Angry
-
కూటమిని అనవసరంగా గెలిపించాం : మహిళలు
-
KSR Live Show: మోదీ మీటింగ్ మీద ఉన్న శ్రద్ధ.. భక్తులపై ఉంటే ఇంత ఘోరం జరిగేదా !
-
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
-
మీరేం డిబేట్కు రాలేదు.. సోమేష్ కుమార్పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్తో పాటు సోమేష్ కుమార్ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్కు రాలేదు.. స్ట్రయిట్గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
హర్యానా కాంగ్రెస్లో అంతర్గత పోరు
చండీగఢ్: హర్యానా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టిక్కెట్ పంపిణీలో భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై మహిళా నేత కుమారి సెల్జా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఇంకా ప్రచారానికి సిద్ధం కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో భూపేంద్ర సింగ్ హుడా తన వర్గం మినహా మిగిలిన నేతలందరినీ విస్మరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళా నేత సెల్జా తాను ఉక్లానా నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆమెకు ఆ స్థానం కేటాయించలేదు. ఉక్లానా నుంచి సెల్జా మేనల్లుడు హర్ష్కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనా అందుకు సెల్జా అంగీకారం తెలుపలేదు.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కుమారి సెల్జాకు సన్నిహితంగా భావించే 90 మంది అభ్యర్థుల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్ దక్కింది. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు. 90 మందిలో 78 మంది అభ్యర్థులు హుడా వర్గానికి చెందినవారు కాగా, ఏడుగురు సెల్జా, ఇద్దరు సూర్జేవాలా వర్గానికి చెందినవారు. మరికొందరు అభ్యర్థులను హైకమాండ్ ఎంపిక చేసింది.హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని, లోక్సభలో బీజేపీ బలం సగానికి తగ్గిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇది కూడా చదవండి: #SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు! -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతుల ఆగ్రహం
-
Gujarat: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిరసనకారుల విధ్వంసం
గుజరాత్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్గావ్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ కరణ్రాజ్ వాఘేలా ఉమర్గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
త్రిపుర: ‘మా ఇళ్లు దగ్ధమౌతుంటే మీరెక్కడున్నారు?’
త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు. STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.READ: https://t.co/qbcXkrArtBVIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024 -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్లాల్ ఖట్టర్ను కూడా తొలగించారని, రమణ్సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్నాథ్సింగ్ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్లో ఆకాష్ ఆనంద్పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
'కోపం' ఇంత ప్రమాదకరమైనదా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
"తన కోపమే తనకు శత్రవుతన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌతన సంతోషమె స్వర్గముతన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ"! అన్న పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చాలామంది దీన్ని పాటించలేరు. కోపం శక్తి అలాంటిది. మెరుపుదాడిలా వచ్చేస్తుంది. అయితే ఈ కోపం వల్ల శత్రవులు పెరుగుతారు అని తెలుసుకున్నాం గానీ ఇది ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదకరమైనదే అట. కోపం కారణంగా శత్రుత్వం ఏర్పడి మనఃశాంతి కరువయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని విన్నాం గానీ. కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ కోపం గుండెపోటు, స్ట్రోక్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేగాదు ఆ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ జర్నల్లో ఈ పరిశోధన గురించి ప్రచురితమయ్యింది. శాస్త్రవేత్తలు కేవలం కొన్ని నిమిషాల కోపం ఆరోగ్యానికి చేటని, అది రక్తనాళాల పనితీరుని మార్చగలదని గుర్తించారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. కోపం తీవ్రతపై గుండెపోటు ప్రమాదం ఆధారపడి ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. కొద్దిపాటి కోపం హృదయ ఆరోగ్యాన్ని దారుణంగా దిగజారుస్తాయని అన్నారు. అందుకోసం కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్లోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ తదితర పరిశోధక బృందం సుమారు 280 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. వారిని నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక సముహాన్ని విచారం, ఆందోళన, కోపానికి గురయ్యే సంఘటనలకు గురి చేశారు. ఆ సముహం ఎనిమిది నిమిషాల వరకు ఈ స్థితిని ఫేస్ చేశారు. అలాగే వారందర్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకునేలా ఒకటి నుంచి 100 అంకెలు లెక్కపెట్టమన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తీవ్ర కోపానికి గురయ్యి బ్యాలెన్స్ తప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల రక్త నమునాలను పరిశీలించగా..కోపాన్ని నియంత్రించుకున్న వారికంటే..కోపానికి గురయ్యిన వారిలో రక్తనాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గడం గుర్తించారు పరిశోధకులు. అందులోనూ అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ తీవ్ర కోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఈజీగా పడుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ భావోద్వేగాలు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలో నిర్థారించారు. ఈ అధ్యయనం మానవుని మానసిక స్థితి, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పరిశోధకులు. అంతేగాదు ఈ పరిశోధన గుండె ఆరోగ్యం భావోద్వేగాలు, ఒత్తిడిని నిర్వహించడంపైనే ఆధారపడి ఉంటుందనేది హైలెట్ చేసిందని పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
"బయటికి పో..!" బండారు పై బాబు ఫైర్
-
బాబుపై భగ్గుమన్న శ్రీకాకుళం టీడీపీ
సాక్షి, శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ మూడో జాబితా ఆ పార్టీలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట ఆశావహులకు మొండి చేయి ఇస్తూ.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారు. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు. చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం పై లక్ష్మీదేవి అసంతృప్తితో రగిలపోతున్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం.. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. -
జనసేనలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి
-
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు -
అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది. అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది. -
గొంతు పెంచి కోర్టును భయపెట్టలేరు: ఓ లాయర్పై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా గట్టిగా అరుస్తూ మాట్లాడిన ఓ న్యాయవాదిపై బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి కోర్టును ఎవరూ భయపెట్టలేరని హెచ్చరించారు. న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు. ‘‘నువ్వు లాయర్గా సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు? బిగ్గరగా అరుస్తూ మాట్లాడి మమ్మల్ని భయపెట్టడం నీవల్ల కాదు. నా 23 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే పద్ధతి ఇదేనా? న్యాయమూర్తుల ముందు ఎప్పుడూ ఇలాగే అరుస్తావా? నేను మరో ఏడాది లోగా పదవీ విరమణ చేయబోతున్నా. కోర్టులో లాయర్లు ఇష్టానుసారంగా మాట్లాడడం చూడాలని నేను కోరుకోవడం లేదు. నీ గొంతు తగ్గించు’’ అని సదరు లాయర్కు తేలి్చచెప్పారు. దీంతో ఆ లాయర్ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు నుంచి, జస్టిస్ చంద్రచూడ్ నుంచి క్షమాపణ కోరారు. -
ఔను..! నిజంగానే కలెక్టర్కు కోపమొచ్చింది!
ఆదిలాబాద్: కలెక్టర్కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు! -
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య..
-
ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది. Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1 — Buitengebieden (@buitengebieden) December 10, 2023 ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
బాబుది బురద రాజకీయం
-
‘పచ్చ దొంగల ముఠా ఊళ్ళ మీద పడుతోంది జాగ్రత్త’
తాడేపల్లి: పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఆ పార్టీ ఏ మాత్రం తీసిపోదని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు సజ్జల. పచ్చ దొంగల ముఠాతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు 'పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్ టీడీపీకి బాగా తెలుసు. చంద్రబాబుకు అమలు చేయాలనే ఉద్దేశం లేని హామీలు ఇచ్చారు. హామీల అమలు ఎక్కడని ప్రశ్నిస్తారని వెబ్సైట్ నుంచి తొలగించారు. ఓటర్ ఐడీకార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. రాత పూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో.. మరి దీనిని ఏమంటారు. 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నారు.' అని దుయ్యబట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే.. అంతర్జాతీయ దొంగల ముఠాకు తీసిపోని టీడీపీ నాలుగైదు దశాబ్ధాల క్రితం ఒక రకమైన మోసాలు జరిగితే..జనరేషన్ పెరిగి, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ మోసాలు రూపు మారాయి. టెక్నాలజీని ఉపయోగించి నిలువు దోపిడీ చేయడం, ప్రలోభపెట్టడం, ఎన్ని చట్టాలున్నా వాటిని ఏదో రకంగా ఉల్లంఘించడం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి మోసాలు ఎల్లలు దాటి విదేశాల నుంచి కూడా మోసాలు జరుగుతున్నాయి. విదేశీ లాటరీ కోట్లు తగిలింది..బ్యాంకు ఎకౌంట్ ఓపెన్ చేయాలంటూ మోసాలు చేసేవారు ఒకరైతే.. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఒంటిమీద బట్టలతో సహా నిలువు దోపిడీ చేయగల కెపాసిటీ ఉన్న దొంగల పార్టీగా టీడీపీ తయారైంది. దాని వల్ల జరిగే ఘోరం, దారుణం ఊహలకు అందదు. అలాంటి లక్షణాలున్న రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి ప్రజలను మోసం చేయడం ఎలాగూ అలవాటే. కానీ మోసం చేయడంలోనూ కొత్త కొత్త టెక్నిక్లను వినియోగించి మళ్లీ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ఆ పార్టీ తెగబడిన తీరు ఈ మధ్య బయటపడింది. పచ్చ దొంగల ముఠా ఊళ్లమీదొచ్చి పడుతోంది..జాగ్రత్త! పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది జాగ్రత్త! ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి.. టీడీపీ ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని మా సూచన. లక్షలు వచ్చినట్టు కంగ్రాట్స్ చెప్తూ వ్యక్తిగత డేటా చోరీ ఇటీవల రాజంపేటలో రెండు సంఘటనలు జరిగాయి. అసలు టీడీపీ వారి మేనిఫెస్టో ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలియదు.. ఏదో సూపర్ సిక్స్ అన్నారు...దత్తపుత్రుడు చెప్పినవి కలిపి 11 హామీలు అంటున్నారు. 2014లో మోడీ, పవన్ కల్యాణ్ హామీలతో తెచ్చిన మేనిఫెస్టోనే చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మాయం చేశాడు. అలాంటిది మేనిఫెస్టోపైనే స్పష్టత లేని నేపథ్యంలో హామీల పేరుతో ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు.. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి డేటా తీసుకుని ఒక యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఓటీపీ వస్తే..క్లిక్ చేయమంటున్నారు. దాన్ని క్లిక్ చేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కార్డు వస్తోంది. దాంట్లో కంగ్రాట్స్ చెప్పి.. 2024 జూన్ నుంచి రూ. 2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు. 2024 జూన్నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. అంతటితో ఆగటంలేదు...చంద్రబాబు సంతకం చేసిన ఒక గ్యారెంటీ పత్రాన్ని ఇస్తున్నారు. చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తున్నాడు. దీంట్లో ఓటరు కార్డు నంబరు, మొబైల్నంబర్ తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మరో ఇంటికి వెళ్లి రూ. 6.90లక్షల వస్తుందని, అర్హత సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక వేళ చెప్పింది ఏదన్నా చేసే వారయినా ఇంటికి వెళ్లి చెప్పవచ్చు. చెప్పింది రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో..అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేసేదే మేనిఫెస్టో. అలా చేయలేకపోతే ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. టీడీపీ గతంలో ఇదే మోసం చేసింది. లేని మేనిఫెస్టోతో డేటా చోరీ అసలు అమలు చేసే ఉద్దేశ్యమే లేని చంద్రబాబు ఇలాంటి హామీలు గతంలో ఎన్నో ఇచ్చాడు.ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలో ఆయన తన మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తీసేయడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు లేని మేనిఫెస్టోను తీసుకుని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నాడు. అసలు మేనిఫెస్టో ఇచ్చే అర్హతే చంద్రబాబుకు లేదు. అలాంటిది ఎలాంటి ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తున్నాడు. ఏదో నాలుగైదు పాయింట్లు తీసుకుని ఇంటింటికి వెళ్లి మీకు పథకాలు వచ్చేశాయి...కంగ్రాట్స్ అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. వారెంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఇతన్ని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. ఇది సైబర్ క్రైంకి కిందకు వస్తుంది...ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల ప్రైవసీలోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. ఓటరు కార్డు తీసుకుని దాని నుంచి ఎన్నికల కమిషన్ రూల్స్ని ఉల్లంఘిస్తున్నాడు. ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్లోకి కూడా వెళ్లిపోతున్నాడు. చంద్రబాబు ముఠా 5 కోట్ల మందిని టార్గెట్ చేసింది దీనినిబట్టి చూస్తే.. ఒక అంతర్జాతీయ దొంగల ముఠాకు, చంద్రబాబుకు తేడా ఏమైనా ఉందా? కనీసం వాళ్లన్నా ఒకర్ని టార్గెట్పెట్టుకుని లక్షో,పదిలక్షలో కొట్టేయాలని చూస్తుంటారు. కానీ చంద్రబాబు 5 కోట్ల మందిని మోసం చేస్తున్నాడు. అసలు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే నీకు, లేని అంశాలను తీసుకొచ్చి ఊహల్లో లెక్కలేసి బూటకపు హామీలిస్తున్నాడు. ఇది ఏ చట్టం కిందకు వస్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పచ్చి అబద్ధాలను తీసుకుని ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను తస్కరిస్తున్నారు. ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చు. బ్లాక్ మెయిల్ చేయవచ్చు..ఇంకేదైనా చేయవచ్చు. ఇంత చేస్తున్న చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిన మంచేమీ లేక ఏకంగా తనకు సరిపడని వైఎస్సార్సీపీ ఓట్లు తీయించడానికి తెగించాడు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్ ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి పబ్లిక్ డేటాకు యాక్సెస్ ఇచ్చి, దాని ద్వారా ఐటీ గ్రిడ్స్కి పంపారు. ఆనాడు ఎన్నెన్నో ఉల్లంఘనలు చేశాడు. ఓటరు డేటా అంతా కలెక్ట్ చేశాడు. కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్ నంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలు కూడా ఆనాడు సేకరించారు. ఆనాడు అధికారంలో ఉండి సేవామిత్ర ద్వారా ఇలా అడ్డగోలుగా ఏమేం చేశారనే దానికి ఆధారాలున్నాయి. అన్ని వివరాలు తీసుకుని ఎన్నికల కమిషన్ వారి వద్ద ఉన్న ఫోటోలతో సహా అన్ని వివరాలు సేకరించారు. ఒక వైరస్లా దూరి ప్రజల డేటా అంతా సేకరించి ఆ వివరాలను బూత్ కమిటీలకు పంపించారు. మీరు ఏ పార్టీ అని అడుగుతారు..ఏ పార్టీకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో, ఓటరు కులం అన్నీ సేకరించారు. ఆనాడు ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ను ప్రభుత్వ ఓటు చీల్చమని చెప్పాడు. సేవామిత్రలను వ్యతిరేక ఓటును తీసేయండని పంపాడు. అలా 2017కల్లా ఆయన 50 లక్షల ఓట్లు తీసేయించాడు. అప్పట్లో మా నాయకుడు జగన్ గారి నాయకత్వంలో మేం గవర్నర్, సీఈసీని కూడా కలిసి సాక్ష్యాలు చూపించాం. మళ్లీ మేం ప్రాసెస్ చేసి, 30 లక్షల ఓట్లు మళ్లీ తెచ్చుకోగలిగాం కాబట్టి సరిపోయింది. ఒక వేళ చంద్రబాబు కోరుకున్నట్లు ఎలిమినేషన్ జరిగితే ఏం జరిగి ఉండేది..? సాక్షి చదివితే...వెంటనే ఫాం 7 దరఖాస్తు చేసేలా పథకం ప్రకారం కుట్ర చేశారు. అతని ఆలోచనలు ఎంతటి వికృతమైనవో, ఒళ్లంతా నరనరాన అక్రమం, మోసం, వెన్నుపోటు లక్షణం అతనికి ఉన్నాయి. ఏ లక్షణాలైతే మనిషికి ఉండకూడదో అన్నీ ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడిపితే ఆ దౌర్భాగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు ఎలిమినేషన్ చేసిన ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో ఓటర్ల వద్దకు వెళ్లి అబద్ధపు హామీలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమే కాదు..అడ్డంగా ప్రజల్ని మోసం చేసి వాళ్లకు భవిష్యత్తు లేకుండా, మళ్లీ చీకట్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మామూలు దొంగతనం, దోపిడీ కంటే మరింత భయంకరమైనది. మాయల పకీరు చేతిలో డేటా.. తస్మాత్ జాగ్రత్త దీంట్లో మరో కోణం కూడా ఉంది. చంద్రబాబు వద్ద ఆనాడు తీసుకున్న డేటా ఉంది. కులపరంగా,పార్టీ ప్రిఫరెన్స్ వారీగా అతని వద్ద డేటా ఉంది. ఇంకా ఏమేం డేటా అతని వద్ద ఉందో తెలియదు. ఇప్పుడు మళ్లీ వెళ్లి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం వ్యక్తిగత గోప్యతను తన చేతిలో పెట్టుకుంటున్నాడు. మాయలపకీరు చేతులోకి డేటా అంతా వెళ్లే డేంజర్ పరిస్థితి ఇది. ఇది చిన్న ప్రమాదం కాదు. మా పార్టీ నుంచి మేం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. అతని ఆలోచనే వంకర..ఎదుటి వారిని మోసగించడంలోనే ఆనందం ఉందనుకునే చంద్రబాబు లాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి. నిజంగా తెలియక వీళ్లు చెప్పే వాటికి ప్రజలు భ్రమలోకి వెళితే 2014–19 మధ్యలో ఏం జరిగిందో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. నిలువుదోపిడీ చేయగల బందిపోటు దొంగే..ఎదుటి వాళ్లను దొంగ.. దొంగ అని అరుస్తున్నాడు. రామోజీరావుకు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం: చంద్రబాబు సేవలో తరిస్తూ, ఎల్లో మీడియా చేస్తున్న అఘాయిత్యం పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు తయారు చేసిన తోలు బొమ్మలు ఏదో ఒక సంస్థ పేరు చెప్పుకుని చేస్తున్న డ్రామాలను కూడా గమనించాలి. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, విద్యావంతులు, మేధావులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మోసం చేస్తున్నది వాళ్లు..ఉల్టా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. లక్షల ఓట్ల తొలగింపు అంటూ ఈనాడు బ్యానర్ వార్తలు రాస్తారు. 5.78 లక్షలు వలసలు వెళ్లిపోయారు అంటూ రాసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...ఆ ఓట్లు షిప్టింగ్ అయ్యాయని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ 5.78 లక్షల ఓట్లు ఒక చోట డిలేట్ చేస్తే..వాటిని షిప్టింగ్ ప్రకారం వేరే చోట నమోదు చేశారని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఎవడైనా నిష్పక్షపాతంగా రాసేవాడైతే ఆ విషయాన్ని కూడా రాయాలి కదా..? రామోజీరావు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం.. దానికి మించి చంద్రబాబుకు ఈనాడు రామోజీరావు రాజగురువు. పచ్చిగా నేను చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నాను..అని ఇలాంటివి రాసుకోవాలి. కుప్పం ఓటర్ల జాబితాలో కనికట్లు అంటూ మరో వార్త రాశారు. సత్యనారాయణరెడ్డి, షఫీయుల్లా అనే పేర్లు చెక్ చేయిస్తే అసలు విషయం తెలిసింది. సత్యనారాయణరెడ్డి లేడట..కానీ ఓటర్ల లిస్టులో ఉందని రాశారు. షఫీయుల్లా ఓటు విషయంలోనూ అదే విధంగా రాశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ఆ ఓటు ఉంది...ఇప్పుడు కూడా అదే ఓటు కంటిన్యూ అవుతోంది. మేం అడుగుతుంది కూడా అలాంటి ఓట్లు తొలగించాలనే. ఇందులో జగన్మోహన్రెడ్డి గారిది కానీ, ప్రభుత్వానికి కానీ ఏం రోల్ ఉంటుంది..? అసలు ఓటర్లకు సంబంధించి ప్రభుత్వం రోల్ ఎందుకుంటుంది..? కానీ చంద్రబాబుకు మాత్రం సంబంధం ఉంటుంది..ఎందుకంటే అడ్డదారుల్లో ఎలా అధికారంలోకి రావాలనే లక్షణం ఉంది కాబట్టి వాస్తవాలు చూపించాం. గత రెండున్నర నెలలుగా రోజూ బ్యానర్ హెడ్డింగ్ లు పెడుతూ.. ఇలా ఓటర్ల మీదే రాస్తున్నారు. దొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లు, అడ్డంగా హత్యలు చేసే హంతకుడే విక్టిమ్ కార్డు ప్లే చేసినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా హత్య చేస్తున్నారు. రాజకీయం అంటేనే విలువలు లేవు అన్నట్లు, పైకి మాత్రం ప్రతివతల్లా ఇలా అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ఎవరూ లోతుగా విశ్లేషించరులే అని బాబుకు అనుకూలంగా రాసేస్తున్నారు. బతికున్న వారిని కూడా చనిపోయారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు మరో వైపు 50 లక్షలు ఓట్లు తీసేయాలంటూ యాగీ చేస్తున్నారు. బతికి ఉన్న వాళ్లని కూడా చనిపోయారని ఫిర్యాదు చేసి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. రోజూ మెమెరాండం తీసుకుని ఎన్నికల కమిషన్కు ఇస్తూ పోతున్నారు. ఒక మెషిన్లా తప్పుడు దారుల్లో మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2014–19 మధ్యలో ఓటర్ల విషయంలో జరిగిన దానికంటే ఇప్పుడు మరిన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. బరితెగించి చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేసేవేమీ కాదు..గతంలో ఏం చేశాడో అందరూ చూశారు. వాళ్లు వస్తే గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని, 12 సిలిండర్లు ఎక్కడ అని, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించాలి. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కొత్త హామీలతో వస్తున్నావు అని ప్రజలు ప్రశ్నించాలి. సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ పేరుతో తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనల నుంచి దానికి అవసరమైన పరిస్థితులను కల్పించి...వాటిని సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వంటి సంస్థలను సృష్టించి ముందుకు వెళ్తారు. నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు ఇలాంటి సంస్థలు పెట్టి సుప్రీం కోర్టులో కేసులు వేస్తారు. నేను వాళ్లనే అడుగుతున్నా...మీరు చంద్రబాబు చేస్తున్న దానికి ఏం సమాధానం ఇస్తారు? అప్పట్లో ఇదే సుబ్రహ్మణ్యమే చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆనాడు జరిగింది ఆయనకు తెలియదా? ఈ సంస్థ వాలంటీర్లపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. అసలు వాలంటీర్లను ఎవరు దించుతున్నారు..ఎందుకు వస్తారు..? వాలంటీర్ అనే వ్యక్తి వైఎస్సార్సీపీ పాలనలో చివరి మజిలీగా పనిచేస్తున్నారు. వారు ఉద్యోగులు కాదన్న విషయం వారికీ తెలుసు..వారు ఉద్యోగులు కాకపోతే వాళ్లేం చేస్తారు..? రాజకీయంగా వాలంటీర్ ఎవరికైనా మద్దతు పలకవచ్చు..అది అతని స్వేచ్ఛ. జన్మభూమి కమిటీలకున్న అధికారాలు వీళ్లకి లేవు కదా..? వాటిల్లా దోపిడీ ముఠాలను క్రియేట్ చేయలేదు కదా? ఆ సంస్థకు లాయర్ కపిల్ సిబాల్..ఆయన కోట్లలో తీసుకుంటాడు.. ఆ సొమ్ము ఈ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది..? – చంద్రబాబు ఇస్తున్నాడు..ఆడిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సేవా మిత్రల ద్వారా, నేడు జనం తిరస్కరించాక ఇలాంటి బ్యూరోక్రాట్స్తో కేసులు వేయిస్తున్నాడు. పొద్దున లేచినప్పటి నుంచీ ఆ ఎల్లో పేపర్లలో, ఎల్లో టీవీల్లో చర్చలు పెట్టుకుంటూ వెళ్తారు. ప్రపంచంలోనే డీప్ ఫేక్ చంద్రబాబు నీకు ఈ దౌర్భాగ్యం అవసరమా చంద్రబాబూ..? దీనికంటే లక్షణంగా చేయగలిగింది రాయల్గా చెప్పొచ్చుగా..? జగన్ గారు ఫాలో అవుతున్నది రాజమార్గం..చేయగలిగిందే చెప్పాలి దాన్ని అమలు చేసి మళ్లీ ప్రజల వద్దకు వెళ్లడం మంచి మార్గం కానీ చంద్రబాబు మాత్రం అడ్డదారుల్లో అదిరిపోయే దారేది అని వెతుక్కుంటున్నాడు. – గోడ దూకడం ఎలా అని ఆలోచిస్తాడు నువ్వు వెన్నుపోటు పొడిచి వచ్చినా, 2014–19 మధ్య ప్రజలు నీకు మళ్లీ అవకాశం ఇచ్చారు అప్పుడైనా ప్రజలకు సేవ చేయాల్సింది..కానీ ఆయనకు ఆ లక్షణం లేదు ప్రపంచంలోనే డీప్ ఫేక్ చంద్రబాబునాయుడు. ఇంతకంటే డీప్ ఫేక్ ఏదీ ఉండదు. చేయలేనిది ఏదీ, బలవంతంగా దేనినీ జగన్ గారితో చెప్పించలేరనేది గతంలోనే చూశాం రుణమాఫీ చేయలేని అని ఆనాడు జగన్ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికల ముందు కొంచెమన్నా చేస్తామని చెప్పాలని మా లాంటి వారు చెప్పినా ఆయన ససేమిరా అన్నారు దానివల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నా పర్లేదు అన్నారు. అదీ జగన్ గారి నిబద్ధత బ్యాంకుల్లో కుదవ పెట్టిన మీ బంగారంతో సహా విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశాడో అందరూ చూశారు చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అక్రమాల్లోనే. అదే ఒరిజినల్ చంద్రబాబు స్కాం సత్యం.. స్కామ్స్టర్ బాబు అనేదే సత్యం..! అరెస్టు కాకముందు ఏ రోగమూ లేని వాడు.. అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచంలోని అన్ని రోగాలున్నాయని కోర్టులకు చెప్పారు. మెడికల్ బెయిల్ వచ్చినా సత్యమేవ జయతే అంటారు..నిన్న రెగ్యులర్ బెయిల్ వచ్చినా సత్యం గెలిచింది అంటారు. అందులో స్కాం మాత్రమే సత్యం.. స్కాంస్టర్ బాబు అనేది సత్యం. చివరికి అదే బయటపడుతుంది... సిస్టమ్లోకి వైరస్ వచ్చినట్లు చంద్రబాబు, ఆయన ముఠా కూడా వైరస్లానే వెళ్తున్నారు. ఈ కుట్ర పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి. మీడియా ప్రశ్నలు–సమాధానాలు ఎన్నికల కమిషన్ను మా పార్టీ వారు కూడా కలుస్తారు. ఎక్కడ ఏ పోరాటం చేయాలో ఆ పోరాటాలు చేస్తాం. మా పార్టీ వైపు నుంచే కాకుండా ఇలాంటి దొంగదెబ్బ కొట్టే వారి గురించి అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మాకుంది. బేసిక్ గేమ్ రూల్స్ ధర్మబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది. – వారు అప్రమత్తంగా ఉండి..వారి వాయిస్ను రెయిజ్ చేయాలి. వాలంటీర్లు ఏం డేటా తీసుకుంటున్నారో కనుక్కోమనండి. ఓపెన్గానే వాలంటీర్లు పథకాల అర్హతను తీసుకుంటున్నారు. టీడీపీ వారికి కానీ, ఇంకెవరికైనా రావాల్సిన బెన్ఫిట్స్ ఆగాయా? జగన్ గారు శాచురేషన్ పద్దతిలో ముందుకు వెళ్తుంటే.. ఇక రాకపోవడానికి అవకాశమే లేదు. అన్ని పార్టీల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఎవరికైనా రాలేదంటే తీసుకుని రండి.. ఆ మేసేజ్ చూడగానే అభినందనలు అంటే లాటరీ కాకుండా ఏం గుర్తుకు వస్తుంది? అప్పుడే ఈయన సంతకంతో హామీ పత్రం ఇస్తే దీనిని ఏ తరహా చీటింగ్ అనాలి ఇదీ చదవండి: బాబు బెయిల్ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు! -
తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ తాడోపేడో..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ.. తెలంగాణలో జెండా పీకేసింది. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్కు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరం అంటూ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్.. నేడు నారా లోకేశ్తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ కానున్నారు. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టారన్న ఆవేదనలో ఉన్న జ్ఞానేశ్వర్ నారా లోకేష్తో తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మారిన పార్టీ స్టాండ్తో తల పట్టుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ కోసం బోలెడు ఖర్చు పెట్టాం అంటూ టీడీపీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలిసింది. తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచించడంతో, పోటీ చేయొద్దని ఇప్పుడు నిర్ణయిస్తే తన పరిస్థితి ఏంటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు.. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడి పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పార్టీకి మనుగడ అయినా ఉంటుందని అంటున్న కాసాని.. ఇంకా కూడా పార్టీ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాసాని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను కాసాని అన్వేషిస్తున్నట్లు సమాచారం. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
ములాఖత్కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..
రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్ను పట్టించుకోలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా. జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట. ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం. -కుర్చీ కింద కృష్ణయ్య -
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..విజయ్ దేవరకొండ తండ్రి ఆవేదన..
-
వైవాహిక జీవితంపై ప్రశ్న.. స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: స్నేహితురాలి భర్తను వివాహమాడారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తన భర్త జుబిన్ ఇరానీని వివాహమాడిన అంశాన్ని, జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా గురించి కూడా ఆమె స్పందించారు. అయితే.. సామాజిక మాధ్యమాల వేదికగా తరచు ఈ ప్రశ్నలు తనకు ఎదురవుతుంటాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈసారి మాత్రం జుబిన్ ఇరానీ, మోనా గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడారు. మోనాతో తనకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా మోనా ఇరానీ తన చిన్ననాటి స్నేహితురాలు కాదని ప్రజలకు విన్నవించారు. తనకంటే మోనా 13 ఏళ్ల పెద్దదని తెలుపుతూ ఇన్స్టాలో పోస్టు చేశారు. 'మోనా కుటుంబం రాజకీయ నేపథ్యం లేనిది. ఆమెను ఇందులోకి లాగొద్దు. నాతోనే పోరాడండి. నాతోనే వాదించండి. నా గౌరవ మర్యాదలపైనే మాట్లాడండి. కానీ ఒక అమాయక పౌరురాలిని ఇందులోకి లాగకండి. రాజకీయంగా ఏమీ సంబంధం లేని మోనాతో పోరాడకండి. ఆమె గౌరవానికి భంగం వాటిల్లవద్దు.' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. స్మృతి ఇరానీ జుబిన్ ఇరానీని 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు 'జోర్' కూడా ఉన్నాడు. కూతురు 'జోయిష్' ఉంది. జుబిన్కి మోనాతో ఇంతకుముందే వివాహం జరిగింది. వారిరువురికి 'షానెల్లే' పేరుగల కూతురు ఉంది. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్ గురించి కూడా ప్రశ్నించారు. రీల్ లైఫ్ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: ఎడతెరిపిలేని వర్షాలు.. విరిగిన కొండచరియలతో కూలిన గుడి.. 21 మంది మృతి.. -
'పవన్ ఫ్యూచర్కే క్లారిటీ లేదు.. అభిమానులకు ఏం భరోసా ఇస్తారు'
నెల్లూరు: నెల్లూరులో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిల్ ఫైరయ్యారు. పవన్కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్ పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఫ్యూచర్కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. మహిళ శక్తిపై టీడీపీ చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యే అనిల్ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్త శుద్ది లేదని విమర్శించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్పై పేరెంట్స్ దాడి -
నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు ?
-
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
డోంట్వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్నే కొనసాగించొద్దంటున్నారు!
డోంట్వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్నే కొనసాగించొద్దంటున్నారు! -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
నా టిక్కెట్ ఎవడికో ఇవ్వడమేంటి ?
-
హీరోయిన్ నడుముపై చేయి వేసిన అభిమాని.. ఆమె ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి ఓ అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఐదేళ్ల వార్షికోత్సవంలో ముంబయిలో జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న నటి అహన కుమ్రా నడుముపై ఓ అభిమాని చేయి వేశారు. ఈ చర్య అహన కుమ్రాకు కోపం తెప్పించింది. దీంతో డోంట్ టచ్ మీ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బుల్లితెర హీరోయిన్ వెండితెరపైకి.. వరుస ఛాన్సులు) ఇది చూసిన నెటిజన్స్ అభిమాని చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఆ సమయంలో అహనా చాలా వేగంగా స్పందించిందని ప్రశంసిస్తున్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా అలా తాకడం తప్పని చెబుతున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన యుధ్ అనే టీవీ షోతో అహన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా లాక్ డౌన్ లాంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె షరీబ్ హష్మీతో కలిసి క్యాన్సర్ అనే చిత్రంలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) View this post on Instagram A post shared by Aahana S Kumra (@aahanakumra) -
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
బైక్లే ఉన్నాయ్.. జనాలేరు?.. బీజేపీ శ్రేణులపై అమిత్షా ఆగ్రహం..
-
వీడియో: ఇది సజ్జనార్ మార్క్.. యువకుడికి మంచి చెబుతూనే.. ఆర్టీసీ ఎండీగా వార్నింగ్ కూడా
-
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్ఫామ్ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
‘చంద్రశేఖర్రెడ్డి.. మా దెబ్బేంటో చూపిస్తాం ఆగు’
సాక్షి, నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వంచనపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. పార్టీ ద్రోహి చంద్రశేఖర్రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్రెడ్డి వర్సెస్ వైఎస్సార్సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు చంద్రశేఖర్రెడ్డిపై పార్టీ నేత మూల వినయ్రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్రెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. మరో నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్రెడ్డికి పది ఓట్లు కూడా రావన్నారు. ఇక జిల్లా ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్రెడ్డిని నిలదీశారు. -
ఢిల్లీకి ఎందుకొచ్చారు?.. ఏపీ బీజేపీ నేతలకు వార్నింగ్.. అసలు ఏం జరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అసమ్మతి నేతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యవహారాలపై చర్చించాలనుకుంటే ఇద్దరు ముగ్గురు రావాలిగానీ.. ఇంతమంది ఢిల్లీకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మురళీధరన్ మాట్లాడి పంపించారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని, పార్టీ వ్యవహారాలపై సమీక్ష అప్పుడే చేద్దామని వారికి సూచించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులను మార్చే సందర్భంలో, ఆయా జిల్లాల్లోని సీనియర్ నాయకులను ఏమాత్రం సంప్రదించడం లేదని, రాత్రికి రాత్రే మార్చారని నాయకులు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. మురళీధరన్తో భేటీ అనంతరం ఏపీ బీజేపీ నేతలు తుమ్మల అంజిబాబు, బాలకోటేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు సీనియర్లను సంప్రదించకుండా మనస్తాపం చెందేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్న కారణంగానే ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు. నాయకత్వ మార్పు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మురళీధరన్ చెప్పినట్టు తెలిపారు. చదవండి: నా వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించింది: పులివెందుల మాజీ ఎంపీటీసీ శశికళ -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్టాప్లు, డెస్్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్గ్రామ్లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్లోని రేజ్ రూమ్లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్టాప్లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
'కుక్క' అన్న పిలుపు విషయమై తలెత్తిన వివాదం..చివరికి..
చిన్న మాట పట్టింపు కాస్త చివరికి హత్యకు దారితీయడం బాధకరం. వారి మధ్య ఉన్న వివాదం పెద్దది కూడా కాదు. కేవలం తమ ఇగోతో ప్రస్టేజ్లకు పోయి చంపుకునేంత వరకు వెళ్లి చివరికి కటకటాల పాలవ్వు తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని ఉలగంపట్టియార్కొట్టంలె నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్, విన్సెంట్తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్(62).. దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్ హెచ్చరించారు ఫాతిమా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ రాయప్పన్ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో.. ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్ తన కొడుకు కెల్విన్కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా.. ఆ మాట విన్న డానియల్ కోపంతో నా పెంపుడు కుక్కను ‘కుక్క’ అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చాడు.ఆ తర్వాత రాయప్పన్ ఛాతిపై బలంగా ఒక పంచ్ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి.. నిర్మలా రాణి తోసహా ఆమె కుమారులను పట్టుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్) -
హలో బ్రదర్.. కాస్త దూరంగా ఉండు.. ఫ్యాన్ పై రాఖీ సావంత్ ఫైర్
-
పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
-
నిజామాబాద్: అయ్యప్ప స్వాముల ధర్నాలో ఉద్రిక్తత
-
Bairi Naresh: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు
సాక్షి, నారాయణపేట: హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా కనిపించడం, నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే అతనిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల కిందట కొడంగల్లో ఓ సభలో హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీడియోలన్నింటిని యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్ భగ్నం కలిగిస్తున్నాడని, కులాల, మతాల మధ్య ద్వేషం రగిలిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను అవమాన పరుస్తున్నాడని విమర్శిస్తున్నారు. హిందూ దేవతలను అశ్లీల అసభ్య పదాలతో వర్ణించడంతో యావత్ హిందూజాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వామి భక్తులు. నకిరేకల్ అయ్యప్ప స్వామి భక్త మండలి అద్యర్యం లో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్లు. -
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటుడు దగ్గుబాటి రానా ఆగ్రహం
-
రిషబ్ పంత్ పై నెటిజన్ల ఆగ్రహం
-
తండ్రి లాంటి సీఎంకు కోపమేల: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు కోపం వచ్చినా వెంటనే తమ పిల్లలను దగ్గరకు తీసుకుంటారని, అలాగే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి సీఎం పోస్టులో ఉన్న కేసీఆర్కు వీఆర్ఏలపై కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని, వారంతా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా అయినా వారి సమస్యలను పరిష్కరించి దసరా కానుక ఇవ్వాలని ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. సమ్మెలో ఉన్న వారంతా జీతాలు లేక అవస్థల పాలవుతున్నారని, ఈ సమ్మె కాలంలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని కోరారు. సీఎం పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తిచేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
పంత్ పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
-
చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే?
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): రాజంపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ చెంప ఛెళ్లుమనిపించారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. అశోక్ ఏబీవీపీ నాయకులను వెంటపెట్టుకొని ఉదయం 11 గంటలకు జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలని హెచ్ఎం లక్ష్మీదేవిని కోరారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తానని హెచ్ఎం ఏబీవీపీ నాయకులకు తెలిపారు. అందుకు అశోక్ ససేమిరా అన్నాడు. విద్యార్థులను ఇళ్లకు పంపితే వండిన భోజనం, కోడి గుడ్లు వృథా అవుతాయని, చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉంటారని, పిల్లలు ఇప్పుడు ఇళ్లకు వెళితే మధ్యాహ్నం భోజనంలేక పస్తులుండాల్సి వస్తుందని హెచ్ఎం వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ వినిపించుకోని అశోక్ ‘మీకు మెంటలా? చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అని పరుష పదజాలంతో గద్దిస్తూ, దురుసుగా ప్రవర్తించటంతో హెచ్ఎం లక్ష్మీదేవి అతని చెంప ఛెళ్లుమనిపించారు. -
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం
Hero Sushanth Fire On Anchor: యంగ్ హీరో సుశాంత్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్తో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ను 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్లో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా.. సుదర్శన్, ప్రేమ్ సాగర్, బిగ్బాస్ ఫేమ్ దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో జులై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనికి ముందు గురువారం (జులై 14) నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్పై హీరో సుశాంత్ ఫైర్ అయ్యాడు. 'సినిమాల్లేకపోతేనే సిరీస్లు చేయాలా? మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు.. వెబ్ సిరీస్లు కూడా చేస్తాను. మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్లో మంచి కంటెంట్ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడు' అంటూ యాంకర్పై అసహనం వ్యక్తం చేశాడు హీరో సుశాంత్. అయితే ఇదంతా నిజంగా కాదులేండి. ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో సుశాంత్, నటుడు, కమెడియన్ సుదర్శన్ సరదాగా ఓ స్కిట్ చేశారు. ఇందులో సుశాంత్ను ఇంటర్వ్యూ చేసే యాంకర్గా స్టేజ్పైకి వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ గురించి సుశాంత్ చెబుతుంటే 'మనలో మన మాట సినిమాల్లేవా?' అని సుదర్శన్ ప్రశ్నించడంతో 'సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్? కంటెంట్ ఉందో లేదో సిరీస్ చూస్తేనే తెలుస్తుంది' అని కోపంతో సమాధానమిచ్చాడు సుశాంత్. అయితే దీనికి సంబంధించిన వీడియోను సుశాంత్ ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల జరిగిన'లడ్కీ: ఎంటర్ ది డ్రాగన్ గర్ల్' ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ శ్యామలపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం (జులై 13) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించింది శ్యామల. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి ఓ గేమ్ ఆడదామని అడిగింది. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏంటో కరెక్ట్గా గెస్ చేయాలంది. దీనికి వర్మ ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చంపూ రశీదు సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటో చెప్పమని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది. దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్ బిల్ అని ఆన్సరిస్తూ నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్గా ఉన్నాను. ఇది సీరియస్ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) -
నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
Amma Rajasekhar Fires On Nithin And Get Emotional: హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రారా రెడ్డి అనే పాట యూట్యూబ్లో వైరల్ అయింది. ఈ పాటలో నితిన్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నితిన్కు డ్యాన్సే రాదని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. నితిన్ మాటిచ్చి హ్యాండిచ్చాడని, అది తనకు అవమానకరంగా ఉందని స్టేజ్పైనే ఎమోషనల్కు గురయ్యాడు. విషయంలోకి వెళితే.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (జులై 10) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సినట్లు తెలుస్తోంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో నితిన్ హాజరు కానట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. పది రోజుల క్రితమే నితిన్ను ఈ ప్రోగ్రామ్కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించా. నితిన్కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు. నితిన్కే కాదు హీరోలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సహాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్.. నువ్ రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది. అని అమ్మరాజేశేఖర్ ఎమోషనల్ అయ్యారు. కాగా నితిన్ నటించిన 'టక్కరి' మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
భార్య మీద పడ్డ ఫ్యాన్స్.. అసభ్య పదజాలంతో దూషించిన నటుడు
Tom Hanks Get Fire On Fans After They Push His Wife Rita Wilson: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఈ మూవీ 'ది ఫారెస్ట్ గంప్'కు రీమెక్గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్. ఇటీవల ఈ నటుడు సహనం కోల్పోయి తన అభిమానులపై అరిచాడు. అసభ్యకర పదంతో తిట్టాడు. ఈ సంఘటన బుధవారం (జూన్ 15) రాత్రి న్యూయార్క్లో చోటుచేసుకుంది. ఆస్కార్ విన్నర్ టామ్ హ్యాంక్స్ తన భార్య రిటా విల్సన్, పిల్లలతో కలిసి న్యూయార్క్లోని ఓ రెస్టారెంట్కు వచ్చాడు. డిన్నర్ చేసి బయటకు వెళ్తుండగా కొంత మంది అభిమానులు టామ్ హ్యాంక్స్ చుట్టూ గుమిగూడారు. అటోగ్రాఫ్లు, సెల్ఫీలు అడిగారు. ఈ క్రమంలో తన భార్యపై పడ్డారు. దాంతో ఆమె కిందపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది చూసిన టామ్ హ్యాంక్స్ తన అభిమానులపై విరుచుకుపడ్డాడు. 'వెనక్కి వెళ్లండి. రీటా నా భార్య. తనపై పడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు' అంటూ 'ఎఫ్ పదం' ఉపయోగించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Daniel T Myles (@danieltmyles) తర్వాత పలువురు అభిమానులు టామ్ హ్యాంక్స్కు క్షమాపణలు తెలిపారు. ప్రస్తుతం టామ్ హ్యాంక్స్ ఎల్విస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్తున్నాడు టామ్. ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. -
కోపంగా చూశాడని కత్తులతో పొడిచి చంపేశారు
యశవంతపుర: ఐటీ సిటీ బెంగళూరులో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరగడం మామూలు విషయమైంది. బైకు తగలడంతో కోపంగా చూశాడని కెంగేరి వద్ద యువకున్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం రాత్రి కెంగేరిలో కరగ ఉత్సవం జరిగింది. భరత్ అనే యువకుడు చూడడానికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైకుపై వెళ్తుండగా అతని బైక్కు మరొక బైక్ తగిలింది. దీంతో భరత్ కోపంగా చూశాడు. నన్నే గుర్రుగా చూస్తావా అని మరో బైకిస్టు స్నేహితులతో కలిసి భరత్ను కత్తులతో పొడిచి చంపారు. శవాన్ని ఈడ్చుకొంటూ వెళ్తుండగా కెంగేరి రైల్వే పోలీసులు రావడంతో హంతకులు పారిపోయారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
పుతిన్ను తప్పుదోవ పట్టిస్తోందెవరంటే..
సైనిక దాడి తగ్గిస్తామని మాటిచ్చి మరీ.. ఉక్రెయిన్లో దాడుల్ని రష్యా తీవ్రతరం చేసింది. కీవ్ నలుమూలల నగరాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. క్రెమ్లిన్ను సొంత సైన్యమే తప్పుదోవ పట్టిస్తోందన్న భావనలోకి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూరుకుపోతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత సైన్యంపైనే గుర్రుగా ఉన్నాడంటూ అమెరికా అంటోంది. ఈ మేరకు బుధవారం అమెరికా ఇంటెలిజెన్సీ కార్యదర్శి, వైట్హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ఫీల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆయన(పుతిన్) సైన్యం తనను తప్పుదోవ పట్టిస్తోందన్న భావనకు వచ్చేశారు. సైన్యాధికారుల్ని ఆయన నమ్మడం లేదు. రష్యా మిలిటరీ వర్గాలు-పుతిన్ మధ్య మధ్య నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ మిలిటరీ చర్యల్లో తనను తప్పుదారి పట్టించినందుకు పుతిన్ కోపంగా ఉన్నార’’ని బెడింగ్ఫీల్డ్ పేర్కొన్నారు. యుద్ధం మొదలై నెల గడుస్తోంది. అయినా ఉక్రెయిన్ లొంగిపోలేదు. యుద్ధ పరిణామాలను తనకు సైన్యం సరిగ్గా వివరించడం లేదని, సరైన దిశానిర్దేశం లేకుండా ముందుకు వెళ్తున్నాయంటూ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు పుతిన్. అయితే పుతిన్కు భయపడే సైన్యం అసలు వాస్తవాలు వెల్లడించడం లేదన్న వాదనా వినిపిస్తోంది. ఇక అమెరికా-ఈయూ దేశాల ఆయుధ సంపత్తితో రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకర్లను, ఎయిర్క్రాఫ్ట్లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు రష్యా సైన్య సిబ్బంది భారీగా మరణిస్తున్నారు. ఇంకోవైపు యుద్ధ భూమిలోనే కాకుండా.. ఆంక్షలతో మాస్కోను ముప్పుతిప్పలు పెడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. ఈ పరిణామాలేవీ పుతిన్కు సహించడం లేదని, ఆ అసహనాన్ని సైన్యం వద్ద చూపిస్తున్నాడంటూ కీవ్ వర్గాలు సైతం కథనాలు వెలువరుస్తున్నాయి. చదవండి: పుతిన్-జెలెన్స్కీ.. అంతా వాళ్ల దుస్తుల్లోనే ఉంది! -
ప్రమోషన్స్కు హీరో రాకపోవడమేంటి? డైరెక్టర్ సీరియస్
ఎలాంటి విభేదాలు ఉన్నా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని దర్శకుడు శీను రామస్వామి పేర్కొన్నారు. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ మదియళగన్ నిర్మించిన చిత్రం కల్లన్. కరు.పళనియప్పన్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ రచయిత్రి పాత్రికేయురాలు చంద్ర తంగరాజ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఫస్ట్ కాపీ చూసిన వెంటనే పీకాక్ పిక్చర్స్ అధినేత ఎస్ ఎస్ కుమరన్ విడుదల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు శీను రామస్వామి. ఈ వేడుకలో కథానాయకుడు కరు.పళణియప్పన్ పాల్గొనకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందన్నారు. దర్శకురాలు అవ్వాలన్న తన 20 ఏళ్ల కల ఈ చిత్రం అని డైరెక్టర్ చంద్ర తంగరాజ్ పేర్కొన్నారు. 100 మంది నిర్మాతలు తిరస్కరించిన ఈ కథను విన్న మదియళగన్ వెంటనే నిర్మించడానికి సమ్మతించారని తెలిపారు. -
పెళ్లి పీఠలపైనే పెళ్లి కూతుర్ని చితకొట్టిన పెళ్లి కొడుకు..!!
-
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
చనిపోయిన ప్రియుడికి కోపం తెప్పించిన ప్రియురాలు.. దెయ్యమై..
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్ఫర్డ్ షైర్కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు. ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్ను వాలెంటైన్స్గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది. తన ప్రియుడికి కెండిల్స్ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
khammam: ఉపాధి పనుల ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం
సాక్షి, గద్వాల(మహబూబ్ నగర్): జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న మండలంలో కూడా ఉపాధిహామీ పనులు ఆలస్యంగా కొనసాగడమేంటని, పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శృతిఓఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మండలంలోని తెలుగోనిపల్లి, ముల్కలపల్లి, బీరెల్లిలో పర్యటించి ఉధిహామీ పనులను పరిశీలించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లు పనులను పరిశీలించారు. అదేవిధంగా ఉపాధి పనులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఖచ్చితంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జాబ్కార్డులున్న ప్రతిఒక్కరికి పనులు కల్పించాలని, పనులు జరిగే సమయంలో కూలీల వద్ద జాబ్ కార్డులుండేలా చూడాలని సూచించారు. మస్టర్, డాక్యుమెంట్లు వంటివి ఎప్పటికపుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ సూరి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం -
అనంత శ్రీరామ్పై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
నెల్లూరు: ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవలె వరుడు కావలెను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ‘దిగు దిగు నాగ’ పాటపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేవతలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ అనంత శ్రీరామ్పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు చిల్లకూరు పీఎస్లో అనంత శ్రీరామ్పై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలకు కించపరుస్తున్నరంటూ మండిపడ్డాయి. నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బ్రాహ్మణ సంఘాలు అనంత శ్రీరామ్కు ఉన్న మంద బుద్ది పోవాలంటూ చురకలంటించారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో నిరసనకు దిగారు. ఇప్పటికే అనంత శ్రీరామ్పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించిన వరుడు కావలెను చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
పెళ్లిలో తలపాగ నేలకేసి కొట్టిన వరుడు.. వైరల్ వీడియో..
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ వివాహం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక వెరైటీ సంఘటనతో వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహంలో మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. బంధువుల మధ్య సిందూర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణంగా, ఈ వేడుకలో వరుడు, వధువు నుదుట.. తల కొప్పులో కుంకుమ పెట్టడం ఆచారం. అయితే, వధువు వేదిక మీద కూర్చోని ఉంది. ఈ క్రమంలో వరుడు, పెళ్లికూతురికి బొట్టు పెట్టడానికి వేదిక దగ్గరకు చేరుకున్నాడు. కుంకుమ పెట్టాడానికి సిద్ధమయ్యాడు.. అయితే, ఇంతలోనే వధువు ఒక్కసారిగా కిందపడి పోయింది. దీంతో వరుడు షాక్ గురయ్యాడు. పాపం.. అతనికి ఏంజరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి, వధువు ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అతను.. వెంటనే తన తలపాగను తీసిపాడేశాడు. అంతటితో ఆగకుండా కోపంతో.. మెడలోని పూలమాల తీసి నెలకేసి కొట్టాడు. ఈ క్రమంలో వరుడిని ఆపటానికి బంధువులు ప్రయత్నించారు. అయినా.. వరుడు ఎవరిమాట లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వధువుకి ఏమయ్యిందో..’, ‘ఆ యువతికి పెళ్లి ఇష్టంలేదు కాబోలు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
-
రంగారెడ్డి : ఆగ్రహంతో బస్తాలకు నిప్పుపెట్టిన రైతన్నలు
-
ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వెలమ సంఘం నాయకుల మండిపాటు
-
కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు
కరోనా ప్రభావమో.. మరేమో కానీ.. ఈ మధ్య జరిగిన చాలా వివాహాలలో ఏదో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంటుంది. దీంతో ఈ పెళ్లిళ్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కూడా అలాంటి కోవకు చెందినదే. ఈ వివాహాంలో వరుడు, వధువు ఇద్దరు స్టేజీమీద నిల్చోని ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఈ వేడుకలో యువతి స్నేహితులు, ఒక ప్లేట్లో స్వీట్ బాక్స్ ఉంచి స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వీట్ బాక్స్ను వధువుకు ఇచ్చి వరుడికి తినిపించాలని కోరారు. ఈ క్రమంలో, ఆ వధువు ఆ బాక్స్లోని ఒక స్వీట్ను తీసుకుని వరుడికి తినిపించేందుకు చేయి చాచింది. అయితే, పాపం.. ఆ వరుడు ఏ ఆలోచనలో ఉన్నాడో, లేక కరోనా వేళ స్వీట్ గోల ఏంటని గాబరా పడ్డాడో గానీ.. నోరు తెరవడానికి కాస్త ఆలస్యం చేశాడు. దీంతో ఆ వధువుకి చిర్రెత్తినట్టుంది. దీంతో వెంటనే తన చేతిలోని స్వీట్ను కోపంతో నేలపై పడేసింది. అయితే, ఈ అనుకోని సంఘటనతో, ఆ పెళ్లి కొడుకుకి ఏంచేయాలో అర్థంకాక.. బిత్తర ముఖం వేసుకొని అలాగే ఉండి పోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆ యువతికి పెళ్లి ఇష్టం లేదేమో..’, ‘ అందరి ముందు ఇంత కోపం పనికి రాదు..’, ‘నీ కోపంతో స్వీట్ను నేల పాలు చేశావ్ కదా.. ’ ‘ బాబీ.. కూల్.. చల్లబడండి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, గతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో సదరు వధువు.. వరుడి ముఖంపై పువ్వులను విసిరి కొట్టిన ఘటన వైరల్గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు -
ధోనిపై ద్రవిడ్ ఆగ్రహం; మళ్లీ ఆ అవకాశం ఇవ్వలేను
న్యూఢిల్లీ: ‘ది వాల్’ గా పేరున్న భారత మాజీకెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతహాగా మృదు స్వభావి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన ప్రశాంతంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓర్పు, సహనం ప్రదర్శించి మిస్టర్ కూల్కు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అయితే ఈ మిస్టర్ కూల్కు ధోనిపై ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చిందట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఇటీవల ద్రవిడ్ ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఈ మిస్టర్ డిపెండబుల్ కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంటాడు. ప్రస్తుతం ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా ద్రవిడ్ ఆగ్రహించాడా అని చాలా మందికి ఓ ప్రశ్న ఎందురైంది. ఈ సందర్భంగా సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ద్రవిడ్ ధోనిపై ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేశాడు. 2006లో పాకిస్థాన్తో వన్డే సిరిస్ సమయంలో ధోనీపై ద్రవిడ్ అరిచాడని పేర్కొన్నాడు. ‘ధోనీ ఓ మ్యాచ్లో పాయింట్ దిశలో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్ కోప్పడ్డాడు. అలాగేనా ఆడేది..? మ్యాచ్ను నువ్వే ముగించాల్సింది అంటూ అరిచాడని’ తెలిపాడు. ధోని-ద్రవిడ్ ఆంగ్ల సంభాషణలో తనకీ విషయాలు అర్థమయ్యాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాతి మ్యాచ్లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవతలి ఎండ్లో ఉన్న సెహ్వాగ్ వెళ్లి బౌండరీల కోసం ప్రయత్నించడం లేదని ధోనిని అడగాడట. అందుకు ధోని ‘ద్రవిడ్ తనని మళ్ళీ తిట్టడం ఇష్టం లేదని, కనుక ఇన్నింగ్స్ను ముగించేవరకు తాను క్రీజ్లోనే కొనసాగాలనుకున్నట్లు’ తెలిపాడని ఈ సందర్భంగా సెహ్వాగ్ వెల్లడించారు. ( చదవండి: రాబోయే రోజుల్లో క్రికెట్లో మార్పులపై ద్రవిడ్ వ్యాఖ్యలు ) Does #MSDhoni never answer his phone? @VirenderSehwag & Ashish Nehra bust myths around MSD, on #CricbuzzLive Hindi#IPL2021 #CSKvDC pic.twitter.com/OJUFeM5tuR— Cricbuzz (@cricbuzz) April 10, 2021 -
ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం
మనుషుల మాదిరి జంతువులకు దాదాపు అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. తాజాగా ఓ శునకానికి యమ కోపం వచ్చేసింది. ఆకలవుతుందని భౌ భౌ అని అరుస్తుంటే ఎంతకీ యజమాని పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆ శునకం తిన్నె గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) ప్రవీణ్ అంగుసామి తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. తనకు ఆకలి అయ్యిందని ఆ కుక్క అరుస్తుంటుంది. కొద్దిసేపటికి కోపమొచ్చి వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్ పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఎంత కోపం? ఆకలైతే అంతే.! తదితర కామెంట్లు చేస్తున్నారు. మీరు చూసేయండి ఆ వీడియో.. -
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
-
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
హిందూపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ సారి టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. గురువారం సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయ్యారు. బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యువత చెడిపోతున్నారు. చాలా పొద్దెక్కే వరకు పడుకోవడం.. రాత్రయితే బండ్లేసుకుని అదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ.. ఆ.. చుక్కలు లెక్కెడుతూ.. వీళ్లలా పోవడం ఏదో ఢీ కొట్టడం.. (ఈ సమయంలో ఆకాశంలో చూస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఊగుతూ మాట్లాడడం చూసిన హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, స్థానిక నేతలు, ప్రజలు ఫక్కున నవ్వారు). ఏయ్.. నవ్వకండి.. (బీకే పార్థసారథి వైపు వేలు చూపిస్తూ) ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్(సీరియస్ అంటూ టీడీసీ నేతలు కోరస్ పలికారు). నాకు తెలుసు.. చాలా మంది అలా తయారవుతున్నారు. సో.. జాగ్రత్తగా ఉండు(వేలు చూపిస్తూ) మనుషులు... మనుషులుగా చూస్తే.. లేదా విప్లవమే. నేనూ చాలా చదివాను. రిమ్యాగ్జన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్స్.. ఆ... ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఏం జరిగిందో అప్పుడు రొట్టె చేతిలో పట్టుకుని వెళ్లి.. ప్యాలెస్.. హూ ఇజ్ ద సిక్సిటిన్త్.. ఆ... మహరాజునే బయటకు లాక్కొచ్చి.. తీసుకొచ్చి.. (తల నిలువుగా ఆడిస్తూ.. ) జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. హెచ్చరిస్తున్నా.’’ చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు బిగుస్తోన్న ఉచ్చు -
కొట్టేస్తా... ఏమనుకున్నావ్!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. వివరాల్లోకెళితే ‘బంగబంధు టి20 కప్’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్పై నెగ్గి ప్లే ఆఫ్కు చేరింది. మ్యాచ్ జరుగుతుండగా బౌన్సర్ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్మన్ అఫిఫ్ హొస్సేన్ కొట్టిన షాట్ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్ను ఫైన్లెగ్లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ అయిన రహీమ్ ఓ జూనియర్ క్రికెటర్ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. -
ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : చిత్ర విచిత్ర వ్యాఖ్యలు, వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ట మరోసారి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. సందర్బం ఏదైనా, సమయం ఏదైనా తనకు కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్లో నిలిచింది. ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “'సెహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్కు నందమూరి బాలకృష్ణ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ రిలీజ్కు బాలకృష్ణ సన్నద్దమవుతున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. అంతే.. జేబులో నుంచి ఫోన్ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్ను అలా గాల్లోకి క్యాచ్ విసిరారు. అలా ఆయన స్టేజిపై నుంచే ఫోన్ విసిరేయటంతో సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం బిక్క చచ్చిపోయారు. దీంతో నెటిజన్లు వ్యంగ్య కామెంట్లు, మీమ్స్తో సందడి చేస్తున్నారు. కోపదారి మనిషికి ఆ సమయంలో ఎవరబ్బా ఫోన్ చేసింది.. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబుకు కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారంటూ సోషల్ మీడియాలోకామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమాని ప్రేమించండి.. సినిమా అనేది ఒక ప్యాషన్.. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు.. అంటూ చిత్రయూనిట్కు బాలయ్య ఇచ్చిన సలహాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. ఇకముందు రాదు కూడా.. దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. (గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) View this post on Instagram A post shared by Punch Siksha (@punchsiksha) View this post on Instagram A post shared by hakunamatata3 (@hakunamatataaa_3) -
పవన్ కళ్యాణ్ పై జక్కంపూడి రాజా ఫైర్
-
మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని, రోస్టర్ విధులను సరిగా నిర్వర్తించని కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని కేంద్ర మంత్రుల జాబితాను ఏరోజుకారోజు సాయంత్రానికల్లా తనకు ఇవ్వాలని మోదీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడాలని మోదీ సూచించారు. క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. టీబీ, క్షయ వంటి వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి, జంతు సంరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతోన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీలను ఆదేశించారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రధానికి తెలిపారు. కాగా, పార్లమెంటు సమావేశాలకు ఎంపీల గైర్హాజరుపై ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలోనూ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర
చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలుకు కేంద్ర ప్రయత్నిస్తోందంటూ తమిళ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ద్వి భాషా విధానాన్నే కొనసాగిస్తామని తమిళ సర్కార్ తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరిరంగన్ నేతృత్వంలో రూపొందించిన జాతీయ విద్యా విధానంలోని ప్రతిపాదనలు శుక్రవారం వెల్లడయ్యాయి. కొన్ని మార్పులు చేర్పులతో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం (మాతృభాష, ఇంగ్లిష్తోపాటు హిందీ)అమలు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై తమిళనాడులోని పలు పార్టీల నేతలు స్పందించారు. ‘త్రిభాషా విధానం అమలు, హిందీని పాఠశాల స్థాయి నుంచి 12వ తరగతి వరకు నేర్వాలనడం పెద్ద షాక్. ఈ ప్రతిపాదన దేశాన్ని విభజిస్తుంది’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. ‘పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు అర్థం ఏమిటి? హిందీని తప్పనిసరి చేయాలని చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం మొదట్లోనే బయటపడుతోంది’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. అది ప్రతిపాదన మాత్రమే: కేంద్రం త్రి భాషా సూత్రాన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తమిళ పార్టీలు చేస్తున్న ఆరోపణను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఖండించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ముసాయిదాలో అది ఒక ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ‘మోదీ ప్రభుత్వం అన్ని భాషల అభివృద్ధిని కోరుకుంటోంది. ఎన్ఈపీ కమిటీ ప్రతిపాదనలపై అపోహలు అవసరం లేదు. అది ప్రతిపాదన మాత్రమే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయిస్తాం’ అని అన్నారు. -
అవును... నాకు కోపమొస్తుంది
సామాజిక సమస్యలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గ్రాండ్ విజువల్స్తో తెర మీద చూపిస్తారు దర్శకుడు శంకర్. ‘జెంటిల్మేన్’ నుంచి ‘ఐ’ వరకూ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన దర్శకుడిగా మనకు తెలుసు. కానీ శంకర్ సెట్లో ఎలా ఉంటారు? శంకర్కు కోపం వస్తుందా? కోపంతో మూడో కన్ను విప్పి ఉగ్ర శంకరుడౌతారా? మనకు తెలియదు. ఇదే ప్రశ్న శంకర్నే అడగ్గా – ‘‘అవును నాకు కోపం వస్తుంది అని సమాధానం ఇచ్చారు. కోపం రావడం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరుగుతాయి’’ అని అంటున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘సెట్లో ఏదైనా పని సరిగ్గా జరగకపోతే కోపం వస్తుంది. చేసే పనిలో శ్రద్ధ లేకపోయినా, సక్రమంగా జరగకపోయినా కోపం వస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా కోపం వచ్చేది. విచిత్రంగా కోపం కొన్ని సార్లు పనులన్నీ సక్రమంగా జరిగేలానూ చేస్తుంది. మనం కోపంగా, చిరాకుగా ఉన్నాం అని మన చుట్టూ ఉన్నవాళ్లు చూస్తే ఆ పని చాలా ముఖ్యమైందని, త్వరగా పూర్తి చేయాలని పనులను త్వరగా పూర్తి చేస్తారు. మెల్లగా మెల్లగా కోప్పడటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయిపోయింది. కోపం తెచ్చుకోవడం కంటే ఏర్పడ్డ సమస్యకు పరిష్కారం వెతకడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం మొదలెట్టాను’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్తో శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘2.0’ ఈ నెల 29న రిలీజ్ కానుంది. -
సభ్యుల గైర్హాజరుపై వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించే సమయంలో సభ్యులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ (123వ సవరణ) బిల్లును సోమవారం ఆమోదించిన సమయంలో 156 మంది సభ్యులే సభలో ఉన్నారు. ‘చారిత్రక బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించాం. కానీ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది హాజరయ్యారు? 245 మంది సభ్యులకు గాను 156 మందే హాజరయ్యారు. ఒకరిద్దరు తగ్గినా బిల్లు పాసయ్యేది కాదు. అతి తక్కువ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది’ అని అన్నారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం సమయంలో సభ్యులు తప్పకుండా హాజరయ్యేలా రాజకీయ పార్టీలు విప్లు జారీ చేయాలని వెంకయ్య అన్నారు. -
పెళ్లి వార్తలపై స్పందించిన మిల్కీ బ్యూటీ
పెళ్లి వార్తలపై వరుసగా వస్తున్న రూమర్స్కు హీరోయిన్ తమన్నా చెక్ పెట్టారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్లో స్పందించారు. ‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్, ఇప్పుడేమో డాక్టర్.. నేనేమి భర్తల షాపింగ్ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్గానే ఉన్నా. నా పేరెంట్స్ కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం చట్ట ప్రకారం, గౌరవప్రదంగానూ మంచిది కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా’ అంటూ తమన్నా ట్వీట్ చేశారు. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్..? -
నిద్ర కరవైతే కోట్లు ఖర్చవుతాయి..
జనాలు సరిగ్గా నిద్ర పోకపోతే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది! ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి అనే సమస్య ఎక్కువవుతోందని.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందికి తగినంత నిద్ర లభించకపోగా.. మిగిలిన వారు వృత్తిపరమైన ఒత్తిడితో, సామాజిక, కుటుంబ కార్యకలాపాల కోసం నష్టపోతున్నారని.. ఇంకొందరు తెలిసో తెలియకో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు దాని ప్రభావం ఉత్పాదకతపై పడటంతోపాటు ఆరోగ్యసమస్యలకూ కారణమవుతోందని వీరు అంటున్నారు. తగినంత నిద్ర లేకపోతే త్వరగా కోపం రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ప్రతిస్పందించే సమయం తగ్గిపోవడం, సానుభూతి కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ రకమైన సమస్యలన్నింటి పర్యవసానాలు ఆర్థికంగా ఎలా ఉంటాయని ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్లు లెక్కకట్టారు. ఆరోగ్య ఖర్చులు, ప్రమాదాల వంటి వాటి వల్ల వచ్చే ఖర్చులు వంటివన్నీ లెక్కకడితే ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 1788 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు వీరు తేల్చారు. ఈ నష్టం ఒక్క ఆస్ట్రేలియాలోనే దేశ జీడీపీలో 1.55 శాతం వరకు ఉందని అంచనా. -
టీడీపీ కార్యకర్తపై బాలయ్య ఆగ్రహం
-
యోగి ఆదిత్యనాథ్ అనుచిత ఆగ్రహం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో గురువారం నాడు కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ రైలు, ఓ స్కూల్ వ్యాన్ ఢీకొన్న సంఘటనలో 13 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నినాదాలు ఆపండి, ఇది విషాధకర సంఘటన. మీ నాటకాలు కట్టి పెట్టండి. నా మాటలు ఆలకించి మీ నాటకాలు ఆపండి!’ అంటూ ఆదిథ్యనాథ్ ఆవేశంగా మాట్లాడారు. జరిగిన దుర్ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం, చేయూత అందించాల్సిన ముఖ్యమంత్రి ఇలా ‘మీ నాటకాలు ఆపండి’ అంటూ మాట్లాడం పట్ట బాధితుల తల్లిదండ్రులే కాకుండా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతులంతా డివైన్ స్కూల్కు చెందిన పిల్లలే. అందరూ పదేళ్లలోపు వారే. యోగికి సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎంపీడీఓపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
సాలూరురూరల్ (పాచిపెంట): పింఛన్ల మంజూరు విషయమై టీడీపీ నాయకులు ఎంపీడీఓ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సూచించిన వారికి పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు కాకపోవడంపై నిలదీశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్దేవ్ సమక్షంలో గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ తతంగం చోటుచూసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం లేకుండా పింఛన్లు ఎలా మంజూరు చేస్తారని ఎంపీడీఓను టీడీపీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, ముఖే సూర్యనారాయణ, తదితరులు ప్రశ్నించారు. తాను నిబంధనల మేరకే పింఛన్లు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు శాంతించలేదు. మండలంలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, మీరు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం మమ్మల్ని పట్టించుకోవడం లేదని భంజ్దేవ్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు మంజూరు చేయించుకోలేకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగ్గలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో భంజ్దేవ్ కూడా ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
పనుల నత్తనడకపై కమిషనర్ ఆగ్రహం
పటమట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు నత్తనడక సాగటంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్ట్రామ్ పనులు జామ్’ శీర్షికన ఈనెల 2వ తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్ జె.నివాస్ బుధవారం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, ఎల్అంట్టీ అధికారులతో సమావేశమయ్యారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో కాలువలను బ్లాక్ చేయటం వల్ల మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రెయిన్లో వచ్చే మురుగునీటిని మోటర్ల ద్వారా పక్కనున్న డ్రెయిన్లలోకి మళ్లించటంతోపాటు పనులు పూర్తయిన వెంటనే మిగిలిన మట్టి, వ్యర్థ పదార్థాలను తొలగించి రోడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రెయినేజీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో యూజీడీ పైప్లైన్, తాగునీటి పైప్లైన్ ఎలాంటి డ్యామేజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అవుట్ఫాల్ డ్రైయినేజీ పనులు నిర్మాణం పూర్తయిన వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రెయిన్లపై శ్లాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రామ్వాటర్ డ్రైయిన్ పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్హెల్త్ విభాగం అధికారులు వివరణ ఇచ్చారు. నగరంలో ఇప్పటివరకు సుమారు 98 కిలోమీటర్ల దూరం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణపు పనులు పూర్తయ్యిన అన్నిచోట్ల గ్యాపులను అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. విశాలాంధ్ర రోడ్డు, ప్రకాశం రోడ్డు, రవీంద్రభారతి స్కూలు వద్ద కల్వర్టుల నిర్మాణపు పనులు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం, లయోలా కళాశాల, పుల్లేటి కాలువ వంటి ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, క్రీస్తురాజపురం ప్రాంతాల్లో విస్తరణ జరుగుతున్న కారణంగా సర్వే పూర్తిచేసి ఎలైన్మెంట్ ప్రకారం డ్రైయిన్ నిర్మాణాలను అడ్డుగా ఉన్న భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశించారు. మూడు మిక్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం స్ట్రామ్వాటర్ డ్రెయినేజీ పనులు నిర్వహణ నిమిత్తం మూడు మిక్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, పనులువేగవంతం చేయటానికి చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. మరో మిక్సింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవాలని ఎల్అండ్టీకి సూచించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే అధికారులతో సమన్వయం అయ్యి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ పి.ఆదిశేషు, ఎస్ఈ రామచంద్రరావు, ఈఈ ప్రభాకర్; విద్యుత్ శాఖ ఎస్ఈ తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ దీక్షాపరుల ఆందోళన
రాయికల్(జగిత్యాల): మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట, అల్లీపూర్ గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షాపరులు సోమవారం ఆయా గ్రామాల నుంచి అయోధ్య గ్రామానికి శోభాయాత్రగా వెళ్తుండగా.. ఎస్సై శివకృష్ణ డీజే సౌండ్బాక్స్లు, జెండాలు తొలగించాలని కోరడంతో దీక్షాపరులు ఎస్సై తీరుపట్ల ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకుంటే ఎస్సై డీజేను, కాషాయ జెండాలను తొలగించాలనడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షాపరులకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ సంఘాల నిరసన
జగిత్యాల: నర్సంపేట జిల్లాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్లు మస్కూరుల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్న కలెక్టర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్కుమార్, ఎండీ.వకీల్, టీఎన్జీవోల అధ్యక్షుడు శశిధర్, కృష్ణ, మధుగౌడ్ పాల్గొన్నారు. -
‘ఛస్.. ఇది సుప్రీం కోర్టా? చేపల మార్కెటా?’
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతి కేసులో వాదిస్తున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఒక దశలో పరుష పదజాలంతో ఇద్దరు దూషించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వీవై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు మర్యాదను కాపాడండి. మీ వాగ్వాదంతో న్యాయస్థానాన్ని చేపల మార్కెట్గా మార్చకండి. మీరు వాదించేది చాలా సున్నితమైన అంశం. ఒక న్యాయమూర్తి మృతికి సంబంధించిన కేసు. ఇక్కడ మాజీ న్యాయమూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. కనీసం వారికైనా గౌరవం ఇచ్చి కోర్టు హాలులో కాస్త పద్ధతిగా మెలగండి’’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ కార్వాన్ మాగ్జైన్(లోయా సోదరి అనురాధా బియానీ ఇచ్చిన ఇంటర్వ్యూ), ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాల ఆధారంగా ‘బీహెచ్ లోనే’ అనే జర్నలిస్ట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోనే తరపున అడ్వొకేట్ పల్లవ్ సిసోడియా.. ముంబై లాయర్స్ అసోషియన్ తరపున దుష్యంత్ దవే వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయమూర్తులు దూషించుకున్నారు. లోయా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే స్వతంత్ర్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిసోడియా వాదించారు. దీనికి స్పందిన దవే.. గతంలో ఇదే అంశంపై బాంబే హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సిసోడియా ‘నువ్వు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు’’ అంటూ దవేను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. దవే కూడా మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించాల్సి వచ్చింది. అయినప్పటికీ దవే వెనక్కి తగ్గకపోవటంతో సున్నితంగా వారించిన న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
కలెక్టర్కు కోపమొచ్చింది..!
సాక్షి ప్రతినిధి, కడప: ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం ధర్నాలు చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. ఏదైనా ప్రభుత్వ పథకం పక్కాగా అమలుకాకపోతే అధికారులపై చిందులు వేసే ఉన్నతాధికారులను చూశాం.. కానీ, జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఓడీఎఫ్ పథకం 100శాతం అమలు కోసం వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న గ్రామాల్లో ధర్నా చేపడతానని ప్రకటించడం విశేషం. నిర్దేశిత సమయానికి లక్ష్యం పూర్తి చేయలేకపోయినా అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తికాని గ్రామాల్లో తానే స్వయంగా ధర్నా చేపట్టి.. ఆ పరిస్థితికి కారణమైన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో హడలిపోయిన అధికారులందరూ పల్లెబాట పట్టారు. మరో వారంరోజులే గడువు.. జిల్లాను ఓడీఎఫ్(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ)గా చేయాల్సిన గడువు మరో వారంరోజులతో ముగియనుంది. జనవరి నెలాఖరుకే జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా(ఓడీఎఫ్) చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇదేలక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తొలుత డిసెంబర్ నెలాఖరులోగా లక్ష్యాలను పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ తర్వా త గడువును జనవరి చివరివరకు పెంచింది. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అన్ని ముఖ్యశాఖల అధికారులకు మరుగుదొడ్ల పనిలో నిమగ్నమయ్యారు. అయితే, పనుల పురోగతిని పరిశీలిస్తే మరో 2నెలలు సమయమిచ్చినా ఓడీఎఫ్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 23 మండలాల్లో పూర్తికాని పనులు స్వచ్ఛభారత్లో భాగంగా జిల్లాలోని 50మండలాల్లో మొత్తం 3,40,823 మరుగుదొడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటివరకు 2,51,431 పూర్తిచేశారు. మిగిలిన 89,392లో 83వేల వరకు వివిధ దశలో పనులు జరుగుతున్నాయి. 9వేల పైచిలుకు మాత్రం ఇప్పటివరకు నిర్మాణానికి నోచుకోలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 23 మండలాల్లో జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత పనులు చేపట్టి పూర్తయిన కొన్ని మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో చాలాచోట్ల మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ముద్దనూరులో 50శాతం లోపే.. సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ముద్దనూరు మండలంలో 50శాతం మరుగుదొడ్లను కూడా పూర్తి చేయలేదు. ఈ మండలంలో మొత్తం 3,095 నిర్మించాల్సి ఉండగా, 1,505 మాత్రమే పూర్తిచేశారు. పులివెందుల మండలంలోనూ 1,258 మరుగుదొడ్లను లక్ష్యంగా ఇచ్చారు. ఇప్పటివరకూ 655 మాత్రమే పూర్తిచేయగలిగారు. మిగిలిన వాటిలో కొన్నిచోట్ల ఇంకా పనులు ప్రారంభమే కాలేదు. అదేవిధంగా వల్లూరు మండలంలో మొత్తం 2,855 మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 1,443 మాత్రమే పూర్తి చేశారు. కలెక్టర్ హెచ్చరికతో ఉరుకులు పరుగులు ఓడీఎఫ్ పథకం అమలులో అధికారులు విఫలమయ్యారంటూ సోమవారం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు హడలిపోయారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. పైగా 23 మండలాల్లో పనితీరు సరిగలేకపోవడంపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన అధికారులు నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 27న మాస్ గ్రౌండింగ్ లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించడంతో పనులు వేగవంతానికి అధికారులు కృషిచేస్తున్నారు. -
ట్రంప్ పిలిస్తేనే వెళతారా? కలెక్టర్ పిలిస్తే రారా..
ఆయన ముఖం ప్రశాంతతకు చిహ్నం. పెదవిపై చిరునవ్వు... ఏ విషయాన్నైనా సావధానంగా వినడం... వాటికి సున్నితంగా సమాధానం చెప్పడం... ఇష్టం లేకుంటే ముభావంగా ఉండటం... ఇదీ నిత్యం మనం చూసే మన జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ విధానం. అంతటి శాంతస్వభావుడు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. ముఖం ఎర్రగా మారిపోయింది. తూటాల్లాంటి మాటలతో చెలరేగిపోయారు. టాప్ లేచిపోతుందా అన్నట్లు కేకలు వేశారు. ఏం చేస్తారోనన్న భయం కలిగించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశం ఇందుకు వేదికైంది. విజయనగరం గంటస్తంభం: ‘జిల్లాలో కలెక్టరు ఎందుకున్నారు? కలెక్టరుకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? జిల్లా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్గారు పిలిస్తేనే వెళతారా? కలెక్టర్ పిలిస్తే రారా... మనిషికి స్వర్గం, నరకం ఉంటాయంటారు... నాకు నరకం చూపిస్తున్నారు... ప్రిపేర్ కాకుండా సమావేశానికి వచ్చేశారు? ఇది సమావేశం అనుకుంటున్నారా? ఆటలు పాటలు కార్యక్రమం అనుకుంటున్నారా?’ అంటూ కలెక్టర్ వివేక్యాదవ్ ఆగ్రహం తో ఊగిపోయారు. అధికారుల నిర్లిప్తతపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణుమనాయుడు ఆధ్వర్యంలో శాసనమండలి హామీల కమిటీ జిల్లాలో సోమవారం పర్యటించింది. సభలో ఇచ్చిన హామీల అమలుపై కమిటీ సమీక్షించనుంది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇచ్చిన 33 హామీల గురించి సమీక్షించేందుకు సంబంధిత అధికారులతో ముందుగా కలెక్టర్ సమావేశమయ్యారు. అధికారుల వైఖరి ఆయన్ను తీవ్రంగా బాధించింది. అంతే వారి వైఫల్యాలపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. విద్యాశాఖలో ఉ పాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగిన చర్చలో డిప్యూటీ డీఈవోను జిల్లాలో డీఎస్సీలో భర్తీ చేస్తున్న పోస్టులపై ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం మొదలైంది. సమాచారం లేకుండా ఎలా వచ్చారని, తెలియనపుడు సూపరింటెడెంట్ను తీసుకుని రావాల్సిందని మండిపడ్డారు. తర్వాత అదనపు తరగతి గదుల నిర్మాణం విషయంలో ఎస్ఎస్ఏ పీవో లక్ష్మణరావుపై విరుచుకుపడ్డారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు తెలియకుండా జెడ్పీ సమావేశంలో తెలియజేయడంపై మండిపడ్డారు. కలెక్టర్కు తెలియకుండా ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. ఆ సమాచారం తాను సమాచార హక్కు చట్టంలో తెలుసుకోవాలా? అంటూ నిప్పులు చెరిగారు. మత్స్యకారులకు జెట్టీల ఏర్పాటు విషయాన్ని మత్స్యశాఖ డీడీని ప్రశ్నించగా ఆయన మంత్రి ప్రతిపాదనలు పంపారనడంతో ఆశ్చర్యపోతూ మంత్రి ప్రతిపాదనలు చేస్తారా? పాలన గురించి తెలుసుకోండి... ఇలా ఎలా ఉద్యోగం చేస్తున్నారంటూ చిర్రెత్తిపోయారు. జలవనరులశాఖ ఎస్ఈపై ఫైర్ నీరుచెట్టు బిల్లుల పెండింగ్ ఎంత ఉందో తెలియని బొ బ్బిలి జలవనరులశాఖ ఎస్ఈపై కేకలు వేశారు. తెలి యకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. అందరూ మోసం చేయడానికి ఇక్కడకు వ చ్చారంటూ నిట్టూర్చారు. ఎస్సీ కుల «ధ్రువీకరణ పత్రాలపై కేసుల విషయంలో డీఆర్వో రాజ్కుమార్ను సై తం గట్టిగా ప్రశ్నించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి పెండింగ్ లేవంటూ ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ చెప్పడంతో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘అంతా సక్రమంగా ఉంది... అధికారులు పని చేయడం లేదు... మీరు నిద్రపోతున్నారు... అంతే’ అన్నారు. పీఐఏ ఈఈ సమావేశానికి రాకపోవడంపై మండిపడుతూ ‘కలెక్టరు పిలిస్తే రారా, మీరేమైనా రాష్ట్రపతి అనుకుంటున్నారా? ట్రంప్గారు పిలిస్తే వెళతారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? వక్స్ బోర్డు భూములకు రక్షణపై మైనార్టీ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నీ వయస్సు ఎంత? ఎంత సర్వీసు ఉంది అంటూ ప్రశ్నించారు. సర్వీసంతా ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? అని మండిపడ్డారు. ట్రైబుల్ వెల్ఫేర్ ఎస్డీసీ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ఇతర అధికారులపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా సుఖంగా ఉండాలి. శరీరం అలిసిపోకూడదు... కలెక్టరు మాత్రం పని చేయాలి. మాకు విజయవాడలో కూర్చోబెట్టి క్లాస్ పీకారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి రాని ఎక్సైజ్ సూరెండెంట్, మైనార్టీ ఏడీ, ఆర్అండ్బి ఈఈ, పీఐఏలకు నోటీసులు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు. అనుమతి లేకుండా వెళ్లిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. ఈఎస్ ఏమయ్యారు? హామీల అమల్లో ఎక్కువ అంశాలున్న ఎక్సైజ్ అధికారులపైనా మండిపడ్డారు. యారక్ ఆపేయడంతో కుటుంబా లకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్కు ప్రతిపాదిస్తూ చేతులు దులుపుకోవడంతో లబ్ధిదారులను ఎవరు గుర్తిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. ఆయా కుటుంబాల గురించి సహాయ ఈఎస్ శంభు ప్రసాద్ చెప్పలేకపోవడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్కడని ప్రశ్నించారు. కమిషనరు సమావేశానికి విజయవాడ వెళ్లారని చెప్పడంతో ఎవరిని అడిగి వెళ్లారని మండిపడ్డారు. కలెక్టరును అడగాలా? వద్దా? అంటూ నిలదీశారు. ‘శంభుప్రసాద్గారు... మీరే చెప్పం డి... కలెక్టరు జిల్లాలో ఎందుకు?’ అని ప్రశ్నించారు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్లో మానిటరింగ్ కమిటీల గురించి కోఅర్డనేటర్ చంద్రావతితో మాట్లాడుతూ ఎన్నిసార్లు సమావేశాలు పెట్టారని ప్రశ్నించగా సమావేశాలు పెట్టలేదని అనగానే అంతకుముందు ఇచ్చిన నోట్లో కలెక్టర్ పెట్టాలని సూచిస్తూ రాయడంపై మండిపడ్డారు. వేలాది కమిటీలు జిల్లాలో ఉన్నాయని, అన్నీ తాను పెట్టాలంటే తన పదవీకాలం చాలదని, మీరు దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత లేదా? అని ఊగిపోయారు. -
'నేనేమన్నా ఇండియాకు అమ్మేశానా?'
ఇస్లామాబాద్ : తన మూడో పెళ్లి విషయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మీడియాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆయన మూడో పెళ్లి చేసుకున్నారంటూ అటు పాక్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై నిప్పులు చెరిగారు. ఈ దేశ(పాక్) రహస్యాలను తానేమన్నా భారత్కు అమ్మేశానా లేకుంటే.. ఈ దేశ (పాక్) సొమ్మునేమైనా దోచుకున్నానా. ఎందుకింతలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు' అంటూ మీడియాపై మండిపడ్డారు. తన ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను వివాహం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు దుమ్ములేచేలా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ కుటుంబీకులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఆ ప్రతిపాదన మాత్రం వచ్చిందని, ఇమ్రాన్ దానికి ఇంకా అంగీకారం తెలపలేదని, కుటుంబ సభ్యులతో, పిల్లలతో చర్చిస్తున్నారని కూడా తెలిపారు. అయినప్పటికీ ఆయన పెళ్లి విషయంపై మీడియా పదేపదే ఆయనను వెంటాడుతుండటంతో ఇమ్రాన్ చిర్రెత్తిపోయారు. ఇదంతా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రైవేట్ మీడియా చేస్తున్న కుట్ర అని అన్నారు. గత కొన్నాళ్లుగా వారు ఇదే పనిపెట్టుకున్నారని దుయ్యబట్టారు. అయినా తానేం భయపడబోనని చెప్పారు. 'షరీఫ్ నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారి నీచమైన జీవితాలేమిటో కూడా నాకు బాగా తెలుసు. కానీ, అలాంటివేవి కూడా వారిలాగా నేను దిగజారి ఆరోపించను.. ప్రచారం చేయను' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. -
చింతమనేని మరోసారి తిట్ల దండకం
-
‘రేయాన్స్’పై మంత్రుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలో (బిల్ట్– బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) పని చేస్తున్న కార్మికుల పట్ల కంపెనీ యాజ మాన్యం నిర్లక్ష్య ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈనెల 9వ తేదీలోపు సంక్రాంతి పండుగ కోసం ఒక నెల జీతం చెల్లించాలని కంపెనీ ప్రతినిధికి డెడ్లైన్ విధించారు. 10వ తేదీన సచివాలయంలో జరిగే సమావేశానికి కంపెనీ సీఈవో హాజరు కావాలని ఆదేశిం చారు. ఈ రెండింటిలో దేనిలో విఫలమైనా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చ డం లేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ మంత్రులను ఆశ్రయించడంతో వారి ఆధ్వర్యంలో మంగళవారం సచివాల యంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారి గోడు వెల్లడించారు. దీనిపై కడియం, నాయిని, చందూలాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడితే కార్మికులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్, కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్నూ అంగీకరిం చారన్నారు. త్వరలోనే కంపెనీ ప్రారం భిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటివరకు ఆ విషయం పట్టించు కోకపోవడం సీరియస్గా పరిగణిస్తున్నా మన్నారు. తీరు మార్చుకోకపోతే చట్టప రంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకా లంలో చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో కార్మికశాఖ కమి షనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమి షనర్ భాగ్యనాయక్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, బిల్ట్ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవరెడ్డి పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకం భూసర్వేపై రైతులు ఆగ్రహం
-
తెల్లగా ఉన్నావని పొగరా?
...తమన్నాను ట్విట్టర్లో ప్రశ్నించాడో నెటిజన్. ప్రేమాభిమానాలు, పొగడ్తలతో పాటు అప్పుడప్పుడూ తిట్లు, ఛీత్కారాలూ వస్తుంటాయి ట్విట్టర్ వంటి సోషల్ మీడియా పోర్టల్స్లో! కొందరు నెటిజన్ల పట్ల ఘాటుగా స్పందిస్తారు. మరికొందరు కూల్గా జవాబిస్తారు. తమన్నా రెండో కేటగిరిలోకి వస్తారు. ‘తెల్లగా ఉన్నావని పొగరా? నాకు రిప్లై ఇవ్వడం లేదు?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తికి కూల్గా రిప్లై ఇచ్చారు. ‘అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అన్నారు తమన్నా. మొన్నీ మధ్య ట్విట్టర్లో ఫ్యాన్స్తో కాసేపు సరదాగా చాట్ చేశారీ బ్యూటీ. ఆమెకు డ్రీమ్ రోల్ ఏదో కూడా చెప్పారు. ‘‘సిన్మాలు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను. డ్యాన్స్ బ్యాక్డ్రాప్లో రూపొందే సిన్మాలో నటించాలనేది నా డ్రీమ్’’ అని పేర్కొన్నారు తమన్నా. -
అబద్ధాల చిట్టాతో ఢిల్లీలో తిరుగుతున్నారు
జేఏసీ చైర్మన్ కోదండరాంపై ఎమ్మెల్సీ కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఢిల్లీలో అబద్ధాల చిట్టా పట్టుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో కోదండరాం అబద్ధాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,45,000 కోట్లు అప్పులు తెచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్కు తెలియదా అని ప్రశ్నించారు. -
రోడ్షోలో గ్రామస్తులపై బాబు అసహనం
-
స్వీటీకి...కోపం వచ్చిందా?
స్వీట్ స్వీట్గా క్యూట్ క్యూట్గా మాట్లాడే స్వీటీ.. అదేనండి అనుష్కకు కోపం వచ్చినట్లుంది. అందుకే ‘ఇలాంటి వార్తలు రిపీట్ అయితే సహించేది లేదు’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ప్రభాష్–అనుష్కా జోడి సిల్వర్ స్క్రీన్పై సూపర్ హిట్. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలతో ప్రభాస్– అనుష్కా హిట్ పెయిర్గా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే గాసిప్ రాయుళ్లు ఆఫ్ స్క్రీన్లో ఈ ఇద్దరికీ ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఎప్పటికీ ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడవని అనుష్క అనుకున్నారేమో. ‘‘అనవసరమైన కథలు సృష్టించవద్దు. ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడను’ అని అనుష్క పేర్కొన్నారు. ఈ మాటలను బట్టి కూల్ గాళ్ అనుష్కకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సంగతలా ఉంచితే.. ఈ మధ్య అనుష్క భక్తి బాట పట్టారనిపిస్తోంది. ఆ విషయంలోకి వస్తే... కేరళలో పూజలు... ఇటీవల మహాలింగేశ్వర దేవాలయంలో పూజలు చేసిన అనుష్క తాజాగా కేరళలోని కొల్లూరులో గల మూకాంబిక దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ‘భాగమతి’ సినిమాలో తనకు కో–స్టార్గా చేస్తోన్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తన కుటుంబ సభ్యులతో కలసి అనుష్క కేరళ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఉన్ని ముకుందన్ స్నేహితుడి ఆయుర్వేద షాపులో కొన్ని ఫేస్ప్యాక్స్ కొన్నారట. -
ఇంత జాప్యమా?
ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంలో ఆలస్యంపై తుమ్మల అసహనం సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొత్త క్వా ర్టర్లను సకాలంలో నిర్మించకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భవన సముదాయాన్ని తనిఖీ చేశారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేసి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్నా ఆచరణలో విఫ లమవడంతో రెండుసార్లు అధికారులు గడువు పొడగించారు. చివర కు మే 31 నాటికి పూర్తి చేసి అప్పగిం చాల్సిందిగా చెప్పారు. కానీ అప్పటిలోగా పూర్తయ్యే అవకాశం లేకపోవటాన్ని తుమ్మ ల గుర్తించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈపాటికే భవన సముదాయాన్ని సిద్ధం చేసి అప్పగిస్తామని స్పీకర్కు హామీ ఇచ్చా మని, మూడోసారి గడువు పొడగించినా అప్ప ట్లోగా పూర్తి చేయలేని దుస్థితి నెల కొందని, ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థపై ఎందుకు చర్య తీసుకోవటం లేదని నిలదీశారు. -
సింగపూర్ కంపెనీలకు మా భూములెలా ఇస్తారు?
-
కలెక్టర్కు కోపం వచ్చింది
► వీడియో కాన్ఫరెన్స్లో నవ్వారని తహసీల్దార్, ఎంపీడీవోపై తీవ్ర ఆగ్రహం ► బందరు తహసీల్దార్కు జుడీషియల్ పవర్ కట్ ► ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశం విజయవాడ: కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతానికి కోపం వచ్చింది. తాను సీరియస్గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా సిల్లీగా నవ్వుకుంటున్న తహసీల్దార్, ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం చెందారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. కలెక్టర్ లక్ష్మీకాంతం విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో 50 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు. ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఎన్టీఆర్ జలసిరి పథకంపై కలెక్టర్ సీరియస్గా మాట్లాడుతుండగా మచిలీపట్నం తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో సూర్యనారాయణ నవ్వుకుంటున్నారు. మచిలీపట్నం జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన వారిద్దరు నవ్వుకోవటాన్ని స్క్రీన్లో చూసిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు వారిద్దరని ఏడెనిమిది నిముషాల పాటు గమనించి కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ యాక్టు ప్రకారం మీ ఇద్దరిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రకటించారు. ఈ క్రమంలో మచిలీపట్నం తహసీల్దార్ నారదముని నిలబెట్టి కలెక్టర్ చివాట్లు వేశారు. తహసీల్దార్ మేజిస్టీరియల్ పవర్స్ రద్దు చేయమని మచిలీపట్నం ఆర్డీవో సాయిబాబును ఆదేశించారు. నేటి నుంచి అధికారాలు లేని తహసీల్దార్గా పని చేయమని కలెక్టర్ తహసీల్దార్తో అన్నారు. అదే విధంగా మచిలీపట్నం ఎంపీడీవో సూర్యనారాయణను నుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఎందుకు నవ్వుతున్నారు తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటికి వెళ్లండి అంటూ కోపంగా చెప్పారు. అంతటితో ఆగకుండా జెడ్పీ సీఈవో సత్యనారాయణకు ఫోన్ చేసి ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు జారీ చేయమని ఆదేశించారు. జిల్లా అధికారులు, 50 మండలాల్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అధికారులు, ఉన్నతాధికారులు ఈ సంఘటనతో కంగుతిన్నారు. లక్ష్యాలు సాధించకుంటే చర్యలు.. నీరు ప్రగతి నిర్వహణ సక్రమంగా లేదని పలువురు స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలపై కలెక్టర్ లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ నుంచి నీరు–ప్రగతి కార్యక్రమంపై జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీరు–ప్రగతిలో పనుల చేపట్టాలని వారం రోజులుగా అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ కొన్ని మండలాల్లో నేటికి పనులు ప్రారంభించకపోవటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, ఉంగుటూరు, ఘం టసాల మండలాల్లో పనులు ప్రారంభించకపోవటంపై సంబంధిత ఎంపీడీవోలను వివరణ కోరుతూ త్వరలో ఆయా మండలాల్లో తనిఖీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా పంటకుంటల తవ్వకాల్లో ముందంజలో ఉన్న మైలవరం, తిరువూరు, కంచికచర్ల మండలాలు అధికారులను అభినందించారు. రానున్న మూడు రోజుల్లో జిల్లాలో వంద నుంచి 120 వరకు తప్పనిసరిగా పంట గుంతలు తవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విదంగా వర్మీ కంపోస్టు కేంద్రాలను జిల్లాలో 15 వేలు పూర్తి చేయాల్సి ఉం డగా నేటి వరకు కేవలం 500 వరకు మాత్రమే చేయడంపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు. జీరోలో ఉన్న పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, నాగాయలంక అధికారులను మందలించారు. పనుల నిర్వహణలో లక్ష్యాలు సాధించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పెండింగు సమస్యలు పరిష్కారంలో రెవెన్యూ శాఖ వెనకబడి ఉన్నదని తక్షణం దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
కృష్ణానది ఫెన్సింగ్పై గంగ పుత్రుల ఆగ్రహం
-
పసుపు రైతుకు ని‘బంధనాలా’?
కడప అగ్రికల్చర్ : పసుపు కొనుగోలుకు శ్రీకారం చుట్టామని గొప్పలు చెప్పుకుని ఇటు రైతుల్లో అటు ప్రజల్లో పరపతి సంపాదించడానికి ప్రభుత్వం పన్నాగం పన్నిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు పెట్టి రైతు నడ్డివిరిచేందుకు ప్రభుత్వం పూనుకుందని రైతుసంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. సోమవారం నుంచి కడప మార్కెట్ యార్డులో జిల్లాలోని రైతుల నుంచి మార్క్ఫెడ్ సంస్థ ద్వారా పసుపును కొనుగోలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన విధించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని చెన్నూరు, ఖాజీపేట, చాపాడు, మైదుకూరు, దువ్వూరు మండలాల నుంచి పసుపు తీసుకువచ్చిన రైతులు కడప మార్కెటింగ్శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిన్న, సన్నకారు రైతుల వద్ద ఉన్న పసుపంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిబందనలు లేవన్నారు. ఇప్పుడు మార్కెట్యార్డుకు తీసుకువచ్చినందుకు బాడుగ, మళ్లీ ఇంటికి తీసుకుపోవడానికి బాడుగ, ఇంటి వద్ద పసుపు కొమ్ములను ఏరించి, గ్రేడింగ్ చేయాలంటే అదనపు భారం పడుతుందని, మరి ఈ ఖర్చులు ఎవరిస్తారని అధికారులను నిలదీశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులను నట్టేట ముంచుతూ నిబంధనలను రుద్దుతోందని ధ్వజమెత్తారు. సాధారణంగా ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు ప్రాథమికంగా 2, 2 1/2 హెక్టారు భూమి ఉన్న రైతులందరికీ సబ్సిడీలను ఇచ్చే నిబంధన పెట్టారు. మరి అలాంటప్పుడు రెండు, రెండున్నర హెక్టార్ల పొలంలో పండిన పసుపు కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని మార్కెటింగ్శాఖ, మార్క్ఫెడ్ అధికారులను రైతులు నిలదీశారు. పసుపు ఉడికించిన తర్వాత ఎండబెట్టి బాగా రుద్ది, శుద్ధి చేసి మార్కెట్యార్డుకు తీసుకువచ్చినా ఏదో ఒక వంకపెట్టి కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు. ఏదో నాలుగు రోజులు కేంద్రం నిర్వహించి చేతులెత్తేయడానికి పూనుకున్నట్లు ప్రభుత్వ తీరును బట్టి అర్థమవుతోందని రైతులన్నారు. మార్క్ఫెడ్ సంస్థ సీనియర్ మేనేజర్ సంజీవరెడ్డి నాణ్యతను చూడకుండానే కొన్ని కుప్పలు మాత్రమే బాగున్నాయని, మరికొన్ని బాగాలేవని రగడకు దిగారని రైతు సంఘం నాయకుడు నారాయణ ఆరోపించారు. ఎంతో శ్రమించి, వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి రైతులు పసుపును తీసుకువస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద, గౌరవం అంటూ వాదనకు దిగారు. రైతు పండించిన పంటలో కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పంటను ఎవరు కొంటారని ప్రశ్నించారు. అసలే అప్పుల భారంతో సతమతమయ్యే తమకు ధైర్యం చెప్పి, సాయమందించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. అందుకు మార్కెటింగ్శాఖ రాయలసీమ రీజియన్ జేడీ సుధాకర్ స్పందిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని, రాతపూర్వకంగా వినతిపత్రం ఇస్తే దాన్ని కూడా మంత్రులకు, మార్కెటింగ్, ఉద్యాన, వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్యాక్స్ మెసేజ్ ఇస్తామన్నారు. మాయమాటలు చెబుతున్న మంత్రులు రైతులకు ఏ సాయం చేయాలన్నా టీడీపీ ప్రభుత్వమేనంటూ అటు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మార్కెటింగ్శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో గొప్పలు చెప్పారని రైతుసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ పసుపు కొనుగోలులోనే ప్రభుత్వ బండారం బయటపడిందని విమర్శిస్తున్నారు. కనీసం ఐదు ఎకరాల్లో పండించిన పసుపును కొనుగోలు చేస్తామని చెప్పి ఉంటే ఎంతో బాగుండేదని, అలాకాకుండా కేవలం 30 క్వింటాళ్లకే పరిమితం చేస్తే మిగతా పసుపు తక్కువ ధరకు అమ్ముకోవాలా?అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పంటసాగుకు రూ.లక్షలు ఖర్చైంది నేను ఎకరంలో పంటసాగు చేయగా పెట్టుబడి రూ.లక్షలు అయింది. మార్కెట్ ధర చూస్తే ఘోరంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలుకు నిబంధనలు పెట్టింది. రైతు పండించిన పంటకు నిబంధనలు పెడతారు. కానీ ప్రభుత్వం ఇచ్చే విత్తనాలకు మాత్రం నిబంధనలు ఉండవు. ధరలు మాత్రం గూబగుయ్యిమనిపిస్తారు. నా పంట దిగుబడి 40 క్వింటాళ్లు వచ్చింది, 30 క్వింటాళ్లు కొంటే మిగతా 10 క్వింటాళ్లు ఎవరు కొంటారు? ఎక్కడ అమ్ముకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. –సుబ్బారెడ్డి, పసుపు రైతు ఇంత అధ్వాన ధరతో కొనుగోలు చేస్తారా? పసుపు పంట పండించిన రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అధ్వానంగా ఉంది. ఈ ధర రైతుకు ఏ మాత్రం గిట్టుబాటు కాదు. అయినా రైతు వచ్చిన కాడికి గోవిందా అంటూ తక్కువ ధరకు విక్రయించడానికి పూనుకున్నా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తూ ప్రతి రైతు నుంచి 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సమంజసంగా లేదు. నిబంధనలు ఎత్తివేయాలి. –నారాయణ, రైతు సంఘం నాయకుడు, మైదుకూరు -
సొంత లాభం కోసం జనాల్ని గాలికొదిలేశారు
-
అభివృద్ధి పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
-
ఎమ్మెల్యే చెప్పిన అభివృద్ది ఏదీ ? ఎక్కడా ?
-
ప్రభుత్వ వైఫల్యంపై మామిడి రైతుల ఆగ్రహం
-
సొంత లాభాల కోసమే ప్రజలకు వెన్నుపోటు
-
బాధ్యత లేకుండా పనిచేస్తే చర్యలు
వైద్య సిబ్బందికి కలెక్టరు అరుణ్కుమార్ హెచ్చరిక కోరుకొండ (రాజానగరం) : జిల్లాలోని కొన్ని ప్రభుత్వాస్పత్రులలో వైద్య సిబ్బంది బాధ్యత రహితంగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టరు హెచ్.అరుణ్కుమార్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి అవరణలో శనివారం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 128 ప్రభుత్వాస్పత్రులలో 40 పీహెచ్సీలలో సిబ్బంది సక్రమంగా బాధ్యతలు చేపట్టడం లేదని, కొన్నింటిలో ఓపీ సక్రమంగా ఉండడం లేదన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టంచేశారు. ఏఎ¯ŒSఎంలు, అంగ¯ŒSవాడీ టీచర్లు పనిచేసే చోటే మకాం ఉండాలన్నారు. జిల్లాలోని 128 మంది పీహెచ్సీల్లో 18 పీహెచ్సీలలో సిజేరిన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రాజమహేంద్రవరం డివిజ¯ŒS జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచిందని అన్నారు. రాజమహేంద్రవరం సబ్కలెక్టర్ ఎ¯ŒS.విజయ్కృష్ణ¯ŒS మాట్లాడుతూ ఆస్పత్రి, పాఠశాలల వద్ద మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ ఆదివారం కూడా ఆస్పత్రులలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డాక్టర్, సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు. తొలుత హెచ్పీసీఎల్ సంస్థ నిర్మించిన టాయ్లెట్ భవన సముదాయాన్ని, కోరుకొండ, రాజానగరం, సీతానగరం, గోకవరం మండలాలకు స్వచ్ఛభారత్లో చెత్త తరలింపు రిక్షాలను కలెక్టర్ ప్రారంభించారు. ఆస్పత్రుల్లో మొక్కలను నాటి న్యూట్రీ గార్డె¯ŒS ఏర్పాటుకు విత్తనాలు జల్లారు. ఆస్పత్రులలో గర్భిణులకు సిజరీ¯ŒS చేసే సముదాయాన్ని ప్రారంభించారు. హెచ్పీసీఎల్ సీనియర్ మేనేజర్ దామోదర్, డీఎంహెచ్ఓ ఎం, చంద్రయ్య, రాజమహేంద్రవరం మార్కెట్ యార్డు చైర్మ¯ŒS తనకాల నాగేశ్వరరావు, కోరుకొండ పీహెచ్సీ అభివృధ్ధి కమిటీ చైర్మ¯ŒS మాతా సీతారాముడు, ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
గోరంత రాజు... కొండంత కోపం
చరిత్ర అడక్కు...చెప్పిందే వినాలి ఇదీ చంద్రవంశ పాలనా తీరు (లక్కింశెట్టి శ్రీనివాసరావు) రాజరాజనరేంద్రుడు, కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు, ఇతర నరపతులు ఏలిన రాజ్యమది. వేదంలా ఘోషించే గోదావరి గీతంలో ఈ విషయాన్ని ఆరుద్ర కూడా ప్రస్తావించారు. వాస్తవానికి తూర్పు చాళుక్యులు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు సమీపాన వేంగిపురం (ప్రస్తుతం పెదవేగి)రాజధానిగా చేసుకుని పాలించేవారు. అంతర్గత కలహాల కారణంగా వాళ్ల వంశీకుడైన అమ్మరాజు విష్ణువర్థనుడు 921–927 మధ్య రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి పాలన సాగించాడు. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజుల కాలం ముగిశాక డచ్, ఫ్రెంచి, ఆంగ్లేయులు పాలిస్తూ వచ్చారు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరంలో రెండు దశాబ్దాలపాటు గోరంత రాజు అనే సామంతుడి పాలన సాగింది. గుంటూ రు ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించిన ‘గోరం’త సామంత రాజుకు కాస్త గోరోజనం ఎక్కువే. హస్తిన రాజకీయాల్లో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఆ సామంత రాజు చారిత్రక రాజ్యాన్ని విడిచిపెట్టి పొరుగు రాజ్యానికి వలసపోయి మూడేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. బొడ్డుకూడా ఊడని పుత్రరత్నానికి సరిపోనా...! మంగళగిరి రాజధానిగా పాలన సాగిస్తున్న ‘చంద్ర’వంశ చక్రవర్తికి మూడేళ్లుగా గోరంత రాజు (సామంతరాజు) అడుగులకు మడుగులొత్తిన వాడే. అటువంటి సామంతరాజుకు చంద్రవంశ చక్రవర్తిపై యుద్ధం ప్రకటించేటంతటి ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అదేదో తన రాజ్యంలో ప్రజల కోసం అనుకునేరు. అలా అనుకుంటే తçప్పులో కాలేసేస్తారు. కాస్త నిదానంగా ఆలోచిస్తే సామంత రాజు వైఖరిలో మార్పునకు కారణం ఇట్టే పసిగట్టేయొచ్చు. చంద్రవంశ చక్రవర్తి తన పుత్రరత్నాన్ని తన కొలువులో కూర్చోబెట్టాలని ఎంతో కాలంగా ఆరాటపడుతున్నాడు. తన తరువాత సింహాసనాన్ని అధిష్టించేది తన పుత్రరత్నమేనని చంద్రవశం చక్రవర్తి కలలుగంటున్నారు. రాజకీయాల్లో బొడ్డు కూడా ఊడని, రాజ్యపాలన అంటే ఏమిటో బొత్తిగా తెలియని ముద్దపప్పు లాంటి తనయుడికి కొలువులో చోటు ఇచ్చి తెలుగు రాజకీయాల్లో సిద్ధాంతకర్తయిన కాకలుదీరిన తననే పక్కనబెడతాడా అంటూ గోరంత రాజుకు ఎక్కడలేని కోపమొచ్చేసింది. చంద్రవంశ రాజుపై గుర్రు... చంద్రవంశ రాజు కొలువులో అతని పక్కన ఆశీనులవ్వాల్సిన మొదటి మంత్రిని తానేనని ఆ ‘గోరంత’రాజు భావన. ఇవేమీ చంద్రవంశ రాజుకు తెలియవా ఏమిటి. అందుకే ఆయన గోరంతరాజును కొలువుల సోదిలో కూడా లేకుండా చేసేశారు. కానీ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాన్ని సుసంపన్నం చేసిన పేదలు, రైతుల పెన్నిధి, మహానేత రాజశేఖరుడి ఆశయాల వెంట నడిచేందుకు వచ్చి వ్యక్తిగత స్వార్థం, డబ్బు మూటలు, అధికార కాంక్ష కోసం చంద్రవంశ రాజ్యానికి ఫిరాయించిన 21 మందిలో నలుగురిని తన కొలువులోకి తీసుకున్నాడు. అందుకేనేమో గోరంత రాజుకు చంద్రవంశ రాజుపై ఎక్కడ లేని కోపం వచ్చేసింది. చంద్రవంశ రాజు, ఫిరాయింపుదారులతో ఏర్పడ్డ కొలువులపైనా సామంతరాజు గుంటూరు మిర్చిలా రెచ్చిపోయి నోటికొచి్చనట్టు తిట్టిపోశారు. చంద్రవంశ రాజునైతే వ్యక్తిగతంగా చీవాట్లు పెట్టడానికీ వెనుకాడ లేదు. అంతటి ధైర్యం, తెగువ మా సామంత రాజుకు ఎక్కడి నుంచి వచ్చాయా అని రాజ్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని వేగులు చంద్రవంశ రాజు చెవిలో వేశారు. తన కొలువులో తీసుకోవడానికి గోరంతరాజుకు అసలు అర్హతే లేదని చంద్రవంశ రాజు కొట్టిపారేశారు. రాజకీయ వ్యాపారం ఇప్పుడు గుర్తుకొచ్చిందా... కొలువు దక్కకపోయేసరికి ఫిరాయింపులన్నీ నీతి బాహ్యమైపోయాయి. రాజకీయాలన్నీ వ్యాపారమయమైపోయాయంటూ ఎక్కడ లేని నీతిసూత్రాలు వల్లెవేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నానని, ఇంతవరకు ఏమీ సంపాదించుకోలేదని ప్రకటించుకున్న ఆ సా మంత రాజు నిజ రూపం తెలిసిన ఆ రాజ్యం లో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడాది క్రితమే ఈ అనైతిక ఫిరాయింపులు నిండు సభలో కళ్లెదుటే జరిగినా స్పందించని ఈ రాజుకు ఇప్పుడు హఠాత్తుగా నీతివంతమైన రాజకీయాలు గుర్తుకు వచ్చాయా అని రాజ్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. హైదరాబాద్ రాజధానిగా ఏలుతున్న కల్వ గుంట్ల రాజ్యంలోకి ఫిరాయించిన వారిని కొలువులోకి తీసుకున్నప్పుడు ఈ రాజుకు రాజకీయాల్లో నీచం కనిపించలేదా అని అనుచరులే మనసులో ప్రశ్నించుకుంటున్నారు. ఏడాదికాలంగా చంద్రవంశంలో ఫిరాయింపులు జరుగుతున్నా ఎందుకు మౌనం వహించినట్టోనని ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. నోరుపారేసుకున్న విషయం వేగుల ద్వారా తెలుసుకున్న చంద్రవంశ రాజు గోరంతరాజుపై కత్తులు నూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పారేసుకున్న నోటిమాట వెనక్కు తీసుకుని సర్ధుకుపోయే ప్రయత్నం చేస్తారా? లేక రాజ్యాన్నే వదులుకుంటారో తేలాలంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు. -
ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు
విలేకర్ల సమావేశంలో ముద్రగడపై ఉప ముఖ్యమంత్రి నిప్పులు భానుగుడి (కాకినాడ) : ముఖ్యమంత్రిని అవినీతి పరుడంటూ ముద్రగడ విమర్శించడం పట్ల ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనస్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిదని, కాపులకోసం కమిష¯ŒS వేసిన ఘనత చంద్రబాబుదని, కాపు ఉద్యమం పేరిట రాజకీయాలు చేయడం ముద్రగడకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రశేఖర్ అనే అనుయాయునికి సర్వీస్ కమిష¯ŒS పదవి ఇవ్వాలని ఎంపీగా ఉన్నపుడు ముద్రగడ కోరారని, ఇపుడు నిజాయితీ పరునిగా కథలు అల్లుతున్నారన్నారు. ఇటీవల ఓ వ్యక్తి రాసిన పుస్తకం ద్వారా ముద్రగడ చరిత్ర ఎంత హీనమయిందో తెలుస్తుందన్నారు. -
ప్రజా ప్రభుత్వమా ? గూండా ప్రభుత్వమా ?
-
ఇదేమైనా జోక్ కోర్టా?
రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ: ‘ఇదేమైనా జోక్ కోర్టా లేక సుప్రీం కోర్టా? రాష్ట్రాలకు ఆసక్తి లేని పంచాయితీ ఏమైనా జరుగుతోందా ఇక్కడ? మీరు (రాష్ట్రాల న్యాయవాదులు) సుప్రీంకోర్టుతో ఎందుకిలా జోక్ చేస్తున్నారు? మీ ప్రధాన కార్యదర్శులను కోర్టుకు రప్పిస్తేగానీమీకు తెలిసిరాదు’అంటూ సుప్రీంకోర్టు రాష్ట్రాలపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని ప్రజాహిత వ్యాజ్యాలను విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం, బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో శుచి తదితర ప్రజా ప్రయోజనమున్న విషయాలపై పలు స్వచ్ఛంద సంస్థలు గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిపై వైఖరి తెలపాలని అప్పుడే కోర్టు కేంద్రం, 12 రాష్ట్రాలను ఆదేశించింది. తాజాగాసోమవారం ఈ వ్యాజ్యాలపై విచారణ కొనసాగించిన ధర్మాసనం రాష్ట్రాలు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయక పోవడంపై పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్,ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం ఉన్నాయి. -
గెటవుట్ ఫ్రం మైరూం
- టీజీవీ క్షేత్రం నిర్వాహకులను దూషించిన కలెక్టర్ – సునయనకు మార్చాలని ప్రయత్నం - ఎఫ్డీసీ జోక్యంతో మళ్లీ టీజీవీ కళాక్షేత్రమే ఖరారు కర్నూలు(అగ్రికల్చర్): నంది నాటకోత్సవ వేదికగా టీజీవీ కళాక్షేత్రాన్ని ముందే నిర్ణయించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీవీ కళా క్షేత్రం నిర్వాహకులను దూషించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి కర్నూలులో టీజీవీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే నందినాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీవో రఘుబాబు, టీజీవీ కళాక్షేత్ర నిర్వాహకులు నందినాటకోత్సవాల ఆహ్వాన పత్రిక గురించి చర్చించేందుకు కలెక్టర్ను కలిశారు. టీజీవీ కళాక్షేత్రంలో ఎందుకు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా.. టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకులు 2నెలల క్రితమే ఎఫ్డీసీ అధికారులు సునయన, టీజీవీ కళాక్షేత్రాలను పరిశీలించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలకు, కళాకారుల మేకప్ రూములకు టీజీవీ కళాక్షేత్రం అనుకూలంగా ఉందని నిర్ణయించారని చెప్పారు. కలెక్టర్ ఆగ్రహంతో టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకునితో హూ ఆర్యూ..! గెటవుట్ ఫ్రం మైరూం అంటూ దూషించారు. ఆర్డీఓ రఘుబాబును సునయనలోనే నాటకోత్సవాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. విషయం తెలుసుకున్న ఎన్ఎఫ్డీసీ అధికారులు మళ్లీ కర్నూలుకు వచ్చి సునయన టీజీవీ కళాక్షేత్రం సౌకర్యాలను పరిశీలించారు. కళాకారుల గ్రీన్రూమ్ సౌకర్యాలు తదితర ఏర్పాట్ల కోసం సునయనను ఇప్పుడున్న కాలపరిమితిలో తీర్చిదిద్దడం కష్టతరమని, కలెక్టర్ ఈ వేదికపై పట్టుపడితే నందినాటకోత్సవాలను వేరే జిల్లాకు మార్చాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో తిరిగి కలెక్టర్ టీజీవీ కళాక్షేత్రంలోనే నందినాటకోత్సవాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న నంది నాటక పోటీల కోసం టీజీవీ కళాక్షేత్రం ముస్తాబవుతోంది. -
ఎంపీ జేసీపై చంద్రబాబు గుర్రు
-
కాల్ తోంది
-
రైతుల కన్నెర్ర
– ఏడీబీ బ్యాంకు బారికేడ్లు ద్వంసం ఎమ్మిగనూరురూరల్: స్థానిక ఎస్బీఐ(ఏడీబీ) దగ్గర శుక్రవారం సాయంత్రం రైతులు అందోళనకు దిగారు. బ్యాంకులో డబ్బులు అయిపోయాయి ఉదయం రావాలని బ్యాంకు అధికారులు చెప్పటంతో ఉదయం నుంచి సహనంతో ఉన్న రైతులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. అందోళనగా వైఎస్ఆర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్లు అక్కడి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఉదయం నుంచి రూ. 2 వేలు ఇస్తున్నారు, ఇప్పుడు అది కూడ లేదంటే మేము ఎక్కడికి వెళ్లాలని చెప్పారు. మేము ఇప్పిస్తామని చెప్పటంతో అందోళన విరమించి బ్యాంకు దగ్గరకు పరుగులు తీశారు. బ్యాంక్ మేనేజర్తో సీఐ,ఎస్ఐలు మాట్లాడటంతో డబ్బులు అయిపోయాయని వారికి చెప్పటంతో ఎస్బీఐ మేనేజర్ ప్రసాద్తో మాట్లాడి బ్యాంకు బయట ఉన్నవారి కోసం రూ. 5 లక్షలు ఏడీబీకి ఇప్పించారు. ఎస్ఐ హరిప్రసాద్ దగ్గరుండి ఒక్కొక్కరకి రూ. 2 వేలు చొప్పున రైతులందరికి ఇప్పించారు. పూర్తి స్థాయిలో డబ్బులు వస్తే ఈ సమస్య ఉండదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
అద్వానీకెరుక
-
మరీ ఇంత కక్కుర్తా మీకు..?
* మహిళా పోలీసు స్టేషన్ని తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని * అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు గుంటూరు (పట్నంబజారు): ‘మరీ ఇంత కక్కుర్తి ఏంటీ మీకు...కష్టాల్లో ఉండి వచ్చిన వారిని వదిలి పెట్టరా..? పురుషుల దగ్గర డబ్బులు తీసుకుని కేసులు తారుమారు చేస్తారా...? ఆపదలో ఉన్న వారికి ఇదేనా మీరిచ్చే ధైర్యం.. జనం అనటం కాదు...నేను చెప్పినా..పట్టించుకోవటంలేదు మీరు...క్యారక్టర్ల గురించి అసభ్యకరంగా మాట్లాడారా..’ అంటూ ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా పోలీసుస్టేషన్లోని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం నన్నపనేని గుంటూరు నగరంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘ఇక్కడ జరుగుతున్న భాగోతమంతా కథలుగా చెప్పుకుంటున్నారని, అసలు ఏ మాత్రం దయా, జాలి లేకుండా వ్యవహరిస్తున్నారా.. ఆఖరికి నేను చెప్పిన కేసుల్లో కూడా న్యాయం చేయకపోవగా..డబ్బులు అడిగారంటా’ అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు... రాష్ట్రంలోని అన్ని మహిళా పోలీస్టేషన్లకు వెళ్లా..ఇంత ఘోరమైన పరిస్థితులు ఎక్కడా చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లో సిబ్బంది లేకపోవటం, కేవలం ఎస్ఐ నాగకుమారి మాత్రమే ఉండటాన్ని గమనించారు. రికార్డులను అడిగి తీసుకొని పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో ఏ ఒక్కరూ సరిగా పనిచేయటంలేదని నిప్పులు చెరిగారు. ఆఖరికి బెయిల్కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. స్టేషన్కు వచ్చిన వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నాని తెలిసిందన్నారు. అని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను హోంమంత్రి, డీజీపీల దగ్గరకు తీసుకెళ్తానన్నారు. కచ్చితంగా అవినీతి అధికారులను వదలిపెట్టే ప్రస్తకి లేదని తేల్చిచెప్పారు. నన్నపనేని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎస్ఐ నాగకుమారి నీళ్ళు నిములారు. అక్కడే ఉన్న బాధితులను ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడటం తప్పా..: నన్నపనేని పెద్దనోట్లు రద్దుతో సమస్యలు పడుతున్నారని ప్రజలు సమస్యల గురించి మాట్లాడితే బీజేపి నేతలు తనపై వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని నన్నపనేని వ్యాఖ్యానించారు. క్యూలైన్లులో నిలబడి ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్న క్రమంలో కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మంచినీటి వసతి కూడా ఏర్పాటు లేదు. దీనిపై ప్రశ్నిస్తే కొంత మంది మిత్రపక్షం నేతలకు ఎందుకు అంత ఆగ్రహమో అర్థం కావటం లేదన్నారు. -
డ్వాక్రా రుణమాఫీపై నిలదీత
* జనచైతన్య యాత్రలో మహిళల ఆందోళన * సమస్యలు తెలుకోకుండా మంత్రి యనమల వెళ్ళిపోయారని ఆగ్రహం గుంటూరు (నగరంపాలెం): డ్వాక్రా రుణాల మాఫీ కేవలం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైందేగానీ ఆచరణలో అమలుకావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు వడ్డీతో సహా రుణాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. రూ.25 వేలు రుణం తీసుకొని సీఎం చంద్రబాబు మాటలు నమ్మి ఒక నెల కిస్తీ చెల్లింపు ఆపినందుకు రూ.4500 వడ్డీ వసూలు చేశారని తెలిపారు. రెవెన్యూ మంత్రి జనచైతన్యయాత్రల్లో పాల్గొంటానికి వస్తున్నారని సమస్యలు చెప్పుకోవటానికి వస్తే ఆయన తన సమస్యలు ఏకరువు పెట్టి మా సమస్యలు తెలుసుకోకుండా వెళ్ళి పోయారని 47, 48 డివిజను మహిళలు ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. కట్టలు తెగిన ఆగ్రహం.... శనివారం ఉదయం 47,48 డివిజన్లలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి మద్ధాళి గిరి ఆధ్వర్యంలో వసంతరాయపురం ఓంకారం గుడి వద్ద జరిగిన జనచైతన్యయాత్ర, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు సభలో పాల్గొంటారని డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలను తీసుకొచ్చారు. బి ఫారమ్ సమస్యలు, పసుపుకుంకమ కింద రుణాలు మంజూరు చేస్తారనీ చెప్పి ఉదయం 8.00 గంటలకు మహిళను ఆర్పీల ద్వారా అక్కడకు చేర్చారు. సమావేశం దగ్గరకు 11.15కి వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఽఉపన్యసించి ఇద్దరకి సభ్యత్వ నమోదు కార్డులు అందించి 11.40కి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ వేచి ఉన్న మహిళలకు ఆగ్రహం కట్టలు తెంచుకొని నియోజకవర్గ ఇన్చార్జి మద్ధాళిగిరి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబును చుట్టిముట్టి ఒక్కసారిగా మండిపడ్డారు. మొదటి విడతే నిధులే రాలేదు... ఉదయం నుంచి పనులు మానుకొని వస్తే కనీసం మంత్రి తమ సమస్యలు తెలుసుకోకుండా వెళ్ళిపోవటం ఏమిటని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల రద్దుకి సంబంధించి రెండు విడతలు బ్యాంకులో జమ చేశామన్నారని, మాకు ఇప్పటికీ మెదటి విడత నిధులు కూడా రాలేదన్నారు. డివిజన్లలో జరిగే అభివృద్ధి పనుల నిర్మాణాలు సైతం నాణ్యత లేకుండా చేస్తున్నారని చెప్పారు. ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి వెళ్ళిపోవడమేమిటంటూ నిలదీశారు. -
టీఆర్ఎస్ సర్కారుపై TNSF ఆగ్రహం
-
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
మచిలీపట్నం (చిలకలపూడి) : ‘ఎన్నిసార్లు చెప్పినా మారరా?.. కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప కోట్ల రూపాయలు వెచ్చించి బందరు ప్రభుత్వాస్పత్రిలో నిర్మించిన కొత్త భవనాన్ని వినియోగంలోకి తీసుకురారా?’ అని ఇంజినీరింగ్ అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. తొలుత విద్య, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ గర్భిణుల కోసం ఆస్పత్రిలో నిర్మించిన భవనానికి త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికల కోసం ప్రత్యేక శానిటరీ ఏర్పాట్లకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్కు సంబంధించి విలువగల భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జిల్లా పరిషత్ స్థలంలో రూ.5 కోట్లతో కన్వెన్షన్ హాలు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జెడ్పీ ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ తోట్లవల్లూరు మండలంలో ఉపాధి నిధులతో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా పరిషత్ అతిథిగృహం కేటాయింపుపై సభ్యుల ఆవేదన విజయవాడలోని జిల్లా పరిషత్ అతిథిగృహం గదుల కేటాయింపులో జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వెళ్లినప్పుడు జెడ్పీటీసీ సభ్యులకు గదుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్కు చెందిన అతిథిగృహంలో ఇతర శాఖల అధికారులకు కేటాయించటంపై అసహనం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యులకే అతిథిగృహంలో గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ను కోరారు. అనంతరం వైస్చైర్మన్ శాయన పుష్పావతి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశం, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యులు దాసరి కరుణజ్యోతి అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో టి.దామోదరనాయుడు, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
నిర్వహణ ఇంత అధ్వానమా?
- అదోని మార్కెట్యార్డ్ అధికారులపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ ఆగ్రహం ఆదోని: స్థానిక మార్కెట్ యార్డు నిర్వహణ తీరుపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనరు మల్లికార్జున రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు రెండు గంటల పాటు యార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. యార్డులో స్టేట్ బ్యాంకు భవనం అభివృద్ది కోసం అధికారులు దాదాపు రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ మేరకు అభివృద్ధి కనిపించలేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనశాలలో కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయకుండా నారరాతి బండలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. రైతు విశ్రాంతి భవనం తాళాలు తన వద్ద లేవని చెప్పిన ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రామారావుపై కమిషనర్మండిపడ్డారు. రైతు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన క్లినిక్ను పరిశీలించి..పనివేళలు, క్లినిక్ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. యార్డులో పత్తి దొంగతనాలపై తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.8 లక్షలతో నిర్మించిన మురుగు కాలువ నాణ్యతపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఇలాగేనా చేసేది? అని యార్డు డీఈఈ రఘురామరెడ్డిపై ఆగ్రహం వ్యక్త చేశారు. రైతుల తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును పరిశీలించారు.తుప్పు పట్టిన కుళాయిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డులో పారిశుద్ద్యంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట యార్డు చైర్మన్ భాస్కర రెడ్డి, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, ఎస్సీ శ్రీనివాసులు, ఈఈ రాజశేఖర్, డైరెక్టర్లు ఉన్నారు. -
అన్యాయాన్ని నిలదీస్తే అరెస్టు చేస్తారా..?
* పీడీ యాక్టు కింద కేసులు పెడతారా! * సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు * వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజం పట్నంబజారు: సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే ... ప్రజా సమస్యలపై ఇదేమని ప్రశ్నిస్తే ... పీడీయాక్టులు పెడతాం... అరెస్టులు చేయిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరండల్పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పాలనను చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు అన్యాయమని మొరపెట్టుకుంటుంటే వారిపై, హోదా కోసం పోరాడుతున్న యువతపై పీడీయాక్ట్ పెట్టాలని చెప్పడం దారుణమన్నారు. వారేమైనా అసాంఘిక శక్తులా? రౌడీలా? గుండాలా? అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం నోరెత్తిన ప్రతి ఒక్కరినీ అణచి వేసే ధోరణ సరికాదన్నారు. విద్యార్థులు, రైతులు, యువతను సభలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన బెదిరేది లేదని, హోదా, రైతన్నల కోసం యువత, విద్యార్థులను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు ఇచ్చిన తీర్పుతో భూస్థాపితం అయిన పార్టీలు ఎన్నో చరిత్రలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు టీడీపీని మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, లక్కాకుల థామస్ నాయుడు, ఎం.డి.నసీర్ అహ్మద్ మాట్లాడారు. -
10 నెలలుగా బిల్లుల కోసం ఎదురుచూపులు
– ఆపదలో ఆదుకుంటే అన్యాయం చేస్తారా..? – మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన జేసీబీ నిర్వాహకుడు మదనపల్లె: ‘గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు, చెరువులు నిండిపోయాయి. ఆ సమయంలో వరద నీరు ఇళ్లలోకిరాకుండా దారి మళ్లించేందుకు జేసీబీతో పనులు చేశాను. రూ.2.75 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటున్నారు’ అని జేసీబీ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి వాపోయారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆత్మీయతా కార్యక్రమంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మధుసూదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఆలోచించకుండా రేయింబవళ్లు జేసీబీతో పనులు చేయించుకుని బిల్లుల మంజూరులో జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. 10 నెలలుగా వందలసార్లు మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదని వాపోయారు. అప్పటి కమిషనర్ మారిపోయారని, ఆ బిల్లులతో తనకు సంబంధం లేదని ప్రస్తుత కమిషనర్ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. తనకు బిల్లులు చెల్లించకపోతే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంపై సబ్కలెక్టర్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అనంతరం కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, మేనేజర్ రాంబాబు, డీఈ మహేష్, ఏఈ గోపీనాథ్, టీపీఎస్ కుముదిని తదితరులు పాల్గొన్నారు. -
బిగిసిన పిడికిళ్లు
-
ప్రాణం తీసిన లాఠీదెబ్బ
–విచక్షణ రహితంగా కొట్టిన సంజామల పోలీసులు –మనోవేదనతో బాధితుడు గుర్ర ప్ప మృతి – మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన – పచ్చనేతల సపోట్తోనే ఎస్ఐ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణ మండలంలో పోలీసుల అరాచకాలు మితిమీరాయి. అధికారపార్టీ నేతల అండతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా సంజామల ఎస్ఐ విజయభాస్కర్నాయుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విచక్షణ రహితంగా లాఠీతో కొట్టి ఒకరి ప్రాణం తీశారు. కానాల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసుల తీరుపై ప్రజల్లో నిరసన పెల్లుబికింది. సంజామల: కానాల గ్రామానికి చెందిన గుర్రప్ప (50)కు తిరుపాలు, శేఖర్ అన్నదమ్ములు. ఈ ఇద్దరి మధ్య పొలంలోని బోరు విషయంలో తగాదా నెలకొంది. ఇరువురికి సర్దుబాటు చేసే ప్రయత్నంలో గుర్రప్ప తన తమ్ముడు తిరుపాలు, అతని భార్యను మందలించాడు. ఇందుకు అతడిపై కేసు పెట్టేలా అధికారపార్టీ నేతలు గుర్రప్ప తమ్ముడిని పురమాయించారు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన ఎస్ఐ నేతల సిఫారసుకు పెద్దపీట వేశారు. గుర్రప్పను ఈనెల 27న స్టేషన్కు తీసుకొచ్చి లాఠీతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో కాలు వాచి నడవడానికి వీలులేని పరిస్థితి. తాను ఏ తప్పు చేయకున్నా తనను ఎస్ఐ కొట్టాడని భార్య, బంధువులు, సన్నిహితులతో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. రోజు చికిత్స చేయించుకుంటున్నా పోలీసులు చేసిన గాయాల మాన కపోగా నొప్పి ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యాడు. బాధపడుకుంటూ రాత్రి ఇంట్లో నిద్రపోయిన అతను తెల్లవారుజామున చూసే సరికి మతిచెంది ఉన్నాడు. మృతికి పోలీసుల దెబ్బలే కారణం పోలీసుల దెబ్బలకే గుర్రప్ప చనిపోయాడని భార్య నాగేశ్వరమ్మ, బంధువులు ఆరోపిస్తూ మృతదేహాన్ని పోలీస్స్టేçÙన్కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీసీ నేత కాటసాని రామిరెడ్డి, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు, మండల పార్టీ నాయకుడు బత్తుల రామచంద్రారెడ్డి, కానాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పాలూరు పద్మావతమ్మ, మద్దూరు వీరశేఖర్రెడ్డి, బాబాపకద్దీన్ తదితరులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. గుర్రప్ప మృతిని తట్టుకోలేని గ్రామస్తులు పోలీస్స్టేçÙన్ను ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ పోలీస్ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశాడు. హుటాహుటిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, శిరువెళ్ల సీఐలు కేశవరెడ్డి, ఓబులేసు, ప్రభాకర్రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు మంజునాథ్, పులిశేఖర్, మధుసూదన్, నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్రెడ్డి, అధిక సంఖ్యలో పోలీసులు స్టేషన్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.తక్షణమే ఎస్ఐను సస్పెండ్ చేసి, సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కుటుంబసభ్యులు, బంధువులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టుబట్టారు. గుర్రప్ప మతిపై విచారించి ఎస్ఐపై చర్యలు తీసుకుంటానని డీఎస్పీ హామీవ్వడంతో వారు శాంతించారు. -
కాళ్లు పట్టుకుని బతిమాలినా..
వైద్యం చేయడానికి నిరాకరించిన మాచర్ల వైద్యులు వారి నిర్లక్ష్యంపై సాగరమ్మ బంధువుల ఆగ్రహం కాన్పు చేసినందుకు జీజీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు గుంటూరు మెడికల్ : ‘కాళ్లు పట్టుకుని బతిమాలినా మాచర్ల వైద్యులు కాన్పు చేయలేదు.. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు అప్పటికప్పుడు మాచర్ల నుంచి గుంటూరుకు జీపు బాడుగకు మాట్లాడుకుని వెళ్లటం కష్టసాధ్యమైంది. తప్పనిసరై రూ.5 వేలు వడ్డీకి తీసుకుని జీపు బాడుగకు తీసుకుని రూ.3 వేలు చెల్లించాం..’ అని గర్భిణి చాట్ల సాగరమ్మ తల్లి మిరియమ్మ వాపోయింది. గుంటూరు జీజీహెచ్లో వైద్యులు పెద్ద మనసుతో చికిత్స అందించటంతో తన కుమార్తె, మనవరాలు క్షేమంగా ఉన్నారని ఆమె శనివారం తనను కలిసిన ‘సాక్షి’కి తెలిపింది. అప్పటికప్పుడు జీపు బాడుగకు తీసుకొని కుమార్తెను గుంటూరు జీజీహెచ్కు తీసుకురాగా స్థానిక వైద్యులు చికిత్స అందించారు. శనివారం ఉదయం సాగరమ్మ సాధారణ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టగానే శిశువు ఏడవకపోవడంతో ఐసీయూలో ఉంచారు. పేదరికంలో ఉన్న తమను మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో పట్టించుకోలేదని ఈ సందర్భంగా మిరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇస్రాయేలు, తాను కలిసి మాచర్ల వైద్యులను కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదని వాపోయింది. తన అల్లుడు లక్ష్మయ్య కూడా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడని వెల్లడించింది. ఒకవేళ పురిటినొప్పులు తట్టుకోలేక ఏదైనా అపాయకర పరిస్థితి ఏర్పడి తల్లి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించింది. ఆందోళన వద్దు : ఆర్ఎంవో జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ శనివారం సాగరమ్మను పరామర్శించారు. ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా తక్షణమే అందేలా చూస్తామని, ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండాలని సాగరమ్మ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. సకాలంలో వైద్య సేవలు అందించిన జీజీహెచ్ వైద్యులకు సాగరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం
-
అక్రమాలపై విద్యార్థుల ఆగ్రహం
– సంక్షేమభవన్లో ధర్నా – బీసీ సంక్షేమాధికారిపై విచారణ జరపాలంటూ డిమాండ్ కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె. రామకృష్ణ, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకొని సంక్షేమభవన్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంజీవరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఓచర్లు సష్టించుకొని రూ.44,700 అక్రమంగా కాజేశారని ఆరోపించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధం లేకుండా ఆళ్లగడ్డ, కర్నూలు కళాశాల బీసీ వసతి గహాల్లో స్వంతగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తన వాహనానికి సంబంధించి కారు మీద ప్రభుత్వ ధనాన్ని డ్రా చేసుకున్నారని, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా స్వాహా చేశారని విమర్శించారు. శ్రీ నిధి ఆఫీస్ ఆటో మిషన్ బిల్ నెం: 151/14–18పై నకిలీ ఓచర్ సష్టించుకొని రూ.10,839 వాడుకున్నారని, పూలే విగ్రహానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.80 లక్షలను 2014 జూన్ 24వ తేదిన నగరంలోని కష్ణానగర్ ఆంధ్రాబ్యాంక్లో జమ చేశారన్నారు. బినామీ కారు అద్దెకు ఆ నిధుల్లో నుంచి రూ.2,24,000 లక్షలు డ్రా చేశారని ఆరోపించారు. వసతి గహం సంక్షేమాధికారులను పలు రకాలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విచారణకు ఆదేశం? జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజుపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. గత నెలలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎల్ఆర్ నెం:ఆర్సీ డీ/1918,తేది 27/07/16న జారీ అయిన లేఖ, ఈ నెల 12వ తేదిన ఎస్సీ,ఎస్టీ,బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎరుకల హక్కుల పోరాట సమితి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చేసిన ఆరోపణలు, అందించిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ విచారణ జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డిని నియమిస్తు విచారణను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆర్సీ ఏజే/5419/2015 మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
నీటి విడుదలలో పశ్చిమ డెల్టాకు అన్యాయం
ఇరిగేషన్ అధికారులపై రైతుల కన్నెర్ర రైతులకు బాసటగా నిలబడిన మేరుగ, అన్నాబత్తుని తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో మాగాణి భూములకు సాగునీటిని విడుదల చేయకుండా అవస్థలు పాల్జేయటంపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్ మేరుగ నాగార్జున నేతృత్వంలో పార్టీ నాయకులు, రైతునాయకులు శనివారం మధ్యాహ్నం పశ్చిమ డెల్టా కార్యాలయానికి వెళ్లారు. అరకొర సాగునీటిపై కార్యనిర్వాహక ఇంజినీరు పులిపాటి వెంకటరత్నంను నిలదీశారు. ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాకు దామాషాకు మించి తూర్పుడెల్టాకు అధిక పరిమాణంలో సాగునీరు తీసుకుంటున్నట్టు నాగార్జున, శివకుమార్లు గణాంకాలతో సహా చెప్పారు. పశ్చిమడెల్టాలోనూ ప్రాజెక్టు ఛైర్మన్ మైనేని మురళీకృష్ణ ప్రోద్బలంతో రేపల్లె బ్యాంక్ కెనాల్కు అధిక ప్రాధాన్యతనిస్తూ, ఇతర ప్రాంతాలపై వివక్ష ప్రదర్శిస్తున్నట్టు ఆరోపించారు. రైతునాయకులు మాట్లాడుతూ పుష్కరాల్లో మునిగితేలుతున్న చంద్రబాబు తమను నిండాముంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూన్ పదో తేదీనుంచి వరినాట్లు వేసుకోమన్న చంద్రబాబు మాటలు నమ్మి, సర్వనాశనం అయిపోతున్నట్టు పార్టీ రైతువిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలవర్తి నాగభూషణం అన్నారు. రుణమాఫీ హామీతో రుణగ్రస్థులను చేశారనీ, ఇప్పుడు వరికి నీళ్లివ్వకుండా రైతులను అష్టకష్టాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎకరా నీటి తడులకు రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తున్నట్టు రైతు ఘట్టమనేని రమేష్ చెప్పారు. దీనిపై ఈఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న సరఫరా మెరుగవుతుందని హామీనిచ్చారు. -
యూనియన్లతోనే సమస్యలు
రాయపర్తి : ఉపాధ్యాయ యూనియన్లతోనే తలనొప్పి వస్తుందని, యూనియన్లపై పెట్టే శ్రద్ధ బడిపై పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతానికి కృషి చేయండని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో హెచ్ఎంతో విద్యావనరుల సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయ సంఘం మూసివేసిన బడులను తెరిపించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మీరు యూనియన్లని తిరిగి తలనొప్పి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాప్రతిని ధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమన్వయంతోనే బడులను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం మూలంగానే ప్రైవేట్కు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ బడులలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గదుల కొరతతో పాటు, త్రాగునీటి సమస్య తది తర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్ఎం లతో చర్చించారు. పెండింగ్లో ఉన్న మధ్యా హ్న భోజన బిల్లులు రావడంలేదని ఓ హెచ్ఎం తెలపగా నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎండీ ఉస్మా న్, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ వం గాల యాకమ్మ, తహసీల్ధార్ వాసం రామ్మూర్తి, ఎంపిడీఓ శంకరి, సర్పంచ్, ఎంపిటీసీలు, హెచ్ఎంలు, సీఆర్పీలు బందు నారాయణ, గారె కృష్ణమూర్తి, లింగారెడ్డి,అనుమాస్ వేణు, నగేష్, ప్రసాద్, సత్యనారాయణ, శోభారాణి, రమాదేవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుడిపై దౌర్జన్యం?
సాక్షి, విజయవాడ : గోశాల వద్ద రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఓ కార్మికుడిపై ప్రజాప్రతినిధి ఒకరు చెయ్యిSచేసుకున్న ఘటన అర్జునవీధిలో జరిగింది. దీంతో తోటి కార్మికులు సోమవారం పనులను నిలిపివేయడంతో దుర్గగుడి అధికారులు వారితో చర్చలు జరిపారు. సేకరించిన వివరాల ప్రకారం అర్జునవీధి వంద అడుగుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం సమయంలో ఓ కార్మికుడు రోడ్డుపై డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో గోశాలకు సమీపంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో సామగ్రి అదరడమే కాకుండా గ్లాస్ తలుపులు బీటలు వారాయి. దీంతో ఆగ్రహించిన ఆయన ఊగిపోతూ మేడపై నుంచి కిందకు వచ్చి ఆ కార్మికుడిపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. దీంతో సదరు కార్మికుడిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న తోటి కార్మికులు దుర్గగుడి అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా ప్రతినిధిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కార్మికులు సిద్ధం కావడంతో అనవసర గొడవ ఎందుకంటూ దుర్గగుడి అధికారులు రాజీ చేసినట్లు సమాచారం. ఇటీవల అర్జునవీధి విస్తరణలో తన నివాసాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు కార్మికుడిపై చెయ్యి చేసుకోవడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ఉపాధిహామీ సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
దుగ్గొండి : ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై డ్వామా పీడీ శేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుంతలు సరే..బిల్లులేవి’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గ్రామాలవారీగా గుంతల వివరాలు.. బిల్లుల చెల్లింపులు తెలపాలంటూ మండల అధికారులకు ఆయన ఆదేశించారు. దీనిపై ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై గ్రామాలవారిగా పనులపై వివరాలు సేకరించారు. రెండు రోజుల్లోగా గుంతలు తీసిన వారందరి బిల్లులు సిద్ధం చేసి, ఎంబీ రికార్డుతో పాటు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయాలని పీడీ ఆదేశించినట్లు ఎంపీడీఓ తెలిపారు. -
చెన్నైలో రజనీ ఫ్యాన్స్ ఆగ్రహం
-
సర్వేలపై టీడీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి
-
అంతా మీ ఇష్టమేనా..?!
► హెచ్ఎన్ఎస్ఎస్, హెచ్చెల్సీ సమీక్షలో రగడ ► మంత్రి పల్లెను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం అనంతపురం టౌన్ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఫైర్ అయ్యారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) హాలులో హంద్రీ–నీవా సుజల స్రవంతి, హెచ్చెల్సీపై కలెక్టర్ శశిధర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ విషయం తెలుసుకుని సూరి గంట ఆలస్యంగా ఎమ్మెల్సీ కేశవ్తో కలిసి అక్కడకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని మంత్రిని ప్రశ్నించారు. సమావేశం ఉందని అధికారులు కూడా తెలపకపోవడమేంటని ఆగ్రహించారు. మీకు మీరే మీటింగులు పెట్టుకుంటే ఇక మేమెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో కేశవ్ కల్పించుకుని కనీసం అజెండా ఏంటో తెలిస్తే సమావేశంలో మాట్లాడటానికి వీలుం టుందన్నారు. ఎవరికీ తెలీకుండా సమావేశం పెడితే ప్రయోజనం ఏంటన్నారు. దీంతో మంత్రి పల్లె.. సూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వినలేదు. ఇంతలో కేశవ్ కల్పించుకుని ‘మీరు చేస్తున్న తప్పిదాలు బయటకు వస్తాయేమోనని మాకు సమాచారం ఇవ్వలేదా?’ అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఇదే సందర్భంలో అధికారులు తనకు ఫోన్ చేసి సమావేశానికి వస్తారా అని అడిగారని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి అన్నారు. దీనిబట్టి వారి వ్యవహారశైలి ఏ విధం గా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పనులు వేగవంతం చేయండి హంద్రీనీవా పనులను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రెండో దశలో రైల్వే క్రాసింగ్, భూ సేకరణ విషయంలో సమస్యలు వస్తుండడంతో జాప్యం జరుగుతోందని అన్నారు. గత ఏడాది 11.5 టీఎంసీలను తెచ్చి 49 చెరువులకు నీరిచ్చామన్నారు. ఈ ఏడాది గతేడాది కంటే ఎక్కువగా అందించాలన్నారు. వచ్చేఏడాది జూన్ నాటికి హెచ్చెల్సీ పనులు పూర్తి చేయాలన్నారు. నీరు–చెట్టు కింద 1,847 పనులు మంజూరయ్యాయని, అసంపూర్తిగా ఉన్న వాటిపై దష్టి పెట్టాలన్నారు. నదులపై కట్టే బ్రిడ్జిలకు హైడ్రాలిక్ క్లియరెన్స్ను మన జిల్లాకు ప్రత్యేకంగా ఇవ్వాలని సీఎంను కోరనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. తుంగభద్ర డ్యాం నుంచి ఈ నెల 25న నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఆగస్టు 3వ తేదీ నాటికి మన జిల్లా సరిహద్దుకు వస్తాయని తెలిపారు. సమీక్షలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల, జేసీ లక్ష్మీకాంతం, ఎస్ఈలు సుధాకర్బాబు, శేషగిరిరావు, సుబ్బారావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించరా..
♦ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఫైర్ ♦ అంతారం హైస్కూల్, తాటిపల్లి కేజీబీవీలను తనిఖీ చేసిన రోనాల్డ్ రోస్ మునిపల్లి : ‘మీ పిల్లలైతే ఇలానే చేస్తారా’ అంటూ కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఉపాధ్యాయుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంతారం హైస్కూల్, తాటిపల్లి కేజీవీబీ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అంతారం పాఠశాల ఉపాధ్యాయురాలు ఒక్కరే 9.30 గంటల సమయంలో విద్యార్థులతో ప్రార్థన చేసి తరగతి గదిలోకి వెళ్తున్న సమయంలో కలెక్టర్ ఆకస్మికంగా వచ్చి పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం ఎంత మంది ఉపాధ్యాయులున్నారు... వారు ఎందుకు ప్రార్థనలో పాల్గొనలేదో చెప్పాలని కలెక్టర్ ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిష్టర్ తీసుకుని నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు రాసి సంతకం చేశారు. కలెక్టర్ వచ్చిన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కలెక్టర్ వద్దకు రాగానే ‘మీ ఉళ్లో విద్యార్థులకు పాఠశాలు బోధించే ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుంటే అధికారులకు ఎందుకు చెప్పడంలేదని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేదని, సమయానికి బస్సు దొరకలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారని గ్రామస్తులు చెప్పడంతో అయితే హెలికాప్టర్ పంపాలా అంటూ కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టరైనా, అధికారులైనా, ఉపాధ్యాయులైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. అక్కడి నుంచి తాటిపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు వచ్చి రాగానే మొత్తం ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారని అడిగారు. ఏడుగురు అని ఉపాధ్యాయులు చెప్పారు. ఏడుగురిలో నలుగురే ఉన్నారు.. మిగతా ముగ్గురు ఎందుకు రాలేదని కలెక్టర్ ప్రశ్నిస్తూ సమయ పాలన పాటించని ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కస్తూర్బాగాంధీ పాఠశాల గదులు, మరుగు దొడ్లు, నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతాలోపంతో పనులు చేపడుతున్న మేస్త్రీని కలెక్టర్ నిలదీశారు. ఇలాగే పనులు చేపడితే జైలులో పెట్టిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటిని ఇలానే నిర్మించుకుంటారా అంటూ సర్పంచ్ అల్లం నవాజ్రెడ్డిని నిలదీశారు. అనంతరం మొక్కలను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి అంతారం సర్పంచ్ సిద్దన్నపాటిల్ ఉన్నారు. -
రాజ్నాథ్కు చిర్రెత్తిపోయింది
లక్నో: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారి తన స్వీయ నియంత్రణను కోల్పోయారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లేడేసమయంలో నిశ్శబ్దంగా ఉండకుంటే అందరికీ చెంపదెబ్బలుపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్కు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరిన పెద్ద సమూహం పెద్దగా కేకలు పెడుతుండగా ఆయన తొలుత వారిని వారించే ప్రయత్నం చేశారు. అయితే, వారు వినకుండా అలాగే తమ గోలను కొనసాగించడంతో ఆవేశానికి లోనైన ఆయన 'నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ చెంపలు పగులుతాయ్' అని అన్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా తాము సిద్ధమని అన్నారు. మథురలో ఘర్షణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం వద్ద వివరాల్లేకుండా పోయాయని అని విమర్శించారు. -
ముఖ్యమంత్రిపై ఏపీ డెప్యూటీ సీఎం ఆగ్రహం
కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ లను కలిసి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో జరిగిన నవ నిర్మాణ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడుతూ... విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థలపై ఆంధ్రప్రదేశ్కు హక్కు లేదా అని డీప్యూటీ సీఎం కేఈ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమించుకొని దానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెట్టిందన్నారు. దీంతో ఏపీలో వ్యవసాయ రంగ పరిశోధనలు చేసేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ర్టంలో శరవేగంగా జరుగుతున్న అభివద్ధి పనులకు తోడ్పాటు వస్తుందని, ఐదేళ్లలో జరగాల్సిన అభివద్ధి రెండేళ్లలోనే సాధించేందుకు వీలవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ, నిధులను కేటాయించాలని డిమాండ్ కేఈ డిమాండ్ చేశారు. -
భర్తపై వేడి నూనె పోసిన భార్య
కేకేగర్: కోపంతో భర్తపై వేడినూనె పోయడంతో తీవ్ర గాయాలైన సంఘటన తమిళనాడులోని అరవకురిచ్చి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. కరూర్ జిల్లా చిన్నతారాపురం సమీపంలోని రంగపాళెయంలో నివసిస్తున్న పళనిస్వామి కుమారుడు రాజేష్ కుమార్ (29) రేవతి(27) భార్యా భర్తలు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన భార్య గ్యాస్స్టౌవ్పై కాగుతున్న నూనెను రాజేష్ కుమార్పై పోసింది. అతను పెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గాయాలైన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై చిన్నతారాపురం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేష్ కుమార్ అరవకురిచ్చి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. వీరికి దివైన్ (5) టోమిని (2) పిల్లలు ఉన్నారు.