ashes test series
-
Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..
లండన్: ఈసారి యాషెస్ సిరీస్ మునుపెన్నడు లేని విధంగా పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఆఖరి మజిలీ కూడా రసవత్తరంగా మారింది. అయితే ఆటలో అరటిపండులా... రసపట్టుపై వాన చినుకులు అంతరాయం కలిగించాయి. ఆదివారం నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన మరో ఇంగ్లండ్ 6 పరుగులు చేసి ఆలౌటైంది. అండర్సన్ (8)ను అవుట్ చేసి మర్ఫీ (4/110) కూడా స్టార్క్ (4/100)తో సమంగా నిలిచాడు. అనంతరం 384 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (58 బ్యాటింగ్; 9 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (69 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఆసీస్ నెగ్గాలంటే మరో 249 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. లంచ్ బ్రేక్ దాకా 75/0 స్కోరు చేసిన ఆసీస్ రెండో సెషన్లోనూ అదే ఆటను కొనసాగించడంతో ఖ్వాజా, వార్నర్ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. తర్వాత కాసేపటికే వర్షం ముంచెత్తింది. దీంతో ఈ సెషన్లో కేవలం 14 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ప్రస్తుతం ఆసీస్ 2–1తో ఆధిక్యంలో ఉంది. గత యాషెస్ సాధించడంతో ఈ మ్యాచ్తో సంబంధం లేకుండానే సిరీస్ను నిలబెట్టుకుంది. చదవండి: Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు -
యాషెస్ సిరీస్: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ తొలి రోజు హైలైట్స్ (ఫోటోలు)
-
'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్బాల్ క్రికెట్తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు. ''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్కు కావాల్సింది ఇదే. యాషెస్ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది. మ్యాచ్లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్లైన్ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్బాల్ క్రికెట్ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్లపైనే. చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు. మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ బజ్బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
రసవత్తరంగా యాషెస్ తొలి టెస్టు.. స్టేడియంలో కన్పించిన షాహీన్ అఫ్రిది! ఫోటో వైరల్
యాడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ తొలి టెస్టు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో బోణీ కొట్టేందుకు ఆఖరి రోజు ఆసీస్కు మరో 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్కు మరో 7 వికెట్లు కావాలి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్గా ఉన్నారు. స్టేడియంలో కన్పించిన షాహీన్ ఇక రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్ను చూసేందుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఎడ్జ్బాస్టన్ స్టేడియంకు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 33 ఓవర్లో షాహీన్ కెమరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బీజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో నాటింగ్హామ్షైర్ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్తో రెడ్బాల్ క్రికెట్లో అఫ్రిది పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి టెస్టు జట్టుకు అఫ్రిది దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Shaheenn Shah Afridi at Edgbaston, watching the 1st #ashes test day 4 pic.twitter.com/L1rNZBCJK8 — Team Shaheen Afridi (@TeamShaheenShah) June 19, 2023 -
తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్
టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్ భాయ్ ఇదే తీరును కనబరిచాడు. తీరు మారని వార్నర్.. డేవిడ్ వార్నర్పై మరోసారి ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పైచేయి సాధించాడు. అద్భుతమైన బంతితో వార్నర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో వార్నర్ను బ్రాడ్ ఔట్ చేయడం 15వసారి కావడం గమనార్హం. టెస్టుల్లో ఓవరాల్గా బ్రాడ్ బౌలింగ్లో 734 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. కేవలం 26.46 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లడ్ గడ్డపై వార్నర్ను బ్రాడ్ ఎక్కువసార్లు ఔట్ చేశాడు. తన సొంత గడ్డపై 9 సార్లు వార్నర్ను పెవిలియన్కు పంపాడు. 2013 నుంచి టెస్టుల్లో వార్నర్కు బ్రాడ్ చుక్కలు చూపిస్తునే వస్తున్నాడు. క్రికెట్లో వార్నర్ను ఏ బౌలర్ కూడా ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. వార్నర్ను బ్రాడ్ ఏకంగా నాలుగు సార్లు డకౌట్ చేశాడు. కాగా వార్నర్కు ఇదే ఆఖరి యాషెస్ సిరీస్. కనీసం ఈ సిరీస్లోనైనా బ్రాడ్ను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(22),స్టీవ్ స్మిత్(7) పరుగులతో ఉన్నారు. చదవండి: PAK vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన!స్టార్ బౌలర్ వచ్చేశాడు Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 -
ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు సన్నాహంగా ఐర్లాండ్తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు. దీంతో టాపార్డర్లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచారు. స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. చదవండి: Josh Tongue: ఇంగ్లండ్కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive... One of the most pleasing shots in cricket 😍 Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw — England Cricket (@englandcricket) June 1, 2023 -
కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది?
Steve Smith- Sussex Deal: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో ఆడనున్నాడు. ససెక్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్లలో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ససెక్స్ క్రికెట్ హెడ్ పాల్ ఫాబ్రేస్తో మాట్లాడానని, కౌంటీల్లో ఆడనుండటం నిజమేనని ధ్రువీకరించాడు. అందుకే ఈ నిర్ణయం తనకు ఇదో సరికొత్త అనుభవమన్న స్మిత్.. యువ క్రికెటర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడం ద్వారా వాళ్లను మెంటార్ చేసే అవకాశం కూడా వస్తుందని, ఇది తనకు సంతృప్తినిస్తుందని స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు. మండిపడుతున్న అభిమానులు కాగా ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సన్నాహకాల్లో భాగంగా స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్మిత్ కౌంటీల్లో ఆడటంపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడికి ఈ అవకాశం ఇచ్చిన ససెక్స్ జట్టును ద్రోహులుగా అభివర్ణిస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పిచ్లపై ఆడించడం ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. తప్పేముందన్న మాజీ సారథి అయితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ వాన్ భిన్నంగా స్పందించాడు. స్మిత్ కౌంటీల్లో ఆడటాన్ని అతడు స్వాగతించాడు. స్మిత్ వంటి మేటి టెస్టు క్రికెటర్లు ససెక్స్ డ్రెస్సింగ్రూంలో ఉండటం.. యువ ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతుందని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్.. మైకేల్ వ్యాఖ్యలతో ఏకీభవించినప్పటికీ.. యాషెస్ సిరీస్(డిసెంబరులో)కు ముందు ఇలాంటి నిర్ణయం సరికాదని పెదవి విరిచాడు. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Great signing for our game … Well done 👍👍 https://t.co/Qs2iqrBARy — Michael Vaughan (@MichaelVaughan) January 19, 2023 -
జో రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్బై
ఇంగ్లండ్ టెస్టు సారథి జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రూట్ శుక్రవారం ప్రకటించాడు. యాషెస్ సిరీస్లో ఘోరపరాభవం, వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం రూట్ కెప్టెన్సీ వైదొలగాలని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రూట్ (64మ్యాచ్లు) రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్లు గెలిచిన రికార్డును కూడా రూట్ కలిగి ఉన్నాడు."నా దేశానికి కెప్టెన్గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంగ్లండ్ వంటి జట్టకు కెప్టెన్గా మరి కొంత కాలం కొనసాగాలని భావించాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపింది. ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్గా ఎవరు ఎంపికైన నా వంతు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు దన్యవాదాలు" అని రూట్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 RR Vs GT: "అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్ ఆ స్థానంలో బ్యాటింగ్కు అవసరమా" -
'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టుకు హెడ్ కోచ్గా'
యాషెస్ సిరీస్లో ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్వుడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాల్ కాలింగ్వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా హెడ్ కోచ్ పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తదుపరి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నాడు. కాగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్.. ది హండ్రెడ్ లీగ్లో లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్గా వార్న్ ఉన్నాడు. 'ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నాను. జట్టును విజయ పథంలో నడిపించగలను అని అనుకుంటున్నాను. ఇంగ్లండ్లో చాలా మంది అత్యత్తుమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రాథమికంగా జట్టులో కొన్ని మార్పులను చేస్తే చాలు. అదే విధంగా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు, ఫీల్డర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు అంతగా రాణించలేకపోతున్నారు' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ కోచ్ పదవికోసం ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు. చదవండి: Prasidh Krishna: బౌలింగ్లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే -
యాషెస్ సిరీస్లో ఘోర పరాభవం.. 8 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లపై వేటు!
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో టెస్టులకు 16 మంది సభ్యలుతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అయితే వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు మందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాషెస్ సిరీస్లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లపై సెలెక్షన్ ప్యానల్ వేటు వేసింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ . డేవిడ్ మలన్ సహ మరికొంత మంది ఆటగాళ్లపై వేటు పడింది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగట్రేం చేయనున్నారు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్కి మరీ ఇంత తక్కువా! -
మ్యాచ్కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్- ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్స్టోరీ అందరికి తెలిసిందే. క్యూట్ లవ్కపుల్గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఆసీస్ జట్టులో అన్ని ఫార్మాట్లలోనూ కీలకబౌలర్గా సేవలందింస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి స్టార్క్ ఇప్పటివరకు 529 వికెట్లు తీశాడు. మరోవైపు అలీసా హేలీ ఆస్ట్రేలియన్ వుమెన్స్ టీమ్లో ప్రధాన బ్యాటర్గా రాణిస్తుంది. టి20ల్లో 2,136 పరుగులు, వన్డేల్లో 2039 పరుగులు, ఆరు టెస్టుల్లో 236 పరుగులు చేసింది. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం ఇక ఆస్ట్రేలియా మెన్స్ టీమ్కు ప్రస్తుతం ఏ సిరీస్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియన్ వుమెన్స్ యాషెస్ టెస్టు మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మ్యాచ్ చివరిరోజు ఆటలో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్రూమ్లో మిచెల్ స్టార్క్, అలీసా హేలీల రొమాంటిక్ యాంగిల్ కెమెరాలకు చిక్కింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హేలీ.. డోనట్ను స్టార్క్కు ఇచ్చింది. స్టార్క్ ఆ డోనట్ను సగం చేసి తన భార్యకు ప్రేమతో తినిపించాడు. ఈ సమయంలో మైదానంలోని కెమెరాలన్నీ వీరిద్దరిపై ఫోకస్ చేశాయి. ఇది చూసిన సహచర మహిళ ప్లేయర్స్ వారిద్దరి క్యూట్లవ్కు తెగ ముచ్చటపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇంగ్లండ్తో వుమెన్స్తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. 48 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులతో విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ వుమెన్స్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి కేవలం 26 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను పడగొట్టారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంగ్లండ్ పరిస్థితి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ఇంగ్లండ్ కష్టతరంగా డ్రా చేసుకుంది. 48 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ వుమెన్స్లో అన్నాబెల్ సుథర్లాండ్ 3, అల్నా కింగ్ 2, ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, తాహిలా మెక్గ్రాత్లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Akhtar Vs Brett Lee: ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు Cute 🥰#Ashes pic.twitter.com/WlAMXUXzoy — 7Cricket (@7Cricket) January 30, 2022 -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్తో యాషెస్ టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్షేక్, ఐస్క్రీమ్లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్మూనీ యాషెస్లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
ఇంగ్లండ్కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
యాషెస్ ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా హోబర్ట్ వేదికగా జరిగే ఐదో టెస్ట్కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ధృవీకరించాడు. కాగా నాల్గవ టెస్ట్లో జోస్ బట్లర్ గాయడ్డాడు. ఇక అఖరి టెస్ట్లో బట్లర్ స్ధానంలో జానీ బెయిర్స్టో వికెట్ కీపింగ్ చేయనున్నాడు. "బట్లర్ చేతి వేలుకు తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు తన ఇంటికి వెళ్లనున్నాడు. అతడు హోబర్ట్ టెస్ట్కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. జట్టు కష్టపరిస్థితిల్లో ఉన్నప్పడు చాలా సార్లు అండగా నిలిచాడు" అని రూట్ పేర్కొన్నాడు. ఇక యాషెస్ సిరీస్లో వైట్ వాష్ నుంచి ఇంగ్లండ్ తప్పించుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ను ఇంగ్లండ్ డ్రాగా ముగించింది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మధ్య అఖరి టెస్ట్ జనవరి 14న ప్రారంభం కానుంది. చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
ఏందయ్యా ఇది.. స్టంప్స్ తాకినా బెయిల్స్ కదల్లా.. స్టోక్స్ బచాయించాడు పో!
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 30 వ ఓవర్ వేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్లో.. బెన్ స్టోక్స్ డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించగా బంతి మిస్ అయ్యి ప్యాడ్ తాకినట్లుగా కీపర్ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కీపర్తో పాటు బౌలర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. వెంటనే స్టోక్స్ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రీప్లేలో బంతి నేరుగా ప్యాడ్ తాకకుండా, ఆఫ్ స్టంప్ని తాకింది. అయితే బంతి స్టంప్స్ని తాకినా బెయిల్స్ పడక పోవడం గమనర్హం. కాగా రీప్లేలో అది చూసిన స్టోక్స్.. బతికి పోయాను అంటూ గట్టిగా నవ్వాడు. అయితే ఈ సంఘటన మాత్రం ఆసీస్ క్రికెటర్లతో పాటు, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా చివరికి 66 పరుగులు చేసిన స్టోక్స్, లయాన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్కు స్టార్ బౌలర్ దూరం! One of the strangest things ever I have seen in cricket - Stokes was given LBW but actually, the ball hit on the stumps, and the bails didint move. pic.twitter.com/h2ZMNwNd2X — Johns. (@CricCrazyJohns) January 7, 2022 UNBELIEVABLE #Ashes pic.twitter.com/yBhF8xspg1 — cricket.com.au (@cricketcomau) January 7, 2022 -
ఏడంకెల జీతం ఉంది కదా.. అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం కావొద్దు!
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటికే వరసుగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి ఇంగ్లండ్ సిరీస్ను చేజార్చుకుంది. దీంతో రూట్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ అసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం కావద్దని అతడు సూచించాడు. ఇంగ్లండ్ టీమ్ మెనేజ్మెంట్ వెంటనే జట్టు వైఫల్యాలపై చర్చించి మార్పులతో ముందుకు వెళ్లాలని అథర్టన్ తెలిపాడు. అదే విధంగా టెస్ట్ జట్టు కెప్టెన్గా రూట్ స్ధానంలో బెన్ స్టోక్స్ని నియమించాలని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని అథర్టన్ పేర్కొన్నాడు. "ఇంగ్లండ్ జట్టులో చాలా మంది ఆటగాళ్లకి ఏడంకెల జీతం ఈసీబీ చెల్లిస్తుంది. కానీ ఐపీఎల్ సమయంలో రెండు నెలలపాటు ఈసీబీ వారి సేవలను కోల్పోతుంది. ఐపిఎల్,ఇతర ఫ్రాంచైజీ లీగ్ల్లో ఆడాడనికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈసీబీ ఎందకు ఇస్తుందో నాకు అర్ధం కావడం లేదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈసీబీ నిర్ణయాలు తీసుకుంటే బాగుటుంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్లకు ఎట్టి పరిస్ధితుల్లో దూరం కావద్దు" అని అతడు పేర్కొన్నాడు. కాగా జోస్ బట్లర్, బెన్స్టోక్స్, మోయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. చదవండి: SA vsIND: "టీమిండియా వన్డే వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా.. ఇది అద్భుతమైన నిర్ణయం" -
ట్రవిస్ హెడ్కు కరోనా... మరి యాషెస్ సిరీస్?
సిడ్నీ: ‘యాషెస్’ సిరీస్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రవిస్ హెడ్ కరోనా పాజిటివ్గా తేలాడు. దాంతో సిడ్నీలో ఈనెల 5 నుంచి ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్టుకు అతను దూరమయ్యాడు. హెడ్ స్థానంలో ముగ్గురు ఆటగాళ్లు మిచెల్ మార్ష్, నిక్ మ్యాడిసన్, జోష్ ఇంగ్లిస్లను ఆసీస్ జట్టులోకి ఎంపిక చేశారు. కరోనా సోకడంతోనే ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కూడా సిడ్నీ టెస్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. -
55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెల్బోర్న్ హోటల్ రూంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్మిత్ కూడా వారి సంబరాలకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవాలనుకున్నాడు. అయితే అనుకోకుండా తాను ఎక్కిన లిఫ్ట్ డోర్ ఇరుక్కుపోయింది. దీంతో ఈ వైస్ కెప్టెన్ సాంకేతిక కారణాలతో 55 నిమిషాల పాటు లిఫ్ట్లో గడపాల్సి వచ్చింది. తన సహచర క్రికెటర్ మార్నస్ లబుషేన్ స్మిత్ను బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి లిఫ్ట్ టెక్నిషియన్ వచ్చి స్మిత్ను క్షేమంగా బయటికి తీశాడు. ఈ మొత్తాన్ని స్మిత్ తన ఇన్స్టాగ్రామ్లో ఫన్నీవేలో చెప్పుకొచ్చాడు. చదవండి: Ashes Series 2021-22: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్కు కరోనా.. '' లిఫ్ట్ ఎక్కిన తర్వాత నేను వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చినప్పటికి డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో బయట ఉన్న మార్నస్ లబుషేన్కు సమాచారం అందించాను. ఒకవైపు నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. అటువైపు లబుషేన్ కూడా ప్రయత్నించాడు. మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో లిఫ్ట్ ఆపరేటర్ వచ్చి నన్ను కాపాడాడు. పోయిన ప్రాణం తిరిగివచ్చింది అనుకున్నా ఆ క్షణంలో.. ఇక 55 నిమిషాల పాటు లిఫ్ట్లో నరకం అనుభవించా. ఆ తర్వాత రూమ్లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక యాషెస్ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతుంది. వరుసగా మూడు టెస్టుల్లో భారీ విజయాలు అందుకున్న ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్లో 3-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. చదవండి: Year End 2021: నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో.. such incredible content from the big man stuck in a lift pic.twitter.com/5XtZasAMWk — Abi Slade (@abi_slade) December 30, 2021 -
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్కు కరోనా..
యాషెస్ సిరీస్లో నాలుగో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావియస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్కు అతడు దూరమయ్యాడు. శుక్రవారం హెడ్కి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్గా తెలినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో, తన భార్యతో కలిసి మెల్బోర్న్లో ఐషోలేషన్లో ఉన్నాడు. కాగా ప్రతిష్టాత్మాక యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా హెడ్ ఉన్నాడు. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 248 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది. చదవండి: Quinton De Kock/ IND Vs SA: భారత్తో ఓటమి.. డికాక్ సంచలన నిర్ణయం! -
'ఇంగ్లండ్ జట్టులో అందరిని తొలగించండి'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. మిగిలిన రెండు టెస్టులు నామమాత్రంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటతీరును ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్ ఆటతీరుపై ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND vs SA: నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది? రూట్ సహా జట్టు మొత్తాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆ దేశ అభిమానులు ఏకిపారేశారు. ఇంగ్లండ్ ఆటతీరును దుమ్మెత్తిపోస్తూ.. టీమ్ మొత్తాన్ని తొలగిస్తే గానీ మా ఆవేశం చల్లారదంటూ డిమాండ్ చేశారు. యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ రాణిస్తున్న చోట ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడూ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో ఒక్క రూట్ మినహా మిగిలిన ఏ ఒక్కరు కనీసం అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయారు. 2019లో వన్డే ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్.. అప్పటినుంచి వారి ఆటతీరుకు సంబంధించిన గ్రాఫ్ పూర్తిగా పడిపోతూ వస్తుంది. గాయాలతో.. వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరంగా ఉండడం ఆ జట్టు ఆటను పూర్తిగా దెబ్బతీస్తుంది. రొటేషన్ పాలసీ పేరుతో స్టువర్ట్ బ్రాడ్ లాంటి సీనియర్ ఆటగాడిని అసలు జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది ఇప్పటికి అర్థం కాలేదంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్కు పుట్టినిల్లుగా అభివర్ణించే ఇంగ్లండ్ ఈ రకమైన అవమానాలను ఎప్పుడు ఎదుర్కోలేదనే చెప్పాలి. మరి యాషెస్ సిరీస్ ముగించుకొని సొంతగడ్డపై అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లండ్కు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్ -
ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టుల్లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పటికే మూడు టెస్టులు వరుసగా గెలిచిన ఆసీస్ సిరీస్ను కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్లో 3-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ఇంగ్లండ్ను వైట్వాష్ చేయాలని భావిస్తోంది. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 5 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. చదవండి: Mohammed Shami: సూపర్ షమీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ విషయం పక్కనబెడితే.. వార్నర్ ఆటలో ఎంత యాక్టివ్గా ఉంటాడో.. కుటుంబంతో కూడా అంతే ఆనందంగా గడుపుతాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడోటెస్టుకు వార్నర్ ఫ్యామిలీ కూడా హాజరైంది. మ్యాచ్ గెలిచిన తర్వాత వార్నర్ తన కూతుర్లతో కలిసి అధికారుల అనుమతితో ఎంసీజీలో క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోనూ వార్నర్ తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. కాగా వీడియోలో వార్నర్ కూతురు ఇండీ తండ్రిని మించిపోయింది. ఇండీకి బంతి వేస్తే.. లెగ్సైడ్ దిశగా భారీ షాట్ ఆడింది. ఈ విషయాన్ని వార్నర్ ట్విటర్లో పంచుకుంటూ.. ఎంసీజీ మైదానంలో ఇండీ ఫస్ట్ షాట్ కొట్టింది.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0 — David Warner (@davidwarner31) December 28, 2021 -
18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాటు ఐదు టెస్టుల సిరీస్ను 3-0 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ 18 ఏళ్ల చెత్త రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది ఇంగ్లండ్కు టెస్టుల్లో ఇది తొమ్మిదో పరాజయం. జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు టీమిండియా చేతిలో ఐదు పరాజయాలు( స్వదేశంలో రెండు, విదేశంలో మూడు), ఆ తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో మరో ఓటమిని చవిచూసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో వరుసగా మూడు టెస్టుల్లో ఓటములు చవిచూసి చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఇంతకముందు 2003లో బంగ్లాదేశ్ జట్టు ఆ ఏడాదిలో 9 పరాజయాలు చవిచూసింది. తాజాగా ఇంగ్లండ్ సరిగ్గా ఏడాదిలో 9 పరాజయాలే అందుకొని బంగ్లాతో సమానంగా నిలిచింది. అయితే ఇంగ్లండ్ ఈ ఏడాది గెలిచిన సిరీస్ ఏదైనా ఉందంటే అది శ్రీలంకతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకోవడం మాత్రమే. చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్! -
68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే..
యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ సిరీస్ను 3–0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ను రెండో ఇన్నింగ్స్లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో గెలిపొందింది. 31-4 పరుగలు వద్ద మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్(28), బెన్ స్టోక్స్(11) పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు, స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఆరంగ్రేట మ్యాచ్లోనే ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ 7 వికెట్లు పడగొట్టి ఆద్బుతమైన ప్రదర్శన చేశాడు. కాగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఆస్ట్రేలియా మ్యాచ్ను ముగించింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 185 పరుగులుకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 267 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా స్కాట్ బోలాండ్ ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్లు మధ్య నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవవరి 5న ప్రారంభంకానుంది. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
13 సార్లు 200లోపూ ఆలౌట్.. 20 మంది ఆటగాళ్లు డకౌట్
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో ఈ ఏడాది చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 28 ఇన్నింగ్స్ల్లో 13 సార్లు 200లోపూ ఆలౌట్ అయింది. ఇక తాజాగా యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్టులో డేవిడ్ మలాన్ డకౌట్ కావడం ద్వారా మరో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయిన 20వ ఆటగాడిగా నిలిచాడు. మలాన్ కంటే ముందు 19 మంది ఉంటే అందులో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సహా బెన్స్టోక్స్, ఇతర క్రికెటర్లు ఉన్నారు. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాను 267 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే పోయింది. 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించింది. ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఓటమినుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: James Anderson: అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది! -
అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మార్క్వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! -
బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు
Pat Cummins Terrific Bowling To Hameed Hasib At Last Duck Out Viral.. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌటైంది. రూట్ అర్థశతకం మినహా మిగతావారెవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రలియా తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లతో చెలరేగడమే కాదు.. తన బంతులతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ హసీబ్ హమీద్కు కమిన్స్ తన బౌలింగ్తో చుక్కలు చూపించాడు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో బౌన్సర్లు, షార్ట్పిచ్ బాల్స్తో కమిన్స్.. హమీద్ను బెంబేలెత్తించాడు. చివరకు అతన్ని డకౌట్ చేసి వారెవ్వా అనిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ కమిన్స్ వేయగా.. మొదటి నాలుగు బంతులను టచ్ చేయడానికే భయపడగా... ఐదో బంతిని టచ్ చేయాలా వద్దా అని హమీద్ అనుకునే లోపే బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ను తాకుతూ కీపర్ క్యారీ చేతుల్లో పడింది. అలా హమీద్ డకౌట్ అయి పెవిలియన్కు నిరాశగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: AUS vs ENG: పాపం రూట్.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా It's taken Pat Cummins less than one over to have an impact on his return to the side! #OhWhatAFeeling @Toyota_Aus | #Ashes pic.twitter.com/iAVB3vC33C — cricket.com.au (@cricketcomau) December 26, 2021 -
పాపం రూట్.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా
యాషెస్ సిరీస్ ఇంగ్లండ్కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్ మూడోటెస్టును కూడా ఫేలవ రీతిలో ఆరంభించింది. ఓడిన రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తాజాగా మూడో టెస్టులోనూ అదే పునరావృతమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మినహా మిగతావారు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. రూట్ మరోసారి అర్థ శతకం(82 బంతుల్లో 50, 4 ఫోర్లు) ఆకట్టుకోగా.. బెయిర్ స్టో 35 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా 50 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔటయ్యాననే కోపంతో రూట్ తన బ్యాట్ను కిందకొట్టి అసహనం వ్యక్తం చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా తాను అర్థసెంచరీ చేసినప్పటికి తన సహచరులెవ్వరు సహకరించలేదన్న కోపమో ఏమోగాని.. రూట్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Ind Vs Sa 1st Test: తొలి టెస్టు డ్రా అవుతుంది.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్ ఇక రూట్ మూడో టెస్టు ద్వారా టెస్టులో మరో రికార్డును అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్మన్గా రూట్ చరిత్ర సృష్టించాడు. తాజా హాఫ్ సెంచరీతో రూట్ ఒక క్యాలెండర్ ఇయర్లో 1680 పరుగులు సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమీ స్మిత్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక రూట్ కంటే ముందు టెస్టు కెప్టెన్గా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్(1788 పరుగులు, 2006), వెస్టిండీస దిగ్గజం వివ్ రిచర్డ్స్(1710 పరుగులు, 1976) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు రెండు సెషన్లలోనే ముగిసిపోయింది. 65.1 ఓవర్లలో 185 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లియాన్ చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చదవండి: Ashes Series 3rd Test: ఆసీస్ బౌలర్ల జోరు.. ఇంగ్లండ్ విలవిల Starc gets the big one - England's captain is gone! Root out for exactly 50 #Ashes pic.twitter.com/cqkjIqCy3W — cricket.com.au (@cricketcomau) December 26, 2021 -
బెయిర్స్టో వచ్చేశాడు.. ఇంగ్లండ్ ఈ సారైనా గెలిచేనా!
యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్ట్(బాక్సింగ్డే టెస్ట్) డిసెంబరు 26న ప్రారంభం కానుంది. కాగా బాక్సింగ్డే టెస్ట్ ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ స్ధానంలో జాక్ క్రాలీకి చోటు దక్కింది. ఈ సిరీస్లో రెండు టెస్ట్లు ఆడిన బర్న్స్ కేవలం 51 పరుగులు మాత్రమే సాధించాడు. ఆదే విధంగా హసీబ్ హమీద్కి మరో అవకాశం ఇచ్చారు. ఓలీ పోప్ స్ధానంలో సీనియర్ ఆటగాడు జానీ బెయిర్స్టో జట్టులోకి వచ్చాడు. ఆదే విధంగా క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ కూడా దూరమయ్యారు. వీరి స్ధానంలో మార్క్ వుడ్, జాక్ లీచ్ జట్టులోకి వచ్చారు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. కాగా బాక్సింగ్ డే టెస్ట్లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలి అని భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఇదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్లో 2-0తో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు: హసీబ్ హమీద్, జాక్ క్రాలీ, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్(వికెట్ కీపర్), మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికు నో ఛాన్స్! -
'మా బౌలింగ్ను విమర్శించే హక్కు మీకు లేదు'
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ ఘోర పరాజయాలు నమోదు చేసింది. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో ఏకంగా 275 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఒకవైపు ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగుతుంటే.. అదే పిచ్లపై ఇంగ్లండ్ బౌలర్లు విఫలమవ్వడం ఆసక్తి కలిగించింది. చదవండి: జీవితంలో మళ్లీ టెస్టులు ఆడతాననుకోలేదు: కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. రైట్ లెంగ్త్(గుడ్లెంగ్త్) విసరడంలో విఫలమయ్యారంటూ క్రీడా విశ్లేషకులు విమర్శించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా మా బౌలర్ల వైఫల్యం ఉందంటూ ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాత్రం తమ బౌలింగ్పై వస్తున్న విమర్శలను తన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. డిసెంబర్ 26 నుంచి మూడోటెస్టు జరగనున్న నేపథ్యంలో అండర్సన్ టెలిగ్రాఫ్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'మేం బౌలింగ్ బాగా చేయలేదని విమర్శిస్తున్నారు. ఒక బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. రైట్ లెంగ్త్ వేయలేదని మీరు అంటున్నారు.. కానీ మ్యాచ్ ప్రారంభంలో రెండురోజులు గుడ్లెంగ్త్తో బౌలింగ్ వేయడానికి మా బెస్ట్ ఇచ్చాం. ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది..మాకు కలిసిరాలేదు అంతే తేడా. మ్యాచ్లు ఆడేటప్పుడు లంచ్ విరామం, టీ విరామం సమయాల్లో మా బౌలర్లంతా ఒక గ్రూఫ్గా ఏర్పడి ఎక్కడ తప్పు చేశామన్నది చర్చించుకుంటాం. గుడ్లెంగ్త్ బౌలింగ్పై దృష్టి పెట్టాలని ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. ఇక మా బౌలింగ్ను విమర్శించే హక్కు మీకు(క్రీడా విశ్లేషకులు) లేదు. అడిలైడ్ టెస్టులో మేము ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్లోనూ ఆలౌట్ చేశాం..ఇది మాత్రం మీకు కనబడలేదా? మా బ్యాట్స్మెన్ మ్యాచ్లో విఫలమయ్యారు. ఇక ఆస్ట్రేలియన్స్ మాకంటే బాగా ఆడారు. కానీ రేపటి మ్యాచ్లో మేం ఆసీస్ను ఓడించే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: BBL 2021: మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి! -
27 రోజుల తర్వాత ట్వీట్ చూసి షాక్.. వార్నర్ క్షమాపణ
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు క్రికెట్ను బ్యాలెన్స్ చేస్తూనే.. వీలున్నప్పుడల్లా వీడియోలతో అభిమానులను అలరిస్తుంటాడు. అంతేకాదు వార్నర్కు జాలిగుణం ఎక్కువ. ఎవరైనా కష్టం వచ్చింది అంటూ తనకు ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తాడు. అలాంటి వార్నర్ మొదటిసారి ఒక అభిమాని ట్వీట్కు సకాలంలో స్పందించలేదు. 27 రోజుల తర్వాత ఆ ట్వీట్ను చూసి షాకైన వార్నర్.. తన వీరాభిమానికి క్షమాపణ చెప్పాడు. చదవండి: 'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్లో దొరికాయి' విషయంలోకి వెళితే.. వేదాంతి హరీష్ కుమార్ డేవిడ్ వార్నర్కు డైహార్డ్ ఫ్యాన్. నవంబర్ 27న తొలిసారి ట్విటర్లో ''హాయ్.. హౌ ఆర్ యూ వార్నర్..'' అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 27 రోజుల పాటు ప్రతీరోజు వార్నర్కు ట్వీట్ పెడుతూనే ఉన్నాడు. కానీ యాషెస్ సిరీస్లో బిజీగా ఉన్న వార్నర్ హరీష్ కుమార్ ట్వీట్కు రిప్లై ఇవ్వలేదు. తాజాగా వార్నర్ తన వీరాభిమాని ట్వీట్ చూసి షాకయ్యాడు. ఆ తర్వాత వెంటనే.. ''సారీ.. ఎలా ఉన్నావు బ్రదర్'' అంటూ రీట్వీట్ చేశాడు. వార్నర్ నుంచి రిప్లై వచ్చిందని తెలియగానే ఎగిరి గంతేసిన హరీష్ కుమార్.. ''27 రోజులకు నన్ను గుర్తించావు.. థాంక్యూ వార్నర్ భయ్యా'' అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్ను ఫన్నీగా ట్రోల్ చేశారు.'' ఏంటి వార్నర్ భయ్యా రిప్లై ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా.. పాపం నీ వీరాభిమాని ఎంత ఫీలయ్యాడో'' అంటూ పేర్కొన్నారు. ఇక యాషెస్ సిరీస్లో బిజీగా ఉన్న వార్నర్ బ్యాట్స్మన్గా దుమ్మురేపుతున్నాడు. తొలి టెస్టులో 94 పరుగులు చేసిన వార్నర్ రెండో టెస్టులోనూ 95 పరుగులు చేశాడు. రెండుసార్లు సెంచరీ మిచ్ చేసుకున్నప్పటికి వార్నర్ ఫామ్లో ఉండడం ఆసీస్కు కలిసొచ్చే అంశం. ఇక వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉంది. డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే రోజున మూడోటెస్టు ప్రారంభం కానుంది. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ Sorry how are you https://t.co/JvjnPjtfgw — David Warner (@davidwarner31) December 23, 2021 -
అభిమానులకు ‘గుడ్న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే!
యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్ట్( బాక్సింగ్డే టెస్ట్) డిసెంబర్26 న మెలబోర్న్ వేదికగా జరగనుంది. అనూహ్యంగా ఈ మ్యాచ్కు పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తెలిపారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న వేళ ఏంసీజీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా మెల్బోర్న్లో ప్రతిరోజూ 1500 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా బుధవారం జరిగే ఈ మ్యాచ్కు ఇప్పటికే సూమారు 70,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ తెలిపారు. "మేము స్టేడియంను అన్ని విధాలా సిద్ధం చేశాము. బాక్సింగ్ డే టెస్ట్ కోసం అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాము. వ్యాక్సినేషన్ సర్టికెట్ ఉన్నవారిని లోపలకి మాత్రమే అనుమతిస్తాం" అని స్టువర్ట్ ఫాక్స్ పేర్కొన్నారు. ఇక 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్కు మాత్రం ప్రేక్షకులను అనుమతి చేయడంలేదు. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! -
'ఆస్ట్రేలియన్ కామెంటేటర్లకు పిచ్చి పట్టింది'
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ నాలుగోరోజు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ వ్యవహారంలో ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల వెకిలి నవ్వును సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. ఈ కామెంటేటర్స్లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఉండడం విశేషం. చదవండి: అసలేం చేస్తున్నావు.. నువ్వు కెప్టెన్గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్ విషయంలోకి వెళితే.. మ్యాచ్ నాలుగోరోజు ఆటలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి రూట్ కాళ్ల మధ్యలో బలంగా తాకింది. దీంతో నొప్పితో బాధపడిన రూట్.. స్టార్క్ తర్వాతి బంతిని లెగ్సైడ్ దిశగా ఆడాడు. కాగా రూట్కు నొప్పి ఉండడంతో కాళ్లను కాస్త దూరం పెడుతూ రన్స్ తీశాడు. ఇది గమనించిన ఒక ఆస్ట్రేలియన్ కామెంటేటర్ 'పాపం రూట్ నొప్పితో బాధపడుతున్నాడు.. మ్యాచ్ ఎలాగూ పోతుంది.. రిటైర్డ్హర్ట్ అయితే బాగుంటుంది''.. అన్నాడు. ఇది విన్న పాంటింగ్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయితే ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. '' రూట్ నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉంది..''.. '' ఒక జట్టు కెప్టెన్కు మీరిచ్చే గౌరవం ఇదేనా''.. '' ఒక ఆటగాడు నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వెలా వస్తుంది'' అంటూ రెచ్చిపోయారు. చదవండి: మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి Absolute scenes in the commentary box, completely losing it watching Joe Root run 😂 #Ashes pic.twitter.com/0CoJCSPTKD — 7Cricket (@7Cricket) December 19, 2021 -
విజయం దిశగా ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!
అడిలైడ్: యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 468 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 43.2 ఓవర్లలో 4 వికెట్లకు 82 పరుగులు చేసింది. బర్న్స్ (34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆటకు నేడు చివరి రోజు. మ్యాచ్ను ‘డ్రా’గా ముగించాలంటే ఇంగ్లండ్ ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 45/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 61 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మార్నస్ లబుషేన్ (51; 6 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (51; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు! -
Ashes 2021-22 Live: స్పిన్ బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్.. వీడియో వైరల్
ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ సన్ గ్లాసెస్ పెట్టుకుని స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తూ స్పిన్ బౌలింగ్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ పార్ట్ టైమ్ స్పిన్నర్గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే రూట్ గాయం కారణంగా 4వ రోజు మొదటి సెషన్లో ఫీల్డ్లోకి రాలేదు. దీంతో రాబిన్సన్ స్పిన్నర్గా అవతారం ఎత్తాడు. స్పిన్ బౌలింగ్ చేసిన రాబిన్సన్ను క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్,స్టీవ్ వా ప్రశంసించారు. ఇక రెండో టెస్ట్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. రెండో ఇన్నింగ్స్లో 230-9 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్కిన అధిక్యంతో కలుపుకుని 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 473 పరుగుల సాధిచంగా, ఇంగ్లండ్ 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 237 పరుగుల ఆధిక్యం ఆసీస్కు లభించింది. ఆస్ట్రేలియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉండగా, ఇంగ్లండ్ ఇంకా 391 పరుగులు వెనుకబడి ఉంది, మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్కు! England pacer Ollie Robinson bowling off spin 🤯😂 #Ashes #Ashes2021pic.twitter.com/ado3C7MC0V — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) December 19, 2021 -
వార్నర్ నువ్వు గ్రేట్.. నొప్పి బాదిస్తున్నా
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీ మార్క్ను చేజార్చుకున్న వార్నర్ వరుసగా 94, 95 పరుగులతో మెరిశాడు. ఇక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ సమయంలో స్టోక్స్ వేసిన బంతి వార్నర్ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో వార్నర్ బ్యాటింగ్ దిగకుండా రెస్ట్ తీసుకున్నాడు. అయితే నొప్పి నుంచి కోలుకోవడంతో వార్నర్ రెండో టెస్టులో బరిలోకి దిగాడని అంతా భావించారు. కానీ వార్నర్ ఇంకా పక్కటెముకల గాయంతో బాధపడుతూనే ఉన్నట్లు తేలింది. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో వార్నర్ ఫీల్డింగ్కు రాలేదు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు చేసిన వార్నర్ రనౌటయ్యాడు. డ్రెస్సింగ్రూమ్లో స్మిత్తో సుధీర్ఘంగా చర్చిస్తున్న సమయంలో వార్నర్ నొప్పితో బాధపడినట్లు క్లియర్గా కనిపించింది. వీడియోలో వార్నర్ స్నీజ్(ముక్కు చీదుతూ) ఒక పక్కకు పడిపోవడంతో స్మిత్తో పాటు కోచ్ జస్టిన్ లాంగర్ కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అయితే వార్నర్ తన పరిస్థితి బాగానే ఉందని సైగలు చేయడంతో అంతా కూల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. 468 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. హమీద్ హసీబ్ డకౌట్ కాగా.. బర్న్స్ 20, డేవిడ్ మలాన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 473 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 230/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇప్పటికే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో ఆటకు ఒకరోజు మొత్తం మిగిలిఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: ''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది'' Rib soreness + sneezing = scenes. Poor David Warner 🙈😅 #Ashes pic.twitter.com/nfjE6g38hv — 7Cricket (@7Cricket) December 19, 2021 -
'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'
అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ను 236 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 237 పరుగుల ఆధిక్యం ఆసీస్కు లభించింది. ఇక ఆసీస్ 473 పరుగుల భారీస్కోర్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్(93)కీలక పాత్ర పోషించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి, 290 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో జట్టు పటిష్ట స్ధితి నిలవడంతో మిగితా ఆటగాళ్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోయినా, స్టాండింగ్ కెప్టెన్ స్మిత్ మాత్రం నిద్ర పోలేదు. అర్ధరాత్రి స్మిత్ నిద్రపోకుండా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి భార్య డాని విల్లిస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ వీడియోకు "స్టీవ్ స్మిత్ తన కొత్త బ్యాట్ని చూస్తున్నారు" అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అర్ధ రాత్రి పడుకోకుండా అది ఏం పని" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ ఈ టెస్ట్కు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Kohli-Ganguly: 'కోహ్లి యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం' Steve Smith’s wife catches him shadow batting at 1am in their hotel room. 📸 Instagram/dani_willis #Ashes pic.twitter.com/5COJlUWiJt — Nic Savage (@nic_savage1) December 18, 2021 -
''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది''
Dawid Malan Frustrated About Own Team Batting Failure.. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆటతీరును కనబరుస్తుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 473 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే 12 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మలాన్(80)లు కలిసి మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. అయితే రూట్, మలాన్లు వెనుదిరిగిన వెంటనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. స్టోక్స్ 34 పరుగులు మినహా మిగతావారు అంతా విఫలమయ్యారు. కేవలం 84 పరుగుల వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 237 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్టయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 2, ట్రెవిస్ హెడ్ 8 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: Ashes 2nd Test Australia Vs England: స్టార్క్ విజృంభణ.. ఆసీస్కు భారీ అధిక్యం ఈ నేపథ్యంలో డేవిడ్ మలాన్ తన సొంత జట్టుపైనే అసహనం వ్యక్తం చేశాడు.'' ఈరోజు మా ఆటతీరు దురదృష్టకరంగా సాగింది. అన్లక్కీ అనే పదం ఇక్కడ వాడకూడదు. మ్యాచ్లో కొన్ని చెత్తషాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నాం. కానీ మా ఆటతీరులో నాణ్యత లోపించింది. జట్టుగా సమష్టిగా పరుగులు చేయడంలో విఫలమయ్యాం. నేను, రూట్ కలిసి 138 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసినప్పటికి దానిని నిలబెట్టుకోలేకపోయాం. ఇదే నాకు కోపం, చిరాకు తెప్పించింది. కేవలం 80 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లు చేజార్చుకొని ప్రత్యర్థికి భారీ ఆధిక్యం అందించాం. అయితే ఇప్పటికి మాకు అవకాశాలు సన్నగిల్లలేదు. ఆసీస్ను రెండో ఇన్నింగ్స్లో తక్కువకు ఆలౌట్ చేస్తే పోరాడగలుగుతామనే నమ్మకం ఉంది. ఇన్ని చెప్పినా ఆరోజు ఆట ఎలా సాగాలో అలాగే నడుస్తుంది.. మన చేతుల్లో ఏం ఉండదు. ఎందుకంటే ఇది జెంటిల్మన్ గేమ్'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? -
పింక్ బాల్ టెస్ట్లో ఆడడం చాలా కష్టం: మార్నెష్ లబూషేన్
యాషెస్ సిరీస్లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నెష్ లబూషేన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం విలేకరల సమావేశంలో మాట్లాడిన లబూషేన్ పలు విషయాలను వెల్లడించాడు. పింక్బాల్తో ఆడడం చాలా కష్టమని, అంత సులభంగా పరుగులు రాబట్టలేమని లబూషేన్ తెలిపాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా భిన్నమైనదని, ఒక్కో పిచ్పై ఒక్కోలా పింక్ బాల్ ప్రవర్తిస్తుందని అతడు చెప్పాడు. "పింక్ బాల్తో ఆడడం చాలా కష్టం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. సాధరణ టెస్ట్ మ్యాచ్ కంటే భిన్నంగా ఉంటుంది. మేము గతంలో ఇదే వేదికలో పాకిస్తాన్తో ఆడాము. అప్పుడు వికెట్పై కొంచెం గ్రాస్ ఉండడంతో పిచ్ చదునుగా ఉండేది. దీంతో బంతి అంత బౌన్స్గా కాలేదు. కానీ ప్రస్తుతం పిచ్పై ఎక్కువగా గ్రాస్ ఉండడంతో బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది. దీంతో ఆడడం చాలా కష్టం అవుతోంది. రెండో రోజు ఆట ప్రారంభించినప్పుడు పరుగులు ఎలా సాధించాలో నాకు అర్ధం కాలేదు" అని లబూషేన్ పేర్కొన్నాడు. ఇక ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరల్లో లబూషేన్(103), వార్నర్(95), స్మిత్(93) టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: IPL 2022: ‘‘అవును.. అతడిని తీసుకున్నాం’’.. కొత్త ఫ్రాంఛైజీ మెంటార్గా గౌతీ -
పింక్ బాల్ టెస్టులోనూ అదే ఆటతీరు.. నువ్వు మారవా!
Cricekt Fans Troll Rory Burns For Continuos Failure Ashes 2021... ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ దారుణ ఆటతీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విషయంలోకి వెళితే.. యాషెస్ సిరీస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ తొలి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఏదో పొరపాటు జరిగిందని సరిపెట్టుకుంటే రెండో ఇన్నింగ్స్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆ టెస్టు ఓడిపోవడం జరిగిపోయింది. చదవండి: Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్ ఇక అడిలైడ్ వేదికగా మొదలైన పింక్బాల్ టెస్టు ద్వారా అయినా బర్న్స్ గాడిన పడతాడనుకున్నారు. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పైగా ఈసారి బర్న్స్కు జతగా మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఫెయిలయ్యాడు. ఆస్ట్రేలియా 473 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగులు మాత్రమే చేసిన బర్న్స్ మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఆరు పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల నుంచి కత్తుల్లా దూసుకొస్తున్న వేళ.. బ్యాడ్లైట్ కారణంగా ఆట తొందరగా ముగించడంతో ఇంగ్లండ్ బతికిపోయింది. అయితే రోరీ బర్న్స్పై అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. తొలి టెస్టులో విఫలమయ్యావు.. కనీసం రెండో టెస్టుకు గాడినపడతావనుకున్నా.. పద్దతి మార్చుకోలేదు.. పింక్ బాల్ టెస్టులోనూ అదే ఆటతీరు.. ఇక నువ్వ మారవా అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ మూడో రోజు ఆటలో కాస్త నిలదొక్కుంది. ఓపెనర్లు ఔటైన తర్వాత కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మలాన్( 73 బ్యాటింగ్) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 323 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం Rory Burns every time he bats pic.twitter.com/NgBD08JW4O — Greggs and Tomelettes (@hknighthoe) December 17, 2021 Rory Burns in the changing room: pic.twitter.com/bFh3gEkuj9 — Cricket Mate 🏏 (@CricketMate_) December 17, 2021 -
ఇంగ్లండ్కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి చూసిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంగ్లండ్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్రేట్ కారణంగా ఇంగ్లండ్కు డబ్ల్యూటీసీ నుంచి 8 పాయింట్లు కోత విధించింది. ఈ దెబ్బతో ఇంగ్లండ్ డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. అయితే తొలి టెస్టు ముగిసిన వెంటనే స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ అప్పుడే ఇంగ్లండ్ జట్టు నుంచి 5 పాయింట్లు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దీనికి క్లారిటీ ఇస్తూ శుక్రవారం ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు నాలుగురోజుల్లోనే ముగిసింది. అయితే ఆట ముగిసేసమయానికి బౌలింగ్లో ఇంగ్లండ్ 8 ఓవర్లు వెనుకబడినట్లు తేలింది. ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆటగాళ్లు, సిబ్బంది నుంచి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. దీంతో 8 ఓవర్ల స్లో ఓవర్ రేటు కారణంగా ఐదు పాయింట్లకు బదులు ఓవర్కు ఒక పాయింట్ చొప్పున 8 పాయింట్లు ఇంగ్లండ్ జట్టు నుంచి కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్లేయింగ్ రూల్స్ క్లాజ్ 16.1.2 ప్రకారమే ఇంగ్లండ్ జట్టు నుంచి ఈ కోత విధిస్తున్నట్లు ఐసీసీ వివరించింది. ఇక ఇంగ్లండ్ తాజాగా 8 పాయింట్లు కోల్పోవడంతో ఓవరాల్గా 10 పాయింట్లు కోల్పోయి 6 మ్యాచ్ల్లో 1 విజయం.. మూడు ఓటములు.. ఇక డ్రాతో 10 పర్సంటేజీ పాయింట్లతో డబ్ల్యూటీసీ 2021-23 పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ రూల్ ప్రకారం మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. Here is how the WTC points table looks like after England are penalised 8 points for slow over-rate in the first Ashes Test 📈#Australia #England #AUSvENG #Ashes pic.twitter.com/hwRq2u4MCP — Sportskeeda (@Sportskeeda) December 17, 2021 -
దుమ్మురేపిన లబుషేన్, స్మిత్.. పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా
అడిలైడ్: ‘యాషెస్’ సిరీస్ రెండో టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన వెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను కష్టాల్లో పడేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం మ్యాచ్ను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ఆట సాగుతున్న సమయంలో ఓవల్ మైదానానికి సమీపంలోనే పిడుగు పడటంతో వెంటనే ఆటను ఆపేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లబుషేన్ (103; 8 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్మిత్ (93; 12 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఆ అవకాశం కోల్పోయాడు. -
Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత..
Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 150 మ్యాచ్లు ఆడిన మూడో ఇంగ్లండ్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. బ్రాడ్కు ముందు జేమ్స్ ఆండర్సన్(167 టెస్ట్లు), అలిస్టర్ కుక్(161) ఇంగ్లండ్ తరఫున ఈ ఘనతను సాధించారు. Congratulations on an incredible achievement, @StuartBroad8! 👏#Ashes | 🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/ySqWgT2Dcb — England Cricket (@englandcricket) December 16, 2021 ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(200) పేరిట ఉండగా.. బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం 525 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), జేమ్స్ ఆండర్సన్(632)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రసుత్తం ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(95) వరుసగా రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్, బ్రాడ్కు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: విరాట్లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్మాన్లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్
యాషెస్ సిరీస్లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుతమైన క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన సువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో.. మార్కస్ హారిస్ లెగ్సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్కు దూరంగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ నిరాశగా పెవిలియన్కు చేరాడు. కాగా ఈ క్యాచ్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇక బట్లర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండో టెస్ట్కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్దేవ్ సంచలన వాఖ్యలు INSANE! Buttler pulls in an all-timer behind the stumps! #Ashes pic.twitter.com/v96UgK42ce — cricket.com.au (@cricketcomau) December 16, 2021 -
క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్
Ben Stokes Bouncer To Joe Root.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు సమాయత్తమవుతుంది. తొలి టెస్టులో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో టెస్టులో గెలిచి తిరిగి ఫామ్లోకి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ తమ ప్రాక్టీస్లో జోరు పెంచింది. చదవండి: Virat Kohli: ఒకప్పుడు సచిన్, ద్రవిడ్లు అనుభవించారు.. ఇప్పుడు కోహ్లి కాగా ప్రాక్టీస్ సెషన్లో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ బౌన్సర్ విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న రూట్పైకి వచ్చిన బంతి తలకు బలంగా తగిలింది. అయితే హెల్మెట్ ఉండడంతో రూట్కు పెద్దగా గాయం కాలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ తన ప్రాక్టీస్ సెషన్ను కొనసాగించాడు. ఇంకో విశేషమేమిటంటే.. ఇంగ్లండ్ ఆటగాళ్లందరి కంటే చివరగా రూట్ ప్రాక్టీస్ నెట్ వీడడం ఆసక్తి కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మరోవైపు తొలి టెస్టులో బౌలింగ్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్టోక్స్ మోకాలి గాయంతో రెండో టెస్టు ఆడేది అనుమానం కలిగింది. కానీ అతను బౌలింగ్ చేసిన తీరు చూస్తే పింక్బాల్ టెస్టు(డే నైట్)కు సిద్ధంగా ఉన్నట్లు ఈసీబీకి తెలియజేశాడు. కాగా డిసెంబర్ 16 నుంచి ఇరుజట్ల మధ్య పింక్బాల్ టెస్టు జరగనుంది. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు Ben Stokes hits Joe Root on the head in the Adelaide nets. Box office, always. pic.twitter.com/MBbac4RSsR — Will Macpherson (@willis_macp) December 14, 2021 No surprises that Joe Root is the last to leave the nets at England training. Copped a knock to the helmet off Ben Stokes a bit earlier but didn’t appear affected. He’s in nice touch #Ashes pic.twitter.com/TYHB1ZaVKf — Louis Cameron (@LouisDBCameron) December 14, 2021 -
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్షాక్.. డేవిడ్ వార్నర్కు గాయం
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు మరో బిగ్షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. తొలి టెస్ట్లో 94 పరుగులు సాధించి జట్టు విజయంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. వార్నర్ స్ధానంలో ఉస్మాన్ ఖవాజా తుది జట్టులోకి రానున్నాడు. ఇక తొలి టెస్ట్లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్ను ఘనంగా ఆరంభించింది. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్16న ప్రారంభం కానుంది. అదే విధంగా ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజల్వుడ్ కూడా రెండో టెస్ట్కు గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు( అంచనా): పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ మార్కస్ హారిస్ అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, జో రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, -
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
యాషెస్ సిరీస్లో రెండో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. దీంతో హాజల్వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్ను ఎంపిక చేశారు. కాగా రెండేళ్ల తర్వాత రిచర్డ్సన్కు టెస్ట్ జట్టులో తిరిగి చోటు దక్కింది. తొలి టెస్ట్లో జోష్ హాజల్వుడ్ మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ వేదికగా జరగిన తొలి టెస్ట్లో కూడా గాయంతోనే హాజల్వుడ్ ఆడినట్లు తెలుస్తోంది. ఇక తొలి టెస్ట్లో ఘన విజయంతో యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ప్రస్తుతం అసీస్ 5 టెస్ట్ల సిరీస్లో 1-0 తేడాతో అధిక్యంలో ఉంది. అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 16న ప్రారంభం కానుంది. చదవండి: Rohit Sharma: రోహిత్పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు.. -
Ashes 1st Test: ఆసీస్ బౌలర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Nathan Lyon: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ పలు అరుదైన ఘనతలను సాధించాడు. ఈ మ్యాచ్లో డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన లియోన్.. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ఏషియన్ ఆఫ్ స్పిన్నర్గా, రెండో నాన్ ఏషియన్ స్పిన్ బౌలర్గా(షేన్ వార్న్(708)), మూడో ఆసీస్ బౌలర్గా(వార్న్, మెక్గ్రాత్(563)), ఓవరాల్గా ఈ ఘనత సాధించిన17వ బౌలర్గా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 34 ఏళ్ల నాథన్ లియోన్ ఈ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా 101 టెస్ట్ల్లో 403 వికెట్లు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్లో మరో విశేషం కూడా ఉంది. లియోన్ గతేడాది జనవరిలో ఇదే వేదికపై తన 399వ వికెట్ సాధించాడు. నాటి నుంచి దాదాపు ఏడాదిపాటు ఒక్క వికెట్ కోసం ఎదురు చూసిన లియోన్.. ఈ మ్యాచ్లో ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఆసీస్.. పర్యాటక ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు బోర్డు: ఇంగ్లండ్ 147 & 297 ఆస్ట్రేలియా 425 & 20/1 చదవండి: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. -
డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు
Alex Carey Suprass Rishab Pant And 5 Others Set New Test Record Debut.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ డెబ్యూ టెస్టులోనే అదరగొట్టాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు ద్వారా క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్యాటర్గా 12 పరుగులు చేసిన క్యారీ పెద్దగా ఆకట్టుకోకున్నా వికెట్ కీపర్గా మాత్రం అదుర్స్ అనిపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్గా 8 క్యాచ్లు అందుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే అత్యధిక క్యాచ్లు తీసుకున్న తొలి వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీ రికార్డు సాధించాడు. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర ఇంతకముందు రిషబ్ పంత్(టీమిండియా) సహా క్రిస్ రీడ్, బ్రియాన్ టేబర్, చమర దనుసింఘే, పీటర్ నెవిల్, అలన్ నాట్లు తమ డెబ్యూ టెస్టులో వికెట్ కీపర్గా ఏడు క్యాచ్లు అందుకున్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఒక టెస్టులో వికెట్ కీపర్గా తొమ్మిది క్యాచ్లు తీసుకున్నప్పటికీ అతనికి డెబ్యూ టెస్టు కాకపోవడం విశేషం. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు ఇదే మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400వ వికెట్ల మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆసీస్ మూడో బౌలర్గా.. ఓవరాల్గా 17వ బౌలర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించింది. ఆసీస్ ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 16- 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. చదవండి: వన్డే వరల్డ్కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే Click Video For Here: Alex Carey Suprass Rishab Pant And 5 Others https://t.co/vMdRHsexqM — sakshi analytics (@AnalyticsSakshi) December 11, 2021 Alex Carey becomes the first player in men's Tests to take eight catches on debut! #Ashes https://t.co/H7QXaUzvGY — cricket.com.au (@cricketcomau) December 11, 2021 -
నాలుగు రోజుల్లోనే ముగించారు.. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం
Ashes 2021 Aus Won By 9 Wickets Vs Eng 1st Test.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. చదవండి: Ashes Test Series: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20 అంతకముందు మూడోరోజు ఆట ముగిసేసమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్లో తేలిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్ 73వ ఓవర్లో జట్టు స్కోరు 223 పరుగులు ఉన్నప్పుడు.. 82 పరుగుల చేసిన మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. అక్కడి నుంచి ఏ దశలోనూ ఇంగ్లండ్ కోలుకోకుండా ఆసీస్ బౌలర్లు దెబ్బతీస్తూ వచ్చారు. చివరికి 74 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. జో రూట్ 89 పరుగులు చేయగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆసీస్ బౌలింగ్లో నాథన్ లియోన్ 4, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర ఇక తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్లో ట్రెవిస్ హెడ్(152 పరుగులు) శతకంతో మెరవడం.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులు, లబుషేన్ 74 పరుగులతో రాణించడంతో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్: తొలి ఇన్నింగ్స్: 147 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 297 ఆలౌట్ ఆస్ట్రేలియా: తొలి ఇన్నింగ్స్: 425 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 20/1 -
74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20
Ahses 2021 AUS vs ENG 1st Test.. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయలక్ష్యం 20 పరుగులు. మూడోరోజు ఆట ముగిసేసమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్లో తేలిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్ 73వ ఓవర్లో జట్టు స్కోరు 223 పరుగులు ఉన్నప్పుడు.. 82 పరుగుల చేసిన మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర అక్కడి నుంచి ఏ దశలోనూ ఇంగ్లండ్ కోలుకోకుండా ఆసీస్ బౌలర్లు దెబ్బతీస్తూ వచ్చారు. చివరికి 74 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. జో రూట్ 89 పరుగులు చేయగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆసీస్ బౌలింగ్లో నాథన్ లియోన్ 4, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు. -
వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర
Nathan Lyon 400 Wicket Milestone In Test Cricket.. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ టెస్టుల్లో 400వ వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా గబ్బా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఓవరాల్గా చూసుకుంటే 400 వికెట్ల మార్క్ను చేరుకున్న 17వ బౌలర్గా నిలిచాడు. చదవండి: Ashes Series: ఓవైపు మ్యాచ్.. మరోవైపు ప్రపోజల్.. ఇక్కడ మరో విశేషమేమిటంటే నాథన్ లియోన్ గతేడాది జనవరిలో ఇదే గబ్బా మైదానంలో టీమిండియాతో జరిగిన టెస్టులో వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేయడం ద్వారా 399 వ వికెట్ సాధించాడు. అప్పటినుంచి దాదాపు ఏడాదిపాటు ఒక వికెట్ తీయడం కోసం ఎదురుచూడడం ఆసక్తి కలిగించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ఎక్కువగా టెస్టులు ఆడకపోవడం.. గాయాలతో లియోన్ దూరమవ్వడం.. ఇక తాను ఆడిన రెండు, మూడు టెస్టులోనూ లియోన్ 33 ఓవర్లపాటు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. ఎట్టకేలకు యాషెస్ సిరీస్లో వికెట్ తీయడం ద్వారా లియోన్ చరిత్ర సృష్టించాడు. చదవండి: Ashes Test Series: మార్క్వుడ్ బీమర్.. బ్యాట్స్మన్ దవడ పగలింది 400 Test Match Wickets For Nathan Lyon 👏 - Third Australian player to scalp 400 wickets in Tests - 17th man overall to reach the milestone AUSTRALIA'S MOST SUCCESSFUL OFF SPINNER 🐐 . .#Cricket #AUSvENG #Ashes #Ashes21pic.twitter.com/wgVcaFynmN — CRICKETNMORE (@cricketnmore) December 11, 2021 -
ఇంగ్లండ్ పోరాటం
బ్రిస్బేన్: కెప్టెన్ జో రూట్ (158 బంతుల్లో 86 బ్యాటింగ్; 10 ఫోర్లు), డేవిడ్ మలాన్ (177 బంతుల్లో 80 బ్యాటింగ్; 10 ఫోర్లు) వీరోచిత ఆటతీరుతో యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కోలుకుంది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రూట్, మలాన్ మూడో వికెట్కు 159 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ఏకంగా 278 పరుగుల ఆధిక్యం కోల్పోయి పరాజయానికి బాటలు వేసుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్... ప్రస్తుతం మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. చేతిలో 8 వికెట్లతో చెప్పుకోదగ్గ పరుగులు సాధిస్తే చివరి ఇన్నింగ్స్లో ఆసీస్కు సవాల్ విసరవచ్చు. అర్ధ సెంచరీ చేసిన క్రమంలో రూట్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్గా నిలిచాడు. మైకేల్ వాన్ (2002లో 1,481 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో రూట్ ఇప్పటికి 1,541 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 343/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 104.3 ఓవర్లలో 425 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (152; 14 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి వికెట్గా వెనుదిరిగాడు. -
మార్క్వుడ్ బీమర్.. బ్యాట్స్మన్ దవడ పగలింది
Mark Wood Beamer Floordown Travis Head.. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 81వ ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ మార్క్వుడ్ వేసిన బీమర్ దెబ్బకు ట్రెవిస్ హెడ్ నొప్పితో విలవిల్లాలాడాడు. వుడ్ చేతి నుంచి జారిన బంతి బౌన్స్ అవకుండా నేరుగా హెడ్ భుజం ఎత్తులో వచ్చింది. దీనిని డిఫెన్స్ చేసే క్రమంలో హెడ్ బ్యాట్ అడ్డుపెట్టినప్పటికి.. 136 కిమీవేగంతో వచ్చిన బంతి గోవ్స్, బ్యాట్ను తాకుతూ దవడ కింద బాగాన్ని అదిమింది. దీంతో హెడ్ ఉన్నచోటనే క్రీజులో కిందపడి కాసేపు నొప్పితో బాధపడ్డాడు. చదవండి: Aus Vs Eng Ahses 1st Test: ట్రావిస్ హెడ్ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్ ఇక ఇంగ్లండ్ బౌలర్ మార్క్వుడ్ ట్రెవిస్ హెడ్ను క్షమాపణ కోరగా.. ఫిజియో వచ్చి అతన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో డగౌట్లో కూర్చున్న ఆసీస్ ఆటగాళ్లు కాస్త ఆందోళనకు గురవ్వడం వీడియోలో కనిపించింది. ఇక ఈ మ్యాచ్లో ట్రెవిస్ హెడ్ భారీ సెంచరీతో(152 పరుగులు) ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 278 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక శతకంతో మెరిసిన ట్రెవిస్ హెడ్ గబ్బా మైదానంలో అత్యంత వేగంగా సెంచరీ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు 2015లో జో బర్న్స్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలబడింది. ప్రస్తుతం 65 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్(13), హసీబ్ హమీద్(27)లు తక్కువ స్కోరు చేసినప్పటికి డేవిడ్ మలాన్(72*), కెప్టెన్ జో రూట్(82*) నిలదొక్కుకున్నారు. ఇంగ్లండ్ ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే కుప్పకూలింది. చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత A quick Beamer from Mark Wood hit Travis Head on his body and he is down.#Ashes #Ashes2021 #TravisHead pic.twitter.com/62eBp6LFrh — Sravan (@Sravan_457) December 9, 2021 We're glad Marnus Labuschagne found this funny 🥴🤨 "I'm not sure why he's got a grin there? The two either side are pretty worried..." Travis Head was cleaned up by a Mark Wood beamer, something his teammate found hilarious 🙃#AshesDaily | #Ashes pic.twitter.com/LEon4bmYSF — Cricket on BT Sport (@btsportcricket) December 9, 2021 -
Ashes 1st Test: ట్రావిస్ హెడ్ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్
Travis Head Century Puts Australia In Command Against England In Ashes 1st Test: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్లో ఆతిధ ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆటలో వార్నర్(94), లబూషేన్(74) అర్థ శతకాలకు ట్రావిస్ హెడ్(95 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సుడిగాలి శతకం తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆసీస్ పేసర్లు కమిన్స్(5/83), హేజిల్వుడ్(2/42), స్టార్క్(2/35), గ్రీన్(1/6) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బట్లర్(39) టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మూడు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్ట్లో ఆసీస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: Rohit Sharma: అచ్చొచ్చిన డిసెంబర్.. మరో ఘనత కూడా ఇదే నెలలోనే..! -
56వ నెంబర్తో బరిలోకి..
Ben Stokes Wore 56 Number ArmBand Tribute For His Father.. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ దాదాపు 4 నెలల తర్వాత యాషెస్ సిరీస్ ద్వారా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో స్టోక్స్ చేతికి 56వ నెంబర్ ఉన్న రిబ్బన్ వేసుకొని బరిలోకి దిగడం ఆసక్తికలిగించింది. అయితే స్టోక్స్ ఆ రిబ్బన్ ధరించడం వెనుక పెద్ద కథే ఉంది. చదవండి: Ashes Series: స్టోక్స్ సూపర్ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్ స్టోక్స్కు తన తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ అంటే అమితమైన ప్రేమ. గతేడాది డిసెంబర్లో గెరార్డ్ బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన స్టోక్స్ ఒత్తిడికి లోనయ్యాడు. ఆటపై సరిగా ఫోకస్ పెట్టలేకపోయాడు. ఇక స్టోక్స్ ఆటకు నాలుగు నెలలు దూరంగా ఉండడం వెనుక ఇదీ ఒక కారణమే. ఇదిలా ఉంటే డిసెంబర్ 8న(బుధవారం) స్టోక్స్ తండ్రి గెరార్డ్ 56వ పుట్టినరోజు. తండ్రి పుట్టినరోజు సందర్భంగా.. స్టోక్స్ ఆయన గుర్తుగా యాషెస్ తొలి టెస్టు మ్యాచ్లో 56వ నెంబర్ ఉన్న రిబ్బన్ను ధరించాడు. ఇక 1982లో న్యూజిలాండ్ రగ్బీ టీమ్లో అడుగుపెట్టిన గెరార్డ్ స్టోక్స్ క్యాప్ నెంబర్ కూడా 56 కావడం విశేషం. ఈ రెండు సందర్భాలను కలుపుతూ స్టోక్స్ తన తండ్రికి ఘన నివాళి అందించాడు. చదవండి: Ben Stokes No Balls: స్టోక్స్ నోబాల్స్ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా? ఇక నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్తో తొలి టెస్టులో బ్యాటింగ్లో నిరాశపరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన స్టోక్స్.. బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాడు. ఏకంగా 14 నోబాల్స్ను విసిరిన స్టోక్స్ 9 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 343పరుగులు చేసింది. ట్రేవిస్ హెడ్ (112* పరుగులు) సూపర్ సెంచరీ సాధించి ఆడుతుండగా.. మిచెల్ స్టార్క్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు వార్నర్ 94 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 196 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: David Warner: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ View this post on Instagram A post shared by Ben Stokes (@stokesy) -
యాషెస్ సిరీస్కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్కప్ హీరోకు నో ఛాన్స్..
Australia announce Ashes squad: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఆసీస్ టీ20 వరల్డ్కప్ హీరో మిచల్ మార్ష్కు చోటు దక్కలేదు. మరో వైపు ఆజట్టు సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు రెండు ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ల్లో చోటు దక్కింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా బుధవారం(నవంబర్-17) ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. డిసెంబర్ 8న బ్రిస్బేన్లో మొదటి టెస్టు, 16న ఆడిలైడ్లో రెండో టెస్టు, 26న మెల్బోర్న్లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్లో జనవరి 14న జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: టిమ్ పైన్ (సి), పాట్ కమిన్స్ , కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, స్విప్సన్, డేవిడ్ వార్నర్ యాషెస్ సిరీస్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్కి ఇదే మొట్టమొదటి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు’ అంటూ రాసుకొచ్చింది. 1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్ మీడియా ‘యాషెస్ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్కి ‘ది యాషెస్’ అనే పేరు వచ్చింది. చదవవండి: కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్తకొత్తగా..! -
ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ రెడీ
Ben Stokes Added To England Squad For Ashes Series: యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త అందింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నాలుగున్నర నెలల విరామం తర్వాత టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత కొంత కాలంగా చేతి వేలి గాయం, మానసిక సమస్యలతో సతమతమవుతున్న స్టోక్స్.. ఇటీవలే కోలుకున్నట్లు ప్రకటించాడు. దీంతో నవంబర్ 4న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న ఇంగ్లీష్ జట్టుతో అతను చేరనున్నాడు. స్టోక్స్ చివరిసారిగా జులైలో పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో ఆడాడు. కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇరు జట్లు 5 టెస్ట్ల్లో తలపడనున్నాయి. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, డామ్ బెస్, రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: అలాంటి మిస్టరీ బంతులను పాక్లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారు..! -
మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు: టిమ్ పైన్
Tim Paine Comments On England Key Players: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కీలక వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ఈ ఏడాది యాషెస్ సిరీస్ తప్పక జరుగుతుందని అతడు తెలిపాడు. ఈ వారంలోపు యాషెస్లో పాల్గోనే జట్టును ఇంగ్లండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పైన్ వెల్లడించాడు. కాగా ఇటీవల కాలంలో ఇంగ్లండ్ అగ్రశ్రేణి ఆటగాళ్లు కెప్టెన్ జో రూట్, జోస్ బట్లర్, జేమ్స్ ఆండర్సన్ బయో-బబుల్ ఆంక్షలను సడలించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే వీళ్ల అభ్యర్ధను అసీస్ ప్రభుత్వం నిరాకరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టిమ్ పైన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తీరుపై పెదవి విరిచాడు. "వాళ్లు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని రమ్మని బలవంతం చేయడం లేదు. మీరు రాకూడదనుకుంటే, రాకండి. అయినా యాషెస్ సీరీస్ ముందుకు వెళ్తోంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 8 న జరుగుతుంది. జో రూట్ ఇక్కడ ఉన్నా లేకపోయినా, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇక్కడకు వస్తారు అనుకుంటున్నా. మేం మెరుగైన సౌకర్యాలే కల్పిస్తాం. ఎందుకంటే మీతో పాటు మేం కూడా అవే నిబంధనలు(బయో బబుల్) పాటించాలి కదా " అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. రెండు దేశాల మధ్య ప్రసిద్ధ యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే అంతకు ముందు సిరీస్కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు తిరుగుబాటు మొదలు పెట్టడంతో యాషెస్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చదవండి:Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
మరో సెంచరీ బాదేసిన స్మిత్
మాంచెస్టర్ : యాషెస్ సిరీస్లో స్టీవ్ స్మిత్ తన భీకరపామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆటలో స్మిత్(100, 163 బంతుల్లో) సెంచరీ సాధించి టెస్టు కెరీర్లో 26 వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండోరోజు లంచ్ సమయానికి ఆసీస్ 5 వికెట్లకు 245 పరుగులు చేసింది. మొదటిరోజు 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్నస్ లబుషేన్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 116 పరుగులు జోడించారు. లబూషేన్ ఔటయ్యాక ఇతర బ్యాట్సమెన్ల సహకారంతో రెండోరోజు ఆటను కొనసాగించిన స్మిత్ 163 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్కు ఈ సిరీస్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. కాగా, మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్కు మరో పరీక్ష
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్కు మరో పరీక్ష. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో యాషెస్ బరిలో దిగిన ఆతిథ్య జట్టుకు మొదటి టెస్టులో తలబొప్పి కట్టింది. తమతో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో కుప్పకూల్చేలా కనిపించిన ఇంగ్లండ్ తర్వాత స్టీవ్ స్మిత్ను అడ్డుకోలేక చేతులెత్తేసి ఏకంగా 251 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్కు అసలు ముప్పు స్మిత్తోనే. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ గాయంతో దూరమైనందున యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రం ఖాయమైంది. దీనికిముందే ఆల్రౌండర్ మొయిన్ అలీపై వేటు వేసిన ఇంగ్లండ్... 12 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్ జాక్ లీచ్కు చోటిచ్చింది. బ్యాటింగ్లో కెప్టెన్ జో రూట్ పైనే భారం వేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్, రోరీ బర్న్స్లతో పాటు బట్లర్, బెయిర్స్టో రాణిస్తేనే ప్రత్యర్థికి సవాల్ విసరగలుతుంది. పునరాగమనంలో స్మిత్ రెండు శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా లయ అందుకుంటే కంగారూలకు తిరుగుండదు. ఉస్మాన్ ఖాజా, ట్రావిస్ హెడ్, మాధ్యూ వేడ్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కమిన్స్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తుండగా, స్పిన్నర్ లయన్ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. పేసర్ ప్యాటిన్సన్కు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా... మిషెల్ స్టార్క్, హాజల్వుడ్లతో 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టెస్టులోనూ ఓడితే సిరీస్లో ఇంగ్లండ్ పుంజుకోవడం కష్టమే. యాషెస్ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్ నెగ్గిన సందర్భాలు (1981, 2005) రెండే ఉండటం గమనార్హం. -
ఇంగ్లండ్కు దెబ్బ మీద దెబ్బ
లండన్: తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచి రెట్టింపు ఉత్సాహంతో యాషెస్ సిరీస్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో చిత్తుచిత్తుగా ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు ఆగస్టు 14నుంచి ప్రారంభం కాబోయే రెండు టెస్టుకు సన్నద్దం అవుతోంది. అయితే ఇప్పటికే రెండో టెస్టుకు ఇంగ్లండ్ ప్రధాన ఆయుధం జేమ్స్ అండర్సన్ దూరమవగా.. తాజాగా మరో పేస్ బౌలర్ ఒల్లీ స్టోన్ గాయపడ్డాడు. బుధవారం ప్రాక్టీస్లో గాయపడిన స్టోన్కు వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి రెండు వారాల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అయితే మరోసారి స్కానింగ్ చేశాక రెండో టెస్టుకు అందుబాటులో ఉండేది లేనిది తెలుస్తుందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. స్టోన్స్కు మెరుగైన చికిత్స నడుస్తుందని రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో స్టోన్ అరంగేట్రం చేశాడు. మూడు వికెట్లతో రాణించాడు. దీంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక తొలి టెస్టులో పట్టుమని ఐదు ఓవర్లు కూడా వేయకుండానే కండరాలు పట్టేయడంతో అండర్సన్ మైదానాన్ని వీడాడు. అనంతరం స్కానింగ్లో అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలపడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక వీరిద్దరూ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే ఇంగ్లండ్ బౌలింగ్ మరింత బలహీనపడుతుంది. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్ 251 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. కాగా నిషేధం తర్వాత ఆడుతున్న ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు బాది జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
స్టోక్స్కు ప్రమోషన్.. ఆర్చర్ అరంగేట్రం
లండన్: అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చని జోఫ్రా ఆర్చర్ మరోసారి నిరూపించాడు. జోఫ్రా ఆర్చర్ ప్రతిభ ఇంగ్లండ్కు అవసరమున్ననేపథ్యంలో నిబంధనలను సవరించి మరీ జట్టులోకి చోటు కల్పించారు. ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టులో అవకాశం కల్పించిన ఇంగ్లండ్ సెలక్టర్లు.. తాజాగా యాషెస్ సిరీస్ కోసం కూడా ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే యాషెస్ సిరీస్ తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. జోయ్ రూట్ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించిన సెలక్టర్లు.. అనూహ్యంగా ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్కు తిరిగి వైస్ కెప్టెన్గా బాధ్యతలను అప్పగించింది. ఐర్లాండ్ టెస్టులో అరంగేట్రం చేసిన జేసన్ రాయ్ను యాషెస్ సిరీస్కూ ఎంపిక చేశారు. గత మ్యాచ్కు విశ్రాంతినిచ్చిన జోస్ బట్లర్, అండర్సన్, బెన్ స్టోక్స్లు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా టీ20ల్లో, తాజా ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేయనున్నాడు. అండర్సన్, బ్రాడ్లకు తోడు క్రిస్ వోక్స్ తోడవడంతో ఇంగ్లండ్ బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఇక తొలిసారి ప్రపంచకప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ అదే ఉత్సాహంలో యాషెస్ సాధించేయాలని తెగ ఆరాటపడుతోంది. తొలిటెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జిమ్మీ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, బట్లర్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఓల్లీ స్టోన్, క్రిస్ వోక్స్ -
నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..
సిడ్నీ : యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్ బెన్క్రాఫ్ట్ ఎట్టకేలకు పిలుపునందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యులు గల జట్టులో చోటుదక్కించుకున్నాడు. బెన్క్రాఫ్ట్తో ఆసీస్ సీనియర్ ఆటగాళ్లు ఓపెనర్ డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు సైతం శిక్షను అనుభవించినప్పటికీ.. ప్రపంచకప్ టోర్నీతో వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశారు. బెన్క్రాఫ్ట్ నిషేధం 9 నెలల్లోనే ముగిసినప్పటికీ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. యాషెస్ సిరీస్ కోసం టిమ్ పెయిన్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల గల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ నెసెర్ అనే అన్క్యాప్డ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ‘25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టమైన పని. ఈ సిరీస్ కోసం అద్భుతంగా సాధన చేశాం. ఇందులో 8 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ తరఫున గత నెలరోజులుగా ఇంగ్లండ్లో ఆడుతున్నారు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఆరుగురిని తీసుకున్నాం. కౌంటీ క్రికెట్ ఆడిన మరో ముగ్గురిని ఎంపిక చేశాం. తొలి టెస్ట్కు సిద్ధంగా ఉండేలా చూసుకున్నాం’ అని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ జట్టును ప్రపంచం ముందు దోషులగా నిలబెట్టింది. దీంతో ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన శిక్షలు విధించడం.. శిక్షణ కాలం ముగిసి పునరాగమనం చేయడం తెలిసిందే. -
ప్రపంచకప్ ఎఫెక్ట్: రాయ్ తొలిసారి
లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్కు ముందు ఈ టెస్టును వార్మప్గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్లను పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టెస్టు జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్. -
ఇంగ్లాండ్ చిత్తు.. యాషెస్ ఆసీస్ కైవసం
యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. 123 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 346 పరుగులు సాధించగా.. మార్ష్ బ్రదర్స్ విధ్వంసంతో ఆస్ట్రేలియా 649/7(డిక్లేర్డ్) భారీ స్కోర్ను సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ ముందు అసీస్ 303 పరుగుల ఆధిక్యం ఉంచినట్లయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఆటగాడు జోయ్ రూట్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మైదానంలో దిగిన అతను మరోసారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆసీస్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 3-0 ఇదివరకే ఆధిక్యంతో ఉన్న ఆసీస్ యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకున్నట్లయ్యింది. అంతకు ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్లు) శతకాలతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోయటంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించగలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఆసీస్ బౌలర్లను తట్టుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో గాయపడిన రూట్దే అత్యధిక పరుగులు(58) కావటం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కుమ్మిన్స్ 4 వికెట్లు, నాథన్ కౌల్టర్-నైల్ 3 వికెట్లు తీశారు. షాన్ బతికిపోయాడు... పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష్ సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. లేకుంటే రన్ అవుట్గా వెనుదిరగాల్సి వచ్చేది. -
నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
మెల్బోర్న్: ఇప్పటికే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ను కోల్పోయింది. ఇంకా సాధించడానికేమీ లేదు. కానీ పరువు నిలబెట్టుకోవాలంటే చివరి రెండు టెస్టుల్లో గెలవాలి. ఈ నేపథ్యంలో ‘బాక్సింగ్ డే’ టెస్టులో విజయమే లక్ష్యంగా ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. వరుస వైఫల్యాలతో ఆటగాళ్లు, ఘోర పరాజయాలతో ఇంగ్లండ్ జట్టు ఈ ‘యాషెస్’లో విలవిల్లాడుతోంది. విశేష అనుభవమున్న కుక్ పేలవ ఫామ్ జట్టును కలవరపరుస్తోంది. బ్రాడ్, మొయిన్ అలీలు కూడా బాధ్యతలకు దూరంగా... జట్టుకు భారంగా మారారు. కెప్టెన్ రూట్కు ఇప్పటిదాకా ఆసీస్ గడ్డపై ఏ మ్యాచ్ కూడా కలిసిరాలేదు. భారీ పరాజయాలతోనే మ్యాచ్ల్ని, సిరీస్ను కోల్పోయాడు. ఇప్పటికైనా సీనియర్లు బాధ్యతలు పంచుకుంటే జట్టు గాడిన పడుతుందని రూట్ భావిస్తున్నాడు. దీంతో కనీసం ట్రోఫీ పోయినా పరువు కాపాడుకోవచ్చని ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్ యువ పేసర్ టామ్ కురన్ ఈ టెస్టుతో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్ స్మిత్ అసాధారణ ఫామ్లో ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న కంగారూ జట్టు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. గాయపడిన మిచెల్ స్టార్క్ స్థానంలో జాక్సన్ బర్డ్ నాలుగో టెస్టు బరిలోకి దిగుతాడని కెప్టెన్ స్మిత్ చెప్పాడు. ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ 2019 తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2013 నుంచి ఆయన కోచింగ్లో ఆసీస్ సొంతగడ్డపై రెండు యాషెస్ సిరీస్లను గెలుచుకోగా.. ఇంగ్లండ్లో మరో రెండు ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సాధించింది. జట్లు: ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, బాన్క్రాఫ్ట్, ఖాజా, మార్‡్ష, మిచెల్ మార్‡్ష, పైన్, కమిన్స్, హాజల్వుడ్, లయన్, బర్డ్. ఇంగ్లండ్: జో రూట్ (కెప్టెన్), కుక్, స్టోన్మన్, విన్స్, మలన్, బెయిర్స్టో, మొయిన్ అలీ, వోక్స్, కురన్, బ్రాడ్, అండర్సన్. ►ఉ. గం. 5.00 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
బాల్ ఆఫ్ ది సెంచరీ కాదు.. అదో ‘జఫ్ఫా’
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో కళ్లు చెమర్చే బంతితో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే ఆ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు బాల్ ఆఫ్ ది సమ్మర్, బాల్ ఆఫ్ది యాషెస్, బాల్ ఆఫ్ది 21వ సెంచరీ, బాల్ ఆఫ్ ది మిలినియమ్ అంటూ పేర్లు పెడుతున్నారు. అయితే ఈ దిగ్గజ బౌలర్ మాత్రం ఆ బంతిని ‘జఫ్ఫా’ అని పిలుస్తానని ట్వీట్ చేశాడు. ‘ఆ బంతిని నేను మాత్రం జఫ్ఫా అని పిలుస్తా.! ఏం బంతేసినవ్ స్టార్క్.. నీ ప్రదర్శన నా బౌలింగ్ రోజులను గుర్తుచేసింది. దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నీ ప్రదర్శనతో ఎడమ చేతి బౌలర్లను తలెత్తుకునేలా చేశావు!’ అని పేర్కొన్నాడు. That’s called a JAFFA! What a delivery @mstarc56 you reminded me of my bowling days and I enjoyed it to the hilt! You made left armers proud! @CricketAus — Wasim Akram (@wasimakramlive) 17 December 2017 యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జేమ్ విన్స్ను స్టన్నింగ్ బంతితో పెవిలియన్ చేర్చాడు. గంటకు143.9 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి ఒక్కసారిగా 40 సెంటీమీటర్ల మేర రివర్స్ స్వింగ్ అయి జేమ్విన్స్ ఆఫ్ స్టంప్ను ఎగరగొట్టేసింది. దీంతో జేమ్విన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు ఏం జరిగిందో తెలియకుండా క్రీజును వదిలాడు. చదవండి: స్టార్క్ స్టన్నింగ్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
స్మిత్ అజేయ ద్విశతకం
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు హవా కొనసాగిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 203/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రోజంతా బ్యాటింగ్ చేసి కేవలం ఒక్క వికెటే కోల్పోయి 346 పరుగులు చేయడంతో... జట్టు స్కోరు 549/4 కు చేరింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (390 బంతుల్లో 229 బ్యాటింగ్; 28 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (234 బంతుల్లో 181 బ్యాటింగ్; 29 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలింగ్ను ఆటాడుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు అజేయంగా 301 పరుగులు జతచేశారు. ఇంగ్లండ్పై పెర్త్లో ఆస్ట్రేలియాకు ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మూడో రోజు పడిన ఏకైక వికెట్ షాన్ మార్ష్ (28)ను మొయిన్ అలీ అవుట్ చేశాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో స్మిత్కు ఇది 22వ సెంచరీ. 58వ టెస్టు ఆడుతున్న స్మిత్ 107వ ఇన్నింగ్స్లో ఈ మార్క్ను చేరుకున్నాడు. గతంలో... బ్రాడ్మన్ (58 ఇన్నింగ్స్లు), గావస్కర్ (101 ఇన్నింగ్స్లు) మాత్రమే అతనికన్నా వేగంగా ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 146 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 403 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
ఆసీస్ దీటైన జవాబు
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మలాన్ (140; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్స్టో (119; 18 ఫోర్లు)ల అద్భుత బ్యాటింగ్తో ఓ దశలో 368/4తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. మలాన్ను స్పిన్నర్ లయన్ అవుట్ చేయడం... అనంతరం వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోయింది. స్టార్క్కు 4, హాజల్వుడ్కు 3 వికెట్లు దక్కాయి. -
ఆసీస్ దీటైన జవాబు
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మలాన్ (140; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్స్టో (119; 18 ఫోర్లు)ల అద్భుత బ్యాటింగ్తో ఓ దశలో 368/4తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. మలాన్ను స్పిన్నర్ లయన్ అవుట్ చేయడం... అనంతరం వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోయింది. స్టార్క్కు 4, హాజల్వుడ్కు 3 వికెట్లు దక్కాయి. -
కీలక ప్రకటన చేసిన ఐసీసీ
సాక్షి, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించటంతో క్రీడా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనటానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ దీనిపై స్పందిస్తూ... ఫిక్సింగ్ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాం. మా బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే ఈ విచారణ చేపట్టాం. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం అని ఆయన వివరించారు. కాగా, యాషెస్ సిరీస్ సందర్భంగా పెర్త్ లో వాకా మైదానం వేదికగా గురువారం నుంచి జరగబోయే మూడో టెస్ట్ స్పాట్ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు వినిపించాయి. భారత్ కు చెందిన ఇద్దరు బుకీలు ఈ స్కాంలో ఉన్నట్లు బ్రిటీష్ పత్రిక ది సన్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇరు జట్లకు చెందిన సభ్యుల పేర్లు ఆ కథనంలో ప్రస్తావించపోగా.. ఆస్ట్రేలియాకు చెందిన బుకీ గ్రూప్ ‘ది సైలెంట్ మాన్’ భారీ మొత్తానికి ఈ మ్యాచ్ను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక పన్నిందని ఆ కథనం వివరిచింది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంతో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
తప్పతాగి...
పెర్త్: ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టులు ఓడిపోయి... ఆటతీరు పరంగానూ విమర్శలెదుర్కొంటున్న ఇంగ్లండ్కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పెర్త్లోని ఓ బార్లో తప్ప తాగి.. సీనియర్ ఆటగాడు అండర్సన్పై మద్యం కుమ్మరించినందుకు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్పై జట్టు యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వాస్తవానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్తో శనివారం ప్రారంభమైన టూర్ మ్యాచ్లో 23 ఏళ్ల డకెట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాల్సి ఉంది. కానీ బార్లో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో అతడిని పక్కకు పెట్టారు. డకెట్ ఇంగ్లండ్ తరఫున నాలుగు టెస్టులు ఆడాడు. గతేడాది భారత్లో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. కీలక ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సెప్టెంబరులో బ్రిస్టల్ నైట్ క్లబ్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. -
యాషెస్ సిరీస్: రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా ఘనవిజయం
అడిలైడ్ : యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్లో 2-0తో స్మిత్ సేన ఆధిక్యం సాధించింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్లో విజయం ఆసీస్నే వరించింది. 442/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లెర్ చేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227 ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో 233 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 138 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్కు కేవలం 354 పరుగుల లక్ష్యమే ఏర్పడింది. కానీ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ విలవిలలాడారు. దీంతో ఆసీస్ విజయం సులువైంది. -
క్రికెట్ చరిత్రలోనే తొలి సారి..!
అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో స్మిత్ సేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలోనే రెండు రివ్యూలను కోల్పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది. కమిన్స్ వేసిన 42 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. ఒకటి క్యాచ్ అవుట్ కోసం.. మరొకటి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరగా అంపైర్ అలీమ్దార్ నౌటౌట్గా ప్రకటించడంతో రెండు రివ్యూల అవకాశం కోల్పోయింది. గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును అదనంగా ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం ఇన్నింగ్స్ మొత్తం రెండే రివ్యూలు ఉండడం ఆసీస్ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. -
తొలిరోజు సమవుజ్జీగా...
అడిలైడ్: ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో రెండు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డే నైట్ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 81 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు వాతావరణం సహకరించలేదు. వర్షం కారణంగా తొలి సెషన్లో 13.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో... ఆదిలోనే వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ రూట్కు నిరాశే మిగిలింది. రెండో సెషన్ తొలి ఓవర్లోనే ఓపెనర్ బెన్క్రాఫ్ట్ (10) రనౌట్ రూపంలో వెనుదిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (47; 5 ఫోర్లు), ఉస్మాన్ ఖాజా (53; 8 ఫోర్లు)తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 34వ ఓవర్లో పేస్ బౌలర్ వోక్స్ ఈ జోడీని విడదీశాడు. వోక్స్ వేసిన పదునైన అవుట్ స్వింగర్ను ఆడటంలో విఫలమైన వార్నర్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్లో ఖాజా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (40; 3 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. తొలి టెస్ట్ ఆడుతున్న ఓవెర్టన్కు వికెట్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆట ముగిసే సమయానికి హ్యాండ్స్కోంబ్ (36 బ్యాటింగ్), షాన్ మార్‡్ష (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఇంగ్లండ్ కోలుకునేనా?
అడిలైడ్: చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో తొలి టెస్టులో ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పుంజుకొని సిరీస్ను గెల్చుకొని 63 ఏళ్లయింది. ఈసారీ ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ తొలి టెస్టులో ఓడిపోయింది. బ్రిస్బేన్లో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పాత రికార్డులను పట్టించుకోకుండా రెండో టెస్టులో తేరుకోవాలని, ఆతిథ్య జట్టుకు గట్టిపోటీ ఇవ్వాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టుతో జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు శనివారం మొదలయ్యే రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. డే నైట్గా జరిగే ఈ టెస్టులో పింక్ బంతిని ఉపయోగిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ఈ మ్యాచ్ సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. -
నేడే ఆసీస్ విజయం!
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఆస్ట్రేలియా కేవలం 56 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 10 వికెట్లున్న ఆసీస్ తొలి టెస్టులో ఈ లాంఛనాన్ని ఆట చివరి రోజు సోమవారం గంటలోనే పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. తమకు అచ్చొచ్చిన బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా బౌలర్లు హాజల్వుడ్ (3/46), స్టార్క్ (3/51), లయన్ (3/67) చెలరేగారు. ఇంగ్లండ్ను రెండో ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 114 పరుగులు చేసింది. ఓపెనర్లు బాన్క్రాఫ్ట్ 51 పరుగులతో, వార్నర్ 60 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి సెషన్లోనే పతనం: ఓవర్నైట్ స్కోరు 33/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్లోనే సగం వికెట్లను కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ స్టోన్మన్, కెప్టెన్ రూట్ కుదురుగా ఆడుతూ జట్టు స్కోరును 60 పరుగులకు చేర్చారు. మరో రెండు పరుగులు జతయ్యాక మొదట స్టోన్మన్ (27; 4 ఫోర్లు)ను... ఐదు ఓవర్ల వ్యవధిలో మలాన్ (4)ను లయన్ ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రూట్ (51; 5 ఫోర్లు)ను హాజల్వుడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ (119/5) సగం వికెట్లను కోల్పోయి లంచ్కు వెళ్లింది. టెయిలెండర్లు నిలబడినా: రెండో సెషన్లో మొయిన్ అలీ (40; 6 ఫోర్లు), బెయిర్స్టో (42; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు నిలబడినా... ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి నిలదొక్కుకోలేకపోయారు. ఆరో వికెట్కు 42 పరుగులు జతయ్యాక అలీని లయన్ వెనక్కిపంపగా మిగతా వికెట్లను స్టార్క్ చేజిక్కించుకున్నాడు. కమిన్స్కు ఒక వికెట్ దక్కింది. తర్వాత 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు వార్నర్, బాన్క్రాఫ్ట్ శుభారంభమిచ్చారు. వీళ్లిద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకొని అబేధ్యమైన తొలి వికెట్కు 114 పరుగులు జోడించారు. సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 302, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 328, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 114/0 (బాన్క్రాఫ్ట్ 51 బ్యాటింగ్, వార్నర్ 60 బ్యాటింగ్). -
యాషెస్కు వేళాయె...
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికర పోరుకు రేపటి నుంచి తెరలేవనుంది. దాయాదులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య 2017–18 యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్ గురువారం బ్రిస్బేన్లో ప్రారంభం కానుంది. జో రూట్, స్టీవ్ స్మిత్ రూపంలో ప్రపంచ టాప్ క్రికెటర్లు కెప్టెన్లుగా ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈసారి యాషెస్ మరింత ఆసక్తికరం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుదే కాస్త పైచేయిగా ఉన్నా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. 2013లో సొంతగడ్డపై జరిగిన సిరీస్లో ఇంగ్లండ్ను 0–5తో మట్టికరిపించిన కంగారూలు... 2015లో ఇంగ్లండ్ గడ్డపై 2–3తో సిరీస్ను కోల్పోయారు. ఈసారి సొంతగడ్డపై లెక్క సరిచేయాలని స్మిత్ బృందం భావిస్తోంది. అయితే కొంతకాలంగా స్మిత్ జట్టు పేలవమైన ఫామ్లో కొనసాగుతోంది. ఈ ఏడాది భారత పర్యటనలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఆసీస్... యాషెస్ సిరీస్ విజయంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. అటు ఇంగ్లండ్ కూడా గత సిరీస్కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. – సాక్షి క్రీడావిభాగం ఇంగ్లండ్ కూర్పు బాగున్నా... జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు కూర్పు బాగానే ఉన్నప్పటికీ బెన్ స్టోక్స్ వంటి నాణ్యమైన ఆల్రౌండర్ కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కుక్, అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ వంటి అనుభవజ్ఞులకు తోడు యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పిచ్లపై ఆడుతున్నప్పడు బెన్ స్టోక్స్ వంటి అద్భుతమైన ఆల్రౌండర్ అవసరం చాలా ఉంటుంది. తాజా యాషెస్ సిరీస్ కోసం స్టోక్స్ పేరును ఈసీబీ ప్రకటించినప్పటికీ.. ఓ కేసు విచారణ పెండింగ్లో ఉండటంతో అతడిని తప్పించాల్సి వచ్చింది. దీంతో అండర్సన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. స్టోక్స్ స్థానంలో ఫిన్ వచ్చినా... ప్రాక్టీస్ గేమ్లో అతనూ గాయపడ్డాడు. కెప్టెన్గా తొలి యాషెస్ ఆడుతోన్న రూట్కు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్లను గెలుచుకుని ఊపు మీదున్న ఇంగ్లండ్కు ఈ సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే సిరీస్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఇంగ్లండ్ జట్టు యాషెస్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. స్మిత్కు సవాల్.... సారథిగా తొలి యాషెస్ ఆడనున్న స్మిత్కు ఈ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకం. ఇటీవలి కాలంలో పరాజయాలతో ఆగ్రహంగా ఉన్న అభిమానులను శాంతింపజేసేందుకు స్వదేశంలో విజయం చాలా అవసరం. హాజిల్వుడ్, స్టార్క్, కమిన్స్ వంటి వారితో ఆసీస్ బౌలింగ్ బలంగానే ఉంది. స్మిత్, షాన్ మార్‡్షలు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్కు బలం. ఏడేళ్ల విరామం తర్వాత వికెట్ కీపర్ టిమ్ పైన్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే... ప్రాక్టీస్ సందర్భంగా వార్నర్ మెడకు గాయమైంది. ఈ వార్త ఆసీస్ను కలవరపెడుతోంది. ►యాషెస్ సిరీస్ ఫలితాలు ఆయా దేశాల్లో హీరోలను విలన్లుగా... విలన్లను హీరోలుగా చేస్తాయనేది వాస్తవం. యాషెస్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు యాషెస్ ఓటమితో వారి వారి దేశాల్లో రాత్రికిరాత్రే హీరోలుగా లేదా విలన్లుగా మారిన సంఘటనకు కోకొల్లలు. మహామహులైన కెప్టెన్లు సైతం యాషెస్ కారణంగా తమ బాధ్యతలను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే యాషెస్ ఇరుదేశాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ►హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించే యాషెస్కు ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ప్రతి యాషెస్కు ముందు సహజమే అయినా ఈసారి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ‘ఈ సిరీస్ తర్వాత చాలామంది ఇంగ్లండ్ ప్లేయర్ల కెరీర్లు ముగిసిపోతాయం’టూ లయన్ వ్యాఖ్యానించాడు. గత సిరీస్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులో జరిగిన మార్పులను ఉదహరించాడు. కంగారూల బౌలింగ్ వేగాన్ని చూసి రూట్ జట్టు భయపడుతోందన్నాడు. ► ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 69 టెస్టు సిరీస్లు జరగ్గా... ఇరుజట్లు చెరో 32 సిరీస్లను సొంతం చేసుకొని.. ఐదు సిరీస్లను డ్రా చేసుకున్నాయి. ‘యాషెస్’ మ్యాచ్ల విషయానికొస్తే... మొత్తం 341 టెస్టు మ్యాచులు జరగ్గా... ఆస్ట్రేలియా 140, ఇంగ్లండ్ 108 మ్యాచుల్లో గెలిచాయి. 93 ‘డ్రా’గా ముగిశాయి. -
యాషెస్ సిరీస్కు స్టోక్స్ ఎంపిక..
లండన్: ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు యాషెస్ సిరీస్లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో స్టోక్స్కు అవకాశం లభించింది. స్టోక్స్ గత ఆదివారం తప్పతాగి ఓ వ్యక్తిని చితకబాది జైలుపాలైన విషయం తెలిసిందే. కోచింగ్ క్యాంప్కు హాజరుకాలేదని స్టోక్స్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విండీస్తో నాలుగో వన్డేకు దూరం పెట్టింది. దీంతో తరువాతి మ్యాచ్లకు స్టోక్స్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్పై కనికరం చూపించింది. నేరం రుజువైతే మాత్రం స్టోక్స్కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం 5 ఏళ్ల జైలు శిక్షపడనుంది. -
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు, మాజీ క్రికెటర్ పీటర్ రిచర్డ్సన్(86) కన్నుమూశారు. కెంట్, వార్సెస్టర్ షైర్, ఇంగ్లండ్ జట్ల తరఫున ఓపెనర్ గా ఆటను ఆస్వాదించారు రిచర్డ్. 1950, 60 దశకాలలో మేటి ఆటగాళ్లలో రిచర్డ్ సన్ ఒకరు. ఇంగ్లండ్ తరఫున 1956-1963 మధ్య కాలంలో 34 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్ సన్ 2061 పరుగులు చేశారు. ఐదు టెస్ట్ సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 1956లో తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో సెంచరీ(104) తో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ రిచర్డ్ సన్ చెలరేగగా, అదే టెస్టులో ఓ సహచరుడు జిమ్ లేకర్ 19 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 1965లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఓవరాల్ గా 161 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆయన సొంతం. 1957లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం విశేషం. -
హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్
సిడ్నీ: యాషెస్ సిరీస్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి టెస్టులో ఇంగ్లండ్ను 281 పరుగులతో చిత్తు చేసి సంపూర్ణ విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 448 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. 31.4 ఓవర్లలో చాప చుట్టేసింది. 52 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి బొక్కబోర్లా పడింది. ఆసీస్ బౌలర్ హారిస్ మ్యాజిక్కు ఇంగ్లీషు ఆటగాళ్లు దాసోసమయ్యారు. కార్బెరీ(43), బెల్(16), స్టోక్స్(32), బ్రాడ్(42) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. హారిస్ 5 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 140/4 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326, ఇంగ్లండ్ 155 పరుగులు చేశాయి. హారిస్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కించుకున్నారు.