Dispute
-
మంచు ఫ్యామిలీ వివాదంపై మల్లాది విష్ణు రియాక్షన్
-
మనోజ్ వెనుక ఏపీ మాజీ మంత్రి..!
-
'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన
ఫ్యామిలీ వివాదం మరింత ముదరడంతో మోహన్ బాబు స్పందించారు. తన ఇంటివద్ద పరిస్థితి ఉద్రిక్తతు దారితీయడంతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. అందరికంటే ఎక్కువగా మనోజ్నే గారాబంగా పెంచినట్లు తెలిపారు. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అందరికంటే బాగా చూసుకున్నా..మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నిన్నే బాగా చూసుకున్నా. కానీ ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. కానీ ఈ రోజు నా మనసు ఆవేదనకు గురైంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నీవల్ల ఈ రోజు మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. నీ ప్రవర్తన చూసి మీ అమ్మ ఏడుస్తోంది. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నువ్వు మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తావా? మన విద్యాలయాల్లో ఎంతమంది గొప్పవాళ్లుగా ఎదిగారు. నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడిగా ఎదిగావ్. నువ్వు మన పనివాళ్లపై ఎందుకు దాడి చేస్తున్నావ్. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్? నా ఆస్తి ఎవరికీ ఇవ్వాలన్నది నా ఇష్టం. ఒకప్పుడు నువ్వు నాకు ఏమి వద్దు అన్నావ్? మరీ ఈ రోజు ఎందుకిలా చేస్తున్నావ్? నువ్వు నా పరువు, ప్రఖ్యాతులు మంటగలిపావ్' అని ఆవేదన వ్యక్తం చేశారు.(ఇది చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!)నా బిడ్డ నన్ను కొట్టలేదు..మోహన్ బాబునా బిడ్డ మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు తెలిపారు. ఈ విషయంపై ఎవరూ కూడా రాద్ధాంతం చేయొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. నా ఆస్తులు ఎవరికీ ఇవ్వాలనేది నా వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్లు.. లేదంటే ఇక్కడే క్షేమంగా ఉంటుందని వెల్లడించారు. దయచేసి మా ఇంటిలో జరిగిన గొడవపై అసత్యాలు ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులు, పోలీసులను మోహన్ బాబు కోరారు.నా ఆస్తులు నా ఇష్టం..మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నువ్వు తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావ్. ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకు తెలుసు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయం దేవాలయంతో సమానం. కాలేజీలో తప్పు జరిగితే ప్రభుత్వం చూసుకుంటుంది. కాలేజీని నెంబర్ వన్గా చేయాలని మీ అన్న ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఆస్తులేమీ వద్దని యాక్టింగ్లోకి వచ్చావ్. ఎంతో ఖర్చుతో విశ్వవిద్యాలయం 30 ఏళ్ల నుంచి నడుపుతున్నాం. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. నన్ను ఎవరు మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం. మందు తాగొచ్చు. నేను ఒకటి రెండు పెగ్గులు తీసుకుంటా. కానీ మందు తాగి ఎవరిని కొట్టలేదని' అన్నారు. -
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
TG: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.జీవో 55 ప్రకారం..గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను.. మల్టీజోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి. ఈ లెక్కన గతంలో 503 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. మొత్తం 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. దివ్యాంగుల కేటగిరీలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు.జీవో 29 ప్రకారం..రిజర్వేషన్ ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు.. రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, తర్వాతి మెరిట్ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 22, 22ఏ ఆధారంగా వీరి ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి.. జీవో 29 ఇచ్చారు.వివాదం ఏమిటి?ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రకారం ఎంపిక చేపట్టారు. అంటే నేరుగా మెరిట్ లిస్టులోని 28,150 మందిని ఎంపిక చేశారు. వీరిని ఓపెన్ కాంపిటీషన్, రిజర్వుడ్ కేటగిరీలు విభజించారు.ఇందులో రిజర్వుడ్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. కింది మెరిట్ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా.. 31,383 మంది అభ్యర్థులను కమిషన్ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరగడం, అందులో రిజర్వుడ్ కేటగిరీలవారు చాలినంత మంది లేకపోవడమంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టేనని, ఇది రిజర్వేషన్లకు దెబ్బ అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం! -
ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!
ఫిన్టెక్ స్టార్టప్ భారత్పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ రెండేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అష్నీర్, సంస్థకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇకపై తాను భారత్పేతో ఏ హోదాలో కొనసాగరు. కంపెనీలోని తన షేర్లను కుటుంబ ట్రస్ట్కు బదిలీ చేస్తారు. ఇరువైపులా ఉన్న చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోనున్నారు.అసలేం జరిగిందంటే..భారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్పే ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్లో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది.ఈ నేపథ్యంలో అష్నీర్ సంస్థతో రెండేళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. సంస్థ కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇకపై గ్రోవర్కు భారత్పేతో సంబంధం ఉండదు. తాను కంపెనీలో ఏ హోదాలోనూ కొనసాగరు. గ్రోవర్ షేర్లు ఫ్యామిలీ ట్రస్ట్కి బదిలీ చేయబడతాయి. అందులో కొంతభాగం కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ‘రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్’కు బదిలీ చేయనున్నారు.ఇదీ చదవండి: యాపిల్కు రూ.1.29 లక్షల జరిమానా‘భారత్పేతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకున్నాను. సంస్థ వృద్ధికి సరైన దిశలో పాటుపడుతున్న మేనేజ్మెంట్, బోర్డు సభ్యులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపై సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నాను. నాకు చెందిన కొన్ని షేర్లను నా ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంస్థతో ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేసుకున్నాం’ అని ఎక్స్లో ప్రకటించారు.I have reached a decisive settlement with BharatPe. I repose my faith in the management and board, who are doing great work in taking BharatPe forward in the right direction. I continue to remain aligned with the company's growth andsuccess. I will no longer be associated with… pic.twitter.com/gB3Pla5qQZ— Ashneer Grover (@Ashneer_Grover) September 30, 2024 -
విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులుకుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్ రోహిణిబ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. -
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పోటాపోటీగా సాగునీరు విడుదల
-
వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని వారిది చిత్త వైకల్యం!
‘వైకల్యం’ లేని మనుషులు అరుదు. కొందరికి అంగవైకల్యం, మరికొందరికి చిత్తవైకల్యం. ఎలాంటి వైకల్యమూ లేకపోవడం పరిపూర్ణత అవుతుంది. కాని అదెక్కడ కనిపిస్తుంది? చిత్తవైకల్యం మతిభ్రమణమూ కానక్కర లేదు, మందబుద్దీ కానక్కర లేదు. ఆస్థిర చిత్తాలు మనోవికారాలు ఆలోచనల వైపరీత్యాలు కూడా వైకాల్యాలే. కనుక ఒకరిని చూసి మరొకరు సానుభూతి చూపించ వలసిందేమి లేదు.వైకల్యాలు ప్రకృతి సహజంగా భావించి, పరస్పరం ప్రేమించుకొనడానికి, గౌరవించుకొనడానికి అవి అవరోధం కాకుండా చూసుకోవడమే మనం చేయవలసిందీ,చేయగలిగిందీ!‘ అంటూ ‘ మనోనేత్రం ’ పేరుతో వికలాంగుల సమస్యలను వస్తువుగా తీసుకొని, ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్బంగా ( 19 మార్చ్ 1989 ) నేను రచించిన కవితా సంపుటికి తమ అమూల్యమైన అభినందన సందేశం అందిస్తూ ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుకాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి సివిల్స్లో దివ్యాంగుల కోటాను విమర్శిస్తూ ‘వికలాంగులు ఐ ఏ ఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు సరిపోరని ’ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సరియైన సమాధానం పెద్దలు పొత్తూరి వారి మాటల్లో స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను.పై అధికారిణి ప్రభుత్వంలో ఉంటూనే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్న, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయే ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చే ఒక ఐ ఏ ఎస్ అకాడమీని విజయవంతంగా నడుపుతున్న మల్లవరపు బాలలత గారు ‘ సివిల్ సర్వంట్ గా తాను పన్నెండేళ్లు పనిచేసానని, ఇలాంటి అధికారులు ఉండబట్టే రాజీనామా చేయాల్సి వచ్చిందని తన బాధను వ్యక్తపరిచారు. అంతేకాదు పై అధికారిణికి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వారు వేసిన ప్రశ్న సమంజసమైంది, అందరూ ఆలోచించవలసింది.అంధులంటే ఎవరో కాదు కళ్లుండీ వాస్తవాన్ని చూడలేని గర్వాంధులు, ధనాందులు , మాదాంధులు ‘ అన్నాను ’ మనోనేత్రం‘ లో నేను 1992 లో కూడా ‘ వికలాంగులలో ‘విజేతలు’ పేరుతో నేను చేసిన మరో రచనలో తమ అంగవైకల్యాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో రాణించిన భక్తకవి సూరదాస్ మొదలుకొని ద్వారం వెంకటస్వామి నాయుడు( వయలిన్ ) ఎస్ జైపాల్ రెడ్డి ( రాజకీయాలు ), సుధాచంద్రన్ ( నాట్యం ), లూయీబ్రెయిల్ ( బ్రెయిల్ లిపి ), మేధావుల్లో మేటి అంటోనియో గ్రాన్సీ , విశ్వకవి భైరన్ వంటి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల పరిచయాలతో పాటు , నాకు గురుతుల్యులు ప్రముఖ హాస్య రచయిత ఎన్వీ గోపాల శాస్త్రి, వికలాంగుల జంట మా అమ్మానాన్నలు ఆండాళమ్మ వేముల రాజంల గురించి కూడా ఇందులో రాశాను.‘లోక కళ్యాణం కోసం కొందరు అడవులకు వెళ్లి ఋషులు మునులైతే సభ్యసమాజంలో ఉంటూ సాటివారిని బాగుచేయడానికి మరికొందరు వికలాంగులు అయ్యారు ’ అన్న నా మాటలను పేర్కొంటూ‘ వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని చిత్తవైకల్యం ఎవరిలోనైనా ఉంటే ’మనోనేత్రం‘ దానిని పోగొట్టగల సాహిత్య ఔషధం’ అంటూ నా రచనకు మంచి కితాబునిచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దలు కీశే పొత్తూరి వెంకటేశ్వర రావు ( 1934 - 2020 ) గారికి శతకోటి వందనాలు !-వేముల ప్రభాకర్ -
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
సింగరేణి వివాదం.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్రెడ్డి తెలిపారు. -
ఛత్తీస్గఢ్ విద్యుత్తో నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి. అదనపు ఖర్చులతో రేటు పెరిగి.. 2017 చివరి నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.ట్రాన్స్మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి. సరిగా విద్యుత్ సరఫరా లేక.. ఛత్తీస్గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్ను అడ్వాన్స్గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్గఢ్కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి. -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
సూడాన్లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
Texas: తీవ్రమవుతున్న సరిహద్దు భద్రత వివాదం
టెక్సాస్: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. షెల్బీ పార్కును టెక్సాస్ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్ విత్ టెక్సాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష -
రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని సందర్శించుకోగలుగుతారు. అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అది.. 1528వ సంవత్సరం బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు. 1885 అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949 వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. 1950 గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. 1950 పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. 1959 వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. 1981 యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986 ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1989 హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. 2002 ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. 2010 అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2019 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. 2019 ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. -
సాగర్పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: నాగార్జున సాగర్ డ్యామ్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని, తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలకు హితవు పలికారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదని.. తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ మేం పోటీ చేయలేదు. అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం మాకు ఉండదు కదా. మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టును మేము వాడుకోం’’ అని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ‘‘నాగార్జున సాగర్పై దండయాత్ర చేసినట్టు ఎల్లోమీడియా వార్తలు రాసింది. ఎవరిష్టం వచ్చినట్టు వారు రాశారు, టీవీల్లో చూపించారు. నిన్న మేము చేపట్టిన చర్య న్యాయమైనది, ధర్మమైనది. రాష్ట్ర విభజ తర్వాత నదీ జలాలను కూడా విభజించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. బీజేపీ కిషన్ రెడ్డి నిన్న కొన్ని వాస్తవాలను కూడా అంగీకరించారు. కానీ ఏపీకి చెందిన కొన్ని పత్రికలు రాద్దాంతం చేశాయి’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. వాస్తవానికి నది, డ్యాంలో సగం మాత్రమే తెలంగాణ పరిధిలో ఉంటుంది. కానీ ఈ చివరి వరకు మొత్తం తెలంగాణ ఆక్రమించింది. చంద్రబాబు హయాంలో చూస్తూ ఊరుకున్నారు. అప్పట్లో నీటి విడుదలకు కూడా తెలంగాణ ఒప్పుకోలేదు. మన భూభాగంలోకి మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఏదో పార్టీకి మేము మద్దతు తెలిపేందుకే ఇలా చేశామని కూడా వార్తలు రాయటం అవివేకం. మేము తెలంగాణలో పోటీ చేయటం లేదు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వటం లేదు. మన హక్కులను చంద్రబాబు తెలంగాణకు ధారపోశారు. ఓటుకు నోటు కేసు వలన ఇలా చేశారు. మన హక్కులను మనం కాపాడుకుంటే దండయాత్ర ఎలా అవుతుంది?’’ అని మంత్రి అంబటి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్ ప్రభుత్వం చేసి సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నాయకులు ఏమీ మాట్లాడలేక పోతున్నారు. పురంధేశ్వరి మాత్రం ఆంధ్రా హక్కులను నీరు గార్చేలా మాట్లాడటం దారుణం. 13వ గేటు వరకు మా హక్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేసి మా హక్కులను మేము సాధించాం. చంద్రబాబు అప్పట్లో తెలంగాణకు లొంగిపోయారు.’’ అని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. ఘటన జరిగింది ఏపీలో ఐతే తెలంగాణ లో కేదు నమోదు ఏంటి?. కృష్ణా బోర్డుకానీ, కేంద్ర జలశక్తి కానీ ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తాం. మా పార్టీ అక్కడ పోటీ చేయటం లేదు. తెలంగాణలో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. రాహుల్, ప్రియాంక గాంధీ సభల్లో కాంగ్రెస్ జెండాలతో పోటీగా టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ఓడించటానికి చంద్రబాబు కులం వారు భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణలో జనసేన అవసరం లేదు, ఏపీలో అవసరమా. పవన్ పిచ్చోడేమోకానీ, ఆయన కులం పిచ్చిది కాదని చంద్రబాబు గుర్తించాలి’’ అంటూ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. -
నిజ్జర్ హత్య కేసు: 'కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం లేదు'
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం కనిపించట్లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల చారిత్రాత్మక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ పౌరుని హత్య విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఏ దేశం పాల్పడకూడదని చెప్పారు. భారత ఏజెంట్ల తర్వాతి లక్ష్యం ఆస్ట్రేలియానేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అలా అని తాను ఊహించలేనని చెప్పారు. కెనడాలో జరిగిన విషయం ఆస్ట్రేలియా వరకు వస్తుందని చెప్పలేమని అన్నారు. ఇతర దేశ ప్రభుత్వం తమ దేశంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు పాల్పడుతున్న అతివాదులకు భారత్ నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అది వారినే అడగాలని దాటవేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. తమ దేశ పౌరుని హత్యలో ఇతర దేశ ప్రమేయం తగదని హెచ్చరికలు చేసింది. ఇది ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ కేసు విచారణలో భారత్ సహకరించేలా ఒప్పించేట్లు ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా కెనడా చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని భారత్ వాదించింది. ఇదీ చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు -
భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం
న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్తో గురువారం భేటీ కానున్నారు. భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ వీరి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఇరుదేశాల మధ్య చెలరేగిన వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు అధికార వర్గాలు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా..? ప్రశ్నించినప్పుడు.. ఈ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని భారత్ను ఇప్పటికే కోరినట్లు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కెనడా, భారత్ రెండు దేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత్తో సంబంధాలు పెంచుకోనున్న నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసులో కెనడాకు అమెరికా మద్దతుగా నిలవడంలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిరాధారమైన ఆరోపణలను భారత్ ఖండించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. ఈ కేసులో భారత్పై ఒత్తిడి పెంచడంలో అమెరికా విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్తో సంబంధాలు పెంచుకునే నేపథ్యంలోనే కెనడాను పక్కకు పెడుతోందని వాదనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో భారత్ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్లింకెన్తో అనధికారికంగా ఇప్పటికే ఒకసారి కలిశారు.కానీ కెనడా-భారత్ వివాదం చర్చకు రాలేదని తెలుస్తోంది. న్యూయార్క్లో జరిగిన క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని మిల్లర్ తెలిపారు. ఇదీ చదవండి: చైనాపై నిరసనల హోరు.. జిన్పింగ్ దిష్టిబొమ్మ దహనం -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'
న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు. భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్లో భాగ్పత్లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తండ్రి ప్రేమకు పరాకాష్ట.. కన్నీరు పెట్టిస్తున్న వాంగ్మూలం!
ఏసీ కూలింగ్ విషయమై ఆ తండ్రీ కొడుకుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన కుమారుడు వెంటనే తుపాకీ తీసుకుని, తండ్రిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులతో ఏమి చెప్పాడో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఏసీ కూలింగ్ విషయమై జరిగిన వివాదంలో కుమారుడు తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకుపోయాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్సర్లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఘటన హోషియార్ పూర్ జిల్లాలోని జలాల్చక్క గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీర్సింగ్ తన కుమారుడు అమర్సింగ్తో పాటు ఇంటిలో ఉంటున్నాడు. వారి ఇంటిలోని ఏసీ సరైన చల్లదనాన్ని అందించడం లేదు. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ‘వాడు తప్పు చేశాడని.. నేను చేయను’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ..‘ నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు. వాడు ఆగ్రహంతో లైసెన్స్ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను’ అని అన్నాడు. ఘటన ఆధారంగా దర్యాప్తు: పోలీసులు ఈ ఉదంతంపై పోలీసు అధికారి బల్విందర్ సింగ్ మాట్లాడుతూ సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఘటనపై తమకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో.. -
శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ఉత్తర ప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉన్నాయి. అయితే కృష్ణ జన్మభూమి కేసు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, దీనిని హైకోర్టు విచారణ చేపట్టాలని హిందూ పిటిషనర్లు కోరారు. మే 3న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీ కృష్ణ జన్మభూమి కేసులపై తామే విచారణ చేపడతామని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు సంబంధిత కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది. కాగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్, రంజనా అగ్నిహోత్రితోపాటు మరో ఏడుగురు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మ స్థాన్ సేవా సంస్థాన్లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు స్థలంపై హిందువులకే హక్కులు ఉంటాయని వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి ఈద్గాను నిర్మించారని తెలిపారు. అలాంటి నిర్మాణం మసీదు కాబోదని పేర్కొన్నారు. ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలకు ఓకే ర్యాంకు.. అదెలా? -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
సాక్షి, జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్ను జిల్లా అధికారులు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మపురి ఎన్నిక వివాదంపై కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ! -
తనకంటే ముందే పూలమాల వేయడంపై ఎమ్మెల్యే కంచర్ల అభ్యంతరం
-
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్స్ మధ్య ముగిసిన వివాదం
న్యూఢిల్లీ: కొత్త టారిఫ్ ఆర్డరుపై (ఎన్టీవో) బ్రాడ్కాస్టర్లు, లోకల్ కేబుల్/మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ మధ్య వివాదం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆపరేటర్లు అంగీకరించారు. దీంతో బ్రాడ్కాస్టర్లు శుక్రవారం తిరిగి చానల్స్ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేట్లను పెంచుతూ రూపొందించిన ఒప్పందాలను కుదుర్చుకోని కేబుల్ ఆపరేటర్లకు డిస్నీ స్టార్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఫీడ్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త ఎన్టీవో ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంతక్రితమే ఫిబ్రవరి 15లోగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా బ్రాడ్కాస్టర్స్ నోటీసులు ఇచ్చారు. కానీ ఆలిండియా రేట్లను 18–35 శాతం మేర పెంచేశాయంటూ డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడీసీఎఫ్) సభ్యులు నిరాకరించడంతో బ్రాడ్కాస్టర్లు సిగ్నల్స్ను నిలిపివేశాయి. -
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడిలో టీడీపీ కార్యాలయం వివాదం
-
కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం
-
ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..
ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్ అప్ వ్యాన్ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్సింగ్గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!) -
మా నాయకుడే అలా అన్నాక ఇక వివాదం ఎక్కడిది!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక చిన్న మాటతో ఆ ఇద్దరి నాయకుల మధ్య రగడకు చెక్ పెట్టారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవలే సీఎం ఆశోక్ గెహ్లాట్.. 2020లో పైలట్ కాంగ్రెస్ పార్టీని కూల్చేయడానికి ప్రయత్నించిన ద్రోహి అని తిట్టిపోశారు. అలాగే పైలట్ కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఐక్యతగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి మాటలు తగదు అంటూ గెహ్లాట్కి కౌంటరిచ్చారు. దీంతో ఇరువురి మధ్య తారా స్థాయిలో విభేధాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఈ వివాదం మీ యాత్రకు అవరోధం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా..ఇది ఎలాంటి ప్రభావం చూపదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ తమ పార్టీకి ఆస్తులు అని, అదే మా పార్టీ అందం అని రాహుల్ చెప్పారు. దీంతో వారి మధ్య ఉన్న రగడ కాస్త గప్చుప్ అంటూ సద్దుమణిగిపోయింది. ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..మా నాయకుడు మమ్మల్ని పార్టీకి ఆస్తులు అని చెప్పినప్పుడూ ఇక మా మధ్య వివాదం ఎక్కడ ఉంటుందని కొట్టిపారేశారు. అంతేగాదు గెహ్లాట్, సచిన్ ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చి.. డిసెంబర్ 4న రాజస్తాన్లో అడుగుపెట్టనున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద విజయాన్ని సాధిస్తుందని పునరుద్ఘాటించారు. మా పార్టీయే మాకు అత్యన్నతమైనది, అది కీర్తీవంతంగా సాగాలని కోరుకుంటున్నాని అన్నారు. అలాగే సచిన్ పైలట్ కూడా ఈ భారత్ జోడోయాత్ర చేస్తున్న రాహుల్కి రాజస్థాన్ ఘన స్వాగతం పలుకుతుందని అన్నారు. (చదవండి: కాంగ్రెస్ సభలో ఎద్దు హల్చల్.. బీజేపీ కుట్రేనటా!) -
కామన్ బోర్డుపై జగడం! యూనివర్సిటీలపై సర్కార్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వివాదాస్పదంగా మారింది. అసలీ బోర్డును ఎందుకు తెచ్చారో చెప్పాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకే బోర్డు ఏర్పాటు జరిగిందా? అని ఆమె సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం మాత్రం అన్ని నిబంధనలకు లోబడే ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు, ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఈ దశలోనే వివాదం మొదలైంది. ఏమిటీ వివాదం? రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో 8 ఏళ్లుగా నియామకాలు జరగలేదు. టీచింగ్, నాన్–టీచింగ్ కలిపి 8 వేల పోస్టుల ఖాళీలున్నాయి. గతంలో వర్సిటీల్లో ఎక్కడికక్కడే సిబ్బందిని నియమించుకునే వాళ్లు. ఈ విధానంలో అవినీతి జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఎవరికి వారు ఇష్టానుసారంగా మార్గదర్శకాలు పెట్టుకోవడం సరికాదంటూ ఉమ్మడి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఇది తమ అధికారాన్ని తగ్గించేలా ఉందంటూ వీసీలూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి బోర్డులో ఉన్నత విద్యామండలి చైర్మన్, ఇతర ఐఏఎస్ అధికారుల పాత్రను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జగడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీల చాన్స్లర్గా ఉండే గవర్నర్ ఉమ్మడి బోర్డుపై మరింత స్పష్టత కోరుతూ విద్యామంత్రికి లేఖ రాసి, వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి బోర్డు పేరుతో ప్రభుత్వం రాజకీయ నియామకాలు చేపట్టే వీలుందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం మధ్యలో వర్సిటీల్లో నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించడం లేదని అంటున్నారు. భారీగా ఖాళీలు... తగ్గుతున్న నాణ్యత వర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడాయి. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాంట్రాక్టు సిబ్బందితో ఏదో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ► 2021 జనవరి 31 నాటికి 11 వర్సిటీల్లో 2,837 పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులున్నారు. ► 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా భర్తీ చేయలేదు. ► శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకే ఒకరున్నారు. ► 11 వర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదవండి: గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం.. మాట్లాడకుండా వెళ్లిపోయిన సబిత -
గవర్నర్కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వాన్ని నడిపే వారికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మధ్య ఏర్పడుతున్న విభేదాలు మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై విద్యాశాఖకు చెందిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును నిలిపివేసి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. గవర్నర్కు ఇలా చేసే అధికారం ఉందా అన్న మీమాంస సహజంగానే వస్తుంది. తమిళసై తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన ఏడు బిల్లులను పెండింగ్లో ఉంచడం సరైన పద్దతి అనిపించదు. చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..? ఆ బిల్లులు ఏవైనా చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని భావిస్తే వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపి, తమ అభ్యంతరాలను తెలియచేసి ఉండవచ్చు. కాని ఆమె ఆలా చేయలేదు. బిల్లుల ఆమోదం తన పరిధిలోనిది అంటూ కొత్త వాదన తీసుకు వచ్చారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఒక భాగమే తప్ప, గవర్నరే ప్రభుత్వం కాదు. గవర్నర్ గౌరవప్రదమైన అధినేతే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం విడుదల చేసే ఏ జిఓలో అయిన బై ఆర్డర్ ఆఫ్ గవర్నర్ అని ఉన్నంత మాత్రాన అన్ని గవర్నరే జారీ చేసినట్లుకాదు తమిళసై కి, ముఖ్యమంత్రి కేసీఆర్కు గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ బేధాభిప్రాయాలు ఇప్పుడు కొత్తరూపం దాల్చుతున్నాయి. ఇటీవలికాలంలో కేసీఆర్ కేంద్రంపైన, బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ రియాక్షన్ ఈ విధంగా ఉందన్నది బహిరంగ రహస్యమే. కొన్ని నెలల క్రితం గవర్నర్ తమిళసై రాష్ట్రంలో టూర్లు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సహకరించని మాట నిజమే. హెలికాఫ్టర్ వంటి సదుపాయం కల్పించడం మానే, కనీసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారు వచ్చి ఆమెకు స్వాగతం పలకడం లేదు. ప్రభుత్వం ఇలా చేయడం కూడా సరికాదు. అలాగే కేసీఆర్ పైన, ప్రభుత్వంపైన గవర్నర్ బహిరంగ వ్యాఖ్యలకు పాల్పడడం వల్ల వివాదాలు ముదురుతున్నాయి. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారినే గవర్నర్లుగా నియమిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ టైమ్లో కూడా పలువురు గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరించారు. ప్రత్యేకించి ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఈ వివాదాలు తీవ్రంగా ఉంటున్నాయి. నాడు ఎన్టీఆర్కు షాక్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి గవర్నర్లు రామ్ లాల్ కాని, కుముద్ బెన్ జోషి వంటివారు కాని అనుసరించిన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురైంది. రామ్ లాల్ అయితే ఏకంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావుకు పట్టంకట్టారు. దాంతో పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి, ఆనాటి ఇందిరాగాంధీనే దిగివచ్చి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరించక తప్పలేదు. కుముద్ బెన్ జోషిపై ఆనాటి మంత్రి శ్రీనివాసులురెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రాజ్భవన్ను కాంగ్రెస్ ఆఫీస్గా మార్చేశారన్న ఆరోపణలు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు పెద్దగా ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకునేవారు కారు. ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా అలాగే జరుగుతోంది. కాని వేరే పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే మాత్రం తేడా వస్తోంది. కేంద్రంతో సఖ్యతతో ఉంటే సరే.. లేకుంటే మాత్రం తగాదానే. గతంలో యూపీలో రమేష్ బండారి అనే గవర్నర్ ఉండేవారు. ఆయన బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ అగ్రనేత వాజ్ పేయి ఢిల్లీలో నిరశన దీక్ష చేశారు. ఇక్కడా బాబు లాబీయింగే.! ఎన్టీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు ఆనాటి ఏపీ గవర్నర్ కృష్ణకాంత్ ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి పదవి పొందడానికి ఇది కూడా కారణమని అంటారు. తదుపరి రాష్ట్రపతి పదవి ఇస్తారని ఆయన ఆశించినా, అది జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురై మనోవేదనతో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన వాజ్ పేయికి మద్దతు ఇచ్చి కేంద్రానికి అనుకూలంగా మారారు. ఆ పలుకుబడితో ఆర్థికవేత్త, ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్ను రాష్ట్ర గవర్నర్గా తెచ్చుకున్నారు. ఆ టైమ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయింది. సుదీర్ఘ కాలం నరసింహాన్ నిజానికి తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్లను నానా రకాలుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో రాజీ కుదుర్చుకోవడానికి మళ్లీ అదే గవర్నర్ను ఏదో రకంగా మేనేజ్ చేయడంలో కూడా ఆయన ఆరితేరారని చెబుతారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు టీడీపీ నేతలు విమర్శించడం కాదు.. దూషించినంత పనిచేశారు. నరసింహన్ రాజకీయవేత్తకాదు. మాజీ బ్యూరోక్రాట్. ఛత్తీస్ గడ్ నుంచి ఏపీకి బదిలిచేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియమించిందని చెబుతుండేవారు. ఆ టైమ్లో టీఆర్ఎస్ వారు ఆయనపై తెలంగాణ ద్రోహి అన్న ముద్రవేసేవారు. కాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆయనతో చాలా సత్సంబందాలు నెరిపారు. వారం, వారం వెళ్లి ఆయనతో భేటీ అయ్యేవారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిభద్రతల అంశం అంతా నరసింహనే చూసుకున్నారన్న భావన ఉండేది. పోలీసు అధికారులు గవర్నర్కు నేరుగా రిపోర్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నరసింహన్కు, ఆయనకు తేడాలు వచ్చాయి. కిరణ్ సిఫారస్ చేసిన ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నరసింహన్ నిరాకరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కిరణ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఇలా జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. సమన్వయం ప్రస్తుతం ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి వివాదాలు లేకుండా, హుందాగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన పట్ల గౌరవ, మర్యాదలతో ప్రవర్తిస్తున్నారు. కాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ఆరంభించినప్పటి నుంచి గవర్నర్కు, ముఖ్యమంత్రికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలో గవర్నర్ తమిళసైని టీఆర్ఎస్ అవమానించిందన్న భావన కూడా ఉంది. దానికి ప్రతిగా గవర్నర్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ఏకంగా సీఎంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగవచ్చు ఛలో హస్తిన.! రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఫోన్ టాపింగ్కు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె ఫిర్యాదు చేసి వచ్చారట. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా ఆమె చర్చించారు. బీజేపీని బదనాం చేయడానికి టీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను తన అధికార పరిధిలో ఉన్నమేరకు తిప్పికొట్టడానికి తమిళసై యత్నిస్తున్నారు. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అక్కడి సీపీఎం ప్రభుత్వంతో పెద్ద గొడవే పెట్టుకున్నారు. మంత్రులను తానే తీసేస్తానంతవరకు వెళ్లారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్లను రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు. తమిళనాడులో గవర్నర్ రవి వివాదాస్పదంగా ప్రవర్తిస్తుండడంతో డిఎంకే ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. మహారాష్ట్రలో బలం లేకపోయినా, కొంతకాలం క్రితం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ క్రియాశీలకంగా ఉండడం పెద్ద వివాదం అయింది. పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ నానా రచ్చ చేసిన ఫలితంగా ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ప్రమోషన్ లభించింది. పరిఢవిల్లాలి ప్రజాస్వామ్యం మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడంలో కూడా గవర్నర్ పాత్ర ఉంటోందన్న భావన ఉంది. ఇది కాంగ్రెస్ టైమ్ లోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలంటే గవర్నర్ల అధికార పరిధిని స్పష్టంగా నిర్వచిస్తూ కేంద్రం చట్టం చేయడమో లేక, రాజ్యాంగంలో మార్పులు చేయడమో జరగకపోతే గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఇలాగే గొడవలు సాగుతుంటాయి. కాని అధికారమే పరమావధిగా మారిన ఈ రోజుల్లో గవర్నర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే కేంద్రంలో ఉన్న అదికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఎప్పటికైనా మారుతుందా అంటే అనుమానమే. మన ప్రజాస్వామ్యంలో గవర్నర్ల వ్యవస్థ ఉండడం ఒకరకంగా మేలు, మరో రకంగా కీడుగా మారింది. దీనికి పరిష్కారం ఇప్పట్లో దొరుకుందా అన్నది ప్రశ్నార్ధకమే. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
స్నేహితుల మధ్య ఘర్షణ ... ఒకరి మృతి
గోరంట్ల: డబ్బు విషయంగా ఘర్షణ పడిన స్నేహితులను విడిపించే క్రమంలో మరో స్నేహితుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సాములపల్లి వద్ద నివాసముంటున్న సుబ్బన్న, అనంతపురానికి చెందిన సురేష్ బావబామ్మర్దులు. తన స్నేహితుడు షాదర్వలితో కలసి బుధవారం సాములపల్లికి సురేష్ వచ్చాడు. డబ్బు విషయంగా సుబ్బన్నతో సురేష్ గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సమయంలో బ్లేడుతో సుబ్బన్న గొంతు కోసేందుకు సురేష్ ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన షాదర్వలి వెంటనే అడు్డకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాదర్వలి తలపై బండరాయితో కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బన్న, షాదర్వలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షాదర్వలి మృతిచెందాడు. సుబ్బన్న పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన సురేష్ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ) -
పోలవరం బ్యాక్ వాటర్ వివాదం పై CWC కీలక నిర్ణయం
-
‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్
‘గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.’ - గవర్నర్ తమిళిసై సందరరాజన్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించడం లేదు. స్పందించడం లేదు. అన్నీ అవమానాలే. నేనెక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ వచ్చి పలకరించడం లేదు. తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం రాకపోతే ఆ సమాచారం ఇవ్వడం లేదు. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎన్నో అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటున్నా. ఒక మహిళా గవర్నర్ను ఎలా వివక్షకు గురి చేశారన్నది గత మూడేళ్ల రాష్ట్ర చరిత్రలో నమోదైంది..’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె రాజ్భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పాలనా విధానాలపై ఆమె ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడూ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని.. ఇవి తననేమీ చేయలేవని తమిళిసై స్పష్టం చేశారు. గౌరవించక పోయినంత మాత్రాన తక్కువైపోనని.. తాను చాలా శక్తివంతురాలినని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గవర్నర్ చెప్పిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. రాజ్భవన్ అంటరాని ప్రాంతమా? ‘‘సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కావాలని అడిగితే చివరిక్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చేదీ, లేనిదీ కనీసం సమాచారం ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి జాతరకు వెళ్లాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరలేదు. ఎక్కడికైనా కారు, రైలు ద్వారా వెళ్తున్నాను. అయినా అసెంబ్లీలో నా ప్రసంగాన్ని నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం నాడు నేను జాతీయ జెండా ఎగురవేయకుండా నిరాకరించారు. ప్రసంగం కాపీ కోరితే ప్రభుత్వం పంపలేదు. నేను నోరు మూసుకుని ఉండాలా? సాధారణ పౌరురాలిగానే ఆ రోజు మాట్లాడాను. గణతంత్ర దినోత్సవానికి సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇది అంటరాని ప్రాంతమా? వివక్ష చూపుతారా? గణతంత్ర వేడుకలను కేవలం రాజ్భవన్కు పరిమితం చేయాలని మంత్రివర్గం ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? పరేడ్ ఎందుకు ఉండకూడదు? అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరేడ్ నిర్వహించాయి. కోవిడ్ మహమ్మారి కేవలం తెలంగాణలోనే ఉందా? రాజకీయ సభలు జరగలేదా? హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు గవర్నర్ ఆమోదించాలని లేదు. నేనేమీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని తిరస్కరించడం లేదు. హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నాను. గవర్నర్ కోటాలోని సర్వీసు కేటగిరీలోకి రాడనే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి నియామకాన్ని అంగీకరించలేదు. గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. తాము ఎన్నుకున్నవారు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు తమ సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మహిళా దర్బార్కు వచ్చిన అర్జీలు, బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గుర్తుంచుకోవాలి. విద్య, వైద్యం, మహిళా భద్రతే.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళల భద్రత అతిపెద్ద సమస్యలు. గతంలో నన్ను కలవడానికి సీఎం కేసీఆర్ వచ్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ పాత్ర అంతకే పరిమితం! రుణాలపై ఆంక్షలు, హామీల అమలు విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను కేవలం రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాను. పలు పరిమితులున్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం కచ్చితంగా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వేదిక, వ్యవస్థలు ఉన్నాయి. గవర్నర్ పాత్ర ప్రేరణ కల్పించడానికే పరిమితం’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. విమోచన దినమే కరెక్టు..! రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తెలంగాణ విమోచన దినం పేరును మార్చిందని. విమోచన దినమే సరైనదని తాను భావిస్తున్నానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ చరిత్రపై తాను అధ్యయనం చేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పాలనా యంత్రాంగం చూసుకుంటుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
ఏమిటీ కంటోన్మెంట్.. వివాదమేంటి?
సాక్షి, హైదరాబాద్: ఈస్టిండియా కంపెనీ పేరిట దేశంలో వ్యాపార కేంద్రాలను స్థాపించిన బ్రిటిషర్లు.. వాటి సంరక్షణ కోసం ప్రత్యేక సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బలగాలు ఉండే స్థావరాలను కంటోన్మెంట్లుగా పిలిచేవారు. అలా నిజాం హయాంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పాటైంది. నిజాం రాజ్యం భారత్లో విలీనమయ్యాక.. కంటోన్మెంట్ సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అందులోని కొన్ని ప్రాంతాలను 1956లో హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ప్రస్తుతం 10వేల ఎకరాల విస్తీర్ణంలో కంటోన్మెంట్ కొనసాగుతోంది. 7వేల ఎకరాలు పూర్తిగా మిలిటరీ ఆధీనంలో ఉండగా, మిగతా 3 వేల ఎకరాల్లో సాధారణ ప్రజల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఆర్మీ నేతృత్వంలోని కంటోన్మెంట్ బోర్డు పాలనలో ఉంటుంది. రోడ్ల మూసివేతతో..: సికింద్రాబాద్ ప్రాంతం నడిబొడ్డున కంటోన్మెంట్ ఉండటంతో.. చుట్టూ ఉన్న ప్రాంతాల మధ్య రాకపోకలకు కంటోన్మెంట్లోని రోడ్లే దిక్కయ్యాయి. అందులో మారేడ్పల్లి నుంచి మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాం తాలకు వెళ్లే రోడ్లను.. ఆరేళ్ల కింద ఆర్మీ అధికారులు భద్రతా కారణాలతో మూసేశారు. స్థానికుల ఆందోళన, సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో.. పగలంతా తెరిచి, రాత్రిళ్లు మూసివేస్తూ వచ్చారు. చివరికి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయదలచినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. స్కైవేకు స్థలంపై వివాదం రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న జింఖానా, పోలో మైదానాలను.. ప్యాట్నీ నుంచి హకీంపేట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు స్కైవేల కోసం.. ఆ రోడ్ల వెంట కంటోన్మెంట్ స్థలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా.. ఆ స్థలాలను రాష్ట్ర సర్కారుకు అప్పగిస్తే.. తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతామని కంటోన్మెంట్ బోర్డు మెలికపెట్టింది. ఏటా రూ.31 కోట్లు సర్వీస్ చార్జీలు ఇవ్వాలని కోరింది. దీనితో భూబదలాయింపు ఆగింది. దీనితోపాటు గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోనూ ఇదే తరహా ఇబ్బందులు ఉన్నాయి. -
ఫ్యూచర్ వివాదంపై ఎన్సీఎల్ఏటీకి అమెజాన్
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేస్రి ఈ విషయం తెలిపారు. అయితే, సత్య ఎంత ఇన్వెస్ట్ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. స్టాక్స్, ఫండ్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడే గ్రో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్లో 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో 251 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,885 కోట్లు) సమీకరించింది. తాజా విడతలో అల్కియోన్, లోన్ పైన్ క్యాపిటల్, స్టెడ్ఫాస్ట్ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సెకోయా క్యాపిటల్, రిబిట్ క్యాపిటల్, వైసీ కంటిన్యుటీ, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ మొదలైనవి కూడా పెట్టుబడులు పెట్టాయి. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
వరికోత.. ఊరినే కోసింది..
మోర్తాడ్ (బాల్కొండ): పచ్చని పంటపొలాలతో కనువిందుచేసే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో సాంఘిక దురాచారం తారస్థాయికి చేరింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి బుధవారం పరస్పరం సాంఘిక బహిష్కరణకు దిగారు. ఇరవై రోజుల కిందట వరి కోత యంత్రాలను అద్దెకిచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చివరకు పరస్పరం బహిష్కరణకు దారితీసింది. వరికోత యంత్రాలు తమ సామాజిక వర్గానికి చెందినవారి పొలాల్లోనే పనిచేయాలని ఒక వర్గం కట్టుబాటు విధించడంతో మరో వర్గం అభ్యంతరం తెలిపింది. అంతకుముందే గ్రామస్తుల మధ్య పలు అంశాలపై భేదాభిప్రాయాలున్నాయి. చివరికి ఒక కులానికి చెందిన సుమారు వంద కుటుంబాలు ఒక సమూహంగా, మిగతా కులాలకు చెందిన 320 కుటుంబాలు మరో సమూహంగా చీలిపోయాయి. ఈ నేపథ్యంలో భూముల కౌలును కూడా రద్దు చేసుకున్నారు. కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఆటోలు ఇతర వ్యాపార సంస్థలను ఎవరికి వారు విభజించుకుని.. ఒక వర్గం వారు మరో వర్గంలోని దుకాణాలకు వెళ్లకుండా కట్టడి చేసుకున్నారు. (చదవండి: స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు) అన్ని కులాల సమూహానికి సంబంధించిన ఆటోలలో ప్రయాణిస్తే రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఒక వర్గం.. తమవారికి కట్టుబాటు విధించింది. మరో పక్క ఒక కులం వర్గం వారికి ఎవరైనా సహకరిస్తే రూ.లక్ష జరిమానా అని మరో వర్గం నిబంధన విధించింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పరచాలని పొరుగు గ్రామాలవారు కోరుతున్నారు. (చదవండి: బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు) -
కేంద్ర గెజిట్ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలం ఎర్రబల్లి వద్ద పొలం వివాదం ఘటనలో అక్బర్ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్ బాషా ఆవేదనపై సీఎం కార్యాలయం స్పందిస్తూ.. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించింది. అక్బర్ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ: ఎస్పీ అన్బురాజన్ అక్బర్ బాషా కుటుంబం.. ఎస్పీ అన్బురాజన్ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ బాషా ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామన్నారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంత కాపాడగలిగామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని.. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి -
Hyderabad: వివాదంలో ఎన్టీఆర్ ట్రస్టుభవన్
-
కుంభమేళాలో కరోనా: రెండుగా చీలిన సాధువులు
సాక్షి, న్యూఢిల్లీ: దేవభూమి ఉత్తరాఖండ్ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంటోంది. హరిద్వార్లో జరుగుతున్న మహా కుంభ్మేళాలో షాహీ స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేసినప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కుంభ్ మేళా కాస్తా కరోనా మేళాగా రూపాంతరం చెందుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ సంఖ్య ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్గా గుర్తించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ కల్లా కరోనా పాజిటివ్ కేసుల వృద్ధిరేటు 8814% గా నమోదైంది. మహా కుంభ్మేళాలో పాల్గొన్న సాధువుల్లో అధికారిక గణాంకాల ప్రకారం 49 మంది సాధువులకు కరోనా సోకగా అందులో రెండవ అతిపెద్ద అఖాడాకు చెందిన ప్రధాన సాధువు మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) చనిపోయారు. ఇది అధికారిక సంఖ్య మాత్రమే. కానీ వైరస్ సోకిన సాధువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. వివిధ అఖాడాల్లో సాధువుల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి అఖాడాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయనున్నారు. మరోవైపు షాహీ స్నానాల అనంతరం మహాకుంభ్ మేళా సూపర్ స్ప్రెడర్గా మారిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో కుంభమేళా సమయంలో 2,483 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. నేటితో కుంభ్మేళా పూర్తి: నిరంజని, ఆనంద్ అఖాడాలు కుంభ్మేళాకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఉత్తరాఖండ్లో కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. గత రెండు వారాలుగా, రాష్ట్రంలో ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారు. అయితే కుంభ్మేళాను నేటితో ముగించనున్నట్లు నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడాలు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దృష్టిలో నేటితో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు. అయితే కుంభమేళా ముగిసిందని ప్రకటించిన ఆయనకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అఖాడాల్లోని ఇతర సాధువులలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు మరో 16 మంది సాధువులను కూడా కరోనా పాజిటివ్గా గుర్తించారు. అదే సమయంలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరికి ఏప్రిల్ 11న కరోనా పాజిటివ్గా తేలింది. ముగింపుపై సాధువుల ఆగ్రహం.. కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్ అఖాడాలు ప్రకటించిన తరువాత, సాధువులలో ప్రతిష్టంభన ఏర్పడింది. కుంభ్ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్ కొనసాగుతుందని ప్రకటించారు. కుంభ్మేళా ఏ ఒక్క సంస్థ లేదా అఖాడాలకు చెందినది కాదని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిరంజని అఖాడా కుంభ్ను రద్దు చేసినట్లు ప్రకటించడంపై బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంజని, ఆనంద్ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్ అఖాడాలు డిమాండ్ చేశాయి. కుంభ్మేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే ఉందని వారు ప్రకటించారు. కుంభ్ ముగిసిందని ప్రకటించిన సాధువు క్షమాపణ చెప్పకపోతే, అతను అఖాడా కౌన్సిల్లో కొనసాగలేడని తేల్చిచెప్పారు. ఏదేమైనా కుంభ్మేళా కొనసాగుతుందని, ఏప్రిల్ 27న బైరాగి సాధువులందరూ షాహీ స్నానాలు చేస్తారని తెలిపారు. -
నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా
సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్పై లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి') ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Veteran music composer #Ilaiyaraaja filed a complaint against Sai Prasad for tampering his musical instruments, notes and valuables by unlawfully entering into his recording studio #PrasadStudios pic.twitter.com/1LyAntffNL — Rajasekar (@sekartweets) July 31, 2020 -
చైనాకు పాశ్చాత్య సెగ
సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఊహించని పరిణామాలేర్పడతాయని కొంతకాలంగా నిపుణులు చేస్తున్న విశ్లేషణల్ని నిజం చేస్తూ అమెరికా పావులు కదుపుతోంది. పెరుగుతున్న చైనా ఆర్థిక శక్తిని అడ్డుకోవడానికి అమెరికా–యూరప్ యూనియన్(ఈయూ)లు బలమైన వ్యూహాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందంటూ గురువారం ఈయూ నేతలతో జరిపిన వీడియో భేటీలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో చేసిన సూచన, అందుకు ఆ దేశాలు సుముఖత కనబర్చడం కీలకమైనది. స్వేచ్ఛాయుత ప్రపంచంవైపుంటారా లేక నిరంకుశ చైనా వైపుంటారా తేల్చుకోమని తాము ఎవరినీ కోరడం లేదని, చైనాయే అందరినీ ఆ పరిస్థితికి నెడుతోందని ఈ సమావేశంలో పాంపియో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఈయూ రెండు పడవ లపై కాళ్లు పెట్టి ప్రయాణిస్తోంది. అమెరికా మాదిరే దానికి కూడా చైనా అనుసరిస్తున్న విధానాలపై చాన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి వుంది. మేధోపరమైన హక్కుల్ని అపహరించడంలో చైనా ముందుం టున్నదని మొన్న జనవరిలో ఈయూ విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వాణిజ్యంలో అది అనుసరిస్తున్న పోటీ విధానాలు కూడా ఈయూకు మింగుడుపడటం లేదు. అయినా చైనాపై వాణిజ్య యుద్ధానికి అమెరికా చేస్తున్న ప్రతిపాదనకు ఈయూ సుముఖత చూపడం లేదు. పైగా మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. వాణిజ్య సంబంధాల విషయంలో, మేధోపరమైన హక్కుల చౌర్యం విషయంలో ఎలాంటి అసంతృప్తివున్నా ఆ సంబంధాలను యధాతథంగా కొన సాగిస్తోంది. ఉద్రిక్తతల్ని పెంచే విధానాలకు దూరంగా వుంటోంది. కానీ రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా వుండవు. ప్రపంచంలోనే ఈయూ అతి పెద్ద వాణిజ్య కూటమి. మొన్న సోమవారం అది చైనాతో జరిపిన చర్చల్లో కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలుపెడదామంటూ ఒత్తిడి తెచ్చింది. అలాగే ఈయూలో పెట్టుబడిని పెంచాలని కోరింది. ఇటీవల ఈయూకు కూడా సభ్యత్వం ఉన్న జీ–7 దేశాల విదేశాంగమంత్రుల భేటీ చేసిన తీర్మానం హాంకాంగ్లో చైనా తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ నెల మొదట్లో ఈయూ ఉన్నత స్థాయి ప్రతినిధి బోరెల్ అమెరికా విదేశాంగమంత్రితో ఆన్లైన్ భేటీ జరిపి చైనాకు వ్యతిరేకంగా అట్లాంటిక్ ప్రాంత దేశాల కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వున్నామని చెప్పడం అమెరికాకు సంతోషం కలిగించే అంశమే. ఈ పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనించడం మన దేశానికి అవసరం. చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గల్వాన్లోయలో దూకుడుగా ప్రవర్తించి మనతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్టే ఇతర దేశాలతోనూ వ్యవహరిస్తోంది. అంతర్జాతీ యంగా కూటములు రూపుదిద్దుకునే ప్రక్రియ ఇంకా ప్రాథమిక స్థాయిలోనేవున్నా, అన్నిటినీ నిశి తంగా పరిశీలిస్తూ మన ప్రయోజనాలకు ఏది తోడ్పడగలదో మన దేశం తేల్చుకోవాల్సివుంటుంది. శుక్రవారం మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే గల్వాన్ లోయలో చైనా తీరుతెన్నులు ఏమాత్రం మారలేదని అర్థమవుతుంది. గల్వాన్లోయ, హాట్స్ప్రింగ్స్, ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల వద్ద ఇప్పటికీ చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) కదలికలు యధాతథంగా వున్నాయని ఆ కథనాలు చెబుతున్నాయి. ఈ నెల 22న కోర్ కమాండర్ల స్థాయి చర్చలు జరిగినా పరిస్థితిలో ఆవగింజంత మార్పు రాలేదు. ఎల్ఏసీ వద్ద సాయుధ బలగాల మోహరింపును అది మే నెలలోనే మొదలుపెట్టిందని తాజాగా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన వెల్లడించింది. ఇదంతా యధావిధిగా కొనసాగిస్తూనే భారత్తో చర్చలకు సిద్ధంగా వున్నామంటూ ఇప్పటికీ అది నంగనాచి కబుర్లు చెబుతోంది. పైగా పరిస్థితి సంక్లిష్టం కావడానికి మన దేశమే కారణమంటోంది. రెండు దేశాల మధ్యా వివిధ సందర్భాల్లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, మరీ ముఖ్యంగా 1993 నాటి ఒప్పం దంలో ‘ఇరు దేశాలూ సైన్యాలను కనిష్ట స్థాయిలో వుంచుకుని, మంచి ఇరుగు పొరుగుగా వుందా మని, స్నేహపూర్వకంగా మెలగుదామ’ని రాసుకున్నా చైనా అందుకు భిన్నమైన పోకడలకు పోతోంది. ఇప్పుడే కాదు... గతంలో అనేక సందర్భాల్లో అది రుజువైంది. చుమార్, దౌలత్బేగ్, డోక్లాం వగైరాల్లో అది వందలసార్లు అతిక్రమణలకు పాల్పడి గిల్లికజ్జాలు పెట్టుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరిగే సూచనలు కనబడటంతో ముందుజాగ్రత్త చర్యగా గల్వాన్ లోయలో బలగాలను పెంచుకుని దబాయింపులకు దిగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి పూర్తి బాధ్యత చైనాదేనంటూ అమెరికా, పాశ్చాత్య దేశాలు విరుచుకు పడుతున్నాయి. హాంకాంగ్లో అది తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఒక్కటవు తున్నాయి. వాణిజ్య, మేధో రంగాల్లో చైనాతో ఆ దేశాలకు వున్న విభేదాలు సరేసరి. ఇలా పలు సమ స్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనాకు వ్యతిరేకంగా భారత్ తమతో జట్టు కడుతుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. మనపట్ల చైనా అనుసరిస్తున్న ధోరణివల్ల అది జరగవచ్చు కూడా. అయితే ఆ దేశాలకు చైనాతో ఏర్పడ్డ విభేదాలకున్న మూలాలు వేరు. మనకు చైనాతో వున్న పొర పొచ్చాల స్వభావం వేరు. స్థానికంగా రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య వచ్చే సరిహద్దు తగాదాల విషయంలో అమెరికా అయినా, ఇతర పాశ్చాత్య దేశాలైనా ఒక స్థాయి వరకూ మాత్రమే మద్దతి స్తాయి. అటు తర్వాత గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తాయి. వాటిని మన చొరవతో మనమే పరిష్కరించుకోగలం తప్ప ఆ దేశాల సాయం పరిమితంగానే వుంటుంది. మనతో సన్నిహితంగా వుంటున్నా పాకిస్తాన్ విషయంలో అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా ఎలా వ్యవహరిస్తున్నదో, చివరకు అప్ఘాన్ అంశంలో అది ఎవరికి మేలుచేసే నిర్ణయం తీసుకున్నదో తెలుస్తూనే వుంది. కనుక మన స్వీయ ప్రయోజనాల పరిరక్షణ గీటురాయిగా మన అడుగులుండాలి. -
ముగిసిన ‘వేంకటేశ్వర’ వివాదం
సాక్షి, నేలకొండపల్లి: కొంత కాలంగా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మరో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. స్థానిక శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం పూజారి లక్ష్మినర్సయ్య సొంత ఖర్చులతో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని దేవాలయంలో ఏర్పాటు చేయించేందుకు పూనుకున్నారు. ఈ విషయంలో ఎవరినీ సంప్రందించకుండానే ప్రతిమను తీసుకొచ్చి దేవాలయంలో ఉంచారు. ఈ విషయాన్ని అక్కడి ఈఓకు, సంబంధిత ఆలయ పూజారికి చెప్పినట్లు లక్ష్మినర్సయ్య వివరించారు. కాగా అసలు ఆ విషయం తమకేమీ తెలియదని మాతో చర్చించలేదని ఈఓ, పూజారులు తెలిపారు. దీంతో ఈ వివాదం కొంత కాలంగా కొనసాగుతోంది. వీరికి తోడు గ్రామ పెద్దలు రెండు వర్గాలకు మద్దతు ఇవ్వటంతో వివాదం తారా స్థాయికి చేరింది. కమిషనర్కు ఫిర్యాదులు అందటంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ దేవాదాయశాఖ స్థపతి వల్లి నాయగాన్ని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గ్రామ సభను నిర్వహించారు. రెండు వర్గాల వారు వారి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా స్థపతి వల్లి నాయగం మాట్లాడుతూ.. ఒకే దేవాలయంలో రెండు విగ్రహాలు ఉండకూడదన్నారు. ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉండవచ్చు కానీ అదే దేవుళ్ల విగ్రహాలు రెండు ఉండకూడదని అన్నారు. దాని వల్ల దేవాలయం సానిధ్యాం పోతుందని అన్నారు. సాంప్రదాయం, నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వయంభుగా వెలిసినందున్న మరో విగ్రహం పెట్టటం మంచిది కాదని, గ్రామం క్షేమం కోసం విగ్రహ ప్రతిష్ఠకు తిరస్కరిస్తున్నామని అన్నారు. సభలో చప్పట్ల ద్వారా నిర్ణయాన్ని అంగీకరించారు. కొంత కాలంగా తారా స్థాయికి చేరిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సభలో అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు, ఈఓ నారాయణచార్యులు, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ ఏడుకొండలు, గ్రామ పెద్ధలు గూడవల్లి రాంబ్రహ్మం, రావెళ్ల సుదర్శన్రావు, చవళం వెంకటేశ్వరరావు, మామిడి వెంకన్న, కాసాని లింగయ్య, మైసా శంకర్, తోట వెంకటేశ్వర్లు, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, బల్లి వెంకన్న, కాండూరి వేణు, కడియాల నరేష్, బాజా నాగేశ్వరరావు, నిమ్మగడ్డ నగేష్, యార్లగడ్డ నాగరాజు, గొలుసు రవి పాల్గొన్నారు. -
చేపల వేటపై వివాదం
సాక్షి, మనుబోలు: మండలంలోని లక్ష్మీనరసింహపురంలో బంగారమ్మ చెరువుకు సంబంధించి చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గూడూరు రూరల్ సీఐ వంశీకృష్ణ, తహసీల్దార్ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బంగారమ్మ చెరువు సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం బంగారమ్మ చెరువు చేపల సొసైటీని ఎల్ఎన్పురం, పిడూరు గ్రామాలకు వేర్వేరుగా విభజించి రెండు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30 మంది సభ్యులతో ఎల్ఎన్పురం సొసైటీని ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా బంగారమ్మ చెరువులో చేపల వేట సాగిస్తున్నా తమకు రూపాయి కూడా పైకం చెల్లించ లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. ఈ ఏడాదైనా తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఓ వర్గం వారు తరచూ చేపల వేటను అడ్డుకుంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్కు చేరుకుంది. దీన్ని రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని చెప్పడంతో స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి సీఐ, మత్స్యశాఖ ఇన్స్పెక్టర్లను పిలిపించి తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్య సంపదను కొల్లగొడుతున్న టీడీపీ నాయకుడు సమాశంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు సొసైటీని తన గుప్పెట్లో పెట్టుకుని తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మత్స్య సంపదను కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే కొందరికి కొద్దిగా నగదు ఇచ్చి మిగిలినదంతా అతను దోచుకుంటున్నాడని తెలిపారు. అధికారులు స్పందించి చెరువులో చేపలపై అందరికీ హక్కు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేపల వేటకు ఎవరికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకూ కోడ్ ఉన్నందున ఎవరూ చెరువులో దిగవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వేట సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెలాఖరు వరకూ ఆగితే చెరువులో నీళ్లు తగ్గి చేపలు చనిపోతాయని కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ చెరువులను పరిశీలించి నివేదక ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశించారు. నివేదకను కలెక్టర్కు పంపించి అనుమతి ఇచ్చిన తరువాతే వేటకు దిగాలని సూచించారు. ఇరు వర్గాల ఘర్షణకు దిగితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
చీరాల ఇరిగేషన్లో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, చీరాల: చీరాల ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈ కి, సిబ్బందికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరిగేషన్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.వెంకటరాజు కార్యాలయం యూడీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మిగిలిన ఉద్యోగులపై కూడా అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని, ఏదైనా చెబితే ఎదురు మాట్లాడుతున్నారని, అందుకే తాను కులం పేరుతో తిట్టాడని యూడీసీ హేమంత్కుమార్పై అట్రాసిటీ కేసు పెట్టానని ఉన్నతాధికారులకు ఈఈ చెప్పుకున్నట్లు సమాచారం. నిత్యం తమను పిలిపించి కాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగుల ముందు అవమానకరంగా మాట్లాడుతూ ఈఈ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని యూడీసీ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈఈ అకారణంగా తమను దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం యూడీసీపై వేధింపులకు పాల్పడటంతో పాటుగా చొక్కా పట్టుకుని దుర్బాషలాడుతూ కర్ర తీసుకొని ఈఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉద్యోగులంతా ఈఈని ప్రశ్నించారు. ఈఈ మాత్రం తనను యూడీసీ కులంపేరుతో దూషించి దాడికి యత్నించాడని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అట్రాసిటీ కేసు పెట్టినట్లు చెబుతున్నారు. యూనియన్ నాయకులను కలిసిన సిబ్బంది ఇరిగేషన్ చీరాల డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసరావును ఒంగోలులో కలిసి ఈఈ ఆగడాలను, వేధింపులను వివరించారు. దీనిపై ఎన్జీవో నేతలు ఈఈతో మాట్లాడితే యూడీసీపై పెట్టిన కేసును మాత్రం వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పాడు. తాను ఇచ్చిన కేసు రిజిస్టర్ చేయాల్సిందేనని డీఎస్పీ వద్ద పట్టుబట్టాడు. ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కింది స్థాయి ఉద్యోగులు సరిగా పనిచేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, సంవత్సర కాలంగా ఉన్నతాధికారులను సైతం తిట్టుకుంటూ తమపై అరాచకంగా ఈఈ ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన అనారోగ్యంతో బాధ్యతలు తీసుకున్నాడని, ఇరిగేషన్ గెస్ట్హౌస్లోనే సంవత్సరం అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి ఫైళ్లు తీసుకుని గెస్ట్హౌస్లోకి తాము వెళ్లాల్సి వస్తుందని, ఏదో ఒక వంక చూపించి తిట్టడం పరిపాటిగా మారిందని ఉద్యోగులు తెలిపారు. పొన్నూరులో పనిచేస్తున్న ఏఈ నాగేశ్వరావు ప్రతి నిత్యం ఈఈ కార్యాలయంలోనే ఉంటూ ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ చేయాల్సిన పనులన్నీ తాను చేస్తూ కార్యాలయంలో ఎవ్వరికీ ఏ పనీ చేతకాదని చాడీలు ఈఈకి చెబుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. చీరాల డ్రైనేజీ ఈఈ నుంచి తమకు రక్షణ కల్పించాలని లేకుండా ఉమ్మడి సెలవులు పెడతామని ఉద్యోగులు అంటున్నారు. యూడీసీని తిట్టిన మాట వాస్తవమే కానీ.. చీరాల డ్రైనేజీ కార్యాలయంలో పనిచేస్తున్న యూడీసీ హేమంత్కుమార్ బిల్లుల విషయంలో నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఐటీ రిటన్స్ విషయంలో ఈఈగా నాకు అధికారం లేదు. ఈ విషయమై యూడీసీతో మాట్లాడుతూ పనిలో నిబద్దత ఉండాలని, పనికిమాలిని పనులు చేయవద్దని తిట్టిన మాట వాస్తవమే. అయితే యూడీసీ మాత్రం తనను బూతులు తిట్టడంతో పాటుగా దాడికి యత్నించి కులం పేరుతో దూషించాడు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచిస్తే నాపై దాడికి యత్నించి, కులం పేరుతో దూషించాడు. అందుకే అట్రాసిటీ కేసు పెట్టా. పనిచేయని ఉద్యోగులు ఎవ్వరినీ విడిచి పెట్టను. -బి.వెంకటరాజు, డ్రైనేజీ ఈఈ, చీరాల. -
వివాదంలో దీప్వీర్ల వివాహం
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు దీపికా పదుకోన్ - రణ్వీర్ సింగ్. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమ పక్షులుగా విహరించిన వీరు చివరకూ ఈ ఏడాది నవంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో దీప్వీర్ల వివాహం అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు ఈ జంట. ఇంత అట్టహసంగా జరిగిన వీరి వివాహంపై వచ్చిన ఓ వివాదం ఇప్పుడు నూతన దంపతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. విషయం ఏంటంటే.. కొంకణీ సంప్రదాయం ప్రకారం నవంబర్ 14న వివాహం చేసుకున్న దీప్వీర్లు ఆ తర్వాత నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ అనే కార్యక్రమాన్ని మాత్రం సరిగా జరపలేదని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి మరీ ఈ వేడుకను నిర్వహించారని పేర్కొంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదని, కాని వారు ఆ నియమాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. జీవితాంతం గుర్తిండిపోయే ఈ వేడుక ఇలా వివాదాల పాలు కావడం నూతన దంపతులను కాస్తా ఇబ్బందికర అంశమే అంటున్నారు సన్నిహితులు. వివాహానంతరం ఈ ఆదివారం ముంబై చేరుకున్న దీప్వీర్ జంట బాలీవుడ్ ప్రముఖుల కోసం నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ తగ్గింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామక వివాదం మరో మలుపు తిరిగింది. జోసెఫ్ నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. తాజాగా శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయన సీనియారిటీని తగ్గించింది. కొలీజియం తొలుత జస్టిస్ జోసెఫ్ పేరును, ఆతర్వాత జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్ల పేర్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కానీ కేంద్రం మాత్రం జోసెఫ్ పేరును జాబితాలో మూడోస్థానంలో ఉంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిబంధనల ప్రకారం మొదటగా కొలీజియం సిఫార్సు చేసిన పేర్లనే నోటిఫికేషన్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రచురించాలి. దీంతో కేంద్రం చర్యపై కొలీజియం సభ్యులు సహా పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణరేఖను ప్రభుత్వం దాటిందని మండిపడుతున్నారు. ఈ విషయమై జడ్జీలు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు జడ్జీలు ప్రమాణస్వీకారం చేసేలోపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐపై ఒత్తిడి తీసుకురానున్నారు. జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ విషయమై దీపక్ మిశ్రాతో నేడు సమావేశమై ఈ విషయంలో తమ అభ్యంతరాలను సీజేఐ ముందు ఉంచనుంది. ప్రసుత్తం దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల సీనియారిటీలో జస్టిస్ జోసెఫ్ 45వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సు చేయగా.. ఇతర రాష్ట్రాల నుంచి సుప్రీంకు తగిన ప్రాతినిధ్యం లేదంటూ ఆ ప్రతిపాదనను కేంద్రం తిప్పిపంపింది. దీంతో జోసెఫ్ పేరును కొలీజియం మరోసారి ఆమోదించి పంపడంతో మరో మార్గం లేక కేంద్రం ఆమోదించింది. అయితే మిగతా ఇద్దరు జడ్జీల కంటే ఆయన్ను జూనియర్గా చేస్తూ శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు ఆగస్టు 3న రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇద్దరు న్యాయమూర్తుల కంటే జస్టిస్ జోసెఫ్ జూనియర్గా మారారు. 2016లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలనను జోసెఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జీగా కొట్టివేశారు. ఈ కారణంగానే ఆయన పదోన్నతికి ప్రభుత్వం అడ్డుతగులుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
నీవు నేర్పిన విద్యనే అధ్యక్షా...!
దెబ్బకు దెబ్బ రుచి అంటే ఏమిటో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్కు తాజాగా స్వానుభవానికి వచ్చింది. తన ధృడమైన కరచాలనంతో స్త్రీ, పురుషుడనే తేడా లేకుండా ఇతర దేశాధినేతలను ‘నొక్కిన’ చరిత్ర ఆయనకుంది. ఈ రకమైన ట్రేడ్మార్క్ షేక్హ్యాండ్లతో విదేశీ ప్రముఖులను అదరగొట్టే ట్రంప్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రన్ అదే తరహాలో తన ఉక్కు పిడికిలి బిగించి చేసిన ప్రత్యేక కరచాలనంతో చుక్కలు చూపించాడు. ఇటీవల కెనడాలో జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అరుదైన ఈ దృశ్యం చోటు చేసుకుంది. ట్రంప్ కుడిచేయిని మాక్రన్ ఎంత గట్టిగా, బలంగా నొక్కాడంటే ఎర్రగా కమిలిపోయింది. ఈ షేక్హ్యాండ్ పూర్తయ్యాక ట్రంప్ కుడిచేయి వెనక మాక్రన్ బొటనవేలు గుర్తు ముద్రించుకు పోయేంత దృఢంగా...దాదాపు 30 సెకన్లపాటు సాగిన ఈ కరచాలనంలో తాను పడిన బాధను పళ్ల బిగువున కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారు. కుడికన్ను గీటుతూ ట్రంప్పై తనదే పై చేయి అన్నట్టుగా మాక్రన్ విజయదరహాసం చేశారు. ‘ ఆర్మ్ రెస్లింగ్లో మాక్రన్ను ఓడించడం కొంచెం కష్టమైనదే. అయితే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. మొదటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి’ అంటూ ఈ ఘటన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ షేక్హ్యాండ్లో 71 ఏళ్ల ట్రంప్ 40 ఏళ్ల మాక్రన్తో చేతులు కలిపి ఉంచడానికి పడిన ఇబ్బందికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ట్విటర్లోనైతే ఎడతెగని చర్చలతో పాటు పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. - ‘1980 దశకం నాటి హ్యాండ్షేక్లతో తన సామర్థ్యాన్ని, బలాన్ని చాటుకోవాలని చూస్తున్న ట్రంప్నకు చివరకు మాక్రన్ కరచాలనం రూపంలో గుణపాఠం దొరికినట్టు అయ్యింది’ అంటూ కమ్యూనియ కొమ్యునియ ట్విటర్ అకౌంట్తో స్పందించారు. - ‘ బలప్రయోగంతో కూడిన షేక్హ్యాండ్కు ప్రసిద్ధుడైన ట్రంపే ఇప్పుడు మాక్రన్ చేతుల్లో బాధితుడయ్యాడు. చూడండి..పాపం ట్రంప్ చేతులపై మాక్రన్ వేలి గుర్తులు..శక్తి అనేది బలమైనదని తేలింది’ అని చ్యుంగ్యెయన్ చౌ వ్యాఖ్యానించాడు. - ‘హ్యాండ్షేక్ క్రీడలో మాక్రన్ విజయం సాధించాడు’ అంటూ నిక్ వెన్మీకర్స్ పేర్కొన్నాడు. - ‘ట్రంప్ మార్క్ గొరిల్లా పట్టు కరచాలనానికి మాక్రన్ గట్టి సమాధానమే ఇచ్చినట్టున్నాడు’ అని ఎరిక్ కొలంబస్ మరో వ్యాఖ్యకు సమాధానమిచ్చాడు. - ‘ఇదొ గొప్ప ఫోటో ప్రేం...ట్రంప్ చేతిపై మాక్రన్ బొటనవేలు ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కోరినె పెర్కిన్స్ వ్యాఖ్యానించారు. - ‘ శరీరాకృతిలో పోల్చితే మాక్రన్ చిన్నగా ఉన్నా 71 ఏళ్ల ట్రంప్నకు ఎవరు బాసో తెలియజేశాడు. ఇది నిజంగా అభినందించదగ్గదే’ నని హేచ్ఎంపీఆ స్లేడ్ అన్నాడు. - ‘ట్రంప్ గొంతు చుట్టూ (చేతిపై కాకుండా) మాక్రన్ వేళ్లు లేకపోవడం విచారకరమే’ అంటూ వ్యంగ్యంగా డాన్ క్యాంప్బెల్,, ‘ఈ సారి అవకాశమొస్తే గొంతుపై ఈ ప్రయత్నమే చేయాలి’ అని హాస్యపూర్వకంగా జాన్ స్టీవెన్స్ పేర్కొన్నాడు. అయితే...వీరిద్దరి మధ్య ఇదే మొదటి షేక్హ్యాండ్ కాదు. గతేడాది ప్రాన్స్లో కలుసుకున్నపుడు ఇద్దరి మెటికలు తెల్లగా పాలిపోయే వరకు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఏడాది మొదట్లో మాక్రన్ అధికారిక పర్యటన సందర్భంగా వైట్హౌస్లో చోటు చేసుకున్న ఇద్దరు దేశాధినేతల కరచాలనం కొంత వికారంగా, ఇబ్బందికరంగా మారాక, ఆ తర్వాత అది వారిద్దరి ఆలింగనానికి దారితీసింది. వివిధ దేశాల అధిపతుల అమెరికా పర్యటన సందర్భంగా లేదా ట్రంప్ విదేశ పర్యటనల సందర్భంగా ట్రంప్ అనుసరించే ధోరణి, ప్రదర్శించే పెద్దన్న వైఖరి వల్ల గతంలో వివిధ దేశాల ప్రముఖులు చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వార్తలొచ్చాయి. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ట్రంప్ ఆధిపత్య షేక్హ్యాండ్కు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్రేడ్ మార్క్ ‘ఎలుగుబంటి ఆలింగనం’ (బేర్ హగ్)తో సమాధానమిచ్చేశారని ట్విటర్వేదికగా చర్చ కూడా సాగింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
1.4 కోట్ల మంది సమాచారం బహిర్గతం
న్యూయార్క్: సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ సాంకేతిక సమస్య కారణంగా యూజర్లు తమ స్నేహితులతో పంచుకున్న ఫొటోలు, పోస్ట్లు బహిర్గతమయ్యాయని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఎగన్ తెలిపారు. మే 18 నుంచి 27 వరకూ ఈ సమస్య కారణంగా 1.4 కోట్లమంది యూజర్లు ప్రభావితమయ్యారని చెప్పారు. ఫేస్బుక్లో తమ పోస్ట్లు, ఫొటోలను స్నేహితులు మాత్రమే చూసేలా యూజర్లు పెట్టుకున్న ‘ఫ్రెండ్స్ ఓన్లీ’ సెట్టింగ్ తాజా సాంకేతిక సమస్యతో ఆటోమేటిక్గా ‘పబ్లిక్’ సెట్టింగ్కు మారిపోయిందన్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేపట్టే వీలుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కారు దిగలేదని కొట్టి చంపారు
ముంబై : రోజురోజుకు మనుషుల్లో కోపం, అసహనం ఎంతలా పెరుగుతున్నాయో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. కనీసం 18 ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్లు కారు త్వరగా దిగలేదన్న కోపంతో కారులోని వారిపై దాడి చేయడమే కాక ఒకరి మృతికి కారకులయ్యారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర సింగ్(30) అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాబ్లో చెంబూరు వెళ్దామని కాబ్ మాట్లాడుకుని, అందులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో మరో నలుగురు యువకులు అక్కడకు వచ్చి కారులో ఉన్న సురేంద్ర, అతడి స్నేహితులను వెంటనే కాబ్లోంచి దిగమన్నారు. అందుకు సురేంద్ర, అతని స్నేహితులు నిరాకరించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో ఆ నలుగురు యువకులు సురేంద్ర, అతని స్నేహితులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ గొడవలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సమీప రాజవాడి ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే సురేంద్ర మరణించాడు. విషయం తేలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ‘నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరు మాత్రమే మేజర్. వీరి నలుగురి మీద హత్యానేరం మోపబడింది. ముగ్గురు మైనర్లను డొంగ్రిలోని జూవైనల్ హోమ్కు తరలించాము. మరో వ్యక్తి క్రిష్ణ పొమన్న బొయన్న(18)ను చెంబూరు కాంప్ ఏరియాకు తరలించామ’ని పోలీసు డిప్యూటీ కమిషనర్(6 జోన్) షహాజీ ఉంపా తెలిపారు. -
ప్రాణం కాపాడిన ప్రసాదం..
న్యూఢిల్లీ : ప్రసాదం కోసం ఆగడమే ఆ చిన్నారి చేసుకున్న అదృష్టమేమో. లేకపోతే తల్లిదండ్రులు, సోదరితో పాటు ఆ బాలుడు కూడా ఈ పాటికే మరణించేవాడు. ఆస్తి తగదాల వల్ల ఒక కుటుంబంలోని భార్యాభర్తలు, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ ఢిల్లీలో జరిగింది. అదృష్టవశాత్తు కుమారుడు మాత్రం ఈ సంఘటన నుంచి తప్పించుకోగలిగాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీకి చెందిన కిషోర లాల్కు (74)కు ముగ్గురు కుమారులు. రాకేష్, విక్కి, రాజేష్. వీరంతా దక్షిణ ఢిల్లీలోని గోవిందపూరీలోని తమ 6 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో నివసిస్తున్నారు. కిషోర్ లాల్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చిన్న కొడుకు విక్కి, అతని భార్య లలిత, కూతురు రాంచీ (6), కుమారుడు రిషబ్(3). విక్కి 2016 నుంచి అపార్టమెంట్లోని మొదటి, రెండో అంతస్తులను తన పేరు మీదకు బదాలయించాలని తండ్రి లాల్తో గొడవపడుతున్నాడు. కానీ లాల్ తాను మరణించేవరకూ ఆస్తి పంపకాలకు వీల్లేదన్నాడు. దాంతో విక్కి తన అన్న రాకేష్తో కలిసి తండ్రిని కొట్టారు. అంతేకాక తాను ఆత్మహత్య చేసుకుని అందుకు తండ్రే కారణమని చెప్తానని విక్కి తన తండ్రిని బెదిరించాడు. ఈ విషయం గురించి లాల్ ఢిల్లీ పోలీసు కార్యలయంలోని సీనియర్ సిటిజన్ సెల్లో ఫిర్యాదు కూడా చేశాడు. శనివారం విక్కి, అతని భార్య లలిత ఆస్తి పంపకాల గురించి ముందు తన తల్లి దగ్గర ప్రస్తావించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లి గొడవ పడ్డారు. తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని తండ్రిని బెదిరించారు. దాంతో లాల్ ఉదయం 10.10 గంటలకు పోలీసులకు ఫోన్ చేశాడు. గొడవ సద్దుమణిగిన తర్వాత విక్కి తన ఇంట్లోకి వెళ్లాడు. అతని భార్య పక్క ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలను తీసుకురావడానికి వెళ్లింది. అప్పుడు కూతురు రాంచీ తల్లితో వెళ్లడానికి అంగీకరించింది. కానీ రిషబ్ మాత్రం తాను ప్రసాదం తీసుకొనే వస్తానని తల్లితో పాటు వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. పోలీసులు వచ్చే సమాయానికి విక్కి, అతని భార్య లలిత, కూతురు రాంచీ విషం మింగారు. పోలీసులు వెంటనే భార్యభర్తలను ఒక ఆస్పత్రికి, కూతుర్ని మరొక ఆస్పత్రికి తరలించారు. కానీ ముగ్గిరిలో ఒక్కరూ కూడా బతకలేదని సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమీషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. తల్లిదండ్రులు మరణించిన విషయం అర్థం కానీ రిషబ్ తన తాతనాయనమ్మలతో ఆడుకుంటున్నాడు. చిన్నారి రిషబ్ను తమ ఇద్దరి పిల్లలతోపాటు పెంచుకుంటానని అతని పెదనాన్న రాకేష్ తెలిపారు. అయితే విక్కి గతేడాది 2017, జనవరి 1న కూడా ఆత్యహత్యాయత్నం చేశాడని అతని సోదరులు తెలిపారు. -
మంత్రాలయ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవాలా?
సాక్షి, సతారా : 'న్యాయం కోసం ప్రతి ఒక్క వృద్ధుడు మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిందేనా?' ఈ ప్రశ్న వేసింది చంద్రశేఖర్ జంగం అనే వ్యక్తి. ఆయన వయసు ఇప్పుడు 98 ఏళ్లు. అయితే, ఆయన సామాన్యుడేం కాదు. గొప్ప పోరాటయోధుడు.. యుద్ధ వీరుడు. భారత ఆర్మీలో సైనికుడిగా విశిష్ట సేవలు అందించాడు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. 1971 సుబేదార్ హోదాలో పదవీ విరమణ పొందారు. అయితే, ఒకప్పుడు ఈ దేశం కోసం పోరాడి చివరి మజిలీకి చేరిన సమయంలో ఆయన నోటి నుంచి ఆత్మహత్య మాట ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సమస్య షరా మాములే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టోకరా పెట్టింది. సైనికులకు కేటాయించే భూమిని ఆయనకు కేటాయించలేదు. రెండు సార్లు ఆయన యుద్ధం నిలిచి గెలిచాడుగానీ, తన హక్కుల కోసం మాత్రం సొంత దేశంలోనే 54 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నారు. చివరకు తనకు న్యాయం జరగడం కోసం మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడమంటారా అని ఆవేదనతో ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్ జంగం తొలిసారిగా 1943లో భారత ఆర్మీలో చేరారు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ కింద యుద్ధ ట్యాంకుల విభాగంలో పనిచేశారు. 1962లో ఇండో-చైనా, 1965 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ కూడా స్వీకరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైనికులు స్థలం కొనుక్కునే అవకాశం ఉండటంతో 1964లో 15.5 గుంటల భూమిని సతారాలో కొనుగోలుచేశారు. అందుకు రూ.3,547లు చెల్లించారు. ఇప్పటికీ ఆ రశీదు కూడా ఉంది. అయితే, ఆ భూమిని మాత్రం చంద్రశేకర్కు బదిలీ చేయలేదు. ఆ ప్రొసీజర్ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఆయన 1968 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1971లో ఆయన పదవీ విరమణ పొందాక కూడా ప్రతివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇక ఆ పనిపూర్తికాకపోవడంతో కనీసం తన డబ్బు తనకైనా తిరిగి ఇవ్వాలని 1977 నుంచి అడగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ పని కూడా జరగలేదు. 1983వరకు పోరాడిన వాళ్లు తిరిగి ఆశ వదులుకున్నారు. మళ్లీ చిగురించిన ఆశ సతారాలోని రహీమత్పూర్లో ఉంటున్న చంద్రశేఖర్కు ముగ్గురు కూతుర్లు.. ఇద్దరు కుమారులు. కుమారుల్లో ఒకరు తమకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై గట్టిగా పోరాటం చేయాలనుకున్నారు. ఒక ఎన్జీవో, అఖిల్ భారతీయ వీర్షవ్య లింగాయత్ మహాసంఘ(ఏబీవీఎల్ఎం) సహాయంతో ఆర్టీఐ ద్వారా కొనుగోలు చేసిన భూమి వివరాలు రాబట్టాడు. అయితే, కొన్ని రికార్డులు లభించగా కొన్ని మాత్రం మాయమయ్యాయి. 15.5గుంటల భూమిని వారు కొనుగోలు చేయగా అందులో రోడ్డు విస్తరణకోసం దాదాపు సగానికిపైగా భూమి పోయి ఇప్పుడు 5.5గుంటలు మాత్రం మిగిలినట్లు తెలిసింది. దీంతో తమకు ఇక భూమి దక్కదని నిర్ణయించుకొని వేరే చోట అయినా కనీసం భూమి కేటాయించాలని కోరారు. గత వారం కుటుంబ సభ్యులు ఏబీవీఎల్ఎం చీఫ్ డాక్టర్ విజయ్ జంగమ్తో కలిసి మహారాష్ట్ర విధాన భవన్కు వెళ్లగా అక్కడి రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్కు ఫైల్ పంపించాలని ఆదేశించారు. అయితే, ఈ విషయంపై ఓ సీనియర్ కలెక్టర్ స్పందించి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద విషయం కాకపోయినా ఎందుకో ప్రతిసారి రివ్యూల పేరిట వాయిదాలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. -
కావేరి జలవివాదంపై నేడు సుప్రీంలో విచారణ
-
బదిలీ చేస్తే... రాజీనామా చేస్తాం
కడప కార్పొరేషన్: జిల్లాకేంద్రమైన కడపలో తహసీల్దార్ బదిలీ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. అదికాస్తా పెనుతుపానులా మారి అ«ధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలకు మరోసారి ఆజ్యం పోసింది. ఇదివరకే ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ నేతల మధ్య ఈ వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. కడప నగరంలో ఇటీవల పంపిణీ చేసిన ఇంటిస్థలాల విషయమే దీనికి కేంద్ర బిందువుగా మారింది. పట్టాల పంపిణీలో అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడం, వామపక్షాలు పక్కా ఆధారాలిస్తామని వరుస ఆందోళనలు చేస్తుండటంతో కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. త్వరలో జరిగే బదిలీల్లో తహసీల్దార్ను బదిలీ చేయనున్నట్లు కూడా సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఇదే తరహా వైఖరితో టీడీపీలోని ఓ వర్గం కూడా ఉంది. కొన్ని డివిజన్లలోనే పట్టాలిచ్చారని, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి, కొందరు జన్మభూమి కమిటీ సభ్యులకు మాత్రమే ఇచ్చారని ప్రముఖ పదవిలో ఉన్న ఓ నాయకుడు, రాష్ట్రస్థాయి పార్టీ పదవుల్లో ఉన్న ప్రముఖులు వాదిస్తున్నారు. తమ మాట పెడచెవిన పెట్టారని, డబ్బులు తీసుకొని పట్టాలిచ్చారని ఆరోపిస్తూ వారు తహసీల్దార్ను బదిలీ చేయాల్సిందిగా పైస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. తహసీల్దార్ పంపితే ఊరుకోం ఇదిలా ఉండగా అందులో తహసీల్దార్ తప్పేమీ లేదని, నిష్పక్షపాతంగానే పట్టా ల పంపిణీ జరిగిందని మరో వర్గం వాదిస్తోంది. తమకు సహాయం చేశారనే కారణంతో తహసీల్దార్ను బదిలీ చేస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు కలెక్టర్ను కలిసినట్లు తెలిసింది. రాజీనామా లేఖలను వారు తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ను బదిలీ చేసే పక్షమైతే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడపలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలో తహసీల్దార్ బదిలీ వ్యవహారం మరిన్ని చీలికలు తెచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అ«ధికారపార్టీ నాయకులు వ్యవహారం జిల్లా ఉన్నతాధికారిని సంకట స్థితిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆ తహసీల్దార్ను బదిలీ చేస్తే ఒక తంటా, చేయకపోతే మరో తంటా అనే విధంగా పరిçస్థితి తయారైంది. ఈ పరిస్థితిలో కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. -
100 కోట్ల క్లబ్ చేరువలో పద్మావత్
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్ వివాదాల నడుమ విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీపికా పడుకోన్ టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్లో చేరనుంది. బుధవారం ప్రీమియర్ షోల ద్వారానే రూ 5 కోట్లు రాబట్టిన పద్మావత్ గురువారం రూ 19 కోట్లు, శుక్రవారం రూ 32 కోట్లు, శనివారం రూ 27 కోట్లు కొల్లగొట్టి మొత్తం రూ 83 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం వసూళ్లు కలుపుకుంటే మూవీ 100 కోట్ల క్లబ్లో చేరుతుందని స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించారంటూ పద్మావత్ మూవీని రాజపుత్రులు, హిందూ సంస్థలు నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు సైతం చిత్ర విడుదలను నిషేధిస్తున్నట్టు ప్రకటించినా సుప్రీం గ్రీన్సిగ్నల్తో వివాదాల నడుమ విడుదలైన పద్మావత్ వసూళ్లలో దూసుకుపోతుండటం పట్ల చిత్ర యూనిట్ ఊపిరిపీల్చుకుంది. -
రేపటిలోగా పరిష్కారం : అటార్నీ జనరల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు గళమెత్తిన వ్యవహారంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. సర్వోన్నత న్యాయస్ధానం పనితీరుపై న్యాయమూర్తుల ఆక్రోశం నేపథ్యంలో తలెత్తిన సంక్షోభానికి శనివారం తెరపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరూ అపార అనుభవం, ప్రతిభా పాటవాలు కలిగిన విజ్ఞులు..నాకు తెలిసి రేపటితో (శనివారం) మొత్తం వ్యవహారం సమసిపోతుంద’ని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో పరిస్థితి సజావుగా లేదని జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు సీజేఐ దీపక్ మిశ్రాపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు బాహాటంగా సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. -
సినిమా చూడకుండానే విమర్శలా..?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్గా టైటిల్ మార్చుకుని సీబీఎఫ్సీ క్లియరెన్స్ పొందినా సినిమాను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నా పద్మావత్పై అభ్యంతరాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇక సినిమాకు శ్యామ్ బెనెగల్, సుధీర్ మిశ్రా వంటి పిల్మ్ మేకర్లు మద్దతుగా నిలిచారు. చారిత్రక డ్రామాగా తెరకెక్కిన సినిమాపై నానా రాద్ధాంతం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అండగా నిలిచారు. దేశంలో సినీ రూపకర్తలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వీరికి తోడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ సైతం పద్మావత్ సినిమాకు మద్దతు పలికారు. పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు మూవీనే చూడలేదని విరుచుకుపడ్డారు. సినిమాను చూడని వీరందరికీ పద్మావత్లో అంత వివాదాస్పద అంశాలు ఏం గుర్తించారని నిలదీశారు. చిత్ర రూపకర్తలు బాధ్యతాయుత వ్యక్తులను వారు కేవలం ప్రేమనే పంచుతారని వ్యాఖ్యానించారు. -
పిక్నిక్లో వివాదం... దారికాచి దాడి
బొబ్బిలి: పిక్నిక్లో చోటు చేసుకున్న చిన్న వివాదం చినికిచినికి గాలివానై చివరకు కొట్లాటకు దారి తీసింది. ఆదివారం సాయంత్రం రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వర్గానికి చెందిన తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన వివరాల ప్రకారం... పట్టణంలోని గొల్లవీధి, చిక్కాల రెల్లివీధులకు చెందిన వారు వేర్వేరుగా పిక్నిక్కు వెళ్లారు. బొబ్బిలి మండలం పెంట గ్రామం వద్ద వున్న వేగావతి నదిలో అందరూ సరదాగా స్నానానికి దిగారు. పిక్నిక్కు వచ్చిన వారిలో వర్గాల వారీ కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు సరదాగా గడుపుతూ నదిలో కేరింతలు కొడుతున్నారు. ఈ సమయంలో చిక్కాల వీధికి చెందిన జె.శ్రీను అనే వ్యక్తి తన కుమార్తెకు స్నానం చేయిçస్తూ అదుపుతప్పి టీచర్స్ కాలనీ(గొల్లవీధి)కి చెందిన శ్రీను అనే వ్యక్తి మీద పడిపోయాడు. దీంతో క్షమాపణ కోరాడు. దీంతో గొడవ రేగి కులదూషణ చేస్తూ జె.శ్రీను అనే వ్యక్తిపై దాడికి దిగినట్టు చెప్పారు. అప్పటికి ఇరువర్గాలనూ అక్కడున్న వారు సముదాయించారు. అప్పటికి ఘర్షణ చల్లబడింది. అయితే సాయంత్రం ఇంటికి వస్తుండగా అప్పయ్యపేట రహదారి మధ్యలో గొల్లవీధికి చెందిన కొంత మందిని తీసుకువచ్చి జె.శ్రీను తదితరులపై దాడికి దిగారు. ఈ సమయంలో ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పలువురు గాయపడ్డారు. చిన్నవారిని కూడా గాయపర్చారని చిక్కాల రెల్లివీధికి చెందిన వారు వాపోయారు. ఈ దాడిలో సోము యామిని, సోము రేణుక, శ్రీను, విష్ణు, ప్రశాంత్, రాజేష్, బంగారి శివ, దానాల కనకరాజు, గురుమూర్తి తదితరులు గాయపడ్డారు. వీరిలో రాజేష్ పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పద్మావతి..థియేటర్ల ఆహుతి’
సాక్షి,ముంబయి: బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిని వివాదాలు వీడలేదు. గతంలో రెండు సందర్భాల్లో మూవీ సెట్లను దగ్ధం చేయడం, దర్శకుడిపై రాజ్పుత్ కర్ని సేన కార్యకర్తలు దాడులకు తెగబడటం తెలిసిందే. తాజాగా రాణి పద్మిని ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను ముందుగా తమకు ప్రదర్శించిన తర్వాతే విడుదల చేయాలని జై రాజ్పుట్ సంఘ్ అల్టిమేటం జారీ చేసింది. తమకు సినిమాను చూపించకుండా రిలీజ్ చేస్తే థియేటర్లను ధగ్థం చేస్తామని హెచ్చరించింది. మూవీలో చరిత్రను వక్రీకరించారా అనే కోణంలో తాము పరిశీలించిన తర్వాతే విడుదలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. చరిత్రను వక్రీకరించడం లేదా రాణీ పద్మావతి, అల్లాద్దీన్ ఖిల్జీ మధ్య రొమాంటిక్ అనుబంధం చూపినా తాము సహించమని హెచ్చరించింది. ఇలాంటి సన్నివేశాలుంటే సినిమా ప్రదర్శించే థియేటర్లను దగ్ధం చేసేందుకు వెనుకాడమని పేర్కొంది. పద్మావతిని అగౌరవపరిచేలా చూపి రాజస్థానీలను అవమానిస్తే చూస్తూ ఉండబోమని జై రాజపుట్ సంఘ్ వ్యవస్థాపకులు భన్వర్ సింగ్ రెటా హెచ్చరించినట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. పద్మావతి మూవీని రాజ్పుట్ సంఘాల ప్రతినిధులకు చూపాలని, రాణీ పద్మావతిని అవమానించేలా ఎలాంటి సన్నివేశాలు లేకుంటే చిత్ర విడుదలకు తాము గ్రీన్సిగ్నల్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 1న పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దళిత నేతల అరెస్ట్
భీమవరం : అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ విమర్శించారు. గరగపర్రు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం చలో గరగపర్రు కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరిహారం అందని 32 మందికి ఆర్థిక సహాయం అందించకపోతే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని రాజేష్ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ధిక్కరించిన నేరానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, తానేటి పుష్పరాజు, పల్లపు వేణు, దారం సురేష్, తోటే సుందరంతో సహా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు చెప్పారు. -
జటిలంగా ‘శ్మశాన వివాదం’
∙పుష్కరఘాట్పై గుడిసెలు వేసేందుకు సిద్ధమైన గ్రామస్తులు ∙సానుకూలంగా పరిష్కరించుకోవాలంటూ అధికారుల బుజ్జగింపులు ∙అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం రేపల్లె: పెనుమూడిలో శ్మశాన వాటిక సమస్య జఠిలంగా మారింది. కృష్ణా పుష్కరాలకు ముందు వరకు పుష్కరఘాట్ వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించవద్దని వ్యతిరేకించిన వర్గం ఘాట్పైనే మృతదేహాలను దహనం చేసేందుకు సిద్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం పుష్కరాల సమయంలో శ్మశనా వాటికను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పుష్కరాల అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెంది మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇక్కడికి తీసుకువస్తే వేరే వర్గం ప్రజలు, అధికారులు ఇక్కడ దహనం చేసేందుకు వీలులేదంటూ వేరే ప్రాంతంలో దహనం చేసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ఈ ప్రాంతం సమీపంలో ప్రజలు నివస్తున్నారన్న ఉద్దేశంతో మృతదేహాలు వేరే ప్రాంతంలో దహనం చేయడం జరిగుతోందని వివరించారు. నాడు వద్దు అన్నవారు.. నాడు దహన కార్యక్రమాలు చేయరాదం టూ వివాదం చేసిన వారే ఇక్కడ దహన సంస్కారాలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేయడానికి వీలేదంటూ, దహనం చేస్తే శిక్షార్హులంటూ తహసీల్దార్ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని దిక్కరిస్తు మృతదేహం దహన ప్రక్రియలు నిర్వహించడంతో ఇబ్బందికర వాతా వరణం నెలకొల్పుతుందన్నారు. మృతదేహం దహనం చేస్తుంటే వాసన రావటంతో పాటు చితి నుంచి బూడిద గాలికి నివాసాల వైపు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుమతి ఇచ్చారని, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు సహాయంతో దహన సంస్కారాలకు పాల్పడటం దారుణమన్నారు. టెంట్లు వేసి ఆందోళనకు దిగిన మహిళలు.. సమీపంలో ప్రజలు నివసిస్తూంటే ఇక్కడ దహన ప్రక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ సమీపంలో నివసిస్తున్న ప్రజలు చిన్నపాటి గుడిసెలు వేసి నిరసన తెలిపారు. ఇక్కడ మేమంతా నివాసం ఉంటే మృతదేహాలను ఏవిధంగా దహ నం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు వాగ్వాదం తలెత్తగా తహసీల్దార్ ఎస్వీ రమణకుమారి, సీఐ పెంచలరెడ్డి గ్రామస్తులను బుజ్జగించినప్పటికి ఫలితం లేకపోయింది. తహసీల్దార్, సీఐలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని అప్పటి వరకు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని కోరారు. -
మంత్రితో వేగలేం
తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పోగొడతారేమోనన్న అనుమానం వస్తోందని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 15వ వార్డులో టీడీపీ అధికారిక కౌన్సిలర్ను కాదని ప్రతిపక్ష పార్టీవారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్టు చుక్కా కన్నమనాయుడు రాజీనామా పత్రాన్ని మున్సి పల్ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ వార్డులో మంత్రి మాణిక్యాలరావు ఓటమికి పనిచేసిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్ రాజీనామా చేస్తున్నారన్నారు. కౌన్సిలర్కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ద్వారా అధికారులను వెంటబెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నిక విధానం ఒకటేనన్నారు. ఎవ్వరికైనా ప్రజలు ఓట్లేసి నెగ్గించాలి్సందేనన్నారు. ఎంపీ సీట్లో మంత్రి కూర్చోలేరు. మంత్రి సీట్లో ఎంపీ కూర్చోలేరు. నా సీట్లో ఎమ్మెల్యే వచ్చి కూర్చోలేరని బొలిశెట్టి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలన్నారు. మంత్రిని గౌరవిస్తూ వస్తున్నామన్నారు. ప్రతీ అభివృద్ధి పనికి మంత్రి మాణిక్యాలరావుకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు. కౌన్సిలర్లు కలిసిఉండటం మంత్రికి ఇష్టంలేదన్నారు. గతంలో నలుగురు బీజేపి కౌన్సిలర్లకు 40 లక్షల రూపాయల నిధులు ఇచ్చారు. ఇటీవల సీఎం ఇచ్చిన కోటి రూపాయల నిధులను ఆరుగురు కౌన్సిలర్లకు మంత్రి ఇచ్చారన్నారు. కనీసం మునిసిపల్ చైర్మన్కు, అధికారులకు తెలియకుండా మంత్రి ఇలా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి ఈ విధంగా పంచుకుంటూ వెళితే మిగిలిన కౌన్సిలర్లకు ఏం సమాధానం చెప్పాలన్నారు. సీఎం గూడెంకు సంబంధించిన పనులు, నిధులు నాకు అప్పగిస్తే మంత్రి ఎలా ఫీలవుతారో.. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో నిధులు, పనులు చేస్తే తాను కూడా అదేవిధంగా ఫీలవుతానన్నారు. అవసరమైతే సామూహిక రాజీనామా మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని బొలిశెట్టి చెప్పారు. ఈ మేరకు కౌన్సిలర్లతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం కనుక మాణిక్యాలరావు కరెక్టు అని చెబితే ఆయన చేతికే రాజీనామా సమర్పించి వస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. మంత్రి వైఖరికి నొచ్చుకొని రాజీనామా చేసిన చుక్కా కన్నమనాయుడు రాజీనామాను ఆమోదిస్తే. ఆయనకు మద్దతుగా సామూహిక రాజీనామా చేస్తామని బొలిశెట్టి చెప్పారు. సమావేశంలో వైస్చైర్మన్ కిల్లాడి ప్రసాద్ , టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘ఆరిమిల్లి’ పంచాయితీ నేటికి వాయిదా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై నమోదైన కేసు విషయమై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వద్ద మంగళవారం జరగాలి్సన పంచాయితీ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం కొవ్వూరులో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి 7.30 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలంతా అమరావతి రావాలని ముఖ్యమంత్రి సూచిం చినట్టు సమాచారం. ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ తన కార్యాలయంలో నిర్బంధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేపై కేసు నమోదైన విషయం విదితమే. దీనిని నిరసిస్తూ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించడం, గన్మెన్లను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తప్పు చేస్తే సీనియర్లు అతనికి తెలియజెప్పాల్సింది పోయి వారు కూడా జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో పలచన అయ్యారు. సోమవారం పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని తాను పరిష్కస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. త్వరలో ఎస్పీల బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ను బదిలీ చేయించడం ద్వారా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన పెనుగొండ సీఐ రామారావుపై డీఐజీ రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు. -
ఆరిమిల్లి వివాదంపై అమరావతిలో పంచాయితీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసు అధికారులను నిర్బంధించిన వివాదంపై మంగళవారం అమరావతిలో పంచాయితీ జరగనుంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది చాలా చిన్న పంచాయితీ అని, దీన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు ఈ విధంగా వివాదాలకు దిగడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఉండే జిల్లా అని, ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు, ఎస్పీలు తమ అనుభవాలను గొప్పగా చెప్పుకుంటారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అధికారులతో వివాదం మంచిది కాదని, ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, ఎస్పీ యువకుడు, కొత్తవాడు కావడంతో ఈ వివాదం వచ్చిందన్నారు. దీనిని తాను పరిష్కరిస్తానని చెప్పారు. ఆదివారం నిర్వహించిన జిల్లా టీడీపీ విస్త్రత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఎస్పీని టార్గెట్ చేయడం, ఆ తర్వాత సమన్వయ కమిటీ సమావేశంలోనూ జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించకుండా ఎస్పీని బదిలీ చేయాలనే అంశంపై రచ్చ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టమంటే ఒక రోజంతా ఒక అధికారి గురించి చర్చిస్తారా అని జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన పర్యటనకు ఎమ్మెల్యేలు ఎవరూ రావద్దని జిల్లా కమిటీ, అనుబంధ కమిటీలపై చర్చించి ఖరారు చేయాలని ఆదేశించారు. మంగళవారం అమరావతికి వస్తే ఈ విషయంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి జిల్లా నేతలకు సూచించారు. దీంతో మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మాత్రమే ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యారు. మిగిలినవారంతా ఏలూరులో సమావేశమై జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించారు. డీజీపీ చెంతకు పోలీస్ అధికారుల సంఘం మరోవైపు పోలీసు అధికారుల సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ఎస్సై, రైటర్ను నిర్బంధించడమే కాకుండా, ఎస్పీని బదిలీ చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టడంపై అసోసియేషన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అమరావతి వెళ్లగా, డీజీపీ ఆంధ్రా, ఒడిశౠ బోర్డర్లో ఉండటంతో కలవడం కుదరలేదు. ముఖ్యమంత్రితోపాటు, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలవాలని పోలీస్ అసోసియేషన్ భావిస్తోంది. -
చెట్టు కింద పెళ్లి..!
- నేడు పోలీసు ఆంక్షల మధ్య ఒకటవనున్న జంట - ఇంటి స్థలం విషయంలో వివాదం సాక్షి, పెద్దపల్లి: ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తన కూతురి వివాహాన్ని చెట్టు కింద చేయాల్సిన పరిస్థితిని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్వాసి వడ్లకొండ రామలక్ష్మయ్య ఎదుర్కొంటున్నాడు. రామలక్ష్మ య్య గీత కార్మికుడు. సొంతిల్లు కూడా లేదు. భార్య రాజేశ్వరి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు కూతుళ్లు సుమలత, సుస్మిత. పెద్ద కూతు రు కుట్టుమిషన్పై పని చేస్తూ కుటుంబానికి చేదో డువాదోడుగా ఉంటోంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తండ్రి ఇబ్బంది పడతాడని భావించిన సుమలత.. ఇంటర్ చదువుతున్న సుస్మిత పెళ్లి ముందుగా చేసేందుకు తండ్రిని ఒప్పించింది. దీంతో కరీంనగర్ జిల్లా చింతకుంట వాసి శ్రావణ్ తో సుస్మిత వివాహం నిశ్చయమైంది. 4 గుంటల స్థలంలో గుడిసె వేసుకొని 17 ఏళ్లుగా అక్కడే ఉం టున్నాడు. కూతురి పెళ్లి కావడంతో ఆ స్థానంలో రేకుల షెడ్డు వేసుకుందామనుకుని గుంతలు తీయడం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన కొందరు వచ్చి.. రామలక్ష్మయ్య స్థలం అసైన్డ్ భూమి అని.. ఈ స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కడుతున్నామని అడ్డుకున్నారు. దీంతో ఇటుకలను అడ్డుగోడగా మార్చుకొని.. అక్కడే ఉంటున్నారు. సుస్మిత నిశ్చితార్థమూ చెట్టు కిందే జరిపించారు. విషయం అధికారులకు చేరడంతో తహసీల్దార్ నాగరాజమ్మ అధికారులతో సర్వే చేయించారు. అది పట్టా భూమి అని తేలింది. అయినా.. గ్రామస్తులు వినకుండా వివాదానికి తెరలేపడంతో చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల ను సర్వే చేయించాలని నిర్ణయించా రు. ఆ స్థలం కింద స్టేటస్కో మెయిం టైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుస్మిత వివాహం జరగాల్సి ఉండగా, సోమవారం తహసీల్దార్, సుల్తానాబాద్ సీఐ వచ్చి రామలక్ష్మయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్థలంలో వివాహం చేస్తే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నందున అక్కడే ఉన్న చెట్టు కింద పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో చెట్టు కిందే సుస్మిత వివాహం చేయనున్నారు. -
మరోపోరాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇప్పటివరకూ గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోగా.. కోర్టులకు వెళ్లలేని వారు ప్రభుత్వం చెల్లించిన అరకొర నష్టపరి హారం వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ఇకపై దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతులు చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు రైతుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి.. ఈ నెల 24న తెడ్లం గ్రామంలో సమావేశమయ్యారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులు, వారికి రావాలి్సన పరిహారం విషయంలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాల్లో అతికించాలని నిర్ణయించారు. కాలం చెల్లిన జీఓ ఆధారంగా ఉద్యాన పంటలకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువల ఆధారంగా పరిహారం పొందేందుకు హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేయాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు ఇచ్చే విధంగా అధికారులతో చర్చలు జరపడంతోపాటు కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న భూములు, నివాస యోగ్యమైన స్థలాలు, వాణిజ్యపరమైన స్థలాలకు అదనపు విలువలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో కోర్టులను ఆశ్రయించాలని తీర్మానించారు. అసైన్డ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ అంశాలపై త్వరలో మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయతలపెట్టిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మరో వర్గం వారు రాత్రికిరాత్రి తరలించడంతో దళి తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా మారి ధర్నా, రాస్తారోకోకు దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని బస్టాండ్ సెంటర్లో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం రాత్రి విగ్రహాన్ని తెచ్చి ఆ ప్రాంతంలో ఉంచారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన కొందరు పంచాయతీ కార్యదర్శి సహకారంతో విగ్రహాన్ని తరలించి పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలిసిన దళితులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ ఇంటికి వెళ్లి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ ఎస్సీ అయినా ఆందోళనకారులకు భయపడి ఇంట్లోంచి రాలే దు. అక్కడి నుంచి దళితులు గ్రామంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ భీమవరం–తాడేపలి్లగూడెం రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో సాగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, దళిత ఐక్యవేదిక, వైఎ స్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సుందర్కుమార్, జిల్లా మాలమహానాడు నాయకులు గుమ్మాపు వరప్రసాద్, మాలమహానాడు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మంతెన యోగీం ద్ర కుమార్ తదితరులు ఇక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ దశలో కొందరు ఆందోళనకారులు వాటర్ ట్యాం క్ ఎక్కి నిరసన తెలిపారు. నరసాపురం సబ్కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆందో ళనకారులతో చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం అభ్యంతరకరమైందని, వేరేచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దళితులు ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించాలని, విగ్రహం తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పెట్టాలని, లేకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటుకు సబ్కలెక్టర్ స్థలం ప్రతిపాదించడంతో ఆందోళన ముగిసింది. ఉండి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి బుట్టాయగూడెం: అంబేడ్కర్పై ప్రేమను తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం తొలగించడంపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమాధానం చెప్పాలని నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. -
పెళ్లి విందుపై వివాదం
హైదరాబాద్: స్వల్ప వివాదం చినికిచినికి గాలివానైంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకినగర్ బస్తీలోని రోడ్డుపై వివాహ విందును ఏర్పాటు చేసుకోవడంపై బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. వారిని బస్తీవాసులు దూషించడంతో ఆగ్రహం చెందిన ఆ యువకులు చిక్కడపల్లి వెళ్లి సుమారు 50మందితో కలిసి వచ్చి బస్తీపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. బస్తీలో బీభత్సం సృష్టించి 2 కార్లు, 5 ఆటోలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారందరినీ గాంధి, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. ఫంక్షన్లోని వంట పాత్రలను పడేసి కుర్చీలను విరగొట్టారు. అల్లరిమూకల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజిని సేకరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
మేకల సంతలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు. -
మేకల సంతలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు. -
సాగర్పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు డెప్యూటీ తహసీల్దార్ ఎల్.విద్యాసాగర్పై సస్పెన్షన్ వేటు పడినట్టు సమాచారం. ఇటీవల కలెక్టర్, రెవెన్యూ అసోసియేషన్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశమైంది. డెప్యూటీ తహసీల్దార్ హోదాలో విద్యాసాగర్ తమను వేధిస్తున్నారంటూ రేషన్ డిపో డీలర్లు కలెక్టర్ కె.భాస్కర్కు శనివారం ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ‘విద్యాసాగర్ మమ్మల్ని ఏమేయ్.. ఒసేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఐదు కిలోల బియ్యం తగ్గినా వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే డిపోకు తాళం వేస్తానని బెదిరిస్తున్నారు’ అంటూ రేషన్ డీలర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏలూరు ఆర్డీఓకు ఆదేశాలిచ్చారు. తిట్లు.. వేధింపులు భరించలేకపోతున్నామని ఫిర్యాదు ఏలూరు మండలానికి చెందిన రేషన్ డీలర్లు, గుమాస్తాలు విద్యాసాగర్ పెట్టే బాధలు భరించలేకపోతున్నామని కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ తల్లిదండ్రులను సైతం చెప్పుకోలేని విధంగా తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క రేషన్ డిపో నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకపోతే డిపోకు తాళాలు వేస్తామని బెదిరిస్తూ బండబూతులు తిడుతున్నారని వారు ఆరోపించారు. గర్బిణి అని కూడా చూడకుండా తనను నోటికి వచ్చినట్టు దూషించి.. 10 కేజీల బియ్యం ఎందుకు తగ్గాయని నిలదీశారని ఈపిచర్ల గంగ అనే డీలర్ వాపోయారు. బస్తాను ఎలుకలు కొరికివేయడం వల్ల బియ్యం కారిపోయి కింద పడ్డాయని, వాటిని పక్కకు తీసి ఉంచానని, వెనక్కి పంపిద్దామనే ఉద్దేశంతో పంపిణీ చేయకుండా డిపోలోనే ఉంచేసినట్టు చెప్పినా వినకుండా కేసు రాస్తే డిపో రద్దవుతుందని అంటూ బెది రించారని ఆమె ఆరోపించింది. డిపో రద్దయితే జీవనోపాధి పోతుందనే భయంతో రూ.5 వేలను సాగర్కు లంచంగా ఇచ్చామని, రెండు రోజుల తరువాత మళ్లీ వచ్చి డిపో రికార్డుల తనిఖీ అంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబైనా, జిల్లా కలెక్టరైనా నాకు గొప్పకాదు. నేను చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఏదో పేరుతో డిపోను రద్దు చేయిస్తానని భయపెడుతున్నారు’ అని డీలర్లు ఎస్.సత్యవతి, ఆర్.విమలాదేవి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, ప్రసాద్, శ్రీరేఖ తదితరులు కలెక్టర్కు వివరించారు. తన తల్లి కోడూరు పార్వతి పక్షవాతంతో బాధపడుతోందని, సహాయం గా తాను డిపోలో పనిచేస్తుంటే సాగర్ వచ్చి బినామీ పేరుతో డిపో నడుపుతున్నావంటూ తన తల్లిని బెదిరించారని, కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని డీలర్ కుమార్తె రమాదేవి వాపోయింది. గతంలో కూడా చెప్పడానికి వీలులేని దుర్భాషలాడుతూ.. లంచాలు ఇవ్వకపోతే డిపోకు తాళం వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు డీలర్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఎవరికీ, ఏ ఒక్కరూ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రేషన్ డిపోల్లో గతంలో అక్రమాలు జరిగేవని, ఈ–పాస్ విధానం అమల్లోకి రావడంతో ఆ పరిస్థితి లేదన్నారు. డీలర్లు ఎవరికీ బయపడాల్సిన పనిలేదని, ఎవరైనా బెదిరిస్తే తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలావుంటే.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో విద్యాసాగర్ ఇటీవల కలెక్టర్కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించడంతోపాటు కలెక్టర్పై ఆరోపణ లు చేశారు. వాటిని కలెక్టర్ తిప్పికొట్టగా, ఆ తర్వాత తహసీల్దార్ల ఒత్తిడితో వర్క్ టు రూల్ చేస్తామన్న అల్టిమేటమ్ నుంచి విద్యాసాగర్ వెనక్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్పై ఒకేసారి డీలర్లంతా వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
టాటా, డొకోమో వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారసంస్థ టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్, జపాన్కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో మధ్య వివాదపరిష్కారానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టాటా టెలీసర్వీసెస్, డొకొమో సేవల నేపథ్యంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా సన్స్, ఎన్టీటీ డొకోమో ఒక అంగీకారానికి వచ్చాయి. ఎన్టీటీ కోరుతున్న పూర్తిస్థాయి నష్టపరిహార మొత్తాన్ని చెల్లించేందుకు ప్రమోటర్ టాటా సన్స్ అంగీకరించింది. 1.17బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటాగ్రూప్ అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. దీంతో సుమారు రెండు సంవత్సరాలకుపైగా సాగుతున్న వివాదాన్ని ముగిసినట్టయింది. తమ మధ్య వివాదాన్ని ముగింపు పలకనున్నట్టు ఇరు సంస్థలు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు డొకోమోపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్ అంగీకరించింది. మార్చి 8 దీనికి సంబంధించిన అప్లికేషన్ ను కోర్టు పరిశీలించనుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి. గత సంవత్సరం టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, డొకొమొ వివాదం పరిష్కారం చర్చలను పునఃప్రారంచింది టాటా గ్రూపు. అయితే విదేశీ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే సంకేతాలను కేంద్రబ్యాంకు వెల్లడించింది. మరోవైపు ఈ వార్తలతో టాటా టెలీ సర్వీసెస్ కౌంటర్కు మార్కెట్లో డిమాండ్ పుట్టింది. ట్రేడర్ల కొనుగోళ్లతో దాదాపు 9 శాతం లాభాలతో కొనసాగుతోంది. టాటా సన్స్ తో కలసి టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రెవెన్యూ రగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో మరోసారి రగడ మొదలైంది. కలెక్టర్ కాటంనేని భాస్కర్, రెవెన్యూ ఉద్యోగుల మధ్య వివాదం రాజుకుంది. గతంలోనూ కలెక్టర్ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా.. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వర్క్ టు రూల్ (నిబంధనల మేరకే పని) పాటిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరు బాగోలేదని, ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై కలెక్టర్ సైతం స్పందించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపాలు, కక్షలు లేవన్నారు. తాను మారేది లేదని.. ఇలాగే ఉంటానని తెగేసి చెప్పారు. ఉద్యోగుల సంఘ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలేనని ఆయన కొట్టిపారేశారు. వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ భాస్కర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్ను కలెక్టర్ దుర్భాషలాడారు. దీనికి నిరసనగా ఏలూరులోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఎన్జీఓ నేతలు సమావేశమయ్యారు. అధికారులు, ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి వీడియో కాన్ఫెరెన్స్లో రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను పాలించే కలెక్టర్ తీరు మారకపోతే భవిష్యత్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెదిరించి పనిచేయించడం మానుకోవాలని.. ప్రేమతో పని చేయించుకోవాలని కోరారు. బెదిరించే ధోరణిలో ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వేషిస్తుందని నాయకులు అన్నారు. సోమవరం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉంటామని స్పష్టం చేశారు. దేనికైనా రెడీ అన్నట్టుగా.. ఎన్జీవో నేతల అల్టిమేటంపై కలెక్టర్ సైతం తీవ్రంగానే స్పందించారు. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలన్న ఆలోచన వారికి ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఆరోపణలు చేయడం ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పడం కొంతమందికి అలవాటుగా మారిందన్నారు. కలెక్టరేట్లో డ్రైవర్గా పనిచేసి.. ఆ తరువాత 12 ఏళ్లపాటు కువైట్లో పనిచేసిన వ్యక్తిని తీసుకువచ్చి ఉద్యోగం ఇవ్వాలని తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి కోరాడని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పరంగా పదవీ విరమణ లబ్ధి చేకూర్చాలని కోరగా.. ఆ పైరవీని తాను అంగీకరించలేదన్నారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్యోగుల విమర్శలపై కలెక్టర్ తీవ్రంగానే ప్రతిస్పందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పడతారా.. లేక మౌనంగా ఉండిపోతారా అన్నది సోమవారం తేలనుంది. పని చేయకపోయినా ఊరుకోవాలా – కలెక్టర్ భాస్కర్ ఏలూరు (సెంట్రల్) : ‘నాకు వ్యక్తిగత కోపాలు, కక్షలు లేవు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న మనం ప్రజ లకు సకాలంలో పనులు చేయాలని చెబుతున్నా. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తు ఊరుకోవాలా. పని చేయమంటే తిట్టినట్టుగా భావిస్తే ఎలా..’ రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటంపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పందిస్తూ అన్న మాటలివి. శనివారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన భాస్కర్ మాట్లాడుతూ జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలనే ఆలోచన ఉద్యోగులకు ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికల ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందన్నారు. త్వరలో ఆ సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధికోసం కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేయడం, తరువాత వచ్చి క్షమాపణలు చెప్పుకోవడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానిం చారు. ఇటువంటి ఆరోపణలకు స్పందిం చాల్సిన అవసరం తనకు లేదని, ప్రజ లకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నానని అన్నారు. భీమవరం తహసీల్దార్ను తాను దుర్భాషలాడానన్న ఆరోపణపై స్పందిస్తూ భీమవరంలో కాపురం ఉంటూ మొగల్తూరులో పనిచేసిన ప్రసాద్ను ఏలూరు బదిలీ చేశామని, ఇక్కడకు కూడా రోజూ భీమవరం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తానంటే ఎలా అని ప్రశ్నిం చారు. ప్రసాద్ ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో భీమవరం బదిలీ చేశామని, అయినా పనితీరులో మార్పు రాలేదన్నారు. అలాంటప్పుడు మందలించకూడదా అని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించనని, అందరూ స్వేచ్ఛగా విధులు నిర్వర్తించుకోవచ్చని, ఆ తరువాత వివిధ శాఖల పనితీరు సమీక్షిస్తానని ఫలితాలు ఎలా ఉంటాయో మీడియా ప్రతినిధులు చూడొచ్చని కలెక్టర్ అన్నారు. ఏలూరు వీఆర్ఓ సర్టిఫికెట్ కోసం ఓ మహిళను రూ.2 వేలు లంచం డిమాండ్ చేస్తే ఆ సొమ్ము తాను ఇచ్చానని చెప్పారు. లం చాలు తీసుకుంటే ఊరుకోవాలా.. అటువంటి వారిని శిక్షించకపోతే సమాజంలో అవినీతి పెరగదా అని ప్రశ్నించారు. ఏయే రోజుల్లో సమీక్షిస్తానో ముందుగానే తెలియచేశామని, అధికారులు వారంలో రెండుసార్లు మించి సమావేశాలకు హాజరుకావాల్సిన పనిలేదని అన్నారు. మండల స్థాయి అధికారులతో వారంలో రెండుసార్లు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రూ.లక్షలు ఖర్చు చేసి రూ.కోట్లు సంపాదించాలనే ఆలోచనతో ఉండే అధికారులు తనకు అవసరం లేదని, నీతి, నిజాయితీలతో ప్రజలకు సేవలందించే అధికారులు కావాలని అన్నారు. వర్క్ టు రూల్ పాటిస్తాం – రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటం ఏలూరు (మెట్రో) : ‘కలెక్టర్ తీరు మారాలి. లేదంటే మేమే మారతాం’ అంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్పై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా రెవెన్యూ భవనంలో శనివారం కీలక సమావేశం జరిగింది. కలెక్టర్ ప్రవర్తన, ఉద్యోగులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తీరుపై అసోసియేషన్ నాయకులు నిరసన గళం విప్పారు. భాస్కర్ తీరుతో విసిగిపోతున్నామని.. ఆయన పద్ధతి మార్చుకోకుంటే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని ప్రకటించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సోమవారం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తామని వెల్లడించారు. విధుల విషయంలో చిన్నచిన్న పొరపాట్లు, తప్పిదాలు ఏ ఉద్యోగికైనా సహజమని.. వాటిని పెద్దగా చూస్తూ కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బాధ్యత గల హోదాలో ఉండి.. పని వేళలను కనీసం గుర్తించకుండా ‘డయల్ యువర్ కలెక్టర్’ అంటూ ఉదయాన్నే కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. రాత్రి వేళ వీడియో కాన్ఫెరెన్స్లు ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల రెవెన్యూ ఉద్యోగులంతా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్ను జిల్లా అధికారులంతా చూస్తుం డగా కలెక్టర్ దుర్భాషలాడారని, గతంలోనూ అనేక మందితో నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. సమావేశంలో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఏ నరసింహరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జీవీవీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ, పెదపాడు తహసీల్దార్ వీజీఎస్ కుమార్, అసోసియేట్ కార్యదర్శి, పెరవలి తహసీల్దార్ వై.జితేంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జీలుగుమిల్లి తహసీల్దార్ ఎం.రాజశేఖర్, కుకునూరు కార్యాలయ ఏఓ సుబ్బారావు, గోపాలపురం తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి, అత్తిలి తహసీల్దార్ జి.కనకరాజు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్కుమార్ పాల్గొన్నారు.