chicken
-
సరదాగా ఈ సండే చేప, చికెన్తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
'చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
చికెన్ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్ 65. దీనికున్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిత తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! ఇలానా దానికి ఆ పేరు వచ్చింది అని నోరెళ్లబెడతారు. మరీ ఆ గమ్మత్తైన కథేంటో చదివేయండి మరీ..గతేడాది ప్రముఖ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ వంటకాల జాబితా ఇచ్చింది. అందులో మన భారతదేశ వంటకం చికెన్ 65 మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతలా ఫేమస్ అయిన ఈ చికెన్ 65ని ఆ నెంబర్తో ఎందుకు పిలుస్తారనేది అతిపెద్ద డౌటు. అందుకు గల రీజన్ కూడా తెలియదు. అయితే చాలామంది 65 చికెన్ ముక్కలతో చేస్తారేమో లేక అన్ని రోజులు లేదా గంటలు ఈ చికెన్ని మ్యారినైట్ చేస్తారేమో అంటూ..పలు వాదనలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కారణం కాదట. అలా పిలిచేందుకు ఓ తమాషా కథ ఉంది. అదేంటంటే..చాలమంది దీన్ని స్నాక్ రూపంలో తింటారు. కొందరు నాన్స్, చపాతీలు, భోజనంగానూ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టేస్టీ చికెన్ 65 పేరు రావడానికి కారణం చెన్నైలోని బుహారీ రెస్టారెంట్ అట. అక్కడ మద్రాస్ మాజీ షెరీఫ్ ఎ ఎం బుహారీ కొలంబోలో పాకశాస్త్రంపై ఇష్టంతో దానికి సంబంధించిన హోటల్మేనేజ్మెంట్ చదువుని పూర్తి చేసుకుని భారత్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో రెస్టారెంట్ని ప్రారంభించాడు. నాటి బ్రిటిష్ వాళ్లకు భారతీయ ఆహారంతో కూడిన సరికొత్త భోజనాన్ని అందించింది ఆయనే. బుహరీ హోటల్ ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు విభిన్న రుచులను అందించాడు. నాటి రోజుల మెనూలో సుదీర్ఘ వెరైటీల జాబితా ఉన్న హోటల్గా ప్రసిద్ధి చెందింది ఈ హోటల్. ఆ నెంబర్తోనే ఎందుకంటే..అయితే మనకేది కావాలో ఆర్డర్ చేయడానికి ఒక సైనికుడు భాషా సమస్య కారణంగా ఆ మెనూలోని నెంబర్ ఆధారంగా ఆర్డర్ చేశాడంట. అతడు ఎప్పుడు 65 నెంబర్లో ఉన్న చికెన్ రెసిపీని ఇమ్మని చెప్పేవాడట. పైగా అది క్రంచీగా ఉండే చికెన్ అని చెప్పేవాడట. దీంతో మిగతా కస్టమర్లు కూడా అతడిలా ఆ నెంబర్లో ఉన్నచికెన్ని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. చెప్పాలంటే ఆ మెనూలో 65వ నెంబర్లో ఉన్న చికెన్ ఆర్డర్లే ఎక్కువగా ఉండేవి. అలా క్రమేపి అది కాస్త చికెన్ 65గా స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ రెసిపీకి చికెన్ 65 అని పేరొచ్చింది. కాలం గడిచేకొద్ది ఈ వంటకానికి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రెస్టారెంట్లలో నువ్వానేనా అనే రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ చికెన్ 65కి ఉన్న క్రేజ్ మరే రెసిపీకి లేదని చెప్పొచ్చు. ఈ వంటకం దొరికే ఫేమస్ రెస్టారెంట్లుచెన్నైలో ఈ వంటకానికి పేరుగాంచిన రెస్టారెంట్లు ఇవే..ఈ రోడ్ అమ్మన్ మెస్: ఇక్కడ చికెన్ 65 తోపాటు ఆంధ్రా చిల్లీ చికెన్ ఫేమస్. అయితే ఈ ఆంధ్రా చిల్లీ చికెన్ని పెద్దపెద్ద పచ్చి మిర్చితో వెల్లుల్లి మసాలతో డెకరేట్ చేసి ఉంటుంది. బుహారీ హోటల్: ఇక్కడ చికెన్78, చికెన్ 82, చికెన్ 90 అనే వంటి రకాల డిషెస్ కూడా ఫేమస్దక్షిణ్ రెస్టారెంట్: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటకాల మెనూ ఉంటుంది. అయితే ఓన్లీ రుచికరమైన చికెన్ 65 మాత్రమే ఉంటుంది. (చదవండి: కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..) -
ముక్క లేనిదే ముద్ద దిగదాయె..
అనంతపురంలోని పాతూరుకు చెందిన షణ్ముగ వయసు 15 ఏళ్లు. చికెన్ అంటే మహా ఇష్టం. ఒక్క రోజులోనే కేజీ చికెన్ ఫ్రైచేసి ఇచ్చినా తినేస్తానంటాడు. నెలలో 10 రోజులు చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు.గుంతకల్లుకు చెందిన రోషన్ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన్ వ్యాపారం చేస్తాడు. అయినా సరే రోషన్కు చికెన్ అంటే ప్రాణం. రోజూ రెండు ముక్కలైనా చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: యుక్తవయసు పిల్లలు శాకాహారం కన్నా మాంసాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ పిల్లలు చికెన్ అంటే మరీ లొట్టలేసుకుని తింటున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్, మటన్ తింటున్న వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల్లో 75.3 శాతం మంది చికెన్ తింటున్నారు. తర్వాతి స్థానం 51.6 శాతంతో మటన్ ఆక్రమించింది. దేశంలో మాంసాహార వినియోగంఏపీలో ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువేమీ కాదన్నట్టుంది. కూరగాయలు, పండ్లు తినడంలో వెనుకంజ ఉమ్మడి జిల్లాలో చిన్నారులు, కుర్రాళ్లు చికెన్, మటన్ను ఇష్టపడినట్టుగా కూరగాయలు, పండ్లపై మక్కువ చూపడం లేదు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని జిల్లాకు పేరున్నా ఇక్కడ పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. 2–4 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో విటమిన్–ఏతో కూడిన తిండి, కూరగాయలు తినడంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది. పండ్లు, కూరగాయలు తినడంలో కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపల లభ్యత బాగానే ఉన్నప్పటికీ చికెన్, మటన్తో పోలిస్తే తక్కువ వినియోగం ఉన్నట్టు తేలింది.మాంసాహారంపైనే మక్కువ|⇒ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది కుర్రాళ్లు మాంసాహారం తినడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే... ⇒ కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటినుంచే మాంసాహారంపై మక్కువ పెంచుకోవడం. ⇒ చికెన్ ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులో ఉండటం. ⇒ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కొనుగోలు స్థాయి పెరగడం. ⇒ మాంసాహారాన్ని సాధారణ మెనూగా భావించి వినియోగించడం. ⇒ యువతను ఎక్కువగా ఆకర్షించేలా విభిన్న రుచుల్లో మాంసాహార వంటకాలు ఉండటం. ⇒ మాంసాహార వినియోగం పెరుగుతున్న స్థాయిలో వ్యాయామం చేయడం లేదు. ⇒ వయసుకు మించి బరువు ఎక్కువగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఫైబర్ ఆహారం తినడం లేదు⇒ శరీరానికి అత్యవసరమయ్యే ఫైబర్ (పీచు)తో కూడిన ఆహారం కుర్రాళ్లకు రుచించడం లేదు. ⇒ చిక్కుడు, గోరు చిక్కుడు, బీన్స్ వంటి కూరగాయలను పట్టించుకోవడం లేదు. ⇒ చిరుధాన్యాలను దరిచేరనివ్వడం లేదు. ⇒ గోబీ మంచూరియా, పానీపూరీ, కట్లెట్ లాంటి అనారోగ్యకర ఆహారంపై మక్కువ. ⇒ పాలు, పాలపదార్థాలతో కూడిన ఆహారం కూడా తక్కువగా వినియోగిస్తున్నారు. ⇒ ఫ్రైడ్ ఆహారం తినడం వల్ల 30 ఏళ్లకే గ్యా్రస్టిక్, అల్సర్ సమస్యలతో సతమతం. -
గుడ్లు, చికెన్ తినేందుకు ఎగబడ్డారు
-
BirdFlu భయమేల చికెన్ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు!
బర్డ్ ఫ్లూ (Bird Flu)అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్, గుడ్ల వైపు చూడాలంటేనే వణికి పోతున్నారు. ఆందోళన అవసరం లేదు నిపుణులు చెబుతున్నప్పటకీ జనం చికెన్ తినడం మానేశారు. మరోవైపు పోషకాలు ఎలా అందోళన కూడామొదలైంది. అయితే కేవలం మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది ఈ నేపథ్యంలో చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు గురించి తెలుసుకుందాం.సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. చికెన్ ప్రత్యామ్నాయంగా ప్రొటీన్లతో కూడిన అత్యంత సాధారణమైనవి గింజలు. కూరల్లో సలాడ్లు , ఇతర వంటకాల్లో మంచి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని చాలా మంది చెఫ్లు శాకాహార వంటకాలను వండేటప్పుడు వాటిని చికెన్ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వీటిల్లో వేరుశనగ, జీడిపప్పు, బాదం, వాల్నట్స్, బఠానీ, రాజ్మా ఇలా చాలానే ఉన్నాయి.బాదం: ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదంపప్పులో ఉన్నాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.శనగలు: శనగలను పోషకాహార పవర్హౌస్ అని అంటారు. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.మాంసం మానేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.ఇదీ చదవండి: Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!వాల్ నట్స్ : వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది . ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.రాజ్ మా: పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ లభిస్తాయి. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తినిస్తుంది. 100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!జనపనార గింజలు(Hemp seeds) ఖనిజాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.మంచి కొవ్వులు, ఆహార ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్లు ,ప్రోటీన్లు. ఎడెస్టిన్ , అల్బుమిన్ వంటి అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగి ఉంటాయి, జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.వీటిని నానబెట్టుకొని తినవచ్చు. లేదా సలాడ్లలో, కూరల్లో వాడుకోవచ్చు. చక్కగా నేతిలో వేయించుకొని, ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్లాగా కూడా తినవచ్చు. -
గుంటూరులో ఉచితంగా చికెన్,గుడ్లు వంటకాల పంపిణీ... పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
ఉదయం 11కే మటన్ మాయం!
సాక్షి, హైదరాబాద్: ఆదివారం ఉదయం... 11.30 గంటల సమయం.. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన అరవింద్ మటన్ తీసుకురావడం కోసం బయల్దేరాడు.. తాను రెగ్యులర్గా వెళ్లే షాపు దగ్గరికి వెళ్లే సరికి మూసేసి ఉంది. దగ్గర్లోని మరో దుకాణానికి వెళితే బారెడంత క్యూ కనిపించింది. లేటవుతుందేమోనని మరో చోటికి వెళ్తే... మటన్ అయిపోయిందని చెప్పారు.దీనితో వెనక్కి వచ్చి క్యూలో నిలబడి అయినా తీసుకెళదామనుకుంటే... తన వంతు కూడా రాకముందే మటన్ అయిపోయిందంటూ దుకాణం కట్టేయడం మొదలుపెట్టారు.. అరవింద్ ఒక్కడికే కాదు, ఉప్పల్ ఒక్క ప్రాంతంలోనే కాదు.. ఆదివారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. చెంగిచర్ల, జియాగూడ వంటి మటన్ మండీల్లోనూ మధ్యాహా్ననికే స్టాక్ ఖాళీ అయిపోయింది. మరోవైపు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్లతో కోళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తలతో చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి. ధర విపరీతంగా పెరిగినా.. ఇటీవలి కాలంలో మటన్ ధరలు కిలో రూ.800 నుంచి రూ.900 వరకు చేరాయి. అలాంటిది డిమాండ్ పెరిగిపోవడంతో.. ఆదివారం చాలా చోట్ల కిలో రూ.1,000 నుంచి రూ.1,100 వరకు ధరతో విక్రయించారు. అయినా సరే మటన్ షాపుల వద్ద జనం కిటకిటలాడారు. కిలో తీసుకునే చోట అరకిలో, అరకిలో తీసుకునే చోట పావుకిలోనో, 400 గ్రాములో కొనుక్కుని వెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో.. సాధారణంగా మహారాష్ట్ర, రాజస్తాన్తోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు మేకలు, గొర్రెలు దిగుమతి అవుతాయి. అయితే బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల ప్రభావం నేపథ్యంలో ఈ దిగుమతులు తగ్గిపోయాయి. వైరస్లు ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దన్న ఉద్దేశంతో మేకలు, గొర్రెల రవాణాను నియంత్రిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అరకొరగా గొర్రెలు, మేకలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో.. ధరలు పెరిగాయని మీరాలం మండిలోని మక్బూల్, జియాగూడ మండిలో మేకల వ్యాపారి రమేశ్ తెలిపారు.చికెన్కు తగ్గిన డిమాండ్బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్లతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయన్న వార్తలతో చికెన్కు డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి ఆదివారం కిటకిటలాడే చికెన్ సెంటర్లు... ఈ ఆదివారం వెలవెలబోయాయి. వైరస్ భయం కారణంగా ఎందుకైనా మంచిదంటూ.. చికెన్కు బదులు మటన్ తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. నిజానికి చికెన్ను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణో గ్రత వద్ద బాగా ఉడికించి తింటే ఎటువంటి హానీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
చికెన్ను వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు
సాక్షి, అమరావతి: సహజంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు అందుబాటు ధరలో ఉండే చికెన్ (Chicken) కోసం షాపుల ముందు క్యూ కడతారు. కాస్త ఆలస్యమైనా వేచి చూస్తుంటారు. కానీ ఈ ఆదివారం ‘ముక్క’ లెక్క మారింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వదిలేసిన జనం మటన్ (Mutton), చేపల వైపు మొగ్గు చూపారు. దుకాణాల ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. రాత్రి అవుతున్నా అదే కోలాహలం నెలకొంది. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. కొద్ది వారాలుగా బర్డ్ఫ్లూ (Bird Flu) విస్తరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కూటమి సర్కారు.. మటన్, చేపల ధరల నియంత్రణను సైతం గాలికి వదిలేసింది. రెడ్జోన్లుగా ప్రకటించడంతో..కోళ్లకు సోకిన బర్డ్ఫ్లూ వ్యాధి ప్రభావం మాంసం విక్రయాలపై భారీగా పడింది. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ బయటపడటంతో అక్కడ కోళ్లను, కోడి గుడ్లను తినవద్దని హెచ్చరించిన అధికారులు ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చికెన్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం రూ.220 పలికిన కిలో చికెన్ రూ.180కి పడిపోయింది. ఆదివారం కిలో చికెన్ రూ.150 నుంచి రూ.100కి అమ్మినా కొనేవారు కరువయ్యారు.ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కోసం మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. మటన్, చేపల విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఆదివారం తెల్లవారగానే మాంసం ప్రియులు చేపలు, మటన్ మార్కెట్లకు పరుగులు దీశారు. అప్పటికే అక్కడ రద్దీగా ఉండటాన్ని చూసి ఉసూరుమన్నారు. మాంసం అమ్మకాలు ఉదయమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ ఆదివారం రాత్రి 9 గంటలైనా పొట్టేళ్లను కోశామని వ్యాపారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కోళ్ల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఇష్టానుసారం ధరలు..కోళ్లను తినకూడదనే హెచ్చరికలతో చేపలు, మటన్ ధరలు అమాంతం ఎగబాకాయి. సాధారణంగా కిలో మటన్ రూ.800 – రూ.900 వరకు ఉండగా డిమాండ్ కారణంగా రూ.1,000 నుంచి రూ.1,100 వరకు పెరిగింది. కొందరు వ్యాపారులు మాత్రం రెట్టింపు అమ్మకాలు జరుగుతుండటంతో కేజీ మటన్ రూ.900కి ఇస్తున్నారు. కిలో చేపలు రాగండి రకం రూ.160 నుంచి రూ.180కి పెరిగాయి. బొచ్చెలు రూ.180 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. కొరమీను కేజీ రూ.650 నుంచి రూ.1,000 వరకూ పలుకుతోంది. రొయ్యలు, పీతలకు సైతం డిమాండ్ ఏర్పడింది. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.700 వరకూ, పీతలు కేజీ రూ.400 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. రకాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. అనకాపల్లిలో కేజీ మటన్ సాధారణంగా రూ.800–900 ఉండగా ఈ ఆదివారం రూ.1,000 వరకు పలికింది. కూరగాయల రేట్లు సైతం..హోటల్కి వెళితే చికెన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్స్ను ఇష్టపడే వారంతా ఇప్పుడు మటన్తో పాటు చేపలు, పీతలు, రొయ్యల వంటకాలను అడుగుతున్నారు. వీధుల్లో బండ్ల మీద చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్స్, కబాబ్స్, ఫ్రైడ్ చికెన్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, షవర్మా లాంటి చికెన్ వంటకాల వ్యాపారాలన్నీ పడిపోయాయి. కర్రీ పాయింట్లు, మెస్లలో సైతం చికెన్ వంటకాల విక్రయాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లల్లో మెనూలో మార్పులు చేశారు. మాంసం పెట్టాల్సిన రోజు కూడా కాయగూరలతో వండినవే పెడుతున్నారు.దీంతో కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాలుగా బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతుండటంతో చికెన్కు దూరమైన వినియోగదారులు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతారని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బర్డ్ ఫ్లూను రాష్ట్రవ్యాప్తం చేసి కళ్లు మూసుకుని కూర్చుందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేశాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్లం. ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది. రాత్రి అయినా ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. – సురేష్, మాంసం వ్యాపారి, బల్లెంవారి వీధి, విజయవాడచికెన్ తిందామంటే బర్డ్ఫ్లూ వచ్చిందని వద్దంటున్నారు. పోనీ చేపలుగానీ మటన్గానీ కొందామంటే వాటి రేట్లు అమాంతం పెంచేశారు. దుకాణాల వద్ద జనం భారీగా ఉంటున్నారు. చాలాసేపు వేచి ఉంటేగానీ మటన్ దొరకలేదు. ఒక్కో దుకాణంలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. – సూర్యారావు, వందడుగుల రోడ్డు, విజయవాడ. -
కోళ్ల అందాల పోటీలు..!
కోడి పందేల్లోనే కాదు, అందాల పోటీల్లోనూ తగ్గేదేలే అంటున్నాయి కోళ్లు. కోళ్లకు అందాల పోటీలేంటని ఆశ్చర్యపోకండి, అందం ఎవరి సొంతం కాదని, కోడి పందేల మాదిరే, ఇరాక్లోని కుర్దిస్తాన్ జిల్లా, సులేమానిలో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల కోళ్లకు అందాల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో, దాదాపు వందకుపైగా కోళ్లు పోటీ పడగా, ఇరాక్కు చెందిన గరీబ్ మహమ్మద్ పెంచుకున్న కోడి, 96 పాయింట్లతో విజయం సాధించింది. కోడి శరీర పరిమాణం, రంగు, జాతి, ఈకల నాణ్యత, శరీర అకృతి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, పోటీ న్యాయనిర్ణేతలు దీనికి ఈ పాయింట్లను ఇచ్చారు. ఇక ఈ విషయమై మహమ్మద్ మాట్లాడుతూ ‘నేను నా రెండు కోళ్లను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే పెంచాను. వాటి ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే, నా పిల్లల కంటే నా కోడినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను’ అని చెప్పాడు. (చదవండి: సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్లుగా..) -
Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి
-
రెండు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ భయం
-
Bird Flu Scare: అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని నిర్వాహకులకు సూచిస్తూనే.. సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు భారీ పడిపోయాయి. ఇదే సమయంలో చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి. మరోవైపు.. ఏపీ నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధకశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్లో 040-23314876 నంబర్ కాల్ చేయాలని సూచించారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే ఈ హెల్ప్ లైన్లకు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశువైద్యాధికారులకు తెలిపారు. ఇక, బర్డ్ ప్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో భారీ నష్టాలు వచ్చాయని ఆవేదన చెందుతున్నారు. చెక్పోస్టులు ఇలా.. ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్ వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుంచి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కి పంపినట్టు కోదాడ మండల పశువైద్యాధికారి మధు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ–ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.వెంకటనారాయణ, వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కందకుర్తిచెక్ పోస్టుల వద్ద పశుసంవర్థక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్లోకి కోళ్లతో పాటు ఏ జీవాలను కూడా రవాణా చేయకుండా నిరోధిస్తున్నారు. -
ముక్క ముట్టాలంటే భయం!
తిరుపతి తుడా: ముక్క ముట్టాలంటే జిల్లా వాసులు భయపడిపోతున్నారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూగా(Bird flu) నిర్ధారణ కావడంతో ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. ముక్క ముట్టెందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. పడిపోయిన చికెన్ విక్రయాలు జిల్లాలో లేయర్ 45 లక్షలు, బ్రాయిలర్ 53.25 లక్షలు, లింగాపురం 1.10 లక్షల కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 60 శాతం మేర జిల్లాకు సరఫరా అవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి చికెన్ విక్రయాలు 50 శాతానికి పైగా పడిపోయాయి. తిరుపతి లీలామహల్ కూడలిలోని ఓ చికెన్ దుకాణంలో రోజుకు 200 కిలోల చికెన్ విక్రయించేవారు. అయితే రెండు రోజులుగా 100 కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని దుకాణదారుడు వాపోయా డు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కోడి రూ.50 లెక్కన, మరికొన్ని ప్రాంతాల్లో కిలో రూ.140కే విక్రయిస్తున్నారు. అమ్మకాలు తగ్గాయి గడిచిన మూడు రోజులుగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజున మరింతగా విక్రయాలు తగ్గడం వాస్తవమే. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు రోజులుగా చికెన్ దుకాణాలు వేలవేలబోతున్నాయి. ఈ వైరస్ ఎఫెక్ట్ మనకు లేకపోయినా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. – కృష్ణమూర్తి, గోవర్ధన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు, తిరుపతి ఎలాంటి భయాందోళన వద్దు బర్డ్ ఫ్లూ వైరస్ మన ప్రాంతంలో ఎక్కడా లేదు. ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. పశు సంవర్థక శాఖ ఇప్పటికే దీనిపై పలు ఆదేశాలు జారీచేసింది. వలస పక్షుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైందని నిర్ధారించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో దీని ప్రభావం ఉంది. రాష్ట్రంలో మరెక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు. ఈ వైరస్ గురించి ఆలోచన చేయడం అనవసరం. చికెన్ బాగా ఉడకబెట్టి తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ నాగేంద్ర రెడ్డి , వెటర్నరీ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ -
వణికిస్తున్న బర్డ్ఫ్లూ.. చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు
సాక్షి,పశ్చిమగోదావరి : గోదావరి జిల్లాలను బర్డ్ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా విధించారు.ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, బర్డ్ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసింది. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది. -
Bird Flu : చికెన్ తినకండి
-
ఏపీలో బర్డ్ ఫ్లూ
సాక్షి, అమరావతి/పెరవలి: ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్లో ఎవియాన్ ఇన్ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్కు అందించారు.వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు..ఉభయగోదావరి జిల్లాల్లో రెండు గ్రామాల్లో బర్డ్› ఫ్లూ నిర్ధారణ అయిన మాట వాస్తవమే. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పూర్తిగా అదుపులోనే ఉంది. 90 శాతం సమస్య పరిష్కారమైంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ఈ వైరస్ వ్యాపించినట్టుగా నిర్ధారణ కాలేదు. ఉడికించిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. – డాక్టర్ టి.దామోదర్నాయుడు, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖరెడ్జోన్స్, సరై్వలెన్స్ జోన్ల ప్రకటన వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్జోన్, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సరై్వలెన్స్ జోన్గా ప్రకటించారు. 144, 133 సెక్షన్లను అమలు చేస్తున్నారు. సర్వైలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లోని కోళ్లు, పశువులు, ఇతర జీవాలతో పాటు మనుషుల రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు. కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్లలోని కోళ్లు, కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలిచ్చారు. వైరస్ గుర్తించిన గ్రామాలున్న మండలాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు బర్డ్ఫ్లూని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోళ్ల రైతులతో ఆయా జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, మొన్నటి వరకు కిలో రూ.250 నుంచి రూ.280 వరకు పలికిన కోడి మాంసం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.150కు మించి పలకడం లేదు. ఫామ్ గేట్ వద్ద రూ.6.25 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.4.25కు పడిపోయింది. -
కోళ్లకు అంతు చిక్కని వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!
సాక్షి,హైదరాబాద్ : ముక్క ముట్టందే ముద్ద దిగడం లేదా? అయితే తస్మాత్ జాగ్రత్త. అంతుచిక్కని వైరస్తో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కోళ్లకు అంతు చిక్కని వైరస్ ప్రభలింది. ఫలితంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. కోళ్లకు సోకుతున్న అంతుచిక్కిన వైరస్ పట్ల అప్రత్తంగా ఉండాలని రాష్ట్రాల్ని అలెర్ట్ చేసింది.ఈ తరుణంలో కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పశు సంవర్థక శాఖ అప్రమత్తమైంది. పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్ళను దూరంగా పూడ్చిపెట్టలని సూచించింది. వైరస్ సోకిన కోళ్ళ తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో ఆదివారం అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే తిర్మలాపూర్, బీర్కూర్ మండలంలోని చించోలి, కిస్టాపూర్ ఫారాల్లో 6వేలకు పైగా బాయిలర్ కోళ్లు మృతి చెందడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇక్కడ చికెన్ చీప్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్ రేట్ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్ రేట్ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు. ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.గురువారం పేపర్ ధర ప్రకారం స్కిన్తో చికెన్ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్లెస్ చికెన్ కిలో పేపర్ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్ బర్డ్ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది. టన్నుల కొద్దీ అమ్మకాలు.. కామారెడ్డి మార్కెట్లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్సేల్గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్ లభిస్తోంది. రెగ్యులర్గా చికెన్ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు.. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్ ధరకే చికెన్ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్ తీసుకుని వెళుతుంటారు. -
Kanuma special recipe : చిట్టి గారెలు, నాటు కోడి పులుసు, డెడ్లీ కాంబినేషన్
సంక్రాంతి పండగ అంటేనే పిండివంటలు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అరిశెలులు, సున్నుండలు, సకినాలు, పొంగడాలు, జంతికలు, తీపి బూంది ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కో రకం. కానీ కనుమ రోజు అయితే మాంసాహార ప్రియులకు పండగే. మరీ ముఖ్యంగా గారెలు, నాటుకోడి పులుసు మరింత ప్రత్యేకం. మరి క్రిస్పీగా గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం!ప్రాంతం ఏదైనా, పండగ ఏదైనా మినపగారెలు , నాటు కోడి కాంబినేషన్ చాలా ఫ్యామస్. ఈ రెండింటి కాంబినేషన్ రుచితోపాటు, ప్రోటీన్లను కూడా అధికంగా అందిస్తాయి. తయారీముందుగా 2 కప్పుల మినపప్పు, కొంచెం బియ్యం వేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానెబట్టుకోవాలి. ఇందులో ఇనుప గరిటె, లేదా అట్ల కాడ వేస్తే తొందరగా నానుతుందని చెబుతారు. పొట్టు పప్పుఅయితే పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. దీన్ని మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి(రుబ్బుకుంటే ఇంకా బావుంటుంది). ఇందులో పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. గారెలు వేసే ముందు నీటితో చేతులను తడి చేసుకుని, అరిటాకుపై చక్కగా గుండ్రంగా అద్దుకోవాలి,మధ్యలో మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత మీడియం మంటపై గారెలను రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది. నాటుకోడి పులుసు తయారీముందుగా నాటు కోడి(మరీ ముదురు కాకుండాస్త్ర మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,ఎండుమిర్చి, లవంగాలు,యాలకులు, వెల్లుల్లి, జాజికాయ ,స్పూన్ ధనియాలను నూనెలేకుండా మూకుడులో దోరగా వేయించుకిన పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు,ఎండు కొబ్బరి , గసగసాలు,సారపప్పు జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.కుక్కర్లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని యించుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇపుడు ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ పెరుగు వేసి, సన్న మంట మీద మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక, మ్యారినేట్ చేసుకున్ననాటుకోడి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాతమసాలా పేస్ట్, కొద్దిగా కారం,ఉప్పు కూడావేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి..అనంతరం కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. మూత వచ్చాక,ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఉంటే మరికొద్దిసేపు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాటే, టేస్టీ టేస్టీ నాటుకోటి పులుసురెడీ. ఈ నాటుకోడి పులుసుతో లేదా చికెన్ కూరతో వేడి వేడి గారెలను నంజుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.ఇదీ కూడా చదవండి: Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా? -
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్గఢ్లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్గా చికెన్ 65..!
ప్రపంచంలోనే బెస్ట్ వంటకాలు, స్వీట్ల జాబితాను విడుదల చేసి వరల్డ్ టేస్ట్ అట్లాస్ తాజాగా బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఫ్రైడ్ చికెన్ని తయారుచేస్తారు. అయితే ఆ జాబితాలో మన భారతీయ వంటకం చికెన్65 టాప్ 10లో చోటు దక్కించుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ వంటకం మూడో స్థానంలో నిలిచింది. దీన్ని అల్లం, నిమ్మకాయ, ఎర్రమిరపకాయల కారం, మసాలా దినుసులతో మెరినేట్ చేసి.. డీప్ ఫ్రై చేస్తారు. భారత్లో ఈ రెసిపీ బాగా ఫేమస్.ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ చికెన్ 65 మూలం తమిళనాడుగా చెబుతుంటారు. అయితే చికెన్ 65 ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం తొలిసారి కాదు. గతేడాది ఆగస్టు 2023లో ఇదే థీమ్పై టేస్ట్ అట్లాస్ జాబితాను విడుదల చేసినప్పుడు చికెన్65 పదో స్థానంలో నిలిచింది. కాగా, టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ప్రస్తుత జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ (చికిన్) అగ్రస్థానంలో ఉండగా, జపాన్కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన అయామ్ గోరెంగ్ ఇప్పుడు 5వ స్థానానికి పరిమితమయ్యింది. ఇవేగాక వీటితోపాటు ఈ జాబితాలో చైనీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ (జాజీజీ), తైవానీస్ పాప్కార్న్ చికెన్, ఇండోనేషియా అయామ్ పెనియెట్ తదితరాలు టాప్10లో చోటు దక్కించుకున్నాయి.(చదవండి: వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!) -
నోరూరించే కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!
ప్రస్తుతం యువతరం చాలా ఇష్టంగా లాగించే చికెన్ వెరైటీలో కేఎఫ్సీ ఒకటి. చాలామందికి ఈ కేఎఫ్సీ చికెన్ అంటే మహా ఇష్టం. ఫ్రైడ్ చికెన్లో ఇంతలా ప్రత్యేకతను సంతరించుకునేలా విభిన్నంగా ఎలా తయారు చేయాగలిగారో వింటే ఆశ్చర్యపోతారు. అందులోనూ లేటు వయసులో తన ఆర్థిక భద్రత గురించి కలిగిన ఆందోళన బిజినెస్ మెదలుపెట్టాలన్న ఆలోచనకు దారితీసింది. అదే చివరికి వెరైటీ రెసిపీని తయారు చేసేందుకు పురిగొల్పింది. చివరకు కనివిని ఎరుగని రీతీలో సక్సెస్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. కలను సాకారం చేసుకోవాలన్న తపన ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు.అతడే కేఎఫ్సీ చికెన్ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. అందరూ యంగ్ ఏజ్లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కొందరూ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వగా మరికొందరూ..చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకుంటారు. చివరికి రిటైర్డ్ వయసు వచ్చేటప్పటికీ ఎంతోకొంత ఆర్థిక భద్రతతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే కల్నల్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే ఎన్నో బిజినెస్లు చేశాడుగానీ ఎందులోనూ మంచి విజయం దక్కించుకోలేదు. అలా 65 ఏళ్లు వచ్చేటప్పటికీ అతడు ఎందులోనూ సక్సెస్ అందుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. పోనీ మిగతా జీవితం సాఫీగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక భద్రతను వెనకేసుకోలేదు. అతడి వద్ద కేవలం రూ. 8వేల రూపాయలే ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటీ జీవితం ఇలా వృధాగా అయిపోయిందన్న బాధ కల్నల్ని నిలువనివ్వలేదు. ఆ సమయంలోనే తాను ఒక రుచకరమైన రెసిపీని తయారు చేయాలని గట్టిగా అనుకున్నాడు. తాను తయారు చేసే రెసిపీని చూడగానే తానే గుర్తొచ్చేలా.. అత్యద్భుతంగా తయారు చేయాలనుకున్నాడు. తన వద్ద కొద్దిపాటి వనరులతో చికెన్తో వెరైటీ రెసిపీ ఏదైనా చేయాలనుకున్నాడు. చెప్పాలంటే రెస్ట్ తీసుకునే వయసులో లక్ష్యం కోసం ఆహర్నిశలు కష్టపడటం మొదలుపెట్టాడు కల్నల్. ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టమనే విషయం గ్రహించాడు. దానిలోనే ప్రత్యేక రుచితో కూడిన వెరైటీ ఫ్రైడ్ చికెన్ చేయాలనుకున్నాడు. అక్కడకు వరకు బాగానే ఉంది. తాను తయారు చేసిన ఫ్రైడ్ చికెన్లు సమీపంలోని రెస్టారెంట్ల వద్దకు వెళ్లి చేసి చూపించి వాళ్ల చేత శెభాష్ అనిపించుకోవడం అంత ఈజీ కాలేదు కల్నల్కి. ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది సార్లుకు పైగా అతడు చేసిన రెసిపీ రిజక్ట్ అయ్యింది. విసుగు, కోపం వచ్చేస్తున్నా.. వెనకడుగు వేయకుండా వారి చేత బాగుంది అని ఒప్పుకునేదాక ప్రయత్నం విరమించలేదు. ఒక రోజు మజ్జిగలో నానబెట్టిన చికెన్ని బ్రెడ్ పౌడర్లో దొల్లించి తాను రెడీ చేసి పెట్టుకున్న మసాల మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసి ఇవ్వగా ఒక రెస్టారెంట్ ఆ టేస్ట్కి ఫిదా అయిపోయింది. ఇక అంతే కొద్ది కాలంలో కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయింది. దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో కేఎప్సీగా జనాల్లోకి తీసుకురావడం, ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడం చకచక జరిగిపోయాయి. అలా 1964 నాటికి అతడి బ్రాండ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ దేశవ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది. అదే సంవత్సరం తన బ్రాండ్ని సుమారు రూ. 16 కోట్లుకు విక్రయించాడు(ప్రస్తుత రోజుల్లో రూ. 144 కోట్లకు సమానం). అయితే అతనే ఆ బ్రాండ్కి అంబాసిడర్, ప్రతినిధి. దీంతో కల్నల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని వ్యక్తి కోటీశ్వరుగా మారిపోయాడు. చాలా లేటు వయసులో లక్ష్యం కోసం యత్నంచి అతిపెద్ద సక్సెస్ని అందుకుని.. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.(చదవండి: 77 ఏళ్ల నాటి కేకు ముక్క..! వేలంలో ఏకంగా..) -
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
చికెన్ రైస్ తిన్న అథ్లెట్ మృతి!
అన్నానగర్: చైన్నెలో ‘చికెన్ రైస్’ తిన్న అథ్లెట్ విషాదకరంగా మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరులోని సుకునాపురానికి చెందిన రాబిన్ డెన్నిస్(40) కుమార్తె ఎలీనా లారెట్(15) బాస్కెట్బాల్ క్రీడాకారిణి. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 8 నుంచి 15వ తేదీ వరకు అంతర్ పాఠశాలల బాస్కెట్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆడేందుకు ఎలీనా లారెట్ తన తోటి విద్యార్థులతో కలిసి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లింది. పోటీ ముగించుకుని గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ రైలులో సోమవారం చైన్నెకి వచ్చారు. రైలు ప్రయాణంలో తినేందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసి చికెన్ రైస్ కొనుగోలు చేసింది. విద్యార్థిని ఎలీనా లారెట్ తోటి విద్యార్థులతో కలిసి రైలులో చికెన్ రైస్, బర్గర్లు తిన్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కడుపునొప్పితో వాంతులు, స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని ఎలీనా లారెట్ చైన్నెలోని అన్నానగర్లో ఉన్న తన బంధువు డేవిడ్ విలియమ్స్కు చెప్పింది. రైలు చైన్నె చేరుకోగానే ఎలీనాను చికిత్స నిమిత్తం అన్నానగర్ 4వ అవెన్యూలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఎలీనా పెరవళ్లూరులోని మరో బంధువుల ఇంటికి వెళ్లింది.అక్కడికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఎలీనాకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బంధువులు ఆమెని పెరవళ్లూరులోని పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎలీనాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పెరవళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెరవళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ రైస్ తిని విద్యార్థిని మృతి చెందిందా? లేక ఆమె మరణానికి మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు. ‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోడి కాదిది.. హోటల్
ఇదేదో రాక్షస కోడి అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఆ ఆకారంలో ఉన్న హోటల్. కోడి ఆకృతిలోని హోటళ్లలో ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇది ఫిలిప్పీన్స్లో కంపుస్టోహన్లోని హైలాండ్ రిసార్ట్లో ఉంది. 115 అడుగుల ఎత్తు, 92 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పున్న ఈ హోటల్లో సకల సదుపాయాలతో కూడిన 15 గదులున్నాయి. ఈ నిర్మాణం తన భార్య ఆలోచనంటూ రిసార్టు యజమాని మురిసిపోతున్నాడు. ఫిలిప్పీన్స్ తుఫాన్లకు, వరదలకు పెట్టింది పేరు. వాటన్నింటినీ తట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఈ నిర్మాణాన్ని కేవలం ఆర్నెల్లలో పూర్తి చేశారట! -
మాదాపూర్: చికెన్ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.మాదాపూర్లోని ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఓ కస్టమర్ ఆర్డర్ తెప్పించుకున్నారు. పార్శిల్ ఓపెన్ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న కస్టమర్ అనిరుధ్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
తల్లిపై కన్నేసి.. చిన్నారిని చంపి...
సుభాష్నగర్: బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడిన కేసులో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ పాటగూడకు చెందిన సుమ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో సహా నగరానికి వలస వచ్చి స్థానిక జీవన్ జ్యోతినగర్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అదే జిల్లాకు చెందిన తిరుపతి కూడా జీవన్ జ్యోతినగర్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ప్రభాకర్తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ప్రభాకర్ ఇంటికి వచ్చే తిరుపతి అతడితో కలిసి మద్యం తాగుతూ, పిల్లలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో సుమపై కన్నేసిన తిరుపతి, ఇద్దరు పిల్లలతో పాటు ప్రభాకర్ను అంతమందించి ఆమెను లోబర్చుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 12న మధ్యాహ్నం సుమ పెద్ద కూతురు జోత్స్నను (7) హత్య చేసేందుకు బయటికి తీసుకెళ్లిన తిరుపతి అవకాశం దొరక్క ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ సాయంత్రం చిన్నారిని తీసుకెళ్లిన అతను బాసరగడి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, గోనె సంచీలో మూట కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమీ తెలియనట్లు ప్రభాకర్తో కలిసి జ్యోత్స్న ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించగా తిరుపతి సదరు బాలికను తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకిస్తూ బాలికను హత్య చేసిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందికి రివార్డు అందజేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
షవర్మ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యా...
రసూల్పురా: కార్ఖానా పీఎస్ పరిధిలోని ఓ రెస్టారెంట్లో షవర్మ తిని అస్వస్థతకు గురైనట్లు సీసీఎస్ సీఐ వంశీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న రాత్రి సీఐ వంశీతో పాటు అతని డ్రైవర్ రెస్టారెంట్లో షవర్మ తిన్నారు. మర్నాడు ఆస్వస్థతకు గురైన సీఐ తాను షవర్మ కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అదే రోజు స్విగ్గి, జొమాటో ద్వారా షవర్మ ఆర్డరు చేసినవారిలో ఎవరూ అస్వస్థతకు గురి కాలేదని తేలింది. దీంతో పోలీసులు ఫుడ్సెఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్సేఫ్టీ విభాగం అధికారులు ఇప్పటివరకు సదరు రెస్టారెంట్లో షవర్మ శాంపిల్ సేకరించేందుకు రాలేదని పోలీసులు తెలిపారు. -
అనంతపురం: టీడీపీ నేతల బరితెగింపు.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. కప్పం కట్టాలంటూ కోళ్ల వ్యాపారిని బెదిరిస్తూ.. యథేచ్ఛగా బరితెగించారు. తెలంగాణ కేంద్రంగా కోళ్ల వ్యాపారం చేస్తున్న స్నేహ కంపెనీపై టీడీపీ నేత గణేష్ నాయుడు బెదిరింపులకు దిగారు. బెదిరింపులకు దిగారు. తనతో సెటిల్ చేసుకోకపోతే అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కోళ్ల క్రయవిక్రయాలు జరగనివ్వనంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్రతూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు.పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు.టీడీపీ నాయకులు స్టే ఆర్డర్ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
చికెన్, ఫిష్ కబాబ్స్ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం!
రెస్టారెంట్లలోనూ, హోటల్స్లోనూ ఆహారం ఆకర్షణీయంగా ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. మనం కూడా అలా కనిపిస్తే ఆవురావురామంటూ తినేస్తాం. కానీ దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వాటిపై నిషేధం విధించారు అధికారులు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ఏడేళ్లు దాక జైలు శిక్ష పడుతుందట. ఈ నిషేధం ఎక్కడంటే..శాకాహారం దగ్గర నుంచి నాన్వెజ్లలో చికెన్, ఫిష్ కబాబ్స్లపై కృత్రిమ రంగులు వాడుతుంటారు. తినేవాడికి నోరూరించేలా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా కబాబ్స్ల వంటి వాటికి ఎక్కువగా కృత్రిమ రంగులు వినయోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్ణాట ప్రభుత్వం సోమవారం ఈ నిషేధం విధించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని చెబుతోంది. ఈ విషయమై కర్ణాటక ఆహార భద్రత ప్రమాణాల విభాగానికి వివిధ ఫిర్యాదులు అందాయి. దీంతో కృత్రిమ రంగులను ఉపయోగించే 39 తినుబండరాల నమునాలను పరీక్షించగా వాటిలో సుమారు ఎనిమిది కృత్రిమ రంగుల ఉపయోగిస్తున్నారని,అవి సురక్షితం కాదని తేలింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు కృత్రిమ రంగులను ఉపయోగించే తినుబండారాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించడమే గాక ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రేతలపై పది లక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్షతో సహా పలు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: 90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..) -
చికెన్ పాయా ఇవ్వనందుకే హతమార్చా
రాయదుర్గం: ‘చికెన్ పాయా (చారు), మద్యం కొనుగోలుకు డబ్బు అడిగా... ఇవ్వలేదు. దీంతో హత్య చేశాను’ అంటూ తాను చేసిన నేరాన్ని పోలీసుల సమక్షంలో నిందితుడు అంగీకరించాడు. రాయదుర్గం పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రూరల్ సీఐ ప్రసాద్బాబు, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డితో కలసి డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం మురుడప్ప హత్యకు గురైన విషయం తెలిసిందే. హతుడి చిన్నమ్మ హరిజన పెన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని గుర్తించి, సోమవారం సాయంత్రం 5 గంటలకు కల్యం బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వాస్తవాలను నిందితుడు బహిర్గతం చేశాడు. అనాథగా ఉంటున్న మురడప్ప చుట్టుపక్కల ఇళ్లతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్గా పనిచేస్తుండేవాడు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణం నిర్వాహకుడి వద్ద కోడి కాళ్లను ఉచితంగా తీసుకున్నాడు.ఆలయానికి దూరంగా ఉండే వంకలో సొంతంగా చికెన్ రసం (పాయా) వండుకుని భోజనం చేస్తుండగా అక్కడికి యేసురాజు చేరుకున్నాడు. చికెన్ చారుతో పాటు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని యేసురాజు అడగడంతో మురడప్ప నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో చేతికి అందిన రాయి తీసుకుని మురడప్ప తలపై యేసురాజు మోది హతమార్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ప్రత్యేకంగా అభినందించారు. -
చికెన్ తిని యువకుడి మృతి
తిరువళ్లూరు: వెయిట్ లిఫ్టింగ్పై ఆసక్తితో తరచూ చికెన్ తిన్న యువకుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తొయుదావూర్ గ్రామానికి చెందిన తులక్కానం కుమారుడు విఘ్నేష్(28). ఇతను వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. శరీర ఆకృతిని పెంచడానికి కోడిగుడ్లు, కోడిమాంసం మాత్రమే గత ఆరు నెలల నుంచి తీసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో గత 16న అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యం అందించారు. ఆరోగ్యం కొంత కుదుటపడడంతో శనివారం ఇంటికి వెళ్లాడు. అనంతరం సమీపంలోని చర్చికి వెళ్లి ప్రార్థన నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అరక్కోణంలోని సీఎంసీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
ఇంటింటికీ చికెన్ పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
-
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
యూఎస్లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకారం..బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
కారులో చికెన్ ఫ్రై రెసిపీ..ఎలాగంటే..?
వెళ్తున్న కారులోనే వంటకాలు చేసి ఔరా! అనిపిస్తున్నారు. యూట్యూబ్ రీల్ కోసం అనో చాలామంది ఇలా కారులోనే వంటకాలు చేసిన వీడియోలు చూశాం. కానీ వాటిలో అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చు కుదరదు అనుకునే వాళ్లం కదా!. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఈజీగా కారులో కూడా వంట చేసేయొచ్చేని అంటారు. ఇంతకీ ఎలా కారులో వండేస్తున్నారంటే.. ఆ వీడియోలో ఒక మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో మసాల దినుసులు, పెరుగు అని కలిపి ఉంచుతుంది. దానిలో చికెన్ కబాబ్ ముక్కలు అన్ని వేసి కాసేపు అలా ఉంచుతుంది. ఆ తర్వాత మరో కవర్ కార్న్ఫోర్ తీసుకుంటుంది. ఇప్పుడు మసాలాలో నాన్చిన చికెన్ముక్కలను ఈ కార్న్ఫోర్ కవర్లో దొర్లించి ఓ ప్లేట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కాసేపు అలా ఉంచుతుంది. అది వేడిక్కెంది అని నిర్థారించుకున్నాక ఈ కార్న్ఫోర్ అద్దిన చికెన్ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకుని లాంగించేస్తుంది. అబ్బా ఇంత ఈజీనా కారులో వంటలు చేయడం అనిపిస్తుంది ఆ మహిళ చేసిన విధానం చూస్తే. కానీ ఎలాగైన కిచెన్.. కిచెనే! ఎందుకంటే కారులో వంట చేయాలంటే కావాల్సిన పదార్థాల తోపాటు అన్ని క్లీన్ చేసుకుని ముందుగా రెడీ చేస్తేనే చేయడం ఈజీ. ఇంతలా ముందుగా హైరాన పడి రెడీ చేసుకోవడం కంటే వంటగదిలో హాయిగా టెన్షన్ పడకుండా చేసుకుంటే బెటర్ కదా..! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sophie Saldana (@sophiesophss) (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ఖమ్మం: చికెన్కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి పడిపోయింది.. ప్రస్తుతం చికెన్కు ఉన్న డిమాండ్కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లతో.. ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో చికెన్కు బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్ పండుగ ఉండటంతో చికెన్కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది. ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్గా స్కిన్లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్స్కిన్ రూ.280 గా, లైవ్కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి లేకనే.. కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం చికెన్ ధర ప్రియం చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది. – శీలం కార్తీక్, నాయుడుపేట, ఖమ్మం -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్పూర్ బ్లాక్కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్నాథ్, సోనాలి, ఎఫ్ఎఫ్జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!
ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. ఎలా చేశాడంటే..? సాధారణంగా చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్ని మేరినేషన్ చేసి పేపర్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్ బ్యాగ్ని పిన్చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్ పేపర్ బ్యాగ్ చికెన్ని అలానే తింటేనే ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Trevor James (@thefoodranger) (చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!) -
చికెన్ నూడుల్స్ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!
చికెన్ సూప్ మీద మనసుపోతే రెస్టారెంట్కి వెళ్లాల్సిందేనా? ఫైవ్స్టార్ హోటల్ రేంజ్లో చికెన్ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్కి చికెన్ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే వీటన్నింటినీ ఎలా చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా చికు బుకు చికు బుకు... చికెనే! అంటూ లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు చికెన్ నూడల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి! చికెన్ నూడుల్స్ కావలసినవి: చికెన్ – 200 గ్రాములు (బోన్లెస్); నూడుల్స్ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మారినేట్ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; సోయా సాస్ – టీ స్పూన్; గరం మసాలా పౌడర్ – టీ స్పూన్; పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు; క్యారట్ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్– టేబుల్ స్పూన్; సోయాసాస్ – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ: ∙చికెన్ను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్లో మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్లో కలపాలి. చికెన్ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి చికెన్ నూడుల్స్రడీ..! -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
దిగొచ్చిన చికెన్ ధరలు.. కిలో 155 రూపాయలు
నల్లగొండ టౌన్: చికెన్ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ స్కిన్తో రూ.155 ధర పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర (స్కిన్తో) రూ.270 నుంచి రూ.285పైగా పలికింది. అప్పుడు సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడం, అయ్యప్పమాలలు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తున్న నేపథ్యంలో చికెన్ వాడకం సగానికి సగం పడిపోయింది. దీంతో చికెన్ ధర కూడా తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే కోళ్ల ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడంతో కోళ్ల పెంపకందారులు నష్టాలపాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ పార్టీల నేతలు విందులు చేసే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందన్న చికెన్ సెంటర్ నిర్వాహకులు భావిస్తున్నారు. చికెన్ ధర ఇలా.. (కిలో రూ.లలో..) నెలక్రితం ప్రస్తుతం విత్ స్కిన్ 285 155 స్కిన్ లెస్ 310 180 కార్తీక మాసం కావడంతో ధర తగ్గింది ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో మహిళలు చాలా వరకు చికెన్ ముట్టరు. దీంతో చికెన్ కొనేవారు సగానికి సగం తగ్గడంతో చికెన్ రేటు కూడా పడిపోయింది. నెల క్రితం కిలో రూ.285 వరకు ఉన్న చికెన్ నేడు రూ.155 మాత్రమే అమ్ముతున్నాము. ఎన్నికలు ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. –నాగయ్య, చికెన్సెంటర్ యజమాని, నల్లగొండ -
ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
క్యారట్ చికెన్ మఫిన్స్.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు
క్యారట్ చికెన్ కప్స్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు; బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్ ఖీమా – అరకప్పు; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానమిలా: పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్ తురుములు, కొత్తిమీర చికెన్ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ∙గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మారితే చికెన్ క్యారట్ కప్స్ రెడీ. -
వండటానికి ముందే చికెన్ని కడగొద్దు! శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా చికెన్ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి. ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు. కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్తో చికెన్ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్లో కూతురు) -
నాటుకోళ్ల పెంపకం.. నెలకు రూ.80వేలకు పైగా లాభాలు
పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది. అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం. చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్ కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం. అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి. వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం. -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్ లూయీస్ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్ గ్లాస్ రాజీనామా చేశారు. ఇది కూడా చదవండి: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్పై చికెన్ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..!
ఒక మహిళకు ఎదురైన వింత అనుభవం ఇప్పుడు వైరల్గా మారింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో ఒక చిన్నపాటి ఎముక ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో తనకు గొంతునొప్పి తలెత్తడంతో వైద్యుని దగ్గరకు వెళ్లానని, ఆయన సర్జరీ చేసేందుకు బదులు ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పనిచేసిందన్నారు. దీంతో తనకు నొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఈ ఉదంతం న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. ఇచ్ మీడియా కంపెనీ స్టఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెథ్ బ్రెష్ అనే మహిళ గత వారంలో వెల్లింగ్టన్లోని ఒక రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడ ఆమె చికెట్ డిష్ ఆర్టర్ చేసింది. అప్పుడు వెయిటర్ ఆమెను ఎముకలతో కూడిన చికెన్ కావాలా లేదా బోన్లెస్ చికెన్ కావాలా అని అడిగాడు. దీనికి ఆమె బోన్తో కూడిన చికెన్ కావాలని తెలిపింది. ఆ చికెన్ తింటున్న సమయంలో ఆమె గొంతులో చిన్నపాటి ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆమెకు కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ, రెస్టారెంట్తో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే రెండుమూడు రోజుల పాటు ఆ నొప్పి కొనసాగడంతో తన ఇంటికి సమీపంలోని వైద్యుని దగ్గరకు వెళ్లి, తన సమస్య వివరించింది. వైద్యుని పరీక్షలో ఆమె గొంతులో చిన్నపాటి బోన్ ముక్క ఉందని స్పష్టమయ్యింది. దీంతో ఆమె తనకు సర్జరీ చేస్తారని అనుకుంది. అయితే ఆ వైద్యుడు సర్జరీకి బదులుగా ఒక విచిత్ర ఉపాయం తెలిపారు. వైద్యుని సలహా గురించి బెథ్ బ్రెష్ మాట్లాడుతూ ఆ వైద్యుడు తనను కొద్ది రోజులు కూల్డ్రింక్ తాగాలని, అప్పుడు తన గొంతులోని బోన్ పీస్ దానంతట అదే కరిగిపోతుందని తెలిపారన్నారు. ఆమెకు ఆ సలహా పనిచేయదేమోనని అనిపించినా దానిని అనుసరించింది. ఫలితంగా ఆమె గొంతు రెండు రోజులలో మునుపటి మాదిరిగా సవ్యంగా మారిపోయింది. ఈ ఘటన గురించి డచ్ మెడికల్ ఎక్స్పర్ట్ డాక్టర్ బ్రాయన్ బెట్టీ మాట్లాడుతూ గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోతే ఇది పరిష్కారం కాదన్నారు. ఎసిడిక్ డ్రింక్ కారణంగా ఎముక ముక్క కరిగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విధంగా బాధితులకు కూల్ డ్రింక్ తాగాలంటూ సలహా ఇవ్వడం సరికాదన్నారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
సోనాలి జాతి కోళ్ల పెంపకం.... పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ
-
కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది!
కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు. పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..) -
మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర
మండపేట: మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో స్కిన్లెస్ కిలో రూ.400కు చేరింది. నాలుగు నెలలుగా సరైన ధర లేక నష్టపోవడం, పెరిగిన నిర్వహణ వ్యయం, అధిక ఎండలకు జడిసి కొత్త బ్యాచ్లు వేయడానికి కోళ్ల రైతులు వెనుకంజ వేస్తున్నారు. కోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో ధర పెరిగిపోతోంది. మాంసాహార ప్రియులు చికెన్ను ఎక్కువగా ఇష్టపడతారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు మూడు లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. పెరిగిన ఖర్చులు అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎండలకు జడిసి వేసవిలో కొత్త బ్యాచ్లు వేసేందుకు వెనకాడతారు. దీనికితోడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 200కు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మేత ధరలు గిట్టుబాటయ్యేలా లేకపోవడం కొత్త బ్యాచ్లు వేయకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. మొక్కజొన్న కిలో రూ.20 ఉండగా, సోయా రూ.50, అన్ని మేతలు మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.43 వరకు ఉంది. కోడిపిల్ల ధర రూ.26 నుంచి రూ.30 వరకు ఉంది. కోడిమేత, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకు వ్యయమవుతోందంటున్నారు. ఆయా కారణాలతో రెండు నెలలుగా అధికశాతం మంది రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. సొంతంగా నిర్వహణ చేయలేక కమీషన్పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి ఇచ్చేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల లభ్యత లేకపోవడం, అధికశాతం ఫామ్లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.400 వరకు అమ్మకాలు చేస్తుండగా, లేయర్ కోడి రూ.130 వరకు ఉంది. సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు పెరిగాక కోళ్లను మార్కెట్కు తరలిస్తుంటారు. కాగా 1.5 కిలో నుంచి 1.8 కిలో బరువున్న కోళ్లను అమ్మకాలు చేసేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరు వరకు ధర తగ్గకపోవచ్చని వ్యాపార వర్గాలంటున్నాయి. నష్టాలకు జడిసి జనవరి నుంచి ఏప్రిల్ వరకు గిట్టుబాటు ధర లేక కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఎండలకు జడిసి చాలామంది కొత్త బ్యాచ్లు వేయక ధర పెరిగిపోతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
వామ్మో ఏమా చికెన్ ధరలు.. నెల క్రితం రూ.200, ఇప్పుడు ఏకంగా..!
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. శుభకార్యాల వేళ ధర పెరగడంతో ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ధరలతోపాటు వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గటం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం చికెన్ కిలో ధర రూ.200 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 పెరిగిపోయింది. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్ వంటి పెద్ద ప్రాంగణాల్లో స్కిన్ రూ.290 స్కిన్లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తుండగా.. సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. వేసవి.. ఆపై శుభకార్యాలు వేసవి సీజన్లో సాధారణంగా చికెన్ ధర పెరగటం సహజం. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉండటం వల్ల డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవటం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. గుడ్డు ధరలూ పెరిగాయ్ కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోడిగుడ్లు అమ్మే దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత నెలలో పాతిక గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించారు. ఇప్పుడు 25 కోడిగుడ్లు రూ.135కు హోల్సేల్ వ్యాపారులు విక్రయిస్తుండగా.. రిటైల్గా ఒక్కొక్కటి రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లో ఆదివారం 25 గుడ్లు రూ.127 ధర పలికాయి. -
మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్ ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర కొండెక్కింది. ఆదివారం కిలో కోడి మాంసం రూ.250కి చేరింది. ఎండలు మండుతుండటం, వేడి గాలుల తీవ్రతతో ఫారాల్లోని కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో చికెన్ ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్గా కిలో స్కిన్లెస్ చికెన్ రూ.250 వరకు విక్రయిస్తుండగా.. స్కిన్తో ఉన్న చికెన్ రూ.220 వరకు అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 50 నుంచి రూ.60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. వచ్చే ఆదివారం నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవులు, ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతుండటంతో చికెన్ వినియోగం బాగా పెరిగి ధరలు మండుతున్నాయి. చదవండి: ‘కొరియన్’ ట్రెండ్కు హైదరాబాద్ యూత్ ఫిదా -
మువ్వన్నెల జెండాతో చికెన్ శుభ్రం.. అరెస్ట్
Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. దాద్రా-నగర్ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్లో చికెన్ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మొహమ్మద్ సైఫ్ నదీమ్ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ శాఖ అతని దుకాణానికి సీజ్ వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. Mohammad Saif Nadim Qureshi was seen cleaning chopped chicken using the national flag in Silvassa. And then they say " Don't question our Patriotism " ! pic.twitter.com/KtPjuYvrSl — Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) April 22, 2023 -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్ప్లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
ఇదేం పగరా నాయనా.. 1,100 కోళ్లను భయపెట్టి చంపడమేంది?
బీజింగ్: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది. ఏం జరిగిందంటే..? గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్గా ఫ్లాష్లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి. జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. దీంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’ -
మండీ బిర్యానీ..కెబాబ్స్ అంటే ఇష్టం : దివి
బిగ్బాస్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షో తర్వాత దివి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ఆమె అందం గురించి పొగడడంతో పాటు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో దివి పేరు తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయింది. ఇక బిగ్బాస్ తర్వాత కరీర్ పరంగా దివి ఫుల్ బిజీ అయింది. ఒకవైపు వరుస సినిమాలు..మరోవైపు షాపు ఓపెనింగ్స్, యాడ్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్లోని కోంపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చికెన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండా ఉండలేనన్నారమే. ‘హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. -
5 వేలతో ప్రారంభమై అందరిని ఆశ్చర్యపరిచిన వ్యాపారం, ఇది!
మనిషి అనుకుంటే కొండలను సైతం పిండి చేయగలడు, అయితే జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణతో కూడా కృషి, పట్టుదల ఎంతో అవసరం. నిరంతరం శ్రమిస్తూ ఈ రోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యాపారవేత్తల్లో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బి సుందరరాజన్, జిబి సుందరరాజన్ కూడా ఉన్నారు. కేవలం రూ. 5,000తో చిన్న వ్యాపారం ప్రారంభించి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. ఇంతకీ వీరి విజయగాథ వెనుక ఉన్న కష్టాలు ఏంటి? సక్సెస్ సాధించడానికి వారు ఎంచుకున్న మార్గాలేమిటనేది ఈ కథనంలో చూసేద్దాం.. చికెన్ తినే అందరికి సుగుణ చికెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ సంస్థ ఎలా పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయింది. (ఇదీ చదవండి: అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?) చిన్నతనంలో చదువులో ముందుకు సాగని అన్నదమ్ములిద్దరూ పాఠశాల విద్యతోనే బడికి బై.. బై చెప్పేసారు. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారం వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, వారికున్న 20 ఎకరాల భూమిలో ఇతర వ్యవసాయదారులకు భిన్నంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. కొంతకాలం ఇలాగే ముందుకు సాగి వ్యవసాయానికి వీడ్కోలు పలికేసారు. వ్యవసాయం వదిలేసిన తరువాత బంధువుల వ్యవసాయ మోటార్ తయారీ కంపెనీలో పని చేయడం ప్రారభించారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ రూ. 5,000 పెట్టుబడితో సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలుపెట్టారు. 1990లో మూడు ఫామ్లతో మొదలైన కోళ్ల పెంపకం ఇప్పుడు పదికంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించింది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..) సుగుణ ఫుడ్స్ ప్రారంభమైన మొదట్లో ఎంతోమంది ఇది సక్సెస్ కాదని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు ఈ సంస్థ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ ప్రారంభించిన ఏడు సంవత్సరాల్లోనే 7 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ సుమారు రూ. 12 వేల కోట్ల కంటే ఎక్కువ సమాచారం. -
‘నాటు’ టేస్టు.. విదేశాల్లో హిట్టు.. నోరూరించే పచ్చడి.. కేరాఫ్ జగిత్యాల రైతు
జగిత్యాల అగ్రికల్చర్: ఎంత బ్రాయిలర్ కాలమైనా నాటు కోడి రుచే వేరు. అందుకే ఓ రైతు రొటీన్కు భిన్నంగా ఆలోచించారు.. అందరిలా కాకుండా నాటుకోళ్లు పెంచుతూ వాటి మాంసంతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. కమ్మని రుచితో అందరి మనసు దోచుకుంటున్నారు. ఆయన చేతి పచ్చళ్లు రుచి చూసిన గ్రేటర్ హైదరాబాద్ వాసులే కాదు.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడ ఉండే తమ బంధువుల ద్వారా ఆర్డర్లపై ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. మామిడితోటలో నాటుకోళ్ల ఫారం జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల మల్లారెడ్డికి గ్రామ శివారులో ఐదెకరాల మామిడితోట ఉంది. అందులో రెండు షెడ్లు నిర్మించారు. ఒక్కో బ్యాచ్లో 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. ఒక్కోటి 1.5 కేజీల నుంచి 2 కేజీల బరువు అయ్యే వరకూ దాణా అందిస్తున్నారు. పెట్టని కేజీకి రూ.400 చొప్పున వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. పుంజు మాంసంతో చికెన్ పకోడి వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తూ వాటినీ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. ఆర్డర్రాగానే.. మల్లారెడ్డి నాటుకోడి మాంసంతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పచ్చడి అతి ప్రధానమైంది. కస్టమర్ల నుంచి ఆర్డర్ రాగానే పచ్చడి తయారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు కూలీల సాయం తీసుకుంటున్నారు. పచ్చడి కోసం కోడి పుంజును వినియోగిస్తున్నారు. గ్యాస్ వాడకుండా కట్టెల మీద కాల్చడం మరో విశేషం. బోన్లెస్ ముక్కలను ఉడికించి, నూనెలో వేపడం ద్వారా ప్రత్యేకంగా తయారు చేసుకున్న మసాలాలతో పచ్చడి తయారు చేస్తున్నారు. పెరిగిన ఆర్డర్లు.. నాటుకోడి పచ్చడి రుచిచూసిన కస్టమర్లు.. తమ బంధువులు, స్నేహితుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు విదేశాల్లోని తమవారికీ పంపిస్తున్నారు. ఆర్డర్లు భారీగా వస్తుండటంతో మల్లారెడ్డి ఇతర రైతుల నుంచి కూడా కోడిపుంజులను హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ఉంటేనే ఆదరణ ఏదైనా వినూత్నంగా ఆలోచించి వినియోగదారులను ఆకర్షించగలగాలి. అదే ఉద్దేశంతో నేను నాటు కోడి పచ్చడి తయారీ ప్రారంభించా. కోళ్లను నేరుగా విక్రయించే బదులు పచ్చడి తయారుచేసి అమ్మడం లాభదాయకం. ఇందులో శ్రమ ఉంటుంది, ఖర్చూ ఉంటుంది. అలాగే లాభమూ వస్తుంది. –ఎడ్మల మల్లారెడ్డి బంధువులే తొలి కస్టమర్లు.. ఈ పచ్చడిని అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఆరు నెలలుగా ‘ఏఎంఆర్ ఇంటిగ్రేటెడ్ ఫామ్’బ్రాండ్ పేరిట అర్ధకిలో రూ.700, కిలో రూ.1,400 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత బంధువులు, పరిచయస్తుల్లో ప్రాచుర్యం పొందింది. క్రమంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కావాలనుకున్న వారు ఆన్లైన్లో చెల్లింపులు చేశాక ఒక్కరోజులోనే పచ్చడి తయారు చేసి అందజేస్తున్నారు. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
కడక్నాథ్ కోళ్లకు బర్డ్ఫ్లూ.. చికెన్ విక్రయాలపై నిషేధం!
జార్ఖండ్: బర్డ్ఫ్లూ కారణంగా 4,000 కోళ్లు, బాతులను చంపివేయాలని జార్ఖండ్ బొకారో జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫాంలో బర్డ్ఫ్లూ వ్యాప్తిచెందినందువల్ల దాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ప్లూ కారణంగా మరణించాయని, మరో 103 కోళ్లను తామే చంపేశామని పేర్కొన్నారు. దీంతో ఈ ఫాంకు ఒక కిలోమీటర్ రేడియస్లో ఉన్న కోళ్లు, బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపనున్నట్లు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ డా.బిపిన్ బిహారీ మహ్తా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఈ ఫాంలో కోళ్లు చనిపోవడం మొదలైందని, నమూనాలు ల్యాబ్కు పంపింతే బర్డ్ఫ్లూగా నిర్ధరణ అయిందని వివరించారు. అయితే కోళ్ల యజమానులకు కొంత పరిహారం ఇచ్చేందుకు ప్రక్రియ మొదలైందని, ఎవరెవరికి ఇచ్చే విషయాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. బర్డ్ఫ్లూను గుర్తించి పౌల్ట్రీ ఫాంకు 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న కోళ్ల ఫాంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే బొకారా జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. మనుషులు ఎవరైనా ఈ వైరస్ బారినపడితే వారికి చికిత్స అందించేందుకు సదర్ హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: బర్డ్ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
మనిషిని పొడిచి చంపేసిన కోడిపుంజు.. దాదాపు ఏడాది తర్వాత
కోడిపుంజు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఐర్లాండ్లో చోటు చేసుకుంది. జాస్పర్ క్రాస్ తన ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజు దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ నిజాలు ఇటీవలే వెల్లడయ్యాయి. అసలేం జరిగిందంటే.. గత ఏప్రిల్లో తన ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజు దాడి చేయడంతో జాస్పర్కు గాయపడ్డాడు. దీంతో అతనికి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో జాస్పర్ తన పెంపుడు కోడి దాడి చేయడం వల్ల చనిపోయినట్లు బయటపడింది. ఈ ఘటన జరిగినప్పుడు అదే ప్రాంతంలో నివసించే గార్డా ఇయోన్ బ్రౌన్ కోర్టులో తెలిపిన సమాచారం ప్రకారం.. దాడి గురించి తెలుసుకున్న తర్వాత తాను క్రాస్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. ఆ సమయంలో క్రాస్ వంట గదిలో రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నట్లు పేర్కొన్నాడు. అతని కాలు వెనుక భాగంలో గాయం కూడా కనిపించిందన్నాడు. క్రాస్ పడి ఉన్న చోటు చుట్టు రక్తపు మరకలు ఉన్నట్లు చెప్పాడు. అతన్ని బతికించేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించాడని చివరికి అది కూడా విఫలమైందని తెలిపాడు. కాగా ఆ కోడిపుంజు గతంలో తనపై కూడా దాడి చేసినట్లు క్రాస్ కూతురు పేర్కొంది. -
వంటిల్లు.. పాలక్ చికెన్
ఇంటికి బంధువులు వస్తున్నారు. డైనింగ్ టేబుల్ కళకళలాడుతోంది. తోటకూర ఉంది... పక్కనే వేటకూరా ఉంది. కూరగాయల ఆధరువులూ కొలువుదీరాయి. బంధువుల వచ్చారు... భోజనాలు పూర్తయ్యాయి. వేటకూర పా త్రలో గరిటె మాత్రమే మిగిలింది. తోటకూర పా త్ర అదే కళతో నిండుగా ఉంది. కూరగాయల వంటలు దిగులుగా చూస్తున్నాయి. అతిథులు రుచిగా భోజనం చేశారు... సంతోషం. మరి... రుచికి ఆరోగ్యం జతగా చేరి ఉంటే మరీ సంతోషం. అందుకే... ఈ వారానికి ఇలా వండి టేస్ట్ చేద్దాం. పాలక్ చికెన్ కావలసినవి: పా లకూర– 100 గ్రాములు (శుభ్రం చేసినది) ; బోన్ లెస్ చికెన్ – పా వు కేజీ. మారినేట్ చేయడానికి: పెరుగు – 2 టేబుల్ స్పూన్లు ; మిరప్పొ డి – అర టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ (మెంతి ఆకులపొ డి) – టీ స్పూన్ (΄పొ డి లేక΄ోతే గుప్పెడు తాజా ఆకులు వాడవచ్చు) ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం– టేబుల్ స్పూన్ ; నెయ్యి– టేబుల్ స్పూన్ . గ్రేవీ కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు ; యాలకులు – 3 ; బిర్యానీ ఆకులు – 2 ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఉల్లిపా యలు – 3 (గ్రైండ్ చేయాలి) ; వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; పచి్చమిర్చి– 2 (నిలువుగా చీరాలి) ; టొమాటోలు – 3 (తొక్క, గింజలు తీసి గ్రైండ్ చేయాలి) ; మిరప్పొ డి– అర టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ– టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; మీగడ– టేబుల్ స్పూన్. గారి్నష్ చేయడానికి: వెన్న – టేబుల్ స్పూన్ తయారీ: ♦ చికెన్ను శుభ్రం చేసి పెద్ద పా త్రలో వేయాలి. మరొక పా త్రలో మారినేట్ చేయడానికి తీసుకున్న దినుసులను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి అన్నింటికీ సమంగా పట్టించి మూతపెట్టి ఆ పా త్రను మూడు గంటల సేపు ఫ్రిజ్లో పెట్టాలి. ♦ ఈ లోపు ఒక పా త్రలో నీటిని మరిగించి పా లకూర ఆకులను వేసి రెండు నిమిషాలపా టు మరిగిన తర్వాత ఆకులను చిల్లుల గరిటెతో బయటకు తీసి చన్నీటిలో వేయాలి. వేడి తగ్గిన తర్వాత వడ΄ోసి పక్కన ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ♦ మందపా టి పా త్రలో నెయ్యి వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి (మీడియం మంట మీద ) ముక్కలను గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తరవాత దించేసి పక్కన పెట్టాలి. ♦ వెడల్పుగా ఉన్న పా న్లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. యాలకులు, బిర్యానీ ఆకులు, పచి్చమిర్చి, ఉల్లిపా య, వెల్లుల్లి, అల్లం పేస్టు వేసి మూడు నిమిషాల పా టు వేయించాలి. నూనె వేరు పడిన తర్వాత టొమాటో పేస్ట్ వేసి కలిపి అందులో ధనియాలపొ డి, మిరప్పొ డి, కసూరీ మేథీ, గరం మసాలాపొ డి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తరవాత పా లకూర పేస్ట్, ఉడికించిన చికెన్ వేసి కలిపి నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా మీగడ వేసి కలిపి దించేయాలి. వడ్డించేముందు కర్రీ మీద వెన్న వేయాలి. గోంగూర మటన్ కావలసినవి: మటన్ – అర కేజీ ; గోంగూర – పా వు కేజీ (ఆకులు); పసుపు – టీ స్పూన్ ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; ఉల్లిపా య ముక్కలు – కప్పు ; మిరప్పొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; జీలకర్రపొ డి– అర టీ స్పూన్ ; పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీరాలి) ; కొత్తిమీర – చిన్న కట్ట ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; షాజీర– టీ స్పూన్ ; యాలకులు – 2 ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ ప్రెషర్ కుక్కర్లో మటన్, జీలకర్రపొ డి, ధనియాల΄పొ డి, మిరప్పొ డి, అరకప్పు నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపా య ముక్కలు, ఉప్పు వేయాలి. ఉల్లిపా య ముక్కలు రంగు మారిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ΄ోయేవరకు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పచి్చమిర్చి, గోంగూర ఆకులు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి. గోంగూర మెత్తబడిన తర్వాత మటన్ (ఉడికించిన నీటితోపా టు) వేసి కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ♦ చివరగా అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసి కలిపి గరం మసాలాపొ డి, కొత్తిమీర ఆకులు వేసి కలిపి దించేయాలి. చికెన్ వెజిటబుల్ స్ట్యూ కావలసినవి: చికెన్ – అర కేజీ ; నూనె – 2 టేబుల్ స్పూన్లు ; జీలకర్ర – అర టీ స్పూన్ ; మెంతులు – అర టీ స్పూన్ ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; కరివేపా కు – 2 రెమ్మలు ; ఉల్లిపా య – 1 (తరగాలి) ; పచి్చమిర్చి– 1 (తరగాలి) ; టొమాటో – 1 (తరగాలి) ; బంగాళదుంప ముక్కలు – కప్పు ; క్యారట్ ముక్కలు – కప్పు ; బీన్స్ ముక్కలు – అర కప్పు ; పసుపు – టీ స్పూన్ ; కశ్మీర్ మిరప్పొ డి – టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం – టీ స్పూన్ ; మిరియాలపొ డి – పా వు టీ స్పూన్ నీరు – 3 కప్పులు. తయారీ: ∙ ♦ చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ♦ పెద్ద పెనంలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేయించాలి. అందులో కరివేపా కు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తరవాత ఉల్లిపా య, పచి్చమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు మసాలాపొ డి, పసుపు, కశీ్మర్ మిరప్పొ డి, ధనియాలపొ డి వేసి అర నిమిషం పా టు సన్న మంట మీద అన్నింటినీ కలుపుతూ వేయించి, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ♦ ఇందులో చికెన్ ముక్కలు వేసి మసాలా మిశ్రమం బాగా పట్టేటట్లు కలిపి మూత పెట్టి సన్న మంట మీద ఐదు నిమిషాల పా టు ఉడికించాలి. ♦ ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీరు ΄ోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత క్యారట్, బీన్స్ వేసి కలిపి మళ్లీ మూత పెట్టి మరో ఐదారు నిమిషాల పా టు ఉడకనివ్వాలి. ఇప్పుడు నిమ్మరసం, మిరియాలపొ డి వేసి కలిపి దించేయాలి. వేడి వేడి చికెన్ వెజిటబుల్ స్ట్యూ రెడీ. బీరకాయ రొయ్యలు కావలసినవి: రొయ్యలు – అరకేజీ (΄పొ ట్టు వలిచినవి) ; బీరకాయ – అరకేజీ ; పసుపు – అర టీ స్పూన్ ; పచ్చిమిర్చి– 2 ; ఉల్లిపా యలు – 4 ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; ఆవాలు – టీ స్పూన్ ; జీలకర్ర – టీ స్పూన్ ; కరివేపా కు – 4 రెమ్మలు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 4 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి మందంగా ఉన్న పా త్రలో వేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరప్పొ డి, కొద్దిగా నూనె వేసి కలిపి పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి. ♦ బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపా య ముక్కలు, పచి్చమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపా కు వేయాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి. ∙రొయ్యలు, మసాలా మిశ్రమం ఉన్న పా త్రను మరొక స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించాలి (ఇందులో నీరు ΄ోయనక్కరలేదు). రొయ్యలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని బీరకాయ ఉడుకుతున్న పా త్రలో వేయాలి. ఇందులో ఉప్పు, మిరప్పొ డి కూడా వేసి బాగా కలిపి రుచి కలిసే వరకు రెండు నిమిషాల సేపు ఉడికించాలి. -
ఇది విన్నారా.. చికెన్ పండిస్తున్నారు.. మార్కెట్లోకి సెల్ కల్చర్డ్ కోడి మాంసం!
మాయా లేదు.. మర్మం లేదు.. అబ్రకదబ్ర అనక్కర్లేదు. కోడి లేకుండానే కోడి మాంసం.. అది కూడా బోన్లెస్గా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇట్టే ఆకలి తీర్చేస్తుంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సరదా సీన్ అనుకోకండి. ఈ ఏడాది నుంచే అమెరికన్ రెస్టారెంట్స్లో ఈ తరహా చికెన్ అందుబాటులోకి రానుంది. భారతీయులు దీనిని రుచి చూడాలంటే కనీసం ఐదారేళ్లు ఆగాల్సిందే. 2028 నాటికి భారతీయ కిరాణా దుకాణాల్లోనూ (గ్రోసరీ స్టోర్స్) ఇలాంటి చికెన్ అందుబాటులోకి వస్తుందని అంచనా. సాక్షి, అమరావతి: చికెన్ కోసం కోడిని చంపనవసరం లేదు. చూడటానికి మృదువుగా.. తినడానికి రుచికరంగా ఉంటుంది. అదే సెల్ కల్చర్డ్ చికెన్. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమంటూ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఇటీవల ధ్రువీకరించింది. కోడి స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో అమెరికన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. భవిష్యత్లో మేక, గొర్రె స్టెమ్ సెల్స్ నుంచి మటన్, పీత, బాతు వంటి స్టెమ్ సెల్స్ నుంచి ఆయా మాంసాలను కూడా ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా అందుబాటులోకి రానుంది. విశ్వవ్యాప్తంగా 27.60 కోట్ల కిలోల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 27.60 కోట్ల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ప్రజల్లో నూటికి 95 శాతం మంది బ్రాయిలర్ కోళ్లనే ఇందుకు వినియోగిస్తున్నారు. కోళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతిలో మాంసాన్ని పండించే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇకపై మాంసం కోసం ఏ జీవిని వ«ధించనవసరం లేకుండా.. సంబంధిత జంతువు కణాల (స్టెమ్ సెల్స్) ద్వారా ఆయా రకాల మాంసాలను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానాన్ని సెల్ కల్చర్డ్ చికెన్/సెల్ కల్చర్డ్ మీట్ అంటారు. ఈ విధానంలో కోడి స్టెమ్ సెల్ను వినియోగించి చికెన్ను ఉత్పత్తి చేస్తారు. తొలివిడత చికెన్ ఉత్పత్తికి 14 రోజుల సమయం పడితే.. ఆ తరువాత దాని నుంచి ప్రతి 18, 24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం ఉత్పత్తి అవుతుంది. విప్లవాత్మక మార్పు ఇది నిజంగా ఆహార చరిత్రలో విప్లవాత్మక పరిణామమని, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగినంత కొవ్వుతో పాటు కావాలి్సన స్థాయిలో ప్రొటీన్స్, విటమిన్స్ ఈ కృత్రిమ మాంసంలో ఉంటాయని ఎఫ్డీఏ గుర్తించింది. పూర్తిగా బోన్లెస్ చికెన్ మాదిరిగా ఉండే ఈ చికెన్ శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఎఫ్డీఏ అనుమతితో అమెరికాలో ‘అప్సైడ్ ఫుడ్స్’ అనే సంస్థ ‘సెల్ కల్చర్డ్ చికెన్’ను ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్ ఫుడ్ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్లో కల్చర్డ్ మాంసం ఉత్పత్తులు సింహభాగం మార్కెట్ను ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జీవహింస చేయక్కర్లేదు ఈ విధానం అందుబాటులోకి వస్తే మాంసాహారం కోసం జీవాలను వధించే ముప్పు తప్పుతుందని, భవిష్యత్లో మిగిలిన మాంసాహార ఉత్పత్తుల్ని కూడా ఇదే తరహాలో తయారు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కణం నుంచి ఉత్పత్తి అయ్యే కల్చర్డ్ చికెన్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ మందుల్ని ఉపయోగించరు. ఈ విధానాన్ని సెల్యులర్ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్ కల్చర్డ్ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్ బ్యాంక్ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తి స్థాయిలో చికెన్ తయారవడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత ప్రతి 18 నుంచి 24 గంటలకు ఆ మాంసం రెట్టింపవుతుంది. అమెరికన్లలో 10 శాతం మంది ఆసక్తి ప్రస్తుతం అమెరికన్లలో నూటికి 10 శాతం మంది కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ అసోసియేట్ పేర్కొంది. కోళ్లను వదించగా వెలువడే 10–12 శాతం గ్రీన్హౌస్, వా యు ఉద్గారాలకు ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ద్వారా చెక్ పెట్టవచ్చంటున్నారు. కల్చర్డ్ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్లో మంచి డి మాండ్ ఉంటుందని, మాంసం మార్కెట్లో కనీ సం 10 శాతం వాటా ఆక్రమిస్తుందని చెబుతున్నా రు. అమెరికాలో ఈ ఏడాదే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుండగా.. 2028 నాటికి మన దేశంలోనూ దర్శనమివ్వనుంది. ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి సంస్థ మాదే పండించిన మాంసం కోసం ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందిన మొదటి కంపెనీగా మా సంస్థ నిలవడం ఆనందంగా ఉంది. ఈ మాంసం తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవించలేదని పరిశోధనల్లో వెల్లడైంది. భవిష్యత్లో ఇదే తరహాలో పశు మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. పేటెంట్ హక్కు కోసం కూడా దరఖాస్తు చేశాం. – ఉమా వాలేటి, సీఈవో, అప్సైడ్ ఫుడ్స్, యూఎస్ఏ. -
యువకుల వీరంగం.. కబాబ్లో చికెన్ ముక్క తక్కువొచ్చిందని!
సాక్షి, బెంగళూరు: చికెన్ కబాబ్లో ఒక ముక్క తక్కువ వచ్చిందని హోటల్ యాజమానిపై ఇష్టం వచ్చిన్నట్లు దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన బెంగళూరులోని కోణనకుంట పోలీసుస్టేషన్లో జరిగింది. బాబు అనే వ్యక్తి ఈశ్వరలేఔట్లో హోటల్ నడుపుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి అదే ప్రాంతానికి చెందిన అభి, మని అనే ఇద్దరు యువకులు రూ.120 చెల్లించి ఒక ప్లేట్ చికన్ కబాబ్ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లి పార్శిల్ తెరిచి చూడగా అక్కడ 9 కబాబ్ పీస్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక ప్లేట్కు 10 ముక్కలు ఇస్తారు. దీంతో 9 ముక్కలు మాత్రమే ఉన్నాయంటూ గురువారం ఉదయం హోటల్ వద్దకు వెళ్లి యజమానితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవడంతో.. బాబుపై ఇద్దరూ దాడికి దిగారు. యమజాని ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభి, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు -
కిలో ఉల్లి 220, కిలో చికెన్ 383, మరి బియ్యం?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒక వైపు రుణ సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, మరోవైపు తరిగి పోతున్న విదేశీ నిల్వలతో మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతున్నాయి. గోధుమ పిండి కొరతతో పాటు, బియ్యం, పాలు చమురు ధరలు 40-50 శాతంపెరిగాయి. దీంతో అక్కడి ప్రజల బాధలు అన్నీ ఇన్నీ కావు. (తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు) గత ఏడాది 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర 501 శాతం పెరిగి రూ. 220 గా ఉంది. చికెన్ కిలో రూ.210 నుంచి రూ.383కి, పప్పుధాన్యం దాదాపు రూ.151 నుంచి రూ.228కి ఎగబాకాయి. తాజా లెక్కల ప్రకారం ఒక కిలో బాస్మతి బియ్యం 46 శాతం పెరిగి రూ.146 పలుకుతోంది. పాల ధరలు 30 శాతం పెరిగి దాదాపు రూ. 150కి చేరుకున్నాయి. 2022 డిసెంబరులో పాక్ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది. ఇది భారతదేశం కంటే దాదాపు నాలుగు రెట్లు. అలాగే విదేశీ నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్టం 5.576 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతుంది. ఫలితంగా చమురును దిగుమతి చేసు కోవడానికి తగినంత నిల్వలు లేనందున ఇంధనాన్ని ఆదా చేయడానికి మార్కెట్లు, హాళ్లను త్వరగా మూసివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించవలసి వచ్చింది. విదేశీ రుణాలను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 13 బిలియన్ డాలర్లు అవసరం. ప్రపంచ బ్యాంక్ వార్షిక రుణ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరం నాటికి పాకిస్థాన్ 33 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాలి.అయితే ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లు ఖాతాలో ఉన్నాయని, 2023 జూన్ నాటికి దేశానికి ఇంకా 13 బిలియన్ డాలర్లు అవసరమని గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ చెప్పారు. కాగా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో ప్రజలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా సింధ్ ప్రావిన్స్ల వంటి అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సింధ్లో, షహీద్ బెనజీరాబాద్లోని సక్రంద్ పట్టణంలోని ఒక పిండి మిల్లు వెలుపల జరిగిన తొక్కిసలాట, ఘర్షణలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. -
పంచాయతీ ఎన్నికలు.. మధ్యాహ్న భోజనంలో చికెన్, పండ్లు
లక్నో: పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార టీఎంసీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కొత్తగా చికెన్, సీజనల్ పండ్లు అందజేయాలని నిర్ణయింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలలపాటు వీటిని స్కూల్ పిల్లలకు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మిల్లో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సోయాబీన్ ,గుడ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెనూలో అదనంగా పీఎం పోషన్ కింద పోషకాహారం కోసం వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మమతా బెనర్జీ సర్కార్ అదనంగా రూ. 371 కోట్లను మంజూరు చేసింది. జనవరి నుంచి అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని విద్యాశాఖ విభాగం అధికారి ఒకరు ధృవీకరించారు. అయితే ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర,ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి. అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది, ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ మండిపడింది.అయితే దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్షాలు ప్రతిదానిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు. చదవండి: నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మరో దారుణం .. -
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
కోడి కూస్తోందని పోలీసులకు ఫిర్యాదు
బనశంకరి(కర్ణాటక): కోడిపుంజు కూతతో నిద్రకు ఆటంకం కలుగుతోందని పోలీసులను ఆశ్రయించాడు ఓ ఐటీ ఇంజినీర్. వివరాల్లోకి వెళి తే.. బెంగళూరులోని జేపీ నగర 8వ ఫేజ్లో ఓ అపార్టుమెంటులో ఉత్తర భారతదేశానికి చెందిన టెక్కీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడు నగర పోలీసుల ట్విట్టర్ అకౌంట్కు తన ఫిర్యాదును ట్యాగ్ చేశాడు. తమ అపార్టుమెంటు వద్ద స్థలంలో ఒక రైతు కోడిపుంజులు, కోళ్లను పెంచుతున్నాడని, కోడిపుంజులు కూత వేస్తుండటంతో నిద్రాభంగం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కోళ్ల పెంపకందారుని ప్రశ్నించారు. నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టెక్కీకి, కోళ్ల రైతుకు సర్దిచెప్పి పంపించారు. చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి.. -
Hyderabad: భాగ్యనగర వాసులు చికెన్ లవర్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసులు చికెన్ లవర్స్ అని మరోసారి నిరూపించారు. ఈ విషయంలో గ్రీన్సిటీ బెంగళూరు తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ సిటీ రెండోస్థానంలో నిలిచింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. 2022 తాజా ఆహార ట్రెండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. చికెన్ వెరైటీ ఆర్డర్లు చేసే వారిలో చెన్నై మూడో స్థానంలో నిలిచిందట. ఆ తర్వాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, పుణె, కోయంబత్తూర్ నిలిచినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఫుడ్ ఆర్డర్ల ట్రెండ్ను పరిశీలిస్తే.. చికెన్ ఆర్డర్లు ఈ ఏడాది సుమారు 29.86 లక్షల మేర ఉండడం విశేషం. నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వెల్లువెత్తుతున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు స్విగ్గీలో భాగస్వాములైనట్లు పేర్కొంది. వీటికి భలే డిమాండ్.. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో ఫుడ్ ఆర్డర్ల ట్రెండ్ను పరిశీలిస్తే.. పలు నోరూరించే ఆహార పదార్థాలకు గిరాకీ బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా చికెన్ బిర్యానీ, మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్బిర్యానీ, తందూరీ చికెన్లు అగ్రభాగంలో నిలిచాయి. విదేశీ వంటకాల్లో.. మెట్రో నగరవాసుల జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరిచిన విదేశీ వంటకాల్లో ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్ అండ్ సుషి వంటకాలున్నాయి. వాహ్.. స్నాక్స్.. వినియోగదారుల మనసు దోచుకున్న స్నాక్స్లో సమోసా, పాప్కార్న్, పావ్భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్స్టిక్స్, హాట్వింగ్స్, టాకో, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్లున్నాయి. నోరూరించే డెజర్ట్లివే... స్విగ్గీ ఆర్డర్లలో అగ్రభాగాన ఉన్న ఐస్క్రీమ్/ మిఠాయిలలో గులాబ్ జామూన్, రస్మలాయ్, చాకోలావా కేక్, రస్గుల్లా, చాకోచిప్స్ ఐస్క్రీమ్, అల్పా న్సో మ్యాంగో ఐస్క్రీమ్, కాజూకాటిల్, టెండర్ కోకోనట్ ఐస్క్రీమ్, హాట్ చాక్లెట్ ఫడ్జ్లున్నాయి. -
చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు
సాక్షి, బనశంకరి: చికెన్ రోల్ ఇవ్వలేదని హోటల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన బెంగళూరు హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి హనుమంతనగర కుమార్ హోటల్కు రౌడీషీటర్ దేవరాజ్, ఇద్దరు అనుచరులు వెళ్లారు. తినడానికి చికెన్రోల్ కావాలని సిబ్బందిని అడిగారు. సమయం ముగిసింది, హోటల్ మూసేస్తున్నాం, ఈ రోజు మెనులో చికెన్రోల్ లేదని వారు చెప్పారు. దీంతో దేవరాజ్, అతని అనుచరులు సిబ్బందితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్ సిబ్బంది చితకబాది బయటికి గెంటేసి హోటల్ తలుపులు వేశారు. పెట్రోలు పోసి నిప్పు దేవరాజ్ అనుచరులు సమీప పెట్రోల్బంక్కు వెళ్లి రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ సిబ్బంది గది మీద పోసి నిప్పుపెట్టారు. మంటలు వ్యాపించగానే సిబ్బంది బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. తలుపు, కిటికీ కాలిపోయింది. హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవరాజ్, గణేశ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (చదవండి: జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్) -
Rishi Sunak: ఓటమి భయంతో..
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై అధికార కన్జర్వేటివ్ పార్టీలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అధినాయకత్వంలో తిరిగి గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో.. చట్ట సభ్యులంతా ఆందోళనతో గందరగోళానికి తెర తీస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే ఆందోళనలో కూరుకుపోయారు కన్జర్వేటివ్ సభ్యులు చాలామంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారట చాలామంది. అంతేకాదు.. మరికొందరైతే వేరే చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నట్లు సమాచారం. రిషి సునాక్ నేతృత్వంలో ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే నెలకొన్నట్లు పార్టీ అంతర్గత సమావేశాలు, పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. బహుశా ఎంపీలు హెలికాప్టర్లలో తమ తమ నియోజకవర్గాలను వెతుక్కుంటే బావుంటేదేమో అంటూ చమత్కరించారు. 90వ దశకంలో టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓడిపోకుండా ఉండేందుకు సురక్షితమైన స్థానాల్లో పోటీ కోసం చేసిన ప్రయత్నాలను చికెన్ రన్గా అభివర్ణించాయి. అంటే కోళ్లు పరిగెత్తినట్లు హడావుడిగా తమ తమ సురక్షిత స్థానాల కోసం ఎంపీలు పరుగులు పెట్టారని ఎద్దేవా చేసింది. అప్పటి నుంచి ఆ పదం అలా బ్రిటన్ రాజకీయాల్లో స్థిరపడిపోయింది. -
ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే!
తెలుగింటి పాకశాలల్లో గతంలో రాజ్యమేలిన గోంగూర, ఆవకాయ ఇప్పుడు సైడ్ అయిపోయాయి. ‘తాజాకూరలలో రాజా ఎవరండీ.. వంకాయేనండీ..’అంటూ పాడుకున్న కూరగాయలేవీ తెలుగువారి పంటికి రుచించడం లేదు. ఇంటా బయటా, విందు వినోదం ఏదైనా సరే.. ముక్క లేనిదే ముద్ద దిగేదేలే.. అన్నట్టుగా మారిపోయింది. మాటామంతీ జరగాలంటే మటన్.. చీటికీమాటికీ చికెన్.. ఫుల్లు జోష్లో ఫిష్.. వెరైటీగా కావాలంటే ప్రాన్స్, బర్డ్స్.. ఎన్ని రకాల మాంసం ఉంటే అంత సరదా. సండే లేదు మండే లేదు.. అన్నీ నాన్వెజ్డేలే అయిపోయాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. ఇందులోనూ తెలంగాణ టాప్లో, ఏపీ మూడో స్థానంలో ఉండటం విశేషం. గొర్రెలు, మేక మాంసం వృద్ధిలో తెలంగా ణ.. చేపలు, రొయ్యల ఉత్పత్తితో ఏపీ ముందంజ లో ఉంది. ఇంకోవైపు చికెన్, గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి కూడా తెలుగు రాష్ట్రాలే. దమ్ బి ర్యానీ, పాయ, తలకాయ, కీమా, నాటు కోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, ఎండు చేపల వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే జిహ్వకో రుచి అన్నట్టుగా మాంసం వంటకాల జాబితా చాంతాడును మించి ఉంటోంది. ఫంక్షన్లలో అయితే ఎన్నో వెరైటీల డిష్లను వడ్డిస్తుండటం కనిపిస్తోంది. దేశంలో తెలంగాణనే టాప్ మాంసాహార వినియోగంలో దేశంలో తెలంగాణదే హవా. తినడమే కాదు ఉత్పత్తిలోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఉత్పత్తి పెరుగుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో ధరలూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో మాంసం ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు గత నలభై ఏళ్లకాలంలో మాంసం ధరలు 30రెట్లు పెరగడం గమనార్హం. జాతీయ వార్షిక తలసరి మాంసం వినియోగం 5.4 కేజీలుకాగా.. అదే తెలంగాణలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 21.17 కిలోల మాంసం వినియోగిస్తున్నారు. గతంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 700–800 లారీల గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యేవని.. రాష్ట్రంలో గొర్రెలు/మేకల సంఖ్య పెరగడంతో దిగుమతి చేసుకునే లారీల సంఖ్య 100 వరకు తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఇలా.. గ్రామీణ భారతీయుల్లో 6.4% మంది మటన్, 21.7 % మంది చికెన్, 26.5 % మంది చేపలు, 29.2% మంది గుడ్లు తింటున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21% మంది మటన్, 21% మంది చేపలు, 27% చికెన్, 37.6% మంది గుడ్లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్లో శాకాహారులే అధికం రాజస్తాన్లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం పురుషు లు, 76.6 శాతం మహిళలు శాకాహారులే. ఇక హరియాణాలో 68.5శాతం పురుషులు, 70 శాతం మ హిళలు.. పంజాబ్లో 65.5శాతం పురుషులు.. 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతుండటం విశేషం. రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం ‘‘2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తిలో విప్లవాత్మక మా ర్పులు వచ్చాయి. దీనికి ముందు రాష్ట్రంలో మటన్ ఉత్పత్తి 5.4 లక్షల టన్నులుగా ఉంటే, ప్ర స్తుతం 10.04 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. 2014– 15లో సాలీనా తల సరి మాంసం లభ్యత 12.95 కేజీలుకాగా అదిప్పుడు 22.70 కేజీలకు చేరింది. గొర్రెల పెంపకానికి ఇ ప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. తద్వారా రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం. – దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ -
Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా!
టేస్టీ టేస్టీ మీల్ మేకర్ – చికెన్ బాల్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. కావలసినవి: ►మీల్ మేకర్ – 1 కప్పు (నానబెట్టి, కడిగి తురుములా చేసుకోవాలి) ►బోన్లెస్ చికెన్ – పావు కప్పు (మసాలా, ఉప్పు జోడించి కుకర్లో మెత్తగా ఉడికించుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►శనగపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత ►ఉల్లికాడ ముక్కలు – కొన్ని ►జీలకర్ర – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 ►అల్లం ముక్క – చిన్నది ►పాలు – 2 టేబుల్ స్పూన్లు ►నీళ్లు –తగినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా మీల్ మేకర్ తురుము, ఉడికిన చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు, అల్లం ముక్క అన్నీ మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►ఇందులో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో పాలు.. అవసరం అయితే నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న బాల్స్లా తయారుచేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని.. టొమాటో సాస్లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Coconut Dream: కొబ్బరి తురుము, అరటి పండు గుజ్జుతో కోకోనట్ డ్రీమ్! గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలక్ దోసె, ఓట్స్ పాలక్ ఊతప్పం.. -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!
గూడూరు(తిరుపతి జిల్లా): మాంసంప్రియుల ట్రెండ్ మారింది. మటన్ కొనే స్థోమత లేని వారంతా ఆరోగ్యాన్ని, అంతకుమించి రుచికి ప్రాధాన్యతనిస్తూ నాటుకోడి వైపు పరుగులు తీస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల మాంసంకంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల మాంసం రుచిగా ఉండటంతో కాస్త ధర ఎక్కువైనా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నారు. ఈ మార్పుతో నాటుకోళ్ల పెంపకం సైతం అధికమైంది. పల్లెల్లో అధికంగా దొరికే నాటుకోళ్లను కొందరు అదేపనిగా కొనుగోలు చేసి, ఆదివారం రోజు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలోని ద్రైపది కాంప్లెక్స్ ప్రాంతం ఆదివారం నాటుకోళ్ల సంతను తలపిస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, పండుక్కో పబ్బానికో కోసుకుని ఇంటిల్లిపాదీ సంతోషంగా గడిపేవారు. కాల క్రమంలో వాటిని పెంచడంతోపాటు ఇతర ఇబ్బందుల నేపథ్యంలో పెంచేవాళ్లు తగ్గుతూ వచ్చారు. ఈ కారణంగానే చిన్న చిన్న పల్లెల్లోనూ చికెన్ సెంటర్లు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి. అయితే నాటుకోడి రుచి తెలిసిన పల్లె జనానికి బ్రాయిలర్ కోడి రుచించలేదు. ఫ్రీజర్లలో నిల్వ చేస్తుండటం.. చెన్నై నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కిలో రూ.99 బోర్డులు పెడుతుండటంతో ప్రజల్లో అనుమానం అధికమైంది. ఎందుకొచ్చిన గొడవ అని.. నాటుకోడి తింటే పోలా అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంతెందుకు.. హోటళ్లలోనూ నాటుకోడి, రాగి సంగటి బోర్డులు చూస్తే వాటికి పెరిగిన డిమాండ్ ఇట్టే అర్థమవుతోంది. క్రమంగా పెరుగుతున్న పెంపకం మారిన మాంసం ప్రియుల అభిరుచికి అనుగుణంగా నాటుకోళ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి పెంపకం కూడా అధికమైంది. కొందరు వ్యాపారులు పల్లెలకు వెళ్లి నాటుకోళ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఇక చాలాచోట్ల నాటుకోళ్లను షెడ్లలోనూ పెంచుతున్నారు. వీటిలోనూ రకాలు ఉండటంతో, అందుకు అనుగుణంగా ధర ఉంటోంది. దాదాపుగా మటన్ ధరకు సరితూగుతూ... నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. ఇదే స్థాయిలో ఒకటిన్నర కిలో బరువున్న నాటుకోడి ధర రూ.700 వరకు ఉంటోంది. వ్యర్థాలన్నీ పోనూ సుమారు కిలో మాంసం ఇంటికి చేరుతుంది. అయితే నాటుకోడి అయితే, ఎలాంటి ఆలోచన లేకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదే మటన్ అయితే, ఏది అంటగట్టారోననే అనుమానం తిన్నా తీరదు. ఇంకేముంది.. నాటు, నాటు పాటను గుర్తుకు తెచ్చుకొని ఎంచక్కా లొట్టలేసుకుంటూ నాటుకోడిని ఆరగించేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం విశేషం. నాటుకోళ్లకు డిమాండ్ నేను బేల్దారి పనిచేస్తుంటా.. ఆదివారం మాత్రం నాటు కోళ్లు తీసుకొచ్చి అమ్ముతుంటా. ఒక్కో రోజు వెయ్యి వరకూ మిగులుతుంది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పల్లెటూళ్లలో పెరిగిన కోళ్లు కావడంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేస్తుంటారు. – రమేష్, గూడూరు ఆ రుచే వేరబ్బా బ్రాయిలర్ కోడి మాంసం తిన్నట్టే ఉండదు. ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్ తెచ్చుకుందామంటే ఆ ధర వింటేనే అమ్మో అనిపిస్తుంది. అందుకే నాటుకోడి ఎక్కడ దొరుకుందా అని చూస్తుంటా. రాగి సంగటి కాంబినేషన్ ఉండనే ఉంది. ఆ టేస్టే వేరు. – శ్రీనివాసులురెడ్డి, గూడూరు చదవండి: రూమ్కు తీసుకెళ్లి రోల్డ్గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
చికెన్లో గన్.. ఎయిర్పోర్ట్ అధికారులు షాక్!
ఇంతవరకు కొంతమంది నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కంటపడకుండా తరలిస్తుంటారని తెలుసు. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్ వంటి విచిత్రమైన ప్రదేశాల్లో చాలా గమ్మత్తుగా బంగారాన్ని తరలించడం చూశాం. అలాగే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి వారందరికంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే యత్నం చేసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...యూఎస్లోని ఒక వ్యక్తి చికెన్లో గన్ని స్టఫ్ చేసి చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్డేల్ హాలీవుడ్ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ అందరీ ప్రయాణికులను తనిఖీ చేసినట్లుగానే ఇతన్ని తనిఖీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చికెన్ని చూసి కాస్త ఆశ్చర్యంతోపాటు సందేహం కూడా వచ్చింది అధికారులకు. దీంతో ఆ ప్యాకింగ్ కవర్ని ఓపెన్ చూసి పరిశీలించగా...ఆ చికెన్ లోపల గన్ని కుక్కి ఉంచాడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్కి గురయ్యారు. ఇంతవరకు తాము వివిధ రకాల్లో ఆయుధాలను తరలించడం చూశాం గానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్పోర్ట్ పోలీసులు. వాస్తవానికి యూఎస్ ఎయిర్లైన్స్లో తుపాకీలను నిషేధించ లేదు. కానీ ప్రయాణికులు వాటిని తీసుకుని వెళ్లేటప్పుడూ..తనిఖీ చేసే సామానుల్లోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకీలను అన్లోడ్ చేసి హార్డ్ కంటైనర్లో లాక్ చేసి పట్టుకెళ్లాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు కచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. There’s a personal fowl here. Our officers @FLLFlyer made this very raw find. We hate to break it to you but stuffing a firearm in your holiday bird for travel is just a baste of time. So, don’t wing it, you'll find all the proper packaging info here: https://t.co/Zm2XnorDx7 pic.twitter.com/BpdbEwwouX — TSA (@TSA) November 7, 2022 (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
దావత్ @మునుగోడు!.. నాటుకోడి మాంసం, మద్యం, కల్లుతో విందులు
సాక్షి, రంగారెడ్డి: ‘మనుగోడు పోదాం చలో..చలో.. ఎంజాయ్ చేద్దాం పదో.. పదో’.. అనే నినాదం ప్రస్తుతం జిల్లాలో మార్మోగుతోంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలక్షన్ పుణ్యాన రాజకీయ పార్టీల నేతలు పండుగ చేసుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే ఆయా పార్టీల శ్రేణులకు కలిసొచ్చింది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిత్యం వారికి కేటాయించిన గ్రామాల్లో డోర్ టు డోర్ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి పలువురు నేతలు అక్కడకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రచార బాట పట్టారు. బీఎస్పీ నుంచి సైతం స్థానిక నేతలు తరలివెళ్తున్నారు. నిత్యం ఉదయం 7గంటలకే సాగర్రోడ్డు నుంచి మాల్ మీదుగా మునుగోడులోని గ్రామాలకు చేరుకుంటున్నారు. రాత్రి వేళ తిరిగి వస్తున్నారు. ఇలా వారం రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్లు వందలాది మంది ప్రచారానికి వెళ్తున్నారు. నాటు కోడి.. భలే క్రేజీ మునుగోడు ప్రచారంలో విందు కోసం నాటు కోడి మాంసం క్రేజ్గా మారింది. నగరం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు విందులో కచ్చితంగా నాటు కోడి మాంసం ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే గ్రామాల్లో పార్టీ శ్రేణులకు ముందుగానే సమాచారం ఇచ్చి.. ఈ రోజు మా నేత వస్తున్నాడు.. నాటు కోడి మాంసం ఉండేలా చూడు బ్రదర్.. ఖర్చు ఎంతైనా చూసు్కందాం అని సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ నాటు కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. భోజనం ఏర్పాట్లు చేసే నిర్వాహకులు నిత్యం రంగారెడ్డి జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్, నల్గొండ జిల్లా పరిధిలోని చింతపల్లి, దేవరకొండ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్లి నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో మాంసం ఉన్న నాటు కోడి ధర రూ.2 వేలు పలుకుతోంది. రెండు కిలోల కోడిని రూ.5 వేలకు పైగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. నాటుకోడి మాంసంతో పాటు విలువైన మద్యం, కల్లు, మటన్, చికెన్తో విందు ఆరగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, చేతి ఖర్చుల కోసం నిత్యం రూ.వేలల్లో జేబు నింపుకొంటున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తమకు అక్కర్లేదు.. నిత్యం విందు భోజనం, చేతి ఖర్చులు అందుతున్నాయా..? లేదా..? అనే విధంగానే అన్ని పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న ఓటర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జిల్లా నేతలకు మునుగోడు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఏ పార్టీ వారు వెళ్లి అడిగినా.. మీకే మా మద్దతు ఓటుకు రేటెంత అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు సదరు గ్రామాల్లోని తమ బంధువులు, తెలిసిన వాళ్లను తీసుకెళ్లి అయ్యా.. అమ్మా అంటూ బతిమాలుతున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల ఇళ్లల్లోనే విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఓటర్లను యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్ మండలాల పరిధి లోని గ్రామాలకు తీసుకువచ్చి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి.. మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని మద్యం తాగించి, డబ్బులు ఇస్తున్నారు. మునుగోడు పోరుతో మద్యం, చికెన్, మటన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
Hyderabad: బాగానే లాగించేశారు!.. ఒకే రోజు అన్ని లక్షల కేజీలా?
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ రోజు గ్రేటర్ పరిధిలో మాంసం విక్రయాలు భారీగా జరిగాయి. నగరవాసులు ‘ముక్క’పై మక్కువ కనబర్చారు. సాధారణ రోజుల్లో 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సందర్భంగా బుధవారం 30 లక్షల కిలోల చికెన్, 10 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో మటన్ రూ. 850– 900.. కిలో చికెన్ రూ.230– 250కి విక్రయించారు. మాంసం అమ్మకాల జోరు ఆదివారం వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: (Dussehra 2022: కాసులు కురిపించిన దసరా) -
‘ఫ్రీగా క్వార్టర్, కోడి.. కేటీఆర్గారూ మీ ఐడియానేనా?’
వైరల్: తెలంగాణ.. జాతీయ స్థాయి రాజకీయాలకు వేదిక కానుందనే చర్చ జోరందుకుంది. దసరా పండుగ నాడు టీఆర్ఎస్ తరపున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారనే జోష్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ తరుణంలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కోడి, క్వార్టర్ బాటిల్ను పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అని తెలుస్తోంది. హమాలీలకు దగ్గరుండి మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారాయన. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్గా మారింది. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ నేపథ్యంలో కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. Liquor party! Ahead of #KCR’s ‘national party’ #BRS launch, #TRS party leader Rajanala Srihari distributes liquor and chicken to locals, in Warangal, to celebrate the launch. The leader, reportedly, said he wants #KCR to become PM, his son #KTR to be CM of #Telangana. pic.twitter.com/J0gOYlsKVS — Rishika Sadam (@RishikaSadam) October 4, 2022 ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ కేటీఆర్ను ట్యాగ్ చేశారాయన. #WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU — ANI (@ANI) October 4, 2022 Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 -
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు.. కోట్ల టర్నోవర్తో అందరికీ షాకిచ్చారు!
వ్యర్థాల నుంచి కంపోస్ట్ చేయడం లేదా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ పద్ధతి మనందరికీ తెలుసు, కానీ మనం ధరించే బట్టలు కూడా వ్యర్థాలతో తయారు చేయవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఓ దంపతులు మాత్రం అలా ఆలోచించారు కాబట్టే, కోడి ఈకలతో మనం ధరించే బట్టలు తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వారి ఐడియా విని ఎగతాళి చేసిన వాళ్లే ఆశ్చర్యపోయేలా చేశారు జైపూర్కి చెందిన ముదిత, రాధేష్. కాలేజీలో పునాది పడ్డ ఈ ఐడియా, తమ కఠోర శ్రమ, అభిరుచితో దాన్ని కంపెనీగా మార్చిన ఈ దంపతులు ప్రస్తుతం కోట్లలో టర్నోవర్ని సొంతం చేసుకున్నారు. అనుకోకుండా ఆలోచన.. అదే వ్యాపారంగా మారి ముదిత మాట్లాడుతూ.. జైపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లో రాధేష్తో ఎంఏ చేస్తున్నప్పుడు, వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే దానిపై ప్రాజెక్ట్ చేశాను. ఒకరోజు, రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న కసాయి దుకాణంలో నిలబడి ఉండగా కోడి ఈకలను చేత్తో తాకాడు. అనుకోకుండా అతనికి ఓ ఆలోచన వచ్చింది దాన్నే ప్రాజెక్ట్గా మార్చాం. ఆపై ఆ ప్రాజెక్ట్ ఐడియాతోనే బిజినెస్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు సుమారు 8 సంవత్సరాలు పట్టింది. 2010లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2018లో పూర్తయింది. ఇందుకోసం చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ వైపు.. రాధేష్ కుటుంబం పూర్తిగా శాఖాహారం కాబట్టి, వాళ్లు ఈ వ్యాపారాన్ని నిరాకరించారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ల కుటుంబం ఆదుకోలేదు. ఈ క్రమంలో వాళ్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు.. ఇంతకు ముందు ఎవరూ అలాంటి బట్టను తయారు చేయలేదు కాబట్టి, పుస్తకాలలో, ఇంటర్నెట్లో కూడా దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చాలా పరిశోధన తర్వాత, కోడి ఈకలను బట్టలుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. ఇక్కడ వరకు పట్టుదలతో ముందుకు సాగిన వీళ్లకు మళ్లీ వీటి సేల్స్ తలనొప్పిగా మారింది. కానీ తొందరగానే కోడి ఈకలతో తయారు చేసిన శాలువాలకు ఇక్కడి కంటే విదేశాల్లో దీనికి అధిక డిమాండ్ ఉన్న విషయాన్ని గమనించారు. అప్పటి నుంచి వారి ఉత్పత్తులు చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చిన్న కుటీర పరిశ్రమ స్థాయిలో మొదలైన వారి ఆలోచన రూపమే.. గత రెండున్నరేళ్లలో కంపెనీ దాదాపు 7 కోట్ల వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
Recipe: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారు చేసుకోవచ్చు!
బోన్లెస్ చికెన్.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్ పొటాటో నగ్గెట్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారీకి కావలసినవి: ►బోన్లెస్ చికెన్ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి) ►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున ►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 2 (ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్ స్పూన్ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి) ►బ్రెడ్ పౌడర్ – గార్నిష్ కోసం ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి. ►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా! Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
తెలంగాణ: ఆ ఏడు మండలాల్లో నాటు కోళ్ళు గాయబ్
అక్కడి వూళ్ళలో కోళ్ళు మాయం అవుతున్నాయి. మాయం అవుతున్నాయంటే వూళ్ళలో దొంగలేమీ పడి ఎత్తుకుపోలేదు. పోనీ ఏ రోగమో వచ్చి నాటు కోళ్ళన్నీ చనిపోలేదు. కానీ, ఏడు మండలాల్లో నాటు కోళ్ళు కనిపించడంలేదంట. ఎందుకిలా జరిగింది. ఇంతకీ ఆ వూళ్ళు ఎక్కడున్నాయి? పల్లెటూళ్ళలో నాటు కోళ్ళకు గిరాకీ ఎక్కువ. చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు. బ్రాయిలర్ కోళ్ళు తిని విసుగు చెందినవారు కచ్చితంగా నాటు కోడిని తినాలనుకుంటారు. ఎంత రేటు పెట్టైనా కొనాలనుకుంటారు. సహజసిద్ధంగా పెరిగే నాటుకోడిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నాటుకోడి ఉన్నట్లుండి నెల రోజుల్లోనే ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరిగింది? అక్కడేమన్నా కోళ్లకు రోగాలు వచ్చాయా అంటే అదేం లేదు. అక్కడ ఉప ఎన్నిక వస్తోంది. అదేంటి ఉప ఎన్నిక వస్తే నాటు కోళ్లు మాయం కావడం ఏంటనుకుంటున్నారా? విషయం అంతా అక్కడే ఉంది మరి.. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ చూసినా ఎనికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల తేదీ అయితే రాలేదు గాని ..మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే పార్టీల కార్యకర్తలు, నేతలు, జనాలకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. విందులో బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటు కోళ్ళకే మక్కువ చూపిస్తున్నారట. అందుకే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాటు కోళ్ళన్నీ అక్కడికొచ్చేవారికి ఆహారంగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ నాటు కోళ్ళ కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించడంలేదంటున్నారు. ఎక్కడైనా కనిపించినా..దాని ధర బంగారం స్థాయికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో మటన్కు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకు ముందుకు గొర్రెలు, మేకలు విరివిగా దొరికేవి. వాటి రేట్లు కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగి మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రచార సభలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మీటింగులకు వచ్చేవారికి నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే వారు నారాజ్ అవుతున్నారట. ఒకవేళ ముక్క భోజనం పెట్టకపోతే మనసులో పెట్టుకుని ఎక్కడ ఓటు వేయరోనన్న ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోందట.. మొత్తానికి మునుగోడులో మటన్ ముక్కతో పాటు నాటుకోడికి కూడా తిప్పలొచ్చాయి. ఉప ఎన్నిక ఏమో గాని మాకు నాటు కోళ్ళు దొరకడంలేదని మునుగోడు నియోజకర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముక్క.. పక్కాయేనా..?
అనంతపురం నాల్గో రోడ్డులో రమేష్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరింటికి బంధువులొచ్చారు. చాలా రోజులకు ఇంటికి రావడంతో ప్రత్యేక వంటకాలతో వారిని సంతోష పెట్టాలని.. రమేష్ స్థానికంగా ఉండే ఓ మటన్ దుకాణానికి వెళ్లి కేజీ పొట్టేలు మాంసం తెచ్చి భార్యతో కూర చేయించాడు. ఏమైందో తెలియదు.. తిన్న కొద్దిసేపటికీ వారందరికీ ఒకటే విరేచనాలు. ఆస్పత్రికి వెళ్లి రూ. వెయ్యి ఖర్చు చేస్తే గానీ ఉపశమనం లభించలేదు. అనంతపురంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మాంసం దుకాణాలు ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి. రాయదుర్గం: పెళ్లయినా, ఇతర ఏ ఫంక్షన్ అయినా ప్రస్తుత రోజుల్లో నాన్వెజ్ అంటేనే ప్రజలు ఉత్సాహం చూపుతారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరకడంతో మాంసాహారంపై మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటినా ఆదివారమొస్తే కచ్చితంగా తినాల్సిందేనంటున్నారు. అయితే, దీన్నే అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ఇష్టానుసారంగా నెలకొల్పి అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు సాగిస్తూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నిబంధనలు ఇలా.. కబేళాలు, మాంసాహార దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏర్పాటు చేసిన కబేళా (స్లాటర్ హౌజ్)ల్లోనే జీవాలను వధించాలి. వధించే ముందు పశువైద్యాధికారి జీవాలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. వధించిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విక్రయించేందుకు వీలుగా మెడ భాగంలో ధ్రువీకరణ ముద్ర వేస్తారు. వినియోగదారులు ఆ ముద్రను చూసి కొనుగోలు చేస్తే కొంత భరోసా ఉంటుంది. జరుగుతోంది ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు. కొన్నింటిని కబేళాల్లో వధిస్తున్నా.. పశు వైద్యాధికారి ధ్రువపరచడం లేదు. మరికొందరైతే దుకాణాల ఆవరణలోనే వధిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అయితే పట్టించుకునే వారే లేరు. అటు స్థానిక అధికారులు, ఇటు పశు సంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరుస్తున్నారు. పలు వ్యాధులతో చనిపోయిన జీవాలను సైతం ఎక్కడో వధించి తీసుకొస్తూ ప్రజలకు కట్టబెట్టేస్తున్నారు. ఆరోగ్యాలను హరిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా చోట్ల ఉన్న కబేళాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలు పక్కాగా అమలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతంది. నెలకోసారి కొంటాం పెద్దల సాంప్రదాయ ప్రకారం ఇంట్లో కోడి మాంసం వండటం లేదు. దీంతో మేక, పొట్టేలు మాంసం కొనాల్సి వస్తోంది. పెద్ద కుటుంబం కావడంతో మూడు కిలోలు కొంటాం. ధర తక్కువ ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు కొని తిన్నాం. ప్రస్తుతం నెలకు ఒకసారి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. – బోయ శివన్న, రైతు, రంగచేడు కమిషనర్లకే చర్యలు తీసుకునే అధికారం కబేళాల ఏర్పాటు, మాంసం నాణ్యతగా ఉండేలా చూడడం, అపరిశుభ్రత ఉంటే చర్యలు తీసుకోవడం తదితర చర్యలు చేపట్టే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఉంది. మాకు సమాచారం ఇస్తే వైద్యాధికారులు వెళ్లి జీవం ఎలా ఉందో ధ్రువీకరిస్తారు. ప్రాథమిక పరీక్షల్లోనే ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అవసరమైతే వధించిన తర్వాత జీవాల పరీక్షలకు ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్యంగా ఉండే మాంసం విక్రయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. లేదంటే కఠిన చర్యలు చేపడతాం. – ఏవీ రత్నకుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ, అనంతపురం నాణ్యతలేని మాసం విక్రయిస్తే కఠిన చర్యలు రాయదుర్గంలో అధికారికంగా జంతుశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం మార్కెట్ వద్దే స్థలం కేటాయించి వ్యాపారాలు చేపట్టేలా ఆదేశాలిచ్చాం. అక్కడ కాకుండా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నాయి. మూగజీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా..? లేదా అని పశు వైద్యులు గుర్తించాకే వధించాల్సి ఉంటుంది. వ్యాధుల బారిన పడ్డ, మృతి చెందిన వాటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేస్తాం. – దివాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం -
నాటు కోళ్ళు మాయం..
-
Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్!
చికెన్, కోడిగుడ్లు, మొక్కజొన్న పిండి, నువ్వులు సెసెమీ క్రస్టెడ్ చికెన్ ఇలా తయారు చేసుకోండి! కావలసినవి: ►బోన్లెస్ చికెన్ – ఒక కేజీ (ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి) మారినేషన్ కోసం: ►పెరుగు – కప్పు ►నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు ►పచ్చి బొప్పాయి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్ ►గరం మసాలా పొడి– ఒక టీస్పూన్ ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►నూనె – 3 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినంత) కోటింగ్ కోసం: ►కోడిగుడ్లు – 3 ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – అర టీ స్పూన్ ►నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి – 6 (సన్నగా తరగాలి) ►వెల్లుల్లి పేస్ట్– టీస్పూన్ ►మిరప్పొడి – టీ స్పూన్ ►వెనిగర్ – టేబుల్ స్పూన్ ►బెల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్.. తయారీ: ►చికెన్ను శుభ్రం చేసి, మారినేషన్ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి కలపాలి. ►మారినేట్ చేసిన చికెన్ ముక్కలను కోటింగ్ మిశ్రమంలో వేసి తీసి నువ్వులలో వేసి (చికెన్ ముక్కల మసాలాలకు నువ్వులు అంటుకునేటట్లు) కలపాలి. ►అవెన్ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Til Ki Barfi And Sesame Veg Salad: నువ్వులతో ఆరోగ్యం.. తిల్ కీ బర్ఫీ, సెసెమీ వెజ్ సలాడ్ తయారీ ఇలా! Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్పటే కోకోనట్, బటాడా వడ తయారీ -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?
రాయదుర్గం(అనంతపురం జిల్లా): రాయదుర్గానికి చెందిన ఎరుకుల వెంకటేశులు గ్రామాలు తిరుగుతూ నాటుకోళ్లను హోల్సేల్ ధరలకు కొనుగోలు చేస్తాడు. ద్విచక్రవాహనంపై బళ్లారికి తీసుకెళ్లి అక్కడ అధిక ధరలకు అమ్మకం చేపట్టి లాభాలు పొందుతున్నాడు. వారానికి అన్ని ఖర్చులూ పోను రూ.6 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా నాటుకోడి వ్యాపారాలు చేపట్టి ఆశించిన లాభాలు పొందే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. నాటుకోడి అంటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. బ్రాయిలర్ చికెన్ ధరకు రెట్టింపు, మటన్తో సమానంగా ధర పలుకుతున్నా కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటి మాంసానికి ఉన్న ఆదరణ చూసి కొందరు దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలిన జాతులను చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాటో.. కాదో నిర్ధారించుకోవడం కొంత కష్టంగా ఉన్నా, తరచి చూస్తే ఇలాంటి మోసాలకు తెరదించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలా పెంచుతారంటే..? గ్రామాల్లో దేశవాళీ నాటుకోడి పెరిగేందుకు ఎక్కువ కాలం పడుతుంది. ఆరు వారాలకు 400 గ్రాముల బరువు పెరుగుతుంది. వంద రోజులు దాటితే 1.5 కిలోలకు ఎదుగుతాయి. అదే వనరాజ, గిరిరాజ కోళ్లు ఆరు వారాల్లోనే 850 గ్రాముల పైన, బ్రాయిలర్ 1.50 కిలోల వరకు పెరుగుతుంది. ఫారంలో లైట్ల వెలుగులో నిద్రపోకుండా చేసి, మొక్కజొన్న, జొన్న, శనగచెక్క వంటి బలమైన ఆహారాన్ని అందిస్తూ వేగంగా పెరిగేలా చేస్తున్నారు. వాటినే మార్కెట్లో నాటుకోళ్లుగా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట తిరిగే దేశవాళీ కోళ్లు పురుగులు, ఆకులు, గడ్డి ఇతర విత్తనాలు వంటివి తిని బలిష్టంగా ఉంటాయి. గుర్తించడం ఇలా.. ♦నాటుకోడి కాళ్లు, ఎముకలు బలిష్టంగా ఉంటాయి. ఎక్కువ సమయం బయట నిల్వ ఉంచినా మాంసం పాడవ్వదు. ♦వండిన తర్వాత ఎముకలు నమిలేందుకు గట్టిగా ఉంటాయి. ♦మటన్తో సమానంగా ఉడికించాల్సి వస్తుంది. ♦గిరిరాజ, వనరాజ, కడక్నాథ్ కోళ్లు సాధారణంగా ఒకే రంగులో జుట్టు కలిగి ఉంటాయి. ఎముకలు పలుచగా, ఈకలు ఎక్కువగా ఉంటాయి. ♦బ్రాయిలర్ మాంసం కూడా తక్కువ సమయంలోనే ఉడికించవచ్చు. నాటుకోడి రుచే వేరు.. కోళ్ల మాంసంలో నాటు కోడి రుచేవేరు. ఆ మాంసం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇలాంటి దేశవాళీతో పాటు షెడ్లలో వేగంగా పెరిగే వనరాజ, గిరిరాజ, కడక్నాథ్ వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటినీ నాటుకోడి మాంసమని చెప్పి విక్రయిస్తూ మోసగిస్తున్నారు. నాటుకోడి విక్రేతలు ధరలో ఎక్కడా రాజీపడరు. కిలో రూ.350 నుంచి రూ.400కు తక్కువ ఇవ్వలేరు. షెడ్లలో పెంచే కడక్నాథ్, గిరిరాజ ఇతర జాతుల కోళ్లు రూ.300లోపే లభ్యమవుతాయి. ఉమ్మడి జిల్లాలో రోజూ ఒకటిన్నర టన్ను వరకు విక్రయాలు జరుగుతుంటాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే టన్ను వరకు అమ్మకాలు జరుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ద్వారా తెలిసింది. సాధారణంగా చాలామంది ఆదివారం మాంసం తినేందుకు ఇష్టపడతారు. పట్టణం, పల్లె ఏదైనా సరే ప్రస్తుతం అందరి చూపు నాటు కోడి వైపు మళ్లడంతో విక్రయదారులు సైతం ధరలు పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయం.. లాభదాయకం.. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ప్రత్యామ్నాయంగా నాటుకోళ్ల పెంపకం ఎంచుకున్నాను. మూడేళ్ల క్రితం 100 కోళ్ల పెంపకంతో మొదలు పెట్టాను. ప్రస్తుతం 300 కోళ్లకు ఫారం సామర్థ్యం పెరిగింది. ఇప్పటికే 200 కోళ్లు అమ్మేశాను. మోసం లేకుండా నాణ్యమైన దేశవాళీ బ్రీడ్ కోళ్లు మాత్రమే అమ్మడంతో గిరాకీ బాగా పెరిగింది. ఫారం వద్ద అయితే కిలో రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. ఇదే కోడి బయట మార్కెట్లో రూ.500కు పైగా అమ్ముడుపోతున్నాయి. పెట్టుబడి పోనూ రూ.40 వేలకు పైగా లాభం చేకూరుతోంది. – గజ్జిని సత్యనారాయణ, రైతు, గొల్లపల్లి పొలం వద్దే పెంపకం పొలం వద్దే 50 నుండి 70 వరకు నాటు కోళ్లు పెంచుతాను. పొలంలో ఆరుబయట మేత కోసం తోలి.. సాయంత్రం కొన్ని గింజలు వేస్తాను. ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోలకు పైగా తూకం రాగానే అమ్మకం చేపడతాను. చాలామంది అధికారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. అడ్వాన్స్ కూడా ఇచ్చిపోతారు. కిలో రూ.300 నుండి రూ.400 వరకు విక్రయిస్తాను. మంచి లాభాలు ఉన్నాయి. నాటుకోడి రుచికి.. గిరిరాజ రుచికి చాలా తేడా ఉంటుంది. – జయరాములు, రైతు, బానేపల్లి కొవ్వు శాతం తక్కువ పెరటి కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతాయి. షెడ్లలో పెంచిన వాటికంటే బలంగా ఉంటాయి. మిగిలిన వాటితో పోల్చితే పోషకాలు ఎక్కువ. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోడి గుర్తించే కొనుగోలు చేయడం మంచిది. ఆహార నియమాల్లో మార్పులు రావడంతో పాటు చాలా మంది మాంసం ప్రియులు నాటుకోడి వైపు చూస్తున్నారు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మంచి గిరాకీ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ 10 నుండి 20 కోళ్ల వరకు ఇళ్ల వద్ద పెంపకం కూడా బాగా పెరిగింది. – నవీన్కుమార్, పశువైద్యాధికారి, రాయదుర్గం -
నాన్ వెజ్ ప్రియులకు షాక్..పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
మండపేట(కోనసీమ జిల్లా): శ్రావణ మాసంలోను చికెన్ ధర దిగి రావడం లేదు. రూ.300కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? రోజూ 3.2 లక్షల కిలోల వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్సీజన్గా భావించి కొత్త బ్యాచ్లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగిరావడం లేదు. అన్ని మేతలు మిక్స్చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడికి రూ.110 వరకు ఖర్చవుతుందంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగా కంపెనీలు ఇస్తున్న కమీషన్ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త బ్యాచ్లపై కొంత ప్రభావం పడిందంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, ఆశ్వారావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో శ్రావణమాసమైనప్పటికి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం స్కిన్లెస్ కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. మేత ధరలు తగ్గితేనే కొత్త బ్యాచ్లు అన్ సీజన్, మేత ధరలకు భయపడి చాలామంది రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
కొండ దిగొస్తున్న కోడి..! తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్లో మాత్రం..!
కడప అగ్రికల్చర్: మొన్నామొన్నటి దాకా కొండ దిగని కోడి మాంసం ధరలు వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మరో వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభంకానుండటంతో చికెన్ ధర మరింత తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు. 20 రోజుల క్రితం రూ.250 పైన ఉన్న ధర వారం రోజుల నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం స్కిన్ లెస్ రూ. 170, విత్ స్కిన్ కిలో రూ. 150 వచ్చింది. చదవండి👉🏻గ్లూకోజ్ పౌడర్ అనుకొని.. ప్రస్తుతం ఎండల తగ్గి వాతావరణం చల్లబడటంతోపాటు పాటు వర్షాలు కూడా వస్తుండటంతో చికెన్ ఉత్పత్తి కొంచం పెరిగిందని వ్యాపారులు తెలిపారు. వేసవిలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 300 పైగా పలికింది. దీంతో సామాన్యులు చికెన్ తినాలంటే జంకే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొండ దిగి వస్తుండడంతో పేద, మద్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బోనాల జాతర నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్ ధరలు పెద్దగా దిగిరాలేదు. అక్కడ స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.240 ఉండగా.. లైవ్ బర్డ్ 180 గా ఉంది. బోన్లెస్ చికెన్ 280 గా ఉంది. చదవండి👉🏻అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే? -
Recipe: చికెన్ ఆమ్లెట్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి!
చికెన్తో రొటీన్ వంటకాలు కాకుండా ఇలా ఓసారి ఆమ్లెట్ ట్రై చేయండి. చికెన్ ఆమ్లెట్ తయారీకి కావలసినవి: ►గుడ్లు – నాలుగు ►ఉప్పు – రుచికి సరిపడా ►మిరియాలపొడి – రుచికి సరిపడా ►నూనె – టీస్పూను ►ఉడికించి సన్నగా తురిమిన చికెన్ – ముప్పావు కప్పు ►ఛీజ్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►పాలకూర తురుము – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేయాలి. ►బీట్ చేసిన గుడ్ల సొనలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి మరోసారి బీట్ చేయాలి. ►ఇప్పుడు పాన్పై నూనెవేసి వేడెక్కనివ్వాలి. ►వేడెక్కిన నూనెపై బీట్చేసిపెట్టుకున్న గుడ్ల సొన మిశ్రమాన్ని ఆమ్లెట్లా పోసుకోవాలి. ►ఆమ్లెట్ మధ్యలో నుంచి అంచుల వరకు చక్కగా కాలేలా సొనను పరుచుకుంటూ సన్నని మంట మీద కాల్చాలి. ►ఇప్పుడు చికెన్ తరుగుని అవెన్లో కాస్త వేడి చేసి ఆమ్లెట్పైన వేయాలి. ►చికెన్తోపాటు చీజ్ తరుగు, పాలకూర తరుగు వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇప్పుడు ఆమ్లెట్ను సగభాగం మడిచి చీజ్ కరిగేంత వరకు రెండు వైపులా చక్కగా కాల్చాలి. ►చక్కగా కాలిన ఆమ్లెట్ను ఫ్రైడ్ బ్రెడ్, స్పినాచ్ సలాడ్తో సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Masala French Toast Recipe: ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్! Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా! -
Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ తయారీ ఇలా!
చికెన్ స్ట్రిప్స్ ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి! చికెన్ స్ట్రిప్స్ తయారీకి కావలసినవి: ►స్కిన్, బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ – కేజీ (పొడవాటి ముక్కలుగా తరగాలి) ►చీజ్ తురుము – కప్పు ►బ్రెడ్ ముక్కల పొడి – కప్పు ►కొత్తిమీర తరుగు – పావు కప్పు ►మైదా – కప్పు ►మిరియాల పొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►గుడ్లు – మూడు ►నూనె – డీప్ఫ్రైకి సరిపడా. చికెన్ స్ట్రిప్స్ తయారీ విధానం ►ఒక గిన్నెలో చీజ్, బ్రెడ్ ముక్కల పొడి, కొత్తిమీర తరుగు వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి. ►మరో గిన్నెలో గుడ్లను పగులగొట్టి సొనను బీట్ చేసి పెట్టుకోవాలి. ►మరో గిన్నె తీసుకుని మిరియాలపొడి, మైదా, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పెట్టుకోవాలి. ►ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ను ముందుగా గుడ్లసొనలో ముంచాలి. ►తరువాత మైదా మిశ్రమంలో ముంచాలి. మైదాలో ముంచి మరోసారి గుడ్లసొనలో ముంచాలి. ►చివరిగా చీజ్ మిశ్రమంలో ముంచి డీప్ఫ్రై చేయాలి. ►రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రైచేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్ పకోడి చేసుకోండి! Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్.. -
చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..
శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్ టిఫిన్ సెంటర్’ పేరుతో ఉండే ఈ టిఫిన్ సెంటర్లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. ఒకప్పుడు ఫైవ్స్టార్ హొటల్లో చెఫ్గా పనిచేసిన సుదర్శన్.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్ మాత్రం తన హొటల్ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది. రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్ దోసె, స్వీట్ కార్న్ దోసె, ఎగ్ ఖీమా దోసె, చికెన్ ఖీమా దోసె, సుదర్శన్ స్పెషల్ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్ సెంటర్ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. కస్టమర్ల సంతృప్తే ముఖ్యం నా టిఫిన్ సెంటర్కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్ సెంటర్ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. – సుదర్శన్, కుక్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రుచులు అమోఘం నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్ సెంటర్లో స్పెషల్. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి. – రంగాల సుమన్, వినియోగదారుడు -
కోడి పుంజుకు టికెట్ కొట్టిన బస్సు కండక్టర్
-
Recipe: హర్యానా వంటకం.. సాగ్ చికెన్ తయారీ ఇలా!
దేశ రాజధాని దిల్లీకి అత్యంత చేరువలో ఉన్న రాష్ట్రం హర్యానా. హర్యానీల ప్రధాన వంటకాల్లో రోటి చాలా ప్రత్యేకం. అందులోకి వారు వండుకునే సాగ్ చికెన్ గురించి తెలుసుకుందాం... సాగ్ చికెన్ కావలసినవి: ►చికెన్ – అరకేజీ ►ఆవాలు – అరటీస్పూను ►జీలకర్ర – టీస్పూను ►ఎండు మిర్చి – రెండు ►ఉల్లిపాయముక్కలు – రెండు కప్పులు ►టొమాటో తరుగు – కప్పు ►పచ్చిమిర్చి – రెండు ►వెల్లుల్లి రెబ్బలు – ఆరు ►అల్లం – అంగుళం ముక్క ►పసుపు – రెండు టీస్పూన్లు ►కారం – ఒకటిన్నర టీస్పూన్లు ►ధనియాల పొడి – టేబుల్ స్పూను ►జీలకర్ర పొడి – టేబుల్ స్పూను ►పాలకూర – రెండు కప్పులు ►ఉప్పు – రుచికి సరిపడా ►ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు. తయారీ.. ►ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగును బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ►పాలకూరను శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ►కాగిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ∙ ►ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙ ►తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు, రుచికిసరిపడా ఉప్పు వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►ఇప్పుడు టొమాటో తరుగు, పాలకూర పేస్టు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ►ఆయిల్ పైకి తేలిన తరువాత మరికొన్ని నీళ్లు పోసి చికెన్ ముక్కలు మెత్తగా ఉడికించి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makki Roti: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో సులువుగా మక్కి రోటీ తయారీ! Indonesian Chicken Satay Recipe: ఇవన్నీ కలిపి బోన్లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! -
Recipe: ఇవన్నీ కలిపి బోన్లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!
చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ బోర్ కొట్టాయా? అయితే బోన్లెస్ చికెన్ ముక్కలతో ఇలా ఇండోనేషియన్ వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి! ఇండోనేషియన్ సటే తయారీకి కావలసిన పదార్థాలు ►బోన్లెస్ చికెన్ ముక్కలు – కేజీ ►కబాబ్ స్టిక్స్ – ఆరు (చల్లటి నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి ►కీరా – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి ►ఆయిల్– వేయించడానికి సరిపడా. మ్యారినేషన్ కోసం ►నూనె – మూడు టేబుల్ స్పూన్లు ►నిమ్మగడ్డి – రెండు రెమ్మలు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ధనియాల పొడి – టీస్పూను ►కారం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు తయారీ... ►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి.. మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాల. ►నానిన చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్కు గుచ్చి బొగ్గు మీద కాల్చాలి. ►రెండు పక్కల కాలిన తరువాత కొద్దిగా ఆయిల్ రాసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►కీరా, ఉల్లిపాయ ముక్కలు, ఏదైనా సాస్తో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Chha Gosht Recipe: అరకేజీ మటన్తో ఇలా ఘుమఘుమలాడే వంటకం తయారు చేసుకోండి! -
పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్
ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది. ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది. అనంతపురం నుంచి దిగుమతి డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్ బ్రీడ్ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు. జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు జిల్లాలో డీఆర్డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్), సీఐఎప్ (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్), హెచ్డీఐఎఫ్ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు. ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్ప్లాన్ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్డీఐఎఫ్ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు వైఎస్సార్ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు. 10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నాం. – బీ.బాబూరావు, పీడీ, డీఆర్డీఏ, ఒంగోలు మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది. – జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు -
బుల్లెట్ బండి.. నోరూరేటట్టు తిండి!
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఈ యువకుడి పేరు పిల్లి శివరామకృష్ణ. ఊరు కొవ్వూరు. చదివింది బీటెక్. చైన్నె, ముంబయి వంటి ప్రాంతాల్లో బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ దుకాణాన్ని అతను చూశాడు. అనుకున్నదే తడవుగా బుల్లెట్ కొనుగోలు చేశాడు. రూ.3 లక్షలు వెచ్చించి బుల్లెట్కు బార్భీక్యూ అమర్చాడు. వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. బుల్లెట్కు వివిధ రకాల లైట్లు అమర్చడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొవ్వూరు పట్టణంలో కొత్తరకంగా వ్యాపారం ప్రారంభించడంతో స్థానికులను సైతం ఆకట్టుకుంటున్నారు. కలర్స్, ఆయిల్స్, టెస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మైదా వంటివి వాడకుండానే వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేయడంతో పట్టణ వాసులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దీనిని రోడ్డు మార్జిన్లో గురువారం ప్రారంభించారు. ఈ నోట ఆ నోట విని ఈ వెరైటీ ఫుడ్ తినడానికి మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఇలా బుల్లెట్కు అన్నీ అమర్చుకోవడం ద్వారా వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రాంతాలకు మార్చుకోవచ్చని శివ అంటున్నారు. అంతేకాకుండా విందు భోజనాలకు సైతం వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి సరఫరా చేస్తానని చెబుతున్నారు. తాను 2013లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్లో వింగ్స్ అండ్ ఫ్రైస్ రెస్టారెంట్లో మూడేళ్లు మేనేజర్గా పనిచేశానని చెప్పారు. డోమినో పిజ్జా రాజమహేంద్రవరం, హైదరాబాద్లో రెండేళ్ల పాటు పనిచేశానన్నారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ టీములో కొన్నాళ్లు పనిచేశానని శివ చెబుతున్నారు. తనకు హోటల్ రంగంతో ఉన్న అనుబంధంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు వివరించారు. -
మాంసాహార ప్రియులు పెరుగుతున్నారట!.. ముక్క లేనిదే ముద్ద దిగదే!
సాక్షి, అమరావతి: దేశంలో ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు. ఇక్కడే అధికం.. పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్ తర్వాత అండమాన్ – నికోబార్ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా మాంసాహారులు ఆంధ్రప్రదేశ్లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య çపురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది. 2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది. అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం -
Portable Grill: పోర్టబుల్ గ్రిల్.. చికెన్, మటన్ అన్నింటికీ.. ధర 6,131
ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేవి నోరూరించే పసందైన రుచులే. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లాంగ్ డ్రైవ్కి వెళ్లినప్పుడు.. అలాంటి రుచులను అందిస్తూ ఆ సందర్భాన్ని అమృత జ్ఞాపకంగా మిగిల్చేదే.. ఈ లగేజ్ స్టయిల్ పోర్టబుల్ గ్రిల్. దీన్ని మన లగేజ్తో పాటు వెంట తీసుకెళ్తే చాలు, రుచుల పంట పండినట్లే. ఇందులో ఎలాంటి వంటైనా నిమిషాల్లో రెడీ అవుతుంది. చికెన్, మటన్ వంటి వాటినీ రకరకాలుగా గ్రిల్ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా టోస్ట్ చేసుకోవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. ఇది చూడటానికి సూట్కేస్లా ఉంటుంది. మేకర్ ముందు భాగంలో రెండు రెగ్యులేటర్స్ ఉంటాయి. ఇది గ్యాస్ సాయంతో పనిచేస్తుంది. చిన్న గ్యాస్ సిలెండర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రిల్ ప్లేట్స్ మార్చుకోవచ్చు. ఈ మేకర్ లోపల రెండు స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన గ్యాస్ స్టవ్లు అమర్చి ఉంటాయి. దీని మూత ఒకవైపు మేకర్కి అటాచ్ అయ్యుంటుంది. దాంతో సూట్కేస్ను తెరిచినట్లుగా ఓపెన్ చేసుకోవచ్చు. తేలికగా అటూ ఇటూ కదపడానికి ఒకవైపు రెండు చక్రాలు ఉంటాయి. మరోవైపు డివైజ్ మొత్తాన్ని పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది. అదే మెషిన్ నిలబడటానికి స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇరువైపులా కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకోవడానికి స్పెషల్ ప్లేట్స్ అమర్చి ఉంటాయి. ధర - 80 డాలర్లు (రూ.6,131) చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
Recipes: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.... జ్యూసీ చికెన్ కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు. మసాలా పేస్టు: ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు. తయారీ.. మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి. మటన్ మామిడి మసాలా కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు. తయారీ.. ∙ ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙ ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్ను రానివ్వాలి ∙ మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. అనప గింజల చారు కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙ ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా -
All In One: ఫిష్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే!
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ కుకర్లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది. ధర : 252 డాలర్లు (రూ.19,313) చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్క్రీమ్లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్ధర రూ. 1,990 -
Recipe: రుచికరమైన చికెన్ కీమా పకోడా ఇలా ఈజీగా!
చికెన్తో రొటీన్గా కాకుండా వైరైటీ వంటకాలు చేయడం మీకు ఇష్టమా! అయితే, ఈసారి ఇంట్లోనే సులువైన పద్ధతిలో చికెన్ కీమా పకోడా ట్రై చేసి చూడండి. చికెన్ కీమా పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ►చికెన్ కీమా, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున ►బియ్యప్పిండి, శనగపిండి – పావు కప్పు చొప్పున ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ ►ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్, సన్నగా తరగాలి) ►కారం – అర టీ స్పూన్ ►నిమ్మరసం – 2 టీ స్పూన్లు ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►జీలకర్ర – అర టీ స్పూన్ ►నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా చికెన్ కీమా పకోడా తయారీ విధానం: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ కీమా, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, శనగ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ►ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ►అనంతరం నూనెలో పకోడాలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి. ►సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. చదవండి👉🏾:Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా? -
Solar Oven: వెజ్తో పాటు నాన్వెజ్ ఐటమ్స్ కూడా.. ధర రూ.48,738
ఈ రోజుల్లో సోలార్ మెషిన్స్కి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత ఇంధనం ఖర్చు ఉండదనేది వీటి ప్లస్ పాయింట్. టెక్నాలజీ పెరిగిన తరుణంలో.. సోలార్ కుక్ వేర్ మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఇందులో కూరగాయ ముక్కలతో పాటు చికెన్, ఫిష్ వంటి నాన్వెజ్ ఐటమ్స్.. బ్రెడ్స్, కేక్స్ వంటివెన్నో గ్రిల్ చేసుకో వచ్చు, కుక్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ ఓవెన్ పెద్ద సైజ్ పెట్టెలా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ మూతతో పాటు.. మూడువైపులా (చిత్రంలో గమనించొచ్చు) సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను స్టోర్ చేసే సామర్థ్యం కోసం.. టెంపర్డ్ డబుల్ ప్యాన్డ్ గ్లాస్ మెటీరియల్ అమర్చి ఉంటుంది. థర్మల్ హీట్ రెసిస్టెంట్ లేయర్లు, అధిక నాణ్యత కలిగిన యానోడైజ్డ్ అల్యూమినియం రిఫ్లెక్టర్స్తో ఇందులోని ఆహారం వేగంగా ఉడుకుతుంది. మొత్తానికి ఈ సోలార్ ఓవెన్.. నాణ్యత కలిగినది, అనుకూలమైనది, ఉపయోగించడానికి సులభమైనది. సోలార్ ఓవెన్ ధర: 639 డాలర్లు (రూ.48,738) చదవండి👉🏾 హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు! -
నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!
కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. చదవండి👉 Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే.. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి. పలమనేరు/బైరెడ్డిపల్లె: ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి. పెరుగుతున్న పెంపకం-వినియోగం గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు. చదవండి👉: నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్టెస్టులు దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్వేర్లు సైతం నాటుకోళ్ల ఫామ్లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు. నాటుకోడి పులుసు హోటళ్లు పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి. పుంజు రూ.5 వేలు ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యం నాటుకోడిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది. పెరిగిన గిరాకీ నేను బైరెడ్డిపల్లి సంతలో 20 ఏళ్లుగా నాటుకోళ్లను కొంటున్నాను. గత రెండేల్లుగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నాటుకోడి మాంసం తినేవారి సంఖ్య పెరిగింది. బ్రాయిలర్ కోడిమాంసం కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ జనం ఎగబడి కొంటున్నారు. మాకు వ్యాపారం బాగానే ఉంది. ఇక్కడ కోళ్లను కొని కర్ణాటకలో అమ్ముతుంటాం. ప్రతివారం కోళ్ల సంతకు వస్తుంటాం. – రియాజ్, నంగిళి, కర్ణాటక ఈ కోళ్ల రుచే వేరు ఎన్నో ఏళ్లుగా బైరెడ్డిపల్లెలో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాను. మా కర్ణాటకలో బైరెడ్డిపల్లె నాటుకోళ్ల్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే వీటిని రైతుల పొలాలవద్ద, పల్లెల్లో పెంచుతారు. అవి ప్రకృతిలో తిరుగుతూ పెరుగుతాయి కాబట్టి రుచిగా ఉంటాయి. ఫారాల్లో పెంచే నాటుకోళ్లు క్రాసింగ్ కాబట్టి అంతరుచి రాదు. నాటుకోడి పులుసు తినేటపుడే నాటుదా ఫారమ్దా అని తెలిసిపోతుంది. శ్రీధర్, కోళ్లవ్యాపారి, ముళబాగిళు, కర్ణాటక -
సింహం సిక్స్టీ ఫైవ్.. పులి కబాబ్ ట్రై చేస్తే..!
చికెన్, మటన్ ఎప్పుడూ తినేవే.. అదే ఏనుగు లెగ్ కర్రీనో, చిరుతపులి ఫ్రైనో ట్రై చేస్తే.. వామ్మో ఏమిటివి అనిపిస్తోందా? ఇవేవో జస్ట్ పేర్లు కాదు. ఆ జంతువుల మాంసంతో చేసే వంటకాలే. కాకపోతే ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులను ఏమీ చంపడం లేదు. మరి ఆ మాంసం ఎలా వస్తుంది అంటారా.. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మాంసం కాని మాంసం.. జంతువులు, పక్షులను వధించి మాంసం వినియోగించడంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొక్కలు, నాచు సంబంధిత పదార్థాలతో మాంసం వంటి ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నారు. కానీ అవేవీ మాంసం వంటి అనుభూతిని కలిగించలేవు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షుల జీవకణాలను కృత్రిమంగా పెంచి మాంసం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చికెన్ వంటివాటిని తయారు చేశారు కూడా. ఎవరూ ఊహించని రీతిలో.. కృత్రిమ మాంసం రూపకల్పనకు సంబంధించి లండన్కు చెందిన ప్రిమెవల్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ చిత్రమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. చికెన్, మటన్, బీఫ్ వంటి సాధారణమైనవి కాకుండా.. ఎవరూ ఊహించని రీతిలో సింహం, పులి, ఏనుగు వంటి మాంసాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో జంతువులను చంపడంగానీ, హింసించడంగానీ ఉండదు. ఆయా జంతువుల నుంచి సేకరించిన కొద్దిపాటి రక్తం, ఇతర కణాల నుంచి.. ల్యాబ్లో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. రుచి.. బలం.. ఎక్కువట! ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్, బీఫ్ వంటివి పెద్ద రుచిగా ఉండవని, వాటి నుంచి అందే పోషకాలు కూడా తక్కువేనని ప్రిమెవల్ ఫుడ్స్ కంపెనీ స్థాపనకు పెట్టుబడులు పెట్టిన ఏస్ వెంచర్స్ ప్రతినిధి యిల్మాజ్ బొరా అంటున్నారు. ‘‘కోళ్లు, మేకలు, పశువుల పెంపకం సులువు కాబట్టే.. వాటి మాంసాన్ని మనం వినియోగిస్తున్నాం. వాటిలో కొలెస్టరాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. అదే కృత్రిమంగా మాంసం ఉత్పత్తి చేయగలిగినప్పుడు కూడా వాటితో పనేముంది? బాగా రుచిగా ఉండే, ఎక్కువ పోషకాలు ఉండే భిన్నమైన జంతువుల వైపు మేం దృష్టిపెట్టాం. ఉదాహరణకు మంచి నిద్ర, మూడ్ ఉండేందుకు చిరుతపులి మాంసాన్ని.. మెదడు పనితీరు మెరుగుపర్చే ఏనుగు మాంసాన్ని మనం భవిష్యత్తులో తినబోతున్నాం’’ అని చెప్తున్నారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమేనని, ఇంకా అద్భుతమైన ఆహార అనుభూతినీ పొందడం ఖాయమని పేర్కొంటున్నారు. -
నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!
చికెన్ను లొట్టలేసుకుంటూ లాగించేవాళ్లూ చాలా మందే ఉంటారు. రొటీన్గా చికెన్ కర్రీ, బిర్యానీ, కబాబ్ వంటివి కాకుండా కొత్త రుచులు కూడా కోరుకుంటారు చికెన్ ప్రియులు. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ. ఎంచక్కా ఇంట్లోనే ఇలా చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారు చేసుకోండి. కావలసినవి: బోన్లెస్ చికెన్ ముక్కలు – 7 లేదా 8 (పలుచగా, చిన్నగా కట్ చేసుకోవాలి), బ్రెడ్ స్లైసెస్ – చికెన్ ముక్కలతో సమంగా (నలువైపులా బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి, పక్కన పెట్టుకోవాలి), కారం, మసాలా, ఉప్పు – తగినంత, పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్లు (నిమ్మరసం, ధనియాలపొడి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, చాట్ మసాలా కొద్దికొద్దిగా జోడించి, మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి), పెరుగు, చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్ల చొప్పున, నూనె – సరిపడా తయారీ: ముందుగా చికెన్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని.. అందులో కారం, మసాలా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, పెరుగు వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం ఇరువైపులా నాన్స్టిక్ మీద గ్రిల్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక్కో చికెన్ ముక్క ఒక్కో బ్రెడ్స్లైస్కి ఒకవైపు పెట్టుకుని.. పైన చీజ్ తురుము, స్వీట్ కార్న్ మిశ్రమం పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. మూడువైపులా తడి వేళ్లతో నొక్కి ఓపెన్ కాకుండా చూసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సాస్లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే! -
కొండెక్కిన చికెన్ ధరలు.. షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను..
సాక్షి, ఖమ్మం: గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగలు రాత్రి సమయంలో కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చికెన్ దుకాణం ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి దొంగిలించుకుపోయిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. వైరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో యజమాని బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కాగా గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. చదవండి: వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి! -
వరంగల్: వామ్మో! అంతుచిక్కని వైరస్తో 4వేల కోళ్లు మృతి
వరంగల్ (నెక్కొండ): అంతు చిక్కని వ్యాధితో 4వేల కోళ్లు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని మడిపెల్లి శివారు హరిశ్చంద్రుతండాలోని సరిత పౌల్ట్రీపామ్లో జరిగింది. యజమాని తేజావత్ మురళీనాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. పౌల్ట్రీనపామ్లో 25 రోజుల నుంచి 11,300 కోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో మూడురోజులుగా రోజుకు 1,000కి పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇప్పటి వరకు 4వేల కోళ్లు మృతి చెందాయి. మరో రెండుమూడు రోజులు గడిస్తే పామ్లోని మిగితా కోళ్లు కూడా మృతిచెందే అవకాశం ఉందని యజమాని వాపోయాడు. కోళ్లకు కిడ్నీ వాపు, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మృతి చెంది ఉండవచ్చని యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు రూ. 6లక్షల నష్టం వాటిల్లిందని, మిగితా కోళ్లు మృతి చెందితే మరో రూ.15 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన కోళ్లను గోతి తోపాతిపెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తాం.. పౌల్ట్రీపామ్లో మృతి చెందిన కోళ్ల వ్యాధి నిర్ధారణ కోసం పోస్టుమార్టం నిర్వహిస్తాం. ప్రస్తుతం కోళ్లు రానికెట్, బర్డ్ ఫ్లూ, వీవీ ఆర్డీ వ్యాధులతో పెద్ద మొత్తంలో మృత్యువాత పడతాయి. లేదా వేసవి తాపం, సాధారణ వ్యాధులతో కోళ్లు మృతి చెంది ఉండవచ్చు. కోళ్ల మృతి విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఏడీడీఎల్ ఏడీ నాగమణి ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరుగుతుంది. అలాగే పరీక్షల కోసం ల్యాబ్కు పంపాం. –మమత, పశువైద్యాధికారి, నెక్కొండ -
భాగ్యనగరంలో కిలో చికెన్ రూ. 280 పైనే
-
ధర తగ్గేదేలే, కొండెక్కి కూర్చున్న కోడి.. ఇలా అయితే తినేదెలా!
సాక్షి, హైదరాబాద్: ఆదివారం వచ్చినా, దోస్త్ల దావత్త్లు, ఫంక్షన్లకు వెళ్లినా ఇలా అకేషన్ ఏదైనా చికెన్ లేకపోతే చాలా మందికి ముద్ద దిగదనే సంగతి తెలిసిందే. అలాంటి చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరిగిన చికెన్ రేట్లతో మన మనీ ఖాళీ అవ్వాల్సిందే. నిన్నటి వరకు డబుల్ సెంచరీ దాటిన చికెన్ ఈ సారి ఏకంగా ట్రిబుల్ సెంచరీని క్రాస్ చేసి సామాన్య ప్రజలకు షాకిచ్చింది! ధర తగ్గేదేలే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు చూస్తే మధ్య తరగతి ప్రజలు కొనాలాంటే భయపడేలా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం.. కిలో చికెన్ (స్కిన్ లెస్) రూ.300కు విక్రయిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వరకు రూ.200 లోపు ఉండేది. అయితే తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర రూ.300లకు పైగా ఉంది. విజయవాడలో కేజీ ధర రూ.306 ఉండగా, హైదరాబాద్లో 290 నుంచి 300 వరకు చికెన్ ధర పలుకుతోంది. ఈ ధర చూసి చికెన్ కొనేందుకు మాంసం ప్రియులు జంకుతున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులతోపాటు చికెన్ కూడా కొనలేని పరిస్థితికి చేరిందనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: పళ్లు తోముకుంటూ వేపపుల్ల మింగేశాడు.. ఆ తర్వాత.. ) అయితే చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు.. అందులో పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం, వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు చనిపోతున్నాయని, బర్డ్ ఫ్లూ లాంటి వదంతుల కారణంగా కొత్త జాతులు ఉత్పత్తి కావడం లేదని పౌల్ట్రీ రైతులు తెలిపారు. వీటి కారణంగా మార్కెట్లో ఉన్న డిమాండ్కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడం వీటి ధరలను అమాంతం పెరుగుతున్నట్లు వ్యాపారలు చెబుతున్నారు. -
చికెన్ – స్వీట్ పొటాటో కట్లెట్స్ తయారీ విధానం
కావలసినవి: బోన్లెస్ చికెన్ – అర కేజీ (మెత్తగా ఉడికించి.. చల్లారాక తురుములా చిదుముకోవాలి) చిలగడదుంప గుజ్జు (స్వీట్ పొటాటో పేస్ట్), శనగపిండి – పావు కప్పు చొప్పున ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తురుము, కారం, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున మిరియాల పొడి – అర టీ స్పూన్ పాలు – 2 టీ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా నీళ్లు – అర కప్పు, ఉప్పు – చిటికెడు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో చికెన్ తురుము, చిలగడదుంప గుజ్జు, శనగపిండి, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తురుము, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పావు కప్పు బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. గారెల పిండిలా కలుపుకోవాలి. అనంతరం ఒక బౌల్లో మిగిలిన బ్రెడ్ పౌడర్, మరో బౌల్లో పాలు, కోడిగుడ్డు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కట్లెట్స్ ఆకారంలో చేసుకుని.. వాటికి గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి... నూనెలో దోరగా వేయిచుకోవాలి. -
కొండెక్కిన కోడి ధర.. నెల రోజుల్లో స్కిన్లెస్ చికెన్ రేట్ అంత పెరిగిందా!
కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది. వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి. ధరలు పైపైకి జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్లెస్తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది. నష్టాలే కారణం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
ఆ యువతి 22 ఏళ్లుగా చికెన్ మాత్రమే తింటోంది.. ఎందుకో తెలుసా!
చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చినా, పార్టీకి వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అదే చికెన్ని రోజు తినాలంటే ఎవరికైనా సాధ్యం కాదు పైగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది బ్రిటన్కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి మాత్రం గత 22 ఏళ్ల నుంచి రోజు చికెన్ మాత్రమే తింటోంది. తన రోజువారి డైట్లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి. అయితే దీనికి కారణం కూడా ఉందని అంటోంది సమ్మర్ మొన్రో. ఆమె మాట్లాడుతూ.. గత 22 ఏళ్ల నుంచి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. మూడు సంవత్సరాల వయస్సులో మెత్తని బంగాళాదుంపలను తినాల్సి వచ్చినప్పుడు ఆమెకు ఫోబియా మొదలైనట్లు చెప్పుకొచ్చింది. సమ్మర్ తన ఫోబియా నుంచి బయటపడేందుకు రెండుసార్లు థెరపీని, హిప్నోథెరపీని ప్రయత్నించింది, కానీ అదేది ఆమెకు సహాయం చేయలేదట. అందుకే తాను పండ్లు, కూరగాయలు తినడం మానేసినట్లు చెప్పింది. అసలు అవి చివరిసారిగా ఎప్పుడు తిన్నానో కూడా తనకు గుర్తులేదని తెలిపింది. అయితే తను పాటిస్తున్న డైట్ తనని ఆరోగ్యంగా ఉంచుతోందని అందుకే.. కేవలం చికెన్తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. -
కోడి ధరకు రెక్కలు.. అమాంతం పెరిగిన ధర.. అమ్మో అంత రేటా?
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: లైఫ్ ఈజ్ రయ్రయ్) డిమాండ్కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్లు వస్తేనే ధరలు తగ్గుతాయి. -బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
Sakshi Cartoon: చుక్కల్లో చికెన్ ధరలు
చుక్కల్లో చికెన్ ధరలు -
నాటుకోడి రుచి.. ధర పెరిగినా తగ్గేదే లే! రూ.900 పెట్టాల్సిందే, ఆర్డర్లు ఇవ్వాల్సిందే!
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): ఆర్మూర్ ప్రాంతంలోని ఆర్డర్ మెస్ల్లో లోకల్ దేశీ కోళ్ల కొరతతో దేశీకోడి ధర కొండెక్కి కూర్చుంది. పల్లెల్లోని ఇళ్లలో పెంచిన దేశీ కోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్ మెస్ల నిర్వాహకులు ధరలను పెంచివేశారు. భోజనప్రియుల నుంచి లోకల్ దేశీ కోడినే వండి ఇవ్వాలనే డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక దేశీకోడి, నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం వండి ఇవ్వడానికి రూ.900 ధర నిర్ణయించారు. ఈ ధర గతంలో రూ.650 మాత్రమే ఉండేది. ఏకంగా రూ.250 పెంచినా లోకల్ దేశీకోడిని మాత్రమే తినాలనే భోజన ప్రియులు ఈ ధరను సైతం లెక్క చేయకుండా ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రతీ గ్రామంలో వెలిసిన ఆర్డర్ మెస్ల నిర్వాహకులు చుట్టు పక్కల గ్రామాలతో పాటు అంగళ్లలో లోకల్ దేశీకోళ్లను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన కోళ్లను తమ ఆర్డర్ మెస్లో వండి ఇస్తుంటారు. భోజన ప్రియుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో సరిపడా లోకల్ దేశీకోళ్లు లభించడం లేదు. దీంతో కొందరు ప్రత్యేకంగా ఫామ్లలో దేశీ కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి కల్పించుకున్నారు. చదవండి: రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి ‘గంగుల’ అంకాపూర్లో ఆర్డర్ మెస్ వద్ద దేశీ కోళ్లు అయితే లోకల్ దేశీకోడి రుచికి ఫామ్లో పెంచిన దేశీకోడి రుచికి మధ్య తేడా ఉండటంతో భోజన ప్రియులు లోకల్ కోడికే ప్రాధాన్యనిస్తున్నారు. ఆర్డర్ మెస్ల నిర్వాహకులు గ్రామాల్లో గతంలో రూ.320కి ఒక కోడిని కొని తెచ్చేవారు. ప్రస్తుతం రూ.420 వరకు వెచ్చించి లోకల్ కోళ్లను కొ నుగోలు చేస్తున్నారు. ఈ కోడి ధరకు వంట సామగ్రికి అయ్యే ఖర్చు, తమ శ్రమను జోడించి ఆర్డర్ మెస్ నిర్వాహకులు ఒక దేశీ కోడి ఆర్డర్ను రూ.850 నుంచి రూ.900 పెంచేసి అమ్ముతున్నారు. చదవండి: హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’ -
లోకల్ టేస్ట్.. చికెన్ చీకులు
నరసన్నపేట: ఎర్రగా మండే నిప్పులు.. పైన వెదురుపుల్లలకు గుచ్చిన చిన్నచిన్న మాంసపు ముక్కలు.. వాటిపై నిమ్మరసం చుక్కలు.. ఈ వంటకం సిక్కోలు ఈవినింగ్ స్నాక్. పేరు చీకులు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నా ‘నరసన్నపేట చీకులది’ మాత్రం ప్రత్యేక రుచి అంటున్నారు మాంసాహార ప్రియులు. దీనిని ఆరగించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, బరంపురం, గుణపురం నుంచి వచ్చి లొట్టలేసుకుంటూ తింటున్నారు భోజనప్రియులు. పక్కా లోకల్.. స్థానికంగా లభించే కారం, మసాలా దినుసుల్నే చీకుల తయారీకి వినియోగిస్తామని చెబుతున్నారు వ్యాపారులు. మార్కెట్లో లభించే ఎలాంటి కృత్రిమ మసాలాలు గానీ, హానికరమైన రంగులు, ఇతర పదార్థాలను వాడమని అందుకే వీటి రుచి విభిన్నమైనదనేది వారి మాట. తయారీ ఇలా.. మాంసపు ముక్కల్ని చిన్నగా ఒకటే సైజ్లో కట్ చేస్తారు. వాటిని మసాలా, కారం ఇతర పదార్థాలతో చేసిన మిశ్రమంలో నాలుగు గంటల సేపు ఉంచుతారు. తరువాత వెదురుపుల్లలకు ఈ ముక్కల్ని గుచ్చి.. ఎర్రగా కాలుతున్న బొగ్గులపై పెడతారు. 10 నిమిషాలు సేపు బాగా ఉడికిన తరువాత వడ్డిస్తారు. ఏఏ రకాలు.. ►చికెన్, లివర్, రొయ్యలతో చీకులను తయారు చేస్తారు. ఒక్కో రకానిదీ ఒక్కో రేటు. ►నరసన్నపేట బజారు వీధిలో 20 ఏళ్ల నుంచి చీకుల్ని విక్రయిస్తున్నారు. -
గాల్లో పక్షిలా చక్కర్లు కొడుతున్న కోడి.. వైరల్ వీడియో
కోడి అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కోడి పందేలు. లేదా మంచిగా మసాలా దట్టించి చికెన్ వండుకొని లాగించేయడమే. అయితే తాజాగా ఓ కోడికి వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా కోడి నేల మీద తిరుగుతూ ఉంటుందని అందరికి తెలిసిందే. వాటికి రెక్కలు ఉన్నా తక్కువ ఎత్తులో తక్కువ సమయం వరకు ఎగురుతాయి. రెక్కలతో ఎక్కువసేపు ఎగరలేవు. కానీ ఇప్పుడు చెప్పబోయే కోడి నేల మీదే కాకుండా గాల్లో పక్షిలా తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ‘కోడి ఇంత దూరం విహరిస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మంచు ప్రాంతంలో కోడి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం కనిపిస్తోంది. చదవండి: భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్ దాదాపు 40 సెకన్లపాటు వందల మీటర్ల వరకూ గాల్లోనే ఎగురుతూ తిరుగుతోంది. చివరికి ఓ చోట ల్యాండ్ అయ్యింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైక్స్ వచ్చి చేరుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు అసులు ఇది నిజంగా కోడేనా, లేక కోడిలా కనిపిస్తోన్న వేరే జాతి పక్షా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6 — Buitengebieden (@buitengebieden_) January 29, 2022 -
Health Tips: గ్యాస్ సమస్యా... అరటి, పల్లీలు, ఫిష్ తింటున్నారా.. అయితే..
కింది నుంచి గ్యాస్ పోవడం చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం. ఎవరికీ చెప్పుకోలేని బాధ కూడా. అయితే ‘లో–ఫోడ్మ్యాప్’ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ ఆహారం ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘లో–ఫోడ్మ్యాప్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. ‘ఫర్మెంటబుల్ ఆలిగో శాకరైడ్స్’, ‘డై–శాకరైడ్స్’, ‘మోనో–శాకరైడ్స్’, ‘పాలీయాల్స్’ అనే రకాల ఆహారాల ముందు మాటలను కలిపి అవి ఓ సంక్షిప్తాక్షరం(ఏక్రోనిమ్)గా రూపొందించడం వల్ల ఏర్పడిన పదమే ‘ఫోడ్మ్యాప్’. ఆయా పదార్థాలు తక్కువగా ఉండే ఆహారమే ‘లో–ఫోడ్మ్యాప్’ న్యూట్రిషన్. వీటిని బట్టి తీసుకోవాల్సిన, తీసుకోకూడని పదార్థాలేమిటో చూద్దాం. ►ప్రధానాహారాలుగా- వరి అన్నం, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ ►పండ్లలో- అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ ►వెజిటబుల్స్లో- క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో ►ప్రోటీన్లలో- చికెన్, ఫిష్ ►నట్స్లో- పల్లీలు, వాల్నట్స్ వంటివి తీసుకోవాల్సిన పదార్థాలు. అలాగే తీసుకోకూడని పదార్థాలు: ►పాస్తా, కేక్ బిస్కెట్స్, పండ్లలో పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్స్, ప్రోటీన్స్లో బీన్స్, సోయాబీన్స్ వంటివి. వీటి నుంచి దూరంగా ఉండాలి. ►ఈ తరహా ఆహారాలలో తీసుకోవల్సినవి తీసుకుంటూ, మిగతావాటికి దూరంగా ఉండటం వల్ల కిందినుంచి గ్యాస్పోయే సమస్యతో పాటు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. చదవండి: Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు, చికెన్ తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల.. Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! -
Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల..
దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. సమతుల ఆహారంతోనే సమగ్రమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. వీటితోపాటు మనసు మీద ప్రభావం చూపించే ఆహారాలు కూడా ఉంటాయి. నిరుత్సాహంగా మార్చే ఆహారాలతోపాటు మనసును ఉత్తేజపరిచే ఆహారాలు కూడా ఉంటాయి. ►కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి. ►లేత మాంసం, కాయధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆహారంలో వీటిని తీసుకున్నప్పుడు డోపామైన్, నార్ఎపీనెఫ్రిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శక్తిని ఇనుమడింప చేయడంతోపాటు మెదడును ఒక విషయం మీద కేంద్రీకృతం చేయడానికి దోహదం చేస్తాయి. ►హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైలు తిన్న తర్వాత వాటిని జీర్ణం చేయడానికి దేహం ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దాంతో నీరసం ఆవహించినట్లవుతుంది. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోలేక వాటిని తిన్నప్పుడు ఇతర ఆహారం మోతాదు తగ్గించడం మంచిది. ►ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తినాలనే జాగ్రత్త పాటించడంతోపాటు ఇష్టమైన వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం అవసరమైన వాటిని తింటూనే ఇష్టమైన వాటిని రోజులో ఒక్కసారికి పరిమితం చేసుకోవచ్చు. ►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. ►వేరుశనగలో ఉండే విటమిన్–బి3... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. చదవండి: Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
నోరూరించే నర్గీస్ కోఫ్తా.. తయారీ ఇలా!
కావలసినవి: గుడ్లు – ఎనిమిది; మటన్ ఖీమా – అరకేజీ; ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; పసుపు – టీస్పూను; కారం – అరటీస్పూను; గరంమసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; బియ్యప్పిండి – అరకప్పు; ఆయిల్ – డీప్ఫ్రైకి సరిపడా. గ్రేవీ కోసం: ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలు తరగాలి); వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; అల్లంపేస్టు – రెండు టీస్పూన్లు; టొమాటోలు – మూడు(పేస్టు చేసుకోవాలి); ధనియాలపొడి – రెండు టీస్పూన్లు; జీలకర్ర – టీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – అర టీస్పూను; గరం మసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పెరుగు – ఎనిమిది టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ: ► ముందుగా ఆరు గుడ్లను ఉడికించి, పెంకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ► పెద్ద గిన్నెలో మటన్ ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుడ్డుసొన వేసి పేస్టులా కలపుకోవాలి ► ఈ మిశ్రమాన్ని ఆరు సమభాగాలుగాచేసి పక్కనపెట్టుకోవాలి ► ఉడికించిన ఒక్కో గుడ్డుకు పూర్తిగా కవర్ అయ్యేలా ఖీమా మిశ్రమాన్ని పట్టించాలి ► అన్ని గుడ్లకు పట్టించాక బియ్యంపిండిలో ముంచాలి మిగిలిన గుడ్డుసొనను బాగా కలపాలి. బియ్యప్పిండిలో ముంచిన గుడ్లను ఈ గుడ్డుసొనలో ముంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రైచేసి పక్కనపెట్టుకోవాలి ► వేడెక్కిన బాణలిలో గ్రేవీకోసం తీసుకున్న ఆయిల్ వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలువేసి రంగు మారేంత వరకు వేయించాలి ► ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులను వేసి మూడు నిమిషాలు వేయించి టొమాటో పేస్టు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేయాలి ► రుచికిసరిపడా ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి, డీప్ఫ్రై చేసి పెట్టుకున్న కోప్తాలను వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙ఐదునిమిషాలు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నర్గీస్ కోఫ్తా రెడీ. ఇది రైస్,చపాతీల్లోకి మంచి సైడ్ డిష్. (క్లిక్: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి) చికెన్ కాగ్జీకట్ కావలసినవి: చికెన్ – అరకేజీ; చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది; బంగాళ దుంపలు – ఎనిమిది; వెల్లుల్లి రెబ్బలు – ఆరు; అల్లం – అంగుళం ముక్క ; పెద్ద ఉల్లిపాయ – ఒకటి; పచ్చికొబ్బరి తురుము – కప్పు; ఎండుమిర్చి – ఏడు; లవంగాలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; మిరియాలు – పది; ధనియాలు – టేబుల్ స్పూను; మెంతులు – టీస్పూను; గసగసాలు – టేబుల్ స్పూను; సోంపు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; జాజికాయ పొడి – టీస్పూను; ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ: ► ధనియాలు, గసగసాలు, మెంతులను పొడిచేకోవాలి ► అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను సన్నగా తరగాలి ► బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము వేసి మూడు నిమిషాలు వేయించాలి ► ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గాక, చికెన్ వేసి సన్నని మంట 10 నిమిషాలు ఉడికాక చిన్న ఉల్లిపాయలు, బంగాళ దంపలు వేసి ఉడికించాలి ► ఆయిల్ పైకి తేలాక జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. (క్లిక్: కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..) -
కోళ్ల నలుపుకు అదే కారణం.. కిలో ధర రూ.700 నుంచి 900
సాక్షి,రాయపర్తి(వరంగల్): తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సైన నలుపుకోడి. మటన్కు పోటా పోటీగా గిరాకీ, నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలతో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చి పెడుతున్న ఈ కోళ్లను రాయపర్తి మండలం కొలన్పల్లికి చెందిన యువకుడు సతీష్ పెంచుతున్నాడు. నాటుకోడిని తలదన్నేలా కడక్నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటుకోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటంతో ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కడక్నాథ్ కోడి మాంసం కిలో రూ.700 నుంచి రూ 900 వరకు, గుడ్డు ఒక్కటికి రూ. 20 నుంచి రూ.30 వరకు పలుకుతుందని సతీష్ అంటున్నాడు. నెలకు 18 గుడ్లు.. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే కడక్నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 గుడ్ల చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీల నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. వృత్తి సాఫ్ట్వేర్..ప్రవృత్తి నాటుకోళ్ల పెంపకం వృత్తి సాఫ్ట్వేర్ అయినా ప్రవృత్తిగా నాటుకోళ్లను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు సతీష్. చాలా చోట్ల తిరిగినా దొరకపోవడంతో ఆన్లైన్లో ఏక్యూఏఐ అనే యాప్ ద్వారా ఒకేసారి ఒక్కో పిల్లకు రూ.110 చొప్పున 50 పిల్లలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం 70 నాటుకోళ్లు, 50 కడక్నాథ్ కోడిపిల్లలతో పాటు బాతులను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తునాడు. చదవండి: రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు -
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు... వీటిని మనుషులు తింటే భయంకరమైన వ్యాధులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా... రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు. చికెన్ వ్యర్థాల సేకరణే టార్గెట్.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. పక్కా రూట్ మ్యాప్ ద్వారా సేకరణ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్ మ్యాప్ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్మార్కెట్కు చేరుకుని హోల్సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్బీనగర్, తిలక్నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్ మీదుగా యైటింక్లయిన్కాలనీ చేరుకుంటుంది. ఈరూట్ మ్యాప్లోని అన్ని చికెన్సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది. మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు చికెన్ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్ఫిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్కు చెందిన ఓ కాంట్రాక్టర్కు చికెన్ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం. ఇలా కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది. -
Honey Chicken: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి
మనం నిత్యం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ రకరకాల రుచికరమైన వంటలను తయారు చేసుకొని అరగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చికెన్ అంటే చాలు లొట్టలేసుకుని లాగించేస్తారు. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి వారి కోసమే హనీ చికెన్ తయారీతో మీ ముందుకు వచ్చాము. ఈ చక్కని వెరైటీ రిసిపిని ఊహించుకుంటేనే నోరూరుతుంది కదా? అయితే వెంటనే మీరు కూడా తయారు చేసుకోవాలిసిందే.... హనీ చికెన్ కావాల్సిన పదార్థాలు.. 1. కొన్నిబొన్లెస్ చికెన్ ముక్కలు 2. అవసరాన్ని బట్టి ఉప్పు 3. తేనె తగినంత 4. వెన్న కావలసినంత 5.తగినంత నిమ్మ రసం 6. సోయా సాస్ తగినంత ఇప్పుడు తయారీ విధానం... ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్టౌవ్ మీద ఒక దళసరి పాన్ని పెట్టుకోని నూనె వేసుకోవాలి. నూనె తగినంత వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేసి 4-5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం మంట మీద ఇంకో పాన్ని తీసుకోండి. దానిలో కొద్దిగా వెన్న, తేనె వేసుకోవాలి. వెన్న అనేది పూర్తిగా కరిగిన తరువాత మంటను ఆపేయండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నిమ్మ రసం, ఉప్పు తగినంత వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ఈ తేనె మిశ్రమం లో ఫ్రై చేసిన చికిన్ ముక్కలను వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. అవసరం బట్టి షెజ్వాన్ సాస్ కూడా ఊపయోగించ వచ్చు. ఆ తరువాత స్టౌ మీద నుంచి కూరను దింపేయాలి. అంతే వేడి వేడిగా హనీ చికెన్ రెడీ. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ -
ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు మెనూలో మాంసాహారం ఉండాల్సిందే! అందుకే వారాంతాల్లో రెస్టారెంట్లు కిటకిటలాడుతాయి. చికెన్, మటన్ సెంటర్లు కళకళలాడుతాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు కొత్తదారి పడుతున్నారు. రుచి, ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ పల్లె బాట పడుతున్నారు. నాటు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచిని ఆస్వాదిస్తున్నారు. మాంసాహార ప్రియుల నోరూరిస్తున్న నాటు కోడి మాంసంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ఖిలా వరంగల్ పౌల్ట్రీ విప్లవం తరుముకొచ్చింది. వీధికో చికెన్ సెంటర్. పల్లెకో(మినీ) పౌల్ట్రీ పరిశ్రమ. ప్రజల నుంచి డిమాండ్ ఉండడాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. బాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. మూడు నెలలు పెరగాల్సిన కోడి కేవలం నలభై రోజుల్లోనే మూడు కిలోల బరువు వరకు పెరుగుతోంది. ప్రజల డిమాండ్కు అనుకూలంగా రసాయనాలు వాడి కోళ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌష్టిక విలువలున్న నాటు కోళ్లవైపు మాంసాహార ప్రియుల చూపు మళ్లింది. నాటుకే మాంసాహార ప్రియుల ఓటు రసాయనాలతో పని లేకుండా నాటుకోళ్లు పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే తౌడు, మొక్కజొన్నలు, సజ్జలు, బియ్యం, నూకలు, రాగులు వంటి తృణధాన్యాలు తిని పెరుగుతున్నాయి. దీంతో వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. మంచి రుచి కూడా ఉండటంతో నాటుకోడి చికెన్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గ్రామాల్లో సహజంగా కనిపించే కోళ్లతో పాటు దేశవాలీ కోళ్లలోనూ గిరి రాజు, వనరాజు వంటి అనేక జాతులు ఉన్నాయి. నగరం చుట్టుపక్కల గ్రామాల్లో వీటిని పెంచి అనేకమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. నోరూరించే కోడి కూర నాటుకోడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ‘నాటుకోడి చికెన్ లభించును’ అని కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల్ని ఆకర్షిస్తూ బోర్డులు పెడుతున్నాయి. యువత పార్టీలు చేసుకునే సమయంలో నాటుకోడికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. పెరిగిన డిమాండ్ .. వరంగల్ నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బాయిలర్ కోళ్లు తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో నాటు కోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇవి పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా వీటికోసం వారాంతాల్లో పల్లెబాట పడుతున్నారు. నాటుకోడి కిలో ధర రూ.400 పలుకుతోంది. అయినప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాటు కోళ్లతో రుచి, ఆరోగ్యం ఇతరకోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇంటిళ్లిపాది నాటుకోడినే ఇష్టపడుతున్నాం. ధర కాస్త ఎక్కువైనా కూడా నాటుకోడి మాంసమే తింటున్నాం. ఆదివారం వస్తే దేశవాళీ కోళ్ల పెంపకం దారుల వద్ద నాటు కోడిని కొని తెచ్చుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా పల్లెబాట పడుతున్నాం. ఆరోగ్యం, రుచి అన్నింటా సహజంగా పెరిగిన నాటుకోళ్లే నయం. – ఎం. శశికాంత్, ఫోర్ట్రోడ్డు వరంగల్ -
Telangana: చికెన్ తిని ఊరంతా అస్వస్థత...
కడెం: కలుషిత ఆహారం తిని ఊరంతా అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం రానిగూడలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిపేట్ గ్రామంలో దండారీ వేడుకల్లో భాగంగా ఈనెల 6న ఊరంతా కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేశారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనలతో ఊరంతా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని 61 మందికి చికిత్స అందజేశారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆహారంలో తీసుకున్న చికెన్తోనే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. -
అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్గా చేతులు పెట్టేస్తున్నాడు!
ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనూ, స్ట్రీట్ ఫుడ్లు తయారు చేసే వాళ్లు తమ పాక కళా శాస్త్ర నైపుణ్యాలతో భోజన ప్రియులను భలే ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు వారు కొంగొత్త రుచులతో భోజన ప్రియులను మైమరిపించడంతో ప్రముఖులుగా పేరు తెచ్చుకంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) అంతేకాదు ఇటీవల కాలంలో చెఫ్ ఒక్కొక్కరూ ఒక్కొ రకమైన పద్దతుల్లో వంటకాలను చేసి కస్ట్మర్లను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇదే తరహాలో ఒక స్ట్రీట్ఫుడ్ చెఫ్ భయంకరంగానూ, విస్తుపోయే విధంగా ఎలా వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడో చూడండి. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడోక స్ట్రీట్ ఫుడ్ లో వంటలు చేసే వ్యక్తి చికెన్ని డీప్ ఫ్రై చేస్తున్నాడు. అంతే ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్గా చేతులతో చికెన్ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. దీంతో సదరు కస్టమర్లు ఒక్కసారిగా విస్తూపోతారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు వీడు ఐరన్ మ్యాన్లా ఎలా చేస్తున్నాడర్రా బాబు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దుపట్టా మేరా సాంగ్కు దుమ్ములేపేశారు..) View this post on Instagram A post shared by SHAILESH | JAIPUR (@nonvegfoodie) -
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు
Man Last Breath After Chicken Bone Stuck in Throat At Chennai చెన్నై: అందియూరు సమీపంలో చికెన్ తింటున్న సమయంలో గొంతులో ఎముక ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా అందియూరు సమీపం కుచ్చి కల్లూరుకు చెందిన సుబ్రమణ్యన్ (56) తాపీ మేస్త్రి. శుక్రవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు. ఆ సమయంలో ఓ చికెన్ ఎముక గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతన్ని హుటాహుటిన అందియూరు ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోయింది. అక్కడ పరిశోధించిన వైద్యులు సుబ్రమణ్యన్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (త్వరలో పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా) -
రుచులూరే.. సాగ్వాల చికెన్, గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ తయారీ ఇలా..
ఎప్పుడూ ఒకేలాంటి వంటకాలకు బదులు కాస్త వెరైటీగా ఇవి ట్రై చేయండి. సాగ్వాల చికెన్ కావల్సిన పధార్థాలు బోన్ లెస్ చికెన్ – కేజీ నానబెట్టడానికి: పెరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పసుపు – అరటేబుల్ స్పూను, ఉప్పు – టేబుల్ స్పూను. సగా చికెన్ సాస్: నెయ్యి – టేబుల్ స్పూను ఉల్లిపాయలు – రెండు జీలకర్ర – టేబుల్ స్పూను దాల్చిన చెక్క పొడి – టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు – మూడు ధనియాల పొడి – టేబుల్ స్పూను ఎండు మిర్చి – మూడు కసూరీ మేథీ – టేబుల్ స్పూను పాలకూర తరుగు – పావు కేజీ తయారీ విధానం ►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నానబెట్టడానికి తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ►స్టవ్మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత ఎండు మిర్చి, ధనియాలపొడి, గరంమసాలా, దాల్చిన చెక్కపొడి, బిర్యానీ ఆకులు వేసి టేబుల్ స్పూను నీళ్లు పోసి వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగిన తరువాత నానబెట్టిన చికెన్ వేసి కలుపుకోవాలి. తరువాత మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►ఇప్పుడు పాలకూర తరుగును మిక్సీజార్లో వేసి పెస్టులా చేసుకోవాలి. ►చికెన్ ముక్కలు ఉడికిన తరువాత పాలకూర పేస్టువేసి సన్నని మంట మీద ఉడికించాలి. ►ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించి, రుచికిసరిపడా ఉప్పు వేసుకుని దించేస్తే సాగ్వాల చికెన్ రెడీ. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ కావల్సిన పధార్థాలు వెల్లుల్లి పాయలు – రెండు ఆయిల్ – టేబుల్ స్పూను బంగాళ దుంపలు – కేజీంబావు బటర్ – కప్పు, పాలు – కప్పు బిర్యానీ ఆకులు – మూడు ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా వెల్లుల్లి పాయల తొడిమను కట్ చేసి కొద్దిగా నూనె చల్లి, సిల్వర్ ఫాయిల్లో చుట్టిపెట్టి అవెన్ లో పది నిమిషాలపాటు వేగనివ్వాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల తొక్కతీసి రెండు అంగుళాల సైజు ముక్కలుగా కట్ చేయాలి. ►ముక్కలన్నింటిని ఒక పెద్దగిన్నెలో వేసి చల్లటి నీళ్లుపోయాలి. దీనిలో బిర్యానీ ఆకులు వేసి దుంపలను ఉడికించాలి. ►దుంపలు ఉడికాక నీళ్లను వంపేసి మరోసారి గిన్నెను స్టవ్ మీద పెట్టి దుంప ముక్కలు పొడిగా మారేంత వరకు వేగనివ్వాలి. ►ఇప్పుడు ఈ బంగాళ దుంప ముక్కలు, వేయించిన వెల్లుల్లిలను కలిపి మెత్తగా రుబ్బాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కాక బటర్ వేసి రుబ్బుకున్న దుంపల మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ►తరువాత పాలు పోయాలి. పాలన్నీ ఇగిరాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేస్తే రోస్టెడ్ గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ రెడీ. చపాతీలు, బ్రెడ్లోకి ఇది చాలా బావుంటుంది. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
స్వీట్ కార్న్ లాలీపాప్స్, చికెన్ బీట్రూట్ సమోసా తయారీ ఇలా..
వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి. స్వీట్ కార్న్ లాలీపాప్స్ కావలసిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి జీలకర్ర ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు ఉప్పు – తగినంత కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) బంగాళ దుంప తురుము – అర కప్పు మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు మైదా పిండి – 1 టీ స్పూన్ నీళ్లు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్. చికెన్ బీట్రూట్ సమోసా కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి) బీట్రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్ బీట్రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్రూట్ రసం కలుపుకోవాలి) ఉప్పు – సరిపడా నూనె – తగినంత తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా!
చికెన్, చేపలతో ఈ ప్రత్యేక వంటకాలు సరదాగా ట్రై చేయడి.. రుచి కూడా అదిరిపోతుంది. ఆనియన్ చికెన్ రింగ్స్, ఫిష్ కట్లెట్ విత్ రైస్ వెరైటీలతో మీ కుటుంబ సభ్యులకు మరిచిపోలేని ట్రీట్ ఇవ్వండి..! ఆనియన్ చికెన్ రింగ్స్ కావల్సిన పదార్థాలు చికెన్ ఖీమా – పావు కేజీ ఉల్లిపాయలు – రెండు (గుండ్రంగా రింగుల్లా తరగాలి) స్రింగ్ ఆనియన్ కాడలు – రెండు (సన్నగా తరగాలి) వెల్లుల్లి తురుము – టేబుల్ స్పూను కారం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా గోధుమ పిండి – కప్పు చీజ్ – అరకప్పు గుడ్లు – మూడు బ్రెడ్ ముక్కలపొడి – ఒకటిన్నర కప్పు ఆయిల్ – డీప్ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా కడిగిన చికెన్ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని స్ప్రింగ్ ఆనియన్ , వెల్లుల్లి తరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ముంచి పక్కన బెట్టుకోవాలి. ►గుడ్ల సొనను ఒక గిన్నెలో , ప్లేటులో బ్రెడ్ ముక్కల పొడి తీసుకోవాలి. ►ఇప్పుడు ఉల్లిపాయ రింగుల్లో.. కలిపి చికెన్ ఖీమా మిశ్రమాన్ని పెట్టి, మధ్యలో చీజ్ తరుగు పెట్టి గుండ్రంగా వత్తుకోవాలి. ►ఈ ఆనియన్ రింగ్స్ను గుడ్డు సొన, బ్రెడ్ముక్కల పొడిలో వరుసగా రెండుసార్లు ముంచి, పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►డీప్ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆనియన్ రింగ్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించితే ఆనియన్ చికెన్ రింగ్స్ రెడీ. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! ఫిష్ కట్లెట్ విత్ రైస్ కావల్సిన పదార్థాలు బోన్ లెస్ చేపముక్కలు – అరకేజి బియ్యం – ముప్పావు కప్పు గుడ్డు – ఒకటి బ్రెడ్ స్లైసులు – రెండు(నానబెట్టాలి) స్ప్రింగ్ ఆనియన్ కాడలు – నాలుగు కొత్తి మీర తరుగు – అరకప్పు మిరియాల పొడి టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా ఆయిల్ – ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద గిన్నెపెట్టి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేసి నీళ్లను మరిగించాలి. ►నీళ్లు మరిగాక బియ్యం వేసి మెత్తటి అన్నంలా ఉడికించి పక్కనబెట్టుకోవాలి. ►చేపముక్కల్ని ఖీమాలా తరుక్కోవాలి. ఈ ఖీమాలో గుడ్డు సొనను కార్చాలి. తరువాత మిరియాలపొడి, నానబెట్టిన బ్రెడ్, తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. ►చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని చేప ఖీమా మిశ్రమాన్ని కట్లెట్లా వత్తుకోవాలి. ►బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంటమీద, ఒక్కోవైపు పదినిమిషాలు వేయించితే ఫిష్ కట్లెట్ విత్ రైస్ రెడీ. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తో.. -
హైదరాబాద్లో సరదా సరదాగా దసరా!
సాక్షి, హైదారబాద్: దసరా సందర్భంగా నగరవాసులు సరదాగా గడిపారు. చికెన్, మటన్, మద్యం విక్రయాలు భారీ స్థాయిలో జరిగాయి. చుక్క, ముక్కతో పసందు చేసుకున్నారు. గతేడాది కోవిడ్ కారణంగా ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు వెనుకంజ వేసిన నగరవాసులు ఈసారి పండగ చేసుకున్నారు. నగరమంతటా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఆనందోత్సాహాలతో నగరం వెల్లివిరిసింది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు మద్యం అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. వారం రోజుల్లో రూ.222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఈ నెల 12 నుంచి 14వ తేదీ మధ్య కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ.75 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. దసరా సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 7.78 లక్షల కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల కేసులు బీర్లు అమ్ముడైనట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల్లో 50 లక్షల కిలోల చికెన్.. గ్రేటర్ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్ వినియోగమవుతుంది. కాగా.. గురు, శుక్రవారాల్లో కలిపి దాదాపు 50 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెప్పారు. దసరా సందర్భంగా గ్రేటర్ ప్రజలు మటన్ కంటే ఎక్కువగా చికెన్కు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చికెన్ అమ్మకాల ద్వారా వెల్లడైంది. మటన్ ధర కిలో రూ. 750– 800 ఉండటం.. చికెన్ ధర మటన్ కంటే సగం ఉండడంతో చికెన్కే ప్రాధాన్యమిచ్చారు. గత మూడ్రోజుల్లో మటన్ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారుల అంచనా. -
ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్షియస్ తెగ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రకరకాల ఆహార అలవాట్లు ఆచరిస్తున్నారు. ఐతే భిన్న ఆహార అలవాట్లు భిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. పచ్చి మాంసాన్ని రోజు వారీ ఆహారంగా తినడం అటువంటి ప్రత్యేక ఆహార అలవాట్లలో ఒకటి. అవును.. మీరు సరిగ్గానే చదివారు! ఓ వ్యక్తి గత మూడేళ్లగా పచ్చిమాంసం తింటూ ఎటువంటి అనారోగ్యం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుతున్నాడు. అతనెవరో.. అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం.. అమెరికాలోని నెబ్రస్కాకు చెందిన వెస్టన్ రో అనే వ్యక్తి మూడుళ్లుగా వండకుండా లేదా వేడిచేయకుండా మాంసం, చికెన్, గుడ్లు.. వంటి మాంస ఉత్పత్తులను పచ్చిగానే తింటున్నాడట. ఔరా! అని ముక్కు మీద వేలేసుకుంటున్నారా? అంతేకాదు.. తన విచిత్ర ఆహార అలవాట్లపై 'ది నేచురల్ హ్యూమన్ డైట్' పేరుతో యూట్యూబ్ ఛానెల్లో డాక్యుమెంట్ కూడా చేశాడట. సాల్మన్ అనే చేప, చికెన్ ఆర్గన్స్, పచ్చి మాంసం.. మొదటైన వాటిని పచ్చిగా తినడం మనం అతని వీడియోల్లో చూడొచ్చు. పచ్చి మాంసం తినే అలవాటు మీకు కొంత విడ్డూరంగా అనిపించినా... వెస్టన్ రో మాత్రం ఈ ఆహారంతో రోజంతా ఎనర్జిటిక్గా ఉంటున్నట్లు చెబుతున్నాడండీ!! రో తన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా స్థిమితంగానే ఉందనీ, ఈ పచ్చి మాంసం ఆహారంగా తినడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యం బారీన పడ్డదాకలాలు లేవని, ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ.. తన ఆరోగ్యంపై పచ్చి మాంసం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ది ఇండిపెండెంట్ అనే ఆన్లైన్ న్యూస్ పేపర్కు వివరించాడు. కల్టివేట్ (వ్యవసాయం) చేసిన మాంసం, చికెన్, గుడ్లు.. క్రమంతప్పకుండా తింటున్నానని, ఉడికించిన ఆహారంతో పోలిస్తే మరింత శక్తినిస్తుందని డైలీ మెయిల్ అనే బ్రిటీష్ డైలీ మిడిల్ మార్కెట్ న్యూస్పేపర్కు వెల్లడించాడు. ముడి చికెన్ తరచుగా తింటే ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్ బారీన పడే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా సోకుతుంది. ఎప్పుడైనా ఈ వ్యాధితో బాధపడ్డావా అని అడిగినప్పుడు, ఇది చాలా వివాదాప్సదమైన అంశం. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని, ఎటువంటి హాని కలగదని న్యూయార్క్ పోస్ట్తో చెప్పడు. ఇతని పచ్చి మాంసం ఆహార అలవాట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే అతని యూట్యూబ్ చానెల్లో తెలుసుకోవచ్చు. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. -
ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆహారంలో తీసుకున్న చికెన్ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి కుమార్తె విగతజీవులయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలోని తంగప్ప నగర్కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్లో చికెన్ గ్రేవిని బుధవారం కొన్నారు. మధ్యా హ్నం భోజనంలో ఆ చికెన్ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు. అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరి మరణానికి చికెన్ గ్రేవీ లేదా శీతల పానీయం కారణం కావొచ్చని మృతుల బంధువులు ఫిర్యా దు చేయడంతో కోవిల్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. -
పది కోళ్లను తిన్న కొండచిలువ
సాక్షి, శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర గ్రామంలోని ఎస్ఎస్ఎస్ చికెన్ షాపు వద్ద గల షెడ్డులోకి 10 అడుగుల భారీ కొండచిలువ ఆదివారం ప్రవేశించి పదికోళ్లకు పైగా తినేసి మరో రెండు కోళ్లను తీవ్రంగా గాయపరిచింది. అదే సమయంలో షాపు యజమానులు సాయి, రామసత్తి, స్థానికులు భారీ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుడు పట్నాయక్ సహాయంతో భారీ కొండచిలువను షాపు యజమానులు పట్టుకుని గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న గంటికొండలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమీపంలో ఉన్న కొండపై నుంచి గెడ్డ ప్రవాహం ద్వారా భారీ కొండ చిలువ కొట్టుకుని వచ్చి చికెన్షాపులో ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. చదవండి: (విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి) భారీ కొండచిలువను పట్టుకున్న స్థానికుడు -
కోడి ఈకలు.. చేపల పొలుసుతో ఇటుకలు
సాక్షి, అమరావతి: కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్ అయింది. గత ఏడాది పదో తరగతి చదువుతున్నప్పుడు యశస్వి దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇంకా మరెన్నో.. కోడి ఈకలు వాయు కాలుషం నివారణలో ఉపయోగపడతాయని యశస్వి నిరూపించింది. ఈ ఈకలను డిస్క్ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్ జెల్ తయారవుతోంది. దీనిని ఐరన్ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్ ట్రీట్మెంట్లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్ను ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్ వేసేటప్పుడు ఈ జెల్ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు. ఏపీసీవోఎస్టీ అవార్డులు అందుకుంటున్న యశస్వి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది ఇలా జాతీయ ఇన్స్పైర్ అవార్డు కోసం దేశం నలుమూలల నుంచి మొత్తం 581 మంది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో యశస్వి రూపొందించిన ప్రాజెక్ట్ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో జాతీయస్థాయి ఎంపికలు ఈ నెల 4నుంచి 8 వరకు వర్చువల్ విధానంలో జరిగాయి. ఇందులో యశస్వి ప్రాజెక్ట్ అవార్డుకు ఎంపికైంది. ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ జె.నివాస్కు వివరిస్తున్న యశస్వి తయారీ ఇలా.. కోడి ఈకలలోని కొలాజిన్, చేపల పొలుసులోని కెరోటిన్లతో పర్యావరణ హితమై భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్, తేలికపాటి సిమెంట్ ఇటుకలు, బయో ఎరువులు, పెయింట్ల వినియోగంలో పెచ్చులూడి పోకుండా చేయడం, వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కొలాజిన్ వినియోగంతో ఐరన్ తుప్పు పట్టే గుణం తగ్గడం, కార్టిలేజ్ ట్రీట్మెంట్ వంటి వాటిపై పరిశోధనలు చేసిన యశస్వి వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్లో పరిశీలించగా బలంగానే ఉన్నాయని నిరూపణ అయ్యింది. యశస్విని సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రోత్సాహం మరువలేనిది కోడి ఈకలు, చేప పొలుసు కాలువల్లో నీటికి అడ్డుపడటంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించటం గమనించా. వీటితో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేయాలనిపించింది. ఇందుకు మా గైడ్, సైన్స్ టీచర్ హేమంత్కుమార్, ప్రిన్సిపల్ రామభారతి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మా అమ్మ, నాన్న శ్రీలక్ష్మి, దేవరామరాజు మొదటి నుంచీ పరిశోధనలపై ఆసక్తి చూపేలా చేశారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – యశస్వి, ఇన్స్పైర్ అవార్డు గ్రహీత -
చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని..
భోపాల్: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. చికెన్ కూర వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కర్రతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఆగస్టు 23న రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ కూర వండలేదని.. వివరాల్లోకి వెళితే.. షాదోల్ జిల్లాలోని సెమారియాటోల గ్రామానికి చెందిన కమ్లేష్ కోల్, రాంబాయ్ కోల్ ఇద్దరూ భార్యాభర్తలు. గత ఆగస్టు నెల 23న రాత్రి కమ్లేష్ కోడికూర వండాలని తన భార్యకు చెప్పాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త పెద్దది కావడం.. కోపంతో కమ్లేష్ కోల్ అందుబాటులో ఉన్న ఓ కర్రని తీసుకుని భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయింది. అయితే, కమ్లేష్ తన భార్య ప్రమాదవశాత్తు తగిలిన గాయాలతో చనిపోయిందని ఇరుగుపొరుగు వారికి చెప్పి అప్పట్లో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మరణించిందని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య, చివరకు.. -
కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్ వెజ్ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్వెజ్ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్వెజ్ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్వెజ్ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్వెజ్ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్వెజ్ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్గా మారిపోయారు. దాదాపు 40 దేశాలకు ఎగుమతి భీమవరం ప్రాంతంలోని నాన్వెజ్ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. నాన్వెజ్ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్వెజ్ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. ► చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. ► చికెన్ వెరైటీలు : బోన్, బోన్లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం ► రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్ ► అలాగే పీత, మటన్ బోన్లెస్, మటన్ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. ► పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు. ► చికెన్ పచ్చడి ► రొయ్యల పచ్చడి ► నాటుకోడి పచ్చడి ► పీతల సమోసా -
బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో కూడా.. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్ తీస్తున్నారు. ఏడాది పొడువునా చికెన్కు డిమాండ్ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఇవే.. కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అలాగే కోవిడ్ను ఎదుర్కొనేందుకు చికెన్ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
భార్య చికెన్ ఫ్రై వండలేదని భర్త నిరాశ.. తట్టుకోలేక..
బెంగళూరు: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్య చికెన్ ఫ్రై వండలేదని ఆగ్రహంతో ఆమెను ఓ చెక్కతో బలంగా కొట్టగా తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో నివసిస్తున్న ముబారక్ పాషాకు భార్య షిరాను బాను, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే) ఆగస్టు 18వ తేదీన చికెన్ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి ఎంతో ఆశగా చూస్తే ఇంట్లో చికెన్ ఫ్రై వండలేదు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఈ సమయంలో భార్యతో గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన భర్త ఆమె తలపై ఓ చెక్కతో బలంగా బాదాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు. అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా వేశారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసుల విచారణ తీవ్రమవడంతో చివరకు ఆగస్టు చివరకు సోమవారం (ఆగస్ట్ 23) నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. కొట్టిన దెబ్బతో తీవ్ర గాయాలపాలైన భార్య ఇంట్లోనే మృతి చెందింది. పిల్లలు రాత్రి నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బయటకు వచ్చాడు. బైక్పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సరస్సులో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్న్యూస్