competitions
-
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘కమాండో కాంపిటీషన్స్’లో సత్తా చాటిన ఏపీ
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి. ఆర్పీఎఫ్కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది. స్మాల్ టీమ్ ఆపరేషన్స్కు ఇచ్చే రణ్నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది. -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్లకు గాను 82 శాతం షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
ముగిసిన ఎస్జీఎఫ్ ఫుట్బాల్ పోటీలు
కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ అంతర్జిల్లాల ఫుట్బాల్(అండర్–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో 2–1 స్కోర్తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్లో 4–3 స్కోర్తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్బాల్ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్జీఎఫ్ అంతరజిల్లాల ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్లు, కోచ్లు పాల్గొన్నారు. అండర్–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉదయ్భాస్కర్, శ్రీనివాసులు, రమేష్ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో, బాలికలు నవంబర్లో పంజాబ్లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలజట్టు: ఎస్.భానుశ్రీ, కె.మనీషా, ఆర్.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్), పి.సుహర్ష, ఏ.బెహ్హప్మన్ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు). బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్, ఎస్.డి.రవూఫ్, ఎస్.కె.నాగషరీఫ్(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్(కడప), సుఫియాన్, సి.అరవింద్(చిత్తూరు), జె.మైఖేల్(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్ అశ్వథ్(వైజాగ్), జే.రాముడు(కృష్ణ), కెల్విన్కెన్నెట్(చిత్తూరు), వై.కల్యాణ్(విజయవాడ), కె.అశోక్కుమార్(నెల్లూరు) స్టాండ్బైలుగా అఖిల్యాదవ్(చిత్తూరు), వి.విజయ్(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్గోదావరి), టి.రోహిత్.శ్రీ.ఫణిధర్(వెస్ట్గోదావరి), జ్ఞానేశ్వర్(శ్రీకాకుళం). -
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్బాబు (ప్రకాశం), ఎన్.అజయ్కుమార్ (కడప), స్టాండ్బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
హైదరాబాద్ హుసేన్ సాగర్ లో సెయిలింగ్ సందడి
-
పొంగి పొర్లిన శివ భక్తి.. ఖండాంతరాల్లో శివ పద నాద తరంగాలు!
శివ పదాలు అంటే మహా దేవుడైన శివుని భావస్వరాంజలులే, అటువంటి పదాలను పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100 పైగా అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ మే నెల 12,13,14వ తేదీల్లో యూట్యూబ్ మాధ్యమంగా శివపదాంకిత వాణీ, నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో నిర్వహించారు. శివపద గీతాల పోటీను పూర్తిగా విన్న షణ్ముఖ శర్మ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివ పదాలను పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శివాశీస్సులు అందించారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు "గ్లోబల్ శివపదం టీం"ను, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు శ్రీ మారేపల్లి సూర్యనారాయణకు, విద్యుత్ అంతరాయాలు ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలూ రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన శ్రీ తోలేటి వెంకట పవన్ కి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. మొత్తం 5 ఖండాలలోని వివిధ దేశాల నుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గునగా, 17 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శారదా సుబ్రమణియమ్, తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్,పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ పాల్గొన్నారు. అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వయసులవారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే 5 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా శివపదాలను అద్భుతంగా వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలలో పాల్గొనటం వలన పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయ నిర్ణేతలు అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం అంతా శివమయంగా మారిపోయింది. పాడే వారు, వినే వారు అందరూ కూడా శివ భక్తి సారంలో తన్మయులయ్యారు. రసరమ్యముగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం మొదలై ఆదివారం రోజు ముగిసింది. అప్పుడే పోటీలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని, వచ్చే ఏడాది కోసం ఇప్పటి నించే వేచిచూస్తామని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు అన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తామని, గాయకులూ, నిర్వాహకులూ, న్యాయనిర్ణేతలు, వీక్షకులూ అంతా అన్నారు. -
జోడుగా.. హుషారుగా.. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్లు
పిఠాపురం(కాకినాడ జిల్లా): వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు.. నేడు పరుగు పందేల్లోనూ సత్తా చాటుతున్నాయి. గతంలో పండగ రోజులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ఎడ్ల పరుగు పందేలు నేడు మామూలు సందర్భాల్లోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ ఈ ఎడ్లను రైతులు పెంచడం విశేషం. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినప్పటికీ దాని ద్వారా వచ్చే సంతృప్తి వెల కట్టలేనిదని వారు చెబుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఈ ఎడ్ల పరుగు పందేలు జరుగుతుండగా, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచీ రైతులు తమ ఎడ్లను తీసుకు వస్తున్నారు. జిల్లాలో లైను పందేలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందేలు ఆడుతుంటారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు ప్రత్యేక శిక్షణ పరుగు పందేల్లో పాల్గొనే ఎడ్లకు గిత్త ప్రాయం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఏడాది వయసులో ఉండగానే చిన్న సైజు బళ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. మామూలు ఎద్దుల్లా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలకు పరుగెత్తిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. ఈ పందేల్లో పాల్గొనే ఎద్దు రేటు రూ.లక్షల్లో పలుకుతుంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చయినా రైతులు వెనుకాడడం లేదు. మేత కూడ ప్రత్యేకమైనదే పందేల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేక దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు ప్రతి రోజూ ఉడకబెట్టి, నానబెట్టిన ఎండుగడ్డి ముక్కల్లో వేసి, దాణాగా మేపుతారు. మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకూ వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలున్నా లేకపోయినా వీటి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాల బళ్లుండేవి. కానీ పరుగు పందేల్లో ఉపయోగించే బళ్లను మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కువగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పందేలకు వెళ్లడమూ ప్రయాసే రాష్ట్రంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా ఎంతో వ్యయప్రయాసలకోర్చి వెళుతుంటారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఎడ్ల పందేలకు ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ, కడప, నెల్లూరు తదితర జిల్లాల నుంచి రైతులు తమ ఎద్దులను తీసుకువచ్చి పందేల్లో పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లో జరిగే పందేలకు ప్రైవేటు వాహనాలపై ఎడ్లబళ్లను తీసుకువస్తారు. ఇందుకు నిర్వాహకులు ఎటువంటి ఖర్చులూ ఇవ్వకపోయినా సుమారు రూ.50 వేల వరకూ సొంత ఖర్చులు పెట్టుకుని మరీ పందేలకు వెళ్తుంటారు. పందేనికి రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి ప్రదేశాలను ఎడ్లకు అలవాటు చేస్తుంటారు. పందెం జరిగే ప్రాంతంలో పందేనికి ముందు రోజు ఎడ్లను పరుగులు పెట్టించి శిక్షణ ఇస్తారు. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్లు కంటిలో లోపం రాకుండా దుమ్ము, ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయేలా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి వాటితో మసాజ్ చేస్తుంటారు. ప్రతి రోజూ పరుగులో శిక్షణ అనంతరం మసాజ్ చేయకపోతే కాళ్లు పట్టేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అందుకే పరుగు పెట్టిన ప్రతిసారీ తప్పనిసరిగా మసాజ్ చేయాల్సి ఉంటుందంటున్నారు. పందెం కొడితే విలువ పెంపు.. పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందేలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందేలు కొట్టిన ఎద్దులు ఒక్కొక్కటి సుమారు రూ.మూడు నాలుగు లక్షలకు అమ్ముడవుతాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందేలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు. గెలుపుతో వచ్చే ఆనందం వెలకట్టలేనిది మా కుటుంబంలో పూర్వం నుంచీ ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. మా దగ్గర పాత ఎడ్లు ఉండగా, రెండేళ్ల క్రితం మరో జత ఎడ్లను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాం. ఇవి శిక్షణ పొందినవి కావడంతో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు 15 పోటీల్లో పాల్గొనగా, ఆరుసార్లు రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచాయి. పందెం ఎడ్లలో సీనియర్స్, జూనియర్స్ విభాగాలు ఉంటాయి. మా ఎడ్లు సీనియర్స్ విభాగంలోకి వస్తాయి. ఇటీవల జిల్లాలో పలుచోట్ల జరిగిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సా«ధించాయి. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా, పోటీల్లో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది. – సత్యేంద్రకుమార్, రైతు, సామర్లకోట -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆన్లైన్ పోటీలు
కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్షిప్ ఆన్లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లైవ్లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
సందడిగా అందాల పోటీలు
-
గార్దభాలు భళా!
సాక్షి,బండిఆత్మకూరు: శివనంది ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడమల కాల్వ గ్రామంలో బుధవారం గార్దభాల(గాడిదల) బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సుమారు 120కేజీల బరువు గల ఇసుక సంచులను గాడిదపై వేశారు. 10 నిమిషాల సమయంలో ఎంత ఎక్కువ దూరం పరిగెడితే వాటిని విజేతలుగా ప్రకటించారు. చాగలమర్రి మండలం పెద్దవంగళి గ్రామం రమణయ్యకు చెందిన గార్దభం 5,509 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచింది. మహానంది మండలం పుట్టుపల్లె ప్రవీణ్కు చెందిన గార్దభం 5,400 అడుగులు లాగి రెండో స్థానం, వెలుగోడు నాగచరణ్కు చెందిన గార్దభం 5,373 అడుగులు లాగి మూడో స్థానం, వెలుగోడు మండలం వేల్పనూరు నాగేంద్రకు చెందిన గార్దభం 5,066 అడుగులు లాగి నాల్గోస్థానంలో నిలిచింది. వీరికి రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, రూ.2వేలు నగదును ఆలయ కమిటీ చైర్మన్ మేకల శ్రీనివాసులు, రాగాల బాబులు, వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా అందజేశారు. -
లడ్డూతినే పోటీలు నిర్వహిస్తున్నారా జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు జరగడం పరిపాటి. ఆఖరి నాలుగు రోజులు ఇవి జోరుగా సాగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు ఓకే అయినా అవి తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన లడ్డూ తినే పోటీ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటు, టోపీలు, టీ–షర్టుల పంపిణీ, లడ్డూలు తినే పోటీటూ నిర్వహిస్తారు. ఆయా పోటీల్లో అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతులు అందజేస్తారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే... ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడం, విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా.. ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రేకియా దెబ్బతినడం వల్లే... ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నర్వ్పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. -
హెల్దీ బేబీస్..
ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఆఫ్ ఉలవపాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆరోగ్య పోటీలు నిర్వహించగా 110 మంది పాల్గొన్నారు. పీడియాట్రిక్ వైద్యుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను సోమవారం ప్రకటించారు. బేబీ ఆఫ్ ఉలవపాడు మేల్ విభాగంలో దామతోటి శ్రావణ్ కుమార్, ఫిమేల్ విభాగంలో పల్లకి చేత్రప్రియ విజేతలుగా నిలిచారు. వైద్యశాల సూపరింటెండెంట్ శోభారాణి, బ్రహ్మయ్య బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో 11 మంది పిల్లలకు బహుమతులిచ్చారు. టీకాలు వేస్తున్న సమయం, బరువు, తల్లితండ్రుల ఆరోగ్య సూచనలు, పిల్లల ఆరోగ్యం ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు వైద్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కరీమ్.. విటమిన్ డ్రాప్స్ అందజేశారు. కార్యక్రమంలో దంతæ వైద్యులు సురేష్, యూనియన్ నాయకులు అల్తాఫ్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు కొల్లేరులో తాటిదోనెల పోటీలు
కైకలూరు: కొల్లేరు సాంప్రదాయక వేటకు తాటి దోనెలు చిరునామాలు. మూడేళ్ల విరామం అనంతరం అటవీశాఖ తాటి దోనెల పోటీలు నిర్వహించనుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కైకలూరు మండలం సర్కారు కాల్వ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. మత్స్యకారులు ఈ పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రథమ బహుమతి రూ.10,000, ద్వితీయ బహుమతి రూ.5,000, తృతీయ బహుమతి రూ.3,000గా నిర్ణయించారు. కొల్లేరులో 2005 ఫిబ్రవరి 2న అప్పటి రేంజర్ సునీల్కుమార్ మొదటిసారి దోనెల పోటీలను నిర్వహించారు. నీటిలో రాకెట్లు తాటి దోనెలు కొల్లేరు సరస్సులో చేపల వేటకు తాటి దోనెలను ఉపయోగిస్తారు. ముందుగా ఓ బలమైన తాటిచెట్టును ఎంపిక చేసుకుని దానిని మొదలుతో సహా తీసుకొస్తారు. 15 రోజుల పాటు బరిసెతో చెక్కుతారు. నీరు చేరకుండా తారును అద్దుతారు. దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. తాటిదోనెలపై మావులను (చేపలు పట్టడానికి ఉపయోగించే కర్రల బుట్ట) తీసుకెళ్లి వేట సాగిస్తారు. ఈ తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. సాంప్రదాయ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు మాత్రమే వీటిని ఉపయోగించగలరు. సంప్రదాయం కొనసాగించాలి కొల్లేరు సరస్సులో చేపల చెరువుల సాగు విస్తీర్ణం పెరగడంతో తాటి దోనెల ఉపయోగం తగ్గింది. ఇంజను ఇనుప పడవల వాడకం ఎక్కువైంది. పూర్వం కొల్లేరులో 4వేల జనాభాలో కనీసం 1000 తాటి దోనెలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కో గ్రామానికి కేవలం 10 దోనెలకు పరిమితమైంది. మయ్యింది. ఈ సందర్భంగా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ రామచంద్రరావు మాట్లాడుతూ చిత్తడి నేలల ఆవశ్యకతను తెలిపేందుకు తాటి దోనెల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. -
తాడిపత్రిలో పందుల పోటీ!
తాడిపత్రి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోళ్ల పందేలు... కానీ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పందేలపై నిషేధం విధించడంతో తాడిపత్రిలో వినూత్నంగా పందుల మధ్య పందెం నిర్వహించారు. ఈ పందెం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. పోటీల్లో పాలు పంచుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పందుల పెంపకం దారులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పందుల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. పోటీల సందర్భంగా రూ. లక్షల్లో బెట్టింగ్ సాగింది. ఇదే విషయంపై డీఎస్పీ మాట్లాడుతూ.. ‘కోడి పందేలను నిషేధించారు... పందుల పోటీ నిర్వహించుకోవడంపై ఉన్నతాధికారులతో మాట్లాడం.. పందుల పందేలపై ఎలాంటి ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా తెలుగమ్మాయి పోటీలు
సంక్రాంతి సంబరాలలో భాగంగా నిడదవోలులో గురువారం తెలుగమ్మాయి పోటీలు జరిగాయి. పరికిణి, ఓణీలతో అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు హోయ లొలికించారు. నిడదవోలు : పట్టు పరికిణీల సందడులు సీతాకోకచిలుకల్ని గుర్తు చేశాయి. అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు పరికిణి, ఓణీలతో హొయలొలికించారు. సంక్రాంతి ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగమ్మాయిల పోటీలకు ఉత్సాహంగా తరలివచ్చారు. పట్టు బట్టలు, గాజులు, కళ్లకు కాటుక, కాలి పట్టీలు, వడ్డాణం, పావిట బొట్టు, నుదిటి బొట్టు, గోరింటాకు, పూలతో పాటు ప్రత్యేక వస్త్ర అలంకరణతో విద్యార్థినులు సందడి చేశారు. పట్టణంలోని ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రోటరీ సెంట్రల్ క్లబ్, సాక్షి పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దీనిలో భాగంగా విద్యార్థినులకు తెలుగమ్మాయి పోటీలను నిర్వహించారు. ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికాస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపల్ పి.సరళ, రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు కూచిపూడి వీర వెంకట రామారావులు ప్రారంభించారు. సుమారు 200 మంది ఉత్సాహంగా పోటీ పడ్డారు. తెలుగమ్మాయి డిగ్రీ సీనియర్స్ విభాగంలో కె.నాగ పద్మిని (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) ప్రథమస్థానం సాధించింది. కోహిని (వికాస్ కళాశాల) ద్వితీయ స్థానం, ఆర్.పద్మావతి (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) తృతీయ స్థానంలో నిలిచారు. ఇంటర్ విభాగంలో అనూష, శైలజ, దేవిదుర్గలు వరుసగా మూడు స్థానాలను సాధించారు. సీనియర్ ముగ్గుల పోటీల్లో ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎం.దేవి, ఎ.అనూష, పి.సునీతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచారు. జూనియర్స్ ముగ్గుల పోటీల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు వి.సుప్రియ, వి.మధు, ఏవీ.సాయిలక్ష్మీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమెంటోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా తెలుగమ్మాయి పోటీలను నిర్వహించిన సాక్షి, రోటరీ సెంట్రల్ క్లబ్ సభ్యులను అభినందించారు. తెలుగు సంప్రదాయాలను వివరిస్తూ నేలపాటి సువర్ణ చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షుడు కూచిపూడి వీర వెంకట రామారావు, ప్రిన్సిపల్స్ పి.సరళ, శ్రీనివాసరావు, కార్యదర్శి వీడీ గంగాధరరావు, కోశాధికారి చింతల కిషోర్, అసిస్టెంట్ గవర్నర్ ముళ్ళపూడి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి గాలి రాఘవయ్య, బీఎన్వీ ప్రసాదరావు, కె.మోహన్బాబు, ముళ్ళపూడి హరిశ్ఛంద్రప్రసాద్, జీఎన్వీ ప్రసాద్, బండి వేణుగోపాలకృష్ణ, ఈదల నాగేశ్వరరావు, చుండ్రు అమ్మిరాజు, సింహాద్రి సాయిబాబా, సింహాద్రి శ్రీనివాస్, నీరుకొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఎం.శ్రీలక్ష్మి, ఉషారాణి, బి.శాంతిశేషు, గాలి ఈశ్వరి, కె.భువనేశ్వరి వ్యవహరించారు. -
27 నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు
పటమట (విజయవాడతూర్పు) : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి కీలకస్థానముందని, వ్యవసాయ రంగానికి చేయూతగా ఉండే పశువులను కుటుంబ సభ్యులుగా చూసుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో పటమటలంకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పటమటలోని వెర్టెక్స్ స్థలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఆరుపళ్ల విభాగంలో, 28న వ్యవసాయ విభాగంలో, 29వ తేదీ సబ్జూనియర్స్, జూనియర్స్ విభాగంలో, 30వ తేదీ సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని వివరించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన జతలకు నగదు పురస్కారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 జతల ఎడ్ల పేర్లు రిజిస్ట్రేషన్ జరిగిందని, రోజుకు 10–12 జతలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు 13వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అన్నాబత్తుని బాబీ, కమిటీ సభ్యులు యలమంచిలి దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక దినోత్సవ పోటీలకు ఆహ్వానం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపా రు. పోస్టర్ పెయింటింగ్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టూరిజం ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ► సుస్థిర పర్యాటకం–అభివృద్ధికి ఒక సాధనం అంశంపై పోస్టర్ పెయింటింగ్ పోటీ ఉంటుంది. ఈ అంశం ఆధారంగా స్పాట్ పెయింటంగ్ చేయాల్సి ఉంటుంది. ► పేపర్ ప్రెజెంటేషన్లో టూరిజం–ఏన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫినామినా, అర్బన్ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ మార్కెటింగ్, టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్, ఎంటర్ప్యూనర్షిప్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటి, సస్టైనబుల్ టూరిజం–ఏ టూల్ ఫర్ డెవలప్మెంట్, జీఐఎస్ అప్లికేషన్ ఇన్ టూరిజం, డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్, టూరిజం ప్లానింగ్ రీజినల్ డెవలప్మెంట్, న్యూ టైప్స్ ఆఫ్ టూరిజం అంశాలపై వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి ఉపకరించే అంశాలను దీనిలో ప్రస్తావించి, వివరించాలి. నాలుగు వేల పదాలకు మించకుండా వ్యాసం ఉండాలి. ► క్విజ్ పోటీల్లో 60 శాతం ప్రశ్నలు ఏపీ పర్యాటకంపైన మిగిలిన 40 శాతం ప్రశ్నలు వర్తమాన అంశాలపై ఉంటాయి. ఒక్కో బృందంలో ఇద్దరు విద్యార్థులు ఉండాలి. ► ఏపీ పర్యాటక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఫొటోలు ఉండాలి. ఒక్కో విద్యార్థి గరిష్టంగా మూడు ఫొటోలను పోటీకి పంపవచ్చును. 2.5 మెగా పిక్సిల్స్కు తగ్గకుండా నాలు గు వేల మెగా పిక్సిల్స్కు మించని క్వాలిటీ కలిగి ఉండాలి. ఒక ఒరిజినల్ ప్రింట్, సాఫ్ట్ కాపీలను విద్యార్థి తమ స్వీయ లేఖను జరపరచి అందించాలి. డిజిటల్ సాంకేతిక సహకారంతో తీర్చిదిద్దిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోం. జేపీఈజీ ఫార్మాట్లో 4 ఎంబీల కంటే తక్కువ నిడివితో ఫొటోలను పంపాల్సి ఉంటుంది. ► పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలను జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. విశాఖపట్నంలో వచ్చేనెల 6న ఉదయం 10 గంటలకు ఎంబీఏ అనెక్స్ భవనం(ఏయూ అవుట్గేట్ వద్ద), శ్రీకాకుళంలో వచ్చేనెల 7న, విజయనగరం ఎంఆర్ పీజీ కళాశాలలో వచ్చే నెల 8న పోటీలు జరుగుతాయి. ఇతర సమాచారం కోసం ఏయూ వెబ్సైట్ www. andhrauniversity.edu.in, ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్. సాంబశివరావు(9848170274)ను సంప్రదించవచ్చును. విజేతలకు వచ్చేనెల 27న పర్యాటక శాఖ నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు. -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ ఉగాది నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. సముద్ర తీరంలోని సైకత శిల్పం అందంగా ఉంటుంది. అలల తాకిడికి కరిగిపోతుంది. అలల్లో కలిసిపోతుంది. అలానే యువతీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారు, వివాహబంధాలను వినాశనం చేసుకుంటున్నారు. ఆకర్షణలకు పోయి వాస్తవాలను విస్మరించి అపోహలతో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే సందేశంతో కళా రాధన (నంద్యాల) కళాకారులు ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శించారు. వివాహ బంధం అలలకు కరిగిపోయే సైకత శిల్పంలా కాకుండా సజీవ శిల్పంలా దృఢంగా నిలవాలని చాటిచెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు చూపే ప్రేమలో పరిమితి ఉండదనే సందేశంతో సాయి ఆర్ట్స్ (కొలుకులూరు) కళాకారులు ‘చాలు–ఇక చాలు’ నాటిక ద్వారా చాటిచెప్పారు. ముందుగా కర్నూలు జిల్లా బనగానపలి్లకి చెందిన కె.అంజలీనాథ్ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నంద్యాలకు చెందిన సుంకర రాజశేఖర ప్రసాద్కు జీవన సాఫల్య ఉగాది పురస్కారాన్ని అందజేశారు. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లా సాఫ్ట్బాల్ జూనియర్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా బాల, బాలికల జూనియర్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు తెలిపారు. ఈ ఎంపిక స్థానిక అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ డీ పాల్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు.ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు 1999 జనవరి 1 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఆర్డీటీ క్రీడా మైదానంలో కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఎడ్లపోటీలు
-
కళలకు పుట్టినిల్లు.. పాలకొల్లు
పాలకొల్లు టౌన్ : కళలకు పుట్టినిల్లైన పాలకొల్లు నుంచి ఎందరో కళాకారులు సినీ రంగంలో ప్రవేశించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురదేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ 10వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు పరిషత్ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షత వహించారు. నేటి హైటెక్ యుగంలో కూడా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ కళాపరిషత్లు నాటకాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మాటల రచయిత చింతపల్లి రమణ, నిర్మాత అడ్డాల చంటిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ, విన్నకోట వేంకటేశ్వరరావు, మానాపురం సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్చైర్మన్ కర్నేన రోజారమణి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటికలు సమాజంలోని పలు అంశాలను లేవనెత్తుతూ కళాకారులు నాటకాలు ప్రదర్శించారు. విలువైన మానవ దేహాలను మట్టికో...కట్టెకో బలి చేయకుండా వైద్య పరిశోధనలకు ఇస్తే భావితరాల భవిష్యత్తుకు ఉపయోగకరమని ‘స్వర్గానికి వంతెన’ నాటిక సందేశాన్నిచ్చింది. దీనికి రచన వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ద్రాక్షారామ కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన ‘అతనికి అటు..ఇటు’ నాటిక సంసారంలో రేగిన కలతలను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టింది. మూడో ప్రదర్శనగా ‘సందడే సందడి’ నాటిక ప్రదర్శించారు. జయశ్రీ శ్రీజ సాధినేని రచన, దర్శకత్వంతోపాటు సుశీల పాత్రను పోషించారు. హాస్యభరితంగా సాగిన ఈ నాటిక ద్వారా దురాశ వల్ల కలిగే నష్టాలను వివరించారు. -
తూచ్..తూచ్ తొండి ‘ఆట’
* ఆడకుండానే ఆడించినట్లుగా కాగితాలపై నమోదు * క్రీడాకారులు రాకుండానే టీమ్లు రెడీ * ఇదీ మండలస్థాయి ఆటల పోటీల తీరు ఆడకుండానే ఆడినట్లుగా.. కూత పెట్టకుండానే పెట్టినట్లుగా.. ఎగరకుండానే ఎగిరినట్లుగా.. ఆటల పోటీలు జరిగాయి. కాదు కాదు.. జరిగాయని మనం అనుకోవాలి. అదేమిటనుకుంటున్నారా.. అవును మరి. మన పీడీలు, అధికారులు అలా చక్రం తిప్పేశారు. పోటీలను నిర్వహించకుండానే కాగితాలపైనే టీంలను ఎంపిక చేసి ఆడించినట్లుగా బొమ్మ చూపిస్తూ తొండి ‘ఆట’ ఆడారు. క్రీడా పోటీల పరువు తీశారు. ప్రత్తిపాడు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో అండర్ –19 క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అండర్–19 విభాగంలో అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ పోటీలు బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించాల్సి ఉంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన టీమ్లను ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లా స్థాయిలో జరగనున్న పోటీలకు పంపాలి. కానీ ఇవేమీ చేయకుండా అసలు ఆటల పోటీలే నిర్వహించకుండా మండలంలో పీఈటీలు కాగితాలపై టీమ్లను నింపేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. పోటీలకు మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్న ఉద్దేశంతో ముందుగానే భోజనాన్ని సైతం ఏర్పాటు చేయించారు. తీరా ఏ ఒక్క పాఠశాల నుంచీ క్రీడాకారులు రాకపోవడంతో పోటీలు జరగలేదు. కానీ పీడీలు మాత్రం పోటీలు జరిగినట్లుగా చెబుతున్నారు. మండలంలోని ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి టీమ్లు వచ్చాయని వాలీబాల్, కబడ్డీ, షాట్పుట్, డిస్కస్త్రో, లాంగ్జంప్, హైజంప్ పోటీలను నిర్వహించామని కట్టుకథను అల్లారు. పచ్చి అబద్ధాలు చెబుతూ అధికారులు, పీడీలు అటు ప్రజలను ఇటు మీడియాను తప్పుదో పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు ఇసుకే లేని మైదానంలో హైజంప్, లాంగ్ జంప్ ఎలా ఆడగలుగుతారు..? అన్న ధర్మ సందేహాలను పీడీ మరిచినట్లున్నారు. పోటీల నిర్వహణకు నిధులు.. పోటీల నిర్వహణకుగాను ప్రభుత్వం ఒక్కో మండలానికి ఐదు వేల రూపాయల నిధులను కేటాయించింది. వీటితో క్రీడాకారులను మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లడం వంటి వాటికి నిధులను వెచ్చించాల్సి ఉన్నప్పటికీ ఈ తతంగమంతా జరగనే లేదు. కానీ పేపర్లలో మాత్రం వచ్చినట్లు, ఆడినట్లు చూపించి ఉన్నతాధికారులకు టోకరా వేస్తున్నారు. వచ్చారు ఆడించాం.. పోటీలకు క్రీడాకారులు వచ్చారు. ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కబడ్డీకి నాలుగు, వాలీబాల్కు నాలుగు టీమ్లు వచ్చాయి. వారితో ఆటలాడించాం. అథ్లెటిక్స్ నిర్వహించాం. - భాస్కరరావు పీడీ, ప్రత్తిపాడు హైస్కూల్ ఒక్క పాఠశాల వాళ్లు కూడా రాలేదు: మండల స్థాయి పోటీలు కావడంతో మిగిలిన పాఠశాలల నుంచి కూడా క్రీడాకారులు వస్తారన్న ఉద్దేశంతో అందరికీ భోజనాలను కూడా ఏర్పాటు చేశాం. కానీ ఒక్క పాఠశాల నుంచి కూడా విద్యార్థులు రాలేదు. పీడీ ప్రమోషన్లు, పీఈటీల బదిలీల్లో హడావిడిగా ఉండటం వలన రాలేదంట. - రమాదేవి, హెచ్ఎం, ప్రత్తిపాడు హైస్కూల్ -
స్వచ్చ సర్వేక్షనలో హైదరాబాద్ మెరుగు పడుతుందా?
-
చానమిల్లి ఆవులకు మూడు బహుమతులు
చానమిల్లి (నిడమర్రు) : తూర్పుగోదావరి జిల్లా నామవరంలోని భారతీ విద్యాభవన్స్ లో జరిగిన అఖిలభారత అవుల, గేదెల అందాల పోటీల్లో చానమిల్లి సర్పంచ్ వెజ్జు రామారావుకు చెందిన ఆవులు 3 బహుమతులు గెలుచుకున్నాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించారని రామారావు ఆదివారం చెప్పారు. సుమారు 250 పైగా ఆవులు పాల్గొన్న ఈ పోటీలు ఆదివారంతో ముగిసినట్టు తెలిపారు. వివిధ జాతి ఆవుల అందాల పోటీల్లో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆవులకు బహుమతులు లభించినట్టు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆవులను పోటీల్లో నామినేషన్ చేయించినట్టు తెలిపారు. కొంగనూరు గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఉమాదేవి గిత్త ద్వితీయ బహుమతి, కపిల గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఆహాన్ గిత్తకు ద్వితీయ బహుమతి, ఒగోలు గిత్త ఆందాల పోటీల్లో వెజ్జు నరేష్ గిత్తకు ప్రత్యేక బహుమతి లభించినట్టు చెప్పారు. ఈ పోటీలు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనా«థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలిపారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి : తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ నెల 21 నుంచి జరిగే జాతీయస్థాయి జూనియర్, మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ – 2017 పోటీలకు రాష్ట్రం నుంచి లిఫ్టర్లను ఎంపిక చేసినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 53 కేజీల విభాగంలో షేక్ మహ్మద్ గౌస్, 120 కేజీల విభాగంలో జన్నాదుల ఈశ్వర్, మాస్టర్స్ కేటగిరీ 93 కేజీల విభాగంలో పసుపులేటి సురేష్, 105 కేజీల విభాగంలో ఆర్.నటరాజ్, గడ్డం రమేష్, 74 కేజీల విభాగంలో కరిముల్లా, డి. పార్థసారథిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదుగురు లిఫ్టర్లు జిల్లా నుంచి ఎంపిక కావడంపై అసోసియేషన్ ప్రతినిధులు మహ్మద్ రఫీ, ఎండీ సంధాని, ఎన్.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. -
జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం
కొయ్యలగూడెం : జిల్లా ఫుట్బాల్ అసోసియేష న్ కోటగిరి విద్యాధరరావు ఫౌండేష న్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కొయ్యలగూడెంలో ఫ్లో(ఫుట్బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి)–2017 మ్యాచ్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం– నరసాపురం జట్లు హోరాహోరీగా ఈ ఈ మ్యాచ్లో తలపడ్డాయి. చివరకు జంగారెడ్డిగూడెం జట్టు 1–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 1.30 గంటల వ్యవధిలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేకపోవడంతో ఆటను అర్ధ గంట పాటు పొడిగించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన జంగారెడ్డిగూడెం జట్టులోని సభ్యుడు పవ న్ ఆట ఆఖరి నిమిషంలో గోల్ సాధించి విజయాన్ని చేకూర్చాడు. టోర్నీ నిర్వాహకులు ఫౌండేష న్ వ్యవస్థాపకుడు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మ్యాచ్ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మొత్తం 15 లీగ్మ్యాచ్లో భాగంగా 9వ మ్యాచ్ కొయ్యలగూడెంలో నిర్వహించామని ఫ్లో సీఈవో ఆర్.రాజేష్ రావూరి, జిల్లా ఫుట్బాల్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావులు తెలిపారు. 16న పాలకొల్లు, 17న నరసాపురంలో సెమీ ఫైనల్స్, 18న ఏలూరులో ఫైనల్స్ జరపనున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఏఎంసీ చైర్మపి.రామారావు, అఫెడా మాజీ డైరెక్టర్ గొడవర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. -
విజేత ఆత్మకూరు జట్టు
బ్యాట్స్మన్ రూపేష్ ఆల్ రౌండ్ ప్రతిభ అనంతపురం సప్తగిరి సర్కిల్ : సెంట్రల్ జోన్ క్రికెట్ బాలుర పోటీల్లో ఆత్మకూరు జట్టు విజేతగా నిలిచింది. బ్యాట్స్మన్ రూపేష్ ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు విజయాన్నందించాడు. బుధవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం, కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో మ్యాచ్లు జరిగాయి. క్వార్టర్ ఫైనల్లో ఆత్మకూరు, పెనుకొండ జట్లు తలపడగా ఆత్మకూరు జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో ముదిగుబ్బ, తాడిపత్రి జట్లు తలపడగా ముదిగుబ్బ జట్టు గెలుపొందింది. సెమీఫైనల్లో విన్సెంట్ డీ పాల్ అనంతపురం, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడగా 24 పరుగులతో ముదిగుబ్బ జట్టు విజయం సా«ధించింది. మరో సెమీఫైనల్లో కదిరి వాల్మీకి జట్టుపై ఆత్మకూరు జట్టు 12 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఫైనల్లో ఆత్మకూరు జట్టు, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడ్డాయి. ఆత్మకూరు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పీవీఎస్ ముదిగుబ్బ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆత్మకూరు జట్టు 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. జట్టులో రూపేష్ 21 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 58 పరుగులు సాధించాడు. ఆత్మకూరు జట్టు విజయానికి రూపేష్ చేసిన పరుగుల వరదే కీలకం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పెనుకొండపై 28, కదిరి జట్టుపై 41 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం ఆర్ట్స్ కళాశాల, కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో బాల. బాలికల ఫుట్బాల్ పోటీలు జరుగుతాయని సెంట్రల్ జోన్ కార్యదర్శి శంకరన్న, పీఈటీ వేణుకుమార్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు బాషా, రాగేష్, సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అమలాపురం జోన్ బాలికల గ్రిగ్స్
సీనియర్స్ ఆల్రౌండ్ చాంపియన్ శ్రావ్య పుల్లేటికుర్రు(అంబాజీపేట) : పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో గత మూడు రోజులుగా జరుగుతున్న అమలాపురం జోన్ బాలికల గ్రిగ్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1,000 మంది క్రీడాకారులు, 70 మంది పీఈటీలు పాల్గొన్నారని గ్రిగ్ నిర్వాహక అధ్యక్షుడు, హెచ్ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలిపారు. విజేతలను ప్రకటించారు. బాలికల సీనియర్స్ వ్యక్తిగత ఆల్రౌండ్ చాంపియన్ షిప్లో సాయి శ్రావ్య (భాష్యం, అమలాపురం), మరియమ్మ (విలస), డి.మనీష (పుల్లేటికుర్రు), జూనియర్స్ విభాగంలో కె.శరణ్య (తొండవరం), ఎస్.కావ్య (పుల్లేటికుర్రు)లకు ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చాయి. సీనియర్స్ హాకీ విభాగంలో పి.లక్ష్మివాడ, మునిపల్లి, గొల్లవిల్లి, బాస్కెట్బాల్ తులిప్స్ అమలాపురం, అమలాపురం, ముమ్మిడివరం, వాలీబాల్లో వీరవల్లిపాలెం, కొమరగిరిపట్నం, మాగం, కబడ్డీలో వన్నెచింతలపూడి, అయినాపురం, కొమరగిరిపట్నం, ఖోఖోలో గంగలకుర్రు అగ్రహారం, పాలగుమ్మి, పుల్లేటికుర్రు, బాల్బ్యాడ్మింటన్లో పుల్లేటికుర్రు, కొండుకుదురు, మాగం, హ్యాండ్ బాల్లో కొమరగిరిపట్నం, విలస, ఇరుసుమండ, టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, డబుల్స్లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, టెన్నికాయిట్ సింగిల్స్లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, డబుల్స్లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, చెస్లో ఇసుకపూడి, విద్యానిధి (అమలాపురం), సెయింట్ జోసెఫ్ ఇరుసుమండ, త్రోబాల్లో అయినాపురం, చెయ్యేరు, నెట్బాల్ శానపల్లిలంక, అమలాపురం, ముమ్మిడివరంలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. సీనియర్స్తో పాటు జూనియర్స్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. -
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
గురజాల రూరల్: గురజాల శ్రీముక్కంటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో జె.ఎం.ఎం.ఎం ఫ్రెడ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వంటూరి వెంకటప్పారెడ్డి, టీడీపీ నాయకులు సఖిల బాలకోటిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొత్తం 32 జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పీఈటీలు బి.బాలాజి నాయక్, జి.కోటేశ్వరావు, కె.కోటిబాబు పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన వారికి ఎనుముల మురళీధర్రెడ్డి ప్రథమ బహుమతి రూ.12,000 లు, ద్వితీయబహుమతిని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వంటూరి వెంకటప్పారెడ్డి రూ.7,000, తృతీయ బహుమతిని శ్రీకాంత్ నర్సింగ్ హోం రూ. 5,000, నాల్గవ బహుమతిని సాంబశివ నర్సింగ్ హోం రూ. 3,000 అందిస్తున్నట్లు తెలిపారు. షీల్డులను యూటీఎఫ్ నాయకుడు టి.అరుణ్ కుమార్ అందిస్తారన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మువ్వా మల్లికార్జునరావు, మంచి కాటంరాజు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి తానా నాటక పోటీలు
కర్నూలు (కల్చరల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తానా నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నాటక పోటీల కమిటీ చైర్మెన్ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కన్వీనర్ ముప్పా రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో భాగంగా 22న సాయంత్రం 6 గంటలకు గుంటూరు నాటక సమాజం వారు అనంతం నాటికను, కరీంనగర్ చైతన్య కళాభారతి వారు దొంగలు నాటికను ప్రదర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు గణేష్ ఆర్ట్ థియేటర్ వారు అంతా భ్రాంతియే అనే నాటికను ప్రదర్శిస్తారన్నారు. 23న సాయంత్రం 6 గంటలకు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు రెండునిశ్శబ్దాల మధ్య అనే నాటికను, యంగ్ థియేటర్స్ అసోసియేషన్ విజయవాడ వారు అనగణగా అనే నాటికను రాత్రి 8.30 గంటలకు, సిరిమువ్వా కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు మాతృక నాటికను ప్రదర్శిస్తారన్నారు. 24న శనివారం ఉదయం 10.30 గంటలకు నంద్యాల కళారాధన వారు సైకథ శిల్పం నాటికను, 11.30 గంటలకు కొలకలూరు సాయిఆర్ట్స్ క్రియేషన్ వారు ఒక్క మాట చాలు అనే నాటికను, 12.30 గంటలకు నిజామాబాద్ మురళీకృష్ణ కళానిలయం వారు పొద్దు పొడిచింది అనే నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. 24న సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ సినీ నటులు బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొంటారన్నారు. కళాభిమానులు ఈ నాటకాలను తిలకించి జయప్రదం చేయాలని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య కోరారు. -
ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
* హోరాహోరీగా అంతర్ కళాశాలల పోటీలు బాపట్ల టౌన్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కళాశాలల విద్యార్థులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల పోటీలు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. పుట్బాల్లో విన్నర్స్గా బాపట్ల వ్యవసాయ కళాశాల, రన్నర్స్గా బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలు నిలిచాయి. క్రికెట్లో సెమిఫైనల్స్కు బాపట్ల వ్యవసాయ కళాశాల, నైరా వ్యవసాయ కళాశాలలు చేరుకున్నాయని వ్యవసాయ కళాశాల స్టూడెంట్స్ ఎఫైర్స్ ఆఫీసర్ డాక్టర్ పి. అనిల్కుమార్ తెలిపారు. అథ్లెటిక్స్లో విజేతలు వీరే... 1000 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా ఎన్. హరికృష్ణ (వ్యవసాయ కళాశాల, నైరా), ఎం.కె. శ్రీకాంత్ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), ఐ. బాలమణికంఠ (వ్యవసాయ కళాశాల, బాపట్ల) నిలిచారు. 200 మీ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా కె. రామ్నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా),వై. రాజేష్, టి. గణేష్ వర్మ (వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, మడకశిర), ఉన్నారు. షార్ట్పుట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా జి. అదిత్య (వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల), జె. మధు (వ్యవసాయ కళాశాల, నైరా), ఎ.జి.హెచ్ ప్రసాద్ (వ్యవసాయ కళాశాల, రాజమండ్రి) గెలుపొందారు. లాంగ్ జంప్లో వై. రాజేష్ (వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, మడకశిర), సిహెచ్. సతీష్కుమార్ (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్ బాబు (వ్యవసాయ కళాశాల, తిరుపతి) ఉన్నారు. ట్రిపుల్ జంప్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రామ్నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా), రిబిన్బాబుబేబి (వ్యవసాయ కళాశాల తిరుపతి) గెలిచారు. హైజంప్లో ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు అహ్మద్ హుస్సేన్ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్బేబి (వ్యవసాయ కళాశాల, తిరుపతి) నిలిచారు. డిస్కస్త్రోలో సాయికుమార్ (వ్యవసాయ కళాశాల, నైరా), తిలక్ (వ్యవసాయ కళాశాల, నైరా), సతీష్ ( వ్యవసాయ కళాశాల, బాపట్ల) విద్యార్థులు గెలుపొందారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
అల్లూరు (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అల్లూరు మంతెన సత్యనారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అండర్ 17 వాలీబాల్ బాలికల విబాగంలో ఎ జీవననాగజ్యోతి, పి.భవాని (స్టాండ్బై ), వాలీబాల్ అండర్ 14 బాలికల విబాగంలో పి సదా,ఎ లీలా మాధవి , ఎస్కె ఫాతిమా (స్టాండ్బై )లు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 14 బాలుర విబాగంలో ఎన్హర్షవర్దన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు (స్టాండ్బైగా ) ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈనెల 8వ తేదీన నరసరావుపేటలో జరిగిన ఖేల్ఇండియా జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైయ్యారని తెలిపారు. -
మూడోరోజు 813 మంది హాజరు
మచిలీపట్నం : పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మూడోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. 1,200 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 813 మంది హాజరయ్యారు. మిగిలిన వారు వివిధ కారణాలతో వెనుదిరిగారు. అభ్యర్థులకు చాతీ కొలతలు, ఎత్తు, 1,600 మీటర్ల పరుగుపందెం, వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్ పోటీలను ఎస్పీ జి.విజయకుమార్ పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4 గంటలకే అభ్యర్థులు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పరుగుపందెం పోటీల్లో అస్వస్థతకు గురైన వారికి అక్కడే ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో సేవలందించారు. గురువారం మహిళా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియను ఏఎస్పీ బీడీవీ సాగర్, అవనిగడ్డ, మచిలీపట్నం డీఎస్పీలు, పలువురు సీఐలు పర్యవేక్షించారు. -
యువజనోత్సహం
ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. డివిజనల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారితో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మరణించిన గాయకులు మంగళం పల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు ప్రావీణ్యతను ఇంకా మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇందుకుగాను తమ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోటీల అనంతరం సాయంత్రం బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ మస్తాన్వలి, మేనేజర్ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారు కూచిపూడి నృత్యం 1. ఎస్. మానస, 2, అర్చన, 3. శాంభవి జానపద నృత్యం 1. లక్ష్మి, అనూష గ్రూప్, 2. స్వప్న, జితేష్ గ్రూప్ భరతనాట్యం 1. రాధ వక్తృత్వ పోటీలు 1. సుస్మితారెడ్డి సంప్రదాయ సంగీతం(హిందుస్తానీ) 1. కె. యశ్వంతి, 2. ఎన్. మునివన్నూరమ్మ కర్ణాటక సంగీతం 1.జీఎం చంద్ర లిఖిత క్లాసికల్ ఇన్స్టుమెంట్స్ 1. ఎం. ముని సాయిరామ్(డోలి), 1. ఎం. తిరుమల(తబల), 2. బి. జి. నాగవీణకుమార్(తబల), 1. ఎం. డోనాల్డ్ డిక్(గిటార్), 1. వై. వెంకటేష్ బాబు(వీణ), 1. అశ్వత్ కుమార్(హార్మోనియం) ఫోక్ సాంగ్ గ్రూప్ 1. రాజ్కుమార్ అండ్ గ్రూప్, ప్రభుత్వ శారద సంగీత కళాశాల, కర్నూలు ఏకపాత్రభినయం 1. సుశాంత్ ఫిలిప్స్ అండ్ గ్రూప్, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, కర్నూలు. -
హోరాహోరీగా ఖోఖో పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలలో భాగంగా జిల్లా క్రీడాభివృ«ద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అండర్–14, 17 బాలబాలికల ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలలో 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో జోసఫ్ కుమార్ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు తదితరులు పాలొన్నారు.అండర్–14 బాలుర విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, సత్తెనపల్లి జట్టు ద్వితీయ, వినుకొండ జట్టు తృతీయ స్థానాలు సాధించాయి.బాలికల విభాగంలో మాచర్ల జట్లు ప్రథమ, బాపట్ల ద్వితీయ, వినుకొండ తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–17 బాలుర విభాగంలో బాపట్ల జట్టు ప్రథమ, చిలకలూరి పేట జట్టు ద్వితీయ, గురజాల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, వేమూరు జట్టు ద్వితీయ, ప్రత్తిపాడు జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. -
ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
దేవరపల్లి : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని అంతర జిల్లాల ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం దేవరపల్లిలో ప్రారంభమయ్యాయి. స్థానిక భూపతిరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి. తొలుత ఈ పోటీలను రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ప్రారంభించారు. విద్యా సంస్థల చైర్మ¯ŒS డి.సువర్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మంది అభిమానులు కలిగిన ఆట పుట్బాల్ అని అన్నారు. క్రీడలకు నన్నయ యూనివర్సిటీ ఇస్తున్న ప్రాధాన్యం రెండు తెలుగు రాష్టాల్లో ఏ యూనివర్సిటీ ఇవ్వడంలేదన్నారు. జాతీయస్థాయిలో 600 యూనివర్సిటీల మధ్య నిర్వహించిన బాల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో నన్నయ యూనివర్సిటీకి ద్వితీయస్థానం లభించిందన్నారు. బాడీ బిల్డింగ్లోనూ ద్వితీయస్థానం లభించినట్టు చెప్పారు. 450 కళాశాలలు యూనివర్శిటీ పరిధిలో ఉన్నాయని, 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. సర్పంచ్ సుంకర యామినీ, జెడ్పీటీసీ కె.సుధారాణి, రాప్ట్ర క్రీడల అధికారి పేరం రవీంద్రనాథ్, ఏఎంసీ ఛైర్మ¯ŒS ముళ్లపూడి వెంకట్రావు, మానవత సంస్థ జిల్లా నాయకుడు పరిమి వెంకటేశ్వరరావు, కళాశాల పీడీ కె.వి.డి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ వి. ఆనందరావు, హెచ్ఎం పి.వీర్రాజు, యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: హైదరాబాద్లో ఈనెల 25, 26 తేదీల్లో జరుగుతున్న జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు భాష్యం విద్యార్థులు బయలుదేరి వెళ్లారని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్ మూడవ లైనులోని భాష్యం మెయిన్ క్యాంపస్లో గురువారం విద్యార్థులను అభినందించిన అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఈనెల 14,15,16 తేదీల్లో ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో అండర్–19 విభాగంలో సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని వై. శ్రీనిత్య, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని ఎం.రిషిత, జూనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థి వి.హర్ష వర్ధన్రెడ్డి అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. శుక్ర, శని వారాల్లో హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా విద్యార్థులకు పుష్ఫగుచ్ఛాలను అందజేసి అభినందించారు. -
ఎడ్లబండ లాగుడు పోటీలు ప్రారంభం
దుర్గి: మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం శ్రీహరిహర బాలనాగేంద్రస్వామి వార్షిక మహోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఎడ్లబండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోటీలలో సేద్యపు విభాగంలో 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, రానున్న జగనన్న పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొత్తా వెంకటేశ్వర్లు, అరిగెల ఏడుకొండలు, గుండా వెంకటేశ్వర్లు, యరబోతుల శ్రీనివాసరావు, నల్ల వెంకటరెడ్డి, వెలిదండి గోపాల్, మొగిలి బాలశ్రీను, అడిగొప్పల చిన్నబ్బాయి, కర్నాటి సుబ్బారావు, బసవయ్యగారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: 62వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు షేక్ ఫరాజ్, మహితారెడ్డి, శ్రేష్టా, అపురూప్, ఆకాష్, హేమ సింధూర ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని శనివారం స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఈసీ సభ్యుడు కోటిలింగా రెడ్డి, టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులలో సోమవారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. -
షటిల్ బ్యాడ్మింటన్ విజేతలు వీరే..
ముగిసిన ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగిన ఫైనల్స్ తెనాలి: బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2016 పోటీలు ముగిశాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలబాలికలకు ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలు శుక్రవారం సాయంత్రం జరిగిన రసవత్తరంగా సాగాయి. అండర్–15 ఫైనల్స్ పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన సాయిచరణ్ కోయ–చరణ్నాయక్ జట్టు విన్నర్స్గా నిలిచింది. వీరు కర్నూలు క్రీడాకారులు సాయినాథ్రెడ్డి–అర్షద్పై 21–11, 21–15 స్కోరుతో విజయం సాధించారు. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో మేఘ (కర్నూలు)–వెన్నెల (కడప) 21–14, 21–18 స్కోరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.జాహ్నవి–కె.మేఘనపై జట్టుపై గెలుపొందారు. సింగిల్స్ మ్యాచ్ బాలుర విభాగంలో షేక్ అర్షద్ (కర్నూలు) విన్నర్ కాగా, షేక్ ఇమ్రాన్ (అనంతపురం) రన్నర్గా నిలిచాడు. బాలికల విభాగంలో కర్నూలు క్రీడాకారిణి పి.మేఘ, చిత్తూరు క్రీడాకారిణి గీతాకృష్ణ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అండర్–13 కేటగిరీలో... అండర్–13 కేటగిరీ బాలుర డబుల్స్లో అనంతపురం ద్వయం బీ విజయ్–పి.రాహుల్ విన్నర్స్, ఎ.నిధిభట్ (కర్నూలు)–షేక్ నుమెయిర్ (ప్రకాశం) జంట రన్నర్గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ జట్టులోని ఆయేషాసింగ్–కేపీఎస్ ప్రజ్ఞ విన్నర్స్, ఎ.నయనవి రెడ్డి (పశ్చిమగోదావరి)– కె.రిషిక (కృష్ణా) జంట రన్నర్స్ స్థానాలు సాధించారు. ఇదే కేటగిరీ బాలుర సింగిల్స్లో బి.విజయ్ (అనంతపురం), ఎ.వంశీకృష్ణ (పశ్చిమగోదావరి), విన్నర్, రన్నర్గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ క్రీడాకారిణి ఆయేషాసింగ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దోబచర్ల చిరుహాసిని మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్లో 19–21, 21–16, 21–17 ఆయేషాసింగ్ గెలుపొందారు. సీడింగ్ అర్హత కలిగిన క్రీడాకారులే కాకుండా కొత్తగా పాల్గొన్నవారు వందకుపైగా ఉన్నారు. వీరికి సీడింగ్ అర్హత కోసం రోజున్నర పోటీలు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియం, వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో పోటీలు సాగాయి.. మొత్తం 8 ఈవెంట్లలో తణుకులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఐదు ఈవెంట్లలో ఫైనల్స్కు చేరుకున్నట్టు అకాడమీ కోచ్ సమ్మెట సతీష్బాబు చెప్పారు. టోర్నమెంటు రిఫరీగా షేక్ జిలానీబాషా (కడప), డిప్యూటీ రిఫరీగా షేక్ హుమయూన్ కబీర్ (ప్రకాశం) వ్యవహరించారు. -
సందడిగా బ్యాడ్మింటన్ పోటీలు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన వేదికపై ప్రారంభసభ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతిని వెలిగించగా, ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పావురాలు, బెలూన్లను ఎగురవేశారు. జ్యోతిని సుంకర హరికృష్ణ, గడ్డిపాటి బాలచంద్రకుమార్ వెలిగించారు. తొలుత క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీవో జి.నరసింహులు, డీఎస్పీ జీవీ రమణమూర్తి, కె.శకుంతల పాల్గొన్నారు. అనంతరం వివిధ జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులకు క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహించారు. అండర్–13 విభాగంలో బాలురు 90 మంది, బాలికలు 38 మంది రాగా, అండర్ –15 విభాగంలో బాలురు 110 మంది, బాలికలు 34 మంది వచ్చారు. వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలతోనే తొలిరోజు గడచిపోయింది. బుధవారం మధ్యాహ్నానికి వీరిలో క్వాలిఫైయింగ్ క్రీడాకారులు తేలిపోతారు. క్వాలిఫై అయిన క్రీడాకారులతో డ్రాలు తీసి, సాయంత్రం నుంచి పోటీలు ఆరంభమయ్యే అవకాశముంది. -
శిల్పికారాణి
కళ డి.దేవికారాణి ఉడయార్. శిల్పం గురించి కొంచెమైనా తెలిసిన వారికి పరిచయం అక్కరలేని శిల్పకళాకారిణి. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. దేవిక ఆల్రౌండర్. నృత్యం, సంగీతం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, వైద్యం, చిత్ర లేఖనం... వీటన్నింటిలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్పి కళారాణి దేవికారాణి. వృత్తి, ప్రవృత్తిగా ఒకటి రెండు రంగాల్లోనే మాత్రమే రాణించే వారిని చూశాం. ఏకంగా ఐదారు రంగాల్లో ఆమెది తనదైన ముద్రే. శుక్రవారం రవీంద్రభారతిలో ‘లత రాజ సాంస్కృతిక శిరోమణి అవార్డు’ అందుకున్న దేవిక సాక్షి ‘ఫ్యామిలీ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు. బాల్యంలోనే: దేవిక ఐదవ తరగతిలో ఉండగా స్కూల్కి ఇన్స్పెక్టర్ వచ్చారు. వివిధ రకాల పోటీలు నిర్వహించారు. దేవిక శంకరాచార్యులు, రామానుజాచార్యుల చిత్రాలు గీశారు. వాటిని స్కూల్ హెచ్ఎం, ఇన్స్పెక్టర్ చూశారు. రూ. 5 బహుమతిగా అందిస్తూ జీవితంలో మహాశిల్పివి అవుతావని ఆశీర్వదించారు. దేవిక చెన్నైలో బీఎఫ్ఏ చేశారు. తండ్రి దగ్గర శిష్యురాలిగా శిల్ప విద్య నేర్చుకున్నారు. ‘‘నెహ్రూగారు తన కుమార్తె ఇందిరా గాంధీని ఎలా తన వెంట తిప్పారో... మా నాన్న మహా శిల్పి భద్రగిరి శ్రీనాధ రత్న కూడా నన్ను అలాగే ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లేవారు’’ అని చెప్పారు దేవిక. హైదరాబాద్ ట్యాంక్బండ్పై విగ్రహాలను రూపొందించడంలో కూడా ఆ తండ్రి తన కూతురి సహకారం తీసుకున్నారు! 60 వేల విగ్రహాలు: దేవిక స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరం. 1973 ఆగస్ట్ 15న జన్మించారు. గత 32 ఏళ్ల ప్రయాణంలో తండ్రితో కలిసి అన్ని రకాలవి కలిపి 60 వేలు విగ్రహాలు చేశారు. అందులో 30 వేల వరకు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. 2003 తండ్రి కాలం చేసి తర్వాత నుంచి ఇప్పటి వరకు సొంతంగా ఒక్కరే ఆరువేల విగ్రహాలు.. మహానుభావులవి, పురాణపురుషులవి, రాజకీయ నాయకులవి తయారు చేశారు. జ్యోతిభాపూలే, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమ దేవి, అన్నమాచార్యులు, తిక్కన, మొల్ల, వివేకానంద, నెహ్రూ, అక్కినేని నాగేశ్వరావు, రఘుపతి వెంకయ్య, ఒబామా, పాప్ రారాజు మైఖేల్ జాక్సన్, సముద్రాల (సీనియర్) విగ్రహాలకూ ప్రాణం పోశారు. పవిత్రమైనది ఈ కళ: ‘‘శిల్ప కళ ఎంతో ఉత్కృష్టమైంది. ఎంతో నిష్ఠగా చేయాలి. ఫొటోను చూచి వ్యక్తిని చూస్తున్నట్లుగా శిల్పకారుడు లీనం అవ్వాలి. ఏ మాత్రం మన ఆలోచనల్లో తేడా వచ్చినా శిల్పం అసలు రూపం పోతుంది. అన్నం ఎంత పవిత్రంగా వండుతామో.. అంతకన్నా పవిత్రంగా శిల్ప కళను ప్రారంభించాలి. అప్పుడే అసలు రూపం వస్తుంది’’ అని చెప్పారు దేవిక. ‘మొదట మట్టితో తయారు చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో రూపొందించిన నమూనా ఓకే అయిన తర్వాత వాటిని అచ్చులుగా రూపొందిస్తాం’’ అని వివరించారు. యునెస్కో గోల్డ్మెడలిస్ట్: దేవిక అసంఖ్యాంగా అవార్డులు అందుకున్నారు. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్లోకి ఎక్కాలనేది ఆమె ఆశయం. పాఠశాల స్థాయి నుండే ఆయా రంగాల్లో తన ప్రతిభకు సానబెట్టుకున్నారు. యునెస్కో గోల్డ్ మెడలిస్ట్గా కూడా ఖ్యాతి గడించారు. హైదరాబాద్ క్రిస్టల్ గార్డెన్స్లో లక్ష్మిదేవిగా నటించి ప్రదర్శించిన ‘ శ్రీలక్ష్మి వైభవం’ భరతనాట్య నృత్య ప్రదర్శన అంతర్జాతీయ కీర్తిని నార్జింపజేసింది. ‘‘ఒక తెలుగు మహిళా శిల్పిగా గ్లోబల్ స్థాయిలో రాణించాలనేదే నా ఆశయం. ధ్యేయం. కష్టం నా వంతు ఫలితం దేవుని వంతు’’ అంటారు దేవిక. ట్రస్ట్ ద్వారా సేవలు: దేవిక తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉడయార్ అకాడమీ అండ్ ఫైనార్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ స్థాపించి కళామతల్లికి ఇతోధిక సేవలు అందిస్తున్నారు. తనకున్న దానిలోనే పదిమంది పేదలకు సహాయ పడాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో ముందుంటున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో ఐక్యత, రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎవరు తనని ఏ విధంగా ఆశ్రయించినా ముందుండి సేవ చేసి, వారి కష్టాలు తీర్చి పంపుతున్నారు. అందుకే స్థానికులు దేవికను బడుగుల రాణిగా పిలుస్తుంటారు. - కోన సుధాకర్రెడ్డి -
ముగిసిన లాన్ టెన్నిస్ పోటీలు
గుంటూరు రూరల్ : గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అండర్ 14 విభాగం లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయోలా పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ అన్వర్ పాల్గొని మాట్లాడారు. క్రీడలతో మానసిక పరిపక్వత సాధిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పోటీల్లో బాలికల సింగిల్స్ విభాగంలో నల్లాపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత ప్రథమ స్థానం సాధించింది. విజయవాడ చైతన్య పాఠశాలకు చెందిన సీహెచ్ ప్రవల్లిక ద్వితీయ స్థానం గెలుపొందింది. సింగిల్స్ బాలుర విభాగంలో విజయవాడకు చెందిన భాష్యం విద్యార్థి జయకృష్ణ వంశీ ప్రథమ స్థానం, నిర్మల హైస్కూల్ విద్యార్థి కె.గిరీష్ కైవశంచేసుకున్నారు. బాలికల డబుల్స్ విభాగంలో నల్లపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత, విజయవాడ చైతన్య విద్యార్థి సీహెచ్ ప్రవల్లిక ప్రథమస్థానం, ఎన్ఎస్ఎమ్ స్కూల్ విజయవాడకు చెందిన విద్యార్థి ఎస్.యశస్వీ, కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని లావణ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరు చైతన్య విద్యార్థి షేక్ ఫరాజ్, విజయవాడ భాష్యం విద్యార్థి జయకృష్ణవంశీ ప్రథమ స్థానం, విజయవాడ నిర్మల హైస్కూల్ విద్యార్థి గిరీష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మాధవ్లు ద్వితీయ స్థానంలో నిలిచారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నాదెండ్ల: చిలకలూరిపేట సాదినేని చౌదరయ్య హెల్త్ అండ్ రిక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్ను శనివారం రాత్రి ధనలక్ష్మి గ్రూపు సంస్థల కార్యదర్శి పేర్ని వీరనారాయణ, చిలకలూరిపేట అర్బన్ సీఐ బి.సురేష్బాబు ప్రారంభించారు. మొత్తం 56 టీములు పాల్గొన్నాయి. మొదటి స్థానాన్ని శ్రీనివాస ఇంటర్నేషనల్ అధినేత తాళ్ళ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మధు దక్కించుకున్నారు. వీరికి రూ.6 వేలు నగదు, షీల్డును బాలాజీ సీడ్స్ అధినేత నరేంద్ర అందించారు. రెండో బహుమతిని చిలకలూరిపేట ఆర్టీసీ కండక్టర్ మైనంపాటి సుబ్రహ్మణ్యం, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ శేఖర్బాబు దక్కించుకున్నారు. వీరికి రూ.4 వేలు నగదు, షీల్డును ఎంఎస్ ఫ్యాషన్స్ అధినేత కొర్నెపాటి శ్రీనివాసరావు అందజేశారు. మూడో బహుమతిని సాదినేని చౌదరయ్య క్లబ్ క్రీడాకారులు కాకుమాను వెంకట్, కోటి సాధించారు. వీరికి రూ.3 వేలు నగదు, షీల్డును అడపా నాగసుబ్బారావు అందించారు. నాలుగో బహుమతిని చిలకలూరిపేట ఎన్ఎస్పీ కెనాల్స్లో పనిచేసే శ్రీనివాసరావు, అధ్యాపకుడు సుబ్బారావు సాధించారు. వీరికి రూ.2 వేలు నగదు, షీల్డును వెనిగళ్ళ శ్రీధర్ అందజేశారు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా గణపవరానికి చెందిన పృథ్వీ ఎంపికయ్యారు. ఆయనకు రూ.వెయ్యి నగదు, షీల్డును నిర్వాహకులు అందించారు. -
అంతర్జాతీయ టార్గెట్బాల్ పోటీలకు రేవంత్
తుని : అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన ఎల్.రేవంత్ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ వీవీఎస్ భానుమూర్తి శనివారం తెలిపారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టులో ఉత్తమ ప్రతిభ చూపిన రేవంత్ అంతర్జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడని, డిసెంబరులో భూటా¯ŒSలో జరిగే పోటీల అండర్–19 విభాగంలో భారతజట్టు సభ్యుడుగా ఆడతాడని చెప్పారు. ప్రతిభ చూపిన రేవంత్ను విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, కార్యదర్శి విజయ్ప్రకాష్ , ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉత్కంఠగా బాస్కెట్ బాల్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ శనివారం జేకేసీ కళాశాలలో ప్రారంభమైంది. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో బాలికల, పురుషుల విభాగంలో పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్లో 12 బాలబాలికల స్కూల్ జట్లు, 15 పురుషుల కాలేజి జట్లు పాల్గొన్నాయి. జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళిమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు, లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ అంతోనీ, ఏ.పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి పి.రాఘవయ్య, పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు... కళాశాల పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్లో ఏసీ కళాశాల జట్టు 40–20 స్కోర్తో ఏఎన్యూ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 36–17 స్కోర్తో నర్సరావుపేట ఎన్ఈసీ ఇంజినీరింగ్ జట్టుపై, వీవీఐటీ జట్టు 46–23 స్కోర్తో ఆర్విఆర్ కళాశాల జట్లపై విజయం సాధించాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకుడు హరగోపాల్ వెల్లడించారు. -
లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్ 14 సింగిల్స్, డబుల్స్ లాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొన సాగనున్న పోటీలను ఎన్టీఆర్స్టేడియం సెక్రటరీ శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంథొని మాట్లాడుతూ లాన్ టెన్నిస్ క్రీడలు తమ పాఠశాలలో నిర్వహించటం ఆనందంగా ఉందని, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం నిర్వహించేందుకు తాము సిద్ధమేనన్నారు. మొదటిరోజు బాలుర సింగిల్స్ విభాగంలో 64 మంది, బాలికల సింగిల్స్ విభాగంలో 16 మంది పోటీ పడుతున్నారన్నారు. -
అమెచ్యూర్ చెస్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అమెచ్యూర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు చంద్రమౌళి నగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ 2300 లోపు ఎలోరేటెడ్ క్రీడాకారులు 50 మంది టోర్నమెంట్లో పాల్గొన్నారని చెప్పారు. మొదటి, రెండవ స్థానం సాధించిన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్లో క్రీడాకారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు. -
కేడీసీసీబీ ఆధ్వర్యంలో పోటీలు
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు, సహకార సిబ్బందికి, కవులు, రచయితలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా సీఈఓ రామాంజనేయులు తెలిపారు. సహకార వ్యవస్థ ఔనత్యం చాటి చెప్పడం, సహకార సంఘాలు నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టేదెలా తదితర వాటిపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకు 83330 32950ను సంప్రదించాలన్నారు. - డిగ్రీ విద్యార్థులకు నవంబరు 6న మద్దూరు నగర్లోని మాస్టర్ జూనియర్ కళాశాలలో దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ పాత్ర, ప్రాధాన్యత అవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు. - కవులు, రచయితలకు సహకార వ్యవస్థ– ఔన్నత్యం అనే అంశంపై కవితలు రాసి వచ్చే నెల 7వ తేదీలోపు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు పంపాలి. - పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి సహకార వారోత్సవాలు ప్రారంభం రోజున బహుమతులు పంపిణీ చేస్తారు. -
రైఫిల్ షూటింగ్లో ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 రైఫిల్ షూటింగ్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పతకాలు సాధించారు. యక్కలూరి శ్రీనిత్య బాలికల పిప్ సైట్ ఈవెంట్లో, ఎం.రిషిత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో , బాలుర ఎయిర్ రైఫిల్ విభాగంలో హర్షవర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మంగళవారం స్కూల్ గేమ్స్ కార్యదర్శి ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.సంజీవరెడ్డి, డీబీఈఓ రామకృష్ణ పరమహంస అభినందించారు. -
హోరాహోరీగా బాస్కెట్బాల్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: డీఎస్ఆర్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్దానిక బ్రహ్మనందరెడ్డి స్డేడియంలో జరుగుతున్న 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. పురుషుల విభాగంలో డీఎస్ఆర్ ఫ్రెండ్స్ క్లబ్, జీఎస్సీ గుంటూరు, యాదవ హైస్కూల్, వి.వి.ఐ.టి, నంబూరు, ఏఎన్యూ, పొలీస్ పెరేడ్ జట్టు, జె.కె.సి కళాశాల, ఏసీ కళాశాల జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. మహిళాల విభాగంలో ఏఎన్యూ జట్టు, జీఎస్సీ గుంటూరు, నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ స్టేడియం జట్లు సూపర్ లీగ్ దశకు చేరుకున్నాయి. బుధవారం పురుషుల, మహిళ విభాగాలలో సెమి ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచులు జరుగుతాయని డీఎస్ఆర్ క్లబ్ ప్రధాన కార్యదర్శి టీ.గురునాధం తెలిపారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. -
వ్యాస రచనలో పోలీసులు
విజయవాడ: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం బందరు రోడ్డులో కె.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్లో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసుల విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం దాని ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించారు. 65మంది కానిస్టేబుల్స్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయివరకు పాల్గొన్నారు. డీసీపీ (అడ్మిన్) జి.వి.జి. అశోక్ కుమార్ పర్యవేక్షించారు. -
నాటక పోటీలకు ‘త్రికూటేశ్వర మహత్యం’
* కోటప్పకొండలో స్క్రీనింగ్ టెస్ట్ * డిసెంబర్ 12 నుంచి 21 వరకు తిరుపతిలో పోటీలు నరసరావుపేట రూరల్: టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబర్లో నిర్వహించే నాటక పోటీల కోసం శనివారం కోటప్పకొండలో స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పోటీలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కళాకారులు త్రికూటేశ్వర మహత్యం అనే పద్య నాటికను ఎంట్రీగా పంపారు. టీటీడీ సాంస్కృతిక విభాగానికి చెందిన కోనెటి సుబ్బరాజు, యానాపురం సత్యనారాయణతో కూడిన నలుగురు సభ్యులు ఈ నాటికను తిలకించారు. కోటప్పకొండలోని కమ్మసత్రంలో నాటకాన్ని ప్రదర్శించారు. డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో గరుడ పోటీలు జరుగనున్నాయి. వచ్చిన ఎంట్రీలలో ఉత్తమ నాటకాలు, నాటికలను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా శనివారం ఈ నాటికను బృందం తిలకించింది. మొత్తం 254 ఎంట్రీలు.. కళాపరిషత్ పోటీలలో పౌరాణిక నాటికలు, నాటకాలు, సాంఘిక నాటకాలు, బాలుర పౌరాణిక నాటికలు, లలిత సంగీతం తదితర విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనేందుకు దాదాపు 254 ఎంట్రీలు వచ్చినట్టు నాటకాన్ని పరిశీలించేందుకు వచ్చిన బృందం సభ్యులు తెలిపారు. వీటిలో ఉత్తమమైనవి గుర్తించి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ తెలుగు సంఘాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చినట్టు వివరించారు. ఆకట్టుకున్న నాటక ప్రదర్శన... కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి మహిత్యంపై కళాకారులు ప్రదర్శించిన పద్య నాటకం ఆకట్టుకుంది. త్రికూట పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చింది, దక్షయజ్ణం, గోల్లభామ తదితర ఘట్టాలను కళాకారులు ప్రదర్శించారు. రెండున్నర గంటల నిడివిగల నాటకంలో గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇద్దరు సురభి కళాకారిణులు ఇందులో ముఖ్యపాత్రలను పోషించారు. రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉన్న తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ నాటిక పోటీలలో ప్రదర్శన ఇచ్చి త్రికోటేశ్వరుని మహాత్యాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు సింగర కొండయ్య చౌదరి తెలిపారు. రెండు నెలల పాటు కళాకారులకు శిక్షణ ఇచ్చామన్నారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు భాష్యం విద్యార్థులు ఎంపికయ్యారని భాష్యం విద్యాసంస్థల సీఈఓ భాష్యం హనుమంతరావు తెలిపారు. స్థానిక చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. అండర్–19 విభాగంలో వై.శ్రీనిత్య (సీనియర్ బైపిసీ), ఎం.రిషిత (సీనియర్ ఎంపీసీ), వి.హర్షవర్ధన్ రెడ్డి(జూనియర్ బైపీసీ), ఎన్.వెంకట వరుణ్ సాయి(సీనియర్ ఎంపీసీ) ఎంపికైనట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. -
ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు
కుంకలగుంట (నకరికల్లు): జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు కుంకలగుంటలో ఘనంగా నిర్వహించారు. కుంకలగుంట పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు జరిగిన పోటీలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట), గోళ్లపాడు ముప్పాళ్ల, వాగ్దేవి గోల్డెన్బాయ్స్ (నరసరావుపేట) జట్లు విజేతలుగా నిలిచి లీగ్మ్యాచ్లలో ప్రవేసించాయి. రెండురోజు ఫైనల్ పోటీలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
తల్లిదండ్రుల ప్రోత్సాహం శుభపరిణామం
రాజమహేంద్రవరం సిటీ : క్రీడలపై చిన్నా రుల ఆసక్తిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్లో 46వ జాతీయ జూనియర్ ఓపెన్ చదరంగం, 31వ జాతీయ జూనియర్ బాలికల చదరంగం చాంపియన్ షిప్–2016 పోటీలు శనివారం మొదలయ్యాయి. జాతీయ క్రీడాకారిణి జి.హర్షితతో మొదటి ఆట ఆడి టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘం సహకారంలో తొమ్మిది రోజులు ఈ టోర్నమెంట్ జరగనుంది. రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారులు హజరయ్యే ఈ టోర్నీలో తొమ్మిది రోజుల్లో 11 రౌండ్లు జరుగుతాయన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ఆడతారన్నారు. అసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు, టోర్నీ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ 30 మంది క్రీడాకారులకు రెండున్నర లక్షల నగదు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చైతన్యరాజు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
హోరా హోరీగా కబడ్డీ పోటీలు
సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల స్త్రీ, పురుష జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్త్రీ, పురుష కబడ్డీ జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం శనివారం రాత్రి పోటీలను తిలకించారు. అంతర్జాతీయ కోచ్ పోతుల సాయిని, పీఈటీ తాళ్లూరి వైకుంఠంలను డిప్యూటీ సీఎం, రాజప్పలు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్ బ్యాగ్లు, స్టాప్ వాచ్, విజిల్ అందజేశారు. మహిళా విభాగంలో విజయనగరం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 48 పాయింట్ల తేడాతో, గుంటూరు జట్టుపై తూర్పుగోదావరి 37 పాయింట్ల ఆధిక్యతతో, విశాఖ జట్టు అనంతపురం జట్టుపై 41 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టు శ్రీకాకుళం జట్టుపై 35 పాయింట్ల తేడాతోను ఘన విజయం సాధించాయి. పురుషుల విభాగంలో గుంటూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 32 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టుపై విశాఖ జట్టు 9 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచాయి. ప్రకాశం జట్టు నెల్లూరు జట్టుపై 10 పాయింట్ల తేడాతోను, విజయనగరం– పశ్చిమ గోదావరిపై మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రాత్రి 8.30 గంటకు సీమి ఫైనల్ మ్యాచ్లు ప్రారంభించారు. పురుషుల మొదటి సెమీ ఫైనల్ తూర్పు– విశాఖ జట్ల మధ్య, మహిళల సెమీ ఫైనల్ తూర్పు –విజయనగరం జట్ల మధ్య జరిగాయి. మహిళా విభాగంలో విజయనగరం జట్టు తూర్పు గోదావరిపై 19 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. తూర్పు గోదావరి పురుషుల జట్టు విశాఖ జట్టుపై 22 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, నలమాటి జానికి రామయ్య, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ క్రీడల్లో జిల్లా జట్ల ముందంజ
గుంటూరు స్పోర్ట్స్: విద్యుత్ శాఖ రాష్ట్ర స్థాయి టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రీడాపోటీలు ఫైనల్స్కు చేరాయి. గుంటూరు జిల్లా టెన్నిస్, బాస్కెట్ బాల్ జట్లు ప్రతిభ కనబరుస్తున్నాయి. మంగళవారం ఎన్టీఆర్ స్డేడియంలో టెన్నిస్ టీమ్ విభాగంలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టు 2–0 స్కోర్తో నెల్లూరు జిల్లా జట్టుపై, రెండో సెమీ ఫైనల్లో విశాఖపట్నం టీఎల్ అండ్ ఎస్ఎస్ జట్టు 2–0 స్కోర్తో హైదరాబాద్ విద్యుత్ సౌధా జట్టుపై విజయం సాధించి ఫైనల్స్కు చేరాయి. బుధవారం జరిగే టెన్నిస్ టీమ్ ఈవెంట్ ఫైనల్స్లో గుంటూరు, విశాఖపట్నం జట్లు తలపడతాయి. బాస్కెట్ బాల్ విభాగం తొలి సెమీఫైనల్స్లో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ జట్టు 33–13 స్కోర్తో వైఎస్సార్ కడప జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్స్లో గుంటూరు జిల్లా జట్టు 39–30 స్కోర్తో విజయవాడ జట్టుపై గెలుపొందింది. బుధవారం ఉదయం గుంటూరు, రామగుండం జట్లు ఫైనల్స్లో తలపడతాయి. మధ్యాహ్నం స్థానిక కుందుల రోడ్డులోని గొంది సీతారామయ్య కల్యాణ మండపంలో క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్ఈ జయభారతరావు వెల్లడించారు. -
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ, ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు హఫీజ్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లా నంద్యాలలో అక్టోబర్ ఆరవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు నారాయణ విద్యాసంస్థల విద్యార్థిని షేక్ హఫీజ్ ఎంపికైనట్టు విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్బాబు తెలిపారు. అమరావతి రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల జోనల్ కార్యాలయంలో శనివారం హఫీజ్ను ఆయన అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో 40 కేజీల బాలికల విభాగంలో విజేతగా నిలిచిన హఫీజ్ రాష్ట్రస్థాయికి అర్హత సాధించిందని వివరించారు. విద్యార్థిని హఫీజ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సైతం విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. విద్యార్థినితో పాటు క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను జీఎం తిలక్బాబు, డీన్ శ్రీనివాసరావు, ఏజీఎం ఆళ్ళ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఏడుకొండలు అభినందించారు. -
తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి
తెనాలి రూరల్ : రాష్ట్ర స్థాయి తైక్వాండో, జాతీయ స్థాయి టాంగ్ సూడో పోటీలకు పట్టణ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గుంటూరులో జరిగిన సెలక్షన్స్లో కళాశాలకు చెందిన యు.దివ్యలక్ష్మి తైక్వాండోలో అండర్ 19, 58 కిలోల విభాగంలో అర్హత సాధించింది. అలాగే గోవాలో అక్టోబర్ 24 నుంచి 26 వరకు జరుగనున్న టాంగ్సూడో జాతీయ పోటీలకు సుంకర అలేఖ్య అర్హత పొందింది. విద్యార్థినులు, కోచ్ కె.శ్రీనివాసరావును శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీన్ ఉమామహేశ్వరరావు, రాంబాబు, శివన్నారాయణ, సురేష్ తదితర అధ్యాపకులు అభినందించారు. -
దివ్యాంగులకు ఆటల పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : రోటోఫెస్ట్ అధ్వర్యంలో గురువారం స్వర్ణభారతి నగర్లోని దాక్షిణ్య సంస్థలోని శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులకు పరుగుపందెం, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, షాట్పుట్, లెమన్ ఇన్ స్పూన్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలను దాక్షిణ్య సంస్థల డైరెక్టర్ టి.వి.రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిమ్నాస్టిక్ పోటీలను రోటరీ డైరెక్టర్ నంబూరు సుబ్బారావు ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టి.వి.రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు వెలకట్టలేనివని చెప్పారు. విజేతలకు ఈ నెల 25న బహుమతి ప్రదానం చేస్తామని రొటేరియన్ అంకమ్మరావు తెలిపారు. -
25న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
బాపట్ల: గుంటూరు జిల్లా స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 25న బాపట్ల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతుందని గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరి ఊసా రాంబాబు తెలిపారు. ఎంపికైన జట్లు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పల్లంబీడు గ్రౌండ్లో జరిగే 64వ అంతర్రాష్ట్ర స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పురుషులు 80 కిలోలు, స్త్రీలు 70 కేజీలు మించి ఉండరాదన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా జిల్లా వాసులై ఉండాలని, ఆధార్కార్డు ఒరిజినల్తో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కత్తి శ్రీనివాసరావు ఉన్నారు. -
కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కారంపూడి: జాతీయ స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లా తేలప్రోలులో నిÆృ‡్వహించిన స్కూల్ గేమ్స్ టోర్నమెంటులో వీరు గోల్డ్ మెడల్స్ సాధించి నేషనల్స్కు క్వాలిఫై అయ్యారు. ఢిల్లీ, పూనే నగరాల్లో నిర్వహించే జాతీయ పోటీలకుృఅర్హత సాధించారు. అండర్14 బాలుర విభాగంలో పి.నరసింహారావు, అండర్17 విభాగంలో ఎ.సిద్ధార్థ, పి.నాగరాజు, సబ్ జూనియర్స్ విభాగంలో ఎ వెంకటేష్, డి.బాలకృష్ణ ఎంపికయ్యారు. ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, ఆర్.ఆంజనేయులునాయక్, రాజేష్ బ్రాంజ్ మెడల్స్, గ్రీకో రోమన్ విభాగంలో ఎం.వంశీ, ఎం.రత్నకుమార్ సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ భూషణం, పీఈటీ ఎం.శ్రీనివాసులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వెస్లీ అధ్యాపకులు అభినందించారు. -
విద్యార్థులకు చెస్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోటో ఫెస్ట్–2016 కార్యక్రమంలో బుధవారం స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్డేడియం నందు బాలబాలికలకు చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన 400 మంది విద్యార్థులు పోటీలలో తలపడ్డారు. ఈ సందర్భంగా రోటో ఫెస్ట్ డైరెక్టర్ రోటేరియన్ అంకమ్మరావు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకు క్రీడా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోటేరియన్లు శివప్రసాద్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, కె.ఎస్.రమేష్, గాలి సుబ్బారావు, క్లబ్ కార్యదర్శి గడ్డిపాటి సుధాకర్ పోటీలను పర్యవేక్షించారు. -
సాఫ్్టబాల్ పోటీల్లో వరంగల్కు మూడో స్థానం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళలు సాఫ్్టబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. విజేతలకు టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి ట్రోఫీలు అందజేశారు. -
కళా ఉత్సవం అదిరెన్!
-
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
తెనాలి టౌన్: ఆత్మరక్షణకు, మనోధైర్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్యార్డు ఆవరణలో రాష్ట్రస్థాయి టాంగ్సూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెనాలిలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణరావు మాట్లాడారు. గుంటూరు జిల్లాకు బంగారు, వెండి, రజత పతకాలు లభించినట్లు పోటీల చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ నాగరాజు, ఆర్గనైజర్ కె.శ్రీనివాసరావు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, క్రీడాకారులు, 10 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
ఏఎన్యూ: యూనివర్సిటీ ఫార్మశీ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పురుషుల, మహిళలపోటీలు శనివారంతో ముగిశాయి. మహిళల విభాగంలో 12 జట్లు, బాలుర విభాగంలో 20 జట్లు పాల్గొన్నాయి. మహిళల విభాగంలో ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సైన్సెస్, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల (గుంటూరు) జట్లు సంయుక్తంగా మొదటి స్థానం సాధించాయి. రెండో బహుమతిని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్యూ), మూడో బహుమతిని ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మశీ సాధించాయి. పురుషుల విభాగంలో బీఏ అండ్ కేఆర్ (ఒంగోలు) జట్టు మొదటి బహుమతిని, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్యూ) రెండో బహుమతి, ఎస్ఎస్అండ్ ఎన్కాలేజ్ (నరసరావుపేట) మూడో బహుమతిని కైవశం చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసా ద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఏఎన్యూ పార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రమీలారాణి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్స్పోర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్సన్, ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వై.కిషోర్, సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి టీవ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
టాంగ్సూడో పోటీలు ప్రారంభం
తెనాలి టౌన్: తెనాలిలో రాష్ట్రస్థాయి టాంగ్సూడో పోటీలు శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ప్రారంభమయ్యాయి. మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను తెనాలి మొదటి ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి జి.ప్రభాకర్, రెండవ ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి సీహెచ్.పవన్కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా టాంగ్సూడో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ప్రారంభోత్సవ సభకు డాన్ బ్లాక్ బెల్ట్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభలో న్యాయమూర్తి ప్రభాకరరావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మసై ్థర్యం పెరుగుతుందని, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. కరాటే నేర్చుకునే విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఆడపిల్లలు ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం ఈ క్రీడలను నేర్చుకోవాలన్నారు. మరో న్యాయమూర్తి పవన్కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. త్రీటౌన్ సీఐ ఎ.ఆశోక్కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కరాటే, కుంగ్ఫూ లాంటి పోటీలను నిర్వహించాలన్నారు. ఆత్మరక్షణకు సంబంధించిన విద్యను నేర్చుకోవడం నేటి సమాజంలో తప్పనిసరి అని అన్నారు. సభ అధ్యక్షత వహించిన నిర్వాహకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలుర, బాలికల విభాగంలో అండర్–11, అండర్–14, అండర్–17, 18 సంవత్సరాలకు పైబడిన క్రీడాకారులకు స్పారింగ్, ప్లామ్స్, వెపన్స్, బ్రేకింగ్ ఈవెంట్లలో పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా గత ఏడాది పోటీలు నిర్వహించామని, ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో రాష్ట్రానికి మూడు వెండి, ఒక రజత పతకం వచ్చినట్లు చెప్పారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24న గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ వి.నాగరాజు, కన్వీనర్ కె.శ్రీనివాసరావు, ఇండియా టెక్నికల్ డైరెక్టర్ బీవీ రమణయ్య, వివిధ జిల్లాల ప్రతినిధులు గోపినాయుడు, రవిబాబు, శంకరరావు, కరిముల్లా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభం
మాచర్ల: పట్టణంలోని సాగర్ రోడ్డులో సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రాష్ట్రస్థాయి సీనియర్ అంతర జిల్లా సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీ లు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు జిల్లా సాఫ్ట్బాల్ అధ్యక్షుడు సీహెచ్ శివశంకరరెడ్డి, కార్యదర్శి పి.నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ ఎన్.మంగమ్మ, సెయింట్ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల హెచ్ఎం సిస్టర్ ఎంఎల్ పుష్పమేరీ, ఎంఈవో వేముల నాగయ్య, రూరల్సీఐ శివశంకర్, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసశర్మ, వికాస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ లక్ష్మీనారాయణ, హెచ్ఎంలు ఐవీ నాగమణి, ఎ.ఇన్నమ్మ, సాఫ్ట్బాల్ పోటీల నిర్వాహకులు సంతోష్కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు గాదె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుస్తీ పోటీలకు కారంపూడి విద్యార్థులు
కారంపూడి: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు 17 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శనివారం తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మందడంలో శుక్రవారం అండర్14, 17 విభాగాలలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. అండర్ 14 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఇ.రవి, ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, జి.అభినవ్, జి.రామకృష్ణ, ఆర్.ఆంజనేయులునాయక్, జి.నరసింహారావు ఎంపికయ్యారు. అండర్ 17 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఎం.నాగేంద్రబాబు, పి.రమేష్, జి.గోపయ్య, ఇ రాజేష్, అండర్ 17 బాలుర గ్రీకో రోమన్ స్టెయిల్లో కె.దిలీప్కుమార్, బి.అబేజ్, ఎం.వంశీ, ఎ.సిద్దార్ధ, ఎం.రత్నకుమార్, పి.నాగరాజు ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.భూషణం, పీఈటీ శ్రీనివాసులు ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ జాన్వెస్లీ, ఉపాధ్యాయులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన
నడిగూడెం: మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎం.మాధవి, సీహెచ్.శిరీష, సీహెచ్.సాద్విక ఈ నెల 28న నల్గొండలో అండర్–19 విభాగంలో చదరంగం పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ క్రీడాకారులను అభినందించారు. వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు హైద్రాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్స్పాల్ ఎస్.గులాం ఎస్ధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ప్రిన్స్పాల్ డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవిత, పీఈటీలు సునిత, భవిత తదితరులు పాల్గొన్నారు. -
ప్యాషన్ మ్యాక్స్ల్ లుక్ ఇండియా పోటీలు
-
ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వక్తృత్వం, వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందగాన పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నృత్యాలు, మూకాభినయం పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలకు హాజరుకావాలన్నారు. కృష్ణా పుష్కరాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.