cyberabad police
-
సినీ నటి మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అవినాష్ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
పండక్కి ఊరెళుతున్నారా.. మీ ఇల్లు జరభద్రం
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు వచ్చేశాయి. క్రమంగా నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే చోరులకు సరైన సమయం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్లో అధికంగా ఇళ్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, నేపాలీ పని మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.పండగ సమయాల్లో అధికంగా చోరీలు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, స్థానికంగా ఇతర జిల్లాల్లో ఉండే చోరులు పండుగ సమయాలను అనువుగా భావిస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకొని, శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పండగ వేళ చోరీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో సైకిల్, నైట్ పెట్రోలింగ్లతో గల్లీగల్లీలో నిఘా పెట్టాలని, నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.సైబరాబాద్ పోలీసుల సూచనలివీ.. u బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. u సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. u మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి. u మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వంటివి జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. u ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది. u సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. -
గంజాయి సీజ్: సినిమాటిక్ రేంజ్ లో మత్తుపదార్థాలు రవాణా
-
ఖాతాదారుకు తెలియకుండా రూ.40 కోట్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఖాతాదారుకు తెలియకుండా రూ.40 కోట్ల నగదును మ్యూల్ అకౌంట్లలోకి మళ్లించాడు ఓ బ్యాంక్ మేనేజర్. దీంతో మేనేజర్ సహా ముగ్గురిపై సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఇండస్ఇండ్ బ్యాంక్లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా ఈ అకౌంట్ నుంచి శంషాబాద్లోని మధురానగర్ బ్రాంచ్కు రూ.15 కోట్లు, రూ.25 కోట్లుగా రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా పథకం ప్రకారమే.. రూ.40 కోట్ల నగదుతో ఈ ఏడాది జులై మొదటి వారంలో కొత్తగా తెరిచిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయింది. ఇక్కడి నుంచి దేశంలోని జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో బ్రాంచ్ మేనేజర్తో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ అనుమానాస్పద లావాదేవీలపై బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించగా అతని బ్యాంక్కు రావడం మానేశాడు. అప్పటి నుంచి అతను పరారీలోనే ఉన్నాడు. ఖాతాదారుకు తెలియకుండా డబ్బు ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు సాగుతోందని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు తెలిపారు.సత్వర స్పందనతో రికవరీ.. అనధికారిక నగదు బదిలీని గుర్తించిన బ్యాంకు ప్రతినిధులు సత్వరమే స్పందించి నేషనల్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆరీ్ప) ద్వారా సైబర్ మోసాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర సైబర్ పోలీసులు దేశంలోని 11 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయిన రూ.32.89 కోట్లను ఫ్రీజ్ చేశారు. లేకపోతే మహారాష్ట్రలో సైబర్ మోసాల్లో ఇది అతిపెద్ద కేసుగా నిలిచేది. నిందితులు మరో రూ.4.24 కోట్ల నగదును వివిధ ఏటీఎంల నుంచి విత్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2.87 కోట్ల నగదును గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాభర్తల చీటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్కు చెందిన చాట్ల సంజీవ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంజీవ్ కుమారుడికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్ను నమ్మించారు. అమెరికాలోని వైట్ హౌస్లో పనిచేసే సుమంత్ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు. అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లి సుమంత్ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్కు చెక్కేశారు. కొత్త సిమ్ కార్డును తీసుకొని యూఎస్లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్ చాట్లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్ పత్రాలను సృష్టించి, సంజీవ్కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు. -
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట, మైండ్స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్, ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. . చదవండి: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు -
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను వైఎస్సార్ ప్రారంభించారు
-
హైదరాబాద్ ORRపై కొత్త రూల్స్.. బీఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది సైబరాబాద్ పోలీస్ శాఖ. పైగా కొత్త రూల్స్ నేటి నుంచి(జులై 31వ తేదీ నుంచి) అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. లైన్ 1 అండ్ 2ల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లొచ్చు. ఆ మధ్య స్పీడ్ లిమిట్ని అనుమతిస్తారు. ఈ లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ఉండొచ్చు. అలాగే.. లైన్ 3 అండ్ 4 లో గరిష్టంగా గంటకు 80, కనిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ORRలో కనీస వేగం గంటకు 40 కి.మీ. ఇంతకన్నా తక్కువ వాహనాలను ఓఆర్ఆర్పైకి అనుమతించరు. 🛣️ ఇక.. లేన్ల మధ్య వాహనాల జిగ్-జాగ్ కదలిక అనుమతించబడదు. 🛣️ పై వేగం ప్రకారం లేన్లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే చేయాలి. 🛣️ అలాగే.. లేన్లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 🛣️ ఓఆర్ఆర్లోని నాలుగు లేన్లలో ఏ వాహనం కూడా ఆగకూడదు. 🛣️ ఏ ప్రయాణీకుల వాహనాలు ORRలో ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు. 🛣️ ORRపై టూవీలర్స్, అలాగే పాదచారులకు అనుమతి లేదు ORRలో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు లక్ష్యం పెట్టుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. కొత్త నియమాలు డ్రైవింగ్ క్రమశిక్షణను తీసుకువస్తాయని, అలాగే.. గందరగోళాన్ని తగ్గిస్తాయని, పైగా.. ORRలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆ నోటిఫికేషన్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలో వాళ్లకు నో ఎంట్రీ -
ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్కు 82.75 గ్రాముల కొకైన్ను సరఫరా చేస్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నిందితుడు కేపీ చౌదరి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో ఫొటోలు, పార్టీ వీడియోలను పోలీసులు గుర్తించారు. గోవాతో పాటు హైదరాబాద్లో కిస్మత్పూర్లోని విల్లాలో కూడా ప్రైవేట్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆయా ప్రముఖులు, సెలబ్రిటీల జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఎలా దొరికాడంటే..: గత నెల 5న మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాయదుర్గం పోలీసు లు నానక్రాంగూడ సమీపంలో 300 గ్రాముల కొకైన్ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితు డు రాకేష్ రోషన్ వాట్సాప్ ద్వారా కేపీ చౌదరి లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. బుధవారం కిస్మత్పూర్ క్రాస్ రోడ్లో కొకైన్ను సరఫరా చేస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. 900 మందికిపైగా కస్టమర్లు: రాకేష్, కేపీ చౌదరిల నుంచి స్వాధీనం చేసుకున్న 9 సెల్ఫోన్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వీటిల్లో 900 మందికి పైగా కస్టమర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులతో వాట్సాప్ చాటింగ్లు, పలు లావాదేవీలు సైతం జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరికి డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నకిలీ కాల్ సెంటర్తో ఖాతాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా, కెనడా దేశవాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. పేట్బషీరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, నేరాలు చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్చేశారు. ఈమేరకు మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్లతో కలిసి మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ బుధవారం మీడియాకు వెల్లడించారు. లండన్లో పెడితే దొరికిపోతామని... హనుమకొండలోని కిషన్పురకు చెందిన బైరిక్ ప్రమోద్ రెడ్డి లండన్లో ఏ1 ఎక్స్ప్రెస్ సూపర్ మార్కెట్ నిర్వహించేవాడు. వ్యాపారం పెద్దగా సాగకపోవటం, అప్పులు మీద పడటంతో అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. లండన్లో ఉంటున్న స్నేహితులు వరంగల్కు చెందిన కుంచాల అజయ్ కుమార్, రామకృష్ణా రెడ్డి, పశ్చిమ బెంగాల్కు చెందిన రబీష్ కుమార్ ప్రసాద్ అలియాస్ రాహుల్, సర్బేష్ కుమార్ గుప్తా అలియాస్ ఆమెన్లకు విదేశీయులను మోసం చేసే పథకం గురించి చెప్పాడు. అయితే లండన్లో నకిలీ కాల్ సెంటర్ పెట్టి మోసాలు చేస్తే సులువుగా పట్టుబడతామని గ్రహించిన ముఠా.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించింది. ‘ఎనీ డెస్క్’ద్వారా కూడా.. నెల రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీఎస్ఎస్ అపార్ట్మెంట్లో ఈ ముఠా సభ్యులు కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సాంకేతిక సేవలు అందిస్తామనే నెపంతో ఆస్ట్రేలియా, కెనడా దేశస్తులను టార్గెట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు చెందిన పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను పశ్చిమ బెంగాల్కు చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి కొనుగోలు చేశారు. టెలికాలర్లుగా పశ్చిమ బెంగాల్కు చెందిన ముకేష్ రజాక్ అలియాస్ మార్క్, కర్మా షీపాల్ అలియాస్ జాక్, ఎండీ ముస్తఫా అలియాస్ డానియల్, అన్మోల్ ప్రదాన్ అలియాస్ స్టీఫెన్, రాయ్ రిష్కాంత్ అలియాస్ ర్యాన్, ఐడీపీఎల్ బాలానగర్కు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ సామ్ మహ్మద్ హాజీ, బొల్లారంకు చెందిన గుంజి పవన్ కుమార్ అలియాస్ కెవిన్, నిర్మల్కు చెందిన సాయి వీర ప్రసాద్ అలియాస్ జేమ్స్, జీడిమెట్లకు చెందిన నయాకోటి బస్వరాజులను నియమించుకున్నాడు. వీరు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా విదేశీయులకు ఫోన్ చేసేవారు. మీరు వినియోగించే అమెజాన్ ప్రైమ్ యాప్ నకిలీదని, హ్యాక్ అయిందని, భద్రతా లోపాలున్నాయని చెప్పి నమ్మించేవారు. సాంకేతిక సేవలను అందించేందుకు కొంత రుసుము చెల్లించాలని చెప్పి మొబైల్కు లింక్లు పంపించి బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేవారు. గిఫ్ట్ కార్డుల రూపంలో ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాలకు సొమ్మును బదిలీ చేయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో బాధితుల సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి ఖాతా ఖాళీ చేసేవారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామకృష్ణా రెడ్డి, ఆకాశ్, వెస్లీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్లు, సీపీయూలు, హెడ్ సెట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు, సిమ్ కార్డులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
డేటా లీకుపై 'ఈడీ ఆరా'
సాక్షి, హైదరాబాద్: దేశంలోని సగం జనాభా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. 70 కోట్ల మంది ప్రజలు, సంస్థలకు చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చోరీ చేసిన ఫరీదాబాద్ (హరియాణా)కు చెందిన వినయ్ భరద్వాజ్పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే 17 కోట్ల మంది డేటా లీకు కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నితీశ్ భూషణ్ కుమార్, పూజా కుమారి, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహ్మాన్లపై పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని అతిపెద్ద డేటా లీకు కేసులో ప్రధాన సూత్రధారి వినయ్ భరద్వాజ్పై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు రక్షణ, టెలికం, విద్యుత్, ఇంధనం, జీఎస్టీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని నిందితులు తస్కరించి, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిందితుల కార్యకలాపాల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణతోపాటు ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం ఆంధ్రపదేశ్, తెలంగాణతోపాటు 24 రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు విక్రయానికి పెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. వినయ్ భరద్వాజ్ ఏడాది కాలంగా ఫరీదాబాద్ కేంద్రంగా డేటా నిల్వ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు 50 మందికి డేటాను విక్రయించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడి సెల్ఫోన్, ల్యాప్టాప్లతోపాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంగా నిందితులు డేటా చోరీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కకపోవటం గమనార్హం. ఈ–కామర్స్ కంపెనీలు, బ్యాంకులకు నోటీసులు ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా ఈ–కామర్స్ కంపెనీల చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్ గ్రూప్, యాక్సిస్ బ్యాంకు, మాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంకు అఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలకు సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేశారు. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, వెబ్సైట్లను సైబరాబాద్లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్పూర్కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్లతోపాటు క్లౌడ్ సర్వీస్లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్: డేటా చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్ అధికారి పర్యవేక్షణతో సిట్ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్ పోలీస్ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని, కేసులో లీడ్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్ ఇతర వివరాలు) సైతం లీక్ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్గా, సెక్యూర్గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. -
హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపి దందాకు పాల్పడుతున్న ఇరువురిని సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ప్రముఖులకు యువతులను నిందితులు సరఫరా చేస్తున్నారు. ముంబై,ఢిల్లీ, బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గోవా, బెంగుళూరులో సైతం ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది. చదవండి: రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా.. -
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
హైటెక్ సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్/హఫీజ్పేట్: హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్.. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ కవిత హోటల్ వర్కర్గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు.. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్కు మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్ట్యాంక్కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్ గ్రూప్ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు. ముఠా దొరికింది ఇలా... ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్టీ సన్సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ టీమ్తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్తో పాటు మాసాబ్ట్యాంక్కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్ అలియాస్ సిమ్రాన్ కౌర్, ఎస్ఆర్నగర్కు చెందిన యరసారి జోగేశ్వర్రావు, బాలానగర్కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్గూడకు చెందిన మహ్మద్ అఫ్సర్, కూకట్పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్నగర్కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్ రౌట్లు ఉన్నారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్ఫోన్లు, 3 కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాస్పోర్ట్లు, ఆధార్లు.. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. దందా సాగుతోందిలా.. ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్మోడల్స్.కామ్ నటాషారాయ్. ఇన్ వంటి కాల్గర్ల్స్ వెబ్సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు. వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తారు. డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు. విటులు నగదు లేదా ఆన్లైన్లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్సెంటర్ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు. -
HYD: మామూలు ప్లాన్కాదు.. 14వేల మందితో హైటెక్ వ్యభిచారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్ చేసి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. సైబరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ముంబై, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సెక్స్ రాకెట్ను నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపుల్లో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు. -
చాటింగ్ తెచ్చిన రగడ
శంకర్పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్కు, సైబరాబాద్ కమిషనర్కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్పల్లి మండలం, దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్స్టేషన్కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. (చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు) -
నిందితులను రిమాండ్కు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నమో దైన కేసులో నిందితుల రిమాండ్ కోరుతూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో 40 నిమిషాలపాటు వాదనలు జరిగాయి. గురువారం నిందితుల రిమాండ్ కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. నిరాకరించిన విషయం విదితమే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం కోసం వచ్చారంటూ అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో బుధవారం రాత్రి సోదాలు చేసిన పోలీసులు నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి న తర్వాతే విచారించాలని సూచించారు. పోలీసుల పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. సుమలత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరమని పేర్కొన్నారు. ఫామ్హౌస్లో ముందే కెమె రాలు ఉన్నాయా?.. మీరు ఏర్పాటు చేశారా?.. కొనుగోలు వ్యవహారం మీకు ముందే తెలుసా? అని ఏజీ న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు పలు చర్యలు చేపట్టి.. అనంతరం దాడి చేసి రెడ్హ్యాండెడ్గా నిందితులను అదుపులోకి తీసుకున్నారని ఏజీ వెల్లడించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమా దం ఉందన్నారు. కిందికోర్టు రిమాండ్కు తరలింపునకు ఉత్తర్వు లు జారీ చేయకపోవడం చెల్లదన్నారు. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టి నిందితులను రిమాండ్కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్రెడ్డి, రోహిత్రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారని, దీనికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని చెప్పారు. సీఆర్పీసీలోని 41(1)(బీ) ప్రకారం దర్యాప్తు అధి కారి సక్రమంగానే చేశారన్నారు. అన్ని కేసుల్లోనూ నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ కేసుల భయం ఉండదని ఎమ్మెల్యేలకు భరోసా కూడా ఇచ్చారని చెప్పారు. ఈ ముగ్గురి వెనుక కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉన్నందని.. నిందితులను రిమాండ్కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి డబ్బు దొరకలేదు.. నిందితుల తరఫున సీనియర్ న్యాయ వాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారన్నారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్కు పంపడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లరని హామీ ఇచ్చారు. సమగ్ర వాదనలకు గడువు కావాలని ఆయన కోరడంతో విచారణ నేటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు... నిందితులు 24 గంటలపాటు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని న్యాయమూర్తి షరతు విధించారు. శుక్రవారం సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సమర్పించాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న రోహిత్రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
Hyderabad: కేటుగాళ్ల వలలో హైదరాబాదీ.. రూ.62 లక్షలు గోవిందా!
గచ్చిబౌలి: మార్కెట్ బాక్స్... అదో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఆ యాప్లో రిజిస్టర్ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ముగల్సరాయ్కి చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ (32) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్ 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్ జైన్తోపాటు కృష్ణ కుమార్ (38), పవన్ కుమార్ ప్రజాపట్ (35), ఆకాశ్రాయ్ (39)లను అరెస్ట్చేశారు. ఉన్నది లేనట్లుగా చూపించి... మార్కెట్ బాక్స్లో మూడువేల మంది రిజిస్టర్ అయ్యారని సీపీ స్టీఫెన్ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్
-
ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ సేవలను సైబరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, సీఏఆర్ హెడ్క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ రియాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ అడ్మిన్ బీఎన్ఎస్ రెడ్డి, ఐటీ ఇన్స్పెక్టర్ రమేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్ బైక్స్ ప్రత్యేకతలివే: ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్ఫోర్స్ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పని చేస్తుంది. ట్రాఫిక్ టాస్క్ఫోర్స్కు అందించిన బైక్లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, కళ్లద్దాలు, ఎల్ఈబా బాటన్ తదితర వస్తువులు ఉంటాయి. టాస్క్ఫోర్స్ ప్యాట్రోలింగ్ ఇక్కడే.. ►మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ– లెమన్ ట్రీ– మైండ్ స్పేస్ ►కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 – ఐటీసీ కోహినూర్ టాస్క్ఫోర్స్ విధులు ఏంటంటే.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి బైక్లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏఎస్) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్ అవర్స్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్ఫోర్స్ బృందాలు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్ చేయడం, నో పార్కింగ్ ప్లేస్లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి. లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్ స్నాచింగ్లు జరిగినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు. -
దొంగకార్ల ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
-
దొరికితే గొలుసులు.. లేదంటే దాడులు!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందితే గొలుసులు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చేతిలోని మారణాయుధాలతో దాడులు... ఇదే గుల్బర్గాకు చెందిన చెయిన్ స్నాచర్ల లక్ష్యం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్లకు పాల్పడి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు స్నాచర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తపంచా, రివాల్వర్, 15 బుల్లెట్లు, రెండు కత్తులు, రెండు సెల్ఫోన్లు, బైక్, 47 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10న గుల్బర్గాకు చెందిన ఇషాన్ నిరంజన్, రాహుల్ కర్నాటకలోని హుడ్నూర్ రింగ్ రోడ్లోని ఓ జువెల్లరీ షాపులో చోరీ యతి్నంచారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు గురుమూర్తి, సంజయ్ కుమార్లపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. కర్నాటక పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో బైక్పై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ వీరికి మరో నిందితుడు ఆశ్రయం కలి్పంచాడు. ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో చెయిన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇషాన్, రాహులపై కర్నాటకలో బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ఈ నెల 25న ముగ్గురు బైక్పై వచ్చి గచ్చిబౌలి, కూకట్పల్లి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో పరిధిలో ముగ్గురు మహిళల మెడలో నుంచి చెయిన్లను దొంగిలించారు. మర్నాడు ఉదయం బైక్పై నిరంజన్, రాహుల్ మియాపూర్ పీఎస్ పరిధిలో మరో మహిళ చెయిన్ లాక్కెళ్లారు. అక్కడి నుంచి పటాన్చెరు మీదుగా పారిపోవటానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే 25న స్నాచింగ్ చేసిన నిందితులే మియాపూర్లోనూ పంజా విసిరినట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), మాదాపూర్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితులు రాత్రి అక్కడే గడిపారు. 26న ఉదయం 10 గంటలకు సీసీఎస్ కానిస్టేబుల్ కృష్ణా బైక్పై వెళుతుండగా నిందితులు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద కనిపించారు. వెంటనే ప్రత్యేక బృందాలకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాపూర్లో స్నాచింగ్కు యతి్నంచి విఫలం కావటంతో.. పరారైన నిందితులు పది నిమిషాల్లోనే ఆర్సీపురం పీఎస్ పరిధిలోని బీహెచ్ఈఎల్లో స్నాచింగ్ చేశారు. దీంతో నిందితులు బీహెచ్ఈఎల్లోకి ఎంట్రీ అయ్యారని నిర్దారించుకున్న పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దిగ్బంధం చేశారు. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబేష్ రవి బైక్లపై గాలిస్తుండగా.. తెలుపై రంగు పల్సర్ బైక్పై యాష్ కలర్ జాకెట్, తెలుపు రంగు షర్ట్, నలుపు, ఎరుపు రంగు టోపీలు ధరించిన నిరంజన్, రాహుల్ హెచ్ఐజీ గేట్ వైపునకు వెళుతున్నట్లు గుర్తించారు. దిబేష్ బైక్ దిగి నిందితుడు రాహుల్ను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన నిరంజన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్యపై దాడి చేశాడు. రక్తం కారుతున్నా.. యాదయ్య నిరంజన్ను వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ రవి.. నిరంజన్ను పట్టుకున్నాడు. వారు యాదయ్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శౌర్య పతకాలకు ప్రతిపాదన.. ప్రాణాలకు తెగించి చెయిన్ స్నాచర్లను పట్టుకున్న హెచ్సీ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిల ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించి పోలీసులపై ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలి్పంచారని కొనియాడారు. హెచ్సీ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిలకు శౌర్య పతకం కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రతిపాదిస్తామని సీపీ తెలిపారు. (చదవండి: ఇక్కడి నుంచే దేశం దాటింది ) -
ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
-
దడ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్లోని ధార్ ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టయిల్. దూలపల్లి హైటెన్షన్ లైన్లోని మహాలక్ష్మి ఎన్క్లేవ్ అగ్రి నివాస్లో అశోక్ రామ ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్లోని ప్రధాన నిందితుడు మాన్సింగ్తో పాటు మొహబత్, రీమ్ సింగ్, కిషన్సింగ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల గుర్తింపు.. అగ్రి నివాస్ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్ బషీరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), లా అండ్ ఆర్డర్ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి) -
సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను
సాక్షిహైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల పనితీరుపై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పోస్టింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ)లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే, అక్రమాలకు పాల్పడే పోలీసులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టంచేస్తున్నారు. అంతర్గత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేసారి 126 మంది ఎస్ఐలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. రెండేళ్లు పైబడితే బదిలీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో మొత్తం 36 శాంతి భద్రతల ఠాణాలున్నాయి. ఒకే పీఎస్లో రెండేళ్లకు మించి పోస్టింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోలీసు అధికారుల పనితీరు, సమర్థతను బట్టి పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తాజాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్ల నుంచి ఒక్కొక్కరు, బాలానగర్ జోన్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పేట్బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్ను బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న ప్రశాంత్ను, జీడిమెట్ల ఇన్స్పెక్టర్గా ఉన్న బాలరాజు స్థానంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్లను బదిలీ చేశారు. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ బాలకృష్ణను బదిలీ చేసి, ఆయన స్థానంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్యను సీసీఎస్కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏసీబీ నాగేంద్రబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బీ నివేదికల ఆధారంగా.. పోలీసుల పనితీరుపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో వారి పనితీరు, అక్రమాలపై కూపీలాగుతూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఎస్బీ అధికారులకు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రుజువైన పోలీసులపై చర్యలతో పాటు భవిష్యత్తులో వారికి పదోన్నతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో నార్సింగి ఇన్స్పెక్టర్గా పనిచేసిన గంగాధర్ స్థానికంగా భూ లావాదేవీలలో తలదూర్చి అక్రమార్కులకు వంత పాడిన ఆరోపణల నేపథ్యంలో గంగాధర్తో పాటు ఎస్ఐ లక్ష్మణ్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రాములు (ప్రస్తుతం రాజేందర్ పీఎస్) బలరాం నాయక్ (నార్సింగి పోలీస్ స్టేషన్), అన్వేష్ రెడ్డి (ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లు సహకరించారని, అంతర్గత విచారణలో నిజమని తేలడంతో రెండేళ్ల తర్వాత వారిపై వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతారు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ షీ టీమ్స్ సరికొత్త కార్యాచరణను రూపొందించింది. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బాలమిత్ర కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను బాలమిత్రులుగా ఎంపిక చేసి, కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే బాలమిత్రుల విధి అని సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు. ► 2019 ఫిబ్రవరి 15న అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో రెండేళ్ల పాటు బాలమిత్ర కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం భౌతిక పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తిరిగి బాలమిత్ర ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 1,650 మంది టీచర్లు బాలమిత్రలుగా నమోదయ్యారు. వీరిలో కొంతమంది టీచర్లు బదిలీ కాగా.. మరికొందరు రిటైర్డ్ అయ్యారు. దీంతో తాజాగా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలమిత్రలు ఏం చేస్తారంటే? పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తారు. చట్టంలోని శిక్షలు, కేసులు నమోదైతే ఉజ్వల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో వివరిస్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వివరించి, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో శిక్షణ ఇస్తారు. తల్లిదండ్రులు, టీచర్లతో స్వేచ్ఛగా అన్ని అంశాలు బెరుకు లేకుండా చర్చించే విధంగా సంసిద్ధులను చేస్తారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ను ఎంత వరకు వినియోగించాలి? అతి వినియోగంతో కలిగే అనర్థాలను వివరిస్తారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ.. పాఠశాల స్థాయిలో బాలమిత్ర కార్యక్రమం 8, 9, 10 తరగతుల కోసం రూపొందించారు. ఈ ఏడాది నుంచి సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎంపిక చేసిన పలు ప్రైవేట్ స్కూల్స్లోనూ బాలమిత్రలను ఏర్పాటు చేస్తారు. (క్లిక్: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్ కావాలి!) -
ఐటీ ఆఫీసుల్లో ‘డ్రగ్స్’ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులుగా మారుతున్న నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డ్రగ్స్ కట్టడికి ప్రణాళిక రచించారు. క్షేత్రస్థాయిలో డ్రగ్స్కు డిమాండ్ను తగ్గిస్తే పై స్థాయిలో సరఫరా తగ్గుతుందని భావిస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. విద్యా, ఉద్యోగ సంస్థల్లో మాదకద్రవ్యాలు నియంత్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యా సంస్థలలో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసిన సీపీ.. ఐటీ ఆఫీసుల్లోనూ ఈ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా.. కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు వర్క్ఫ్రమ్ హోం చేసిన ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పని ఒత్తిడి, వీకెండ్ పార్టీలతో ఉద్యోగులెవరూ మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా నియంత్రించే ఉద్దేశంతో ‘డ్రగ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్’ (డ్రగ్స్కు తావులేని పని ప్రదేశం) నినాదంతో డ్రగ్స్ నిరోధక కమిటీలను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్లో చిన్న పెద్ద ఐటీ కంపెనీలు సుమారు వెయ్యి వరకు ఉంటాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది పురుష, 2.50 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పని ప్రదేశాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఐటీ బ్రాండ్కు మచ్చపడకుండా ఉంటుందని, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తు మత్తుకు చిత్తుకాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కమిటీలో సభ్యులు ఎవరెవరు? డ్రగ్స్ నిరోధక కమిటీలో స్థానిక పోలీసులతో పాటు కంపెనీ మేనేజ్మెంట్, మానవ వనరుల విభాగం (హెచ్ఆర్), సెక్యూరిటీ, ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే కమిటీల విధివిధానాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరు నుంచి ఆయా కమిటీలు కార్యరూపంలోకి రానున్నాయి. కమిటీలు ఏం చేస్తాయి? డ్రగ్స్ నిరోధక కమిటీలు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిసారిస్తాయి. 1. ఎవరైనా డ్రగ్స్ను ఆఫర్ చేస్తే ప్రలోభాలకు గురికాకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో సూచనలు ఇస్తారు. ఆఫర్ చేసిన స్నేహితుడు, సహోద్యోగిని నొప్పించకుండా సున్నితంగా ఎలా తిరస్కరించాలో నేర్పిస్తారు. 2. డ్రగ్స్కు అలవాటు పడినవారిని కమిటీలు గుర్తించినా లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నవారు స్వచ్ఛందంగా కమిటీ ముందుకొచ్చినా.. వారు అలవాటును ఎలా మానుకోవాలో శిక్షణ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎన్జీవో, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3. కంపెనీలు, విద్యా సంస్థలలో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై కమిటీలు నిఘా పెడతాయి. విక్రయ, కొనుగోలుదారుల వివరాలను రహస్యంగా సేకరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ తరఫున కూడా చర్యలు ఉంటాయి. 150కి పైగా విద్యా సంస్థల్లో ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారిగా మాదాపూర్ జోన్లో 150కి పైగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే శంషాబాద్, బాలానగర్ జోన్లలోని విద్యా సంస్థలలో కూడా ఏర్పాటు చేయనున్నారు. జూలై నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం అయ్యాక ఆయా కమిటీలు కార్యరూపంలోకి వస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే హెచ్సీయూ, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి ప్రధాన విద్యా సంస్థల్లో సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ డివిజన్లోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 94920 99100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఇదీ రూట్.. ఒరిస్సా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్.. కానీ మధ్యలో..
సాక్షి, సిటీబ్యూరో: ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, అమరావతికి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు, రిసీవర్ పరారీలో ఉండగా.. గంజాయి లోడ్ వాహన డ్రైవర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. వీరి నుంచి 560 కిలోల గంజాయి. కారు, డీసీఎం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అమరావతికి చెందిన నౌషాద్ ముంబై, అమరావతి ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఉస్మాన్నగర్కు చెందిన సలీమ్ ఉల్లా అలియాస్ రాజు, షేక్ రెహాన్, షేక్ వసీం సహకరించేవారు. ఒరిస్సా చిత్రకొండకు చెందిన సంతోష్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నౌషాద్.. సంతోష్ను సంప్రదించి, 1,000 కిలోల ఎండు గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్స్గా రూ.2 లక్షలు చెల్లించాడు. దీంతో సంతోష్ 560 కిలోల గంజాయిని సిద్ధం చేసి నౌషాద్కు సమాచారం అందించాడు. (చదవండి: హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్.. ) నౌషాద్ భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బంగాళదుంపలను రవాణా చేయాలని కోరుతూ.. హైదరాబాద్కు చెందిన ఇక్బాల్ను సంప్రదించాడు. ఈనెల 15న సలీం, రెహాన్, వసీం కారులో ఖమ్మం వెళ్లారు. అక్కడ ఇక్బాల్ ఏర్పాటు చేసిన డీసీఎం తీసుకున్నారు. సలీం డీసీఎం నడుపుతూ భద్రాచలం వెళ్లి అక్కడ 3 టన్నుల బంగాళా దుంపలు లోడ్ ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి ఈనెల 18న చిత్రకొండ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డీసీఎంను పార్క్ చేసి సంతోష్కు సమాచారం అందించాడు. సంతోష్ డీసీఎంలో 560 కిలోల గంజాయి లోడ్ చేసి మిగిలిన ముగ్గురికి సమాచారం అందించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. సలీం డీసీఎంను డ్రైవ్ చేస్తుండగా రెహాన్, వసీం కారులో ఎస్కార్ట్గా అమరావతి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దులో తనికీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నిందితులు టోల్ రోడ్లు రాకుండా డీసీఎంను దారి మళ్లించారు. హిమాయత్సాగర్ మీదుగా వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీసులు పీడీపీ క్రాస్రోడ్ వద్ద డీసీఎం, ఎస్కార్ట్గా వెళుతున్న కారును అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విషయం బయటపడింది. కిలో 1,250 చొప్పున కొనుగోలు చేసి.. వినియోగదారులకు రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. -
ఫోర్ట్వంటీ.. నకిలీ ‘గ్యారంటీ’..
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో జాతీయ బ్యాంక్ను మోసం ఘటన చేసిన నగరంలో వెలుగుచూసింది. నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)కు రూ.53 కోట్లు టోకరా వేసిన ఇద్దరు ఘరానా నిందితులను సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్నగర్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కట్టమీది సంతోష్ రెడ్డి (36) కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట 2010 ఏప్రిల్లో కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో కేపీహెచ్బీకి చెందిన నెక్కంటి శ్రీనివాస్ (51), మాదాపూర్ సాయినగర్కు చెందిన కొండకల్ గోపాల్ (42), నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన సోమవరపు సురేందర్ రెడ్డి (52) డైరెక్టర్లుగా చేరారు. వివిధ కంపెనీ సప్లయర్ల నుంచి మెటీరియల్ సేకరణ కోసం యూబీఐ నుంచి బ్యాంక్ గ్యారంటీ పొందాడు. దీని ఆధారంగా హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ లిమిటెడ్, హెచ్పీసీఎల్, ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్, సృజన ఇండస్ట్రీస్, ఎన్ఎస్ఐసీ లిమిటెడ్, ఓఎఫ్బీ టెక్, పవర్2ఎస్ఎంఈ, జెట్వెర్క్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు సంతోష్ రెడ్డికి మెటీరియల్ సరఫరా చేశాయి. నకిలీ గ్యారంటీ సమర్పణ సాధారణంగా బ్యాంక్ గ్యారంటీ పొందాలంటే కంపెనీలోని ఒక డైరెక్టర్ ఆస్తులను సెక్యూరిటీగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితి దాటితే అప్పటికే ఉన్న గ్యారంటీని క్లోజ్ చేయాలి లేదా దాని స్థానంలో గ్యారంటీని పునరుద్ధరించాలి. అయితే ఈ కేసులో సంతోష్ రెడ్డి గరిష్ట గ్యారంటీ పరిమితి రూ.15 కోట్లు ఉండగా.. ఆ పరిమితిని మించి వివిధ కంపెనీల నుంచి మెటీరియల్ పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించాడు. వీటిని సంబంధిత కంపెనీలకు సమర్పించాడు. అలాగే కొత్త బ్యాంక్ గ్యారంటీని పొందేందుకు అప్పటికే గ్యారంటీ సమర్పించిన కంపెనీల లెటర్లను ఫోర్జరీ చేసి బ్యాంక్లకు సమర్పించాడు. ఇలా కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యూబీఐ కొండాపూర్ బ్రాంచ్లో 39 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి 53,18,50,093 రూపాయలు మోసం చేసింది. నకిలీని గుర్తించి.. నకిలీ గ్యారంటీ పత్రాలను గుర్తించిన యూబీఐ బ్యాంక్ ఏజీఎం సరిగాల ప్రకాశ్ బాబు గత జూలై 8న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంపాస్ ఇన్ఫ్రా, నలుగురు డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు సంతోష్ రెడ్డి విదేశాలకు పరారయ్యాడు. ఈఓడబ్ల్యూ బృందం నిందితుడి కదలికలపై నిఘా ఉంచింది. సాంకేతిక ఆధారాలను సేకరించి, విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో సంతోష్ రెడ్డి, శ్రీనివాస్లను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరు నిందితులు గోపాల్, సురేందర్ రెడ్డి పరారీలో ఉన్నారు. -
గోవా నుంచి మత్తు పదార్థాలు రవాణా చేసిన ముఠా అరెస్టు
-
న్యూఇయర్ టార్గెట్: గ్రాము ‘కొకైన్’ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా తయారైంది కొకైన్ . గోవా నుంచి గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున దిగుమతి చేసుకొని... హైదరాబాద్లో రూ.14 వేలకు విక్రయిస్తున్న ఓ పెడ్లర్తో సహా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ డీసీపీ జి.సందీప్తో కలిసి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం.. ♦ బాచుపల్లికి చెందిన రామేశ్వర శ్రవణ్ కుమార్ (24), కొండాపూర్కు చెందిన గోరంట్ల చరణ్ తేజ (27) స్నేహితులు. న్యూ ఇయర్ వేడుకలను కొకైన్ మత్తులో తేలిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ టోలిచౌకికి చెందిన అరబిక్ టీచర్ మహ్మద్ అష్రఫ్ బేగ్ (37)ను సంప్రదించారు. చెరో గ్రాము కొకైన్ కొనుగోలు చేశారు. ♦ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ పి.శివ ప్రసాద్ తన బృందంతో రాయదుర్గం పీఎస్ పరిధిలోని గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ ఫ్లాట్ నం. బి–1305లో ఇద్దరు వినియోగదారులు శ్రవణ్, చరణ్ తేజలను అదుపులోకి తీసుకున్నారు. ♦ఇద్దరి నుంచి కొకైన్ను స్వాధీనం చేసుకుని వారిని విచారించగా టోలిచౌకిలోని మహ్మద్ అష్రఫ్ బేగ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో అష్రఫ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. వ్యక్తిగత ఫోటోలు పంపు, నీ కష్టాలు తీరుస్తానంటూ.... ♦అఫ్రష్ నుంచి 181 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను నుంచి 183 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలు, మూడు సెల్ఫోన్లు పట్టబడ్డాయి. వీటి విలువ రూ.26.28 లక్షలు. ♦అష్రఫ్ను పోలీసులు విచారించగా.. ప్రధాన డ్రగ్ సరఫరాదారు నైజీరియాకు చెందిన జూడ్ అలియాస్ క్రిస్ దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నైజీరియా దేశం నుంచి గోవాకు వచ్చి అక్కణ్నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిసింది. ♦కొంత కాలంగా గోవా నుంచి డ్రగ్స్ను దిగుమతి చేసుకొని హైదరాబాద్లో వ్యక్తిగత కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అష్రఫ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయిర్ గోవాలో ఉంటున్న జూడ్ పరారీలో ఉన్నాడు. చదవండి: బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో.. ఈ ఏడాది 202 కేసులు.. ♦ కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరా ఉంటుందని సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బల్క్ సప్లయర్స్, స్థానిక రిటైలర్లు, సరఫరాదారులు, వినియోగదారులపై దాడులు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. ♦ ఈ ఏడాది ఇప్పటివరకు 202 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. 419 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 23 మందిపై పీడీ యాక్ట్లు రిజిస్టరయ్యాయి. 1,770.8 కిలోల గంజాయి, 37.2 కిలోల 124 గంజాయి మొక్కలు, 14 గాంజా మాత్రలు, 8.55 లీటర్ల హషీప్ ఆయిల్, 150 ఎంజీ 12 లైరికా మాత్రలు, 141 కిలోల ఆల్ప్రాజోలం, 116.29 గ్రాముల ఎండీఎంఏ, 200 గ్రాముల ఓపీఎం, 61 ఎక్స్టసీ మాత్రలు, 3 ఎల్సీడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం.. ఉమ్మడి రాష్ట్రంలో 63 గ్రాముల కొకైన్ హైదరాబాద్ పరిధిలో అప్పట్లో పట్టుబడింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక కొకైన్ కేసుగా నిలవగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలో 183 గ్రాముల కొకైన్ కేసు బయటపడటంతో ఇదే అత్యధికమని సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ సందీప్ తెలిపారు. -
‘పుష్ప’రాజ్ని అలా వాడేసిన పోలీసులు.. నెట్టింట ట్వీట్ వైరల్
సోషల్ మీడియాను వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసలు ఎప్పుడూ ముందుంటారు. ట్రెండింగ్లో ఉన్న అంశాలను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మంచి సందేశాలను అందిస్తుంటారు. మరీ ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు, డైలాగ్స్ని తమకు అనుగుణంగా మార్చుకొని ట్రాఫిక్ నియమాలపై జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమాను కూడా వాడేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్లో తెరకెక్కిన పుష్ప మూవీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: పుష్ప’మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని బన్నీ పోస్టర్తో సైబరాబాద్ పోలీసులు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. బుల్లెట్ బండిపై స్టైలిష్గా కూర్చున్న బన్నీ ఫోటోను సైబరాబాద్ పోలీసులు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను ఫిక్స్ చేయండి. సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. (చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ) గతంలో సింహా సినిమాలోని ఓ డైలాగ్ వాడుకుని.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదలైనపుడు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. హెల్మెట్స్ ఎక్కడా అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టులు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021 -
గోల్మాల్ ‘గ్యాంగ్’ ..సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్లోకి
గచ్చిబౌలి: సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా గుర్తుందా? అక్రమార్కులను కొల్లగొట్టడానికి కథానాయకుడి నేతృత్వంలోని ముఠా సీబీఐ అధికారుల మాదిరిగా రెచ్చిపోతుంది. అచ్చు అలాంటి ఉదంతమే మధ్యాహ్నం గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ జయభేరి ఆరెంజ్ కౌంటీలో జరిగింది. లాకర్లో ఉన్న 1.34 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆ మాటే నేరగాళ్లకు కలిసొచ్చింది.. రియల్ ఎస్టేట్ సంస్థ భువన తేజ డెవలపర్స్ చైర్మన్ వెంకట సుబ్రహ్మణ్యం ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్లోని ఫ్లాట్ నంబర్ 110లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సీసీ కెమెరాలు, వాచ్మన్లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిఘా నీడలో ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రధాన గేటు వద్ద ఉండే వాచ్మన్ యజమానిని సంప్రదించిన తర్వాతే పంపిస్తుంటారు. సుబ్రహ్మణ్యం నగర శివార్లలో కొన్ని వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కొనుగోలుదారులు, బ్యాంకర్లు తదితరులు వచ్చిపోతుంటారు. ఇలా ఎవరు వచ్చినా వాచ్మన్ సంప్రదిస్తుండటంతో.. తన కోసం ఎవరైనా వస్తే నేరుగా పంపించాల్సిందిగా గతంలో చెప్పారు. దీంతో సుబ్రహ్మణ్యం కోసమంటూ ఎవరు వచ్చినా వారిని ఫ్లాట్ నం.110కు పంపడం పరిపాటిగా మారింది. పక్కా పథకం ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటిని కొల్లగొట్టాలని పథకం వేసుకున్న నేరగాళ్లకు ఇదే అంశం కలిసి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కారులో వచ్చిన నలుగురు వాచ్మన్తో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో అతడు వారిని లోపలకు పోనిచ్చాడు. 1.10 గంటలకు ఫ్లాట్ నం.110కు వెళ్లిన నేరగాళ్లు తలుపు కొట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ స్వామి నాయుడు వెళ్లి తలుపు తీశారు. తాము సీబీఐ ఏజెంట్లమని సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మికి చెప్పిన నలుగురూ నకిలీ గుర్తింపుకార్డులు చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మితో పాటు డ్రైవర్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ముగ్గురు సంతానం, డ్రైవర్ను హాలులోనే కదలకుండా కూర్చోబెట్టారు. ఆదాయపు పన్ను బకాయిలంటూ... సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భాగ్యలక్ష్మితో ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖకు రూ.18 కోట్లు బాకీ పడ్డారని, ఈ నేపథ్యంలోనే సోదాల కోసం వచ్చామంటూ చెప్పారు. ఇద్దరు దుండగులు హాలులోనే కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరూ నేరుగా పడక గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. వాటితో లాకర్ తెరిచి అందులో ఉన్న 1.34 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. ఈ వ్యవహారం మొత్తం 25 నిమిషాల్లో పూర్తయింది. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా... సీబీఐ ఏజెంట్లు అయితే బంగారు నగలు తీసుకొని ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో జరిగిన వ్యవహారం గుర్తించి సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరంలో చిక్కిన నిందితులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంట్రీ వద్ద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి వెళ్లడంతో పాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడటంతో పరిచయస్తుల పనిగా అనుమానించారు. బాధితుల వివరాలు తెలిసిన వాళ్లే వెనుక ఉండి దుండగులతో కథనడిపి ఉంటారని అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ఆధారంగా దుండగులు కారులో వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని తేల్చారు. దాని డ్రైవర్ రోడ్డు పైనే ఆగిపోగా నలుగురు మాత్రం కౌంటీలోని ప్రవేశించినట్లు నిర్ధారణైంది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారని తెలిసింది. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) -
ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం
సాక్షి, హైదరాబాద్: ‘ఓ వ్యక్తికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ +18601801290 నుంచి ఫోన్ వచ్చింది. మీ పాత క్రెడిట్ కార్డ్ గడువు ముగియనుంది. కొత్త కార్డ్ జారీ కోసం కాల్ చేస్తున్నామని చెప్పాడు. పాత కార్డ్ మీద ఉన్న 16 అంకెల నంబర్, సీవీవీ, కార్డు గడువు వివరాలను కోరాడు. కొత్త కార్డ్ యాక్టివేషన్ కోసం వచ్చిన ఓటీపీ చెప్పాలని సూచించాడు. అది చెప్పేసిన క్షణాల్లోనే సదరు ఉద్యోగి కార్డ్ నుంచి రూ.1,64,612 డెబిట్ అయ్యాయి. బాధితుడు తేరుకునేలోపే సైబర్ నేరస్తులు కార్డ్లోని మొత్తాన్ని కొట్టేశారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు’ కూపీ లాగితే.. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్... బాధితుడి ఫోన్కు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్తో ఎలా మోసం చేశారని కూపీ లాగారు. కస్టమర్ కేర్ నంబర్ను కాల్ స్పూఫింగ్ చేసి సైబర్ నేరస్తులు వల వేశారని పసిగట్టారు. కాల్ స్పూఫింగ్ అప్లికేషన్లను వినియోగిస్తూ 14 మందితో ఢిల్లీ ఉత్తమ్నగర్ కేంద్రంగా సాగిస్తున్న నకిలీ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి ఢిల్లీవాసి నిఖిల్ మదన్కు కాల్ స్పూఫింగ్ అప్లికేషన్లను విక్రయించిన మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరస్తుడు యూపీ మొరాదాబాద్కు చెందిన ఫర్మాన్ హుస్సేన్ కూడా ఉన్నాడు. కేసు వివరాలను గురువారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ►ఫర్మాన్ హుస్సేన్కు టెక్నాలజీపై మంచి పట్టుండటంతో సొంతంగా ప్రోస్పోక్హెచ్డీ.కామ్, రౌండ్2హెల్.ఓఆర్జీ అనే రెండు కాల్ స్పూఫింగ్ వెబ్సైట్లను అభివృద్ధి చేశాడు. ఫర్మాన్ నుంచి మోసిఫ్, సిల్వర్ డైలర్, రౌండ్2హెల్, ఐటెల్ మొబైల్ డైలర్ అనే నాలుగు కాల్ స్పూఫింగ్ అప్లికేషన్ల తాలుకు పెయిడ్ సరీ్వస్లను బిహార్ సరన్కు చెందిన ముర్షీద్ ఆలం కొనుగోలు చేసి.. వాటిని ఉత్తమ్నగర్కు చెందిన నిఖిల్ మదన్కు విక్రయించాడు. ఇతను 14 మందితో కలిసి ఉత్తమ్నగర్లో ఎస్బీఐ నకిలీ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం, మంచి పరిచయాలు ఉన్న నిఖిల్.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలను డైరెక్ట్ సేల్ ఏజెంట్స్ (డీఎస్ఏ) నుంచి సేకరించారు. ►ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్లు 18601801290, 01139020202 స్పూఫింగ్ చేసి కస్టమర్కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు, బీమా సౌకర్యం కలి్పస్తామని, రివార్డ్ పాయింట్స్ పెంపు, కొత్త కార్డ్ జారీ చేస్తామని మాయమాటలు చెప్పి.. కస్టమర్ల నుంచి కార్డ్ వివరాలను సేకరిస్తారు. వీటిని ఉపయోగించి ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తారు. ►ప్రధాన నిందితుడు నిఖిల్ మదన్, ఫర్మాన్ హుస్సేన్, దీపాన్షు మదన్, పింకీ కుమారి, రోహిత్ మాథూర్, హితేష్ చోప్రా, వికాస్, సంజయ్ కుమార్, ప్రభాత్ కుమార్ సింగ్, సంక్షం రాజ్, అనూజ్ కుమార్, సమీర్ మిశ్రా, ముర్షిద్ ఆలం, గౌరవ్లను అరెస్ట్ చేశారు. ►ఏడాది కాలంగా ఈ నకిలీ కాల్ సెంటర్ దేశంలోని 33 వేల మందికి ఫోన్ చేయగా.. 14 వేల కాల్స్ గుర్తించారు. ఈ ముఠాపై 5 వేల వరకు కేసులు ఉన్నాయి. ఫర్మాన్ హుస్సేన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తొలిసారిగా సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. 23 మందికి కాల్ స్పూఫింగ్ యాప్స్ విక్రయించాడు. రూ.3 కోట్లు కొట్టేసిన నకిలీ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్ కేసులోనూ ప్రధాన నిందితుడు దీపక్ చౌదరి, విశాల్ కుమార్లకు మోసిప్, సిల్వర్ డైలర్ కాల్ స్పూఫింగ్ యాప్స్ విక్రయించాడు. -
మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్లో ఎస్హెచ్ఓల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడేళ్లకు పైగా ఒకటే పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ)లు బదిలీ కానున్నారు. మాదాపూర్, బాలానగర్ జోన్లలో దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవటమే సస్పెన్షన్కు కారణాలని తెలిసింది. రెండు మూడు వారాల్లో ఆయా బదిలీలు జరుగుతాయని సమాచారం. శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈ బదిలీలు చేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిర్ణయించినట్లు తెలిసింది. సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పలు భూ వివాదాల్లో తలదూర్చినందుకు నార్సింగి పీఎస్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, ఎస్ఐ కే లక్ష్మణ్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 66 మంది ఎస్ఐలకు పోస్టింగ్లు.. సైబరాబాద్లో మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ మూడు జోన్లలో కలిపి 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లున్నాయి. ఇన్చార్జి ఇన్స్పెక్టర్లతో నెట్టుకొస్తున్న పలు పోలీస్ స్టేషన్లకు శాశ్వత అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలే 66 మంది సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ) సైబరాబాద్ కమిషనరేట్కు రిపోర్ట్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా జోన్లకు అటాచ్లో ఉన్నారు. త్వరలోనే వీళ్లందరికీ కొత్త పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. చేవెళ్ల వంటి సున్నితమైన ప్రాంతాలలోని పీఎస్లలో ఎస్ఐల విద్యార్హతలు, నిబద్ధత, క్రమశిక్షణలను బట్టి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. పీఎస్లను సందర్శిస్తూ.. సీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే శాంతి భద్రతలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ, పోలీసుల పనితీరును సీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్టేషన్, రికార్డ్ల నిర్వహణలను లోతుగా పరిశీలించారు. రిసెప్షన్, జేడీ ఎంట్రీ ప్రతి రికార్డ్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పీఎస్లలో సందర్శించారు. చదవండి: హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె -
సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు?
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది కే. పరమేశ్వర్ విచారించారు. త్రిసభ్య కమిటీ సజ్జనార్ను అడిగిన ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నందిగామ, ఆమన్గల్ పోలీస్స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ 2019, డిసెంబర్ 3న సీజ్ చేశారని రిమార్క్స్ కాలమ్లో నమోదు చేశారు. కానీ, డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో ఇదే పిస్టల్ను వినియోగించారని తేలింది. ఇదెలా సాధ్యమైంది.? సజ్జనార్: తనిఖీ చేశాక సమాధానం ఇస్తా. కమిషన్: నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 2019, నవంబర్ 29 రాత్రి 10 గం.కు అయితే.. మీరెలా 3 గంటల ముందే (7 గం.) మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు? సజ్జనార్: 2019, నవంబర్ 29న శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లా. అక్కడ్నుంచి క్యాంప్ ఆఫీస్కు వస్తుంటే శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్ గురించి డీసీపీ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను తెలియజేశా. నేను ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షించలేదు. మార్నింగ్ బ్రీఫింగ్లో పాల్గొనేవాడిని. ‘దిశ’కేసుపై ఏర్పాటు చేసిన 9 బృందాలకు శంషాబాద్ డీసీపీ నేతృత్వం వహించారు. కమిషన్: నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారా? సజ్జనార్: నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్ 2న డీసీపీ అభ్యర్థిస్తే.. అదనపు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులను అపాయింట్ చేశా. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆ విభాగాన్ని ఆదేశించా. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాం. కమిషన్: ఆ 9 ఎంఎం పిస్టల్ ఎవరిది? సజ్జనార్: ఎన్కౌంటర్లో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ నందిగామ సబ్ఇన్స్పెక్టర్ నర్సింహకు జారీచేశారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్కు వెంకటేశ్వర్లు ఎస్ఐగా పోస్టింగయ్యారు. దీంతో ఆ పిస్టల్ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది. కమిషన్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్ చేస్తారా? సజ్జనార్: సివిల్ ఫోర్స్కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్ చేస్తుంటారు. కమిషన్: సైబరాబాద్ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్ ఉంటుందా? సజ్జనార్: ఉంటుంది. ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లానే సైబరాబాద్ సీపీలో ఆర్మ్స్ రిజర్వ్ వింగ్ కూడా ఉంటుంది. కమిషన్: నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్ గురించి సైబరాబాద్ సీపీ రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్ వింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది. కమిషన్: నందిగామ, ఆమన్గల్ స్టేషన్లకు కేటాయించిన ఆయుధాలను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు? ఎలాంటి నిర్ధిష్టమైన విధుల కోసం ఆయుధాలను కేటాయించారు? ఆయా వివరాలను రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల జారీ, తనిఖీ అంశాలను పర్యవేక్షించడానికి అదనపు డీసీపీ, సీఏఆర్ నేతృత్యంలో ప్రత్యేక వింగ్ ఉంది. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో షాద్నగర్ ఏసీపీ వీ. సురేందర్తో సమావేశమయ్యారా? సజ్జనార్: కాలేదు. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో శంషాబాద్ డీసీపీ కాన్ఫరెన్స్ హాల్లో మీరు సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు? సజ్జనార్: లేదు, ఇది జరిగింది 2019, నవంబర్ 30న. కమిషన్: అంటే.. ఈ ఎంట్రీ తప్పంటారా? సజ్జనార్: దీనికి సురేందరే సమాధానం చెప్పాలి. కమిషన్: ఎస్కార్ట్ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ కోరితేనే జారీచేశా. కమిషన్: గతంలో మీరెప్పుడైనా అత్యాచారం, హత్య కేసుల్లో ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఇలాంటి ఆయుధాలను జారీ చేశారా? సజ్జనార్: ఒకసారి తనిఖీ చేసుకొని సమాధానమిస్తా. కోర్టుకు హాజరుకాకుండానే కస్టడీకి అనుమతి.. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ షాద్నగర్ పీ.శ్యాంప్రసాద్.. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల భౌతిక హాజరు అత్యవసరమని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 2న మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిందితుల కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, అదే రోజు సాయంత్రం అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాగే నిందితుల పంచనామాలు, సాకుల స్టేట్మెంట్లు కూడా తనకు సమర్పించలేదని, తహసీల్దార్కు సమర్పించారని స్పష్టం చేశారు. తహసీల్దార్ రిమాండ్ రిపోర్ట్ను అనుసరించే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చానని వివరించారు. కాగా.. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిందితులను 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. పోలీసులు 15 రోజులు కస్టడీలో ఉంచుకున్నారన్నారు. చర్లపల్లి జైలర్ నిందితుల సంతకాలను అటాచ్ చేశాడు కాబట్టి.. తాను ఆ సంతకాలను నిర్ధారించుకోలేదని కమిషన్కు తెలిపారు. నిందితుల తరఫు నుంచి తనకి ఎలాంటి న్యాయపరమైన సలహా లేదా కస్టడీని వ్యతిరేకిస్తూ దరఖాస్తు అందలేదని వెల్లడించారు. -
అమెరికా వెళ్లాకే పెళ్లి ...22 లక్షలకు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: మాట్రిమోనియల్ సైట్స్ ద్వారా పెళ్లి పేరుతో యువకులకు ఎర వేసి మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఇతగాడిని మూడు రోజుల క్రితం ఇలాంటి కేసులోనే రాచకొండ అధికారులు పట్టుకున్నారు. ఇతడి వలలో పడి రూ.21.74 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్ యువతి ఫిర్యాదు మేరకు బుధవారం నగరంలో కేసు నమోదు చేశారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన యువతి తన ప్రొఫైల్ను షాదీ.కామ్లో పొందుపరిచారు. దీన్ని లైక్ చేసిన పొట్లూరి బాల వంశీకృష్ణ అనే ప్రొఫైల్ కలిగిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే తాను అమెరికా వెళ్లిన తర్వాతే పెళ్లని నమ్మించాడు. వీసా కోసం రూ.20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ లేదా డిపాజిట్ అవసరమని యువతితో చెప్పాడు. దీంతోపాటు కొన్ని ఖర్చుల కోసమంటూ బాధితురాలి నుంచి రూ.21.74 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీని పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. చదవండి : OnlinePaymentFraud: టీవీ రీచార్జ్, ఘరానా మోసం Chandan Mitra: కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం -
చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్
సాక్షి, సిటీబ్యూరో: ఒక్క చలానా పెండింగ్లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ అవాస్తవమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. చదవండి: డేంజర్ డెంగీ సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ (సీఎంవీఆర్)–1989 రూల్ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్ చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని పేర్కొన్నారు. చదవండి: సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు ఏమైనా ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదే. ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్లైన్ ద్వారా అధికారులకు నివేదించవచ్చు. సాక్ష్యాలను ధ్రువీకరించి సరిదిద్దుకోవచ్చని వారు సూచించారు. చదవండి: ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే! -
సన్ పరివార్ కేసు: విచారణ ముమ్మరం
-
సన్ పరివార్ కేసు: విచారణ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సన్పరివార్ కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈడీకి పోలీసులు లేఖ రాశారు. 2018లో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల సన్పరివార్ కేసులో ఆ సంస్థ సీఈవో రవీందర్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పటేల్గూడ సర్పంచ్ నితీషా సహా ఆరుగురు అరెస్టయ్యారు. 14వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు పోలీసులు సీజ్ చేశారు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల రూపంలో రూ.16కోట్లు గుర్తించారు. అమీన్ పూర్ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ ఎంపీపీ దేవనాథ్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రాదనుకున్న సొమ్ము రాబట్టారు..
గచ్చిబౌలి: చోరీకి గురైన సొత్తును బాధితులకు అప్పగించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 176 కేసుల్లో కోటిన్నర విలువైన కిలో బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి, రూ.30.67 లక్షల నగదు, 90 వాహనాలు బాధి తులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్లో జరిగిన ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చోరీ జరిగిన సొమ్మును బాధితులకు అప్పగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. చోరీ జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, క్లూస్ సేకరించి నిందితులను రిమాండ్ చేసి చార్జిషీట్ వేయడం వరకే ఆగిపోతున్నట్లు చెప్పారు. సొమ్ము గురించి అంతగా పట్టించు కోకపోవడంతో న్యాయపరంగా సొత్తు తీసుకోవట్లేదని తెలిపారు. చోరీ అయిన సొత్తును త్వరితగతిన ఇప్పించాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సొత్తును అప్పగించేందుకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, డీసీపీలు, సీసీఆర్బీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిరంతరం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శంషాబాద్ జోన్ పోలీసులు 101 కేసుల్లో సొత్తు రికవరీ చేశారని తెలిపారు. -
‘నారప్ప’ని అలా వాడేసుకున్న సైబరాబాద్ పోలీసులు
ట్రాఫిక్ రూల్స్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. ట్రెండ్ని ఫాలో అవుతూ తమదైన శైలీలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా కరోనాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో కరోనా పూర్తిగా తొలగి పోలేదని.. ఇంకా ఉందని.. అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నారు. మాస్కులు కచ్చితంగా ధరించాలని గుర్తు చేస్తున్నారు. కరోనాపై అవగాహన కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్ని వాడేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. నారప్ప సినిమా పోస్టర్లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, గతంలోనూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదల కాగా, బైక్పై ఎన్టీఆర్, రామ్ చరణ్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని.. వారి పోస్టర్కు హెల్మెట్ అమర్చి, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. Don't forget your mask. COVID-19 is still awake. #Narappa Always #WearAMask when stepping out. #StaySafe #covid19 #MaskUpIndia pic.twitter.com/S3eEoquPCn — Cyberabad Police (@cyberabadpolice) July 22, 2021 -
దమ్మాయిగూడ అత్యాచార కేసులో పురోగతి
సాక్షి, జవహర్నగర్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తిగా జవహర్ నగర్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను బండ్లగూడలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. భార్యతో తరచూ గొడవల కారణం కొంతకాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నారు. జవహర్నగర్ సీఏ బిక్షపతి రావు, కీసర సీఐ నరేందర్ గౌడ్ జాయింట్ ఆపరేషన్లో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల దమ్మాయిగూడలో నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. -
రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్
నటుడు బ్రహ్మాజీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో ఆయన వేసే కామెడీ పంచ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మాజీ సోషల్ మీడియాలో సైతం పలు సంఘటనలపై తనదైన స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. తాజాగా ఆయన ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు వచ్చిన మెసెజ్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ప్రైజ్మనీని తీసుకురావాల్సింది హైదరాబాద్ సిటీ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా మనలో చాలా మంది మీరు ఇంత డబ్బును గెలుచుకున్నారంటూ మీ పేరు, చిరునామా ఇవ్వాల్సిందిగా గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి తరచూ మనకు మెసెజ్లు వస్తూనే ఉంటాయి. అయితే గురువారం బ్రహ్మజీకి ఈ మెసెజ్ రావడంతో వెంటనే దానిని స్క్రీన్ షాట్ తీసి ట్వీటర్లో షేర్ చేశాడు. ఆ ఫోన్ నెంబర్ ట్వీట్లో పేర్కొంటూ ‘సార్ నాకు ఈ నెంబర్ నుంచి రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని యూకేకు చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మెసెజ్ వచ్చింది. దయ చేసి మీరు ఈ డబ్బులను తీసుకురాగలరు’ అంటూ సిటీ పోలీసులు, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇక బ్రహ్మజీ చమత్కారంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసి నెటిజనలు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. +91 80996 68183 Sirr..got a msg from above number..pl collect money @hydcitypolice @cyberabadpolice pic.twitter.com/GLLsiSgKkP — Brahmaji (@actorbrahmaji) June 17, 2021 చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్ -
హైదరాబాద్లో బయటపడ్డ భారీ మోసం.. కార్లను అద్దెకు తీసుకుని
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్ ఏజెన్సీ, ఓనర్ల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత సబ్సిడీ కార్ల పేరుతో అద్దెకు తీసుకున్న కార్లను బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ నమ్మబలికి.. జనాలను మోసం చేస్తారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా మోసం వెలుగులోకి రావడంతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్ పోలీసులు సోమవాంర ఈ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ కార్ల పేరుతోటి విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ దాదాపుగా నాలుగున్నర కోట్లు రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అద్దెకు తీసుకున్న కార్లకు రెండు మూడునెలల వరకు రెంట్ చెల్లించి ఆ తర్వాత మొహం చాటేయెడం వీరికి అలవాటని తెలిపారు పోలీసులు. ముఠాకు చెందిన పల్లె నరేష్ , బడావత్ రాజునాయక్, కలుముల వికాస్, గొల్లె భరత్ జోషిబానూరి ఎలక్షన్ రెడ్డి, తాళ్ల నర్స్మింహా రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చదవండి: ‘ఇండస్ వివా’ చీటింగ్ కేసు: భారీ ఆఫర్లతో ఎర -
మహేష్బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు లేటెస్ట్గా మహేష్బాబును వాడేశారు. డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేష్బాబు ఫోటోను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు..'డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. మహేష్ డెనిమ్ జాకెట్, డెనిమ్ జీన్స్ వేసుకొని ఉన్న మహేష్ ఫోటోతో ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Safety First..#WearAMask #StaySafe #IndiaFightsCorona#Unite2FightCorona @urstrulyMahesh @MaheshBabu_FC @TelanganaCOPs pic.twitter.com/jNvP6XW0PS — Cyberabad Police (@cyberabadpolice) May 11, 2021 చదవండి : సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ ఎన్టీఆర్కు కరోనా.. హెల్త్ అప్డేట్స్ ఇచ్చిన చిరంజీవి -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇక అంబులెన్స్ సేవలు ఫ్రీ..
సాక్షి, గచ్చిబౌలి: సైబరాబాద్ కమిషనరేట్లో సైబరాబాద్ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్లను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ సెకండ్ వేవ్లో అంబులెన్స్ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులు, చిన్నారులు, గుండె జబ్బులు ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్ల కోసం అందుబాటులో అంబులెన్స్లు ఉంటాయన్నారు. సైబరాబాద్తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషరేట్లలో ఉచితంగా సేవలందిస్తాయని తెలిపారు. రహేజా మైండ్ స్పేస్, దివ్యశ్రీ ఓరియన్, ఫినిక్స్, వేవ్రాక్, గార్గ్ కార్పొరేషన్, అసెండాస్, టీసీఎస్, గుగూల్, డీఎల్ఎఫ్ సహకారంతో అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్తో పాటు అంబులెన్స్ల కోసం 94906 17440, 94906 17431లను సంప్రదించాలన్నారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
మహేశ్ బాబు వీడియోని వాడేసిన తెలంగాణ పోలీసులు.. వైరల్
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్బాబు ముందున్నారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియా ఆయన కరోనా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. అలాగే కరోన కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులకు కూడా తనకు తోచిన సహకారం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ప్లాస్మా దానం చేయాలంటూ సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్పై స్పందించారు. ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని తన అభిమానులకు మహేశ్ పిలుపునిచ్చారు. Let's do everything in our stride to help those battling with Covid. Plasma donors are needed more than ever now. I pledge my support to @cpcybd VC Sajjanar sir & @cyberabadpolice for taking up this initiative. #DonatePlasmaSaveLives https://t.co/AiMipnd7Ey — Mahesh Babu (@urstrulyMahesh) April 23, 2021 ‘కరోనాతో పోరాడుతున్న వారికోసం మనకు సాధ్యమైనంత చేయూతనిద్దాం. గతంలో కంటే ఇప్పుడు ప్లాస్మా దాతలు మరింత అవసరం. పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు నా మద్దతు తెలియజేస్తున్నా’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ట్విటర్లో మహేశ్ బాబు వీడియోతో ప్రజల్లో కరోనా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. 'జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్... మాస్కు తప్పనిసరిగా వాడండి' అంటూ మహేశ్ వాయిస్తో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానికి 'మాస్క్ ఈజ్ మస్ట్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. #MaskIsMust@urstrulyMahesh pic.twitter.com/L4AzI0JBvO — Telangana State Police (@TelanganaCOPs) April 24, 2021 చదవండి: ఫన్ బకెట్ భార్గవ్ కేసు : అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్ పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి -
హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు
సినిమా షూటింగ్ను కూడా పిక్నిక్ స్పాట్గా మార్చేసి తెగ అల్లరి చేసింది ఎవరా అంటే రంగ్దే టీమ్ పేరే వినిపిస్తుంది. ఆ మధ్య సెట్స్లో కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తే నితిన్, దర్శకుడు వెంకీ అట్లూరి ఆమె వెనకాల చేరి ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కోపగించుకున్న కీర్తి వారిద్దరి మీదా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. అన్నట్లుగానే డైరెక్టర్ను పరిగెత్తించి మరీ కొట్టింది. తర్వాత నితిన్ మాట్లాడుతున్నట్లుగా ఉండే ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది ఇదిలా వుంటే కీర్తిని మరోసారి ఆటపట్టించాడు నితిన్. MISSING KANABADUTALEDHU Dear anu, nuvvu ekkadunna RANG DE promotions lo join avvalani maa korika.. Itlu nee arjun 😈😈😈😈 #Rangdeonmarch26 pic.twitter.com/fpnv06ebCb — nithiin (@actor_nithiin) March 20, 2021 'కనబడుటలేదు.. డియర్ అను, నువ్వు ఎక్కడున్నా రంగ్దే ప్రమోషన్స్లో జాయిన్ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్..' అని ట్వీట్ చేశాడు. దీనికి హీరోయిన్ రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను జత చేశాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందిస్తూ.. 'భయపడకండి నితిన్.. మేము చూసుకుంటాం' అని సరదాగా రిప్లై ఇచ్చారు. వాళ్ల కామెంట్కు చేతులు జోడిస్తూ నితిన్ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి వీరి సరదా ట్వీట్లు నెట్టింట అందరినీ నవ్విస్తున్నాయి. కాగా రంగ్దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: ఈ సారి గొడవ కలవడానికి చెయ్.. గెలవడానికి చేయకు రంగ్దే ట్రైలర్ లాంఛ్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో కార్తికేయ శవాలు మోసే బస్తీ బాలరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సైబరాబాద్ పోలీసులు హీరో కార్తికేయ(బస్తీ బాలరాజు)కు ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారు. చావు కబురు చల్లగా సినిమాలోని కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్పై వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ..'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కార్తికేయ, లావణ్య త్రిపాఠిలకు ట్యాగ్ చేశారు. హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు @ActorKartikeya @Itslavanya @Koushik_psk #ChaavuKaburuChallaga pic.twitter.com/XPDTfV3bm0 — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 19, 2021 ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే సైబరాబాద్ పోలీసులు..లేటెస్ట్గా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా పోస్టర్ను వాడి హెల్మెట్ ఆవశ్యకత గురించి చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటించగా, లావణ్య..నర్సుగా నటించింది. సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషించగా, యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్లో అలరించింది. చదవండి : ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ (చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్) -
మనీ సర్క్యులేషన్ స్కామ్ బట్టబయలు
-
మనీ సర్క్యులేషన్ స్కామ్ బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మనీ స్కీమ్ గ్యాంగ్ రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. మాదాపూర్లోని ఓ ప్రముఖ హోటల్లో నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. డైరెక్టర్స్ సహా 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. సాయంత్రం మూడు గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. చదవండి: కేటీఆర్ పీఏనంటూ టోకరా మిస్సింగ్ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి.. -
7 చిరునామాలతో 72 పాస్పోర్టులు!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్పోర్టులు కావని, అసలైన పాస్పోర్టులనే వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధన్ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్ వివరించారు. ఆ అనుభవమే పెట్టుబడిగా... సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్కు చెందిన పరిమళ్ బెయిన్ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్ కార్డు పొందాడు. బోధన్లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్వాసి సమీర్ రాయ్ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేశాడు. బోధన్లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్ చేయడంతో పరిమళ్కు పాస్పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు. బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్ తెరలేపాడు. తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్ బెయిన్కు ఏఎస్సై మల్లేశ్ సహకారంతో అక్రమంగా పాస్పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్ సమకూర్చేవారు. ఇరాక్లో పనిచేస్తున్న సమీర్ కుమారుడు మనోజ్ వీసాల ప్రాసెసింగ్కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా ఉన్న మల్లేశ్రావు, ఏఎస్సై బి.అనిల్ కుమార్ సహకారం, అవినీతి ఉన్నాయి. ఇద్దరు పోలీసుల కీలకపాత్ర... ఈ గ్యాంగ్ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్పోర్టులు పొంది దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్ దాస్, మహ్మద్ రానా మయ్, మహ్మద్ హసిబుర్ రెహ్మాన్ గత నెలాఖరులో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్ కేంద్రంగా జరిగిన ఈ పాస్పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్ చేశారు. అక్రమంగా పాస్పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్ అహ్మద్ మీర్జా అక్రమంగా ఆధార్ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్స్ జారీ చేస్తున్నారు. -
ఆ పాత్ర మర్చిపోలేనిది: సోనుసూద్
సాక్షి, రాయదుర్గం: కరోనా వేళ..అభ్యాగులను ఆదుకోవడంలో నేను నిర్వహించిన పాత్ర జీవితంలో మర్చిపోలేనిదని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో సైబరాబాద్ పోలీసులు, సొసెటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ను బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాజరైన సోనూసూద్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ముంబై తదితర ప్రాంతాల్లో బాధితులను ఆదుకున్న తీరును గుర్తు చేసుకున్నారు. కరోనా చాలా వరకు తగ్గిపోయిందని, అయినా తోటి వారికి సహాయం చేసే పనిని నిరంతరం అందరూ కొనసాగించాలన్నారు. పోలీసులు, డాక్టర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఇతరులు చాలా మంది కరోనా వేళ ఎంతో సేవ చేశారని, వారంతా రియల్ హీరోస్ అని పేర్కొన్నారు. గాయని స్మిత, సైబరాబాద్ సీపీ సజ్జనార్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తదితరులను ఈసందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, డీసీపీలు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈ రిక్షాలు అందించిన రియల్ హీరో -
ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ చేసేందుకు ఆన్లైన్ కేటుగాళ్లు నూతన పంధాను ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థ పేరుతో ఫోన్ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే బహుమతులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాము అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంఐ 11 టీ మొబైల్ ఫోన్ గెలుచుకోవాలంటూ గాలం వేసి, మొబైల్ ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా సైబర్ నేరగాళ్లు చెప్పే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్కు స్పందించి, వాళ్లు చెప్పిన విధంగా చేస్తే.. బ్యాంకు లావాదేవీలు మొత్తం సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలను బురడీ కొట్టించే క్రమంలో కేటుగాళ్లు లింకులు పంపి, వాట్సప్ గ్రూపులు ద్వారా 20 మంది స్నేహితులకు పంపాలని మెసేజ్లు పంపుతారని, ఇలాంటి వాటికి ప్రజలు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీకి సంబంధించి అనేక కేసులు నమోదవుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. -
‘ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్చరణ్
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): పోలీస్ పాత్రంటే కథ వినకుండానే ఓకే చేస్తానని సినీనటుడు రామ్చరణ్ తేజ్ పేర్కొన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో స్పోర్ట్స్ మీట్ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ధ్రువ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్గా నటించేందుకు చాలా కష్ట పడ్డానని చెప్పారు. సినిమా చూసిన పోలీసులు నవ్వుకోకుండా ఉండేందుకు సెల్యూట్ నుంచి డ్రెస్ వేసుకోవడం వరకు ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశానని గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ పోలీస్ పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. పోలీసులపై ఉన్న గౌరవంతోనే అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న తాను గంటన్నర పాటు మేకప్ తొలగించుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. కోవిడ్ సమయంలో 10 నెలల పాటు పోలీసులు, డాక్టర్లు అంకితభావంతో పని చేశారని కొనియాడారు. సైబరాబాద్ పోలీసుల స్పోర్ట్స్ మీట్లో టగ్ ఆఫ్ వార్ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్చ్ఫాస్ట్ చూస్తుంటే స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. తాను కూడా ఎల్లోస్ టీమ్లో మార్చ్ ఫాస్ట్ చేసేవాడినని, బ్యాండ్ సైతం నేర్చుకున్నట్లు చెప్పారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ మీట్లో ఏడు జట్లు పాల్గొన్నాయని, తొలిసారి మినిస్ట్రీయల్ సిబ్బందికి అవకాశం కల్పించామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాతీయ అథ్లెటిక్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ నాగపురి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, డీసీపీలు పద్మజ, విజయ్ కుమార్, ఎస్ఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలీస్ స్పోర్ట్స్ మీట్కు హాజరైన రామ్చరణ్ ఫొటోలు
-
పోలీస్ స్పోర్ట్స్ మీట్కు హాజరైన రామ్చరణ్
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో పోలీసుల విధులు అనిర్వచనీయమని హీరో రామ్చరణ్ అన్నారు. స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబర్చిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీసు వార్షిక క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రామ్చరణ్ తెలిపారు. షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పటికీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనగానే ఓకే చెప్పానని, అందరినీ కలవాలని పోలీసుల కోసం వచ్చానన్నారు. కరోనా కాలంలో పోలీసులు, వైద్యులు తమను తాము కాపాడుకుంటూ ప్రజలను కాపాడారని ప్రశంసించారు. పోలీసులు క్రీడల్లో మరింతగా రాణించాలని కోరుకున్నారు. తనను అతిథిగా పిలిచిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఆచార్య: మెగా అభిమానులకు డబుల్ ధమాకా) (చదవండి: హెడ్కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం) -
ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్: అనుష్క
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పాహి’ మొదటి వార్షికోత్సవం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. షీ పాహి కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళా సిబ్బందిలో స్పూర్తి నింపుతున్నామన్నారు. సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలు ఉన్నారని, మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వుమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ట్రాఫిక్లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. చదవండి: శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్కు.. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ లాంటి వారని హీరోయిన్ అనుష్క శెట్టి అన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని, తనను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది మహిళా పోలీస్లు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. షీ పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు లేకుండా జీవితాన్ని ఊహించలేమంటూ కొనియాడారు. వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పోలీసులతో అనుష్క ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2014లె షీ టీమ్స్ను మొదలు పెట్టామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. విధుల్లో స్త్రీ, పురుషులని ఎలాంటి వివక్ష ఉండదని, షీ టీమ్స్లో పురుషులుకూడా ఉన్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. భరోసా సెంటర్లు రాష్ట్రంలో 4 ఉన్నాయని, 2021లో భరోసా సెంటర్స్ సంఖ్య 10కి పెంచుతామని తెలిపారు. సైబరాబార్లో ఒకేసారి 2058 కెమెరాలు పెట్టారని పేర్కొన్నారు. -
తుపాకీతో బెదిరించి.. కాళ్లు, చేతులు కట్టి!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో నిర్మాణమవుతున్న గేటెడ్ కమ్యూనిటీల్లో చొరబడతారు.. సెక్యూరిటీ గార్డులను తుపాకీతో బెదిరిస్తారు.. వారి కాళ్లు, చేతులు తాడుతో కట్టేస్తారు.. ఆపై సీసీ కెమెరా డీవీఆర్లు ధ్వంసం చేసి స్టోర్ రూమ్ల్లోని ఎలక్ట్రిక్ సామగ్రి (వైర్ బండిల్స్, ఎంసీబీలు, ప్యానెల్ బోర్డులు)ని దొంగిలిస్తున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు చెందిన 9 మందితో పాటు ఇద్దరు రిసీవర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్లోని పబ్లిక్ సేఫ్టీ– ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ అండ్ డాటా సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో నిందితుల బొలెరో వాహన నంబర్ను క్యాప్చర్ చేసి పోలీసులకు మార్గదర్శనం చేయడంతో దుండిగల్ టోల్గేట్ వద్ద కాపుకాసి మరీ పట్టుకున్నారు. రూ.55,10,000 విలువైన వైర్ బండిల్స్, ఎలక్ట్రిక్ వైర్ బండిల్స్, కాపర్ పైప్స్ అండ్ కేబుల్స్, ఎంసీబీ బాక్స్లు, బొలెరో వాహనం, ఒక పిస్టల్, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ విజయ్కుమార్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు ప్రకాష్రెడ్డి, పద్మజారెడ్డి, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ గోనె సందీప్లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. చదవండి: మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు ఢిల్లీలో పరిచయం.. నగరంలో దోపిడీలు రాజస్థాన్ దౌలాపూర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుషావహ, కుల్దీప్, మాధవ్ సింగ్, ధర్మేందర్ సింగ్, ఉత్తరప్రదేశ్కు చెందిన నిహల్ సింగ్, శైలేందర్ సింగ్, సంజయ్, ధర్మేంద్ర కుమార్, సత్యబాన్ సింగ్లు వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్లు. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో వీరు స్నేహితులయ్యారు. స్థిరాస్తి రంగం బాగుందని 2019లో హైదరాబాద్కు వచ్చారు. ముప్పా కంపెనీలో ఆరు నెలల పాటు రోజువారీ కూలీలుగా పనికి కుదిరారు. ప్రదీప్ కుషావాన్ మినహా మిగతావారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రదీప్ తాను పనిచేసే కంపెనీ నుంచి సెక్యూరిటీ కళ్లుగప్పి రోజుకో వైర్ బండిల్ తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయించేవాడు. అప్పటికే జల్సాలకు అలవాటుపడిన అతను తన గ్యాంగ్ను గతేడాది జూన్లో రప్పించాడు. వీరు పనిచేసిన డీఈ కంపెనీలోనే వైర్ బండిల్స్ చోరీ చేసి కొండాపూర్లో ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తున్న రాజస్థాన్కు చెందిన మనీశ్ కుమార్, స్క్రాప్ షాప్ నడుపుతున్న మహబూబ్నగర్కు చెందిన గోవుల విజయ్కుమార్కు విక్రయించారు. వేలాది రూపాయల విలువచేసే వైర్ బండిల్ను కేవలం రూ.400కే అమ్మేవారు. ఈ సొమ్మును సమానంగా పంచుకుని సొంతూళ్లకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వీరిని ప్రదీప్ ఈ ఏడాది జనవరి 6న పిలిపించాడు. పక్కాగా రెక్కీ.. భవన నిర్మాణ పనులు జరుగుతున్న శంకర్పల్లి, మోకిల్లా, కొండకల్, నార్సింగి, మల్లంపేట, ఆర్సీపురం ప్రాంతాలకు ఉద్యోగం కావాలంటూ బొలేరో వాహనంలో వెళ్లేవారు. స్టోర్ రూమ్, వైర్ బండిల్స్ పరిశీలించేవారు. ఆ తర్వాత రాత్రి 11.30 నుంచి 3 గంటల మధ్యలో ఆయా సైట్లకు వెళ్లి వైర్ల బండిళ్లను దొంగిలించేవారు. వారం వ్యవధిలోనే శంకర్పల్లి, ఆర్సీపురం, దుండిగల్ వరుసగా చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. జనవరి 9న అర్ధరాత్రి దాటాక మల్లంపేటలోని ప్రణీత్ ప్రణవ్ లీప్ విల్లాస్లో జరిగిన చోరీపై దుండిగల్లో కేసు ఫిర్యాదు రావడంతో బాలానగర్, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, వెంకట్రెడ్డి, దుండిగల్, మేడ్చల్ ఇన్స్పెక్టర్లు వెంకటేశం, ప్రవీణ్రెడ్డి నేతృత్వంలో బృందాలు రంగంలోకి దిగాయి. చోరీ జరిగిన తీరును తెలుసుకున్న పోలీసులకు నిందితులు వినియోగించిన బొలెరో వాహన కదలికలు సీసీ కెమెరాలకు చిక్కాయి. వాహన నంబర్ ఆధారంగా నిఘా ముమ్మరం చేశారు. దుండిగల్ టోల్గేట్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం వాహన తనిఖీలు చేస్తున్న ప్రత్యేక బృందాలకు బొలెరోలోని తుపాకీ, వైర్ బండిల్స్ దొరికాయి. ప్రదీప్ కుషావాహ, కుల్దీప్, శైలేంద్రసింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితులను నార్సింగ్ ఠాణాలో ఇందిరానగర్లో పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని సీపీ సజ్జనార్ నగదు రివార్డులను అందజేశారు. -
ఇలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్ : వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. అరెస్టయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. నిందితుడు ఆర్టీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహిల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రమేష్తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామన్నారు. చదవండి: తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే.. -
‘జర జాగ్రత్త’లో యాంకర్ వర్షిణి
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు...అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో ‘డిజిటల్ ప్లాట్ఫామ్’ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘుచిత్రాన్ని నిర్మించారు. ‘బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన ఈ షార్ట్ఫిల్మ్ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘుచిత్ర లింక్ను సైబరాబాద్ పోలీసుల సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పోస్టు చేశారు. ఇవీ గమనించండి... ► సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయవిక్రయాలు జరిపే ఆన్లైన్ పోర్టల్స్ను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు. ► కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా..చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ► సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు. నగదు వెనక్కి ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. ► అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి. ► ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444 వాట్సాప్ నంబర్ను సంప్రదించాలని సీపీ సజ్జనార్ అన్నారు. -
లోన్యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టంట్ లోన్యాప్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్లో తనిఖీలు నిర్వహించి ఇన్స్టంట్ రుణాల పేరుతో పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీల్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ఆరుగురు ఆన్లైన్ లోన్ యాప్ కాల్సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సునీల్ కాల్డేటా ఆధారంగా వీరిని గుర్తించారు. ఇప్పటికే పలు ఆన్లైన్ యాప్ టెలీ కాలర్లందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. (యాప్ రుణానికి మరొకరు బలి ) హైదరాబాద్లో నిన్న (సోమవారం )3చోట్ల నిర్వహించిన దాడుల్లో 650 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరిపై 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మద్యాహ్నం మూడు గంటలకు అడిషనల్ సిపి క్రైమ్స్ షికా గోయల్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆన్లైన్ యాప్స్ నిర్వహణలో ఆసక్తికర అంశాలను గుర్తించారు. కాల్సెంటర్ బయట ఉద్యోగులు కస్టమర్లతో పాటించాల్సిన నియమాలంటూ ఓ నోట్ ఉంచారు. ఇందులో కస్టమర్లను గౌరవించాలి, వారితో మర్యాదగా మాట్లాడాలని రాసి ఉంది. కానీ అందుకు పూర్తి విరుద్దంగా లోపల దందా జరుగుతుంది. అప్పు తీసుకున్న కస్టమర్లు గడువులోగా చెల్లించకపోతే కస్టమర్లను బూతుపురాణం తిడుతూ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంత వసూలు చేస్తే కాల్ సెంటర్ ఉద్యోగులకు అంత ఇన్సెంటివ్లు ఇస్తుండటంతో ఉద్యోగులు కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలువురు బాధితులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. (లోన్యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్ ) -
జగ్గూ భాయ్ సాయం.. జక్కన్నకు పోలీసుల థ్యాంక్స్
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడటంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి వారికి సాయం చేయడానికి ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది పేద సినీ కార్మికులకు నిత్యావసరవస్తువులతో పాటు మాస్క్లు, శానిటైజర్లు అందజేశారు. గతంలో కూడా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్-95 మాస్క్లు, శానిటైజర్లు అందించిన విషయం తెలిసిందే. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) రాజమౌళికి ధన్యవాదాలు: సైబరాబాద్ పోలీసులు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భగభగమండే ఎండలో సైతం తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన శీతల పానీయాలు అందించిన విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా నగరంలో 30,000 బాటిళ్లను పోలీసులకు అందించారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ రాజమౌళి బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీంకు సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (బుట్టబొమ్మ సారీ చెప్తుందా?) Thank you @ssrajamouli @Shobu for the expression of support. @cyberabadpolice enjoyed these tasty and nutritious beverages from @GolisodaDrinks. 30000 bottles distributed over 3 weeks time ensuring social distancing and WHO production guidelines. @TelanganaDGP @KTRTRS pic.twitter.com/VmWnRu5ZKc — Cyberabad Police (@cyberabadpolice) May 30, 2020 -
‘వాకింగ్ కోసం బయటకు రావొద్దు.. ’
హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు.. 24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యలో ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. ఇదేకాకుండా.. లాక్డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసకుంటామని తెలిపారు. (చదవండి : అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం) లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి 20,591 వాహనాలకు సీజ్ చేశామని.. అందులో 16,000 టూ వీలర్స్, 1,401, త్రీ వీలర్స్, 2,246 ఫోర్ వీలర్స్, 144 ఇతర వాహనాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రత్యేక తనిఖీలు చేపడుతూ.. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మొత్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 9,15,182 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రించవచ్చని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే నగరవాసులకు పలు సూచనలు జారీచేశారు. ► ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసమని బయటకు రావొద్దు. ► బర్త్డే పార్టీలు, ఇతర పార్టీలు.. అలాగే జనసముహాలకు అనుమతి లేదు ► అన్ని షాపులు, సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు సాయంత్రం 6 గంటల్లోపే మూసివేయాలి.. అప్పుడే అందులో పనిచేస్తున్నవారు సాయంత్రం 7 గంటల్లోపు ఇంటికి చేరుకోవడానికి వీలు పడుతుంది.. ఒకవేళ సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డుపై ఎవరైనా వాహనాలతో కనిపిస్తే వాటిని సీజ్ చేస్తాం. ► బంధువుల ఇళ్లకు వెళ్తున్నా, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా వంటి పిచ్చి సాకులతో ప్రజలు బయటకురావొద్దు. ► లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా, సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలను సీజ్ చేసి, ఐపీసీ సెక్షన్ 188, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తాం. -
మరో అవగాహన పాటతో కీరవాణి
-
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరు ఒడిశాకు చెందిన ముఠాగా గుర్తించినట్లు తెలిపారు. గచ్చిబౌలి హెడీఎఫ్సీ మేనేజర్ ఫిర్యదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా నిందితులు 140 క్లోనింగ్ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్ డ్రా చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోన్డ్ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
కీచక జాబితా @ ఐటీఎస్ఎస్ఓ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అలాంటి దారుణాలకు పాల్పడే కీచక జాబితా సిద్ధం చేసి ప్రత్యేక డేటాబేస్ ద్వారా అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలోపడింది. దీనికోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)కి భిన్నంగా ‘ఇన్వెస్టిగేటింగ్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’(ఐటీఎస్ఎస్ఓ)కు రూపమిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆ జాబితాలను అప్డేట్ చేసి అందజేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిధిలో నడిచే సీసీటీఎన్ఎస్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరగాళ్ల గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. కీచక నేరస్థులు మళ్లీ నేరం చేసి దొరికినపుడు వారి గత చరిత్రను ఎఫ్ఐఆర్, చార్జిషీట్లలో పేర్కొనాలని యోచిస్తోంది. దీనికోసమే ఐటీఎస్ఎస్ఓ అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ‘దిశ’ఘటన నేపథ్యంలో కేంద్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడే నిందితులందరికీ ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీఎస్ఎస్ఓ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్ శివారులో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. తరువాత డిసెంబర్ 6న జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లలో దిశ కేసులో నిందితులు నలుగురు చనిపోయారు. నిందితులు నలుగురు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా మహిళలపై అలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అన్న అనుమానాలను సీపీ సజ్జనార్ సైతం వ్యక్తం చేశారు. గతంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. వారి డీఎన్ఏ శాంపిళ్లను కర్ణాటకతోపాటు, ఏపీ తదితర రాష్ట్రాలకు పంపుతామని సైబరాబాద్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఐటీఎస్ఎస్ఓనే ఆధారం.. ఈ డేటాబేస్లో ఆడవారిపై అనుచితంగా ప్రవర్తించేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారు, ట్రాఫికింగ్, వ్యభిచారం, కిడ్నాపులు, ఆన్లైన్ వేధింపులకు పాల్పడేవారి జాబితాను పొందుపరుస్తారు. ఇందులో నేరగాళ్ల వేలిముద్రలు, బ్లడ్గ్రూప్, డీఎన్ఏ, పాత నేరాలు, నేర స్వభావం, నేరం చేసే విధానం తదితర విషయాలు రికార్డు చేస్తారు. దేశంలో ఎక్కడ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఘటనాస్థలంలో దొరికిన శాంపిల్స్ను ఇకపై ఐటీఎస్ఎస్ఓకు పంపుతారు. ఒకవేళ నేరస్తుడిని ముందే గుర్తించినా అతని వేలిముద్రలను ఐటీఎస్ఎస్ఓతో పోల్చి చూస్తారు. ఒకవేళ గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటే.. అవి కూడా దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. ఫలితంగా దర్యాప్తు వేగంగా పూర్తవుతుంది. పాత నేరస్తుడి గత చరిత్రను చార్జిషీటుతో పాటు కలిపి న్యాయస్థానానికి సమర్పించడంతో నిందితుడికి తక్కువ సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నది కేంద్రం యోచన. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వద్ద దాదాపుగా 5 లక్షల మందికిపైగా నేరస్తుల వేలిముద్రలు, నేర చరిత్ర వివరాలున్నాయి. వీటిలో రేపిస్టులు, మహిళలను వేధించేవారి వివరాలను వేరు చేసి త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. -
ఈసారి చెన్నై పోలీసులకు..
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు అమోల్.. మహారాష్ట్రకు చెందిన ఇతగాడు జల్సాలకు అలవాడుపడి నేరగాడిగా మారాడు.. కుడిచేత్తో బైక్ నడుపుతూ ఎడమ చేత్తో స్నాచింగ్ చేస్తాడు.. దక్షిణాదిలో బంగారం ఎక్కువనే ఉద్దేశంతో ఈ వైపునకు వచ్చాడు.. సైబరాబాద్లో 17 నేరాలు చేసి 2018లో పోలీసులు చిక్కాడు.. తాజాగా హైదరాబాద్లో చోరీ చేసిన బైక్ వాడి చెన్నైలో నాలుగు నేరాలు చేశాడు.. ఇక్కడి పోలీసుల సహకరారంతో అక్కడి పోలీసులు అమోల్ను ఇటీవల అరెస్టు చేశారు. జల్సాల కోసం నేరబాట.. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా యశ్వంత్నగర్కు చెందిన అమోల్ బాబాసాహెబ్ షిండే కుటుంబం పెద్దదే. పెద్దగా చదువుకోని ఇతగాడు బతుకుతెరువు కోసం డ్రైవర్గా మారాడు. ఈ వృత్తిలో వస్తున్న ఆదాయం కుటుంబ పోషణ, తన జల్సాలకు సరిపోకపోవడంతో నేరాల బాటపట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచర్గా మారాడు. 2013లో అక్కడి పర్భనీ జిల్లాలో గొలుసు దొంగతనానికి పాల్పడి తొలిసారిగా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాతి ఏడాది జైలు నుంచి విడుదలైన ఇతగాడు తన మకాంను ఔరంగాబాద్కు మార్చాడు. అక్కడ వరుసగా నాలుగు స్నాచింగ్స్ చేసి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో బెయిల్పై వచి్చన తర్వాత కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. స్నేహితుడి సలహాతో ఇటు.. అమోల్ 2016లో లాతూర్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని సంజయ్ హాకాని యాదవ్ అనే మరో నేరగాడితో కలిసి ముఠా కట్టాడు. అయితే ఏ ఉదంతంలోనూ అతడితో కలిసి నేరం చేయలేదు. సంజయ్ను కేవలం ‘సలహాలు–సూచనలకు’ మాత్రమే పరిమితం చేశాడు. మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో స్నాచింగ్ చేసినా.. ఆ గొలుసు కనీసం తులం కూడా ఉండట్లేదని సంజయ్ వద్ద వాపోయాడు. దీంతో దక్షిణాదిలో ఉన్న వాళ్లు.. ప్రధానంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా బంగారం ధరిస్తారని అక్కడ స్నాచింగ్స్ చేస్తే ఒక్కో గొలుసు కనీసం మూడు తులాలు ఉంటుందని సలహా ఇచ్చాడు. దీంతో అమోల్ కన్ను 2017 ఈ ప్రాంతంపై కన్నేశాడు. ఆ ఏడాది ఆగస్టులో లాతూర్లోనే ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఖరీదు చేసి దాని పైనే హైదరాబాద్కు వచ్చాడు. సిగింల్ హ్యాండ్ స్నాచర్.. ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత లాడ్జిలో బస చేసి, పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతనే అమోల్ స్నాచింగ్ చేస్తుంటాడు. దేవాలయాలు, దుకాణాలకు ఒంటరిగా వెళ్ళే మహిళల్నే ఇతగాడు టార్గెట్గా చేసుకునే వాడు. స్నాచింగ్ చేయడానికి ఇతడికి ఎవరి సహాయం అవసరం లేదు. తానే స్వయంగా బైక్ను నడుపుకుంటూ టార్గెట్కు ఎదురుగా వచ్చి వారి పక్కగా వాహనాన్ని పోనిచ్చేవాడు. హఠాత్తుగా తన ఎడమ చేత్తో వారి మెళ్ళోని గొలుసు లాక్కుని ఉడాయించేవాడు. ఈ పంథాలో కేపీహెచ్బీలో మూడు, మియాపూర్లో ఒక నేరం చేసి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 జనవరి 6న సిటీకి వచి్చన అమోల్ మియాపూర్లోని గాయత్రి లాడ్జిలో బస చేశాడు. అదును చూసుకుని మియాపూర్లో రెండు, చందానగర్లో ఒకటి, కేపీహెచ్బీలో మరోటి స్నాచింగ్స్ చేశాడు. ఇలా మొత్తం ఐదు నెలల కాలంలో 17 స్నాచింగ్స్కు పాల్పడి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. మరోసారి వచ్చినప్పుడే చిక్కి.. ఈ నేరాలు చేస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను అధ్యయనం చేసిన పోలీసులు అనుమానితుడి ఫొటోను ఇతర రాష్ట్రాలకు పంపారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల ఆ నేరగాడు అమోల్ అని గుర్తించి సైబరాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం పర్భనీకి వెళ్ళినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి నిఘా ఉంచిన పోలీసులు 2018 జనవరి 28న మరోసారి సిటీకి వచి్చనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అనేక చోట్ల గాలించి చివరకు మియాపూర్లో పట్టుకుని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇతడి నుంచి దాదాపు 47 తులాల బంగారం రికవరీ చేశాడు. ఇతడిపై మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ కేసులు ఉన్నాయని, పలు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్లో ఉన్నాయని గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన అమోల్ -
బాలలకు భరోసా
పిల్లలు అంటే బాలురు, బాలికలు (పోక్సో), మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు జరిగితే కేసు నమోదు చేయడంలో సహాయపడ్డం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకే చోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బందులను తప్పించడానికి.. పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్టు హాలు, తికమక పెట్టే డిఫెన్స్ వాదన, నిందితుడి కసి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటివన్నీ లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో సమస్తం సమకూరుస్తోంది భరోసా. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడే జరిగేలా. ఇందుకోసం హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఒక డాక్టర్ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి, న్యాయవిచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం.. కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు పిల్లలకు నిందితుడు కనిపించనివిధంగా ఏర్పాటు ఉంటుంది. కోర్టు కూడా పెద్ద హాలులా కాకుండా.. డ్రాయింగ్ రూమ్లా కట్టారు. అవసరమైన పిల్లలకు పునరావాసాన్నీ కల్పిస్తారిక్కడ. ఈ భరోసా సెంటర్లు ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్లో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్ కమిషనరేట్లో మరొకటి, సైబరాబాద్ కమిషనరేట్లో రెండు, రాచకొండ కమిషనరేట్లో, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్లోని కోర్టుకు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. ఇంకో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే పిల్లలు ఎక్కడా నిందితుల కంటపడకుండా అన్నమాట. పోర్న్ వలలో పిల్లలు ►ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగా పోర్న్ సైట్స్కు సరుకుగా మారుతున్నదీ మన పిల్లలే! ►ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తెలిసే తమ పిల్లలను పోర్న్కు ముడిసరుకుగా మారుస్తున్నారనేది కఠోర వాస్తవం. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్లల్లో పూరిగుడిసెల్లో సైతం కెమెరాలుంటాయి. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారు పిల్లలు. ►లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన బాలికలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు.. ఇలా మొత్తం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఉంటుంది. బాలికలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైనా లేదా దారుణమై పరిస్థితిల్లో ఉంటే ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 నుంచి 8 లక్షల రూపాయాల దాకా కూడా ఉండొచ్చు. ►ఈ చట్టం ప్రకారం.. నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఇదివరకు తమకు అన్యాయం జరిగిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితులపైనే ఉండేది. ►అలాగే పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా పోలీస్ రికార్డుల్లో, కోర్ట్ రికార్డుల్లో నమోదు చేయకూడదు. కోడ్ నంబర్స్ ఉండాలి. అలాగే మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత ఆ వివరాలను తొలగించాలి. తెలంగాణ పోలీస్ ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా సెంటర్లు హైదరాబాద్లో ఒకటి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొండాపూర్లో ఒకటి, అల్వాల్లో ఒకటి ఉన్నాయి. ఈ ఏడాదిలో జీడిమెట్ల, పేట్ బషీరాబాద్, శంషాబాద్, షాద్నగర్, రాజేంద్రనగర్లలోనూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి నేర బాధితులకు భరోసా? లైంగికదాడి, లైంగిక వేధింపులు, గృహహింస, పోక్సో కేసులకు సంబంధించి న్యాయ, వైద్య సహాయాలు అందిస్తుంది. భరోసాను సంప్రదించు నంబర్లు: 040 – 29882977, వాట్సప్ నం: 9490617124 -
చిరునామా, ఫొటోలిస్తేనే పెట్రోల్..
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్ల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో ఇంధనం కొనుగోలు చేసేవారిపై సైబరాబాద్ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు పెట్రోల్ బంక్లపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిల్స్ లేదా జెర్రీ కేసెస్లో ఇంధనం నింపడంపై నిషేధం ఉన్నా పలు పెట్రోల్ బంక్లు వాటిని పాటించకపోవడం వల్ల కొన్ని సార్లు నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇంధనం అవసరం ఉన్న కొనుగోలుదారుడి చిరునామా, గుర్తింపుకార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఫొటోలిస్తేనే విక్రయించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిళ్లలో కొనుగోలు చేసిన పెట్రోల్ ఉపయోగించి కొందరు వ్యక్తులు హత్యలకు పాల్పడి మృతదేహాలను తగలబెడుతుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించని కొనుగోలుదారులు, పెట్రోల్బంక్ సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదుచేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే కొనుగోలుదారుడు తప్పుడు చిరునామా ఇస్తే ఇతర సెక్షన్లలు కూడా నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల్లో నెల నుంచి ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ‘ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్రోల్ కొనడమనేది చట్టప్రకారం నేరం. దీనిపై పెట్రోల్ పంప్ యజమాన్యం, సిబ్బందికి అవగాహన కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామ’ని సీపీ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పెట్రోల్ విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ వాహనాల్లోనే పెట్రోల్ పంప్కు వచ్చి ఇంధనాన్ని నింపుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఎక్కడైనా ఆగిపోతే పెట్రోల్ బంక్లకు బాటిల్స్లో కొనుగోలు చేసేందుకు వస్తే గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
మా దగ్గర అన్నింటికీ ఆన్సర్లున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో : దిశ మిస్సింగ్, ఆపై హత్యచారంలో కేసు నమోదు నుంచి నిందితుల ఎన్కౌంటర్ వరకు అంతా చట్టపరిధిలోనే జరిగిందని చెబుతున్న సైబరాబాద్ పోలీసులు.. అందుకు తగిన ఆధారాలు సిద్ధం చేశారు. గత నెల 27న దిశా ఘటన జరిగినప్పటి నుంచి ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కూడా వస్తున్న విమర్శలన్నింటికీ పక్కా సాక్ష్యాలతో రూపొందించిన నివేదికను ఇటు న్యాయస్థానాలకు, అటు హక్కుల కమిషన్కు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్కౌంటర్పై కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ప్రతి అంశాన్ని పక్కాగా నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఈ కేసు విచారణలో సీసీ కెమెరాల ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, పరిస్థితులను బట్టి నిర్ధారించే సర్కమ్స్టాన్సియల్ ఎడివెన్స్లతో పాటు లారీలో సేకరించి ఫోరెన్సికల్ ల్యాబ్కు పంపిన రక్తపు మరకలు, వెంట్రుకలే కీలక ఆధారాలుగా ఉన్నాయి. కిడ్నాప్, అత్యాచారం, హత్య.. ఇవి జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, హతురాలి శరీరం కాలిపోవడంతో స్వాబ్స్ వంటివి సేకరించే పరిస్థితి లేదు. కాగా, ఎన్కౌంటర్ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాల ప్రకారం ఇప్పటికే షాద్నగర్ ఠాణాలో చటాన్పల్లి వద్ద జరిగిన నలుగురి ఎన్కౌంటర్పై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్తోపాటు కేసు డైరీ, ఎంట్రీలు, పంచనామాల తదితర సమాచారాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా అతిక్రమించలేదని, నిందితులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. -
దిశ కేసు: సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో?
#Justice_for_Disha..మనమింతే ఆవేశమున్నంతసేపే ఆలోచిస్తాం.. ఆవేశంలాగే చప్పున చల్లారిపోతాం!! భ్రమలు తొలగిపోయాయి. హైదరాబాద్ విశ్వనగరమని, దేశంలోనే అత్యంత సురక్షిత నగరమని పొద్దునలేస్తే రాజకీయ నాయకులు మొదలు పోలీసు బాసుల వరకు చెప్పిందే చెప్పారు. కానీ నగర శివార్లలో తాము నిరంతరం గస్తీ తిరిగే ప్రదేశంలో అత్యంత కిరాతకమైన ఘటన జరుగుతుంటే పోలీసులు గ్రహించలేకపోయారు. బాధితుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే తమ పరిధి కాదంటూ చేతులేత్తేశారు. కాపాడాల్సిన పోలీసులే మాకేం పట్టి మా పరిధి కాదంటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఇంకా ఈ సమాజానికి ఎవరు భద్రత? జస్టిస్ ఫర్ దిశ (షాద్నగర్ శివార్లలో జరిగిన అమానుష హత్యాచార బాధితురాలి మారుపేరు) కేసులో తప్పెవరిది. ఎవరిని ప్రశ్నిద్దాం. మహిళ ఒంటరిగా నిర్భయంగా బయటకు వెళ్లి వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు. పేరుకు గొప్ప నగరమే. కానీ, నగరంలో, నగర శివార్లలో ఎన్నో గ్రే ఏరియాలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటి మీద పోలీసులకు ఏమైనా అవగాహన ఉందా? ఇలాంటి గ్రే ఏరియాల్లో నేరాలు జరగకుండా పోలీసులు ఏవైనా ప్రివెంటివ్ మెష్యూర్స్ తీసుకుంటున్నారా? పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థే కదా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది. ఆపద సమయాల్లో ఒంటరి మహిళలకు ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. డయల్ 100తోపాటు అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే సహాయం అందించేందుకు 112 టోల్ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్తున్నారు. 112కు డయల్ చేయలేని పరిస్థితి ఉంటే.. తమ స్మార్ట్ ఫోన్లో ‘పవర్ బటన్’ను మూడుసార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్లైన్కు సమాచారం అందుతుందని, సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్ ప్రెస్ చేసినా ఈ సేవలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ సేవలను ఆపద వేళల్లో మహిళలు, యువతులు నిర్భయంగా ఉపయోగించుకునేవిధంగా ఎందుకు విస్తృతంగా అవగాహన కలిగించలేకపోయారు? పోలీస్ స్టేషన్లకు వెళితే కంప్లయింట్లే తీసుకోవడం లేదు? ఇక ఫోన్ చేస్తే సమయానికి ఆదుకుంటారనే భరోసా ఎలా ఇస్తారనే అనుమానం ప్రజల్లో రాకపోదా? ఇవన్ని పోలీసులు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు. ఇకనైన, నగరం, నగర శివారు ప్రాంతాలు మహిళలకు మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పోలీసుల ముందున్న సవాల్. దిశపై ఊహకందని అమానుషం జరిగింది. ఆ దారుణం నిజంగానే సమాజం అంతరాత్మను కదిలించింది. కానీ, ఈ ఘటనలో పోలీసులూ, వ్యవస్థ తప్పును ఎత్తిచూపుతున్నప్పుడు ప్రజలుగా మన బాధ్యతను, తప్పును గుర్తించాలి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఇప్పటికీ భాగ్యనగరంలో ఒంటరి మహిళలకు ఏదోరూపంలో ముప్పు వెంటాడుతూనే ఉంది. కాబట్టి, ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్లు ధైర్యంగా ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక్కడ దిశను తప్పుబట్టడమో అలా చేయాల్సి ఉండాలి ఇలా చేయాల్సి ఉండాలని చెప్పడం కాదు. ఒకానొక్క క్లిష్టస్థితిలో తను ఉన్నప్పుడు మాటువేసి పక్కా ప్లానింగ్తో మృగాళ్లు ఈ దాడికి పాల్పడినట్టు స్పష్టమవుతూనే ఉంది. ఆ భయానక రాత్రి ఒంటరై.. దిక్కుతోచని స్థితిలో ధైర్యం కోసం చెల్లెలికి ఫోన్ చేసిన దిశ.. అంతకుమించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. మనుషులంతా మంచివాళ్లేననుకొని.. మానవ మృగాళ్లు ముసుగులో తిరుగుతుంటారని గ్రహించి ఉండకపోవచ్చు. మృగాల అమానుషత్వానికి బలై బూడిదగా మిగిలిన దిశ సమాజానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. ఈ ప్రశ్నల పరంపర ఎక్కడ ఆగుతుంది? ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో ఈ ఘటనలో.. ఈ ఘటన తర్వాత మనమేమైనా చెప్పుకోవాల్సింది ప్రశ్నించుకోవాల్సింది ఉందా? నిజాయితీగా చెప్పండి. పోలీసుల సహాయం తీసుకోవడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆపద సమయాల్లో 100కు లేదా 112కు నిర్భయంగా డయల్ చేయండని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఒంటరిగా ప్రయాణించే మన బిడ్డలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నాం? మొబైల్ ఫోన్ ఇస్తున్నాం.. ఏదైనా కష్టమొస్తే మనకో మన బంధువులకో ఫోన్ చేయమంటున్నాం కరెక్టే. కానీ, ఇంకా ముందుకెళ్లి వ్యవస్థ సహాయం తీసుకోగలిగేలా ధైర్యం ఇవ్వగలుగుతున్నామా? ఒంటరి వేళలో నిర్భయంగా ఉండేగలిగే ధైర్యాన్ని, వ్యవస్థ నుంచి నిస్సంకోచంగా సహాయం కోరే పరిణతిని మనం కల్పిస్తున్నామా? ఆడపిల్లల్ని ఎన్ని కట్టుబాట్లలో పెంచుతున్నాం. నీకు ఏదైనా ఆపద వస్తే పోలీసులకు ఫోన్ చేసి సహాయం తీసుకోమని చెప్పగలుగుతున్నామా? మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ సాధనమే కాదు.. సరిగ్గా వాడుకుంటే బలమైన ఆయుధం కూడా. మొబైల్ఫోన్, ఇంటర్నెట్ ఉంటే ప్రపంచమే అరచేతుల్లో ఉంటుంది. ఎవరైనా క్షణాల్లో ఆన్లైన్లోకి రావొచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొచ్చు. చుట్టుపక్కల ఎవరైనా స్నేహితులున్నా వారి సహాయం తీసుకోవచ్చు. తన లోకేషన్ షేర్ చేసి..యావత్ ప్రపంచానికి తానున్న పరిస్థితిని వివరించవచ్చు. చెప్పలేం ఏదైనా సహాయం దొరకపోదా? కానీ, ఆపదలో ఉన్నానని చెప్పి.. సమయానుకూలంగా సహాయం తీసుకోగలిగే ధైర్యాన్నైనా మనం ఇవ్వగలుతున్నామా? ఒకవేళ ఆపద సంభవిస్తే మన ఫోన్ని ఎలా వాడాలన్నది ఎవరైనా గ్రౌండ్లెవల్లో అవగాహన కల్పిస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మన బిడ్డల్ని సుశిక్షితులను చేసుకోవడం లేదు. ధైర్యంగా పెంచడం లేదు. కట్టుబాట్ల పేరిట అమాయకంగా పెంచుతున్నాం. ఆ అమాయకులను ఇలాంటి మానవ మృగాలు ఇప్పటికీ కబళిస్తూనే ఉన్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు మనవంతు బాధ్యతగా చేయాల్సింది చాలా ఉంది. ఆవేశమే కాదు ఆలోచనతో వివేచనతో ఈ దారుణ ఘటనపై చర్చించాల్సిన అవసరముంది. -శ్రీకాంత్ కాంటేకర్