత బిగ్బాస్ ఓ పెద్ద భూకంపం రాబోతుందని ట్విస్ట్ ఇచ్చాడు. మిమ్మల్నే సవాలు చేస్తూ కొందరు ఇంట్లోకి రాబోతున్నారని సర్ప్రైజ్ చేశాడు. ఒకటీరెండు కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయన్నాడు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ ఇంటిసభ్యులకు ఇచ్చాడు. తాను ఇచ్చే ఛాలెంజ్ గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చని తెలిపాడు. అలాగే గెలిచే ప్రతి టీమ్ తరపు నుంచి ప్రైజ్మనీలోకి రూ.1 లక్ష జమ అవుతాయని పేర్కొన్నాడు.మణికంఠపై కుళ్లు జోకులువైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పగానే మణికంఠ భయంతో వణికిపోయినట్లున్నాడు. ఒంటరిగా దిగాలుగా కూర్చున్నాడు. అలాంటి సమయంలో 'అబ్బాయిలెంతమంది ఉన్నాం? నలుగురుమా? అయ్యో మణిని లెక్కపెట్టాలిగా' అని పృథ్వీ అంటే అందుకు యష్మి కౌంట్ లేదు అనేసింది. dwgsy నిఖిల్ దీన్ని పెద్దది చేశాడు. నిన్ను అబ్బాయిల లిస్టులోనే తీసేశారంటూ మసాలా జోడించాడు.వార్నింగ్!తను అబ్బాయే కాడంటూ జోకులు వేయడంతో కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ బాల్ పట్టు- టవర్లో పెట్టు. ఈ గేమ్లో కాంతార టీమ్ గెలవడంతో సభ్యులు ఎగిరి గంతేశారు. వీరు రూ.1 లక్ష గెలవడంతో పాటు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని హౌస్లో అడుగుపెట్టకుండా చేశారు.నిఖిల్ అనుకున్నదే వేరుఓడిన టీమ్లో ఒకర్ని ఆటలో నుంచి తీసేయాలని బిగ్బాస్ చెప్పాడు. నిఖిల్ మినహా అందరూ తన పేరే చెప్పడంతో పక్కకు తప్పుకునేందుకు మణి అంగీకరించాడు. అయితే నిఖిల్ మనసులో మాత్రం మరొకరి పేరు ఉందట! యష్మిని పక్కన పెట్టేదామనుకున్నానని, ఇంతలో మణి స్వయంగా సైడ్ అయ్యాడని సోనియాతో వాపోయాడు. ఎలాగో ఈ వారం నామినేషన్స్లో కూడా లేదు కదా! పైగా మన తప్పులు వెతకడానికే ఆమె ఈ టీమ్లోకి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.బిర్యానీ ఛాలెంజ్ఇంతలో బిగ్బాస్ బిర్యానీ ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో తాను ఆడతానని యష్మి ముందుకు రాగా.. నిఖిల్ తనను పక్కనపెట్టి సోనియాను సెలక్ట్ చేశాడు. కాంతార టీమ్ నుంచి నబీల్ విందు ఆరగించాడు. ఎంత కష్టపడ్డా బిర్యానీ ఖాళీ అవట్లేదని గ్రహించిన బిగ్బాస్ వీరికి తోడుగా మరో ఇద్దరు వెళ్లొచ్చన్నాడు. అలా యష్మి, ఆదిత్యను పంపించారు. అయినప్పటికీ మహాథాళిని 40 నిమిషాల్లో పూర్తి చేయకపోవడంతో రెండు టీమ్స్ ఓడిపోయాయని బిగ్బాస్ తెలిపాడు. అయితే మిగిలిన బిర్యానీని ఎవరైనా తినొచ్చనడంతో మిగతావాళ్లు ఎగబడి మరీ ఎంగిలి ఫుడ్ ఆవురావురుమని ఆరగించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి -
Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి
బిగ్బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ రచ్చనే సగం ఎపిసోడ్లో చూపించారు. ఈ క్రమంలోనే సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టగా.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనిపించింది. ఇంతకీ బిగ్బాస్లో 23వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.సోనియా బండారంనామినేషన్స్లో సోనిమా తీసిన పాయింట్స్.. యష్మికి ఎక్కడలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా నిఖిల్-పృథ్వీలనే నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడతుందని యష్మికి కౌంటర్గా సోనియా చెప్పింది. దీని వల్ల నామినేషన్స్ పూర్తయిన తర్వాత సోనియా-యష్మి గొడవపడుతూనే ఉన్నారు. 'నిఖిల్, పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితే మీరు మాట్లాడాలి' అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్గా మాటలు వదులుతుంటే నేను వంద మాట్లాడతా.. కానీ నేను అంత చీప్గా దిగజారను అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది.(ఇదీ చదవండి: తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?)యష్మి ఏడుపుఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్గా నువ్వు చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ.. గేమ్ పరంగా నేను చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి.. చేయి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావ్. మేము తప్పుగా మాట్లాడకూడదా.. అంటే ఎవరు హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో.. నువ్వు వాళ్లకి సిస్టర్ కాదు మదర్ కాదు.. నీ ఇష్టమచ్చినట్లు వాళ్లని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.. ఈరోజు అది క్లియర్ అయింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది.నిఖిల్ ఓదార్పుసోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్లూ నీతో (నిఖిల్) మాట్లాడతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికొచ్చింది మాట్లాడుతుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరుకు తీసుకుని ఆమెని ఓదార్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)హర్ట్ బ్రేక్ చేశావ్ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి నిఖిల్-సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చేయి వేసి మరీ సోనియాకు నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఈమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావ్ అన్నది పాయింట్ కాదురా.. ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకు బతుకున్నావ్ అని, వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అని యష్మి అందని.. అయితే ఇవన్నీ నువ్వు వినను కూడా వినలేదని.. కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నీ వరకు నువ్వు కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావ్ అని నిఖిల్తో సోనియా అంది. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి దూరం పెరిగినట్లే అనిపిస్తోంది.కొత్త చీఫ్గా సీతఇక రాత్రంతా సోనియా-యష్మి గొడవ జరగ్గా.. ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్కి ఇప్పటికే నిఖిల్ ఉండగా.. కాంతార క్లాన్ చీఫ్గా ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరికి చీఫ్ అయ్యే అర్హత లేదే వాళ్ల బొమ్మ విరగ్గొట్టాలని, దీనికోసం బజర్ మోగినప్పుడు సుత్తిని పట్టుకుని.. దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. ఈ ప్రొసెస్లో చివరగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్కి చీఫ్గా బాధ్యతలు అందుకుంది. అయితే ఏ క్లాన్లో ఎవరెవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుస్తోంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీప్ బిహేవియర్ బయటపడింది. అలానే యష్మి మంరింత స్ట్రాంగ్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
వాళ్లిద్దరినీ ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్.. సోనియాపై యష్మి ఫైర్
బిగ్బాస్ హోస్లో చీఫ్ పోస్ట్ పోయాక యష్మి ఆటలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్కు సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. అందులో యష్మి, సోనియాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవారం నామినేషన్ల తంతు రచ్చరచ్చ అయింది. ఒకరిపై మరోకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ముఖ్యంగా సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఈ గొడవలు ఇంతటితో క్లోజ్ అయ్యాయి అనుకుంటే.. మంగళవారం ఎపిసోడ్లో కూడా ఆ రచ్చ కొనసాగినట్లు ఉంది.సోనియాను యష్మి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. సిస్టర్, మదర్ అంటూ రిలేషన్స్ కలుపుతూ సోనియా గేమ్ ఆడుతుందని యష్మి ఫైర్ అయింది. ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాపై మండిపడింది. టాస్క్లలో పృథ్వి, నిఖిల్ ఇద్దరూ సోనియాకు హెల్ప్ చేస్తున్నారనేలా యష్మి మాట్లాడింది. దీంతో సోనియా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే మంగళవారం ఎపిసోడ్ రసవత్తరంగా ఉండేలా ఉంది. -
Bigg Boss 8: టాస్క్ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?
బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్లోనూ రేషన్ కోసం బిగ్బాస్ మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ-యష్మి, సీత-నిఖిల్ మధ్య నడిచిన ఫర్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఇంతకీ 16వ రోజు (మంగళవారం) బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందనేది చూద్దాం.తట్టుకోలేకపోయిన యష్మియష్మిని నామినేట్ చేసిన మణికంఠ.. నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టగానే ప్రయత్నించాడు. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనక నుంచి యష్మిని హగ్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకుపడి వదిలెయ్ అని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్బాస్కి చెప్పింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)రేషన్ కోసం మూడు టాస్క్లుఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం రెండు కాన్స్ (గ్రూప్స్)కి మూడు పోటీలు పెట్టాడు. తొలుత 'ఫొటో పెట్టు ఆగేటట్టు' గేమ్లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీమ్ లీడర్స్ ఫొటోలని స్టాండ్లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు' అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలని మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టారు. ఇందులో నిఖిల్ శక్తి టీమ్ గెలిచింది.తొక్కలో సంచాలక్అయితే రెండో గేమ్లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకి చెందిన ప్రేరణ.. మణికంఠపై అగ్గిపై గుగ్గిలం అయింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫ్ఫాడించేసింది. సంచాలక్గా తప్పు చేశాడన్నట్లు తొలుత మాట్లాడిన ప్రేరణ.. తర్వాత వెళ్లి అతడికి సారీ చెప్పింది.బెలూన్ వల్ల గొడవ'బూరని కొట్టు రేషన్ పట్టు' అని మూడో గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరు స్టిక్తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్లు గెలిచినట్లు అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా.. చివరకు బజర్ మోగేసరికి నిఖిల్ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది. నిఖిల్ ఒంటిపై ఏం లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీమ్ రేషన్ టాస్క్లో విజేతగా నిలిచింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. తెర వెనక ఇంత జరిగిందా?)యష్మి vs సోనియాకొన్నాళ్లుగా యష్మి, సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్ను డిక్లేర్ చేశావ్ అని ఫైర్ అయింది. ఏదేమైనా నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి.పులిహోర కబుర్లుగేమ్ గురించి పక్కనబెడితే మంగళవారం ఎపిసోడ్లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ-సోనియా మధ్య కూడా సమ్థింగ్ సమ్థింగ్. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా? అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది.ఇక రెండో గేమ్లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దుపెట్టేశాడు. అంతకు ముందు కిచెన్లోనూ సీత.. పృథ్వీని హగ్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి ఈ యవ్వారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: రూల్స్ పాటించరు.. పైగా అరుస్తూ దబాయింపు) -
వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్గా లేదు.. ఫైర్ అయిన యష్మి
బిగ్బాస్ తెలుగు 8వ సీజన్ మూడో వారం చేరుకుంది. సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత రెండువారాలుగా చీఫ్ పోస్ట్లో ఉన్న యష్మి తొలిసారి నామినేషన్ల ప్రక్రియలో అడుగుపెట్టింది. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ నామినేషన్ చేశారు.మణికంఠ, యష్మిల మధ్య నామినేషన్స్లో భాగంగా భారీ ఫైట్ నడిచింది. ఇద్దరూ కూడా గట్టిగట్టిగా అరిచారు. యాటిట్యూడ్ చూపించొద్దంటూ యష్మిపై మణికంఠ ఫైర్ అయ్యాడు. ఫ్రెండ్గా డ్రామాలు చేస్తున్నావా అంటూ మణిపై యష్మి విరుచుకుపడింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో తాను హౌస్లో ఉన్నంత కాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి చెప్పింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా విడుదలైన (డే-16) మంగళవారం ఎపిసోడ్లో యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతాడు. అదంతా నామినేషన్ వరకే అంటూ హగ్ చేసుకుంటాడు. కానీ, యష్మి మాత్రం తన హగ్ను రిజక్ట్ చేస్తుంది. వదిలేయ్ అంటూ కాస్త గట్టిగానే చెబుతుంది. ఈ సమయంలో యష్మి బాగా ఎమోషనల్ అవుతుంది. ఆపై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్ గురించి చెబుతుంది. 'అతని హగ్ కంఫర్టబుల్గా లేదు.. అంతా ఫేక్.. నేను ఉన్నంత వరకు వాడిని (మణి) నామినేట్ చేస్తూనే ఉంటాను' అని చెబుతుంది. -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్తో హౌస్లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్సభ్యులు తొండాట ఆడారని, చీఫ్గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్కే నువ్వు డేంజరస్గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్గా అనిపిస్తున్నాడని, హౌస్లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్లో మణికంఠ vs యష్మి
సోమవారం వచ్చేసింది. అంటే బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు. అందుకు తగ్గట్లే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు.తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్లా అనిపించిందని కారణం చెప్పింది. అలానే గేమ్లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. 'ఫ్రెండ్గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అలానే తన పాయింట్ ఆఫ్ వ్యూని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావ్ అని మణికంఠ చెప్పగా.. నీకు దమ్ము లేదా అని యష్మి రెచ్చిపోయింది. ఇక చివర్లో విష్ణుప్రియ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటేనే హోరాహోరీగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకేలా ఉంటుందో ఏంటో?(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్లు ఇచ్చాడు. టీమ్ లీడర్గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్తో గేమ్ ఆడించాడు. మీ టీమ్లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్లో నబీల్కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్గా నిలిచాడు. దీంతో హౌస్లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
యష్మికి బుల్లెట్ దింపిన నాగ్.. వెంటనే ప్లేటు తిప్పేసిందే!
బిగ్బాస్ హౌస్లో కెరటం టీమ్ సభ్యులు నాగమణికంఠ, నిఖిల్ రేషన్ లేక అల్లాడిపోతున్నారు. నిజానికి రేషన్ కోసం పెట్టిన గేమ్లో వీరు గెలవాల్సింది. అయితే యష్మి సంచాలకురాలు కావడంతో ఆటను తనకు నచ్చినట్లు మార్చేసింది. తాజా ప్రోమోలో నాగ్ ఆ విషయాన్ని ప్రస్తావించాడు.ప్లేటు తిప్పేసిన యష్మిమరమరాలు పావుకిలో తేవాలని బిగ్బాస్(#BiggBosstTlugu8) ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే పావుకిలోకు దగ్గర్లో పట్టుకొస్తారో వారికి పాయింట్ ఇస్తానంది యష్మి. మణికంఠ పావుకిలోకు దగ్గర్లో ప్యాక్ చేశాడు. కానీ, అతడిని గెలిపించడం ఇష్టం లేక ప్లేటు తిప్పేసింది. కరెక్ట్గా పావుకిలో ఉంటే మాత్రమే ఇస్తానంటూ ఎవరికీ పాయింట్ ఇవ్వలేదు. ఈ వీడియోను చూపిస్తూ యష్మి చీఫ్గా ఫెయిలైందంటూ తన ఫోటోను గన్తో కాల్చాడు. అబ్బా.. ఏం కవరింగ్రా బాబూ..దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్న టీమ్ ఆకలితో ఉండకూడదనే అలా చేశానని కవర్ చేసింది. అలాగే సంచాలకురాలిగా ప్రేరణ కన్ఫ్యూజ్ కావడానికి కారణం కూడా నువ్వేనని నాగ్ తనను నిందించాడు. ఇక పృథ్వీ కొన్ని అభ్యంతరకర పదాలు వాడుతున్నావని, నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించాడు. చదవండి: బిగ్బాస్ సైకాలజీ: అన్నింటినీ ప్రభావితం చేసేది గ్రూపులే! -
కిందపడ్డ సోనియా.. గెలిచి చూపించిన విష్ణుప్రియ
బిగ్బాస్ హౌస్లో కిరాణా సామాను పంపిణీ ముగిసింది. యష్మి, నైనిక టీమ్ సభ్యులు రేషన్ గెలుచుకుని, దాన్ని హాయిగా వండుకుని కడుపు నింపుకున్నారు. కానీ నిఖిల్ టీమ్ మాత్రం రాగిముద్ద, ఉడకబెట్టిన కూరగాయలతో సరిపెట్టుకుంది. రేషన్ గొడవ అయిపోవడంతో బిగ్బాస్(#BiggBossTelugu8) ప్రైజ్మనీపై దృష్టి సారించాడు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న ప్రైజ్మనీని హౌస్మేట్స్ వీలైనంతవరకు లాక్కుంటూ పోవచ్చన్నమాట!కిందపడ్డ సోనియాఈ ప్రైజ్మనీ టాస్కుల్లో భాగంగా మొదట విష్ణుప్రియ, సోనియా, మణికంఠలను స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నాడు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో సోనియా కిందపడిపోయింది. విష్ణు అందరికంటే ముందు దూకి రూ.25 వేలు గెలిచింది. తర్వాతి టాస్కులో నిఖిల్, నబీల్, పృథ్వీ కలర్ బాల్ గేమ్ ఆడారు. ఇందులో నబీల్ ఆదిలోనే అవుట్ అయిపోగా నిఖిల్, పృథ్వీ హోరాహోరీగా పోరాడారు. అబ్బాయిల కష్టాలుఅంతిమంగా నిఖిలే గెలిచి రూ.50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అనంతరం నిఖిల్, పృథ్వీ, నబీల్ను వ్యాక్స్ చేసుకోమన్నాడు బిగ్బాస్. ఈ వ్యాక్స్ చేసుకునేందుకు ముగ్గురూ నానాతంటాలు పడ్డారు. ఇకపోతే ఏదో పాల ప్యాకెట్ డస్ట్ బిన్లో కాకుండా కింద పడేసినందుకు విష్ణుప్రియకు యష్మి క్లాస్ పీకింది. మీరు మా చికెన్ దొంగిలించారుగా అని తనేదో చెప్పబోతుంటే యష్మి ఒంటికాలిపై లేచింది. సాక్ష్యం ఉందా? మేము తీసుకున్నట్లు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అని నిలదీసింది. ఎందుకు అరుస్తున్నావని అడిగితే నేనిలాగే మాట్లాడతానంటూ తన కోపాన్ని ప్రదర్శించింది. బహుశా ఇప్పటివరకు ప్రైజ్మనీ కోసం పెట్టిన గేమ్స్లో తన టీమ్ ఒక్కటి కూడా గెలవలేదన్న బాధను యష్మి ఇలా చూపిస్తుందేమో! -
నిజంగానే ఎమోషనల్ ఫూల్, ఇలాగైతే కష్టమే! మణి అదుర్స్!
బిగ్బాస్ హౌస్లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్కు హ్యాండిచ్చింది సోనియా. తనను లూజర్ అని పదేపదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న బిగ్బాస్వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్బాస్(#BiggBoss8Telugu) సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్ను ఆదేశించాడు బిగ్బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూడు టీమ్స్ సంపాదించిన రేషన్ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటగా మూడు టీమ్స్కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీమ్ గెలిచింది.సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పుఇక వేరే టీమ్స్కు ఫుడ్ దొరకదనుకుందో, ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్కు బిగ్బాస్ పోటీపెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్లో ఉన్నానని, తానే ఆడతానని మంకుపట్టు పట్టాడు. ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమిఅలా నిఖిల్ టీమ్ నుంచి మణి, నైనిక టీమ్ నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్.. ఇలా ఒక్కో వస్తువు చెప్పినకొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్లో గెలిచినట్లు! మరమరాలు పావుకిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గర్లో (290 గ్రాములు) పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్లో ఎవరూ విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. వారమంతా రాగి ముద్దతోనే..ఫైనల్గా ఈ ఛాలెంజ్లో సీత తన అంతులేని వీరులు టీమ్ను గెలిపించింది. కెరటం టీమ్లోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సర్దిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి.. టీమ్ అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. దొంగతనం షురూఅందుకు సోనియా సరేనంటూ తలూపుతూనే నిఖిల్ దగ్గరకొచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో.. అందరూ దోసె చేద్దామనుకుంటే కుదరదు ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీమ్ సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటిసభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు.ఎమోషనల్ ఫూల్మరోవైపు నిఖిల్ నామినేషన్స్లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక.. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్తో సోనియా.. నిఖిల్గాడిని చూస్తేనే కోపమొస్తుందని చెప్పింది. లూజర్స్తో ఉండనన్న సోనియాఅందుకు అభయ్.. నువ్వు నిఖిల్ను పదేపదే లూజర్ అన్నావంటగా.. లూజర్స్తో ఉండను అన్నావంట.. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీలయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా.. మరీ అంత కాకపోయినా, క్యాజువల్గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్లో అవతలివారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్లిద్దరు మాత్రమేనంది. అయినా మొన్నటి నామినేషన్స్తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు? అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ ఇద్దరి కడుపు కొట్టిన బిగ్బాస్, నిఖిల్ కోసం సోనియా ఏడుపు!
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అన్నీ అన్లిమిటెడ్ అంటూనే కొన్ని మాత్రం గెలిచి సంపాదించుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో రేషన్ ఒకటి. ఇంటిసభ్యుల కడుపు నిండాలంటే వారే కష్టపడి టాస్కులు గెలిచి రేషన్ గెలిచి వండుకుని తినాలి. లేదంటే పస్తులుండాల్సిందే!ఆకలి పోరాటంఇందుకోసం టీముల మధ్య పోటీ పెట్టాడు బిగ్బాస్. మొదట లెమన్ పిజ్జా టాస్క్ పెట్టారు. ఇందులో యష్మి టీమ్ గెలిచినట్లు సమాచారం. తర్వాతి ఛాలెంజ్లో కందిపప్పు తెమ్మనగానే సీత పరుగెత్తుకుంటూ వెళ్లి తెచ్చేసింది. నెక్స్ట్ టమాట బుట్టలో ఒక యాపిల్ను తీయండనగానే మణికంఠ దాన్ని కనిపెట్టి క్యాచ్ చేశాడు. ముచ్చటగా మూడో గేమ్లో పావుకిలో మరమరాలు తేవాలన్నాడు బిగ్బాస్.మణికంఠ వర్సెస్ యష్మికరెక్టుగా 250 గ్రాములే తేవడానికి వీళ్లేమైనా కిరాణా షాపులో పని చేశారా? దీంతో కాస్త అటూఇటుగా తీసుకొచ్చారు. కానీ సంచాలకురాలు యష్మి కరెక్ట్గా తేలేదంటూ ఇద్దర్నీ అనర్హులుగా ప్రకటించింది. పావుకిలోకు దగ్గర్లో (290 గ్రాముల మరమరాలు) తెచ్చిన తాను గెలిచినట్లే కదా అని మణికంఠ వాదించాడు. అందుకు యష్మి ఒప్పుకోలేదు. మొత్తానికి ఈ గేమ్లో నైనిక టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది.చాలా బాధగా ఉంది బిగ్బాస్అందరికంటే చిన్నదైన నిఖిల్ టీమ్ ఎందులోనూ గెలవకపోవడంతో ఈ వారమంతా నో రేషన్ అని చెప్పాడట బిగ్బాస్. అలాగని పస్తులుంచకుండా.. కేవలం రాగి పిండి పంపించి దానితోనే అడ్జస్ట్ అయిపోమన్నాడట! కేవలం రాగిముద్దతోనే కడుపు నింపుకుని టాస్కులు ఆడాలంటే కష్టమే కదా! అందుకే సీత.. ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది. వారికి కూడా ఆహారాన్ని ఇవ్వండని బిగ్బాస్ను అభ్యర్థించింది. అటు సోనియా మాత్రం.. నిఖిల్ కడుపు మాడుతే తాను భరించలేనంటూ ఏడ్చేసింది. -
చుక్కలు చూపిస్తున్న యష్మి టీమ్.. మణిలో ఈ యాంగిల్ ఉందా!
సాధారణంగా బిగ్బాస్ మొదలైన ఒకటీరెండు వారాలవరకు పెద్దగా కంటెంట్ ఏమీ ఉండదు. కానీ ఈ సీజన్లో మాత్రం కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. శేఖర్ బాషా తన వెరైటీ కామెడీతో, సోనియా పాయింట్లు లాగుతూ గొడవ పడుతూ, నాగమణికంఠ ఏడుస్తూ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంటర్టైన్నారు. మరి ఈరోజు బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందో నేటి (సెప్టెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..తెలివిగా ఆడిన నైనిక టీమ్యష్మి, నైనిక, నిఖిల్.. ఈ ముగ్గురు చీఫ్స్లో ఎవరు పవర్ఫులో తేల్చుకోవాలంటూ బిగ్బాస్ టాస్కులు ఇచ్చాడు. అయితే నిఖిల్ టీమ్లో కేవలం ముగ్గురే ఉండటంతో యష్మి, నైనిక టీమ్స్కు మాత్రమే పోటీ పెట్టాడు. ఇప్పటికే ఓ టాస్కులో యష్మి టీమ్ గెలవగా తాజాగా మరో టాస్క్ ఇచ్చాడు. అందులో బుర్ర పెట్టి ఆడిన నైనిక టీమ్ను సంచాలకుడు నిఖిల్ విజేతగా ప్రకటించాడు. తన ఫ్రెండ్ నిఖిల్ తన టీమ్నే గెలిపిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్న యష్మి ఇది జీర్ణించుకోలేక కాసేపు కస్సుబుస్సులాడింది.ఈ వారం ఎవరిపై వేటుఎప్పుడూ గొడవకు సై అంటూ ముందుకు దూకే సోనియా సైలెంట్గా ఉండటంతో ఏమైందని నిఖిల్ ఆరా తీశాడు. ఒంటరిగా కూర్చున్న తనతో కబుర్లు పెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు కిచెన్లో అభయ్, బాషా, ప్రేరణ ఈ వారం నాగమణికంఠ ఎలిమినేట్ అవచ్చని ఊహించారు. కానీ పోలింగ్ చూస్తుంటే ఈ ఊహాగానాలు బోల్తా కొట్టడమే ఖాయమనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు రెండు గేముల్లో చెరొకటి గెలిచిన యష్మి, నైనిక టీమ్స్కు ఆఖరిగా ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. స్వింగింగ్ ప్లాట్ఫామ్పై ఐదు ఇటుకలను మొదటగా పేర్చాలని చెప్పాడు. పవర్ఫుల్ చీఫ్గా యష్మిఇక్కడ రెండు టీమ్స్ ఎలా గెలవాలన్నదానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే దృష్టి పెట్టారు. ఈ ఛాలెంజ్లో యష్మి టీమ్ గెలిచింది. రెండు టాస్కులు గెలిచి పవర్ఫుల్ చీఫ్గగా నిలిచిన యష్మి.. నిఖిల్ టీమ్లో నుంచి సోనియాను లాక్కుంది. అలాగే డ్రాగన్ రూమ్లోకి తన టీమ్తో పాటు వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అందులో చాక్లెట్లు, కూల్డ్రింక్స్ అన్నీ ఉండటంతో టీమ్ సభ్యులు తెగ ఆనందపడిపోయారు.మూడు టీమ్స్ పేర్లివేఅనంతరం మూడు టీమ్స్ను మూడు జెండాలు, పేర్లు రూపొందించుకోవాలని బిగ్బాస్ ఆదేశించాడు. అందులో భాగంగా యష్మి టీమ్ అఖండగా, నైనిక టీమ్.. అంతులేని వీరులుగా, నిఖిల్ టీమ్.. కెరటంగా నిలుచున్నారు. ఈ మూడు టీమ్ లీడర్స్ను బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. పవర్ఫుల్ చీఫ్ అయిన యష్మి టీమ్లో ఎవరూ ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ వారికి గుడ్న్యూస్ చెప్పాడు. లబోదిబోమన్న అంతులేని వీరులు టీమ్అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఏ పని చేయాలనేది యష్మి నిర్ణయించాలన్నాడు. దీంతో ఆమె కెరటం టీమ్కు వంటపని కేటాయించింది. మిగతా పనులన్నీ అంతులేని వీరులు టీమ్ చేయాలని నిర్ణయించింది. ఇది విని అంతులేని వీరులు టీమ్ సభ్యులు గుండెలు బాదుకున్నారు. గొడ్డుచాకిరీ చేయాలా? అని ఆవేశపడ్డారు, ఎమోషనలయ్యారు. అటుపక్క దొరికిందే ఛాన్స్ అన్నట్లు అఖండ టీమ్ రెచ్చిపోయింది. డస్ట్బిన్లో గ్లాస్ పడేసిన ప్రేరణ.. ఇది తన పని కాదన్నట్లు ఆ గ్లాసును మళ్లీ బయట తీసిపెట్టింది. నోరేసుకుని పడిపోకు..అటు అభయ్ నవీన్.. నచ్చింది వండుకుంటానంటూ కిచెన్లో అడుగుపెట్టాడు. అలాగైతే వండుకున్నాక మీ గిన్నెలు కూడా మీరే తోముకోండని సీత ఒంటికాలిపై లేచింది. అందుకు అభయ్.. మీరేమీ నా ఇంట్లో పని చేస్తలేరు.. ఇది గేమ్.. దిమాక్ ఉండాలి.. నోరేసుకుని పడిపోకు.. అని ఫైర్ అయ్యాడు. ఆ మాటతో సీత ఏడ్చేసింది. ఇక మొన్నటివరకు కన్నీళ్ల కుళాయి తెరిచిన మణికంఠ తనలో రెమోని బయటకు తీశాడు. భార్యను తలుచుకుని రొమాంటిక్ అయ్యాడు. ఈసారి భార్యను హగ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు సెంటు పూసుకుని వెళ్తానంటూ సిగ్గుపడిపోయాడు. బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఫేస్వాష్తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్కు ఫేస్వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్బాస్ ముగ్గురు చీఫ్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!
బిగ్బాస్ హౌస్ను కంటెస్టెంట్లు మొదటిరోజే చేపలమార్కెట్ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్గా ప్రకటించిన విషయం తెలిసిందే! స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్గా ఎన్నుకున్నారని సోనియా చాలాసేపు వాదించింది.గగ్గోలు పెట్టిన సీతమరోవైపు ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే బేబక్క ఒప్పుకోవడం లేదని సీత బుంగమూతి పెట్టింది. అలాగే తనను కిచెన్ టీమ్లో నుంచి కావాలనే సైడ్ చేశారని గగ్గోలు పెట్టింది. అలాంటిదేమీ లేదని నిఖిల్ నచ్చజెప్పినా అస్సలు వినిపించుకోలేదు. ఇంతలో బిగ్బాస్ నామినేషన్ అనే ప్రక్రియతో అసలైన గొడవ మొదలుపెట్టాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను బండరాయికి తగిలించాలని చెప్పాడు.చీఫ్లకు మినహాయింపుచీఫ్లకు నామినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్మేట్స్ ఇద్దరిని చొప్పున నామినేట్ చేస్తే అందులో ఒకరి సేవ్ చేస్తూ మరొకిరిని నామినేట్ చేసే అధికారం చీఫ్లకు ఉందని పేర్కొన్నాడు. మొదటగా సోనియా... కిచెన్లో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ బేబక్కను నామినేట్ చేసింది. కుక్కర్ పని చేయకపోయినా అది నా తప్పేనా? అని బేబక్క సమాధానమిస్తుంటే తననసలు మాట్లాడనివ్వలేదు. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్లు కలగజేసుకున్న పాపానికి మీరేమీ జడ్జిలు కాదంటూ వారి నోరు కూడా మూయించింది.సోనియా వర్సెస్ ప్రేరణఅనంతరం ప్రేరణను నామినేట్ చేస్తూ.. ఇదేం పిక్నిక్ కాదు, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో.. కానీ, అవతలివారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ.. తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్ యష్మి.. వారిద్దరిలో బేబక్క నామినేషన్కు పచ్చజెండా ఊపింది.నాగమణికంఠకు ఎక్కువ ఓట్లునబీల్.. ఎవరితో కలిసిపోవట్లేదంటూ నాగమణికంఠను, తనతో ఎక్కువ కనెక్ట్ కాలేదంటూ బేబక్కను నామినేట్ చేశాడు. యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాగమణికంఠ ఫోటోపై కత్తిగుచ్చి అతడి నామినేషన్ను ఫైనలైజ్ చేసింది. అనంతరం శేఖర్ బాషా.. నాగమణికంఠ, బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించాడు. చీఫ్ నైనిక.. వీరిలో నాగమణికంఠను నామినేట్ చేసింది.సాయం చేయలేదంటూతర్వాత బేబక్క.. నబీల్ను నామినేట్ చేసింది. తనకు కిచెన్లో సాయం చేయలేదంటూ పృథ్వీ ఫోటోను బండరాయికి అతికించింది. అయితే సీత.. అతడు కిచెన్లో బోళ్లు తోమాడంటూ పక్కనుంచి ఉప్పందించింది. ఇది చూసిన నిఖిల్.. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని ఫైరయ్యాడు. అనంతరం అతడు పృథ్వీ నామినేషన్ను ఫైనల్ చేశాడు.నామినేషన్స్లో ఎవరంటే?ఈ నామినేషన్ పర్వం రేపటి ఎపిసోడ్లోనూ కొనసాగనుంది. అయితే ఈపాటికే బిగ్బాస్ హౌస్లో ఈ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ లిస్టు బయటకు వచ్చేసింది. అందులో పృథ్వి, నాగమణికంఠ, శేఖర్ బాషా, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వీరిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఏమైనా చీఫ్స్కు ఇస్తారా? లేదంటే వీళ్లే నామినేషన్లో ఉంటారా? అనేది రేపు తేలనుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: నామినేషన్స్కు లైన్ క్లియర్.. ఫస్ట్ రోజే రచ్చలేపిన కంటెస్టెంట్లు
ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైంది. ప్రేక్షకులకు ముక్కూముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్యే ఈసారి ఎక్కువగా ఉంది. అయినా ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలేలే! కొన్నాళ్లు పోతే వీళ్లకే మళ్లీ అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి. ఈసారైతే కంటెస్టెంట్లు మొదటిరోజే గొడవలుపడ్డారు. ఆ విషయాలు, విశేషాలేంటో సెప్టెంబర్ 2 నాటి ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఆవేశంగా నాగమణికంఠబిగ్బాస్ లాంచింగ్ రోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు నాగ్. అడుగుపెట్టిన మొదటిరోజే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ అనిల్ రావిపూడిని హౌస్లోకి పంపించి బాంబ్ పేల్చాడు. ఎవరిని బయటకు పంపిద్దామన్నప్పుడు మెజారిటీ జనాలు నాగమణికంఠకు ఓటేశారు. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్లగొట్టడమేంటని అతడిలో అగ్నిపర్వతం బద్ధలైంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఫ్రస్టేట్ అయ్యాడు.అందరికీ నచ్చే వ్యూ..అయితే అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో అతడిని పంపించేయమని సూచించిన కంటెస్టెంట్లు తనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనోడు తగ్గేదేలే అన్నట్లుగా కోపాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఇకపోతే బాత్రూమ్లో శేఖర్ బాషా.. అందరికీ నచ్చే వ్యూ.. ఐ లవ్యూ అనడంతో గలగలా మాట్లాడే బేబక్క సైతం అవాక్కయిపోయింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు?తర్వాత కిచెన్ టీమ్లో ఉన్న ఆర్జీవీ బ్యూటీ సోనియా.. ఎవరికీ బాధ్యత లేదంటూ అందరిపైనా రంకెలేసింది. ఆరెంజ్తో గేమ్ ఆడినవారెవరూ ఆ పండ్లు తినడానికి వీల్లేదంటూ కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దీంతో బాషాకు ఒళ్లు మండింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? అంటూ తనపై ఫైరయ్యాడు. తర్వాత కాసేపటికి కూలైపోయి మళ్లీ మామూలుగానే మాట్లాడుకున్నారు.బిగ్బాస్ ట్విస్ట్ ఈసారి కెప్టెన్కు బదులుగా ఇంటికి ముగ్గురు కంటెస్టెంట్లు చీఫ్లుగా ఉండనున్నారని బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. షో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్స్లో గెలిచిన నిఖిల్, యష్మి, శేఖర్ బాషా, పృథ్వి, నైనిక, బేబక్క చీఫ్ పదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకటించాడు. వీరికి.. పట్టుకుని ఉండండి- వదలకండి అనే టాస్క్ ఇచ్చాడు. మూడో చీఫ్గా..ఈ గేమ్లో ఎక్కువసేపు తాడును పట్టుకుని ఉన్న నిఖిల్ మొట్టమొదటి చీఫ్గా గెలిచాడు. రెండో గేమ్లో నైనిక గెలిచి రెండో చీఫ్గా నిలిచింది. యష్మి, బేబక్క, అఫ్రిది, బాషాలలో ఒకరిని మూడో చీఫ్గా సెలక్ట్ చేయండంటూ నిఖిల్, నైనికలకే నిర్ణయాన్ని వదిలేశాడు. అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని చీఫ్గా ఎంపిక చేశారు. గొడవకు దిగిన సోనియాఅఫ్రిదికి బదులు యష్మిని సెలక్ట్ చేయడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్రెండ్షిప్ను పక్కనపెట్టి నిజంగా అర్హులైనవారిని సెలక్ట్ చేయాలంటూ గొడవకు దిగింది. ఆల్రెడీ చీఫ్గా ప్రకటించాక మధ్యలో నీ గొడవేంటని సోనియామీద గరమైంది యష్మి. అలా ఈరోజు ఎపిసోడ్ వాడివేడిగానే ముగిసిపోయింది. నేటి గొడవలే రేపటి నామినేషన్కు దారి తీయనున్నాయి.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మికి బాధ్యతలేదన్న సోనియా.. శివాలెత్తిన బ్యూటీ
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది అడుగుపెట్టారు. ఒకరినొకరు నవ్వుతూ పరిచయం చేసుకున్నారు. కొందరు ఇంకా మొహమాటంగానే ఉన్నారు. మరికొందరేమో అప్పుడే అందరినీ కలుపుకునిపోయి మాట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన మరుసటి రోజే పోట్లాటకు దిగుతున్నారు.అసలేమైందంటే.. ఈ సీజన్లో కెప్టెన్ ఉండడని నాగార్జున ముందే చెప్పేశాడు. అయితే కెప్టెన్ లేకుండా హౌస్ను ఓ ఆర్డర్లో పెట్టడం కష్టమే.. అందుకే చీఫ్ అనే పోస్టులను ప్రవేశపెట్టారు. చీఫ్గా ఎంపికవడం కోసం టాస్కులు పెట్టాడు. అలా ఇంట్లో ఉదయం కొన్ని టాస్కులు జరగ్గా అందులో నిఖిల్, నైనిక గెలిచారు. అందులో ఓడిన వారికి మరో ఛాన్స్ ఇస్తూ టాస్క్ పెట్టారు.అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. యష్మి, అఫ్రిది, బేబక్క, శేఖర్ బాషా ఈ గేమ్లో ఉన్నారు. వీరిలో చీఫ్ అవ్వడానికి ఎవరు అనర్హులో నిఖిల్, నైనిక చెప్తే దాన్ని సదరు కంటెండర్ డిఫెండ్ చేసుకోవాలి. అలా బేబక్క, అఫ్రిదిలను పక్కన పెట్టేశాడు. వారి కంటే యష్మి బాధ్యతారాహహిత్యంగా ఉందని సోనియా అనడంతో గొడవ మొదలైంది. మధ్యలో నా పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నావంటూ సోనియాతో వైరానికి దిగింది. చూస్తుంటే యష్మి చీఫ్గా సెలక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?
పేరుకే తెలుగు బిగ్బాస్. కానీ చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం 14 మంది హౌసులోకి అడుగుపెడితే అందులో ఏకంగా ఆరుగురు పరాయి భాషకి చెందిన వాళ్లే ఉన్నారు. వీళ్లందరూ తెలుగులో సీరియల్స్, షోలు, సినిమాలు చేశారు. ఇంతకీ వీళ్లెవరు? నిజంగానే షోలో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతోందా? బిగ్బాస్ గేమ్ ప్లాన్ ఏంటనేది చూద్దాం!(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్మేట్స్ వీళ్లే)ఆదివారం కొత్త సీజన్ మొదలైంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఏడు జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో యష్మి గౌడ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్.. కర్ణాటకకు చెందినవాళ్లు. తెలుగులో సీరియల్స్ చేశారు. తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ పూర్తిగా తెలుగు అయితే కాదు. అలానే నైనిక అనే డ్యాన్సర్ ఉంది. ఈమె చాన్నాళ్లుగా తెలుగు డ్యాన్స్, రియాలిటీ షోలు చేస్తోంది. సోషల్ మీడియాలో తెలుగమ్మాయి అని రాసుకుంది కానీ చూస్తుంటే ఇక్కడామె కాదనిపిస్తోంది.అప్పట్లో 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెలుగులో హీరోగా పేరు తెచ్చుకున్న ఆదిత్య ఓం.. చాన్నాళ్ల తర్వాత బిగ్బాస్ తెలుగు షోలో కనిపించాడు. ఇప్పటికీ ఇంకా తెలుగు ఇబ్బందిగానే మాట్లాడుతున్నారు. తెలుగు షోలో మాట్లాడాలన్నా, గొడవ పడాలన్నా సరే ఫ్లూయెంట్గా తెలుగు వస్తే ఆ మాజా వేరుగా ఉంటుంది. ఇలా వేరే భాషకు చెందిన వాళ్లని తీసుకొస్తే.. కొన్నిసార్లు వీళ్లు చెప్పింది పక్కనోళ్లకు అర్థం కాదు, వాళ్లు చెప్పింది వీళ్లకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు)దానికి తోడు వీళ్లు వేరే భాషలో మాట్లాడుకున్నా ప్రతిసారి.. తెలుగులోనే మాట్లాడండి అని బిగ్బాస్ చెప్పుకోవాల్సి వస్తుంది. వేరే ఏ భాషలోని బిగ్బాస్ షో తీసుకున్నా.. ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉంటారు తప్పితే తెలుగోళ్లు ఒక్కరూ కనిపించరు. అప్పట్లో ఓసారి బింధుమాధవి తమిళ బిగ్బాస్ షోలో కనిపించిందంతే.ఈ సీజన్లో పాల్గొన్న 14 మందిలో ఆరుగురు వేరే భాషలకు చెందినవాళ్లు. అంటే తెలుగులో సరైన కంటెస్టెంట్సే లేరా? నిర్వహకులు కావాలనే ఇలా ప్లాన్ చేశారా అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. మరి వీళ్లలో ఎవరు హౌసులో ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అయి వెళ్లిపోతారనేది చూడాలి?(ఇదీ చదవండి: కోట్లు ఇచ్చినా 'బిగ్బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో విష్ణుప్రియ ఇలా) -
Bigg Boss 8: పన్నెండోవారం యష్మి ఎలిమినేట్
సీరియల్స్తో అల్లాడించిన యష్మి గౌడ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తనకేమో నటన అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లకేమీ నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్లో ఏదో సీరియల్కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్లింది. ఫస్ట్ ఆడిషన్లోనే ఎంపికైంది. అలా తన కెరీర్ మొదలైంది. స్వాతి చినుకులు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. లాక్డౌన్ సమయంలో నాగభైరవిలో నటించే అవకాశం వచ్చింది. కృష్ణ ముకుంద మురారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. కన్నడలో ఓ మూవీలోనూ యాక్ట్ చేసిన ఈ బ్యూటీకి సిరామిక్ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారుచేసే బిజినెస్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటించాలని కలలుగంటున్న యష్మి బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. వచ్చీరావడంతోనే నాగ్కు పూలు ఇచ్చి బుట్టలో పడేసే ప్రయత్నం చేసింది. ఫుల్ జోష్ మీదున్న ఈ బ్యూటీ పన్నెండో వారం ఎలిమినేట్ అయింది.