Bill Gates
-
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్, డీప్సీక్ వంటి చాట్బాట్లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు. -
విశాఖ వాసికి బిల్ గేట్స్ ప్రశంస
అక్కిరెడ్డిపాలెం: అప్పుడే పుట్టిన శిశువుల్లో వచ్చే పచ్చకామెర్ల నివారణకు వినియోగించే ఎనలైట్–360 పరికరాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యప్రసాద్ ఈ పరికరాన్ని తయారు చేశారు. దీనిని దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించగా.. బిల్గేట్స్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. పరికరం తయారుచేసిన ప్రసాద్ను అభినందించారు. ఈ పరికరం తయారీతో నూతన ఆవిష్కరణలకు అందించే ప్రతిష్టాత్మక ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు 2023ను ప్రసాద్ ఇప్పటికే సాధించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్.. పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. భారత్ కు వచ్చే ముందు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు. -
‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి మెలిందా గేట్స్(Melinda Gates) విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లే మ్యాగజైన్తో మాట్లాడిన 60 ఏళ్ల మెలిందా గేట్స్ తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘విడాకులు బాధాకరమైనవి. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.మెలిందా, బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. తర్వాత మూడు నెలలకు అధికారికంగా వీరు విడిపోయారు. ఇటీవల తమ బ్రేకప్పై బిల్గేట్స్ టైమ్స్ ఆఫ్ లండన్తో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారం తనకు, మెలిందాకు కనీసం రెండేళ్ల పాటు బాధను మిగిల్చిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని తమ విడాకులేనన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలల తర్వాత మెలిందా తాజాగా స్పందించడం గమనార్హం. తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు మెలిందా తెలిపారు. విడాకులు బాధాకరమైనవని చెప్పారు. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం కష్టమైనప్పటికీ జీవితాన్ని స్వతంత్రంగా పునర్నిర్మించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె అన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార2021లో బిల్గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
గూగుల్, గేట్స్ ముసుగులో నడుస్తున్నదంతా మాయేనా?
‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట. వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు. రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు...ఎం. రాజేశ్వరి -
బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ ఢిల్లీలో బుధవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. బిల్గేట్స్ను కేంద్ర సహాయ మంత్రులు చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులతో కలిసి సీఎం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ‘ఎక్స్ ద్వారా తెలిపారు. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్–2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంలో, లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నా. ఏపీ పురోగతికి బిల్గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు. దేశానికే రోల్ మోడల్గా నిలుస్తాం: బిల్గేట్స్ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై బిల్గేట్స్ హర్షం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నొస్టిక్స్, వైద్య పరికరాలను స్థానికంగా తయారు చేయడం ద్వారా పేదల బతుకుల్లో కొత్త వెలుగులు నింపే సామర్థ్యం మన భాగస్వామ్యానికి ఉందన్న సంగతి నన్ను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రాథమిక విద్యా రంగాల్లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఏఐ టెక్నాలజీతో మనం పరిష్కరించవచ్చు. ఆయా రంగాల్లో మనం సాధించే విజయాలు మొత్తం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తాయనడంలో సందేహం లేదు’ అని బిల్గేట్స్ పేర్కొన్నట్టు తెలిపింది.నేను నిద్రపోను..మిమ్మల్ని పోనివ్వను కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు క్లాస్ సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎంపీలుగా గెలిచి ఏడు నెలలు గడిచింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మీరేం చేస్తున్నారు. ఏయే మంత్రులను, ఏ అధికారులను కలిశారో చెప్పండి. పనిలో మీరు వహించిన నిర్లక్ష్యానికి ఫుల్స్టాప్ పెట్టండి. మీ పనితీరు మార్చుకోండి’ అంటూ సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలకు క్లాస్ పీకారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళతానంటే కుదరదంటూ హెచ్చరించారు. ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబు.. మంగళవారం రాత్రి కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఒక్కో ఎంపీ పనితీరుపై చంద్రబాబు ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్కు వెళ్లి హాజరు వేయించుకుంటే సరిపోదని, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు. పనితీరుపై అసంతృప్తి.. కేవలం ఇద్దరు ఎంపీల పనితీరుపై మాత్రమే చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రులను కలవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు ఇవ్వాలని కోరినట్టు ఆ ఇద్దరు ఎంపీలు సీఎం దృష్టికి తెచ్చారు. ‘మీ ఇద్దరి సంగతి సరే. మిగతా వాళ్లు ఎందుకు సరిగా పనిచేయడం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి కదా? మరి మిగతా వారు ఎందుకు ఈ చొరవ చూపడం లేదు. మీరు సాధించింది ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధిపై మీరు ఎందుకు పనిచేయడం లేదు. ఎవరైనా నాకు ఒకటే. నిరంతరం కష్టపడి పనిచేయాల్సిందే. పదేపదే కేంద్ర మంత్రులను కలవాల్సిందే. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందే. ఇకపై నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అంటూ ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
భారత్కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది. -
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్వేర్ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
టెక్ బిలియనీర్ లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం!
ఆధార్ ఖర్చుపై సంచలన వ్యాఖ్యల్ని చేసిన హాట్మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా ట్రెండింగ్లో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన యూట్యూబ్ పాడ్కాస్ట్లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ఆధార్ కోసం చేసిన (1.3 బిలియన్ల ఖర్చును వృథా అని చెప్పడంతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా అతని లవ్ స్టోరీ, పెళ్లి విడాకులు లాంటి అంశాలు నెట్టింట సందడిగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, చాలామంది స్టార్లతో డేటింగ్ చేయడం మొదలు, చాలా మంది మహిళలు తన పట్ల ఆకర్షితులయ్యేవారని, పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారని సబీర్ భాటియా చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నంటికీ భిన్నంగా తన కుటుంబ స్నేహితురాలు, బైద్యనాథ్ గ్రూప్కు చెందిన తాన్యా శర్మతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు. (బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు)సబీర్ భాటియా చెప్పిన వివరాల ప్రకారం తాన్య శర్మ కుటుంబంతో తమ కుటుంబానికి ఎనిమిదేళ్లుగా పరిచయం. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు తమ స్నేహాన్ని కుటుంబ సంబంధంగా మార్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే నిజానికి సబీర్ తాన్యను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమెను కోడలిగా తెచ్చుకోవాలనే కోరిక మాత్రం తల్లిదే. తల్లి కోరిక మేరకు ఆమెతో మాట్లాడిన తరువాత, ఆమె ప్రేమలో పడటం, జీవితాంతం ఆమెతో గడపాలని భావించాడు.దీంతో వీరి పెళ్లి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. సబీర్ భాటియా, తాన్య శర్మ జంట 2007, డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు.ఆ తర్వాత మలేషియాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2008, మార్చి 9న, మలేషియాలోని ప్రసిద్ధ లంకావి ద్వీపంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. దాదాపు 270 మంది ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం సబీర్ మొత్తం లంకావి ద్వీపాన్నే బుక్ చేసుకున్నాడట.పెళ్లైన కొన్నాళ్లకు వీరికి ఒక పాప పుట్టింది. ఈ పాపకు 'అరియాన్నా' అనే పేరు పెట్టారు. తాన్యా గుడ్కేర్ ఫార్మాకు డైరెక్టర్ (బైద్యనాథ్ గ్రూప్ సోదరి సంస్థ గుడ్కేర్ ఫార్మా)గా ఉన్నారు. తాన్యా ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి కోర్సును కూడా చదివింది.అయితే పెళ్లైన ఐదేళ్లకు వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. 2013లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కోర్టులో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అరియాన్నా చిన్నది కనుక ఆమె కస్టడీ హక్కులు తల్లి తాన్యా శర్మకు అప్పగించారు. ఐశ్వర్యారాయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట సబీర్. ఈ విషయంలో నటుడు సల్మాన్ ఖాన్తో పెద్ద పోటీయే ఉండేదట. 2001లో ఒక పార్టీలో వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ పుకార్లను మీడియా ఊహాగానాలుగా భాటియా తోసిపుచ్చాడు.కాగా సబీర్ భాటియా 1996లో హాట్మెయిల్ను సృష్టించడం ద్వారా ఇమెయిల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన వ్యాపార భాగస్వామి జాక్ స్మిత్తో కలిసి, భాటియా తొలి వెబ్ ఆధారిత ఇమెయిల్ సేవలలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్థాపించిన 18 నెలలకే దీన్ని అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్కు విక్రయించాడు. దీంతో రాత్రికి రాత్రే వేలకోట్లకు అధిపతియ్యాడు. ఈసొమ్ముతో మరిన్ని కంపెనీలను నిర్మించాడు. ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద, గేమ్-ఛేంజింగ్ ఒప్పందాలలో ఒకటిగా టెక్ వర్గాలు భావించాయి. ఈ డీల్ ద్వారా సబీర్ రూ. 3300 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. దీన్నే ఇపుడు ఔట్లుక్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సబీర్ భాటియా AI-ఆధారిత అభ్యాస వేదిక, షోరీల్కు నాయకత్వం వహిస్తున్నాడు. -
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్ కోడ్’!
మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్ గేట్స్ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ పుస్తకం వెలువరించారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్ గేట్స్ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్ గేట్స్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. తండ్రికి కోపం తెప్పించిన సందర్భంస్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్గేట్స్ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్ కోడ్’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్ ఫుల్మార్క్లు కొట్టేశారు. అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్ గురించి తెలిసిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్ గేట్స్ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్ సీనియర్ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్ ఫర్ ద షవర్’ అంటూ అక్కడి నుంచి బిల్ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్ఎస్డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్ గేట్స్ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. మేము లేకుండా కంప్యూటర్ విప్లవమా?హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్ గేట్స్కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్ ఇవాన్స్కూ పర్సనల్ కంప్యూ టర్పై అవగాహన ఉంది. ఎయిత్ గ్రేడ్లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్లో బగ్స్ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్నూ వెళ్లగొట్టారని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. కంప్యూటర్ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్కూ, అలెన్కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్–డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ వంటి సాఫ్ట్వేర్ రూపకల్పనలు చేయ గలిగారు.ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్లో బిల్ గేట్స్ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్ కోడ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. మైక్రోసాఫ్ట్లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్ జాబ్స్తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్ గేట్స్ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
ఆమె నా అదృష్టం.. పెదవి విప్పిన బిల్ గేట్స్
అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.ఎవరీ పౌలా హర్డ్?పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.బిల్ గేట్స్ ఆత్మకథ బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్లా ఉంది ఈ స్వీయచరిత్ర. తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారత్ ఒక ప్రయోగశాల
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ యథాలాపంగా చెప్పిన ఒక వాక్యం వివాదాస్పదమైంది. తరచూ భారత్ను పొగిడే బిల్గేట్స్ ఒక్కసారిగా భారత్ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రీడ్ హాఫ్మన్తో నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ చర్చావేదికలో భారత ప్రస్థానాన్ని బిల్గేట్స్ ప్రస్తావించారు. ‘‘ జనాభాపరంగా అతిపెద్దదైన భారత్లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.భారతీయులు సుస్థిరాభివృద్ధిని మాత్రమేకాదు సుస్థిర ప్రభుత్వా దాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడి ప్రజలు మరింత పురోభివృద్దిని సాధించగలరు. భారత్ వెలుపల కంటే భారత్లో తమను తాము నిరూపించుకునేందుకు ఆ దేశం నిజంగా ఒక ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా పైలట్ ప్రాజెక్టులు మేం చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరుగనక భారత్కు వెళ్లి అక్కడి వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు’’ అని అన్నారు. వెల్లువెత్తిన విమర్శలుభారత్ను ప్రయోగశాలగా పోల్చడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ‘‘ తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్ను ఒక ల్యాబ్లాగా వాడుకుంటున్నారు. అయినాసరే ఇలాంటి పెద్దమనుషులు మనల్ని గినీ పందుల్లా వాడుకునేందుకు మన ప్రభుత్వాలే అనుమ తిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం. సిగ్గుపడాల్సిన విషయం’’ అని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా దేశం మీకొక ప్రయో గశాల అనుకుంటున్నారా?. అయితే దేశం విడిచి వెళ్లిపొండి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యా నించారు. ‘‘ బిల్గేట్స్ భారతీయ మీడియా మొదలు విపక్షం, అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థనూ తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. మనమెప్పుడు మేల్కొంటామో’’ అని ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్ఫార్మర్కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ వంటి వారు సైతం న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్గేట్స్కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ తనకు వారెన్బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్బెజోస్ వారెన్బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM— Jon Erlichman (@JonErlichman) August 27, 2024 -
పారిస్ ఒలింపిక్స్లో బిల్గేట్స్ అల్లుడు..
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పోటీలపై అందరికన్నా ఉత్సాహంగా ఉంది మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ కుటుంబం. కారణం ఆయన అల్లుడు ఈ పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడుతుండటం.బిల్ గేట్స్ అల్లుడు, నాయెల్ నాసర్ ఈజిప్ట్ దేశం తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్లో పోటీ పడుతున్నారు. నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. మెలిందా, బిల్ గేట్స్ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఒలింపిక్స్ పాల్గొంటున్న తన అల్లుడిని ఉత్సాహపరుస్తూ.. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ మద్దతు తెలియజేశారు.నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. అంతర్జాతీయ పోటీలలో ఈజిప్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ అథ్లెట్. ఈజిప్షియన్ తల్లిదండ్రులకు చికాగోలో జన్మించారు. కువైట్లో పెరిగారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే గుర్రపు స్వారీ పట్ల మక్కువ పెంచుకున్న నాసర్ అనేక ప్రపంచ ఈవెంట్లలో పాల్గొన్నారు. బిల్, మెలిందా గేట్స్ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ను 2021లో వివాహం చేసుకున్నారు. వీరికో పాపాయి కూడా పుట్టింది. -
పాలు లేకుండా వెన్న.. ఇది కదా టెక్నాలజీ అంటే!
వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు. -
విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి తాను విడాకులు తీసుకోవడానికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు. 2021లో విడాకులు తీసుకున్న మెలిందా అంతకు ముందు పరిస్థితులను గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.2021 కంటే ముందే తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు, ఆ తరువాత 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మెలిందా విడాకులను భయంకరమైనవిగా వివరించారు. విడాకులు తీసుకున్న తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.ఇప్పుడు నేను నా పనులను నేనే చేసుకుంటున్నాను. మెడికల్ స్టోరుకు వెళ్లడం, రోజూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం వంటివి హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను విడాకుల తరువాత పొందుతున్నాని మెలిండా అన్నారు.27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన మెలిండా గేట్.. విడాకుల తరువాత 'బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్' నుంచి కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం మెలిండా తన ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్తోపాటు యూఎస్లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్నెస్కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్ గేట్స్ సూచిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తనకెంతో ఆసక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీలో తాను నిపుణుడిని కాకపోయినా దానిపై చిన్నపిల్లలకు ఉండే ఉత్సుకత తనకు కూడా ఉందని తెలిపారు. అదేసమయంలో టెక్నాలజీకి తాను బానిస కాలేదని వివరించారు. ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, కృత్రిమ మేధ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని బిల్గేట్స్కు తెలియజేశారు. ఇండియాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బిల్గేట్స్తో మోదీ ఇంకా ఏం చెప్పారంటే... కృత్రిమ మేధ.. మంత్రదండం కాదు ‘‘నేడు డిజిటిల్ ప్రజా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన పెంచాలి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి శక్తివంతమైన సాంకేతికత దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఇలాంటి టెక్నాలజీ పడితే దుష్పరిణామాలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏఐతో సృష్టించే కంటెంట్లో వాటర్మార్క్ను జోడించాలి. ఏఐతో సృష్టించే డీప్ఫేక్ల విషయంలో అప్రమత్తత అవసరం. ఏఐని అన్నీ సాధించిపెట్టే మంత్ర దండంగా చూడొద్దు. అంటే కృత్రి మేధ విలువను తగ్గించడం నా ఉద్దేశం కాదు. గత ఏడా ది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఏఐని నేను ఉపయోగించుకున్నా. పలు కార్యక్రమా ల్లో నా ప్రసంగాలను వేర్వేరు భాషల్లో ప్రసా రం చేయడానికి ఈ టెక్నాలజీ తోడ్పడింది. భూగోళాన్ని కాపాడుకోవాలి వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్నాయి. భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విద్యుత్ లేదా ఉక్కు వినియోగాన్ని అభివృద్ధికి కొలమానంగా చూపుతున్నారు. ఈ ధోరణి కచ్చితంగా మారాలి. విద్యుత్, ఉక్కు విచ్చలవిడి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చేటు తప్పదన్న సంగతి మర్చిపోవద్దు. ఇకపై గ్రీన్ జీడీపీ, గ్రీన్ ఎంప్లాయ్మెంట్ వంటి పరిభాషను ఉపయోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునరి్వనియోగం ఇండియాలో చాలా సహజం. ఇప్పుడు నేను ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన ఉత్పత్తే. టెక్నాలజీ అంటే కేవలం సేవలను విస్తరించడానికే కాదు, సామాన్య ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయాలని నేను నమ్ముతున్నా. తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యం గత ఏడాది ఇండియాలో జీ20 సదస్సు నిర్వహించిన తర్వాత వాతావరణ మార్పులపై యుద్ధంలో వేగం పెరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మన జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్రకృతి, పర్యావరణహితమైన నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. విద్యుత్ను వృథా చేస్తే, నీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యం సాధించలేం. తక్కువ నీరు అవసరమయ్యే తృణధాన్యాల సాగును పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ముప్పుగా మారింది. త్వరలో కొలువుదీరే మా నూతన ప్రభుత్వ హయాంలో మహిళలకు.. ముఖ్యంగా బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాం. సాంకేతిక ప్రజాస్వామీకరణ పునరుద్పాతక ఇంధన రంగంలో మేము శరవేగంగా దూసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం. ‘సాంకేతిక ప్రజాస్వామీకరణ’ మా విధానం. డిజిటల్ విప్లవంలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేశాం. ఈ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కలి్పస్తున్నాం. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలన్నది మా ఆకాంక్ష. ఆ దిశగా ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రవేశపెట్టాం. నమో యాప్లో సెల్ఫీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియా చూపుతున్న చొరవను, వేగాన్ని బిల్గేట్స్ ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శిగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధను తాను ఉపయోగించుకుంటున్న తీరును గేట్స్కు మోదీ తెలియజేశారు. తన సెల్ఫోన్ను గేట్స్కు ఇచ్చి, అందులోని ‘నమో’ యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులోని టెక్నాలజీతో పాత ఫొటోలూ కనిపిస్తాయని అన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫొటోలను గేట్స్కు చూపించారు. -
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
బిల్గేట్స్కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్వాలా మీట్పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్పూర్కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్పూర్ కా డాలీ చాయ్గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్పూర్లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్లో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
బిల్ గేట్స్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్.. జుకర్బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్బెర్గ్ ప్రకారం బిల్గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో బిల్గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రజలు కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీని రాబోయే రోజుల్లో ఉపయోగించడం మొదలుపెడతారని, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) వెల్లడించారు. కృత్రిమ మేధస్సు మనం మునుపెన్నడూ చూడని వేగంతో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తన బ్లాగ్లో రాశారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఏఐ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నాయని, 2024లో ఇది మరింత వేగవంతం అవుతుందని, దీంతో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని బిల్ గేట్స్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మనం ఎప్పుడూ చూడలేని అనేక నూతన ఆవిష్కరణలు ఏఐతో సాధ్యమని అన్నారు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతకడంలో ఏఐ పాత్ర ప్రధానంగా ఉండబోతోందని.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులతో పీడించబడే ప్రజలకు సైతం ఏఐ టూల్స్ సాయపడుతుందని వ్యాఖ్యానిస్తూ.. కొన్ని కంపెనీలు క్యాన్సర్ వంటి వాటిని నయం చేయడానికి కావలసిన మందులను అభివృద్ధి చేయడంలో ఏఐ టెక్నాలజీని ఇప్పటికే వాడుతున్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలామంది దిగ్గజ కంపెనీల సీఈఓలు కూడా కొంత ఆందోళన చెందారు. ఏఐ వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు కూడా వెల్లడించారు. ఏది ఏమైనా ఏఐ వల్ల కొందరికి నష్టమే వాటిల్లినప్పటికీ కొత్త ఆవిష్కరణలకు ఇది బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక స్త్రీ ప్రసవ సమయంలో మరణిస్తుందని, ఇలాంటి ప్రమాదాలను తగ్గించడంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం 'కోపైలట్' సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. HIV ప్రమాదాలను కూడా అంచనా వేయడానికి చాట్బాట్ ఒక సలహాదారు మాదిరిగా పనిచేస్తుందని, దీని ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవచ్చని, ఇలాంటిది అట్టడుగు వర్గాల వారికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చని బిల్ గేట్స్ వెల్లడించారు. -
పనిగంటలపై నవ్వుతెప్పిస్తున్న మీమ్స్ - పారిశ్రామిక వేత్తల మధ్య..
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి క్యాపిటల్ పాడ్కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే అంటూ వెల్లడించారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని, ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు ఎక్కువపని చేశారని వెల్లడించారు. నారాయణ మూర్తి పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు అతి తక్కువ కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కొందరు ఈయన వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరికొందరు గట్టిగా విమర్శించారు. అటు ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి, కొంతమంది ప్రముఖుల వరకు చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు. పనిగంటలు ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కూడా ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న వేళ మనుషులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్గా నిర్వహించిన ‘వాట్ నౌ’ షోలో వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో మనుషులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని చెబుతూ.. కొత్త టెక్నాలజీ మనుషుల ఆయుష్షు, ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? పనిగంటలు ఉద్దేశించి ఇద్దరు పారిశ్రామిక వేత్తలు చేసిన వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ చిన్న వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం నవ్వు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం. -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్గేట్స్ అద్భుతమైన వీడియో
Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్షైర్ హాత్వే , ఛైర్మన్,సీఈవో వారెన్ బఫ్ఫెట్ పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్ చూస్తూ వినూత్నంగా విషెస్ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది 1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్ బఫ్ఫెట్. 93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు ఇన్వెస్టర్లకు పెద్ద సక్సెస్మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో 60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్షైర్ హాత్వే సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్ అంటారు ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫ్ఫెట్. Happy 93rd birthday to my friend Warren! pic.twitter.com/WxeVO1vOut — Bill Gates (@BillGates) August 30, 2023 -
విండోస్ బర్త్డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
కుసుమా నువ్వు గ్రేట్
బనశంకరి: ప్రజల్లో డిజిటల్ ఆర్థిక సాధికారత కోసం బెంగుళూరుకు చెందిన ఒక పోస్టుమాస్టర్ చేస్తున్న కృషికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ముగ్ధుల య్యారు. పోస్ట్మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను కలిశారు. పోస్ట్మాస్టర్అయిన కుసుమనూ కలిశారు. భారత్లో శరవేగంగా సాగుతున్న డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన బిల్గేట్స్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
బిల్ గేట్స్ ప్రశ్నకు ఖాన్ సమాధానం - వీడియో వైరల్
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల తన సొంత పోడ్కాస్ట్ 'అన్కన్ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తయింది. రెండవ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్లో సాల్ ఖాన్కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫోటో చూపించి.. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఈ వ్యక్తి కనిపించారా? ఇద్దరి పేర్లూ ఒకేలా ఉన్నాయని ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ నాకు తెలుసు, నేను అకాడమీ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఫ్యాన్స్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పాడు. ఇదీ చదవండి: అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అంతే కాకుండా.. మెయిల్స్లో నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు మ్యాథ్స్ అంత సులభంగా ఎలా చేస్తారు అని ఉండేదని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు బిల్ గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
ఏకంగా రూ. 3.4 లక్షల కోట్ల విరాళాలిచ్చిన మహిళ ఎవరో తెలుసా?
పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం. ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. 1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రదానం చేశారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు. -
పెళ్ళికి ముందే ప్రియురాలితో చక్కర్లు కొడుతున్న బిల్ గేట్స్ - (ఫోటోలు)
-
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
అపర కుబేరులు జిమ్లో ఉంటే ఎలా ఉంటుంది - ఫోటోలు
-
బిల్గేట్స్తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు!
భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ దేశా రాజధానిలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. అంతేగాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వార్రూమ్ని సైతం సందర్శించారు బిల్గేట్స్. వాస్తవానికి దీన్ని కోవిడ్ సమయంలో నేషనల్ పబ్లిక్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో వార్ రూమ్ని రూపొందించారు. మన్సుఖ్తో జరిగిన సమావేశంలో బిల్గేట్స్ కోవిడ్ నిర్వహణ, టీకా డ్రైవ్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రశంసించారు. అలాగే ఆ సమావేశంలో బారత్ జీ20 ఆరోగ్య ప్రాధాన్యతలు, పీఎం భారతీయ జనౌషధి పరియోజన ఈ సంజీవని గురించి కూడా ఆరోగ్య మంత్రి మన్సుఖ్ బిల్గేట్స్తో చర్చించారు. ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా బిల్గేట్స్తో జరిగిన సమావేశం వండర్ఫుల్ అంటూ ఈవిషయాన్ని వెల్లడించారు. కాగా, బిల్గేట్స్ గతవారం తన బ్లాగ్లో భారత పర్యటన గురించి తెలియజేశారు. బ్లాగులో ఆయన..నేను వచ్చేవారం భారతదేశానికి వెళ్తున్నాను. చాల ఏళ్లుగా అక్కడ చాలా సమయం గడిపినప్పటికీ..మరుగదొడ్లను తనిఖీ చేయడం నుంచి భారతదేశంలోని పేద, వెనుకబడిన కులాలు నివశించే గ్రామాన్ని సందర్శించడం వరకు ప్రతిదీ చేస్తున్నాను. కోవిడ్కి ముందు నుంచి కూడా భారత్ని సందర్శించ లేకపోయాను. అక్కడ ఎంత వరకు పురోగతి సాధించిందో తెలుసుకునేంతం వరకు వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. అలాగే భారతదేశాన్ని కొనయాడారు. భారతదేశం భవిష్యత్తుపై మంచి ఆశను కలిగిస్తుందన్నారు. ప్రపంచం పలు సంక్షోభాలతో అతలాకుతలం అయిపోతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఎంత పెద్ద సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలదని నిరూపించిందన్నారు. (చదవండి: చైనాపై ఒత్తిడి తెచ్చేలా..రంగం సిద్ధం చేస్తున్న అమెరికా!) -
భారత డిజిటల్ నెట్వర్క్ భేష్
న్యూఢిల్లీ: భారత్లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా విశ్వసనీయమైన, చౌకైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. భారత్ అత్యంత చౌకైన 5జీ మార్కెట్ కావచ్చని ఆయన పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సంబంధ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గేట్స్ ఈ విషయాలు తెలిపారు. ఆధార్, చెల్లింపుల వ్యవస్థ, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు భారత్ సాధించిన పురోగతి తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రాథమిక ఆధార్ రూపకల్పనపై ఇన్వెస్ట్ చేయడం సహా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేయడంలో భారత్ సమగ్రమైన ప్లాట్ఫాంను రూపొందించిందని గేట్స్ చెప్పారు. ఈ విషయంలో మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలు ఇలాంటి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. -
రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?
ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనమే. అందరూ చాట్బాట్ గురించే చర్చించుకుంటున్నారు. చాట్జీపీటీ వంటి చాట్బాట్లతో మాట్లాడేందుకు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ నుంచి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమ అంతరార్థాలను ఆవిష్కరించారు. వీరిని ఇంటర్వ్వూ చేసేందుకు ఈ చాట్బాట్ అధునాతన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్లను ఉపయోగించింది. గతంలో వారిద్దరు చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్మెంట్ల నుంచి ప్రశ్నలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారితో సమాధానాలు రాబట్టేందుకు చాలా తెలివిగా ప్రశ్నలు సంధించింది. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఈ ఇంటర్వ్వూ వీడియోను పోస్ట్ చేశారు. రాబోయే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ, జాబ్ మార్కెట్పై సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?.. అంటూ ఇంటర్వ్వూను ప్రారంభించిన చాట్బాట్.. ఇద్దరినీ ఆలోచనలను రేకెత్తించే పలు ప్రశ్నలను సంధించింది. దీనికి బిల్గేట్స్ స్పందిస్తూ.. కార్మిక కొరత, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల్లో ప్రపంచం మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడిగిన చాట్బాట్ను అభినందిస్తూ తాము మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఏఐ సహాయపడుతుందన్నారు. చాట్బాట్ తర్వాతి ప్రశ్న.. ‘మీరు ఇప్పటివరకు స్వీకరించిన అతి ముఖ్యమైన సలహా ఏమిటి, అది మీ వృత్తిని, జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది’.. దీనిపై బిల్స్గేట్, రిషిసునాక్ ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన సహకారాన్ని, సలహాలను పంచుకున్నారు. మీ విధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాల్సివస్తే దేన్ని చేయాలని మీరు కోరుకుంటారు అని అడిప్రశ్నకు గేట్స్ సమాధానమిస్తూ.. తాను నోట్స్ తయారు చేసే క్రమంలో డ్రాయింగ్లు, పద్యాలను జోడించడానికి ఏఐ సహాయం తీసుకుంటానన్నారు. ప్రధాని ప్రశ్నోత్తరాల సమయంలో తన తరఫున ఏఐ పాల్గొనడాన్నిఇష్టపడతానని రిషి సునాక్ చెప్పారు. బ్రెగ్జిట్ అనంతరం యూకే ఆర్థిక పరిస్థతి, వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి రిషి సునాక్ను చాట్బాట్ ప్రశ్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలలో పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, చిన్న వ్యాపారారులకు మద్దతిచ్చే వ్యవస్థను సృష్టించడం వంటివాటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. కోవిడ్ అనంతర ప్రపంచం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు ఎలా తోడుగా నిలివాలి వంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు. సమాజంలో ఏఐ పాత్ర, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం వంటి అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి బిల్ గేట్స్ను అడగ్గా నైతికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. దీని ప్రయోజనాలు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం మధ్య సహకారం కావాలని పిలుపునిచ్చారు. -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్టాప్ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
హాట్ టాపిక్గా బిల్గేట్స్ డేటింగ్, ఎవరా కొత్త గర్ల్ ఫ్రెండ్?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒరాకిల్ మాజీ సీఈవో భార్య పౌలా హర్డ్తో గతేడాది నుంచే డేటింగ్లో ఉన్నట్లు రకరకాల కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఇద్దరు ఇటీవల ఒక ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్లో జంటగా కనిపించడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పౌలా హర్డ్ 2019లో క్యాన్సర్తో పోరాడి మరణించిన ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య. పౌలా హర్డ్ కూడా ఈవెంట్ నిర్వాహకురాలిగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆమెకు మంచి పేరుంది. అంతేగాదు ఆమె గతంలో టెక్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేసింది. పౌలా కూడా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాగా. బిల్గేట్స్ 30 సంవత్సరాల వివాహం అనంతరం మెలిండా గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే తాము విడిపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించే తమ ఫౌండేషన్తో మాత్రం ఇరువురం కలిసే పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం. (చదవండి: మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్స్టాడ్స్ అధ్యయనం) -
సాక్షి కార్టూన్ 06-02-2023
-
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రోటీ చేస్తే ఎలా ఉంటుంది? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒక ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం చెఫ్ అవతార మెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బెర్నాథ్తో కలిసి రోటీలు చేసిన వాటిని నేతితో ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు రోటీ ఎలా చేయాలో నేర్చుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని ఆరంగించారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో గేట్స్ ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో రోటీని ఎలా తయారు చేయాలో బెర్నాథ్ గేట్స్కు నేర్పించారు. ‘‘మేం కలిసి భారతీయ రోటీని తయారు చేసాం. ఈటాన్ భారతదేశంలోని బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గోధుమ రైతులను కలుసుకున్నాడు, కొత్త ప్రారంభ విత్తే సాంకేతికతలతో దిగుబడి గణనీయంగా పెరిగింది’’ అని గేట్స్ క్యాప్షన్లో రాశారు.అలాగే 'దీదీ కి రసోయ్' కమ్యూనిటీ క్యాంటీన్ల మహిళలను కూడా కలుసుకున్నారు. అటు పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్లకు ధన్యవాదాలు’’ అని ఆయన రాశారు. .@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3 — Eitan Bernath (@EitanBernath) February 2, 2023 -
హైదరాబాద్కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్కేర్, లైఫ్సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త మిలిందా ఫ్రెంచ్ గేట్స్ డేటింగ్ అంశం అమెరికా మీడియాలో హల్ చల్ చేస్తోంది. మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. ఫాక్స్ న్యూస్మాజీ కరస్పాండెంట్, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ జోన్ డు ప్రీతో మళ్లీ ప్రేమలో పడ్డారని టీఎంజెడ్ సహా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని నివేదించింది. అంతేకాదు కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లోని ఫైవ్ స్టార్ హోటల్లో ఈ జంట, కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు బస చేసినట్లు కూడా రిపోర్ట్ చేసింది. Bill Gates ex-wife Melinda finds love again; reportedly dating a former TV reporter Melinda Gates, ex-wife of billionaire Bill Gates, is reportedly dating a former Fox News reporter TMZ reports that the 58-year-old philanthropist has been dating Jon Du Pre, 63, for months now. pic.twitter.com/A0ixRbudvR — Instablog9ja (@instablog9ja) November 9, 2022 కాగా బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ ఆగస్టు 2021లో విడాకుల అంశాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు బిల్గేట్స్తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానంటూ మిలిందా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు. మరోవైపు తాజా కథనాలపై మిలిందాగ గానీ, జాన్ డ్యూ ప్రీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్గేట్స్ ఫౌండేషన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
భారత ఆరోగ్యరంగంపై బిల్గేట్స్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని మైకోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శ్లాఘించారు. దేశీయంగా ఆరోగ్య, డిజిటల్ రంగాల దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీని పొగిడారు. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమన్నారు. As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav — Bill Gates (@BillGates) August 15, 2022 ఇదీ చదవండి: భారత్పై మరోమారు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు -
ప్రధాని మోదీకి బిల్గేట్స్ అభినందనలు
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల ప్రక్రియ పూర్తైనందునా అభినందించారు బిల్గేట్స్. ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి మరీ ట్విటర్లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. భారత వ్యాక్సిన్ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. ఇక ప్రధాని మోదీ ఆదివారం నాడు భారత్ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బూస్టర్ డోసులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ప్రజలకు అందిస్తోంది. Congratulations @narendramodi for yet another milestone of administering #200crorevaccinations. We are grateful for our continued partnership with Indian vaccine manufacturers and the Indian government for mitigating the impact of COVID19. https://t.co/YeGUPsveL0 — Bill Gates (@BillGates) July 19, 2022 -
బిల్ గేట్స్ నిర్ణయం.. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలోకి గౌతమ్ అదానీ!
గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ఇటీవల బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: Go First Flights: గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో -
ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు తన ఆస్తిలో సుమారు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందుకే నాకు, నాకుటుంబానికి కావాల్సినంత ఖర్చు చేసి మిగిలిన మొత్తం ఫౌండేషన్కు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా బిల్ గేట్స్ ఫౌండేషన్కు లక్షన్నకోట్లు విరాళం ఇస్తున్నట్లు బిల్ గేట్స్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల స్థానంలో ఉన్న బిల్గేట్స్కు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పెరిగిపోతున్న సంపదను ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఖర్చు చేస్తుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్కు బిల్గేట్స్ పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
Bill Gates Resume: రెజ్యూమ్ అంటే అట్లుంటది: బిల్గేట్స్ పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్ను శుక్రవారం సోషల్మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేశారు. ‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్సైట్లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది. సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్లా లేదు ప్రామిసరీ నోట్గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. -
వారెన్ బఫెట్: అపర కుబేరుడి మంచి మనసుకు నిదర్శనమిది!
ప్రపంచ అపర కుబేరుడు వారెన్ బఫెట్ది మంచి మనసు. ఎన్నోసార్లు తన తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అయితే.. ఆయన మరణిస్తే తన ఆస్తి ఎవరికి చెందాలో నిర్ణయించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బఫెట్ నిర్ణయం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. " మీ దృష్టిలో సక్సెస్ అంటే..వేల కోట్ల ఆస్తి ఉంటే మనం జీవితంలో విజయం సాధించనట్లు కాదు. డబ్బుతో ఏదైనా కొనుచ్చు. కానీ ప్రేమను కొనలేం. అలాంటి ప్రేమ ఎదుటి వారిని నుంచి పొందాలంటే..మనం వాళ్లని ప్రేమించాలి."అంటూ సక్సెస్కి విభిన్నమైన నిర్వచనం చెప్పారు వారెన్ బఫెట్. నిర్వచనం చెప్పడమే కాదు.అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. మరణించిన తర్వాత తన ఆస్తిని ప్రపంచవ్యాప్తంగా పిల్లల సేవింగ్స్ బ్యాంకులు తెరిచి.. తద్వారా వాళ్ల అకౌంట్లలో వేసే యోచనలో(అంచనా) ఉన్నట్లు తెలుస్తోంది. బఫెట్ ఆస్తుల వివరాలు! బెర్క్షేర్ హత్వే కంపెనీ సీఈవోగా ఉన్న బఫెట్ 2006లో తన స్టాక్లో 85 శాతం ఛారిటీకి ఇస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం..ఎక్కువ భాగం గేట్స్ - మిలిండా ఫౌండేషన్ కు కేటాయించారు. బఫెట్ మొత్తం 90 బిలియన్ డాలర్ల బెర్క్ షైర్ వాటాలో 56 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్ కు, 17.4 బిలియన్ డాలర్లు నాలుగు కుటుంబ సభ్యుల ఛారిటీ సంస్థలకు దానం చేయగా.. మిగిలిన 18 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఏం చేస్తారనేది.. ప్రశ్నార్ధకంగా మారింది. పిల్లల అకౌంట్లకి డబ్బులు ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌడేషన్ మాజీ ఉద్యోగి వాల్ స్ట్రీట్ జర్నల్ తో మాట్లాడుతూ..గేట్స్ ఫౌండేషన్ విరాళాలు అందించే దాతలు ఎక్కువ మంది ఉన్నారు. బఫెట్ దానం చేయగా మిగిలిన మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే బఫెట్ తన ఆస్తుల్ని ఎవరికి ఇవ్వాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్తో ఓ ప్రతిపాదన ఉంచినట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి బహిర్గతం చేశారు. "ఇందులో తాను(వారెన్ బఫెట్) మరణించిన 10ఏళ్ల లోపు తన బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఖర్చు చేయాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం వరల్డ్ వైడ్గా బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం,అకౌంట్లను ఓపెన్ చేసి అందులో పిల్లల పేర్ల మీద డబ్బులు వేయడం." గేట్స్ ఫౌండేషన్ ఏం చెబుతుందంటే ఆగస్ట్ 30తో 92వ ఏట అడుగుపెట్టనున్న వారెన్ బఫెట్..మరణానంతరం తన సంపదను ఎలా పంపిణీ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ వైడ్గా ప్రతి బిడ్డకు పంపిణీ చేసే మొత్తం బఫెట్ సమకూరిస్తే.. విశ్వంలో ఉన్న పిల్లలందరూ సామాజిక ఆర్థిక సమస్యల్ని అధిగ మించవచ్చు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని గేట్స్ ఫౌండేషన్ అభిపప్రాయం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. -
ఆదర్శ భారత్: బిల్గేట్స్ని ఆకట్టుకున్న భారత్
భారతదేశ శక్తి సామర్థ్యాలు, ఆ దేశం సాధించిన ఘనత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బిల్ గేట్స్ ఇటీవల అన్నారు. అందుకాయన చూపిన నిదర్శనం కోవిడ్ నియంత్రణలో భారత్ ఆదర్శంగా నిలబడటం. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అత్యంత క్లిష్టమైన సమయంలో ఆరోగ్య సవాళ్లను అధిగమించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్–19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. భారత్ సాధించిన ఈ విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి అని కూడా గేట్స్ అన్నారు. మొదట అంశం: పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పని చేయడం. రెండో అంశం: భారత్ తనకున్న సుదీర్ఘ అనుభవం, అవగాహన, మౌలిక వసతులను ఉపయోగించుకుని కోవిడ్పై పోరాటానికి ప్రచారం చేయడం. మూడో అంశం: మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతూ ఉండటం. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందివ్వడం. నాలుగోది : భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజయవంతంగా మానిటర్ చేయడం. ఈ మౌలికమైన అంశాలన్నిటితో ఇండియా ప్రపంచానికి ఒక ధైర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్లలో ఇండియా ఆరోగ్య అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదన్న భావన కూడా గేట్ మాటల్లో ధ్వనించింది. -
ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు - బిల్గేట్స్
వారిద్దరు ప్రపంచ కుబేరులు. ఒకే సమయంలో వ్యాపార సామ్రాజ్యంలో పోటీ పడ్డారు. వారిలో ఒకరు వారెన్ బఫెట్ అయితే, మరొకరు బిల్గేట్స్. సంప్రదాయ వాణిజ్యం, స్టాక్మార్కెట్లో వారెన్ బఫెట్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే.. టెక్నాలజీ బాట పట్టి మైక్రోసాఫ్ట్తో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు బిల్గేట్స్. వ్యాపారంలో ఇద్దరి దారులు వేరైనా వాటి ద్వారా వచ్చిన సంపద ఖర్చు పెట్టడంలో ఇద్దరూ ఒక్కటే. తమ దగ్గరున్న సంపదను సేవా కార్యక్రమాలను వెచ్చించడంలో వీళ్లద్దరూ ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా వెలుగొందుతున్న కాలంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆహారం, విద్యా, వైద్యం మొదలు వ్యాక్సిన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిల్గేట్స్ ఉద్దేశాలు నచ్చి వారెన్ బఫెట్ సౌతం గేట్స్ - మిలిందా ఫౌండేషన్కి భారీ ఎత్తున విరాళం అందిస్తున్నాడు. తాజాగా గేట్స్ - మిలిందా ఫౌండేషన్కి నాలుగు బిలియన్ డాలర్లు అందించాడు వారెన్ బఫెట్. దీంతో ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్కు వారెన్ బఫెట్ అందించిన సాయం ఏకంగా 36 బిలియన్ డాలర్లకు చేరింది. కీర్తి కోసం పాకులాడకుండా తన మిత్రుడు నడిపిస్తున్న స్వచ్చంధ సంస్థకు వారెన్ బఫెట్ భారీగా విరాళం అందిస్తున్నాడు. దీంతో మంచి పనులు చేసేందుకు సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు వారెన్ బఫెట్ అందిస్తున్న సహకారం చూస్తుంటే తన కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ గేట్స్ పేర్కొన్నారు. I’m grateful for Warren’s gifts to support the foundation’s work and for our many years of friendship. When he decided in 2006 to make these gifts, it moved me to tears. It still does. https://t.co/JVfF4aUCZv — Bill Gates (@BillGates) June 14, 2022 చదవండి: బిల్గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
బిల్గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?
ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలం నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపడమే కాదు ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు గేట్స్. బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటు ఆయన మానుకోలేదు. రెగ్యులర్గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సజెస్ట్ చేస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. 1) ది పవర్ ది పవర్ పుస్తకాన్ని బ్రిటీష్ రచయిత నయోమీ అల్డర్మ్యాన్ రాశారు. ఈ నవల ఫిక్షన్ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందుతుల తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. 2) వై వీ ఆర్ పోలరైజ్డ్ అమెరికన్ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం వై వీ ఆర్ పోలరైజ్డ్. అమెరికా రాజకీయలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక్షన్ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 3) ది లింకన్ హైవే అమోర్ టవెల్స్ రాసిన ది లింకన్ హైవే పుస్తకం కూడా చదివి తీరాల్సిందే అంటున్నాడు బిల్గేట్స్. గతంలో అమెర్ టవెల్స్ రాసిన ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కోకి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే రెండోది మరీ బాగుందంటూ కితాబు ఇచ్చారు బిల్గేట్స్. 4) ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్ కిమ్ స్టాన్లీ రాబిన్సన్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తు ఎంత దుర్లభంగా ఉంటుందనే అంశాలను లోతుగా చర్చించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటున్నారు గేట్స్. 5) హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్ ప్రముఖ రచయిత వాక్లవ్ స్మిల్ కలం నుంచి జాలువారిన మరో మాస్టర్ పీస్ హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు. చదవండి: బిల్గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం -
Sakshi Cartoon: కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్గేట్స్
కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్గేట్స్ -
మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద!
బిలయనీర్లు ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్' సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..అత్యధికంగా బెజోస్ 53.2 బిలియన్ డాలర్లు, మస్క్ 46.4 బిలియన్ డాలర్లు, అత్యల్పంగా బిల్ గేట్స్ 15.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో గత శుక్రవారం నాటికి మస్క్ సంపద 224 బిలియన్ డాలర్లు, బెజోస్ ఆస్తి 139 డాలర్లు, గేట్స్ ఆస్తి 123 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 133 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఇది కూడా చదవండి : Elon Musk: నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత కొంపముంచిన ట్విటర్! ముఖ్యంగా మస్క్ సంపద కరిగిపోవడానికి కారణం ఆయన నిర్ణయాలేనని బ్లూం బర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. టెస్లాలో మస్క్ వాటా 15.6శాతం ఉండగా మొత్తం సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో టెస్లా కారు షేర్లు ఈ ఏడాదిలో మొత్తం (గత వారం శుక్రవారం వరకు) 37శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్ను 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు టెస్లా పట్ల అతని నిబద్ధతను పెట్టుబడిదారులను ప్రశ్నించేలా చేసింది.దీంతో టెస్లా స్టాక్స్ పడిపోయాయి. ఆ తర్వాత మస్క్ సైతం ట్విట్టర్ను 44 బిలియన్లకు టేకోవర్ చేసుకునేందుకు 8.4 బిలియన్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ అమ్మాడు. వెరసీ మస్క్ సంపద కరిగిపోవడానికి పరోక్షంగా కారణమైంది. -
బిల్గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం
ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య భేదాభిప్రాయాలు భగ్గుమంటున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల పోరు ముదిరింది. టీ కప్పులో తుఫాన్లా మొదలైన వీరి కొట్లాట వ్యక్తిగత నిందారోపణల వరకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్న వీరి మధ్య గొడవ చివరకు ఆ ఫండింగ్పై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది... ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, మాజీ నంబర్వన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. మస్క్కు చెందిన టెస్లా కంపెనీని దెబ్బతీయడానికి గేట్స్ లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారన్న వార్తలు వీరి మధ్య విభేదాలకు నాంది పలికాయి. ట్విటర్ కొనుగోలు యత్నాల్లో ఉన్న మస్క్ను అడ్డుకునేందుకు గేట్స్ ఫౌండేషన్ యత్నిస్తోందన్న ఒక వెబ్సైట్ కథనం మస్క్కు మరింత కోపం తెప్పించింది. దీంతో గేట్స్పై, ఆయన ప్రోత్సహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర విమర్శలకు దిగారు. గేట్స్ను అపహాస్యం చేసేలా కామిక్ ఫొటో కూడా ట్వీట్ చేయడంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. మస్క్ ట్విటర్ను కొనుగోలు చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందంటూ గేట్స్ కూడా పరోక్ష విమర్శలు చేశారు. గతంలో నూ వీరిద్దరూ చిన్న చిన్న విసుర్లు విసురుకున్నా తాజాగా మాటల యుద్ధం బాగా ముదిరింది. విభేదాలు పెంచిన కథనం ట్విటర్ను మస్క్ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ట్విటర్ అడ్వర్టైజర్లకు పలు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. వీటిలో 11 సంస్థలకు గేట్స్ ఫౌండేషన్ నిధులందించిందంటూ బ్రిట్బార్ట్ అనే వెబ్సైట్ తాజాగా కథనం వెలువరించింది. దీనిపై మస్క్ను కొందరు ట్విటర్లో ప్రశ్నించగా అదో ఒక పనికిమాలిన చర్య అంటూ తిట్టిపోశారు. అంతేగాక టెస్లాలో షార్ట్ పొజిషన్లు (షేర్ మార్కెట్లో ఒక కంపెనీ ధర పడిపోతుందనే అంచనాతో తీసుకునే పొజిషన్లు) అధికంగా తీసుకున్నారంటూ గేట్స్ను దుయ్యబట్టారు. గేట్స్ను గర్భిణితో పోలుస్తూ ఎమోజీ షేర్ చేశారు. ‘‘షార్ట్ పొజిషన్లపై గేట్స్ను నిలదీశా. శీతోష్ణస్థితి మార్పులపై మా కంపెనీ ఎంతో పోరాటం చేస్తోంది. అలాంటి కంపెనీలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న గేట్స్ దాతృత్వాన్ని, పర్యావరణంపై పోరును నేనైతే సీరియస్గా తీసుకోలేను’’ అంటూ దులిపేశారు. పర్యావరణంపై పోరు పేరిట టెస్లా పెద్దగా చేస్తున్నదేమీ లేదంటూ గేట్స్ గతంలో ఎద్దేవా చేశారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసినంత మాత్రాన పర్యావరణ మార్పును అడ్డుకున్నట్టు కాదన్నారు. ట్విటర్పై రగడ ట్విటర్ను మస్క్ కొనుగోలు చేయడంపై గేట్స్ గతంలోనూ నెగెటివ్గా స్పందించారు. మస్క్ నేతృత్వంలో ట్విటర్లో అసత్య సమాచారం మరింత పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పారదర్శకత కూడా లోపిస్తుంది. నేను ప్రోత్సహించే టీకాలు మనుషుల ప్రాణాలు తీస్తాయని, వాళ్లను నేను ట్రాక్ చేస్తున్నానని వ్యాఖ్యలు చేసే మస్క్ ఆధ్వర్యంలో ట్విటర్లో ఎలాంటి వార్తలు వ్యాపిస్తాయో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. అప్పట్నుంచీ గేట్స్పై మస్క్ గుర్రుగా ఉన్నారు. తాజా కథనం నేపథ్యంలో తన కసినంతా విమర్శల రూపంలో వెళ్లగక్కారు. అయితే మస్క్ ట్వీట్లను పట్టించుకోనని గేట్స్ సమాధానమిచ్చారు. గతంలో మస్క్ బిట్కాయిన్లో వాటా కొన్నప్పుడూ గేట్స్ పరోక్ష విమర్శలు చేశారు. అయితే వీరి మధ్య విభేదాలు ఇంతలా ఎందుకు పెరిగాయన్నది అంతుబట్టని విషయం. ఈ కొట్లాట మరింత ముదిరితే దాని ప్రభావం వారు పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే నిధులపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ బారిన పడిన బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంలో వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు.. అందులో కోవిడ్ 19 పాజిటివ్గా తేలినట్టు ఆయన వెల్లడించారు. వైద్యులు అందించిన సూచనటు పాటిస్తూ ఐసోలేషన్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. తిరిగి ఆరోగ్యవంతుడైన తర్వాత ఐసోలేసన్ వీడుతానని బిల్గేట్స్ ట్వీట్ చేశారు. I've tested positive for COVID. I'm experiencing mild symptoms and am following the experts' advice by isolating until I'm healthy again. — Bill Gates (@BillGates) May 10, 2022 అయితే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ , బూస్టర్ డోసు వేసుకున్నందున వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్గేట్స్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రపంచాన్ని ముంచెత్తడానికి ముందే ఓ మహమ్మారి మానవాళిపై దాడి చేసే అవకాశం ఉందని బిల్గేట్స్ ముందుగానే ప్రపంచ దేశాలకు సూచనలు చేశారు. చదవండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్! -
ట్విటర్ను హ్యాండిల్ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్గేట్స్
నాటకీయ పరిణామాల మధ్య ట్విటర్ను సొంతం చేసుకుని అందరి చేత ఔరా అనిపించాడు ఈలాన్ మస్క్, ఈ నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించిన ఎందరో తర్వాత ఈలాన్కు మద్దతుదారులగా మారారు. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిలేగేట్స్ మాత్రం ఈ టేకోవర్పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన వాల్స్ట్రీట్ జర్నల్ ఈవెంట్ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూజర్లకు ఫ్రీ స్పీచ్ అందివ్వాలనే ఉద్దేశంతో ట్విటర్ను ఈలాన్ మస్క్ టేకోవర్ చేసినట్టు చెబుతున్నారు. కానీ ఫ్రీ స్పీచ్ ముసుగులో వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ఎలా అరికడతారంటూ ప్రశ్నించారు. ఫ్రీ స్పీచ్కి అవకాశం ఇస్తూనే దీన్ని ఆపే విధానం ఎలా ఉంటుందో చూడాలన్నారు బిల్గేట్స్. ఈలాన్ మస్క్ దగ్గర మంచి ఇంజనీర్లు, టెక్నిషియన్లు ఉండవచ్చు. కానీ టెస్లా, స్పేస్ఎక్స్లను నిర్వహించినంత సుళువు కాదు ట్విటర్ను హ్యాండిల్ చేయడం అంటూ తన అభిప్రాయం చెప్పారు బిల్గేట్స్. ఇప్పటికయితే ట్విటర్ గాడి తప్పుతుందని నేను అనేకోవడం లేదని, అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కచ్చితంగా తన అభిప్రాయాలు చెబుతానని ఆయన వెల్లడించారు. చదవండి: మస్క్ ట్విటర్ కొనుగోలు: సౌదీ యువరాజు ట్యూన్ ఇలా మారిందేంటబ్బా! -
విడాకుల కన్నా అదే ఎక్కువ బాధించింది: బిల్గేట్స్
ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్గేట్స్. సండే టైమ్స్తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: బిల్గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!! -
Elon Musk: బిల్గేట్స్పై ఎలన్ మస్క్ అసభ్య ట్వీట్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది మస్క్ తాజాగా ఓ దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను అవమానపరిచేలా శనివారం ఓ దారుణమైన ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఐఫోన్లో ఆమధ్య ప్రెగ్నెంట్ మెన్(అఫీషియల్ ప్రకటన చేయకపోయినా అదే నిజం!) ఎమోజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు బిల్గేట్స్, మరోవైపు ఆ ఎమోజీ ఫొటోను ఉంచి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఒకవేళ మీరు త్వరగా బో**ను కోల్పోవాల్సి వస్తే.. అంటూ ఓ చిల్లర కామెంట్ను క్యాప్షన్గా ఉంచాడు. దానికి అసభ్యమైన అర్థం వస్తుంది. అందుకే మస్క్ను అతని ఫాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఏ మత్తులో ఈ కామెంట్ చేశాడో, దాని వెనకాల కారణం ఏంటో తెలియదుగానీ.. ఈ ట్వీట్ ట్విటర్లో పెనుదుమారాన్నే రేపుతోంది ఇప్పుడు!. in case u need to lose a boner fast pic.twitter.com/fcHiaXKCJi — Elon Musk (@elonmusk) April 23, 2022 చదవండి👉🏼: నెట్ఫ్లిక్స్పై మస్క్ కామెంట్లు ఎందుకంటే.. -
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్తో మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. హైదరాబాద్లో గురువారం వర్చువల్ పద్ధతిలో మొదలైన 19వ బయో ఆసియా సదస్సులో బిల్గేట్స్, తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏవని ప్రశ్నించగా గేట్స్ స్పందిస్తూ వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మ నిషి సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. అ లాగే ఆక్సిజన్ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్ టీకాలను వేగంగా తయారు చేసింద ని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిం దని కొనియాడారు. టీకాల సమర్థ పంపిణీతో ఎ న్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. సిద్ధంగా ఉండాలి.... భవిష్యత్తులోనూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని గేట్స్ ఆకాంక్షించారు. మెరుగైన వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో రాగల మహమ్మారి గురించి గేట్స్ 2015లోనే అంచనా వేయడాన్ని కేటీఆర్ ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా మాదిరిగా ఏళ్లపాటు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధనలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని కోరారు. జీవశాస్త్రంలో మనిషి ఊహించని స్థాయిలో ఆవిష్కరణలు జరగనున్నాయని, అవి భవిష్యత్ సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని అన్నారు. ఎంఆర్ఎన్ఏదే భవిష్యత్తు... హెచ్ఐవీ మొదలు అనేక ఇతర వ్యాధులకు చికిత్స అందించే సామర్థ్యంగల ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీదే భవిష్యత్తు అని బిల్గేట్స్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎంఆర్ఎన్ఏ సాం కేతికత అందర్నీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గేట్స్ ఫౌండేషన్ ప్రయత్నాలు ము మ్మరం చేసిందని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో చవకైన మందులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారతీయ కంపెనీలతోనూ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసు కున్నట్లు ఆయన తెలిపారు. హెచ్ఐవీతోపాటు అనేక వ్యాధులకు రానున్న 10–15 ఏళ్లలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో సెన్సార్లు కృత్రిమ మేధ సా యంతో పనిచేసే పరికరాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయన్నారు. హైదరాబాద్కు ఎప్పుడు వస్తారన్న కేటీఆర్ ప్రశ్నకు కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ముప్పు తప్పదు: బిల్గేట్స్
టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్గేట్స్కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా బిలియనీర్ బిల్గేట్స్ కోవిడ్-19 తీవ్రత కొద్దిగా తగ్గినట్లు పేర్కొన్నారు. కానీ, భవిష్యత్ కాలంలో మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉన్నట్లు బిల్గేట్స్ పేర్కొన్నారని సీఎన్బిసీ నివేదించింది. ప్రపంచ జనాభాలో అధిక భాగం కరోనా వైరస్ నుంచి ఒక స్థాయి రక్షణను సాధించారని బిల్గేట్స్ మీడియాతో చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్ వల్ల సంక్రామ్యత తీవ్రత తగ్గిందని ఆయన తెలిపారు. అయితే, ఆయన ఇలా హెచ్చరి౦చాడు: "మన మీద మరో మహమ్మారి దాడి చేసే అవకాశం ఉ౦ది. ఇది మరో కొత్త రకం వ్యాధి అవుతుంది" అని అన్నారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే, భవిష్యత్తులో మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం మెరుగైన స్థితిలో ఉంటుందని గేట్స్ చెప్పారు. "తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉండటానికి అయ్యే ఖర్చు అంత పెద్దది కాదు" అని గేట్స్ సీఎన్బిసీకి అని అన్నారు. (చదవండి: ఐపీఎల్ కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య యుద్ధం..!) -
బిల్గేట్స్తో ఫొటో.. బిల్డప్కు పోయి నవ్వులపాలయ్యాడు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్ కొట్టేందుకు బిల్గేట్స్తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా.. అందులోని ఓ పాయింట్తో పాక్ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్గేట్స్.. తాజాగా పాక్లో పర్యటించారు(ఆయన పాక్లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్గేట్స్తో లంచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది. పాక్ న్యూస్ ఏజెన్సీ ది కరెంట్ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్ఐ(Inter-Services Intelligence) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్ సర్వీస్ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్ ఐడెంటిటీని రివీల్ చేయడం ఇష్టం లేని పాక్ ప్రభుత్వం.. మరోపక్క బిల్గేట్స్తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్లో ఐఎస్ఐ చీఫ్ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్ ఇజ్జత్ తీసేస్తున్నారు పాక్ నెటిజన్లు. Prime Minister @ImranKhanPTI's luncheon in honor of @BillGates Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki — Prime Minister's Office, Pakistan (@PakPMO) February 17, 2022 గత అక్టోబర్లో నదీమ్.. ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్ మొదట నదీమ్ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చదవండి: ఇమ్రాన్ఖాన్ ది ఇంటర్నేషనల్ బెగ్గర్ -
బయో ఆసియా సదస్సుకు బిల్గేట్స్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న ప్రారంభం కానున్న రెండ్రోజుల బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు ‘బయో ఆసియా’లో బిల్ మెలిండా గేట్స్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్సీ్క, మెడ్ ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. బిల్ గేట్స్, అలెక్స్ గోర్సీ్క, జెఫ్మార్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నడుమ సాగే ఇష్టాగోష్టిలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, విశ్వవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందిపుచ్చుకోవాల్సిన సామర్థ్యాలు, ప్రభుత్వం, పరిశ్రమలు పోషించాల్సిన పాత్రపై మాట్లాడతారు. కోవిడ్ ప్రభావం, సప్లై చైన్లో అంతరాయం, ఆవిష్కరణల వాతావరణం, స్టార్టప్లు, ఆరోగ్య రక్షణ రంగంలో ఏఐ, ఎమ్ఎల్, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత పాత్రపై జాన్సన్ అండ్ జాన్సన్ సీఈవో అలెక్స్ గోర్సీ్క కీలక ప్రసంగం చేయనున్నారు. మెడ్ టెక్ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, మెడ్ టెక్ రంగం అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై మెడ్ ట్రానిక్స్ సీఈఓ జెఫ్మార్తా ప్రసంగిస్తారు. 72 దేశాల నుంచి 31 వేల మంది.. ‘ఆరోగ్య రక్షణ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీసారి జరిగే బయో ఏషియా సదస్సు సంబం ధిత రంగాలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. 2022 సదస్సు కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది. బిల్గేట్స్, గోర్సీ్క, మార్తా వంటి దూరదృష్టి కలిగిన వారు సదస్సులో పాల్గొనడం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు మేలు చేస్తుంది ’ మంత్రి కేటీ రామారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక భారతీయ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. -
బిల్గేట్స్పై ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్గేట్స్పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ని మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఈ సంస్థ బిల్గేట్స్ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్గేట్స్ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్గేట్స్ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్ హోల్డర్స్.. బోర్డును కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్’ మీద ఫోకస్ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్గేట్స్ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు. చదవండి: ‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’ సంబంధిత కథనాలు: గేట్స్ వెకిలి మెయిల్స్.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్! -
ఒమిక్రాన్తో కరోనా విశ్వరూపం!
న్యూయార్క్: కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలుపడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్ టీకాలు తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్ విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, టీకా తీసుకున్నవారిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తోందని ఇప్పటికే డబ్లు్యహెచ్ఓ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోందని గేట్స్ చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్లో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిం చే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ అందరికీ సోకుతోందని, తన స్నేహితుడు దీని బారిన పడడంతో తాను హాలీడే ప్రణాళికలను రద్దు చేసుకున్నానని తెలిపారు. వీలైతే బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ మనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు అంతా దీన్ని సీరియస్గానే తీసుకోవాలని సూచించారు. డెల్టాలో కనీసం సగం తీవ్రత దీనికున్నా దీని వేగంతో అత్యంత భీభత్సం సృష్టించగలదని హెచ్చరించారు. మూడునెలల్లో వేవ్ పూర్తి ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక దేశంలో అడుగుపెట్టి డామినెంట్ వేరియంట్గా మారిన తర్వాత వచ్చే వేవ్ 3నెలల్లోపే ముగియడం శుభపరిణామమని గేట్స్ చెప్పారు. అయితే వేవ్ కొనసాగిన కాలం మాత్రం సమస్యలు తప్పవన్నారు. సరైన చర్యలు తీసుకుంటే 2022కు తప్పక కరోనాకు చరమగీతం పాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒమిక్రాన్ విజృంభణ.. బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
Bill Gates Warns World on Omicron surge: టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్గేట్స్కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే డెల్టాఫ్లస్ లాంటి ప్రమాదకరమైన వేరియెంట్ విజృంభణ సమయంలో.. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడం, పాజిటివిటీ రేటు పడిపోతుడడంపై బిల్గేట్స్ ఓ అంచనాకి వచ్చారు. కరోనా అంతమయ్యే సమయం ఎంతో దూరం లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కానీ, ఒమిక్రాన్ బిల్గేట్స్ అంచనాల్ని తలకిందులు చేసింది ఇప్పుడు. దీంతో తన తాజా ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారాయన. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుందని, రానున్న రోజులు మరింత కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఏడాదిలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్షోభాల్ని ఎదుర్కొక తప్పదని అంచనా వేశారు. ఈ మేరకు తన ట్విటర్లో వరుస ట్వీట్లు పోస్ట్ చేశారాయన. ‘‘సెలవుల్ని బంధువులతో కలిసి ఆస్వాదిద్దాం అనుకున్నా. కానీ, నా సన్నిహితులు సైతం ఒమిక్రాన్ బారినపడ్డారు. దీంతో మొత్తం కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నా. చరిత్రలో ఏ వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ కన్నా వేగంగా విస్తరించలేదు. అతిత్వరలో అన్ని దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించడం ఖాయం. రాబోయే మూడు నెలలు ప్రపంచం గడ్డుకాలం ఎదుర్కొబోతోంది. కొన్నినెలలపాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. There will be more breakthrough cases in people who are vx’d, which sounds concerning but is purely a factor of how many people are vx’d and how fast this variant is spreading. Vaccines are designed to prevent people from getting seriously ill or dying & are doing that well. — Bill Gates (@BillGates) December 21, 2021 సంక్షోభాలు తప్పకపోవచ్చు!. డెల్టాలో సగం తీవ్రతకు చేరుకున్నా.. ఒమిక్రాన్ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. పరిస్థితులు దిగజారిపోతాయి. కానీ, ఒక్కటి మాత్రం కరాకండిగా చెప్పగలను. సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటే 2022లోనే కరోనాను జయించొచ్చు. వీలైనంత త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు బిల్గేట్స్. Omicron is spreading faster than any virus in history. It will soon be in every country in the world. — Bill Gates (@BillGates) December 21, 2021 ఆ కామెంట్పై విమర్శ కరోనా ప్యాండెమిక్లో దారుణమైన దశకు చేరుకున్నామన్న బిల్గేట్స్.. మరో ట్వీట్తో విమర్శలపాలయ్యారు. బూస్టర్ షాట్స్ తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన సలహాను చాలామంది తప్పుబడుతున్నారు. సంబంధిత వార్త: కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్ చదవండి: బిల్గేట్స్, బెజోస్ తర్వాత ఎవరంటే.. -
కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్
Bill Gates Predicted Covid Pandemic: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పీడ నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వాక్సిన్ల వాడకం దృష్ట్యా మహమ్మారి తీవ్రమైన దశ 2022లో ముగుస్తుందని ఈ విషయాన్ని తన బ్లాగులో చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లతో వ్యాప్తి చెందడం, ప్రజలకు పూర్తిగా టీకాలు వేయడం అంత త్వరగా జరిగే పని కాదు గనుక మహమ్మారి ముగింపు తాను ఆశించినంత దగ్గరగా లేదని బిలియనీర్ చెప్పాడు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఆందోళన తప్పదని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. కొత్త వేరియంట్లను ప్రభావాన్ని వేగంగా గుర్తించడం, వ్యాక్సిన్లు, యాంటీవైరల్ డ్రగ్స్లో అభివృద్ధితో కలిపి, 2022లో కోవిడ్ తీవ్రత నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రతి సీజన్లో కోవిడ్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని, మహమ్మారి అంతమయ్యేవరకు పోరాటం ఆపకూడదని సూచించారు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. -
ఆ విడాకుల విలువ అక్షరాల యాభై వేల కోట్లు!
Russian Billionaire Vladimir Costly Divorce Case News: రష్యన్ బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ అత్యంత ఖరీదైన విడాకులతో వార్తల్లోకెక్కాడు. ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) విడాకుల భరణం కోరుతూ ఆయన భార్య(మాజీ) కోర్టుకెక్కింది. తద్వారా జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ తర్వాత అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది. వ్లాదిమిర్ పొటానిన్.. రష్యాలోనే రెండో రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 31 ఏళ్ల కాపురం తర్వాత వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా పొటానినా విడాకులకు సిద్ధమయ్యారు. అయితే ఖనిజం ఫ్యాక్టరీ ఎంఎంసీ నోరిల్స్క్ నికెల్ పీఎస్జేసీలో వ్లాదిమిర్కు చెందిన వాటా నుంచి యాభై శాతం భరణంగా ఇప్పించాలంటూ మాజీ భార్య నటాలియా లండన్ కోర్టుకు ఎక్కింది. ఆ విలువ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. అంతేకాదు ఆయన వ్యాపారాల్లో ఆ విలువ మూడో వంతు పైనే ఉంటుంది. ఇలాంటి హైప్రొఫైల్ కేసులకు తీర్పులు ఇవ్వడంలో లండన్ కోర్టుకు ఘన చరిత్రే ఉంది. గతంలో బిలియనీర్ ఫర్ఖద్ అఖ్హ్మెదోవ్ విడాకుల కేసులో 450 మిలియన్ పౌండ్ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కూడా. ఇంతకు ముందు నటాలియా పొటానీనా కింది కోర్టులో 84 మిలియన్ డాలర్లు కోరగా.. 40 మిలియన్ డాలర్లకు జడ్జి తీర్పు ఇచ్చారు. కానీ, పొటానీనా మాత్రం భారీ భరణం కోరుతూ ఈసారి లండన్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పోటానిన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మాక్మెకంజీ స్కాట్కు 36 బిలియన్ డాలర్లు విడాకుల భరణం చెల్లించగా.. బిల్గేట్స్, మిలిండాకు 26 బిలియన్ డాలర్ల భరణం చెల్లించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మూడో బిలియనీర్గా ఖరీదైన విడాకుల జాబితాలో వ్లాదిమిర్ నిలుస్తాడా? లేదా? అన్నది తెలియడానికి కొంత టైం పడనుంది. -
బిల్గేట్స్తో మోదీ భేటీ
గ్లాస్గో సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ మంగళవారం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, అపరకుబేరుడు బిల్గేట్స్తో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధి, భూతాపోన్నతిని తగ్గించే చర్యలపై చర్చలు జరిపారు. అనంతరం నేపాల్ ప్రధాని దేవ్బా తో మోదీ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు చతురోక్తులు విసురుకున్నారు. ‘మా దేశంలో మీకు అత్యధిక జనాదరణ ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ తెలపగా మోదీ ‘థ్యాంక్యూ, థాంక్యూ’ అంటూ బదులిచ్చారు. అనంతరం బెన్నెట్ తమ యమినా పార్టీలో చేరాలంటూ మోదీని ఆహ్వానించారు. దాంతో, ఇరువురు నేతలు సరదాగా నవ్వుకున్నారు. -
బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’
వాషింగ్టన్: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్గేట్స్, జెఫ్ బెజోస్. వీరిద్దరిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల క్రితమే బిల్గేట్స్ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్ హెలికాప్టర్లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు. ఈ బర్త్డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్డైయాక్సైడ్ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్ హెలికాప్టర్ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ వెల్లడయినట్లు తెలిసింది. (చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది) ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిల్గేట్స్నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్) బిల్గేట్స్ బర్త్డే పార్టీ జరిగిన పడవ సూపర్యాచ్ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్కి వెళ్లినట్లు తెలిసింది. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..
వాషింగ్టన్: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్గేట్స్ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. (చదవండి: ప్రియుడితో బిల్గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!) కొన్ని రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్ గేట్స్ తన వివాహ వేడుక గురించి వోగ్ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్. (చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!) ‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది. ‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. జెన్నీఫర్ భర్త నాయల్ నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
అమ్మాయిలతో ‘పులిహోర’.. బిల్గేట్స్కు గట్టి వార్నింగ్!
ఇదేం కొత్త ఆరోపణ కాదు. కాకపోతే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ‘చిలిపి చేష్టలు’ తమ దృష్టికి రావడంతో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ స్వయంగా ఆయన్ని మందలించారనే కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు వాల్స్ట్రీట్ జర్నల్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. సదరు ఘటన 2008లో జరిగింది. ఓ మిడ్ లెవల్ ఉద్యోగితో పులిహోర కలుపుతూ ఆయన(బిల్ గేట్స్) పంపిన మెయిల్స్ వ్యవహారం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ దృష్టికి వచ్చింది. దీంతో జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్(మైక్రోసాఫ్ట్ ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ ), మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ కలిసి గేట్స్ను వ్యక్తిగతంగా సంప్రదించారు. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు ఆపితే మంచిదని ఆయన్ని సున్నితంగా మందలించారు కూడా!. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బిల్గేట్స్ నీళ్లు నమలడం, ఉద్యోగిణికి కేవలం వెకిలి మెయిల్స్ మాత్రమే పంపడం, పైగా శారీరక సంబంధం దాకా యవ్వారం వెళ్లకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలిపెట్టారని వాల్స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో పేర్కొంది. ఇక ఈ కథనంపై ఇటు మైక్రోసాఫ్ట్గానీ, అటు స్మిత్గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది. ఇదిలా ఉంటే 2019లో బిల్గేట్స్ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లైంగిక ఆరోపణలపై న్యాయపరమైన విభాగంతో దర్యాప్తునకు ఆదేశించింది మైక్రోసాఫ్ట్. ఆ దర్యాప్తు గోప్యంగా కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఎప్పుడైతే బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ విడాకులు ప్రకటించారో.. అప్పటి నుంచి వరుసబెట్టి ఆయనపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా బిల్గేట్స్ చిలకొట్టుడు వ్యవహారాలే మెలిండాతో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి కారణమనే వాదన సైతం తెర మీద వినిపిస్తుంటోంది. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ఎవరంటే.. క్లిక్ చేయండి: ‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’ -
‘నువ్వింక మారవా?’.. ఎలన్ మస్క్ రిప్లై ఇది
సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు మాత్రం.. చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరులతో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్గేట్స్తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. ‘విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా’ అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ‘ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం’ అంటూ సింగిల్ లైన్లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు. Hopefully enough to extend life to Mars — Elon Musk (@elonmusk) October 16, 2021 ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్కాయిన్లకు సమానం. బిల్గేట్స్, వారెన్ బఫెట్ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్కు ఎలన్ మస్క్ ‘బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో!’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు . టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్ఎక్స్ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్ను సైతం ఆస్వాదిస్తుంటాడు. చదవండి: మస్క్, బెజోస్.. భూమ్మీద ఏక్ నెంబర్ 'పిసినారులు' -
ప్రియుడితో బిల్గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్-మిలిందా గేట్స్ల కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహ వేడుక సీక్రెట్గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్లో జరిగినట్లు సదరు మ్యాగజైన్ ప్రచురించింది. కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్తో విడాకులు తీసుకున్న బిల్గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్-నాజర్ల పెళ్లి జరిగినట్లు పీపుల్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. నాజర్ది సంపన్న కుటుంబమే.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్లో అమెరికా తరఫున నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాయల్ నాజర్ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది. చివరకు సోషల్ మీడియా వేదికగా జెన్నీఫర్ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్గేట్స్తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు పీపుల్ మ్యాగజైన్ తెలిపింది. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది ‘నాయల్ నాజర్.. నువ్వు నాకు దొరికిన ఒక అదృష్టానివి. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది. మన జీవితం కలిసి పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జెన్నీఫర్. ‘ ప్రపంచంలో నేను అదృష్టవంతుడ్నే కాదు.. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ని కూడా. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ప్రతీ ఉదయాన్ని, ప్రతీ రోజుని ఒక కల అంత అందంగా ఆస్వాదించేలా చేసిన నీకు చాలా థాంక్స్’ అని నాజర్ తెలిపాడు. బిల్గేట్స్-మిలిందా మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్గేట్స్ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్ గేట్స్. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట. -
అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్గేట్స్...!
Bill Gates Takes A Dig At Jeff Bezos And Elon Musk: గత కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే..! ఈ సంస్థల అధినేతలు స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలు తదుపరి అంతరిక్షయాత్రల కోసం వడివడిగా పనులను జరుపుతున్నాయి. ప్రపంచంలోని బిలియనీర్స్ రోదసి యాత్రలను చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! భూమ్మీద ఎన్నో సమస్యలున్నాయి..వాటిపై..! అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్పై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదు ’ అని అన్నారు. లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డాన్ షోలో పలు అంశాలపై బిల్గేట్స్ చర్చించారు . భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్గేట్స్ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్ కోర్డాన్ పేర్కొన్నారు. Tonight on our special #ClimateNight episode, Bill Gates shares a very good reason for why you haven’t seen him in a rocket ship 🚀 pic.twitter.com/7C8cKarJl0 — The Late Late Show with James Corden (@latelateshow) September 23, 2021 చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! -
ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్గేట్స్, జెఫ్బెజోస్..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్..! ఎంత త్వరగా వీలైతే అంతా తక్కువ సమయంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్ శక్తిని ఉపయోగించి వాహనాల తయారీ కోసం ఇప్పటికే పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. చదవండి: Elon Musk SpaceX: కక్ష్యలో 3 రోజుల ప్రయాణానికి సర్వం సిద్ధం ఎలన్మస్క్కు చెందిన టెస్లా ఒక అడుగు ముందేకేసి ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్చేస్తే ఆరు వందల కిలోమీటర్లమేర ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ అనేది ఆయా వాహనాల మెటల్ బాడీపై ఆధారపడి ఉంటుంది. అత్యంత మన్నికైన, తేలికైన, శక్తివంతమైన, మెటల్ బాడీల తయారుకోసం పలు శాస్త్రవేత్తలు పరిశోధనలను చేపట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లోహలకోసం చేపట్టే పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చేందుకు గాను ప్రపంచ బిలియనీర్లు అమెజాన్ అధినేత జెఫ్బెజోస్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కోబోల్డ్ అనే మినరల్ ఎక్స్ప్లోరేషన్ స్టార్టప్లో భారీగా నిధులను ఇన్వెస్ట్చేసినట్లు తెలుస్తోంది. కోబోల్ట్ స్టార్టప్, బీహెచ్పీ కంపెనీ భాగస్వామ్యంతో ఈవీ వాహనాల్లో వాడే లోహలను వెతకడం కోసం పరిశోధనలను చేపట్టనున్నారు. వీరు అందించే లోహలు ప్రాథమికంగా టెస్లా కార్ల తయారీకి ఉపయోగపడనుంది. కోబోల్డ్ మెటల్స్ , బిహెచ్పి కలిసి ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్, కోబాల్ట్, రాగి కోసం శోధిస్తాయని కోబోల్డ్ సిఇఒ కర్ట్ హౌస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెస్లా కార్ల బ్యాటరీలో వాడే నికెల్ అందించడంకోసం టెస్లాతో బీహెచ్పీ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృత్రిమ మేథస్సు ఏఐ టెక్నాలజీనుపయోగించి ఈవీ వాహనాల లోహలకోసం కోబోల్డ్ మెటల్స్ అన్వేషణ చేపట్టనున్నాయి. ఈ కంపెనీల్లో ఎనర్జీ వెంచర్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్తో పాటుగా బ్లూమ్బర్గ్ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్లూమ్బర్గ్ పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. వీరు ఎంతమేర పెట్టుబడిపెట్టారనే విషయంపై కోబోల్ట్ స్పందించలేదు. ఈవీ వాహనాల లోహల పరిశోధనలకోసం 14 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనుంది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్గా కెరీర్ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్బెల్.. మొదట్లో ఫుట్బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్బెల్. ►మార్క్ జుకర్బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్తో దగ్గరగా ఎలన్మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్గేట్స్కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్ -
బిల్గేట్స్నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్
ఆర్థిక నేరాలు, కుంభకోణాలు మనం నిత్యం చూస్తున్నవే. కానీ, ఆ నేరాల్లో నైపుణ్యం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నది మేధావుల మాట. ఆర్థిక మేధావిగా ప్రపంచం నుంచి జేజేలు అందుకున్న అరిఫ్ నక్వీ.. తర్వాతి కాలంలో ‘స్కామర్’గా ఓ మాయని మచ్చను అంటించుకున్నాడు. ప్రస్తుతం తాను పాల్పడ్డ ఆర్థిక నేరాలకు సుదీర్ఘ కాలం జైలుశిక్ష అనుభవించేంత పరిస్థితికి చేరుకున్నాడు. అందులో బిల్గేట్స్ను 700 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్కు చెందిన అబ్రాజ్ గ్రూపుల అధినేతే ఈ అరిఫ్ నక్వీ(60). ప్రపంచానికి ఏదో మంచి చేస్తామంటూ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. కంపెనీలు, సేవా కార్యక్రమాల పేరిట పెట్టుబడులను స్వీకరించాడు. ఈ క్రమంలో దర్పం ప్రదర్శిస్తూ గొప్ప గొప్పవాళ్లతో భేటీ అవుతూ.. తెలివిగా బోల్తా అందరినీ ఏమాయ చేశాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలతో పాటు గోల్డ్మ్యాన్ సాచ్స్ మాజీ సీఈవో లాయ్డ్ బ్లాంక్ఫెయిన్, బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటి ప్రముఖలెందరో అరిఫ్ చేతిలో మోసపోయినవాళ్ల లిస్ట్లో ఉన్నారు. ‘ది కీ మ్యాన్: ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాస్ డూప్డ్ బై ఏ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టెయిల్’ అనే బుక్లో సైమన్ క్లార్క్, విల్ లాంఛ్ ద్వయం ఈ బిల్డప్ బాబాయ్ మోసాల గురించి రాశారు. మొత్తం ఫండ్స్ నుంచి 780 మిలియన్ డాలర్ల సొమ్మును ఎలా పక్కదారి పట్టించాడు, మరో 385 మిలియన్ డాలర్ల సొమ్మును లెక్కల్లోనే లేకుండా ఎలా చేశాడు అనే వివరాల్ని ప్రస్తావించారు. ఇక బిల్గేట్స్ సహాయక కార్యక్రమాల ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దావోస్ సదస్సులో తనను తాను ఓ వ్యాపార దిగ్గజంగా పరిచయం చేసుకున్న అరిఫ్.. తన కంపెనీ ర్యాంకింగ్లంటూ, ఎన్జీవో సేవాకార్యక్రమాలంటూ ఫేక్ వివరాలను, సర్వేలను చూపించాడు నక్వీ. చేయూత నివ్వాలంటూ కోరడం, అతని ఆర్భాటాలు-హడావిడి చూసి గేట్స్ మోసపోవడం గురించి వివరంగా రాశారు ఆ బుక్లో. అయితే అబ్రాజ్ తరపున నక్వీ మోసాలు బయటకు రావడం, అప్పటికే ఆలస్యం కావడంతో నష్టం జరిగిపోయిందంటూ బుక్లో తెలిపారు. పాక్లో ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ల కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ల కోసం 100 మిలియన్ డాలర్ల(700 కోట్ల రూపాయలపైనే) సాయం అందించింది గేట్స్ ఫౌండేషన్. అలా ఆ డబ్బును తన ఖాతాలో వేసేసుకున్నాడు నక్వీ.. రహస్యాంగా అంతా ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. బిల్డప్ బాబాయ్ నేపథ్యం 1960లో పాకిస్తాన్ కరాచీలో పుట్టిన నక్వీ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆర్థిక మేధావిగా ఎన్నో సదస్సుల్లో ప్రసగించడమే కాకుండా, ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆపై అమన్ పేరుతో ఓ ఫౌండేషన్ నెలకొల్పి.. చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. 2003లో ఇస్లాం దేశాల రాజులు, వ్యాపారుల నుంచి 118 మిలియన్ డాలర్లను సేకరించాడు. ఆ సొమ్ముతో అబ్రాజ్ కంపెనీని నెలకొల్పి.. భారీ అవతకవలకు పాల్పడ్డాడు. 2010లో ఒబామా అధ్యక్షతన అమెరికాలో జరిగిన ఎంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్కు నక్వీ కూడా హాజరయ్యాడు. అంతేకాదు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సైతం దక్కించుకున్నాడు. దుబాయ్లో లగ్జరీ ఇంటిలో విలాసవంతమైన జీవితం గడిపిన నక్వీ.. కంటితుడుపుగా యూనివర్సిటీలకు విరాళాలు ఇస్తుండేవాడు. ఈ బిల్డప్లతోనే సుమారు 300 కంపెనీల నుంచి పెట్టుబడులను రాబట్టాడంటే అతిశయోక్తి కాదు. పైగా దావోస్ లాంటి విదేశీ సమ్మిట్లకు హాజరవుతూ.. బిల్గేట్స్లాంటి బిలియనీర్లెందరితోనో పరిచయం పెంచుకున్నాడు. 2017లో ఆయన అవినీతి గురించి ఉద్యోగులు మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. ఆరోపణల తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఈ ఆరోపణలపై ప్రైవేట్ దర్యాప్తునకు ఆదేశించింది. చివరికి ఆ ఆరోపణల ఆధారంగా నక్వీని నేరస్తుడిగా తేల్చిన అమెరికా కోర్టు.. ఏప్రిల్ 10, 2019న లండన్ హెత్రో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయించింది. అయితే బెయిల్ దొరికినప్పటికీ.. వ్యక్తిగత పూచీ కత్తులపై హౌజ్ అరెస్ట్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ కూడా నక్వీ నేరాలపై విచారణ కొనసాగిస్తోంది. నక్వీ ఆర్థిక నేరాలు గనుక రుజువైతే 300 ఏళ్లు జైలు శిక్ష పడనుంది. చదవండి: డర్టీ బిజినెస్- భార్య ఎఫైర్లను సైట్లో పెట్టిన గూగుల్ ఫౌండర్ -
మగవాళ్ల కోసం సంతాన నిరోధక మాత్రలు! అతి త్వరలో..
Male Contraceptive Pill:ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. సేమ్.. మగవాళ్లకూ అలాంటి మాత్రలు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. అలాగే ఇవి మగవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీ ఆపుతాయన్నమాట. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డుండీ(స్కాట్లాండ్) ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. బిల్గేట్స్ సహకారం ఈ మాత్రలు మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. కారణం.. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ ప్రయోగాల వెనుక ఉండడం. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. ఇందుకోసం ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయం అందించింది కూడా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందిస్తున్నట్లు డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బర్రాత్ ఓ ప్రకటనలో వెలువరించాడు. సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్లను మార్కెట్లోకి తెచ్చారు సైంటిస్టులు. అయితే వీటి తర్వాత మెడికల్ సైన్స్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు.. అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్ క్రిస్ చెప్తున్నాడు. అయితే సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు ఆయన. -
అవును వాళ్లిద్దరు విడిపోయారు.. అధికారికంగా.!
బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ దాంపత్య జీవితానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదే ఈ పరిణామం.! 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా మే నెలలో విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత వారి నిర్ణయాన్ని అంగీకరిస్తూ వాషింగ్టన్ కు చెందిన కింగ్ కౌంటీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. దీంతో బిల్ గేట్స్, మెలిందా గేట్స్ బంధానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది. మే నెలలో బిల్గేట్స్ - మెలిందాలు తాము విడిపోతున్నట్లు, విడాకుల కోసం కింగ్ కౌంటీ కోర్ట్ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు. దీంతో వారు విడిపోవడంపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బిల్గేట్స్ దంపతుల విడాకులు మరోమారు చర్చకు దారితీశాయి.. అమెరికా చట్టాల ప్రకారం డివోర్స్ కావాలంటే మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంది. అందుకే బిల్గేట్స్ దంపతులు విడాకుల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో కింగ్ కౌంటీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. బ్లూం బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం.. విడాకులతో సుమారు 152 బిలియన్ల డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస్తిని ఎలా పంచుకుంటారో తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఫ్రెంచ్ గేట్స్కి బదిలీ చేసినట్టు అమెరికన్ మీడియా 'టీఎంజీ' తన కథనంలో పేర్కొంది. ఇక వాషింగ్టన్ న్యాయ నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో ఆస్తులు,ఇతర వ్యవహారాల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో.. విడిపోయే సమయంలో కూడా ఆ నిబంధనలపై కట్టుబడి ఉండాలి. వాటికి లోబడే బిల్గేట్స్-మెలిందా గేట్స్ ఆస్తుల్ని పంచుకోవాలని న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ ఆస్తి ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరి ఆస్తి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’
న్యూయార్క్: విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్ వాల్లేస్. జేమ్స్ వాల్లేస్.. గేట్స్ మీద రెండు బయోగ్రఫీలు రాశాడు.అందులో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో గేట్స్.. విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడని, ఆ టైంలో తన పదిహేడు గంటల పని తీరును పక్కనపెట్టాడని వాల్లేస్ పేర్కొన్నాడు. గేట్స్ లోకల్ నైట్ క్లబ్ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్ ఆరోపించాడు. కొమ్డెక్స్, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్.. పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ టైంలో బిల్గేట్స్ తప్పతాగే వాడని గతంలో రాబర్ట్ క్రింగ్లే అనే బ్లాగర్ రాసిన కథనాన్ని ప్రస్తావించాడు వాల్లేస్. ఇక ఈ ప్రకటనపై.. బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు. స్త్రీ లోలుడు : మాజీ ఉద్యోగి ఆరోపణ ఇక బిల్గేట్స్(65)పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి బిల్గేట్స్ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ఎందుకు? -
అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్గేట్స్ మాత్రం కాదు..
భారత పారిశ్రామిక పితామహుడుగా పేరొందిన జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్దకాలంలో దాతృత్వాన్ని చాటడంలో హురున్ రిపోర్ట్, ఎడెల్గైవ్ ఫౌండేషన్ రూపొందించిన రిపోర్ట్లో జేఆర్ టాటా నంబర్.1 స్థానంలో నిలిచారు. సుమారు జేఆర్ టాటా 102 బిలియన్ల డాలర్ల(7.5 లక్షల కోట్ల)ను వివిధ సామాజిక కార్యాక్రమాలకోసం విరాళాలుగా ఇచ్చారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత విరాళాలను ఇచ్చిన వ్యక్తిగా జేఆర్ టాటా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం టాటా కంపెనీ ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ పనుల వరకు చేస్తోంది. జేఆర్ టాటా తరువాత , బిల్గేట్స్ అతని భార్య మిలిందా గేట్స్ సుమారు 74.6 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో , వారెన్ బఫెట్ 37.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో , జార్జ్ సోరోస్ 34.8 బిలియన్ డాలర్లతో నాలుగో స్ధానంలో నిలిచారు. గత శతాబ్ద కాలంలో అమెరికన్, యూరోపియన్కు చెందిన బిలియనీర్లు సామాజిక కార్యక్రమాలను చేయడంలో ముందున్నా..టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాను అధిగమించడంలో వెనుకబడ్డారని హురున్ చైర్మన్, పరిశోధకుడు రూపెర్ట్ హూగ్వెర్ఫ్ విలేకరులతో అన్నారు. కంపెనీ లాభాల్లో మూడింట రెండు వంతులు విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలకు విరాళాలను కేటాయించడంతో జంషెట్జీ టాటా ముందంజలో నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్జీ, తన మొత్తం సంపాదనలో 22 బిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలను చేపట్టడానికి విరాళంగా ఇచ్చారు. హురున్ రిపోర్ట్, ఎడెల్గైవ్ ఫౌండేషన్ రూపొందించిన రిపోర్ట్లో టాప్ 50 మందిలో యూఎస్ నుంచి 38 మంది, యూకే నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు నిలిచారు. చదవండి: చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..! -
అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా?
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా బిల్ గేట్స్ అని మనందరికీ తెలుసు, కానీ మనలో ఎంత మందికి గేట్స్ అమెరికాలో అతిపెద్ద రైతు అని తెలుసు. మీలో చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు కానీ, ఇది నిజం. గేట్స్ అమెరికా అతిపెద్ద రైతులలో ఒకరు. బిల్ గేట్స్, అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ల్యాండ్ రిపోర్ట్, ఎన్ బీసీ రిపోర్ట్ ప్రకారం.. గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. నార్త్ లూసియానాలోనే గేట్స్కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు. అలాగే నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. ఒకసారి గేట్స్ను రెడ్డిట్లోని తన వ్యవసాయ భూముల గురించి అడిగినప్పుడు దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.. “ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది” అని అన్నారు. బిల్ గేట్స్ , మెలిండా వ్యవసాయ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆస్పష్టంగా ఉంది. చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
బిల్గేట్స్కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెలిందా
వాషింగ్టన్: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారు వివరించలేదు.. కానీ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆమె తమ ఇద్దరి సమిష్టి సంపద 130 బిలియన్ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు గాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్ ట్రస్ట్, ఎస్టెట్ లాయర్ ఉన్నారని డెయిలీ మెయిల్ కోట్ చేసింది. మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
బిల్ గేట్స్ను అరెస్ట్ చేయాల్సిందే.. మరీ ఇంత దారుణం చేశాడా?
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను అరెస్ట్ చేయాలంటూ ట్విటర్లో ఓ పోస్ట్ ట్రెండింగ్లో ఉంది. భారత్లో అమాయక గిరిజన బాలికలపై వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను తన సంస్థ ( బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) తరపున అనధికారికంగా నిర్వహించారని , వాటికి పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చారంటూ గ్రేట్గేమ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం విడుదల చేసింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి 'అరెస్ట్ బిల్ గేట్స్' అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విటర్లో నెటిజన్ల పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది ట్రెండింగ్లో ఉంది. మెలిండా గేట్స్తో విడాకుల వ్యవహారం, మైక్రోసాఫ్ట్లోని ఒక మహిళా ఉద్యోగితో అతని అక్రమ సంబంధంపై వివాదంతో పాటు ప్రస్తుతం తాజా ఆరోపణలు చూస్తుంటే బిల్ గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గ్రేట్గేమ్ ఇండియా రాసిన ప్రత్యేక కథనంలో.. 2009లో తెలంగాణ సహా నాగాలాండ్లోని గిరిజన బాలికలపైనా అనాధికారంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. 14 వేల మంది కోయ గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో పొందుపరిచింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపినట్లు తెలిపింది. ఆ వ్యాక్సిన్ హ్యూమన్పాపిలోమా వైరస్ను నివారించడానికి తయారు చేసింది. అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్న ఎన్జీఓ సంస్థ ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించినట్లు గ్రేట్గేమ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను, పేదరికంలో ఉన్న వారినే ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లా పలువురు గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవల వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. This is the untold story of how @BillGates funded NGO PATH killed tribal girls in India in unauthorised clinical trials and got away with it. #ArrestBillGates https://t.co/yYqCRZ4Ah3 — Tribal Army (@TribalArmy) May 29, 2021 He is a monster and enemy of humanity...He must be stopped for good.#ArrestBillGates #ArrestBillGates#ArrestBillGates pic.twitter.com/sXyaTxV9is — Suraj Samrat 💙 (@samratsurajINC) May 29, 2021 చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
ఇంజనీర్తో బిల్గేట్స్ ఎఫైర్.. సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఆయనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలగాల్సి వచ్చిందని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందించారు. అప్పటికి, ఇప్పటికి కంపెనీలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల బిల్ గేట్స్ పేరు ప్రస్తావించకుండా ఈ అంశంపై స్పందించారు. ‘‘2000 సంవత్సరంతో పోలిస్తే కంపెనీలో పరిస్థితులు ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా మార్పులు సంభవించాయి. కంపెనీలో వైవిధ్యం, భిన్న సంస్కృతులు ప్రతి రోజు అభివృద్ధి అయ్యే వాతావారణాన్ని మేం సృష్టించామని నేను భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. దాని మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించాను’’ అని తెలిపారు. ‘‘మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి గురించి ఏవైనా ఆరోపణలను లేవనెత్తినప్పుడు అవతలి వారి కంఫర్ట్ గురించి కూడా ఆలోచించాలి. లేవనెత్తిన ఆరోపణలను పూర్తిగా దర్యాప్తు చేయగలిగేలా చూసుకోవాలి. అప్పటి వరకు మనకు తోచినవిధంగా ఊహించుకుని వారిని ఇబ్బంది పెట్టకూడదు" అని నాదెళ్ల తెలిపారు. వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్లో పనిచేసే మహిళా ఇంజనీర్తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్గేట్స్ రాజీనామా చేశారని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చదవండి: ఇంజనీర్తో ఎఫైర్: అందుకే బిల్ గేట్స్ రాజీనామా?! -
ఇంజనీర్తో ఎఫైర్: అందుకే బిల్ గేట్స్ రాజీనామా?!
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించిన మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వివరాలు.. తన జీవితం ఇక పూర్తిగా సామాజిక సేవకే వినియోగించాలనుకుంటున్నానని, అందువల్లే మైక్రోసాఫ్ట్ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు బిల్గేట్స్ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో మరింత బిజీగా మారిపోయారు. అయితే, వాల్స్ట్రీట్ జర్నల్ తాజా కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్లో పనిచేసే మహిళా ఇంజనీర్తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్గేట్స్ రాజీనామా చేశారని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన బిల్గేట్స్ అధికారప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి మాట. ఆ బంధానికి స్నేహపూర్వంగానే ముగింపు పలికారు. బోర్డు నుంచి వైదొలగడానికి, దీనికీ ఎటువంటి సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా భార్య మిలిందా గేట్స్తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్ గేట్స్ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వీరి బంధం బీటలు వారడానికి యాన్ విన్బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయనకు మరో మహిళతోనూ ఎఫైర్ ఉందన్న వార్తలు వెలువడటం గమనార్హం. కాగా స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%. చదవండి: అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే! -
గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’..
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలయనీర్ బిల్ గేట్స్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నట్లు గేట్స్ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి మెలిందా 2019లోనే న్యాయవాదులను కలిసి చర్చించారని వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మెలిందా అక్టోబర్, 2019 నాటికి అనేక సంస్థలకు చెందిన న్యాయవాదులతో విడాకుల గురించి చర్చించారని.. వారి వైవాహిక జీవితం “అతకలేని విధంగా విచ్ఛిన్నమైందని” మెలిందా వారికి తెలిపినట్లు వాల్ స్ట్రీట్ వెల్లడించింది. గతేడాది కోవిడ్ సమయంలోనే వీరి విడాకుల గురించి చర్చలు జరిగాయని.. వారి సంపద 145 బిలియన్ డాలర్లను విభజించడానికి న్యాయవాదుల బృందం మధ్యవర్తిత్వం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. ఓ లైంగిక నేరస్థుడితో గేట్స్కు ఉన్న డీలింగ్ వల్లే మెలిందా భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్స్ట్రీట్ పేర్కొంది. అతడు ఎవరంటే జెఫ్రీన్ ఎప్స్టీన్. ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు ఉన్న సంబంధాల గురించి తెలిసినప్పటి నుంచి మెలిందా చాలా బాధపడ్డారని నివేదిక పేర్కొంది. 2013 నుంచి బిల్గేట్స్, ఎప్స్టీన్తో డీలింగ్స్ కలిగి ఉన్నట్లు వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది. గత సంవత్సరం న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జెఫ్రీ ఎప్స్టీన్ను చాలాసార్లు కలుసుకున్నారని, అతని న్యూయార్క్ టౌన్హౌస్లోనే గేట్స్ చాలా సమయం గడిపేవారని తెలిపింది. ఈ వార్తలపై బిల్ గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. గేట్స్, ఎప్స్టీన్ మధ్య సమావేశాలు దాతృత్వంపై దృష్టి సారించాయని తెలిపారు. ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్.. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఆర్థికవేత్త. అతను లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడ్డాడు. అతనిపై సెక్స్ కోసం తక్కువ వయస్సు గల అమ్మాయిలతో విస్తారమైన నెట్వర్క్ను నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాకు సంబంధించిన సమాఖ్య ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎప్స్టీన్ 2019 ఆగస్టులో 66 సంవత్సరాల వయసులో జైలులో మరణించాడు. చదవండి: గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు? -
గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు?
మే 3న గేట్స్ దంపతులు విడాకులపై సంతకాలు పెట్టారు. 4న ఆ సంగతి ప్రపంచానికి చెప్పారు. 5న గేట్స్ దీర్ఘకాల ప్రియ స్నేహితురాలు యాన్ బిన్బ్లాడ్ పేరు బయటికి వచ్చింది! 6న గేట్స్ చైనీస్ ఇంటర్ప్రెటర్ ఝ షెల్లీ వాంగ్ పేరు గేట్స్తో జత అయింది!! ‘సర్ అలాంటివారు కారు..’ అని షెల్లీ అంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఒక భార్య, ఒక భర్త విడిపోయారంటే అందుకు మరొక మహిళే కారణమా!! 36 ఏళ్లు షెల్లీకి. చక్కగా, చలాకీ గా ఉంటారు. ‘నేను అలాంటి మనిషిని కాదు’ అనడం లేదు తను. గేట్స్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గేట్స్ కి యాన్ కి, గేట్స్ కి షెల్లీ కి మధ్య ఏముంది? వట్టి ప్రేమేనా? అంతకన్నా ఉన్నతమైన భావన ఏదైనానా?! నిజంగా గేట్స్ గుండెల్లో ఎవరైనా ఉన్నారా? లేక.. ఎవరో ఒకరు ఉండకపోతారా అని మీడియానే ఆయన గుండె తలుపుల్ని తట్టి చూస్తోందా?! భార్యాభర్తలుగా తామిద్దరం విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించగానే, అందుకు యాన్ విన్బ్లాడ్ అనే మహిళ కారణం అయుండొచ్చన్న ఊహా కథనాలు మొదలయ్యాయి. అయితే అవి కేవలం ఊహల ఆధారంగా అల్లుకున్నవి కావు. గేట్స్కి మెలిందా పరిచయం అవడానికి ఏడేళ్ల ముందు నుంచే యాన్.. అతడి గర్ల్ ఫ్రెండ్. చివరికి యాన్ అనుమతితోనే గేట్స్ మెలిందాను పెళ్లి చేసుకున్నారు. అదే అనుమతిని పెళ్లికి ముందే మెలిందా దగ్గర్నుంచి కూడా గేట్స్ తీసుకున్నారు... ఏడాదిలో ఒక వారం రోజులు యాన్తో కలిసి ఉంటానని!! యాన్ వయసిప్పుడు 70 ఏళ్లు. గేట్స్ కంటే ఐదేళ్లు పెద్ద. యాన్ విన్బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ ఇరవై ఏడేళ్లు కలిసున్నాక, ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు గేట్స్ దంపతులు విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకోడానికి కారణంగా యాన్ విన్బ్లాడ్ తర్వాత బయటికి వచ్చిన ఇంకో మహిళ పేరు ఝ షెల్లీ వాంగ్! షెల్లీ చైనా యువతి. యాన్ కన్నా 35 ఏళ్లు, గేట్స్ కన్నా 30 ఏళ్లు చిన్న. ‘బిల్, మెలిందా గేట్స్ పౌండేషన్’లో ఆరేళ్లుగా చైనీస్ ‘ఇంటర్ప్రెటర్’గా ఉన్నారు. భాషల తర్జుమాల్లో ప్రవీణురాలు. ‘బిల్ గేట్స్ మిస్ట్రెస్ (ప్రియురాలు) ఈజ్ ఝ షెల్లీ వాంగ్ ఫ్రమ్ చైనా’ అని మే 6న మైఖైల్ డెలాజెన్ అనే యూజర్ నేమ్తో అకస్మాత్తుగా నెట్లో ఒక ట్వీట్ తలెత్తగానే.. తలలన్నీ యాన్ మీద నుంచి షెల్లీ వైపు తిరిగాయి! ‘‘సర్ అలాంటి వారు కారు. నమ్మండి. సర్తో, మేడమ్తో నాకున్న బాంధవ్యం ఉద్యోగానికి అతీతమైనదేమీ కాదు’’ అని చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘వైబో’లో షెల్లీ పెట్టిన పోస్ట్ గత రెండు రోజులుగా అక్కడ వైరల్ అవుతోంది. ఏమైనా ఇప్పుడు గేట్స్, మెలిందాలు వార్తల్లోంచి వెళ్లిపోయి, యాన్, షెల్లీలు.. వదంతులలోకి వచ్చారు. వాటిని విని యాన్ నవ్వుకుంటుంటే, షెల్లీ కంట తడి పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు వస్తున్న మెజేస్లలో ఇప్పుడు ఆమెను ఓదారుస్తున్నవే ఎక్కువ. ‘షెల్లీ గేట్స్ ప్రియురాలు’ అనే ట్వీట్ ప్రత్యక్షం కాగానే, ఆ మాటను రూఢీ పరిచే రీ ట్వీట్లూ మొదలయ్యాయి.‘‘ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ పన్నిన కుట్రలా అనిపించవచ్చు. కామ్రేడ్ గేట్స్కి డబ్బు, మీడియా ప్రచారం అవసరం లేకున్నా.. ఒక స్త్రీని వద్దనుకోగలడా?’’ అనేది ఆ ట్వీట్లలో ఒకటి! అయితే గేట్స్ మరీ అంత అవసరంలో ఉంటాడని అనుకోడానికి ఒక్క కారణమూ లేదు. ఆయన జెంటిల్మన్ అయినట్లే, యాన్, షెల్లీ నైస్ ఉమెన్. యాన్ని మోసం చేసి ఆయన మెలిందాను పెళ్లి చేసుకోలేదు. ఎంతకూ పెళ్లి మాట ఎత్తకపోతుంటే.. ‘అలాగే ఆలోచిస్తూ ఉండు’ అని నవ్వుతూ యాన్ వేరే వ్యక్తిని వివాహమాడారు. గేట్స్ కూడా యాన్కు చెప్పకుండా మెలిందాను చేసుకోలేదు. ఆమె సంప్రదించాకే పెళ్లికి చొరవ చేశాడు! పెళ్లయ్యాక ఎప్పుడూ మెలిందా అనుమతి తీసుకోకుండా యాన్ని కలవలేదు గేట్స్. యాన్కి, గేట్స్ మధ్య అప్పటికీ ఇప్పటికీ ఉన్న బంధం అభిరుచుల అనుబంధమే తప్ప, హృదయ సంబంధం కాదు. యాన్ ఎలా చూసినా గేట్స్ కన్నా గ్రేట్. మైక్రోసాఫ్ట్ ఆరంభ సంవత్సరాలలో యాన్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఇబ్బడిముబ్బడిగా స్టార్టప్లకు డబ్బు పెడుతుంటారు. సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. పాతిక పైగా కంపెనీల ‘బోర్డ్’లలో ఆమె కీలక సలహాదారు. సిలికాన్ వ్యాలీలో తొలి మహిళా ప్రోగ్రామర్. ఇవన్నీ అటుంచితే.. అసలు గేట్స్కి, యాన్కి మధ్య ఏమున్నట్లు?! వాళ్లను ఎప్పటికీ కలిపి ఉంచేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. గేట్స్ మెలిందాతో ప్రేమలో పడటానికి ముందు యాన్ తో ప్రేమలో ఉన్న మూడేళ్లూ వాళ్ల డేటింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి బయో ఇంజినీరింగ్లో చిన్నపాటి అధ్యయనం చేశారు. ఇంకోసారి మరో దేశం వెళ్లారు. అక్కడ రిచర్డ్ ఫేవ్మన్ ప్రసంగాల ఆడియో టేప్లలో ఫిజిక్స్ను ఆస్వాదించారు. జాంజిబార్ వెళ్లినప్పుడు ప్రాచీన మానవ జీవన శాస్త్రాల పరిశోధకుడు డొనాల్డ్ జొహాన్సన్ పరిణామక్రమ సిద్ధాంతాల గురించి చదివారు! ఇదే వాళ్ల లైఫ్, లవ్! మెలిందాతో పెళ్లయ్యాక కూడా యాన్ని గేట్స్ కలుస్తున్నది ఇందుకోసమే. ఇక ఆమెవల్ల వీళ్లు విడిపోడానికి ఏముంటుంది?! మరి షెల్లీ కారణంగా గేట్స్ దంపతులు విడిపోయి ఉంటారా?! గేట్స్ అంత బలహీనమైన వారు కానీ, షెల్లీ అంత బలం లేని మహిళ కానీ కాదు. షెల్లీ చక్కగా ఉంటారు. చలాకీగా ఉంటారు. ఈ భార్యాభర్తల పౌండేషన్లోనే పని చేస్తున్నారు. క్షణం తీరిక ఉండని ఉద్యోగి ఆమె. నిజానికి మైక్రోసాఫ్ట్లో, గేట్స్ అండ్ మెలిందా ఫౌండేషన్లో వందల మంది షెల్లీలు ఉంటారు. ఎవరి ప్రపంచాలు వారివి. వాళ్లలో షెల్లీ ప్రపంచం కూడా ఒకటి. ఒకటి కాదు. చాలా! హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా ఆమె ఇంటర్ప్రెటర్గా పని చేస్తున్నారు. టి.ఇ.డి. కాన్ఫరెన్స్లకు వెళుతుంటారు. ‘మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో కూడా పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నారు. ఒక్కమాటలో గేట్స్ ఎంత బిజీగా ఉంటారో, గేట్స్ సంస్థలో పని చేస్తున్న షెల్లీ కూడా అంత బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ జనించకూడదా అనే ప్రశ్న రావచ్చు. వృత్తిని ప్రేమించేవారి దగ్గరికి ఒక ‘వ్యక్తిగా’ ప్రేమ ఎన్నటికీ దరి చేరలేదు. ‘‘భార్యాభర్తలుగా విడిపోతున్నా, ప్రొఫెషనల్స్గా మాత్రం మేము కలిసే ఉంటాం’’ అని బిల్ గేట్స్, మెలిందా చెప్పింది అందుకేనేమో! -
ప్రతి ఏటా మాజీ గర్ల్ ఫ్రెండ్తో బిల్ గేట్స్ టూర్
వాషింగ్టన్: నాలుగు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిల్గేట్స్కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. ఏంటంటే బిల్ గేట్స్ ఏటా తన మాజీ గర్ల్ ఫ్రెండ్తో టూర్కు వెళ్తారట. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దీని గురించి మిలిందా గేట్స్కు కూడా తెలుసట. ఆ వివరాలు.. మిలిందాతో వివాహానికి ముందు బిల్ గేట్స్, అన్ విన్బ్లాడ్ అనే మహిళను ప్రేమించారట. కానీ ఆ తర్వాత మిలిందాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్ గేట్స్ వివాహానికి ముందే దీని గురించి మిలిందాతో చెప్పాడట. ప్రతి ఏటా వసంత కాలంలో తాను అన్ విన్బ్లాడ్తో టూర్ వెళ్తానని తెలిపాడట. అందుకు మిలిందా కూడా అంగీకరించింది అని సమాచారం. ఇక బిల్ గేట్స్, అన్ విన్బ్లాడ్ ప్రతి ఏటా వసంత కాలంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని బీచ్ కాటేజ్లో ప్రైవేట్ సమయాన్ని గడపడానికి వెళ్తారు. దీనిపై విన్బ్లాడ్ స్పందిస్తూ "మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయోటెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం లాంటిది. ఈ టూర్లో మేం మా గురించి, ప్రపంచం గురించి చర్చించుకునేవాళ్లం. ఇక మిలిందా బిల్గేట్స్కు అన్ని విధాల తగిన భార్య" అన్నారు. ది పోస్ట్ ప్రకారం, ఆన్ విన్బ్లాడ్, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ ప్రైవేట్ పరిశోధకుడైన ఎడ్వర్డ్ అలెక్స్ క్లీన్ను వివాహం చేసుకుంది. అతను నేరాలు, మోసం, పౌర హక్కుల కేసులను విచారించే ‘అలెక్స్ క్లైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ సర్వీస్’ యజమాని. విన్బ్లాడ్ ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థాపకురాలు. 1997లో టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. "విన్బ్లాడ్ నా కన్న ఐదేళ్లు పెద్దది. మిలిందాతో నా వివాహం గురించి ముందుగా విన్బ్లాడ్కే చెప్పాను. తన అంగీకరంతోనే నేను మిలిందాను వివాహం చేసుకున్నాను. విన్బ్లాడ్ను ప్రతి ఏటా ఒక్కసారి కలుస్తానని వివాహానికి ముందే మిలిందాకు చెప్పాను. తను కూడా అంగీకరించిది" అని బిల్గేట్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు! -
గేట్స్ దంపతుల విడాకులు: కుమార్తె భావోద్వేగం
వాషింగ్టన్: ‘‘నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న వార్త మీలో చాలా మంది వినే ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదు. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్ చేయదలచుకోలేదు. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుంది’’ అంటూ గేట్స్ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండబోవడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. కాగా సతీమణి మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన జెన్నిఫర్ ఇన్స్టా వేదికగా ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమకు అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా 1994లో బిల్, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) సంతానం. ప్రస్తుతం బిల్గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే! -
అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే!
వాషింగ్టన్: విడాకులు తీసుకోనున్నట్లు బిల్ గేట్స్ దంపతులు ప్రకటించడంతో గతంలో విడిపోయిన ప్రముఖుల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 2019లో విడాకులు తీసుకున్నారు. టెస్లా సంస్థ చీఫ్ ఎలన్ మస్క్ కూడా గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా బెజోస్ తన భార్య మెక్కెంజీకి 38 బిలియన్ డాలర్ల (ప్రస్తుత మారక విలువ ప్రకారం రూ. 2.80 లక్షల కోట్లు) భారీ మొత్తం చెల్లించేందుకు అంగీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల ఓనర్ ఎలన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ నుంచి 2008లో విడాకులు తీసుకున్నారు. జస్టిన్కు చెల్లించే మొత్తానికి సంబంధించి, పిల్లల బాధ్యతలకు సంబంధించి కోర్టు వెలుపల వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత బ్రిటిష్ నటి టలులా రిలేను మస్క్ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దాదాపు 20 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. గేట్స్ దంపతుల ఆస్తుల పంపకం ఉమ్మడి ఆస్తులను పంచుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన విడాకుల ఒప్పంద పత్రంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ పేర్కొన్నారు. కాగా వివాహం అనంతరం సంపాదించిన ఆస్తులపై ఇద్దరికీ సమానంగా హక్కు ఉంటుందని వాషింగ్టన్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. పరస్పర అంగీకారంతో ఆ ఆస్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మిలిందాకు భారీగా భరణం లభించే అవకాశం ఉందని, తద్వారా ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన విడాకులు.. భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు తదితర వివరాలు తెలుసుకుందాం. దిమిత్రి రైబోలోలెవ్- ఎలీనా రైబోలోలెవ్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు వివాహ బంధం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో బిలియనీర్ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్లు భరణంగా ఇచ్చారు. ఎలిక్ వైల్డిస్టీన్- జోక్లిన్ వైల్డిస్టీన్ ఫ్రెంచ్లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్. 1999లో ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ సందర్భంగా 3.8 బిలియన్ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు. రూపెర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్ మన్ అమెరికన్ మీడియా మెఘల్ రూపెర్ట్ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్బై చెబుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్ డాలర్లు భరణం చెల్లించారు. బెర్నీ ఎలెస్టోన్- స్లావికా ఎలెస్టోన్ ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్ డాలర్లు. స్టీవ్ వీన్- ఎలైన్ వీన్ కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్ వీన్పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. స్టీవెన్ స్పీల్బర్గ్- ఎమీ ఇర్వింగ్ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు. ఆసియాలో ఆమె మాత్రమే... భర్త నుంచి విడాకులు పొంది.. తద్వారా లభించిన భరణంతో ఆసియాలోని సంపన్న మహిళల్లో ముందు వరుసలో నిలిచారు చైనాకు చెందిన యువాన్ లిపింగ్. షెంజన్ కాంగ్టాయ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో. చైర్మన్ డూ వీమిన్ మాజీ భార్య ఆమె. విడిపోతున్న సందర్భంగా, యువాన్కు భర్త 163.3 మిలియన్ షేర్లు బదలాయించడంతో వీరి విడాకుల వ్యవహారం ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్గా నిలిచింది. జూన్ 2, 2020న మార్కెట్లు ముగిసేనాటికి యువాన్ ఆస్తి 3.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్బర్గ్ అప్పట్లో వెల్లడించింది. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
బిల్గేట్స్ సంచలన ప్రకటన
-
27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్గేట్స్
బిల్ గేట్స్, మెలిందాలది లవ్ మ్యారేజ్. 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా నిన్న వాళ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు!! కారణాలు చెప్పలేదు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. మైక్రోసాఫ్ట్ చక్కగా నడుస్తోంది. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచానికి అండగా ఉంది. మరి ఈ దంపతుల మధ్య ప్రేమ ఏమైంది? అసలు ఆ ప్రేమ ఎలా మొదలయింది? భార్యభర్తల పేరు మీద ఉన్న బిలియన్ల డాలర్ల మహా దాతృత్వ సంస్థ ‘బిల్ అండ్ మెలిందా గేట్స్’ ఎప్పటిలా పరోపకారార్థం పని చేస్తుంటుంది. అయితే ఆ భార్యాభర్తలు మాత్రం తమ దాంపత్య బంధాన్ని ఇక మీదట కొనసాగించరు. బిల్ గేట్స్, మెలిందా కలిసి సోమవారం చేసిన ట్వీట్ని బట్టి అర్థమవుతున్నది ఇదే! ‘‘మా మలిదశ జీవితంలో భార్యాభర్తలుగా మేము కలిసి ఎదగ గలమని మాకు ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. కొత్త జీవితంలోకి మేము ప్రయాణిస్తున్నందున మా కుటుంబానికి అవసరమైన ‘స్పేస్’నీ, ‘ప్రైవసీ’ని ఇవ్వమని అడుగుతున్నాం’’ అని ఆ ట్వీట్లో గేట్స్, మెలిందా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65. మెలిందా వయసు 56. ముగ్గురు పిల్లలు. కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21). పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. యాభై బిలియన్ డాలర్ల ఆస్తులు గల ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’లో కనీసం సగానికి పైగా మానవాళి క్షేమానికి అందివ్వాలని అనుకున్న మాటకు ఇద్దరూ కట్టుబడి ఉన్నారు. వృత్తి, జీవితం, కుటుంబం స్థిరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో గేట్స్, మెలిందాల దాంపత్యంలో ఒక్కసారిగా ఈ కల్లోలం ఏమిటి? గేట్స్, మెలిందా తమ మలి జీవితాన్ని వేరుగా, ఎవరికి వారుగా గడపాలని అనుకోవడం ఏమిటి? వాళ్లది ప్రేమ పెళ్లే కదా! అవును ప్రేమ పెళ్లే. పాల్ ఆలెన్తో కలిసి 1975 లో తన 20 ఏళ్ల వయసులో ‘మైక్రోసాఫ్ట్’ని స్థాపించారు గేట్స్. 2008లో 53 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్ బాధ్యతల్ని భాగస్వాములకు, ప్రతిభ గల వారికి అప్పగించి తన రోజువారీ విధుల నుంచి తప్పుకున్నారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే 2000లో తన 43 ఏళ్ల వయసులో భార్య మెలిందాతో కలిసి.. విద్య, స్త్రీ పురుష సమానత్వం, ఆరోగ్యం అనే మూడు లక్ష్యాల సాధన కోసం ‘ఫౌండేషన్’ని ప్రారంభించారు. ఈ సంవత్సరాలన్నీ మైక్రోసాఫ్ట్ మైలు రాళ్లు అనుకుంటే.. గేట్స్ జీవితంలోని మలుపు రాయి 1987. అప్పుడు గేట్స్ వయసు 32 ఏళ్లు. ఆ ఏడాది న్యూయార్క్ సిటీలో జరిగిన మైక్రోసాఫ్ సిబ్బంది డిన్నర్ పార్టీలో తొలిసారి మెలిందాను దగ్గరగా చూశాడు గేట్స్. ఆ ఏడాదే మెలిందా మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాడక్ట్ విభాగానికి జనరల్ మేనేజర్ గా వచ్చారు. అప్పుడు ఆమె వయసు 23. డిన్నర్ తర్వాత గేట్స్ తన దారిన తను వెళ్లిపోయాడు కానీ, మనసు మెలిందా వెళ్లిన దారిలోకి మళ్లింది. తర్వాత కొన్ని నెలలకు గానీ ఆమెను అతడు బయటికి డిన్నర్కి రమ్మని పిలిచే ధైర్యం చేయలేకపోయాడు. 1994 లో హవాయిలో వాళ్ల పెళ్లి జరిగే వరకు మైక్రోసాఫ్ట్లో ఎవరికీ వాళ్లద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలియదు! పెళ్లి తర్వాత వాళ్లద్దరి మధ్య ప్రేమ తప్ప ఎవరికీ ఏమీ కనిపించలేదు. 2020 వాలెంటైన్స్ డేకి కూడా ఇన్స్టాగ్రామ్లో గేట్స్ పెట్టిన పోస్ట్, ఆ ఫొటోకు జత చేస్తూ రాసిన చిన్న మాట.. భార్యపై అతడికి ఎంత ప్రేమ ఉందో తెలిపేలా ఉంది. ఫొటోలో ఇద్దరూ అటువైపు తిరిగి ఉంటారు. గేట్స్ ఆమెపై చెయ్యి వేసి ఉంటారు. ‘ఈ ప్రయాణంలో నేను ఇంతకన్న మెరుగైన జీవన సహచరిని కోరబోను’ అని రాశారు గేట్స్. బిల్ గేట్స్, మెలిందా (పెళ్లప్పుడు) మెలిందాపై మనసునైతే పారేసుకున్నాడు కానీ, పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచించాడు గేట్స్. అలాగని ఆమెపై ప్రేమ లేకపోవడం కాదు. తనే ముందు చెప్పాడు ‘ఐ లవ్ యు’ అని. తనే ముందు అడిగాడు ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని. ఓ రోజు మెలిందా వెళ్లేసరికి గేట్ తన బెడ్ రూమ్లో ఉన్న వైట్ బోర్డు మీద ఏవో ప్లస్లు, మైనస్లు నోట్ చేస్తున్నాడు. ‘‘ఏంటవి?’’ అని అడిగింది మెలిందా. ‘‘పెళ్లి చేసుకుంటే లాభాలు, నష్టాలు’’ అని చెప్పాడు. ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఏడేళ్ల ప్రేమ తర్వాత మేము ఒక పాయింట్కి వచ్చేశాం. అప్పుడిక బ్రేకప్ అవనన్నా అవాలి. పెళ్లయినా చేసుకోవాలి. నేను పెళ్లినే ఎంచుకున్నాను’’ అని గేట్ చెప్పడం 2019లో విడుదలైన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ఇన్సైడ్ బిల్స్ బ్రెయిన్’లో కనిపిస్తుంది. అందులోనే ఒకచోట డాక్యుమెంటరీ డైరెక్టర్ డేవిడ్ గూగన్హైమ్, గేట్స్ ప్లేయింగ్ కార్డ్ ఆడుతుంటారు. ఆ ఆటలో గేట్స్ గెలుస్తారు. ‘యు ఆర్ లక్కీ ఇన్ లైఫ్. అండ్ యు ఆర్ లక్కీ ఇన్ వార్’ అంటాడు డేవిడ్. ‘వార్’ అంటే ఆట అని. ‘‘.. అండ్ ఇన్ లవ్ టూ’’ అంటాడు గేట్స్ నవ్వుతూ. ప్రేమలో కూడా అదృష్టవంతుడినేనని. మెలిందా ప్రేమను పొందడం తన అదృష్టం అని చెప్పడం గేట్స్ ఉద్దేశం. అదృష్టమే అనుకోవాలి. ఇరవై మూడేళ్ల వయసులో మైక్రోసాఫ్ట్లోకి వచ్చే సమయానికే మెలిందాకు చాలామందే బాయ్ఫ్రెండ్స్ ఉన్నారు. గేట్స్కి ఉన్నది ఒక్కరే. మైక్రోసాఫ్ట్! అంతమంది పోటీని తట్టుకుని మెలిందా ప్రేమను దక్కించుకోగలిగాడు గేట్స్. అతడి జీవితంలో ఆమెకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రాముఖ్యం కాదు, ఆమే అతడిలో సగ భాగానికి పైగా! 2017లో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘కాన్వర్జేషన్ విత్ గేట్స్’ కార్యక్రమంలో వారెన్ బఫెట్ ఒక మాట అన్నారు. వయసులో పాతికేళ్లు తేడా ఉన్నా గేట్స్, బఫెట్ మంచి స్నేహితులు. ‘‘మనకు దగ్గరగా ఉండేవాళ్లు ఎటు వెళ్తే మనం అటు వెళ్తాం. అందుకని మనకన్నా మెరుగైన వాళ్లకు మనం దగ్గరగా ఉండాలి. ప్రత్యేకంగా చెప్పేదేముంది? జీవిత భాగస్వామే కదా మనకు అందరికన్నా దగ్గరగా ఉంటారు’’ అని ఆ కార్యక్రమంలో బెఫెట్ అన్నారు. గేట్స్ అప్పుడు చిరునవ్వుతో మెలిందాను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది వాలెంటైన్స్ డేకి బిల్ గేట్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలో గేట్స్, ఆయన భార్య మెలిందా మరి ఇప్పుడేమిటి? అంత ప్రేమ ఉండి, ఒకరికొకరు అంత ప్రత్యేకం అయి ఉండి గేట్స్, మెలిందా విడిపోవడం?! ఫౌండేషన్ని కలిసే నడుపుతారు. భార్యాభర్తలుగా మాత్రం ఎవరికి వారుగా ఉంటారు! నిన్నటి నుంచీ ప్రపంచం ఈ దంపతుల విడాకులకు కారణాలు వెతుక్కుంటోంది. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదా ఈ పరిణామం?! కాకపోవచ్చు. కొన్నాళ్లుగా గేట్స్, మెలిందా తీవ్రమైన సామాజిక బాధ్యతల ఒత్తిళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ తరఫున ఏటా ఈ దంపతులు ఒక ఉత్తరం విడుదల చేస్తుంటారు. ‘‘మసకబారిన వీడియో మీటింగుల్లా రోజులు గడుస్తున్నాయి. కలవర పరిచే దిగ్భ్రాంతికర వార్తలు, మైక్రోవేవ్డ్ మీల్స్ ఇవే దైనందిన జీవితం అయిపోతున్నాయి’’ అని ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులు విడుదల చేసిన ఉత్తరంలో ఆవేదన, ఆందోళ వ్యక్తం అయింది. ప్రస్తుత మానవాళి మానసిక స్థితిలో ప్రతిఫలిస్తున్న ఈ ఆవేదన, ఆందోళనల్ని పోగొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ఏదైనా మార్గాన్ని వేర్వేరుగా ఎవరి దారుల్లో వారు అన్వేషించదలచారా?! -
బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు!
వాషింగ్టన్: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. మిలిందా గేట్స్తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్తో కలిసి ట్విటర్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 27 ఏళ్ల బంధం ఇక ముగిసింది.. ‘‘మా బంధం కొనసాగాలా లేదా అన్న అంశం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయానికివచ్చాం. గత 27 ఏళ్ల బంధంలో ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యవంతులుగా, మెరుగైన జీవనం గడిపేలా మా వంతు కృషి చేశాం. ఈ మిషన్ ఇలాగే కొనసాగిస్తాం. ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తాం. అయితే, మా జీవితంలోని తదుపరి దశలో దంపతులుగా మాత్రం కొనసాగలేం. దయచేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్న మాకు, మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మనవి’’ అని మిలిందా, బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. సంపదలో కుబేరులు.. మానవత్వంలోనూ స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%. బ్లూమ్బర్గ్ తాజా నివేదిక ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్గేట్స్ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. అలా మొదలైంది ఇక 1987లో మైక్రోసాఫ్ట్లో ప్రొడక్ట్ మేనేజర్గా జాయిన్ అయిన మిలిందా, అదే ఏడాదిలో ఓ డిన్నర్ పార్టీలో బిల్ గేట్స్ను కలిశారు. ఈ క్రమంలో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ప్రస్తుతం బిల్గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు ఫౌండేషన్ స్థాపించి.. గేట్స్ దంపతులు 2000లో సియాటిల్లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో మానవీయ కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లాది డాలర్లను విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించారు. ప్రధానంగా ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి సాయం చేశారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికతకై తమ వంతు కృషి చేశారు. అంతేకాదు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికై ఈ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్ల గ్రాంట్లు విడుదల చేసింది. తద్వారా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. కాగా 2018 వరకు బిల్, మిలిందా గేట్స్ ఈ ఫౌండేషన్కు సుమారు 36 బిలియన్ డాలర్లను సమకూర్చారు. 2006 నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ 29 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు. pic.twitter.com/padmHSgWGc — Bill Gates (@BillGates) May 3, 2021 -
గిరిజన బాలికలపై ప్రమాదకర క్లినికల్ ట్రయల్స్.. బిల్ గేట్స్ను అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణ కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందెన్నడూ లేనిది ఇప్పడెందుకు ప్రస్తుతం ప్రపంచం దేశాలు ఈ కరోనా మహమ్మారి కట్టడి కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రూపంలో ఈ వైరస్ భారత్లో వీర విహారం చేస్తోంది. ఇంతటి గడ్డు కాలాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కుంటుండగా ఇటీవల బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇటీవలు ఆయన ఓ ఇంటర్వ్యూలో.. కోవిడ్ వ్యాక్సిన్ల ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవడానికి వీలుగా మేధో సంపత్తి హక్కుల చట్టాన్ని మార్చడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందుకు బిల్ గేట్స్ సమాధానమిస్తూ.. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఫార్ములాను ఇవ్వడాన్ని ఆయన నిరాకరించారు. దీనికి మరింత వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలా వ్యాక్సిన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే వ్యాక్సిన్ల భద్రత, రక్షణల గురించి ప్రజలు చాలానే ఆలోచిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఫార్ములాను పంచుకోవడం ఏంటని అన్నారు. అంతేందుకు భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), ఆస్ట్రాజెనెకాతో ఓ ఒప్పందం ప్రకారం కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను తయారు చేస్తోందని తెలిపారు. ప్రపంచ వ్యాక్సినేషన్ విషయంలో కొన్నిటిని నిలిపి ఉంచడానికి కారణం మేధో సంపత్తి హక్కులు కారణం కాదన్నారు. ఏదో వ్యాక్సిన్ ఫ్యాక్టరీ ఉంటుందని, దానికి రెగ్యులేటరీ అనుమతులు కూడా వస్తాయని చెప్పారు. దాంతో అది సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేస్తుందని కాదని అన్నారు. వీటిపై పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రతి తయారీ ప్రక్రియను చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంటుందని ఆయన తన సమాధానానికి వివరణ ఇచ్చారు. ( చదవండి: కోవాగ్జిన్తో డబుల్ మ్యూటెంట్కి అడ్డుకట్ట ) -
కోవిడ్ గురించి 2015లోనే హెచ్చరించిన బిల్ గేట్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్కి వ్యతిరేకంగా వివిధ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రారంభించిన తరుణంలో, అమెరికా వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2015లోనే రాబోయే మహమ్మారి గురించి హెచ్చరించిన విషయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఏ మహమ్మారి తలుపుతట్టనుందో అనే విషయాన్ని బిల్ గేట్స్ ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ‘‘నెక్టŠస్ ఔట్ బ్రేక్? వుయ్ ఆర్ నాట్ రెడీ’’ (తదుపరి ప్రమాదానికి మేం సిద్ధంగా లేము) అనే పేరుతో 2015లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో బిల్ గేట్స్ కోవిడ్–19 లాంటి మహమ్మారి ప్రమాదం పొంచివుందని చెప్పారు. ప్రపంచం రాబోయే అంటువ్యాధి మహమ్మారిలను తట్టుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆనాడే గేట్స్ జోస్యం చెప్పినట్టు చెప్పారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఏదైనా కోటి మందిని చంపగలిగేది ఉందీ అంటే అది ఏ యుద్ధమో కాదు, కేవలం వైరస్ మాత్రమేనని బిల్గేట్స్ వ్యాఖ్యానించారు. ‘‘మిస్సైల్స్ కాదు మైక్రాన్స్ (సూక్ష్మజీవులు)అని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్థంభింపజేసిన తరుణంలో 2020మార్చిలో, బిల్గేట్స్ ఎప్పుడో 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో వైరల్ అయ్యింది. జోస్యం గురించి తెలియదు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘‘వెరిటాసియం’’ను నిర్వహిస్తోన్న డెరెక్ ముల్లర్తో వీడియో కాల్లో మాట్లాడారు. తనకు జోస్యం గురించి అంతగా తెలియదని, ఇలాంటి వాటిలో తనకేం అనుభవం లేదని గేట్స్, ముల్లర్తో అన్నారు. అర్థ దశాబ్దం క్రితమే ఇలాంటిదొక విపత్తు ముంచుకొస్తుందని అంత నిర్దిష్టంగా ఎలా చెప్పగలిగారని ముల్లర్ బిల్ గేట్స్ని ప్రశ్నించారు. అనేక శ్వాసకోశ సంబంధ వైరస్లు ఉన్నాయని, ఆయా సమయాన్ని బట్టి ఒక్కోటి పుట్టుకొస్తుందని ఆయన సమాధానమిచ్చారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అత్యంత భయంకరమైనవి. ఎందుకంటే మీకు ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, ఇంకా మీరు విమానాల్లోనూ, బస్సుల్లోనూ తిరుగుతూ ఉంటారు. ఎబోలా లాంటి ఇతర వ్యాధులొస్తే మీరు ఆసుపత్రుల్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు బయట తిరిగేస్తుంటారని గేట్స్ చెప్పారు. ప్రజలు సిద్ధంగా లేని తదుపరి విపత్తులను గురించి చెప్పాలంటూ ముల్లర్ కోరారు. ఈ ప్రశ్నకు ప్రజలు సంసిద్ధంగా లేని తదుపరి విపత్తు ఒకటి వాతావరణం మార్పు, మరొకటి బయోటెర్రరిజం అని గేట్స్ చెప్పారు. మరిన్ని అంటువ్యాధులు.. ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా మరణించిన వారికంటే ప్రతి యేడాది మరణాల రేటు అధికం అవుతుందన్నారు. మరో సంక్షోభం గురించి ప్రజలు మాట్లాడటానికి కూడా ఇష్టపడరని తాను భావిస్తున్నట్టు ఆయన అన్నారు. బయోటెర్రరిజం గురించి మాట్లాడుతూ ఎవరైనా నష్టం కలిగించాలని భావించేవారు, హానికారకమైన వైరస్ని సృష్టించొచ్చని, దీనిలాగే అది కూడా సహజసిద్ధమైన వైరస్కన్నా అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యంత విపత్కరమైన కరోనా వైరస్ మహమ్మారి కాలంలో, రాబోయే అంటువ్యాధులను ప్రజలు అడ్డుకోగలరా? అని ముల్లర్ ప్రశ్నించగా, గేట్స్ లేదు అని సమాధానమిచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పొంచివుందని గేట్స్ హెచ్చరించారు. -
మరో రెండు విపత్తులు.. కోటి మరణాలు
వాషింగ్టన్ : కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక పలు అనుమానాలను రేకేత్తించింది. 2015నాటి ఈ వీడియోలో బిల్ గేట్స్.. కరోనా గురించి ముందుగానే హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మానవ నిర్మిత వైరస్ ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొన్నారు. ఆయన మాటలు 2020లో వాస్తవ రూపం దాల్చాయి. గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్ ల్యాబ్లో అభివృద్ధి చేసిందేనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. అయితే విధ్వంసం ఇంతటితో ఆగలేదని గేట్స్ హెచ్చరించారు. మరో రెండు విపత్తులు ప్రపంచాన్ని కకావికలం చేస్తాయని తెలిపారు. వచ్చే పదేళ్లలో ఈ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటాయన్నారు. వాతావరణ మార్పులు, బయో టెర్రరిజాలే ఆ రెండు విపత్తులు అన్నారు. ‘‘వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు హరించేది యుద్ధం కాదు.. వైరస్. అవును మిస్సైల్స్, మైక్రోబ్స్ కాదు.. చాలా ప్రమాదకరమైన వైరస్ వల్ల కోటి మంది మరణిస్తారు. ఇక మీదట వచ్చేవి అన్ని బయో వార్లే’’ అన్నారు బిల్ గేట్స్. డెరేక్ ముల్లర్ అనే వ్యక్తి నడుపుతోన్న యూట్యూబ్ చానెల్ వెరిటాసియంలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు సంవత్సరాల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం మరో సారి ఇంటర్నెట్లో వైరలవుతోంది. ఎబోలా వైరస్ వ్యాప్తి సమయంలో గేట్స్ సమీప భవిష్యత్తులో ఇంతకంటే ప్రమాదకరమైన వైరస్లు మన మీద దాడి చేస్తాయని.. వాటి నుంచి రక్షణ పొందటానికి మన దగ్గర ఎలాంటి ఆయుధం ఉండదని తెలిపారు. ఆయన మాటల ప్రకారం 2020లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 2.271 మిలియన్ల మందిని బలి తీసుకోగా.. 104.3 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు. అయితే తన ఊహాలు ఏవి నిజం కాకూడదని బిల్గేట్స్ కోరుకున్నారు. ఇవన్ని అంచనాలుగానే ఉండాలని ఆశించారు. చదవండి: రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్ గేట్స్ మాస్క్లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి -
వ్యాక్సిన్తో 7 లక్షల మంది చనిపోతారన్న బిల్గేట్స్?!
వాషింగ్టన్: పలు చోట్ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆస్పత్రిపాలు అవుతుండటంతో జనాలు వ్యాక్సిన్ అంటేనే జంకుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అని పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ వల్ల ఏడు లక్షల మంది చావడమో లేదా వికలాంగులుగా మారడమో జరుగుతుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో చాలా మంది బిల్గేట్స్ చెప్పింది నిజమేనేమోనని వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు, టీకా వేయించుకోవద్దని సూచిస్తూ స్నేహితులకు, సన్నిహితులకు సదరు పోస్టును షేర్ చేస్తున్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా) కానీ వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారని బిల్గేట్స్ ఎక్కడా చెప్పలేదు. గతేడాది ఏప్రిల్లో సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ.. టీకా తీసుకోవడం వల్ల సుమారు ఏడు లక్షల మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే తప్ప టీకా వారికి దీర్ఘకాలంగా హానీ తలపెడుతుందనో, లక్షల మంది మరణిస్తారనో చెప్పలేదు. కాబట్టి ఇది ఫేక్ న్యూస్. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని చెప్పింది. కానీ అవి కొద్ది రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయని పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14 రకాలు) క్లారిటీ: కరోనా వ్యాక్సిన్ వల్ల ఏడు లక్షల మంది వైకల్యానికి గురి కావడం లేదా ప్రాణాలు విడుస్తారని బిల్గేట్స్ చెప్పలేదు. -
రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్ గేట్స్
వాషింగ్టన్: రానున్న నాలుగు నుంచి ఆరు నెలలు కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. గేట్స్కు సంబంధించిన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ కోవిడ్–19 కు టీకా రూపొందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ‘అమెరికాలో రానున్న 4 నుంచి 6 నెలలు కరోనా మహమ్మారి ముప్పు భారీగా పెరిగే ప్రమాదముంది. ఐహెచ్ఎంఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్) అధ్యయనం ప్రకారం అదనంగా 2 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. అయితే, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు పాటిస్తే ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’ అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని బిల్ గేట్స్ 2015లోనే హెచ్చరించారు. 2015లో తాను అంచనా వేసిన దానికన్నా ఈ వైరస్ మరింత ప్రమాదకారి అని తేలిందని గేట్స్ ‘సీఎన్ఎన్’ వార్తాసంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా టీకా ప్రపంచంలోని అందరికీ అందాల్సి ఉందని, అందుకు అమెరికా సహాయపడాలని గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా స్వార్థంగా ఆలోచించకూడదన్నారు. టీకాపై ప్రజల విశ్వాసం పెంచేందుకు బహిరంగంగానే తాను వ్యాక్సీన్ను తీసుకుంటానన్నారు. -
బిల్ గేట్స్కు ప్రతిష్టాత్మక పురస్కారం
భారతీయ ఐటి పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకునే దివంగత ఎఫ్సీ కోహ్లీ (మరణానంతరం), ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, దాత బిల్ గేట్స్ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. 'టై గ్లోబల్' అనే సంస్ కోహ్లీకి లైఫ్టైమ్ అచీవ్మెంట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేయగా, బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డుతో సత్కరించింది. మారియట్ ఇంటర్నేషనల్కు చెందిన బిల్ మారియట్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఫ్యామిలీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం వర్చువల్ గా జరిగిన ‘‘గ్లోబల్ సమ్మిట్ 2020’’ కార్యక్రమంలో ది ఇండస్ వ్యవస్థాపకులు (టీఐఈ) ఈ అవార్డులను ప్రదానం చేసింది. టీసీఎస్ వ్యవస్థాపక సీఈవో దివంగత కోహ్లీ తరపున ఆయన భార్య ఈ అవార్డును అందుకున్నారు. (ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక లేరు) ప్రతి వ్యవస్థాపకుడు బిల్గేట్స్ లా ఉండాలనే కలకంటారని, కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్దిలో ఆయన అద్భుతమైన కృషికి ఈ అవార్డు లభించిందని టీఐఈ గ్లోబల్ చైర్ మహావీర్ శర్మ వెల్లడించారు. అటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'టై గ్లోబల్' అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని గేట్స్ తన సందేశంలో తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే ప్రధానభూమిక పోషిస్తాయన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ విభాగంలో మూడు అవార్డులతో పాటు, వివిధ విభాగాల క్రింద పది అవార్డులను ఇచ్చింది. స్టార్టప్ ఎకోసిస్టమ్కు మద్దతు ఇచ్చే ఉత్తమ ప్రభుత్వ సంస్థ అవార్డును సింగపూర్ ప్రభుత్వం గెలుచుకుంది. ఇతర అవార్డులు: ఉత్తమ కార్పొరేట్ సహాయక వ్యవస్థాపకత (స్టార్టప్ల కోసం గూగుల్ / ఆల్ఫాబెట్); ఉత్తమ విశ్వవిద్యాలయం ప్రోత్సాహక వ్యవస్థాపకత (స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం); ఉత్తమ యాక్సిలరేటర్ అవార్డు (వై కాంబినేటర్); ఉత్తమ పనితీరు గ్లోబల్ వీసీ ఫండ్ (సీక్వోయా క్యాపిటల్); ప్రపంచంలో అత్యంత చురుకైన ఏంజెల్ నెట్వర్క్ (టెక్ కోస్ట్ ఏంజిల్స్); బూట్స్ట్రాప్ టు బిలియన్స్ అవార్డు (బెన్ చెస్ట్నట్); రాపిడ్ లిస్టింగ్ అవార్డు (విఐఆర్ బయోటెక్నాలజీ), లైటనింగ్ యునికార్న్ అవార్డు (ఇండిగో అగ్రికల్చర్); మరియు మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ (డేటా రోబో) ఉన్నాయి. -
చైనాను వదిలేస్తే భారత్ వైపు చూడండి: బిల్గేట్స్
కౌలాలంపూర్: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ భారత్పై ప్రశంసల జల్లు కురిపించారు. సింగపూర్లో జరుగుతున్న ఫిస్ ఎటక్ ఫెస్టివల్ వర్చ్యువల్ విధానంలో మంగళవారం పాల్గోన్న ఆయన ఈ సందర్భంగా భారత ఆర్థిక విధానాన్ని ప్రశంసించారు. వినూత్న ఆర్థిక విధానాలను అవలంభించడంలో ఇండియా మిగతా దేశాల కంటే ముందు నిలిచిందన్నారు. అంతేగాక అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని, ఒకవేళ చైనాను వదిలేసి మరో దేశంపై అధ్యయనం చేయాలనుకునే ప్రపంచ దేశాలు ఏవైనా తప్పనిసరిగా ఇండియాను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద బయో మెట్రిక్ డేటా బేస్ ఇప్పటికే భారత్లో సిద్ధమైందని, డబ్బు బట్వాడా బ్యాంకుల ద్వారా కాకుండా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా జరుగుతుండటం కూడా ఇండియాలో శరవేగంగా విస్తరిస్తోందన్నారు. అంతేగాక భారత ప్రభుత్వాలు సైతం పేదలందరికి సంక్షేమ పథకాలను దగ్గర చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!) ఇక 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత్లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని నిర్మూలనకు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం మొత్తం నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని తెలిపారు. వైర్లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది కూడా ఇండియాలోనేనని ఆయన గుర్తు చేశారు. భారత్లో స్మార్ట్ ఫోన్ల ధరలు సైతం తక్కువగా ఉన్నాయని, దీంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయన్నారు. ఫేస్బుక్, అమెజాన్, వాల్ మార్ట్, పేటీఎం సహా అన్ని కంపెనీలు తమ సేవలకు యూపీఐ ప్లాట్ ఫాంను వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని కితాబిచ్చారు. అయితే ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ప్రపంచమంతా పంపిణీ చేయగలదు) -
ఆకాశం మస్క్ హద్దురా!
న్యూఢిల్లీ: ‘స్పేస్ఎక్స్’ రాకెట్ ఒకపక్క అంతరిక్ష యాత్రల్లో సంచలనాలు నమోదుచేస్తుంటే... దాన్ని సృష్టించిన ఎలాన్ మస్క్ సంపద కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది! ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను అధిగమించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం సుమారు 128 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానానికి ఎగబాకారు. సోమవారం టెస్లా షేరు ధర ఎగియడంతో ఒకే రోజున ఆయన నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆయన సంపద 100.3 బిలియన్ డాలర్ల మేర ఎగిసింది. దీనితో ఈ సంవత్సరం జనవరిలో 35వ స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి దూసుకొచ్చారు. టెస్లా మార్కెట్ విలువ దాదాపు 500 బిలియన్ డాలర్ల దరిదాపుల్లో ఉంది. మస్క్ సంపదలో సింహభాగం టెస్లాలో ఆయనకున్న షేర్ల ద్వారా వచ్చినదే. టెస్లాతో పాటు స్పేస్ఎక్స్ పేరిట అంతరిక్ష ప్రయోగాల సంస్థ కూడా మస్క్కి ఉంది. కంపెనీల షేర్ల ధరల రోజువారీ మార్పుల ప్రకారం వాటి అధినేతల సంపదను లెక్కించడం ద్వారా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నప్పటికీ.. సంపన్నుల సంపద మాత్రం భారీగానే పెరిగింది. సంవత్సరం ప్రారంభమైనప్పట్నుంచీ చూస్తే బ్లూమ్బర్గ్ సూచీలోని సభ్యుల సంపద విలువ 23 శాతం (సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు) ఎగిసింది. టాప్లో అమెజాన్ బెజోస్ బ్లూమ్బర్గ్ సూచీలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ సూచీ ప్రారంభించిన ఎనిమిదేళ్లలో గేట్స్ రెండో స్థానానికన్నా కిందకి పడిపోవడం ఇది రెండోసారి. 2017లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానాన్ని దక్కించుకునే దాకా ఆయనే టాప్లో కొనసాగారు. సూచీ తాజా గణాంకాల ప్రకారం గేట్స్ సంపద విలువ సుమారు 127.7 బిలియన్ డాలర్లు. సేవా కార్యకలాపాలకు విరాళాలు గానీ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇది మరింత ఎక్కువే ఉండేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2006 నుంచి ఆయన దాదాపు 27 బిలియన్ డాలర్లు విరాళాలిచ్చారు. టాప్–100 అపర కుబేరుల్లో భారత్ నుంచి నలుగురు... ఇక తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలోని టాప్ 10 సంపన్నుల్లో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. 74 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 10వ స్థానంలో నిల్చారు. భారత్ నుంచి టాప్ 100లో మరో ముగ్గురు దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 40వ ర్యాంకులో (32.1 బిలియన్ డాలర్లు), విప్రో అధినేత అజీం ప్రేమ్జీ 56వ స్థానంలో (23.4 బిలియన్ డాలర్లు), హెచ్సీఎల్ చీఫ్ శివ్ నాడార్ 71వ ర్యాంకులో (21.4 బిలియన్ డాలర్లు) నిలిచారు. -
10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా సెలబ్రిటీలుగా ఉన్నవారికి భారీ క్రేజ్ ఉంటుంది. అందులోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రాణిస్తోంటే.. యువత ఆసక్తి మామూలుగా ఉండదు. తాజాగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బిల్ గేట్స్ దాటేయడంతో ట్రెండింగ్లో నిలిచారు. దీంతో ఆయనపై సోషల్మీడియా అంతా మంగళవారం మీమ్స్ సందడి నెలకొంది. తమాషా వ్యాఖ్యలు, క్లిప్లు, ఇమేజ్లతో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అన్నట్టు కమెంట్ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.. మీరూ సరదాగా నవ్వుకోండి. (మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్కు షాక్) #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Elon Musk:- pic.twitter.com/b2fhwx47ks — Raj Aditya (@chiku_9693) November 24, 2020 #ElonMusk ELON MUSK TO BILL GATES pic.twitter.com/GoDyFsgtLC — fᵣₑₑ wₐy (@T_O_freeway) November 24, 2020 #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Jeff bezos: pic.twitter.com/slamrRpdCu — Naveen Kumar (@Navikumar108) November 24, 2020 #ElonMusk becomes 2nd richest person after overtaking #BillGates Jeff Bezoz be like: pic.twitter.com/0EN0kAtdxn — Adarsh Adhar (@AdarshAdhar) November 24, 2020 #ElonMusk become 2nd richest person by surpassing #BillGates * Meanwhile Bill Gates to Elon pic.twitter.com/vuVvRk79FA — Chayan Jain (@ChayanJ20734351) November 24, 2020 -
మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్కు షాక్
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ (49) అరుదైన ఘనతను సాధించారు. అపర కుబేరుడు బిల్గేట్స్ను అధిమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా దూసుకు వచ్చారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అతని నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పుంజుకోగా, బిల్గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్కు చెందిన టెస్లా స్టాక్ సోమవారం ట్రేడింగ్లో దాదాపు 6.58 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 521.85 డాలర్లకు చేరింది. ఇదే అత్యధిక సింగిల్-డే లాభాలకు కారణమైంది. అతని మరో కంపెనీ స్పేస్ ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్లకు చేరడం విశేషం. ఈ ఏడాది జనవరి నుండి తన నికర విలువ 100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగిసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 మంది ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండవస్థానం కంటే కిందికి పడిపోవడం బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఇది రెండవసారి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్బెజోస్ 2017లో గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుగా నిలిచారు. అంతుకుముందు వరకు బిల్గేట్స్ రిచెస్ట్ పర్స్న్గా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం బెజోస్ 182 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 67 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. కాగా బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్ డాలర్లను నేమ్సేక్ ఫాండేషన్కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు. -
మాస్క్లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి
వాషింగ్టన్ : కరోనా ఆరోగ్య నియమాలను పాటించకుండా, మాస్కులు ధరించవద్దని ప్రదర్శనలు నిర్వహిస్తోన్న నిరసనకారులను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తప్పు పట్టారు. మాస్క్ ధరించని వారిని నగ్నంగా తిరిగేవారితో పోల్చి జోక్ చేశారు. అమెరికాలో మాస్క్లు ధరించడాన్ని రాజకీయ చేయడంపై ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అయిన ఓ కార్యక్రమంలో కమేడియన్, సినీతార రషీదా జోన్స్తో కలిసి బిల్గేట్స్ మాట్లాడారు. ప్యాంట్లు ధరించమని చెబితే కొద్ది మంది అమెరికన్లు అదేదో ఘోర తప్పిదంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మొదట్లో కోవిడ్ని ఆరోగ్య నిపుణులు సాధారణ ఫ్లూ, జ్వరంతో పోల్చారని, అయితే తర్వాత ఇదొక తీవ్ర వైరస్గా మారిందని ఆయన వీక్షకులకు వివరించారు. సాధారణ జలుబుతో బాధపడే వ్యక్తులు మాస్కు లేకుండా ఇంట్లో ఇతరులతో కలిసి ఉండవచ్చని, అయితే కోవిడ్ సోకిన వారు అలా చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉంటే కనుక లక్ష మరణాలను నివరించగలిగేవారమని, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధనలో తేలిందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యాక్సిన్ అభివృద్ధికి బిల్ గేట్స్ కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చారు. -
బిల్గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కి చెందిన బ్రేక్థ్రూ ఎనర్జీ వెంచర్స్ (బీఈవీ)లో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో విడతలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలు కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది. సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ఇంధనాలు మొదలైన వాటిని ఆవిష్కరించేందుకు వెచ్చించనుంది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్ తెలిపింది. -
వర్క్ ఫ్రం హోమ్ ఎప్పటికీ కొనసాగుతుంది
ముంబై: ఇంటి నుంచి విధులు నిర్వర్తించే (వర్క్ ఫ్రం హోమ్) సంస్కృతి బాగా పని చేసిందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయినా చాలా కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. ‘కోవిడ్–19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్కు మార్చివేశాయి. మహమ్మారి ముగిసిన తర్వాత కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంత సమయం వెచ్చించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలి. (ఇంటి నుంచే పని చేస్తాం: ఐటీ ఉద్యోగులు) చాలా కంపెనీలు తమ ఉద్యోగులు ఎక్కువ సమయం కార్యాలయంలో పని చేయాలని భావిస్తాయి. వర్క్ ఫ్రం హోమ్ విధానం ఆకర్షణీయంగా లేదు. ఇందుకోసం సాఫ్ట్వేర్ మరింత మెరుగవ్వాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆశ్చర్యకరంగా బాగా పని చేసింది. అయితే చిన్న పిల్లలు ఉన్నా, ఇల్లు చిన్నదైనా, పనులున్నా విధులకు కష్టం. మహిళలు అయితే వారు నిర్వహించడానికి చాలా విషయాలున్నాయి. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కొన్ని లోపాలూ ఉన్నాయి’ అని అన్నారు. పనికోసం ఈ ఏడాది తాను ఎక్కడికీ ప్రయాణించలేదని చెప్పారు. ‘చాలా ఎక్కువ చేయడానికి సమయం లభించింది. ఇది నాకు కనువిప్పు’ అని వ్యాఖ్యానించారు. (వర్క్ ఫ్రం హోమ్.. రియాలిటీ ఇదే) జనాభాయే భారత్కు సవాల్.. భారత్ విషయానికి వస్తే లాక్డౌన్ సమయంలో లబ్దిదారులకు నగదు బదిలీకి డిజిటల్ మౌలిక వసతులను వినియోగించడం వంటి అద్భుతమైన పనులు చేశారు. కానీ జనాభాయే భారత్కు సవాలు’ అని బిల్గేట్స్ వివరించారు. -
టీకా తయారీలో భారత్ పాత్ర కీలకం
న్యూఢిల్లీ: కోవిడ్ కారక కరోనా వైరస్ను కట్టడి చేసే టీకా తయారీలో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ వ్యాఖ్యానించారు. టీకా తయారు చేయడంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ దాన్ని చేరవేయడం కరోనా నియంత్రణలో ముఖ్యమైందని స్పష్టం చేశారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్గేట్స్ కరోనా టీకా తయారీకి తనవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం భారీ ఎత్తున టీకాలు తయారు చేయగల దేశాల్లో భారత్ ఒకటని, ఎవరికి? ఎన్ని టీకాలు అన్న ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. అందరికీ న్యాయబద్ధంగా టీకా పంపిణీ అయ్యే విషయంలో భారత్ సాయం చేస్తుందని భావిస్తున్నామని, ధనికులకు ముందుగా టీకా అందించడం కాకుండా అత్యవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని గేట్స్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం నిర్మూలనకు, వ్యాధులను ఎదుర్కొనేందుకు గేట్స్ ఇప్పటికే కోటానుకోట్ల డాలర్లు దానం చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకా విషయంలోనూ గేట్స్ ఆ టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. వ్యాక్సీన్ తయారీ విషయంలో సీరమ్తోపాటు, బయలాజికల్ ఈ, భారత్ బయోటెక్ సంస్థల సామర్థ్యంపై మాట్లాడారు. టీకా ప్రయోగాల్లో కొన్ని సానుకూల ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం టీకాను ఎంత చౌకగా తయారు చేయవచ్చన్న అంశంపై దృష్టి పెట్టడం ముఖ్యమని చెప్పారు. -
స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్గేట్స్
ప్రపంచంలోని అన్ని బంధాల్లో స్నేహ బంధం గొప్పదంటారు. తల్లదండ్రులకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను కేవలం స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహితుల పుట్టిన రోజు వస్తే ఖచ్చితంగా ఎదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే.. ఆ బహుమతి విలువ దాని ఖరీదును బట్టి కాకుండా ఇచ్చే స్వచ్చమైన మనుసును బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన స్నేహితుడికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్.. అవును తన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఆదివారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ తన స్నేహితుడి కోసం స్వయంగా కేకును తయారు చేసి వారెన్కు బర్త్డే విషెస్ తెలిపారు. (‘2021 మే నాటికి కరోనా అంతం’) కేక్ తయారు చేసిన వీడియోను బిల్గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిమిషం నిడివిగల ఈ వీడియోకు ‘90వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వారెన్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో కేకు కోసం పిండిని జల్లెడ పట్టం, చాక్లెట్ కట్ చేయడం నుంచి అన్ని పనులను ఆయనే చేశారు. ఆఖరుగా కేకును బేక్ చేసి దానిపై ఓరియో బిస్కెట్లతో అందంగా తయరు చేశాడు. ఒక పీస్ను కట్ చేసి పెట్టాడు. అతను చివరకు తుది ఉత్పత్తితో పోజులిచ్చాడు మరియు కేక్ నుండి ఒక ముక్కను కత్తిరించాడు. అయితే కేకుతోపాటు భావోద్వేగ లేఖను కూడా స్నేహితుడి కోసం రాశారు. ఇందులో వారెన్ వ్యక్తిగత జీవితం, స్నేహం బంధం గురించి వివరించారు. కాగా బిల్గేట్స్, వారెన్ బఫెట్ తొలిసారిగా 1991 జూలై 5న కలుసుకున్నారు. (2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు) Happy 90th birthday, Warren! pic.twitter.com/8nH2EulTR4 — Bill Gates (@BillGates) August 30, 2020 -
‘2021 మే నాటికి కరోనా అంతం’
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. వైరస్ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మన దగ్గర ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ కరోనా అంతానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుంది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్ తుడిచిపెట్టుకుపోతుంది. కరోనా వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. కాకపోతే ఈ వైరస్ వైద్యరంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి రావడానికి సాయం చేసింది. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్ పరిశోధనల్లో పురోగతి జరిగింది’ అన్నారు బిల్ గేట్స్. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225) కరోనా వ్యాక్సిన్ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చతున్నది. ఈ క్రమంలో గతవారం పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్.. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల నిధులు.. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గేవ్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులు అందాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసే కొన్ని వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ రెండింటికి గాను ఒక డోస్కి 3 డాలర్ల ధర నిర్ణయించబడింది. ఇది 90 కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో పాటు దీని మద్దతు ఉన్న గవి కూడా ప్రపంచ దేశాలన్నింటికి వేగంగా.. సమానంగా కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
'నాకు బిల్గేట్స్తో ఎలాంటి ఎఫైర్ లేదు'
న్యూయార్క్ : టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక టెక్నాలజి గురించి ప్రస్తావిస్తూ వార్తలో నిలిచే ఎలన్ ఈసారి మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్పై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక అసలు విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎలన్ మస్క్ కరోనా వైరస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా గురించి ప్రపంచ దేశాలు అనవసరంగా భయపడుతున్నాయని, మరణాలను కూడా ఎక్కువ సంఖ్యలో లెక్కిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు లాక్డౌన్ కూడా అంత అవసరం లేదంటూ తెలిపారు. ఎలన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.(సైకిల్ తొక్కి ఆశ్చర్యపరిచిన ప్రధాని బోరిస్) తాజాగా మంగళవారం బిల్గేట్స్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'ఎలన్ మస్క్ కరోనా వైరస్పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతను కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే విషయంలో తలదూర్చలేదు. బహుశా అతను ఎలక్ట్రిక్ కార్లను బాగా తయారు చేయొచ్చు.. రాకెట్లను కూడా బాగా ప్రయోగించగలడు.. ఇలాంటి విషయాల్లో ఎలన్ ఆరితేరినవాడని నేను ఒప్పుకుంటా. కానీ అతనికి తెలియని విషయాల్లో తలదూర్చి అనవసరంగా ఇబ్బందులపాలవుతాడు. నాకు అది నచ్చదు. అందుకే అతనికి తెలిసిన విషయాలకు పరిమితమైతేనే బాగుంటుంది' అంటూ బిల్గేట్స్ చురకలంటించారు. The rumor that Bill Gates & I are lovers is completely untrue — Elon Musk (@elonmusk) July 30, 2020 బిల్గేట్స్ వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ ట్విటర్ వేదికగా ట్రోల్ చేశాడు. 'బిల్గేట్స్ , నేను ప్రేమికులం అనే వార్త అవాస్తవం. నాకు బిల్గేట్స్తో ఎలాంటి ఎఫైర్ లేదు' అంటూ బదులిచ్చాడు. అయితే ఎలన్ బిల్గేట్స్నుద్దేశించి ఈ రకమైన ట్వీట్ ఎందుకు చేశాడన్నది నెటిజన్లకు అర్థంకాలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎలన్ చేసిన ట్వీట్ దృష్టిలో ఉంచుకొని బిల్గేట్స్, అతను కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ .. ఎలన్ దీనికి కూడా వివరణ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. The rumor that Bill Gates & I are lovers is completely untrue — Elon Musk (@elonmusk) July 30, 2020 -
ప్రపంచమంతా పంపిణీ చేయగలదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్ను ఉత్పత్తిచేసి పంపిణీ చేయగల సత్తా భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా టీకాకు సంబంధించి భారత్లో ఎన్నో కీలక ఘట్టాలు పూర్తయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా ఫార్మా ఇండస్ట్రీకి ఉందని ఆయన కొనియాడారు. ‘కోవిడ్–19: వైరస్పై భారత్ యుద్ధం’పేరుతో గురువారం డిస్కవరీ ప్లస్ చానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీలో గేట్స్ మాట్లాడారు. అతి పెద్ద దేశం, కిక్కిరిసిన జనాభా, పట్టణాల్లో జనసాంద్రత వంటి అంశాల వల్ల కరోనా వైరస్తో భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. టీకాల తయారీలో భారత్కు మించిన దేశం లేదన్నారు. సీరం వంటి అతి పెద్ద సంస్థలు సహా ఎన్నో ఫార్మా కంపెనీల సహకారంతో ప్రపంచ దేశాలకు టీకాలను పంపిణీ చేయగలదని గేట్స్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. వివిధ రకాల పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బిహార్లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గేట్స్ వివరించారు. -
భారత్కు ఆ సత్తా ఉంది: బిల్గేట్స్
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. భారత్తో సహా పలు దేశాల్లో ఇప్పటికే మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఫార్మా రంగాన్ని ఆకాశానికెత్తారు. తమ దేశానికే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్కు ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్లతో కరోనాకు వ్యాక్సిన్ రూపొందించడానికి భారత్ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ‘ఇండియాస్ వార్ ఎగెనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం డిస్కవరీ చానెల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం అవుతుంది. (వ్యాక్సిన్ అందరికీ పంచాలి: ట్రూడో) బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం భారతదేశం మీద కూడా భారీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ. అలానే పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగానే ఉంటుంది. భారతదేశంలో డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. భారత్లోని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమయిన వ్యాక్సిన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదు. ఇదే కాక బయో ఈ, భారత్(బయోటెక్) వంటి ఎన్నో ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. తన ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా కరోనా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ సొంతం’ అన్నారు బిల్ గేట్స్. అంతేకాక భారత్ ‘కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్నెస్ ఇన్నోవేషన్స్’(సీఈపీఐ)లో చేరడం పట్ల గేట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీల కూటమి. (ఈ మందులు నిల్వ ఉంచండి) -
‘ప్రపంచ కుబేరులు ఏ విధంగా ఎదిగారో తెలుసా’
ముంబై: ప్రపంచ కుబేరుల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే 2018లో ఫోర్బ్స్ జాబితాలో కైలీ కాస్మోటిక్స్ వ్యవస్థాపకురాలు, రియాలిటీ ఫేమ్ కైలీ జెన్నర్ పేరు ప్రముఖ్యత సంతరించుకుంది. 21ఏళ్ల కైలీ జెన్నర్ అంత పాపులర్ కావడానికి ఆమె స్వయం కృషితో ఎదిగినట్లు నామినేషన్ వేసి సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రపంచ కుబేరులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ వారు ఈ స్థాయికి ఏ విధంగా ఎదిగారో కచ్చితమైన ఆదారాలున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకుంటు ప్రపంచ కుబేరులుగా ఏ విధంగా ఎదిగారో స్పష్టమైన ఆదారాలున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి అమెజాన్ సంస్థను బెజోస్ చిన్న గ్యారేజిలో స్థాపించిన ఆధారాలను ఫోటో రూపంలో ఇటీవల సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. అయితే కైలీ స్వయం కృషితో ఎదిగినట్టు నామినేషన్ వేయడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె కర్దాషియన్ వంశానికి చెందిందని, ఆమె 13ఏళ్లలోనే టీవీ రియాల్టీ షోలో పాల్గొని స్వయం కృషితో ఎదిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా ఆమెకు స్వయం కృషితో ఎదిగిన ఇమేజ్ వచ్చిందని, కుటుంబ నేపథ్యం చెప్పాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. (చదవండి: బిల్ గేట్స్ చెప్పిన ఐదు పుస్తకాలు) Cute propaganda. In reality Bezos's mommy and daddy gave him $245,573 to stop Amazon from failing in 1995, but you'd never know it from listening to our right-wing mainstream media that blames poverty on personal failure and attributes wealth to personal virtue. https://t.co/vM15SKIcWs — Aidan Smith ⧖ (@AidanSmith2020) July 6, 2020 -
‘కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికే’
వాషింగ్టన్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మైక్రోసాఫ్ట్’ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ సరఫరాలో ఎక్కువ డబ్బులు బిడ్ చేసే వారికి కాకుండా.. అత్యంత అవసరమున్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి మహమ్మారి సమయంలో డబ్బు గురించి కాకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచం అత్యంత తీవ్రమైన మహమ్మారితో బాధపడుతుంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్, వ్యాక్సిన్ సరఫరాలో ఎక్కువ అవసరమున్న ప్రాంతాలకు, దేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు గురించి ఆలోచిస్తే.. మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు మార్కెట్ శక్తులకు అడ్డుకట్ట వేసి అందరికి సమన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు. (కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్ గేట్స్!) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు ఈ పరిశోధనలు, ట్రయల్స్పై వేల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ధనిక దేశాలు కరోనా వైరస్కు వ్యాక్సిన్ను తయారు చేస్తే.. అభివృద్ధి చెందిన దేశాలకు అన్యాయం జరుగుతుంది అన్నారు బిల్గేట్స్. ‘రెండు దశాభ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన ఎయిడ్స్ / హెచ్ఐవీకు మందులను అందుబాటులోకి తేవడం కోసం ప్రపంచదేశాలు అన్ని కలసికట్టుగా పని చేశాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా హెచ్ఐవీకి మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ గురించి కూడా ఇలానే ప్రయత్నించాలి’ అని బిల్గేట్స్ సూచించారు. (కలిపి కొడితే కరోనా ఫట్?) -
బిల్ గేట్స్ సూచించిన ఐదు పుస్తకాలు ఇవే!
కాలంకంటే ముందే పుట్టి, కాలంకంటే ఒకడుగు ముందు నడుస్తున్న మనిషిలా ఉంటారు బిల్ గేట్స్. కాలానికి జలుబు చేయబోతోంది, కాలానికి పలానా పుస్తకాలు మంచి మెడిసిన్ అని కూడా చెబుతుంటారు. వేసవికాల పఠనం కోసం ఇప్పుడు ఆయన 5 పుస్తకాలు సూచించారు. వాటిల్లో ‘నోబెల్’ దంపతులు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డూఫ్లో రాసిన ‘గుడ్ ఎకనమిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్’ కూడా ఉంది. మిగతా నాలుగు.. ది ఛాయిస్ (డాక్టర్ ఎడిట్ ఈవా ఎగర్), క్లౌడ్ ఎట్లాస్ (డేవిడ్ మిట్చెల్), ది రైడ్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ (బాబ్ ఈగర్), ది గ్రేట్ ఇన్ ఫ్లూఎంజా (జాన్ ఎం బ్యారీ). బిల్ గేట్స్ ఏదైనా చెప్పారంటే అందులో మానవాళి శ్రేయస్సు ఉంటుందనే. కోవిడ్ 19 పొంచి ఉందని 2015 లోనే చెప్పారు ఆయన ఒక స్పీచ్లో!! అప్పుడే ఇంకో మాట కూడా చెప్పారు. కనీసం కోటీ యాభై లక్షల మందికి సంక్రమించాక కానీ కోవిడ్ శాంతించదని!! -
కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచం దాదాపు 3 మిలియన్ల (30 లక్షల మంది) సోకింది. ప్రపంచవ్యాప్తంగా 205,000 మంది మరణించిన విపత్కర సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలోపే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలిపారు. లేదంటే దీనికి మందు కనుక్కోవడానికి రెండేళ్ళ లోపు సమయం పట్టవచ్చు అన్నారు. అయితే అంత సమయం పట్టక పోవచ్చుకానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని, ఇది తయారు కావడానికి కచ్చితంగా 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) 18 నెలలకంటే ఎక్కువ సమయం పట్టదని తాము అంచనా వేస్తున్నామని, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని ఉటంకిస్తూ బిల్ గేట్స్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు వందకు పైగా ప్రయత్నాలతో చాలా వేగంగా ముందు కెడుతున్నామనీ, ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ అభివృధ్దితో పాటు, వేగంగా తయారీ ప్రక్రియపై కూడా దృష్టిపెట్టినట్టు చెప్పారు. (ప్రధానికి బిల్ గేట్స్ ప్రశంసలు) మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు తగ్గించే నిర్ణయంపై గతంలో విమర్శలు గుప్పించిన బిల్ గేట్స్ తాజాగా అమెరికాలో ఎక్కువగా పరిక్షలు నిర్వహిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా ప్రతికూలంగా స్పందించారు. తప్పుడు వ్యక్తులకు పరిక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. 24 గంటల లోపు పరిక్షా ఫలితాలు రాకపోయినా సరే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. అసలు ఆ పరిక్షలకు విలువ ఉండని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రాణాంతక వైరస్ టీకా కోసం భారీ నిధులను సమకూరుస్తున్న బిలియనీర్ బిల్ గేట్స్ అత్యంత ఆశాజనకమైన ఏడు విధానాలకు నిధులు సమకూరుస్తుండటం విశేషం. -
మహమ్మారిపై పోరు : ప్రధానికి బిల్ గేట్స్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ కుబేరుడు, దాతృత్వశీలి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. భారత్లో కోవిడ్-19 మహమ్మారి విస్తృత వ్యాప్తిని అరికట్టడంలో మీ సారథ్యంలోని ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్తో పాటు వైరస్ అనుమానితులకు నిరతంరం టెస్ట్లు నిర్వహిస్తూ, క్వారంటైన్లకు పంపడం వంటి చర్యలు చేపట్టడం మెరుగైన ఫలితాలు ఇచ్చిందని ప్రధానిని ఉద్దేశించి బిల్గేట్స్ ప్రస్తుతించారని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంపై అధిక నిధులు వెచ్చించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ ప్రస్తావించారని ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ను గుర్తించి, కాంట్రాక్ట్ ట్రేసింగ్కు సహకరించేలా ఆరోగ్య సేతు డిజిటల్ యాప్ను ప్రారంభించడం ద్వారా కోవిడ్-19ను ఎదుర్కోవడంలో డిజిటల్ సామర్ధ్యాలను ప్రభుత్వం పెంపొందించిదని బిల్గేట్స్ అన్నారని వివరించాయి. చదవండి : కరోనా కట్టడికి బిల్గేట్స్ సూచనలు! -
ట్రంప్ నిర్ణయం మంచిది కాదు : బిల్గేట్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్గేట్స్ బుధవారం అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో ఇలాంటి నిర్ణయాలు సహేతుకం కాదని పేర్కొన్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుంటోందని, ఈ సంస్థ అవసరం ప్రపంచానికి ఎంతైనా ఉందని అన్నారు. జనవరి చివర్లో కరోనా వైరస్ను పబ్లిక్ ఎమర్జెన్సీగా డబ్యూహెచ్వో ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరపున 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని బిల్గేట్స్ ప్రకటించింది. ఇంత భారీ మొత్తం విరాళాన్ని ప్రకటించడం ఇది మొదటిసారేం కాదు. గతంలోనూ చైనాలో క్షయ వ్యాధి నియంత్రణకు 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. ఇక అమెరికాలో కరోనా కట్టడికి లాక్డౌన్ అమలు చేయాలంటూ బిల్గేట్స్ సహా పలువరు నిష్ణాతులు కోరినా ట్రంప్ అవేమీ పట్టించుకోలేదు. ఫలితం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రజలను అల్లాడిస్తుంది. ఇక డబ్యూహెచ్వోకు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ స్పందించింది. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఈ సమయంలో ట్రంప్ నిర్ణయం ప్రమాదరకరమైనందంటూ అభిప్రాయపడింది. ఈ మేరకు డాక్టర్ ప్యాట్రిస్ హారిస్ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలంటూ పేర్కొన్నారు. -
విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి కరాళ నత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడిన బాధితులతోపాటు, పొట్ట కూటి కోసం అలమటిస్తున్న అభాగ్యులను, అనాథలను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా దయార్ద్ర హదయులైన దాతలు ముందుకు వచ్చారు. వారిలో కార్పొరేట్ కుటుంబ సంస్థలు, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, పార్లమెంట్లు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యక్తులు ఉన్నారు. వారంతా మున్నెన్నడులేని విధంగా ముందుకు వచ్చారు. (కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం ) ఇలా మార్చి ఒకటవ తేదీ నాటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 7,629 కోట్ల రూపాయలు విలాసంగా వసూలయ్యాయి. ఇదివరకు ఎబోలా వైరస్ దాడి చేసినప్పుడు 362 మిలియన్ డాలర్లు, హార్వే ఉప్పెన ముంచుకొచ్చినప్పుడు 341 మిలియన్ డాలర్లు మాత్రమే విరాళంగా వచ్చాయి. ఈసారి పెద్ద మొత్తాల్లో విరాళాలు కుటుంబ సభ్యులతో నడుస్తున్న వ్యాపార సంస్థల నుంచి రావడం, ఆ సంస్థలే ముందుగా స్పందించడం గమనార్హం. ఈ సంస్థలకు కుటుంబ సభ్యులే సీఈవోలుగా, డైరెక్టర్లుగా ఉంటారు కనుక వారు త్వరగా సమావేశం కాగలరు, వారి మధ్య త్వరగా ఏకాభిప్రాయం కుదురగలదు. అదే పలువురు కలిసి నడిపే కార్పొరేట్ సంస్థల్లో డైరెక్టర్లు సకాలంలో సమావేశం అవడం, అయినా ఏకాభిప్రాయానికి రావడం అంత సులువు కాదు. (విడాకులు తీసుకున్న సీరియల్ నటి ) ఇటలీలో ఆగ్నెల్లీ కుటుంబం ► ఇటలీలో ప్రధానంగా కార్ల పరిశ్రమను నిర్వహించే ఆగ్నెల్లీ పారిశ్రామిక కుటుంబం పది మిలియన్ యూరోలను ఇటలీ పౌర రక్షణ విభాగానికి విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి చెందిన కంపెనీలు వైద్య పరికరాలను, మందులను, ఆహారాన్ని స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వ విభాగాలకు, ప్రజలకు సరఫరా చేసింది. సామాజిక దూరం ఎలా పాటించాలో అవగాహన కల్సించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. (ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస) ►విలాస వస్తువులను తయారు చేసే ఫ్రాన్స్కు చెందిన ఎల్వీఎంహెచ్ సంస్థ ప్రభుత్వ వైద్య సిబ్బందికి నాలుగు కోట్ల క్లినికల్ మాస్క్లను విరాళంగా అందజేసింది. తమకు చెందిన మూడు కాస్మోటిక్ ఫ్యాక్టరీలను కేవలం శానిటైజర్లను తయారు చేయడానికే కేటాయించింది. వాటన్నింటిని ఉచితంగా అందచేయడానికి ముందుకు వచ్చింది. ►ఆరోగ్య రంగంలో ప్రసిద్ధి చెందిన స్విడ్జర్లాండ్కు చెందిన ‘రోచే’ సంస్థ కరోనా వైరస్ను కనుగొనేందుకు కొత్త పరీక్షను రూపొందించింది. ఇక భారత్కు చెందిన టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ 1500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదనంగా రోగులకు అవసరమైన వెంటిలేటర్లు అందజేయడానికి టాటా ట్రస్టులు ముందుకు వచ్చాయి. ►విప్రో గ్రూప్ ఈజ్మీ ప్రేమ్జీ గ్రూప్ 1125 కోట్ల రూపాయలు, అంబానీలకు చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. లాభాలే లక్ష్యంగా పనిచేసే వ్యాపార సంస్థలు ఇలాంటి ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యమే. ►ఇటలీకి చెందిన జార్జియో అర్మానీ, రెమో రుఫిణి, సిల్వియో బెర్లూస్కోని అనే బిలియనీర్ వ్యాపారస్థులు వారి దేశంలో కరోనాపై పోరాటానికి 45 మిలయన్ డాలర్లును విరాళంగా ప్రకటించారు. ► ఇక క్రీడారంగంలో ఆటల పోటీలు నిలిచిపోవడం వల్ల ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల జీతాలను చెల్లిస్తామని జియాన్ విలియమ్సన్, బ్లేక్ గ్రిఫిన్ లాంటి బాస్కెట్ బాల్ క్రీడాకారులు ముందుకు వచ్చారు. అథ్లెట్స్, క్రికెట్ క్రీడాకారులు కూడా తమవంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ►కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పది కోట్ల డాలర్లను ప్రపంచ దిగ్గజ వ్యాపారస్థుల్లో ఒకరైన బిల్ గేట్స్ ప్రకటించారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివద్ధి కోసం చైనా ధనవంతుడు జాక్ మా వంద మిలియన్ యాన్లను కేటాయించారు. కరోనా పరీక్షలకు ఐదు లక్షల కిట్లను, పది లక్షల మాస్క్లను అమెరికాకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ ) -
కరోనా కట్టడికి బిల్గేట్స్ సూచనలు!
వాషింగ్టన్ : అమెరికాతో సహా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో కరోనా కట్టడికి మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ మూడు అంశాలను చెప్పారు. అందులో మొదటిది ప్రపంచదేశాల్లో అనుసరిస్తున్న లాక్డౌన్ను అమెరికాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బీచ్లకు ఇంకా జనం వెళుతున్నారని, రెస్టారెంట్లు ఇంకా తెరచే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలా సరిహద్దులు దాటి తిరిగితే వైరస్ విస్తరిస్తుందని తెలిపారు. లాక్డౌన్ను కచ్ఛితంగా ప్రతి ఒక్కరు పాటించేలా చూడాలని బిల్గేట్స్ అమెరికా నాయకులకు విజ్ఙప్తి చేశారు. కార్యకలాపాలు ఆపివేయకపోవడం వల్ల భవిష్యత్తుల్లో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొవడమే కాకుండా వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. (కరోనా మహమ్మారిపై బిల్గేట్స్ స్పందన) ఇక కరోనా టెస్ట్ల విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఇదే విషయంలో న్యూయర్క్ నగరానికి సంబంధించి మాట్లాడుతూ.. నగరంలో ప్రతి రోజు 20వేల మందికి టెస్ట్లు చేస్తున్నారని తెలిపారు. స్వయంగా కరోనావైరస్ సోకిందా లేదో తెలుసుకోవడానికి సెల్ఫ్ స్వాబ్ పద్దతిని సీటెల్ కరోనావైరస్ అసెస్మెంట్ నెట్వర్క్ రూపొందించిందని తెలిపారు. దీంతో తమ శాంపిల్స్ను తామే పరీక్షించుకునే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా టెస్ట్ల కోసం అధిక డిమాండ్ ఉందని పేర్కొన్న బిల్గేట్స్.. ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో మొదట అత్యవసర సేవల్లో పనిచేస్తూ వైరస్ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉన్న వారిని పరీక్షించాలని, ఆ తరువాత ఎవరైతే ఎక్కువ జబ్బుపడే ప్రదేశాల్లో ఉంటూ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారిని అలా ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు. దీంతో పాటు ఇదే క్రమాన్ని మాస్క్లు, వెంటిలేటర్లు అందించే విషయంలో కూడా పాటించాలని ఆయన చెప్పారు. ఇంకా బిల్గేట్స్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వేత్తలు కరోనా వాక్సిన్ కోసం 24గంటలు శ్రమిస్తున్నారని అయితే దీనికి సంబంధించి అసత్య ప్రచారాలు జరగకుండా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ మందులు కొనే విషయంలో అనవసర భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. వాక్సిన్ తయారికీ సంబంధించి ప్రయోగాలు చేస్తున్నామని, వేరు వేరు వ్యక్తులపై వాటిని పరీక్షిస్తున్నామని, సరైన ఫలితాలు రాగానే ఆ సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎవరికైతే దాని అవసరం ఎక్కువగా ఉందో వారికి అందిస్తామని తెలిపారు. హడావిడిలో ఏదో వ్యాక్సిన్ కనిపెట్టడానికి బదులుగా మంచి ఫలితాలను ఇచ్చే వ్యాక్సిన్ను తయారు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ కనిపెడితే సగం యుద్దమే గెలిచినట్లు అవుతుందని.. అందరికి సరిపడేలా ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినప్పుడే పూర్తి యుద్దం గెలిచినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా 18 నెలల సమయం పడుతుందన్నారు. అయితే మంచి నిర్ణయాలు తీసుకొని, వైద్య నిపుణులు చెప్పినవి పాటిస్తే అమెరికా కొన్ని రోజుల్లో కొలుకుని యధాస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం తనకి ఉందని బిల్గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య మంగళవారం సాయంత్రం 3873కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 865 మంది మృత్యువాతపడడం గమనార్హం. ఇక ఇప్పటివరకు 188172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటగా... 40 వేల మందికి పైగా మరణించారు. -
కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్ గేట్స్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచ మానవాళిపై దాడి చేస్తుందని, ఫలితంగా ఎంతో మంది మృత్యువాత పడతారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ‘మైక్రోసాఫ్ట్’ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 2015లోనే అంచనా వేయడం, ఆ విషయాన్ని ఆయన ప్రజాముఖంగా ‘టెడ్ టాక్’లో తెలియజేయడం విశేషం. ‘అణు యుద్ధానికి ధనిక దేశాలు ఎలాగైతే సన్నద్ధం అవుతాయో, అలా సన్నద్దమయితేనే రానున్ను మహమ్మారిని ఎదుర్కోగలం. రానున్న దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు యుద్ధాల బారిన కాకుండా వైరస్ల బారిన పడి చనిపోతారు. ఎబోలా వైరస్ లాంటివి ఇప్పటికే దాడి చేసినా ప్రభుత్వాలు ఇప్పటికీ కళ్లు తెరవలేకపోతున్నాయి. ఫలితంగా ముప్పు తీవ్రమవుతోంది. మళ్లీ చెబుతున్నా దాడి చేసేవి మిస్సైల్స్ కావు, మైక్రోబ్స్’ అని బిల్ గేట్స్ హెచ్చరించారు. సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వైరస్ల దాడులను చూసినప్పటికీ ప్రపంచ దేశాలు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడంతో బిల్ గేట్స్ ఊహించినట్లు నేడు అవి కరోనా మహమ్మారి బారిన పడ్డాయి. ఎబోలా వైరస్ కారణంగా 2013 నుంచి 2016 మధ్య కాలంలో గినియా, లైబీరియా, సియెర్రా లియేన్ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో 11 వేల మంది మరణించారు. ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా మరణించగా, రెండున్నర లక్షల మంది వ్యాధిగ్రస్థులయ్యారు. ‘ఎబోలా పట్టణ ప్రాంతాలకు విస్తరించక పోవడం కేవలం మన అదృష్టం. మరోసారి వైరస్ మహమ్మారి దాడి చేస్తే మనకు అదృష్టం కలసి రాకపోవచ్చు. సైనిక ముప్పులను ఎంత తీవ్రంగా తీసుకుంటారో, అంతే తీవ్రంగా వైరస్ దాడులను పరిగణించాలి. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధాలకు సన్నద్దం అవడం కోసం ఎలాగయితే వార్ గేమ్స్ను నిర్వహిస్తారో, అలాగే జెమ్స్ గేమ్స్ను నిర్వహించాలి. అణ్వస్త్రాలను మార్గమధ్యంలోనే విధ్వంసం చేసే శస్త్రాలపై మనం ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాం. వైరస్ నిరోధక వ్యవస్థ కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం లేదు. పర్యవసానంగా రానున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేం’ అని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన హెచ్చరికలను ప్రపంచ దేశాలు పరిగణలోకి తీసుకొని ఉన్నట్లయితే నేడు కరోనా వైరస్ ఇంతగా ప్రపంచ దేశాలను భయపెట్టి ఉండేది కాదు. (భారత్లో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య) బిల్ గేట్స్ గతేడాది మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన వర్ధమాన దేశాల్లో వైరస్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2019లో నెట్ఫిక్స్ తీసిన డాక్యుమెంటరీలో కిల్లర్ వైరస్ ఒకటి చైనాలోని ఓ సీ మార్కెట్ నుంచి విస్తరిస్తుందని చెప్పడం కూడా నేడు నిజమైంది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా) -
మైక్రోసాఫ్ట్కు బిల్గేట్స్ రాజీనామా
-
మైక్రోసాఫ్ట్కు బిల్గేట్స్ రాజీనామా
న్యూయార్క్ : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్టైం పనికి కూడా గుడ్బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చదవండి : మళ్లీ నెం.1గా బిల్ గేట్స్ బిల్గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు -
కరోనా మహమ్మారిపై బిల్గేట్స్ స్పందన
చికాగో : ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్-19 శతాబ్ధంలో ఒకసారి వచ్చే అత్యంత తీవ్రమైన వ్యాధికారిక వైరస్ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ పేర్కొన్నారు. ' పేద, మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే అలాంటి దేశాలపై కరోనా లాంటి వైరస్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇందుకోసం ప్రపంచదేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలి. మందులు, వ్యాక్సిన్లపై మరింత ఖర్చు పెట్టాలి. అప్పుడే వైరస్లను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడగలం' అని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్లో బిల్గేట్స్ తెలిపారు. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) కాగా కరోనా వైరస్ను అరికట్టేందుకు తన వంతు సాయం కింద బిల్గేట్స్... మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం ప్రకటించారు. కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవైపు చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, బాధిత దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ న్యూజిలాండ్, లిథువేనియాలకు సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 44 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,780 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 83 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. (బిల్గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు) -
సమానత్వం కోసం వేచి ఉండే పనే లేదు
‘‘నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఆడపిల్లగా పుట్టావంటే చాలు, జీవితాన్ని నెట్టుకురావడానికి చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు’’. ఈ మాట అన్నది మామూలు మహిళ కాదు. మిలిందా గేట్స్. బిల్ గేట్స్ సతీమణి. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకురాలు. ప్రపంచ దేశాల్లో పర్యటించి ఆడవాళ్లు, పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన మహిళ. తాను చూసిన ఘటనలతో ‘ద మోమెంట్ ఆఫ్ లిఫ్ట్’ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన మహిళ. గేట్స్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గేట్స్ దంపతులు సోమవారం సంయుక్తంగా ఒక వార్షిక లేఖను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్యం, విద్య, స్త్రీ పురుష సమానత్వాలకు మున్ముందు మరింత ప్రాముఖ్యం ఇవ్వబోతునట్లు‡ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో స్త్రీ–పురుష సమానత్వం గురించి మిలిందా పంచుకున్న విషయాలు ఆలోచన రేకెత్తించేవిలా ఉన్నాయి. అదే సమయంలో స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే అనే ఆశనూ చిగురింపజేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ఇరవయ్యవ వార్షికోత్సవంతోపాటు, చరిత్రాత్మకమైన బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్కూ ఈ ఏడాది పాతికేళ్లు నిండబోతున్నాయి. ఆనాటి బీజింగ్ సదస్సు మహిళల స్థితిగతుల మీద చర్చించడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని మిలిందా తన లేఖలో గుర్తు చేశారు. 1995లో బీజింగ్లో జరిగిన ఉమెన్ వరల్డ్ కాన్ఫరెన్స్లో హిల్లరీ క్లింటన్ ప్రసంగిస్తూ ‘మానవ హక్కులే మహిళల హక్కులు.. మహిళల హక్కులే మానవ హక్కులు’ అన్నారు. ఆ మాట తనను ఎంత ఇన్స్పైర్ చేసిందీ చెప్పారు. ‘ఆ తర్వాత నేను ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో పర్యటించాను. అక్కడి మహిళలను చూసిన తర్వాత స్త్రీ– పురుష సమానత్వ సాధన కోసం స్త్రీలకు అవసరమైన శక్తినివ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పదలచినది ఏమంటే.. మన శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మహిళలమందరం ముందుకు రావాలి. అప్పుడు సమానత్వం కోసం వేచి చూడాల్సిన పనే ఉండదు’ అని లేఖలో రాశారు మిలిందా గేట్స్. బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహణతోపాటు మిలిందా గేట్స్ సొంతంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విరాళాలతో సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాభివృద్ధి ద్వారా కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా సమాజాభివృద్ధి సిద్ధిస్తుందని చెబుతారామె.మిలిందా గేట్స్ యూఎస్లోని డ్యూక్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ చేశారు. ఒక దశాబ్దం పాటు తన కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టారామె. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబం, సమాజ సేవ కోసం కేటాయించారు. -
బిల్గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు
ప్రపంచంలోనే సంపన్నుడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఓ విలాసవంతమైన యాట్(విహార నౌక)ను కొన్నారు. గతేడాది మొనాకోలో నిర్వహించిన యాట్షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్గేట్స్ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. వెంటనే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా.. ఈ నౌక విశేషాలు: ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్ రూమ్లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్ ఉంటుంది. ఇందులో 5 డెక్లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఈ బోట్లో ఉన్నాయి. కాగా ఈ బోట్ను బిల్గేట్స్ తరచూ వెకేషన్కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. ఇక ఈ బోటు ధర రూ.4600 కోట్లు కావడం విశేషం. కాగా లిక్విడ్ హైడ్రోజన్తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. బిల్గేట్స్ కొనుగోలు చేసిన సూపర్యాచ్ పొడవు 370 అడుగులు. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్గేట్స్ చేతికి రానుంది. -
బిల్గేట్స్తో ఆ విషయం చర్చించిన మల్లికా శెరావత్
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను కలిశారు. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ని కలిసి మహిళా సాధికారత గురించి చర్చించిందట. వాషింగ్టన్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ విషయం గురించి మల్లికా తన ఇన్స్టాగ్రామ్లో తెలియజేసింది. ఆయనతో మహిళా సాధికారత గురించి మాట్లాడడం సంతోషంగా అనిపించిందని మల్లికా తన పోస్ట్లో పేర్కొంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్-13లోను మల్లికా శెరావత్ సందడి చేసిన సంగతి తెలిసిందే. (మల్లికా శెరావత్కు వింత అనుభవం) View this post on Instagram So enjoyed my conversation with Bill Gates abt female empowerment @thisisbillgates #inspired #billgates #womensrights #femaleempowerment A post shared by Mallika Sherawat (@mallikasherawat) on Jan 27, 2020 at 11:10pm PST -
బిల్గేట్స్ అల్లుడు ఇతడే
వాషింగ్టన్ డిసి : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మెలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నిశ్చితార్థం పూర్తి అయింది. ఈజిప్టుకు చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) జెన్నిఫర్(23)తో తన నిశ్చితార్థం అయిందని జెన్నిఫర్ ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ మేరకు మంచుకొండల్లో నయెల్ నాసర్తో దిగిన ఫోటన్ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ తాము ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా నాసర్, జెన్నిఫర్లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Nayel Nassar, you are one of a kind. Absolutely swept me off my feet this past weekend, surprising me in the most meaningful location over one of our many shared passions. I can’t wait to spend the rest of our lives learning, growing, laughing and loving together. Yes a million times over. 💍 AHHH!!! A post shared by Jennifer Gates (@jenniferkgates) on Jan 29, 2020 at 12:29pm PST జెన్నిఫర్ ఇన్స్ట్రాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పోస్ట్కు ఇప్పటికే 46వేలకు పైగా లైక్లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెన్నిఫర్ ఇన్స్ట్రాగ్రామ్ పోస్ట్పై ఆమె తల్లిదండ్రులు హర్షం వెలిబుచ్చారు. ‘ నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అభినందనలు’ అని బిల్గేట్స్ కామెంట్ చేయగా, ‘నిన్ను, నయెల్ నాసర్ను జంటగా చూడడం సంతోషంగా ఉంది’ అని మెలిండా గేట్స్ ట్వీట్ చేశారు. ఇక నయెల్ నాసర్ కూడా తన నిశ్చితార్థానికి సంబందిన విషయాన్ని ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘ చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో’ అంటూ జెన్నిఫర్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram SHE SAID YES!! 💍 I’m feeling like the luckiest (and happiest) man in the world right about now. Jenn, you are everything I could have possibly imagined..and so much more. I can’t wait to keep growing together through this journey called life, and I simply can’t imagine mine without you anymore. Love you more than you can possibly imagine, and thank you for making every single day feel like a dream to me. Here’s to forever! 😘❤️ A post shared by Nayel Nassar (@nayelnassar) on Jan 29, 2020 at 12:49pm PST నాసర్ తల్లిదండ్రులది ఈజిప్టు కాగా అమెరికాలో స్థిరపడ్డారు. నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా గుర్రపు స్వారీ ఆటలో ఆ దేశం తరఫున 2020 ఒలంపిక్స్లో సైతం పాల్గొనబోతున్నాడు. -
బిల్గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్గేట్స్ తండ్రి వుడ్కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్గేట్స్ ఒక రెస్టారెంట్కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడెలా?!
సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు. వివరాలు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆయనతో కలిసి భారతీయ పోషణ్ కృషి కోష్ అనే కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్గేట్స్తో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్మృతీ మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడేం చేద్దాం! అంటూ క్యాప్షన్ జతచేశారు. దీనర్థం ఏంటంటే.. బిల్గేట్స్, స్మృతి ఇరానీ ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. కనీసం డిగ్రీకూడా పూర్తిచేయకుండా బిల్గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగితే, స్మతి ఇరానీ కేంద్రమంత్రిగా ఎదిగారు. దీన్ని బట్టి చూస్తే చదవకపోవడం అనేది భవిష్యత్తులో ఎదగడానికి అడ్డంకి కాదని ఆమె అభిప్రాయం. యూపీలోని అమేథీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్మతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని పేర్కొన్న విషయం విదితమే. -
ప్రధాని మోదీతో బిల్ గేట్స్ భేటీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు బిల్గేట్స్ సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు సంప్రదింపులు జరిపారు. బిల్ గేట్స్తో తన భేటీ అద్భుతంగా సాగిందని, ఆయనతో పలు అంశాలపై చర్చించడం స్ఫూర్తివంతంగానే ఉంటుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తన వినూత్న ఆలోచనా విధానం, క్షేత్రస్ధాయిలో పనిచేయడం ద్వారా భూమండలాన్ని జీవించేందుకు మెరుగైన ప్రదేశంగా మలచడంలో నిమగ్నమయ్యారని కొనియాడారు. ఇక అంతకుముందు బిల్ గేట్స్ భారత్లో వైద్య విధానాలపై నీతిఆయోగ్ రూపొందించిన నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత వైద్య వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తోందని, డిజిటల్ టూల్స్తో దీన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పోలియో నిర్మూలనకు భారత ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని ప్రశంసించారు. వ్యవసాయ గణాంక శాస్త్రంపై జరిగిన ఎనిమిదో అంతర్జాతీయ సదస్సులోనూ గేట్స్ పాల్గొన్నారు. -
భారత్పై బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : రానున్న దశాబ్ధంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్ వ్యవస్థ, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్ధ్యం ప్రశంసనీయమైనవని కొనియాడారు. దేశంలో ఆర్థిక మందగమనంపై ఆందోళన నెలకొనడంతో పాటు స్లోడౌన్ ప్రభావం మరికొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి బిల్ గేట్స్ భారత ఎకానమీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వల్ప కాలంలో ఏం జరుగుతుందనేది తనకు తెలియకపోయినా, రానున్న దశాబ్ధంలో భారత్లో అనూహ్య వృద్ధి రేటు నమోదవుతుందని వ్యాఖ్యానించారు. 110 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ను వెనక్కునెట్టి 64 ఏళ్ల బిల్గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా తిరిగి తన స్ధానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గేట్స్ మూడు రోజులు భారత్లో పర్యటిస్తారు. భారత్లో ఆధార్ వ్యవస్థ పనితీరును గేట్స్ ప్రశంసించారు. ఇతర దేశాల్లోనూ ఈ తరహా వ్యవస్ధను ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు భారత్లో అద్భుత వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని అన్నారు. -
మళ్లీ నెం.1గా బిల్ గేట్స్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 105.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. కాగా గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలోకి చేరాడు. ఆయన ఆస్తి విలువ 103.9 బిలియన్లు. ఈయన కంపెనీ అమెజాన్ మూడో త్రైమాసికంలో 26 శాతం నష్టాలను చవిచూసింది. అలాగే విడాకుల కారణంగా ఆయన భార్య భారీ స్థాయిలో భరణం పొందింది. దీంతో బెజోస్ ఏడు బిలియన్ల డాలర్ల స్టాక్ వాల్యూను కోల్పోయాడు. -
షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!
వాషింగ్టన్ : అమెజాన్ షేర్లు పతనమైన నేపథ్యంలో కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ భారీగా సంపద కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న బెజోస్ స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సొంతం చేసుకున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్ భారీ నష్టాలు చవిచూడటం.. అదే విధంగా గురువారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేర్లు ఏడు శాతం మేర పడిపోవడంతో... 2017 తర్వాత తొలిసారిగా కంపెనీ నికర ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఏడు బిలియన్ డాలర్ల మేర(స్టాక్ వాల్యూ) సంపద బెజోస్ చేజారింది. ఇక తాజా నివేదికల ప్రకారం బెజోస్ ఆస్తి 103.9 బిలియన్ డాలర్లుగా ఉండగా.. బిల్ గేట్స్ ప్రస్తుతం 105.7 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. దీంతో ఆయన మరోసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచారని పలు నివేదికలు పేర్కొన్నాయి. కాగా 1987లో ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్ జాబితాలో తొలిసారిగా స్థానం దక్కించుకున్న బిల్ గేట్స్ 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇక 1998లో అమెరికా సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచిన బెజోస్.. అమెజాన్ షేర్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో 2018లో తొలిసారిగా బిల్ గేట్స్ను వెనక్కినెట్టి 169 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అయితే ప్రస్తుతం అమెజాన్ షేర్ల పతనం, భార్య మెకాంజీకి భరణం రూపంలో దాదాపు 36 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లు బదలాయించడంతో బెజోస్ రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది.(చదవండి : విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!) -
సన్కే స్ట్రోక్ ఇద్దాం!
సూరీడు సీరియస్గా ఉన్నాడు.. ఎండ దంచి కొడుతోంది.. ఏం చేస్తాం? అడ్డంగా గొడుగు పెడతాం.. మనకు ఓకే.. మరి భూమి మొత్తానికి ఎండ కొడుతోందిగా.. ఏం చేయాలి? గొడుగు పట్టాలా? అడ్డుగా ఏదైనా పెట్టాలా? భూతాపం నుంచి రక్షించుకునేందుకు సూర్యుడి వేడిని ఎలా ఆపాలి? వినడానికిది సిల్లీగా అనిపిస్తోందా.. అయితే, ఇదేదో ఊసుపోని పోరగాళ్ల ముచ్చట కాదు.. ప్రపంచంలోనే పేరొందిన హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల వినూత్న ఆలోచన.. దీనికి నిధులు సమకూరుస్తోంది కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కావడం విశేషం.. అరె.. సింపుల్రా భయ్.. బోలెడంత చాక్ పౌడర్ను తీసుకెళ్లి.. ఆకాశంలో చల్లేయ్.. అదే పెద్ద సన్షేడ్లాగ సూరీడు నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది ఇంతకీ సూరీడు దుమ్ము దులిపేసే ఆ ఆలోచన ఏంటి? సూర్యుడి వేడి భూమిపై పడకుండా ఉండేందుకు భారీ మొత్తంలో దుమ్మును ఆకాశంలో సూర్యుడికి అడ్డంగా చల్లుతారట. ఇందుకోసం రోజుకు 800 భారీ ఎయిర్క్రాఫ్ట్ల సాయంతో లక్షల టన్నుల చాక్ (క్యాల్షియం కార్బొనేట్) దుమ్మును భూమి కి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తు (స్ట్రాటోఆవరణం)లో జల్లి వస్తారు. ఇలా చల్లిన దుమ్ము సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తుంద ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల భూమిపైకి వచ్చే కిరణాల తీవ్రత తగ్గి.. భూతాపం నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. బిల్గేట్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల నిమిత్తం స్ట్రాటోస్ఫియరిక్ కంట్రోల్డ్ పెర్టుర్బేషన్ ఎక్స్పెరిమెంట్ అనే పరికరం (రూ.20 కోట్లు) ద్వారా ఓ పెద్ద బెలూన్ను ఉపయోగించి రెండు కేజీల క్యాల్షియం కార్బొనేట్ పొడిని 20 కిలోమీటర్ల పైకి పంపి అక్కడ చల్లుతారు. తొలుత న్యూ మెక్సికోలో ఈ ప్రయోగం చేయనున్నారు. దీంతో అక్కడున్న గాలి మందంగా తయా రై సూర్యుడి కిరణాలు కిందకు రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు. అలాగే కాల్షియం కార్బొనేట్ కణాలు తెలుపు రంగులో ఉండటం వల్ల సూర్యుడి కాంతి పరావర్తనం చెందుతుంది. దీన్నే అల్బిడో అని పిలుస్తారు. శుద్ధమైన మంచుకు అల్బిడో విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు సూర్యుడి కాంతి మొత్తాన్ని పరావర్తనం చెందిస్తుంటుంది. ఎండాకాలంలో ఇంటి మేడపై తెల్లటి (వైట్ వాష్) పెయింట్ వేస్తే సూర్యరశ్మి వేడిమి ఇంట్లోకి రాకుండా ఆపుతుంది కదా.. అలాగన్న మాట. అదే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాల్షియం కార్బొనేట్ను ఆకాశంలో జల్లి వస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. నష్టమా.. లాభమా..? ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి తాపం నుంచి భూమికి, మనకు ఉపశమనం కలుగుతుందో లేదో తెలియదు కానీ.. భవిష్య త్తులో స్ట్రాటో ఆవరణంలోని ఈ పొడి వల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి కరువులు, హరికేన్లు వచ్చే ప్రమాదముందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వాదనలను హార్వర్డ్ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మోదీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డు
న్యూయార్క్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్కీపర్’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. ఈ నెల 24న బ్లూమ్బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 38. గాంధీ పార్కు ఆవిష్కరణ? గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ‘గాంధీ పీస్ గార్డెన్’ను మోదీ ప్రారంభించనున్నారు. న్యూయార్క్లోని భారతీయ కాన్సులేట్ జనరల్, లాంగ్ ఐలాండ్ కేంద్రంగా పనిచేస్తున్న శాంతి ఫండ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలు కలిసికట్టుగా నాటే 150 మొక్కలు ఈ పార్కులో ఉంటాయి. పార్కులో తమకిష్టమైన వారి జ్ఞాపకార్థం మొక్కలు పెంచుకోవచ్చు. 2014 ఎన్నికల తరువాత మోదీ తొలిసారి ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించగా.. రెండోసారి గెలిచాక మరోసారి ఈ చాన్సు వచ్చింది. రష్యాతో సంబంధాలను విస్తరిస్తాం వ్లాడివోస్టోక్/న్యూఢిల్లీ: రష్యాలోని వ్లాడివో స్టోక్లో జరిగే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్) సదస్సు సందర్భంగా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానంపై ఈ నెల 4వ తేదీన వ్లాడివోస్టోక్ చేరుకోనున్న ప్రధాని ఈఈఎఫ్ 5వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అక్కడే జరిగే భారత్–రష్యా 20వ వార్షిక భేటీలోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరిం చడంతోపాటు, బలోపేతం చేసుకోవాలన్న రెండు దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా తన పర్యటన కొనసాగుతుందన్నారు.. సృజనాత్మకత పెంచుకోండి: ఉపాధ్యాయులకు ప్రధాని సూచన సృజనాత్మకత, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుకుని సాంకేతికతను బోధనలో ఉపయోగించుకోవాలని మోదీ ఉపాధ్యాయులను కోరారు. ఢిల్లీలో తనను కలిసిన జాతీయ అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులనుదేశించి ప్రధాని మాట్లాడారు. ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి ఆయన వివరించారు. -
అతను మాయ చేసేవాడు
వాషింగ్టన్: ప్రత్యర్థి సంస్థ యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సారథ్య నైపుణ్యాలపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి, సుదీర్ఘంగా గంటల కొద్దీ పనిచేసేలా మాయ చేయడంలో జాబ్స్ ఆరితేరిన వ్యక్తని కితాబిచ్చారు. అథఃపాతాళంలోకి జారిపోతున్న యాపిల్ను మళ్లీ నిలబెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిపిన జాబ్స్ 2011లో క్యాన్సర్తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘అతను మాట్లాడుతుంటే అందరూ మంత్ర ముగ్ధులైపోవడం నేను చూశాను. అయితే, నేను కూడా ఒక చిన్న పాటి మంత్రగాణ్ని కావడంతో ఆయన మాయలు, మంత్రాలేవీ నా మీద ప్రభావం చూపేవి కావు‘ అని ఒక ఇంటర్వ్యూలో గేట్స్ పేర్కొన్నారు. టాలెంట్ను గుర్తించడంలోను, వారిలో స్ఫూర్తి నింపడంలోనూ జాబ్స్ను మించినవారెవరూ ఇప్పటిదాకా తనకు కనిపించలేదని చెప్పారు. -
నేను చేసిన పెద్ద తప్పు అదే: బిల్గేట్స్
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్కు ధీటైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్గేట్స్ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ, విలేజ్ గ్లోబల్కు ఇచ్చిన ఒక ఇంటరŠూయ్వలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లే... యాపిల్ ఫోన్లు కాకుండా మిగిలిన ఇతర ఫోన్లకు ప్రామాణిక ప్లాట్ఫాంగా ఆండ్రాయిడ్ అవతరించిందని, మైక్రోసాఫ్ట్ ఆ స్థానంలో ఉండాల్సిందని ఆయన వివరించారు. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ను 2005లోనే కొనుగోలు చేసింది. ఐఫోన్ 2007లో మార్కెట్లోకి రాగా, ఆండ్రాయిడ్ ఫోన్2008లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న స్మార్ట్ఫోన్లలో 85 శాతానికి పైగా ఆండ్రాయిడ్ ఓఎస్తో ఉన్నవే. ఇక విండోస్ ఓఎస్తో తయారైన ఫోన్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. -
బిల్ గేట్స్కే ప్రేరణనిస్తున్న మహాదాత ఎవరో తెలుసా?
సమాజ సేవకు, ముఖ్యంగా విద్యకు భారీగా నిధులను కేటాయించే విప్రో ఛైర్మన్, ఇండియన్ బిలియనీర్ అజీమ్ ప్రేమ్జీ తన ఉదారతతో ప్రపంచ దాతలను సైతం ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, మహాదాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. సమాజానికి ప్రేమ్జీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమైనవని వ్యాఖ్యానించారు. సామాజిక వేదిక ట్విటర్ ద్వారా బిల్గేట్స్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. అజీమ్ ప్రేమ్జి తాజా వితరణ తనకు ఎంతో ఉత్సాహానిచ్చిందని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముఖ్యంగా సమాజానికి ప్రేమ్జీ అందిస్తున్న స్వచ్ఛంద సహకారం, దాతృత్వం, చూపిస్తున్న నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలకు ప్రేరణనిస్తుందని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కాగా విప్రోలోనితన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు కేటాయించినట్టు ఇటీవల అజీమ్ ప్రేమ్జీ ప్రకటించారు. రూ.52,700 కోట్లను అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కు అందించారు. దీంతో ప్రేమ్జీ అందించిన విరాళం విలువ మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం I’m inspired by Azim Premji’s continued commitment to philanthropy. His latest contribution will make a tremendous impact. https://t.co/IOTiHxtivw — Bill Gates (@BillGates) March 24, 2019