energy
-
UPI లాంటి మరో విప్లవం.. ఆధార్ సృష్టికర్త అంచనా
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తరహాలో తదుపరి విప్లవాన్ని భారత ఇంధన రంగం చూస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా ఎదిగేందుకు వీలుగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను విస్తృతంగా అమలు చేస్తున్న విషయాన్ని పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ వివరించారు."మనం సాధారణంగా తక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాం.. నిల్వ చేస్తుంటాం. మీరు ఎల్పీజీ సిలిండర్ కొంటున్నారంటే ప్యాకేజింగ్ చేసిన ఇంధనాన్ని కొంటున్నట్టు. కానీ విద్యుత్ మాత్రం గ్రిడ్ నుంచి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాళ్లం. విద్యుత్ అందుబాటులో లేకపోతే జనరేటర్ కొనుక్కోవడమో, నూనె దీపాలు వెలిగించడమో చేస్తుంటాం'' అని నీలేకని చెప్పుకొచ్చారు.ఇప్పుడు ‘రూఫ్ టాప్ సోలార్ ఉండటం వల్ల ప్రతి ఇంటికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈవీ బ్యాటరీ ఉండటం వల్ల ప్రతి ఇల్లు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి, ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారు, అమ్మకందారు అలాగే కొనుగోలుదారు కూడా. కాబట్టి, యూపీఐ మాదిరిగా, మీరు ఇప్పుడు విద్యుత్ను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు" అన్నారాయన. ఇంధన ఉత్పత్తి, వినియోగం వికేంద్రీకరణ వల్ల లక్షలాది మంది సూక్ష్మ ఇంధన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, ఇది ఆర్థిక ఆవిష్కరణలు, వృద్ధికి దోహదపడుతుందని నీలేకని అన్నారు.యూపీఐ విజయ ప్రస్థానందశాబ్దం క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతన్నాయి. గత జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లు దాటాయి. అలాగే వాటి విలువ రూ .23.48 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు దేశాల్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఒక్క గ్రాముతో.. 27 ఏళ్లు బతికేయొచ్చు
కడుపు నిండా భోజనం చేస్తే.. ఓ పూట పనికి సరిపడా శక్తి వచ్చేస్తుంది. మహా అయితే మరికొన్ని గంటలు గడిపేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒకటి తినాల్సిందే. శక్తిని సమకూర్చుకోవాల్సిందే. అరటి పండు తింటే ఇంత, అన్నం తింటే ఇంత అంటూ మన శరీరానికి అందే కేలరీల శక్తిని గురించి లెక్కలేసుకుంటూ ఉంటాం కూడా. కానీ కేవలం ఒక్క గ్రాము.. అంటే అరచేతిలో పట్టేంత పదార్థంతో.. 27 ఏళ్లు బతికేసేంత శక్తి వస్తే!? భలే చిత్రమైన అంశం కదా.. ఇది జస్ట్ కేవలం థియరీ మాత్రమే, నిజంగా చేయగలిగితే మనుషులమంతా ‘ఐరన్ మ్యాన్’ అయిపోవచ్చన్న మాటే!ఏం చేసినా, చేయకున్నా శక్తి ఖర్చు..మనం ఏ పనిచేసినా, ఏమీ చేయకుండా నిద్రపోయినా కూడా మన శరీరంలో శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం, రక్త సరఫరా, శ్వాస తీసుకోవడం, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా దాదాపు అన్ని అవయవాలు దాదాపుగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇందుకోసం శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. ఇక మనం ఏ పనిచేసినా కండరాల్లో శక్తి వినియోగం అవుతుంది. మనం తినే ఆహారం నుంచే ఈ శక్తి శరీరానికి సమకూరుతూ ఉంటుంది.ఉదాహరణకు ఒక అరటి పండు నుంచి 90 కేలరీల శక్తి వస్తుంది. గుడ్డు నుంచి 155 కేలరీలు, వంద గ్రాముల అన్నం నుంచి 130 కేలరీలు, 100 గ్రాముల చికెన్ నుంచి 239 కేలరీల శక్తి అందుతుంది.ఆ ఒక్క గ్రాము.. ఆహారం కాదు!ఒక్క గ్రాముతో 27 ఏళ్లు బతికేయొచ్చని చెప్పినది ఆహారం గురించి కాదు.. అంత శక్తిని ఉత్పత్తి చేయగల యురేనియం నుంచి! అణువిద్యుత్ ఉత్పత్తి, అణ్వాయుధాల తయారీ కోసం యురేని యం వాడటం తెలిసిందే. శాస్త్రవేత్తలు తేల్చిన లెక్కల ప్రకారం... ఒక్క గ్రాము యురేనియం నుంచి సుమారు 1,96,05,985 కేలరీలు.. ఈజీగా చెప్పాలంటే సుమారు 2 కోట్ల కేలరీల శక్తి వస్తుంది. అంటే.. ఏకంగా 27 ఏళ్లపాటు శరీరానికి అవసరమైన శక్తి అంతా అందుతుందన్న మాట.ఐరన్ మ్యాన్ ‘ఆర్క్ రియాక్టర్’ తరహాలో..అయితే యురేనియం నుంచి శక్తి వస్తుందికదా అని నేరుగా తినేయడం అస్సలు సాధ్యం కాదు. అత్యంత ప్రమాదం కూడా. కేవలం 50 మిల్లీగ్రాముల యురేనియం శరీరంలోకి వెళ్లినా... ప్రాణాలు పోయినట్టే. మరి శరీరానికి శక్తి ఎలా? దీనిపైనే శాస్త్రవేత్తలు భిన్నమైన ప్రతిపాదన చేస్తు న్నారు. చిన్న పరిమాణంలో ఉండే అణు రియాక్టర్ను రూపొందించి, శరీరంలో అమర్చడం ద్వారా శక్తి పొందవచ్చట. ఉదాహరణకు.. ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో హీరో క్యారెక్టర్. తన గుండె ఉండే భాగంలో చిన్న పాటి ‘ఆర్క్ రియాక్టర్’ను అమర్చుకుంటాడు. దాని నుంచి వచ్చే శక్తితోనే ఐరన్మ్యాన్ పోరాటాలు, విన్యాసాలు చేస్తుంటాడు.అయినా.. ‘ఆహారం’ తప్పనిసరిగా తినాల్సిందే!ఒకవేళ నిజంగానే ‘ఆర్క్ రియాక్టర్’ వంటిది వచ్చినా.. మనం ఆహారం తీసుకోవడం మాత్రం తప్పదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. మన శరీరం కేవలం కేల రీల శక్తితో మాత్రమే పనిచేయదు. ప్రతి అవయ వం పనితీరుకు, ప్రతి జీవక్రియకు కొన్ని ప్రత్యేక మైన రసాయన సమ్మేళనాలు.. విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి అవసరం. వాటికోసమైనా మనం సమతుల పోషకాహారం తీసుకోక తప్పదు మరి.ఇక మిగిలింది.. యురేనియంతో ‘ఐరన్మ్యాన్’ ఎప్పుడు అవుదామా అని ఎదురుచూడటమే!– సాక్షి సెంట్రల్ డెస్క్ -
రష్యా క్రూడ్తో అమెరికాకు ఇంధనం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడాది కాలంలో 724 మిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును ఇంధనంగా మార్చి అమెరికాకు ఎగుమతి చేసింది. ‘‘2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యకాలంలో 2.8 బిలియన్ యూరోల శుద్ధి చేసిన ఇంధనాన్ని భారత్, టర్కిలోని ఆరు రిఫైనరీల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో 1.3 బిలియన్ యూరోల విలువ చేసే ఇంధనం రష్యా చమురుతో తయారైనది’’అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ యూనిట్ల నుంచి అమెరికా రెండు బిలియన్ యూరోల పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకోగా.. ఇందులో 724 మిలియన్ యూరోల (రూ.6,733 కోట్లు సుమారు) విలువైన ఇంధనం రష్యా ముడి చమురు ఆధారితమేనని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యా నేరుగా ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గుజరాత్లోని వాదినార్లో రష్యా రోజ్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీకి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. ఈ సంస్థ సైతం గతేడాది కాలంలో అమెరికాకు 184 మిలియన్ యూరోల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ 124 మిలియన్ యూరోల విలువ మేర రష్యా ముడి చమురు ఆధారితమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ ఎంఆర్పీఎల్ సైతం అమెరికాకు 42 మిలియన్ యూరోల విలువైన ఇంధనాన్ని ఎగుమతి చేయగా, ఇందులో 22 మిలియన్ యూరోల మేర రష్యా ముడి చమురుతో చేసిందేనని ఈ నివేదిక తెలిపింది. -
ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి: -
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!యాంటీ ఏజింగ్ టిప్స్లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని చెక్ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు. ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం. జంక్ ఫుడ్కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి. మసాజ్: శారీరక ఆరోగ్యానికి మసాజ్ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు. -
ఇంధన రంగంలో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత ఇంధన రంగం(Energy Sector)లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. వచ్చే అయిదేళ్లలో భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధనానికి మారాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2025లో (ఐఈడబ్ల్యూ 25) వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను సాధించాలన్న లక్ష్యాలు, చమురు .. గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు బిడ్డింగ్ ప్రకటించడం మొదలైనవి దేశీయంగా ఇంధన రంగానికి దన్నుగా నిలుస్తాయని ఆయన చెప్పారు.వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, కొత్త ఆవిష్కరణలను రూపొందించేలా ప్రతిభావంతులను ప్రోత్సహించడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోందని తెలిపారు. ఆర్థికంగాను, రాజకీయంగానూ దేశం పటిష్టంగా ఉందని ప్రధాని వివరించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాబోయే రెండు దశాబ్దాలు చాలా కీలకమని, వచ్చే అయిదేళ్లలో దేశం అనేక మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి దేశం అయిదో స్థానానికి చేరిందని చెప్పారు. ఈఈఎస్ఎల్ ఒప్పందాలు.. ఐఈడబ్ల్యూ సందర్భంగా ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తమ 15వ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలతో రూ. 500 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండొనేషియా–మలేషియా–థాయ్ల్యాండ్ గ్రోత్ ట్రయాంగిల్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (ఐఎంటీ–జీటీ జేబీసీ), గ్రీన్ గ్రోత్ ఏషియా ఫౌండేషన్ (జీజీఏఎఫ్), ఐఐటీ హైదరాబాద్ వీటిలో ఉన్నాయి. విద్యుత్ ఆదా చేసే లైటింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కూలింగ్ సాంకేతికతలు మొదలైన వాటి రూపకల్పనకు ఎంవోయూలు తోడ్పడనున్నాయి. -
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇంధన ఉత్పత్తి పెంపుఅమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్లో అమెరికాను టాప్లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..అంతర్జాతీయ ధరలపై ప్రభావంయూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది. -
దృఢ సంకల్పమే మీ బలం
ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్నిప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లిపోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి.‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్నిప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్ను అనుసరించి ఎక్స్షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్లను ఎంచుకోవచ్చని పేర్కొంది. -
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు. పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. -
నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే ఎందుకు జరుపుకుంటారు?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శక్తి (ఎనర్జీ) వినియోగం తగ్గించడానికి విధా నాలు, వ్యూహాల అభివృద్ధికి సహాయపడే రాజ్యాంగ పరమైన సంస్థ. భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ద్వారా శక్తి ప్రాముఖ్యం గురించి ప్రజలు తెలుసు కోవటానికి, అలాగే తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా ఎక్కువ శక్తిని ఆదా చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రజా జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడం; శక్తి పరిరక్షణ దినోత్సవం లక్ష్యాలుగా చర్చలు, సమావేశాలు, పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇంధన పరిరక్షణ ప్రక్రియను ప్రోత్సహించడం... వంటి ప్రధాన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తూంటుంది. శక్తిని అనవసరమైన వాటికి వాడటాన్ని నివారించడంతో పాటు, తక్కువ శక్తిని ఉపయోగించడం భవిష్యత్తుకు చాలా అవసరం. ప్రతి ఏడాదీ ‘జాతీయ శక్తి వినియోగ దినోత్సవం (నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే)’న్ని డిసెంబర్ 14న భారతదేశం అంతటా జరుపుకొంటారు.2013 నుండి మొత్తం ప్రాథమిక ఇంధన వినియోగంలో చైనా, అమెరికా తరువాత ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్ ఉంది. అలాగే అమెరికా, చైనా తరువాత 2017లో 221 మిలియన్ టన్నుల చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం ప్రాథమిక శక్తిలో దాదాపు 45% నికర శక్తి దిగుమతిదారుగా మన దేశం ఉంది. 2017లో 294.2 మెట్రిక్ టన్ను లతో భారత్ బొగ్గు ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో దాదాపు 80% బొగ్గు నుంచి వస్తుంది. ఇది దేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంలో భారతదేశంరెండవ స్థానంలో ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచ ఇంధన వినియోగంలో 3.4% వాటా కలిగిన భారత్ 6వ స్థానంలో ఉంది. భారతదేశం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి ఎక్కువగా శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశ విద్యుత్ ఉత్ప త్తిలో 80% శిలాజ ఇంధనాల నుండే జరుగుతోంది. చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో మన దేశం ఒకటి. 2035 నాటికి... ప్రపంచ ఇంధన డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 18% పెరుగుదలకు కారణమవుతుంది. భారతదేశపు పెరుగుతున్న ఇంధన డిమాండ్లు పరిమిత దేశీయ చమురు, గ్యాస్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని దేశం తన పునరుత్పాదక, అణు విద్యుత్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతి ష్ఠాత్మక ప్రణాళికలను చేపట్టింది. మన దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్ను కలిగి ఉందన్న సంగతి ఇక్కడ గమనార్హం. శిలాజ ఇంధనాలకు బదులుగా వాడటా నికి ఏ ఒక్క శక్తి వనరూ సిద్ధంగా లేదు.చదవండి: ఇది మాయ కాక మరేమిటి?అందుకే కనీసం గృహ అవసరాలకు వినియోగించే శక్తి పరిమాణాన్ని తగ్గించడం, ఆదా చేయడం వంటి చర్యలతో శక్తి వనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. రోజువారీ అనవసర వాడకాన్ని తగ్గించడం, తగిన సమయములో బల్బులను మార్చడం, స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించడం, శక్తి సామర్థ్య నీటి తాపన ఖర్చులను తగ్గించడం, కార్యాలయ పరికరాలు, ఉపకరణాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటిని ఇన్సులేట్ చేయడం మొదలయిన పద్ధతులు ఇందుకోసం పాటించవచ్చు. - డాక్టర్ పిఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్(డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే) -
పెట్రోల్, డీజిల్పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్తో పెట్రోల్, డీజిల్పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్లోని వడినార్లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్లున్నాయి. -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
అమెరికా ఇంధన మంత్రిగా క్రిస్ రైట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా ఇంధన శాఖ మంత్రిగా క్రిస్ రైట్ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టంప్ర్నకు క్రిస్ రైట్ భారీగా విరాళాలు అందజేశారు. ఆయన ప్రచారానికి సహకరించారు. డెన్వర్లోని లిబర్టీ ఎనర్జీ అనే సంస్థకు క్రిస్ రైట్ సీఈఓగా పని చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. చమురు, గ్యాస్ ఉత్పత్తకి గట్టి మద్దతుదారుడు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు.కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రపంచమంతా శిలాజేతర ఇంధన వనరుల వైపు పరుగులు తీస్తుండగా, ట్రంప్ మాత్రం శిలాజ ఇంధనాలకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇంధన మంత్రిగా క్రిసరైట్ను నియమించడంతో అమెరికా శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరగాలని క్రిస్ రైట్ వాదిస్తున్నారు. ఆయన గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఆయనకు లేదు. క్రిస్ రైట్ను ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్ నియమించడం వెనుక అమెరికాలోని చమురు లాబీ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇంధన భద్రతకు సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ మూడో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది.ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ‘‘సైన్స్, టెక్నాలజీ మొదలుకుని ఇన్నొవేషన్ల దాకా ఆకాశమే హద్దుగా భారత్ సాగుతోంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు తీసుకొచ్చాం. ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాం. మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు. -
ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరం
దేశీయంగా 2030 నాటికి 440 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరమని ఇక్రా తెలిపింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) ఈమేరకు నివేదిక విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధన రంగం ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలో తెలిపింది.ఇక్రా గ్రూప్ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.విక్రమ్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారతదేశం 440 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించింది. అందుకోసం ఏటా రూ.మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 200 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చే ఆరేళ్లలో రెట్టింపు అవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఈ రంగంలో ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 25 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, బస్సులు వరుసగా 40 శాతం, 30 శాతంగా ఉంటాయి. వీటి కోసం భవిష్యత్తులో విద్యుత్ వినియోగం పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చదేశీయంగా పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా తయారీ ఊపందుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో విద్యుత్తు తయారీకి ఇప్పటికీ అధికం శాతం భారత్లో బొగ్గునే వినియోగిస్తున్నారు. క్రమంగా దీన్ని పునరుత్పాదక ఇంధనంతో భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ దిశగా ఏటా బడ్జెట్లో కేటాయింపులు పెంచుతున్నారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసి ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రణాళికలు ఏర్పాటు చేసింది. -
‘మిషన్ లైఫ్’తో భవిష్యత్తు!
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో.. భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది. విస్తృత ప్రచారం.. మిషన్ లైఫ్లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై ప్రత్యేక డ్రైవ్లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్షాప్లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్లను చేపడుతోంది.స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం మిషన్ లైఫ్కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్లైఫ్లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్రా, బీఈఈ కార్యదర్శి మనం మారితేనే..» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనాల ఇంజన్లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు. » షాపింగ్లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు. » వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు. » నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. » పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు. » ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్ను ప్రోత్సహించడం, ఎల్ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు. » బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది. -
విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు
ముంబై: విద్యుత్, ఇంధన రంగాల్లో ఈ ఏడాది నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్లీజ్ సరీ్వసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్’ నివేదిక తెలిపింది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్లీజ్ ఈ నివేదికను రూపొందించింది. ఢిల్లీలో అధికం ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వృద్ధికి మద్దతు.. ‘‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. -
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్ఫోలియో బిజినెస్కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో, ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్ రంగ ప్రగతి ► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. ► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్హెచ్పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. ► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను కొనసాగించడం కోసం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్ధ్యం పెరిగింది. ► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. ► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్ను తయారు చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ► 2023 మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది. ► గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్ సరీ్వస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళ్తున్న సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. అయోధ్యలో రాల్ లల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలి. దాని కోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నాం’ అని నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్యాలెన్స్ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं। आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो। अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV — Narendra Modi (@narendramodi) January 22, 2024 చదవండి: శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ -
అదానీ గ్రీన్కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
సీమెన్స్ ఎనర్జీ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ఎనర్జీ బిజినెస్ను విడదీసే ప్రతిపాదనను పూర్తి చేసేందుకు దేశీయంగా సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం సీమెన్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు తెలియజేసింది. ఎనర్జీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పూర్తి చేయవలసిందిగా సీమెన్స్ లిమిటెడ్ బోర్డును ప్రమోటర్ సంస్థలు సీమెన్స్ యాక్టింగిసెల్షాఫ్ట్(జర్మనీ), సీమెన్స్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ, సీమెన్స్ ఎనర్జీ హోల్డింగ్ బీవీసహా ప్రధాన ప్రమోటర్ సీమెన్స్ ఎనర్జీ యాక్టింగిసెల్షాఫ్ట్ కోరినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతిపాదనపై పరిశీలన, విలువ నిర్ధారణ, తదితర అవసరమైన చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. వెరసి వెనువెంటనే పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు నిర్ణయించినట్లు వివరించింది. ఎనర్జీ విడదీత వార్తలతో సీమెన్స్ షేరు ఎన్ఎస్ఈలో 6% జంప్చేసి రూ. 4,138 వద్ద ముగిసింది. -
పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఏ పని చేయకపోయినా నీరసంగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా వెంటనే అలసిపోతున్నారా? రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసత్వంగా అనిపిస్తుందా? ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?సింపుల్గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ►అరటిపండులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, బద్ధకం దూరం అవుతుంది. ►శరీరానికి తగినంత నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. హైడ్రెటెడ్గా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అదేవిధంగా అలసట, నీరసం కూడా దూరమవుతాయి. ► రోజుకో కొబ్బరి బోండం తాగండి. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ► అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది. ► ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి మంచి బలం చేకూరుతుంది. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగితే శరీరానికి మంచి రక్తం పట్టి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ► రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది. ► గ్రీన్ టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎనర్జీ రావడమే కాకుండా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ► రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది. ► తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్లా పనిచేస్తుంది. ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి శక్తి అందుతుంది. ► తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును.దీన్నే నీర అని అంటారు. రోజుకో వెలగపండు తింటే నీరసం పోయి శరీరానికి బలం చేకూరుతుంది. ► ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.ఇక క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది. -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్మెన్గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
రూ.1,440 కోట్ల డీల్, వేదాంత చేతికి మీనాక్షి ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్న మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నుంచి ఆమోదం పొందింది. రుణ భారంతో ఉన్న మీనాక్షి ఎనర్జీని విక్రయించడానికి పిలిచిన టెండర్లలో విజయవంతమైన బిడ్డర్గా వేదాంతను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో మీనాక్షి ఎనర్జీకి 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఈ పవర్ ప్లాంట్ను స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిర్వహించాలని వేదాంత యోచిస్తోంది. అలాగే వినియోగదారులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కొనుగోలు ప్రక్రియలో భాగంగా రుణదాతలకు ముందస్తుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్కు ఏపీ హబ్గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఇంధన పరివర్తన ఇండెక్స్లో భారత్ సత్తా.. మెరుగైన ర్యాంక్ సాధన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్) ఇండెక్స్లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని వెల్లడించింది. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్లో భారత్ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది. -
రిలయన్స్కు పునరుత్పాదక ఇం‘ధనం’
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ .. పునరుత్పాదక ఇంధన వ్యాపారం ద్వారా 2030 నాటికి 1015 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ విభాగంలో పరిమిత స్థాయిలోనే అనుభవం ఉన్నందున.. సదరు రంగ కంపెనీలను కొనుగోలు చేయడం లేదా భాగస్వామ్యాలను కుదుర్చుకోవాల్సి రానుంది. బ్రోకరేజ్ సంస్థ సాన్ఫోర్డ్ సి బెర్న్స్టీన్ ఈ మేరకు ఒక నివేదిక రూపొందించింది. స్వచ్ఛ ఇంధనమనేది (సౌర, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ మొదలైనవి) రిలయన్స్కు కొత్త వృద్ధి చోదకంగా నిలవనుందని నివేదిక తెలిపింది. 2050 నాటికి భారత్లో వీటిపై 2 లక్షల కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు రానున్నట్లు వివరించింది. 2030 నాటికి ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 5 శాతానికి, ద్విచక్ర వాహనాల్లో 21 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. అప్పటికి మొత్తం స్వచ్ఛ ఎనర్జీ మార్కెట్ (టీఏఎం) 30 బిలియన్ డాలర్లుగా (ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని తెలిపింది. 2050 నాటికల్లా టీఏఎం 200 బిలియన్ డాలర్లకు, మొత్తం పెట్టుబడులు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంది. ‘2030 నాటికి రిలయన్స్ .. సౌర ఇంధన మార్కెట్లో 60 శాతం, బ్యాటరీలో 30 శాతం, హైడ్రోజన్ విభాగంలో 20 శాతం వాటా దక్కించుకోవచ్చు. ఈ కొత్త ఇంధనాల వ్యాపారంతో రిలయన్స్ 1015 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలిగే క్రమంలో సౌర, హైడ్రోజన్ ఇంధనాల వైపు మళ్లుతోంది. 2035 నాటికి కార్బన్ ఉద్గారాలకు సంబంధించి తటస్థ స్థాయికి చేరుకోవాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందుకోసం సౌర, బ్యాటరీలు, హైడ్రోజన్ వంటి విధానాల ద్వారా పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తి వ్యవస్థను రూపొందిస్తోంది. 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్ నిర్దేశించుకున్న 280 గిగావాట్ల సామర్ధ్యంలో 35 శాతం. ► రిలయన్స్కు పటిష్టమైన ఆర్థిక వనరులు, సంబంధాలు ఉన్నప్పటికీ .. ఈ విభాగంలో విజయం సాధించడానికి అవసరమైన సాంకేతికత, తయారీ నైపుణ్యాలు అంతగా లేవు. కాబట్టి ఇందుకోసం తగిన సంస్థలతో చేతులు కలపాల్సి ఉంటుంది. ► సౌర, బ్యాటరీ ప్లాంట్లు 2024లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇంధన వ్యాపారాల నుంచి రిలయన్స్కు ఆదాయాలు రానున్నాయి. ► 2030 నాటికి సౌర విద్యుత్ టీఏఎం 13 బిలియన్ డాలర్లుగా, హైడ్రోజన్ 10 బిలియన్ డాలర్లు, బ్యాటరీల టీఏఎం 7 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సోలార్లో రిలయన్స్కు 8 బిలియన్ డాలర్లు, బ్యాటరీల్లో 3 బిలియన్ డాలర్లు, హైడ్రోజన్ నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం రావచ్చు. ► సోలార్లో 2030 నాటికి రిలయన్స్ 100 గిగావాట్ల స్థాపిత సామరŠాధ్యన్ని సాధించగలదు. అలాగే, బ్యాటరీల మార్కెట్లో 50 గిగావాట్పర్అవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్ధ్యంతో సుమారు 36 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవచ్చు. హైడ్రోజన్ విభాగంలో టీఏఎం 81 గిగావాట్లుగా ఉండనుండగా.. రిలయన్స్ 16 గిగావాట్లతో 19 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉంది. -
అభివృద్ధి పథంలో ఇంధన రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. వార్షిక ఇంధన వినియోగం 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 2022–23లో 65,830 మిలియన్ యూనిట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై విద్యుత్ సంస్థలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే.. విద్యుత్ వినియోగం దాదాపు 31.45 శాతానికి పెరిగిందని, ఇటీవల రోజుకు 251 మిలియన్ యూనిట్లు ఆల్ టైమ్ హై ఎనర్జీ డిమాండ్ రాగా విద్యుత్ సంస్థలు విజయవంతంగా తీర్చాయని చెప్పారు. ఒప్పందాలతో ఉజ్వల భవిష్యత్ ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం పెట్టుబడులతో దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని విజయానంద్ వెల్లడించారు. ఈ 42 అవగాహన ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం విద్యుత్ సంస్థలపై ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం మార్చిందన్నారు. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని తెలిపారు. పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్లు (పీఎస్పీ) పూర్తయితే విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్గా మారి మిగులు విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించాలని పదే పదే చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 25 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్ర గ్రిడ్ కు 105 మిలియన్ యూనిట్లు జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రిడ్కు రోజుకు 102 నుంచి 105 మిలియన్ యూనిట్లను జెన్కో సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్లో 40 నుండి 45 శాతం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని, బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి కూడా జెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. సమావేశంలో ట్రాన్స్కో జేఎండీ బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి, ట్రాన్స్కో డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, టి.వీరభద్రారెడ్డి పాల్గొన్నారు. -
భారత ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చబోతున రిలయన్స్ ...
-
ఈ–టూవీలర్ల కోసం రేస్ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
విద్యుత్ పొదుపులో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ప్రత్యేకంగా ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు 67,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంచనా ప్రకారం ఏటా దీన్లో దాదాపు 25 శాతం అంటే 17 వేల మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇందులో కనీసం 10 శాతం లక్ష్యంగా పెట్టుకున్నా రూ.1,200 కోట్ల విలువైన 1,700 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించనుంది. ఎందుకీ పాలసీ.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సరికొత్త ఇంధన సంరక్షణ, సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేయనుంది. ఇంధన భద్రత సాధించేందుకు, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ పాలసీ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్–2001ని సమర్థంగా అమలు చేయడం, కర్బన ఉద్గారాల (గ్రీన్హౌస్ వాయువుల) తగ్గింపుతో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం, ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వినూత్న ఫైనాన్సింగ్, మార్కెట్ వ్యూహాలను రూపొందించడం ఈ ఇంధన పాలసీ లక్ష్యం. పరిశ్రమలు, భవనాలు, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలను రూపొందించడం, నివాస, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో స్టార్ రేటెడ్ ఇంధన సామర్థ్య పరికరాల వినియోగంపై ఈ పాలసీ దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని, వివిధ రంగాలకు చెందిన విభాగాధిపతుల నేతృత్వంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్ను చేరవేసే హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
ఎస్యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకాడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు సీఎం జగన్. ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్ అండ్ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ట్రాన్స్కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్ బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామన్న అధికారులు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేసిన సీఎం. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్న అధికారులు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్న అధికారులు. అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి. -
ఇంధన రంగంలో అపార అవకాశాలు
సాక్షి, బెంగళూరు: దేశంలో ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగానిది కీలక పాత్ర అన్నారు. చమురు శుద్ధి సామర్థ్యంలో నాలుగో స్థానం భారత్లో సుస్థిర ప్రభుత్వం, నిరంతర సంస్కరణలు, సామాజిక, ఆర్థిక సాధికారత పలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని మోదీ ఉద్ఘాటించారు. ‘‘తొమ్మిదేళ్లలో ఇంటర్నెట్ అనుసంధానం మూడు రెట్లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 5 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 4 ఎంఎంటీల మేర గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందుకోసం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. ఇక ఈ–20 ఇంధనం ఈ–20 ఫ్యూయల్ (పెట్రోల్లో 20 శాతం ఇథనాల్)ను మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ–20ని తొలుత 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తారు. ఈ–20 ఇంధన వినియోగంతో ముడిచమురు దిగుమతుల భారం తగ్గనుంది. తుమకూరు జిల్లా గుబ్బీ తాలూకాలో హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. -
పెట్టుబడులు, ఆవిష్కరణలతో ఉపాధికి ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్కేర్లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. -
ఇంధన సంరక్షణలో ఏపీ ఆదర్శం.. డాక్టర్ అజయ్ మాథుర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మేటి అని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కొనియాడారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ‘ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాటర్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్ అజయ్ మాథుర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి తన పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందుకున్న ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఈసీఎంను అభినందించారు. ఇంధన పరిరక్షణకు సంబంధించిన పలు పథకాలను సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. ఏపీలో ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అన్ని శాఖలనూ భాగస్వాములను చేయడం, అన్ని విభాగాల్లోనూ ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు వంటి చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆయన చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రోత్సాహం, అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు లభిస్తున్నాయని చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రానికి మూడు ‘ఎనర్షియా’ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న విధానాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు లభించింది. ఇంధన రంగంలో జాతీయ స్థాయిలో ఏపీకి మూడు అవార్డులు వచ్చాయి. ఇంధన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవార్డుకు ఏపీ ఎంపికైంది. అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీట్రాన్స్కో)కు అవార్డు లభించింది. ఉత్తమ పునరుత్పాదక సంస్థగా ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్ఈడీఏపీ) నెడ్కాప్ను అవార్డు వరించింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 15వ ఎనర్షియా అవార్డుల సదస్సులో ఈ అవార్డులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ బి.శ్రీధర్ అందుకున్నారు. ఎనర్షియా ఫౌండేషన్ అనేది ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత్తో పాటు ఆసియా, మిగిలిన ప్రపంచ దేశాల్లో క్లీన్, గ్రీన్, సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, ఇంధన రంగం అభివృద్ధికి కృషిచేస్తోంది. చదవండి: పేద పిల్లలకు ట్యాబ్లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా? -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెరగవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది. ‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్సీ, పంపిణీ సంస్థల వెబ్సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే. ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్ సంస్థలు పూడ్చుకుంటాయి. చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఏపీఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు. అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. డిస్కంల వారీగా సేవా ఖర్చు ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్ అఫ్ సర్వీస్)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్ అఫ్ సర్వీస్ ప్రతీ యూనిట్కు ఇలా వున్నాయి.. (రూ.లలో) -
అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది!
శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగంలో నభూతో అనదగ్గ అతి కీలక ముందడుగు! అంతర్జాతీయంగా ఇంధన రంగ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేయగల పరిణామం!! మహా మహా శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడంలో సైంటిస్టులు తొలిసారిగా విజయవంతమయ్యారు. కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులు చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత సాధించారు. సంలీన ప్రక్రియలో అత్యంత కీలకమైన, పరిశోధకులంతా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న ‘నికర శక్తి లాభం’ సాధించి చూపించారు. సంలీన ప్రక్రియను ప్రారంభించేందుకు వెచ్చించాల్సిన శక్తి కంటే, ప్రక్రియ ద్వారా పుట్టుకొచ్చే శక్తి పరిమాణం ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు. అమెరికా ఇంధన మంత్రి జెన్నిఫర్ గ్రాన్హోం మంగళవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. వైట్హౌస్ శాస్త్ర సలహాదారు ఆర్తీ ప్రభాకర్, పరిశోధకుల బృందంతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయమిది. మా పరిశోధకుల బృందం తమ కెరీర్లతో పాటు జీవితాలను కూడా అంకితం చేసి పాటుపడి ఎట్టకేలకు సాధించింది. ఇంతకాలంగా మనమందరం కలలుగన్న కేంద్రక సంలీన ప్రక్రియను నిజం చేసి చూపించింది. ఇది ఈ రంగంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు తెర తీయనుంది’’ అని చెప్పారు. ఈ పరిశోధన రక్షణ రంగంలో కనీవినీ ఎరగనంతటి విప్లవాత్మక మార్పులకు తెర తీయడమే గాక విద్యుచ్ఛక్తితో సహా భవిష్యత్తులో మానవాళి మొత్తానికీ సరిపడా స్వచ్ఛ ఇంధనాన్ని సునాయాసంగా తయారు చేసుకునేందుకు కూడా వీలు కల్పించగలదని అమెరికా ఇంధన శాఖ ఒక ప్రకటనలో ఆశాభావం వెలిబుచ్చింది. ఎంతకాలమైనా సహనం కోల్పోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి అద్భుతాలైనా సాధ్యమేననేందుకు ఈ ఫలితమే ఉదాహరణ అని ఆర్తీ అన్నారు. ఏమిటీ కేంద్రక సంలీనం? కేంద్రక సంలీనం అంటే రెండు చిన్న పరమాణువుల కేంద్రకాలు కలిసిపోయి, అంటే సంలీనం చెంది ఒకే పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. అలా ఏర్పడ్డ సదరు కేంద్రకం తాలూకు ద్రవ్యరాశి ఆ రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే తక్కువగా ఉంటుంది. ఆ మిగులు ద్రవ్యరాశి అపార శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది జరగాలంటే అపారమైన శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. సూర్యునిలోనూ, ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి ఈ కేంద్రక సంలీనమే మూలం. వాటిలోని అపార ఉష్ణోగ్రతలు ఇందుకు వీలు కల్పిస్తాయి. హైడ్రోజన్ బాంబు తయారీ సూత్రం కూడా ఇదే. అదే అణు బాంబు తయారీలో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను అనుసరిస్తారు. అందులో ఒకే అణువు తాలూకు కేంద్రకం చిన్న భాగాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో విపరీతమైన శక్తి పుట్టుకొస్తుంది. తాజా ఆవిష్కరణ ప్రత్యేకత ఏమిటంటే... సూర్యుడు, ఇతర తారల్లోనూ హైడ్రోజన్ బాంబు తయారీలోనూ కేంద్రక సంలీన చర్య అనియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతూ ఉంటాయి. దీన్ని గనక నియంత్రిత వాతావరణంలో జరపగలిగితే అపారమైన శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా భూమిపై మానవాళి మొత్తానికీ సరిపడా విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేయొచ్చు! అది కూడా అతి చౌకగా, ఎలాంటి రేడియో ధార్మిక తదితర కాలుష్యానికీ తావు లేకుండా!! తాజాగా అమెరికా సైంటిస్టులు స్వల్ప పరిమాణంలోనే అయినా సరిగ్గా దాన్నే సాధించి చూపించారు. హైడ్రోజన్ ఐసోటోప్లైన డ్యుటీరియం, ట్రిటియంలను సంలీనం చెందించారు. ‘‘ఇతర సంలీనాలతో పోలిస్తే వీటి సంలీనానికి తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. పైగా చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుంది’’ అని యూఎస్ ఇంధన శాఖ పేర్కొంది. ప్రయోజనాలు అనంతం! కేంద్రక సంలీన ప్రక్రియను శాస్త్రవేత్తలు ఏనాడో అవగాహన చేసుకున్నారు. భూమిపై దీన్ని చేసి చూసేందుకు 1930ల నుంచే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటిపై పలు దేశాలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ‘‘ఇంధనపరంగా చూస్తే కేంద్రక సంలీనం తాలూకు ప్రయోజనాలు అనంతమనే చెప్పాలి. ఎందుకంటే అణు విద్యుదుత్పత్తికి అనుసరించే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా విడులయ్యే రేడియోధార్మిక వ్యర్థాలకు సంలీనంలో అవకాశమే ఉండదు. కాబట్టి మానవాళి మొత్తానికీ అవసరమయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని అపరిమితంగా, కారుచౌకగా అందించడం సాధ్యపడుతుంది’’ అని కాలిఫోర్నియా వర్సటీ ఇంధన విభాగ ప్రొఫెసర్ డేనియల్ కామెన్ వివరించారు. అయితే ఇది సాకారమయ్యేందుకు ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. -
ఎనర్జీ స్టోరేజ్ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ గ్రిడ్ రంగంలో అంతర్జాతీయంగా 2022 జనవరి–సెప్టెంబర్లో రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 66 శాతం పెరిగిందని స్వచ్ఛ ఇంధన కన్సల్టింగ్ కంపెనీ మెర్కామ్ క్యాపిటల్ నివేదిక వెల్లడించింది. ఎనర్జీ స్టోరేజ్ విభాగంలో 92 డీల్స్కుగాను రూ.1.8 లక్షల కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మిగిలిన మొత్తం స్మార్ట్ గ్రిడ్, ఇంధన సామర్థ్యం విభాగాలు కైవసం చేసుకున్నాయి. ఇంధన నిల్వ సంస్థలు శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక ఇంధనాలకు మారడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతూనే ఉంటాయని మెర్కామ్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. -
రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్
సాక్షి, ముంబై: గ్లోబల్ కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ వీవర్క్ ఇండియాలోని తన ఉద్యోగులందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్' అంటూ 10 రోజుల దీపావళి సెలవులను ఉద్యోగులకు ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా ఉద్యోగులు పని నుండి విరామం తీసుకొని, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఈ సెలవులు బాగా ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈదీపావళి వెకేషన్ కుటుంబాలతో దీపావళి జరుపుకోవడంతోపాటు, ఉద్యోగులకు విశ్రాంతితో, మరింత ఉత్సాహంగా పనిచేసేలా శక్తి ఇస్తుందని వీవర్క్ ఇండియా చీఫ్ పీపుల్ అండ్ కల్చర్ ఆఫీసర్ ప్రీతి శెట్టి తెలిపారు. ఇటీవలి కాలంలో కంపెనీ అంతర్గత బెంచ్మార్క్లను అధిగమించిన నేపథ్యంలో ప్రతీ ఉద్యోగి పట్ల కృతజ్ఞతగా తాముఈ సెలవులను ప్రకటించిందని చెప్పారు. కాగా న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న వీ వర్క్ గత సంవత్సరం పండుగ సీజన్లో 10 రోజుల సెలవులను ఆఫర్ చేసిన సంస్థ ప్రతీ ఏడాది దీన్ని కొనసాగించాలని భావిస్తోందట. -
వారీ ఎనర్జీస్కు రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు. ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రూఫ్టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది. -
రానున్న పదేళ్లలో100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: అదానీ
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మూడో అంత్యంత సంపన్న బిలియనీర్ గౌతమ్ అదానీ రానున్న దశాబ్ద కాలంలో ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారు. పదేళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని తాజా వెల్లడించారు. న్యూ పవర్ ఎనర్జీ, డేటా సెంటర్లు లాంటి రంగాలలో ఈ పెట్టుబడులుంటాయని తెలిపారు. సింగపూర్లో జరిగిన గ్లోబల్ సీఈఓల కాన్ఫరెన్స్లో అదానీ మాట్లాడుతూ, అదానీ గ్రూపుగా వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నా మన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 70 శాతం ఇంధన పరివర్తన రంగానికి కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుత 20 గిగా వాట్ల పునరుత్పాదక పోర్ట్ ఫోలియోతో పాటు, 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని తీసుకొస్తా మన్నారు. ఇది 100,000 హెక్టార్లలో విస్తరించి, సింగపూర్ వైశాల్యం కంటే 1.4 రెట్లు ఎక్కువ. 30 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కమర్షలైజేషన్కు తోడ్పడు తుందని అదానీ వెల్లడించారు. -
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
వింతైన ట్రిక్ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్కి 'టై' ధరించొద్దు!
డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్ ట్రిక్లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ... ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్కి టై ధరించకుండా ఉన్నాడు. ఇంధనం ఆదా చేయడానికికి నెక్కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు.. వీడియో వైరల్) -
ట్విటర్-మస్క్ వార్: మనీ, టైం, ఎనర్జీ అన్నీ పాయే!
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ డీల్ వార్పై పారిశ్రామిక వేత్త ఆనంద్స్పం మహీంద్ర స్పందించారు. ట్విటర్ కొనుగోలు డీల్ నిలిచిపోవడంతో రెండు దిగ్గజాల మధ్య పోరు గ్లోబల్గా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహీంద్రా గ్రూప్ బాస్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో స్పందించారు. ఎంత వేస్ట్ ఆఫ్ టైం మనీ, అండ్ మనీ అంటూ కామెంట్ చేశారు. అసాధారణమైన వార్తలకు, అనుసంధానానికి మూలం ట్విటర్. అలాంటి ముఖ్య సంస్థను ఒక పాక్షిక సామాజికసంస్థలా, లిస్టెడ్ కంపెనీలా, లాభాల కోసం.. ఏదైనాగానీ, ట్రస్టీల్లాగా బాధ్యతాయుతంగా ప్రవర్తించే డైరెక్టర్ల బోర్డుతో నిర్వహించుకోవచ్చుగా అంటూ ట్వీట్ చేశారు. What a waste of time, energy & money. Twitter is an indispensable source of news & connectedness. Can it be run like a quasi social enterprise—listed, for profit—but with a strong charter & managed by a board with directors who act responsibly like trustees? https://t.co/jXqyz9ABPu — anand mahindra (@anandmahindra) July 14, 2022 కాగా 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తొలుత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ తరువాత ట్విటర్లో నకిలీ ఖాతాలపై సరియైన సమాచారం ఇవ్వడం లేదంటూ డీల్కు తాత్కాలిక బ్రేక్లేశారు. చివరికి ట్విటర్ వైఫల్యం కారణంగానే డీల్ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంపై ట్విటర్ న్యాయపోరాటానికి దిగింది. డెలావేర్ కాంట్రాక్ట్ చట్టానికి లోబడి విలీనాన్ని పూర్తి చేయాలని మస్క్ను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ డెలావేర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
అలా చేయడం శుద్ధ దండుగ పని - ఈలాన్మస్క్
ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ని ఉపయోగించుకోవాలనే ఐడియా శుద్ధ దండుగ వ్యవహామని టెస్లా కార్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్ష్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ కార్ అనే సమ్మిట్లో మాట్లాడుతూ ఈలాన్ మస్క్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్కు ప్రత్యామ్నయంగా సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించాలనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ను ఉపయోగించాలంటూ కొందరు చెబుతున్న విషయం మస్క్ దగ్గర ప్రస్తావించగా... ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ బ్యాడ్ ఛాయిస్, ఎనర్జీని ద్రవ రూపంలో నిల్వ చేయాలన్నా అతి భారీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. ఇక అది వాయురూపమైతే నిల్వ చేసే పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనేది చెప్పడమే కష్టం. కాబట్టి ఎనర్జీ స్టోరేజికి హైడ్రోజన్ వాడాలనుకోవడం శుద్ధ దండగ అంటూ తెలిపాడు మస్క్. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ ఎంతో చక్కగా పనికొస్తుందని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయానికి కట్టుబడి ఉంటోంది. చదవండి: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్ -
ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్ టన్నుల చమురు, 1 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్–8 మార్జినల్ ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది. -
పరిశ్రమలకు 'పవర్' ఆంక్షలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. డిమాండ్కు సరిపడా విద్యుత్ అందుబా టులో లేదు. దీంతో గృహ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంధనశాఖ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్యకేంద్రాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. అందుబాటులో ఉన్న విద్యుత్ను వ్యవసాయ, గృహావసరాలకు సర్దుబాబు చే యాలని నిర్ణయించింది. నిరంతరం పనిచేసే పరిశ్రమలు ప్రస్తుతం రోజులో వాడే విద్యుత్లో 50 శా తం లోడు తగ్గించాలని, ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని ఇంధనశాఖ కోరింది. మిగతా పరిశ్రమలు కూడా ప్రస్తుతం ఉన్న ఒకరోజుకు అద నంగా మరొక రోజు ‘పవర్ హాలీడే’ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పవర్ హాలీడే శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అంటే, ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. దీనిని జిల్లాలవా రీగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నియంత్రి స్తాయి. మాల్స్, వ్యాపార, వాణిజ్యసంస్థలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ నియంత్రణ పాటించాలని సూచించింది. ఈ సమయంలో హోర్డింగ్లు, సైన్ బోర్డుల విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివే యాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్లో ఏసీలు 50 శాతమే వాడాలని చెప్పింది. ఇంధన శాఖ అత్యవసర సమావేశం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడంతో ఇంధనశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగంపై సమీక్షించారు. దేశమంతటా కొరత ఏర్పడటంతో గుజరాత్ వంటి చాలా పారిశ్రామిక రాష్ట్రాలు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని గురువారం ఆయన సమీక్షించారు. పంట ముగింపు సీజన్, దేశవ్యాప్తంగా వేడిగాలుల కార ణంగా విద్యుత్ అందుబాటులో లేదని, రానున్న 15 రోజుల్లో పంటలు కోతకు రానున్నందున డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ విని యోగదారులకు నష్టం జరగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి లోడ్ రిలీఫ్ అమలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. కొందామన్నా దొరకడంలేదు వేసవి కాలం కావడంతో గృహ విద్యుత్ వినియోగం 5 శాతం, నీరు సమృద్ధిగా ఉండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కె సంతోషరావు, జె పద్మజనార్దనరెడ్డి, హెచ్ హరనాధరావులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. గత మూడేళ్లలో కోవిడ్ 19 కారణంగా పరిశ్రమలతో పాటు వాణిజ్య విద్యుత్ వాడకం కొంత తగ్గిందని, ఇప్పుడు కరోనా నుంచి బయటపడటంతో వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు అందుబాటులో లేకపోవడం, బహిరంగా మార్కెట్లో కొందామాన్న దేశవ్యాప్తంగా పవర్ ఎక్సే ్చజిల్లో 14 వేల మెగావాట్ల విద్యుత్కుగాను 2 వేల మెగావాట్లే అందుబాటులో ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. పరిస్థితి మెరుగుపడగానే పవర్ హాలీడే, ఆంక్షలు ఎత్తివేస్తామని వారు వివరించారు. అనివార్యంగా లోడ్ రిలీఫ్ ఏప్రిల్ 1న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 235 మిలియన్ యూనిట్లు ఉండగా, అందుబాటులో ఉన్న ఉత్పత్తి వనరులతో పాటు బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 64 మిలియన్ యూనిట్లు మాత్రమే లభించింది. ఈ డిమాండ్ 2021తో పోల్చితే 3.54 శాతం, 2020తో పోలిస్తే 46 శాతం ఎక్కువ. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ను తీర్చడానికి అన్ని దీర్ఘకాలిక ఉత్పత్తి వనరులను ఉపయోగించిన తర్వాత, రోజుకు దాదాపు 40 నుంచి 50 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. దీనిని అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ల నుండి కొనాలి. అయితే, దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజిల నుంచి విద్యుత్ కొంటున్నాయి. కానీ విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ఎక్స్చేంజిలలో కూడా అవసరమైన మేరకు దొరకడంలేదు. దీంతో అనివార్యంగా రాష్ట్రంలోని వ్యవసాయ, గృహ రంగాలకు రోజులో కొన్ని గంటలు అత్యవసర లోడ్ రిలీఫ్ జారీ చేయవలసి వచ్చిందని ఇంధన శాఖ వివరించింది. -
హరిత ఇంధన దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: రాబోయే రెండు దశాబ్దాల్లో పర్యావరణ అనుకూల ఇంధన రంగంలో భారత్ దిగ్గజంగా ఎదగగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 0.5 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయగలదని ఆయన తెలిపారు. టెక్నాలజీతో కొత్త, పరిశుభ్రమైన ఇంధనాల వ్యయాలు గణనీయంగా తగ్గగలవని ఆసియా ఎకనమిక్ డైలాగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ చెప్పారు. అయితే, ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోదని.. బొగ్గు, దిగుమతి చేసుకున్న చమురుపై భారత్ ఆధారపడటం మరో రెండు, మూడు దశాబ్దాల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ, రాబోయే రోజుల్లో కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారించే వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 21వ శతాబ్దంలో భౌగోళికరాజకీయ పరిస్థితులను హరిత ఇంధన విధానాలవైపు మళ్లడమే ప్రభావితం చేయగలదని అభిప్రాయపడ్డారు. ఇంధనంగా బొగ్గు స్థానంలో కలప చేరినప్పుడు భారత్, చైనాను యూరప్ దేశాలు అధిగమించాయని ఆయన చెప్పారు. అలాగే చమురు వాడకం మొదలైనప్పుడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే అమెరికా, పశ్చిమాసియా పురోగతి చెందాయని పేర్కొన్నారు. ‘హరిత, పరిశుభ్ర ఇంధనాల విషయంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా మారాకా భారత్ .. ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఆవిర్భవిస్తుంది‘ అని అంబానీ తెలిపారు. ఈ పరిణామక్రమంతో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, గణనీయంగా విదేశీ మారకం కూడా ఆదా అవుతుందని చెప్పారు. కొత్త సూపర్ పవర్గా ఇండియా.. గడిచిన రెండు దశాబ్దాలు చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిందని, వచ్చే 20 ఏళ్లలో ఇంధనం.. జీవ శాస్త్రంలో సూపర్ పవర్గా ఆవిర్భవిస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. హరిత ఇంధనాల విషయంలో యావత్ ప్రపంచం ఇంకా కుస్తీ పడుతుంటే.. భారత్ ఏకంగా ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని పని చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘రాబోయే 10–20 ఏళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ విభాగాల్లో దేశీయంగా కనీసం 20–30 కొత్త కంపెనీలు.. రిలయన్స్ స్థాయిలో లేదా అంతకు మించి వృద్ధి చెందగలవని భావిస్తున్నాను‘ అని అంబానీ చెప్పారు. రిలయన్స్కు 1 బిలియన్ డాలర్ కంపెనీగా మారడానికి 15 ఏళ్లు, 10 బిలియన్ డాలర్ల మార్కును చేరేందుకు 30 ఏళ్లు, 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరేందుకు 38 ఏళ్లు పట్టిందని ఆయన తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం 10 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉన్న భారత టెక్నాలజీ, డిజిటల్ ఎగుమతులు నేడు 150 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇవి అర లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలవు. అలాగే, 20 ఏళ్లలో హరిత ఇంధన ఎగుమతులు కూడా అర లక్ష కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీతో చౌకగా ఇంధనం వాణిజ్యపరంగా లాభదాయకత సాధించగలిగితే టెక్నాలజీ పురోగతితో.. హరిత ఇంధనం చౌకగా లభించడానికి ఆస్కారం ఉంటుందని అంబానీ చెప్పారు. దానికి తోడు ప్రభుత్వం కూడా పారదర్శకమైన, వినియోగదారులకు అనుకూలమైన విధానాల ద్వారా కొత్త ఇంధనాలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పునరుత్పాదకత వనరుల ద్వారా 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి లక్ష్యాల్లో 40 శాతాన్ని 2021 నాటికే భారత్ సాధించేసిందని అంబానీ తెలిపారు. హరిత హైడ్రోజన్ ధరను కిలోకు డాలర్ కన్నా తక్కువకే అందించవచ్చని, రవాణా తదితర వ్యయాలను కూడా డాలర్ లోపే కట్టడి చేయవచ్చని ఆయన చెప్పారు. ‘భారతదేశ పురోగతిని ఎవ్వరూ ఆపలేరు. మనది 5 లక్షల కోట్ల డాలర్లు.. ఆ పైన 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా కచ్చితంగా అయి తీరుతుంది. అది 2025లో లేదా 2027 అవుతుందా లేక 2030–2032లో అవుతుందా అన్నదే ఆలోచించా ల్సిన విషయం‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన న్యూ ఏజ్ బాలెనో కారు..!) -
రెట్టింపు స్థాయికి చమురు, గ్యాస్ అన్వేషణ
న్యూఢిల్లీ: ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గ్యాస్, చమురు అన్వేషణ, ఉత్పత్తి చేసే ప్రాంత విస్తీర్ణాన్ని 2025 నాటికల్లా రెట్టింపు స్థాయికి (5 లక్షల చ.కి.మీ.లకు) పెంచుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి దీన్ని 10 లక్షల చ.కి.మీ.కు పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం 2,07,692 చ.కి.మీ. విస్తీర్ణంలో చమురు, గ్యాస్ అన్వేషణ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాల కోసం చమురు, గ్యాస్పై ఆధారపడటం కొనసాగుతుందని వరల్డ్ ఎనర్జీ పాలసీ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2025 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని పురి వివరించారు. ఈ నేపథ్యంలో ఇంధనానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. బ్రిటీష్ ఇంధన సంస్థ బీపీ ఎనర్జీ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్లో భారత్ వాటా ప్రస్తుత 6 శాతం స్థాయి నుంచి రెట్టింపై 12 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. నికరంగా సున్నా స్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. భారత్ 80 శాతం పైగా ఇంధనావసరాల కోసం బొగ్గు, చమురు, బయోమాస్పైనే ఆధారపడుతోంది. మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతం వాటా బొగ్గుది ఉంటుండగా, చమురుది పావు శాతం, సహజ వాయువుది 6 శాతం వాటా ఉంటోంది. చమురు అవసరాల్లో 85 శాతాన్ని, గ్యాస్లో 50 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గ్యాస్ వినియోగం పెంపు.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నట్లు పురి తెలిపారు. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే చెరకు, మిగులు ఆహారధాన్యాల నుంచి వెలికితీసే ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా కూడా చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లెండింగ్ (పెట్రోల్లో ఇథనాల్ కలిపే స్థాయి) 8 శాతంగా ఉండగా 2025 నాటికి ఇది 20 శాతానికి పెంచుకోనున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారు. మరోవైపు, కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ‘పర్యావరణ హైడ్రోజన్ను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపైనా, భారత్ను హరిత హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దడంపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. హైడ్రోజన్ను ఇంధనంగాను, గ్యాస్ పైప్లైన్లలోను ఉపయోగించగలిగే ప్రాజెక్టులను మా చమురు, గ్యాస్ కంపెనీలు రూపొందిస్తున్నాయి ‘ అని పురి చెప్పారు. దేశీయంగా చమురు, గ్యాస్ రంగంలో తలపెట్టిన సంస్కరణలు ఏదో స్వల్పకాలికమైనవి కాదని.. అపార వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనానికి మళ్లడంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
కాంక్రీట్ దిమ్మెలే.. బ్యాటరీలు!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? భవన నిర్మాణం కోసం ఉంచిన కాంక్రీట్ దిమ్మెలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే! ఎందుకంటే.. ఇవి స్విట్జర్లాండ్ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’ గతేడాది సిద్ధం చేసిన 8 మెగావాట్ల బ్యాటరీలు!! కాంక్రీట్తో బ్యాటరీ ఏమిటని అనుకోకండి. నిజానికి ఇది చాలా సింపుల్. ఎలాగంటే డ్యామ్లలో ఉన్న నీళ్లు వేగంగా కిందకు జారుతూ టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి అవడం మనకు తెలుసు కదా. ఇది కూడా అలాగే కాకపోతే ఒక్క చిన్న తేడా ఉంది. విద్యుత్కు రాత్రిపూట డిమాండ్ ఎక్కువగా ఉంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఎక్కువ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ అదనపు విద్యుత్ సాయంతో ఒక్కో కాంక్రీట్ దిమ్మెను క్రేన్ల ద్వారా పైకి ఎత్తుతారు. ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తారు. రాత్రిపూట విద్యుత్కు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దిమ్మెను కిందకు జారవిడిచి గతి శక్తిని కాస్తా విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఐడియా బాగుంది కదూ! ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చినా అన్ని అడ్డంకులను దాటుకొని వాణిజ్య స్థాయిలో ఓ టవర్ను ప్రారంభించేందుకు ‘ఎనర్జీ వాల్ట్’కు కొంత సమయం పట్టింది. చిత్రంలో ఉన్న ఏర్పాటు ద్వారా దాదాపు 8 మెగావాట్ల విద్యుత్ను నిల్వ చేసుకోవచ్చు. -
Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..
చాలా మందికి అత్యంత ఇష్టమైన పానియం కాఫీ. కొంతమందికైతే కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభంకాదు. ఐతే కాఫీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని కొన్ని పరిశోధనలు వెల్లడించినప్పటికీ.. దీనిని అధికంగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో అనేక మంది దీనికి అడిక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. కాఫీ తాగడం మానెయ్యడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. వాటిల్లో కొన్ని మీకోసం.. ఎనర్జీ మరింత పెరిగినట్లు అనిపిస్తుంది కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎనర్జీ బూస్టర్ అని మీరు ఇంతకాలం భావించి ఉండవచ్చు. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శక్తి హీణత లేదా అలసటకు కారణమవుతుందని మీకు తెలుసా! కాఫీ తీసుకోవడం ఎప్పుడైతే మానేస్తారో.. శరీరానికి నిజంగా శక్తినిచ్చే పోషకాలను గుర్తించగలుగుతారు. అలాగే నిద్ర, స్ట్రెస్ హైడ్రేషన్, పోషకాహారం, యోగాలపై మరింత దృష్టి నిలపగలుగుతారు కూడా. కాబట్టి కాఫీతాగడం మానేస్తే.. రోజుమొత్తానికి అవసరమైన కాఫీకంటే మెరుగైన శక్తిని పొందుకుంటారనడంలో సందేహం లేదు. మంచి నిద్ర వస్తుంది రాత్రిపూట కప్పు కాఫీ తాగడం వల్ల దానిలోని కెఫెన్ మీకు సరిపడినంతగా నిద్రపట్టకుండా చేసి, నిద్రలేమికి కారణమవుతుంది. ఐతే కాఫీ మానేస్తే కెఫెన్ కంటెంట్ లేకపోవడం వల్ల మీరు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. బరువులో మార్పులు లేకపోవడం కాఫీ తాగే అలవాటును మానుకోవడం వల్ల మీ బరువులో ఎటువంటి తేడా కనిపించదని నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు తగ్గడం లేక పెరగడం వంటివి సంభవిస్తాయేమోనని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహమాత్రమే. కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. పైగా మీ శరీరంలో కేలరీల స్థాయిలు తగ్గి, కొన్ని కిలోల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంగ్జైటీ స్థాయిలు తక్కువ కాఫీ తాగిన వెంటనే మీలో యాంగ్జైటీ పెరుగుతుంది. కెఫిన్ కంటెంట్ దీనికి ప్రధాన కారణం. కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే, కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె కండరాల పనితీరును ఉత్తేజపరుస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి కాఫీ తాగే అలవాటు మానుకుంటే ఆందోళన మీ చెంతకు చేరదు. తలనొప్పి, చికాకు నుంచి విముక్తి తలనొప్పి, చిరాకు, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలు మీలొ ఎప్పుడైనా కనిపించాయా? సాధారణంగా కాఫీ తాగేవారు తలనొప్పి, అలసటను అనుభవిస్తారు. కానీ కాఫీ అలవాటును మానేసిన కొన్ని రోజుల్లోనే ఈ లక్షణాల నుంచి బయటపడగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్గా మారి..! -
హరిత ఇంధనమే భవితకు బాట
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్కు రక్ష! ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి. వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది. సరైన దిశలోనే భారత్! అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్ప్రింట్ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది. గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్గోవ్లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది. భూమి ఒక వివాదాంశమే! భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి. పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్కు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆంధ్రప్రదేశ్లో పవర్ ‘ఫుల్ ఆదా’
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా నివారిస్తూ ప్రతి పైసాను ఆదా చేయడంతో విద్యుత్ సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిన్న ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటించడం, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ను కొనుగోలు చేయడంతో విద్యుత్ సంస్థలు రూ.2,342 కోట్ల మేర ఆదా చేయగలిగాయి. విద్యుత్ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీ,సీ) 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. రీ టెండర్తో రూ.15.96 కోట్లు మిగులు చౌక విద్యుత్, పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ట్రాన్స్కో సిస్టం అప్లికేషన్స్ అండ్ ప్రొడక్టస్(ఎస్ఏపీ), హన (హై పెర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్) ఎంటర్ప్రైజెజ్ క్లౌడ్ సర్వీసుల టెండర్ ఖరారులో రూ.15.96 కోట్లు ఆదా చేసింది. వాస్తవానికి ఎస్ఏపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఏపీ ట్రాన్స్కో ఐదేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలానికి క్లౌడ్ సర్వీసులకు రూ.20.22 కోట్లతో నామినేషన్ పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఇదే కంపెనీ మరో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్ కో తిరస్కరించింది. రీ టెండర్ ద్వారా ఐదేళ్ల క్లౌడ్ సర్వీసుల కోసం రూ.3.94 కోట్లకు, వన్ టైం మైగ్రేషన్ కోసం రూ.31.22 లక్షలకు టెండరు ఖరారు చేసింది. ఫలితంగా రూ.15.96 కోట్లు ఆదా అయ్యాయి. విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. 2019 – 20, 2020 – 21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్సే ్చంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం రూ.2,342 కోట్లు ఆదా చేశారు. విద్యుత్ సంస్థల సాంకేతిక, వాణిజ్య నష్టాల వివరాలు శాతాల్లో సంస్థ 2018–19 2019–20 ఏపీఈపీడీసీఎల్ 6.68 6.64 ఏపీఎస్పీడీసీఎల్ 8.45 8.30 ఏపీసీపీడీసీఎల్ 7.93 7.99 సాంకేతిక నష్టాల సగటు 7.70 7.62 డిస్కంల వాణిజ్య నష్టాలు 6.09 3.33 ఏటీ అండ్ సీ నష్టాల మొత్తం 13.79 10.95 అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్ ‘‘వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటంతో పాటు అందుబాటు ధరల్లోనే అందించే ప్రయత్నాలను కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. విద్యుత్ వ్యవస్థలు ఈ విధానాలను పాటిస్తూ ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాయి’’ – నాగులాపల్లి శ్రీకాంత్. ఇంధనశాఖ కార్యదర్శి ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం ‘‘ఉత్తమ విధానాల అమలు, చౌక విద్యుత్లో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేయాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేయగలిగాం’’– కర్రి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ -
రిలయన్స్ ఓ2సీ వ్యాపారం వేల్యుయేషన్ 69 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా సోలార్, బ్యాటరీలు, హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్స్ మొదలైన వాటిపై భారీగా ఇన్వెస్ట్ చేయనున్న నేపథ్యంలో కొత్త ఇంధన వ్యాపార విభాగం వేల్యుయేషన్ దాదాపు 36 బిలియన్ డాలర్లకు చేరవచ్చని బ్రోకరేజి సంస్థ బెర్న్స్టెయిన్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. అలాగే చమురు, రసాయనాల వ్యాపార విభాగం (ఓ2సీ) వేల్యుయేషన్ 69 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని వివరించింది. ఈ రెండింటి విలువ 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని బెర్న్స్టెయిన్ రీసెర్చ్ పేర్కొంది. రిటైల్, డిజిటల్ సర్వీసులు మొదలైనవన్నీ కూడా కలిపితే మొత్తం కంపెనీ విలువ 261 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని వివరించింది. పలు చమురు కంపెనీలు .. కాలుష్యరహిత ఇంధన సంస్థలుగా మారేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాయని... కానీ రిలయన్స్ వ్యూహం భిన్నమైందని పేర్కొంది. -
వేసవిలో విద్యుత్ కొరత ఉండొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎనర్జీ డిపార్ట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పని తీరుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. థర్మల్ యూనిట్ల నిర్మాణం దీర్ఘ కాలం పాటు కొనసాగితే అవి భారంగా తయారవుతాయని తెలిపారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అధికారులకు సూచించారు. విద్యుత్ కొరత లేకుండా చూసుకొండి వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంతమేరకు విద్యుత్ అవసరమవుతుందో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ -
మూడోరోజూ అమ్మకాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు. ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..! ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్అండ్ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది. రిలయన్స్ను అధిగమించిన టీసీఎస్ రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్బర్గ్ బిలినియర్ ఇండెక్స్లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది. -
‘సీమ’లో ప్లాంట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానం (ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ) కోసం లక్ష ఎకరాలను గుర్తించగా పవన, సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు వీటిని ఇవ్వనున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇందుకు అపార అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పి విద్యుత్ను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేందుకు ఎక్స్పోర్ట్ పాలసీ వీలు కల్పిస్తుంది. ఈ విధానం కింద ముందుకొచ్చే సంస్థలకు సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) మౌలిక వసతులు కల్పిస్తోంది. లీజుకు భూమి సోలార్, విండ్ ప్లాంట్లు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వమే భూమి సమకూరుస్తుంది. 25 ఏళ్ల పాటు లీజుపై ఇస్తారు. ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్కు రూ. లక్ష చొప్పున ప్రభుత్వానికి రాయితీ చెల్లించాలి. ఏపీలో ప్లాంట్లు స్థాపించినా విద్యుత్ను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. పవర్ గ్రిడ్ లైన్తో పాటు ఏపీ ట్రాన్స్కో లైన్ను వినియోగించుకుంటే ఆయా సంస్థలకు నిర్ణీత ధర చెల్లించాలి. ఎక్స్పోర్ట్ పాలసీని దృష్టిలో ఉంచుకుని నెడ్క్యాప్ ఇప్పటికే 1,00,611.85 ఎకరాలను గుర్తించగా ఇందులో చాలావరకూ ప్రభుత్వ భూమే ఉంది. పెద్ద సంస్థలు రెడీ ఏపీలో సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ) 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) 5 వేల మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలతో కలసి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆసక్తి చూపుతున్నాయని నెడ్క్యాప్ తెలిపింది. (చదవండి: రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ) సోలార్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూమి జిల్లా ఎన్ని ఎకరాలు? అనంతపురం 29,982.92 కడప 29,548.79 ప్రకాశం 9,630 కర్నూలు 31,450.14 మొత్తం 1,00,611.85 -
డిమాండ్కు భారత్ ‘ఇంధనం’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అంతర్జాతీయంగా వినియోగం పడిపోయిన తరుణాన .. ఇంధనానికి డిమాండ్ మళ్లీ పెరిగేందుకు భారత్ ఊతంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అంచనాలను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ‘వచ్చే కొన్నేళ్ల పాటు అంతర్జాతీయంగా ఇంధనానికి డిమాండ్ తగ్గుతుందని పలు గ్లోబల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇంధన వినియోగంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని కూడా అంచనా వేస్తున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే భారత్లో వినియోగం రెట్టింపు కానుంది. భారత ఇంధన భవిష్యత్తు ప్రకాశవంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇదే ప్రపంచానికి శక్తినివ్వనుంది‘ అని సెరావీక్ నిర్వహిస్తున్న 4వ ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్ ప్రస్తుతం రోజూ 5 మిలియన్ బ్యారెళ్ల చమురు సరిసమాన ఇంధనాన్ని వినియోగిస్తోంది. పారదర్శక విధానాలు ఉండాలి.. ఇంధనాలను సరఫరా చేసే దేశాలు ధరల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. ‘చాలాకాలంగా క్రూడ్ ధరలు భారీగా పెరగడం చూశాం. అలా కాకుండా ధరల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించే విధానాల వైపు మళ్లాలి. చమురు, గ్యాస్ విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యతనివ్వాలి‘ అని ఆయన సూచించారు. భారత ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా ఎదుగుతోందని, 2024 నాటికి దేశీ విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంధనం అందుబాటు ధరల్లో లభించాల్సి ఉందన్నారు. వృద్ధికి ప్రాధాన్యం.. కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉంటూనే .. ఇంధన రంగంలో వృద్ధి సాధనపై భారత్ మరింతగా దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. దేశీయంగా ఇంధన రంగం పరిశ్రమ, పర్యావరణానికి అనుకూల విధానాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాల్లో పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ మార్కెట్గా ఎదుగుతోందని వివరించారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని ముందుగా నిర్దేశించుకోగా .. కొత్తగా 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలను ప్రధాని ప్రస్తావించారు. 100 శాతం విద్యుదీకరణ, ఎల్పీజీ కవరేజీని పెంచడం, 36 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ తదితర అంశాలను వివరించారు. సీఈవోలతో భేటీ.. అంతర్జాతీయ ఇంధన దిగ్గజ సంస్థల అధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో పరిస్థితులు, చమురు.. ఇంధన రంగంలో పెట్టుబడులు తదిర అంశాలపై మేథోమథనం జరిపారు. రెండు గంటలపైగా ఈ సమావేశం కొనసాగింది. బ్రిటన్కు చెందిన బీపీ అధినేత బెర్నార్డ్ లూనీ, ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ చైర్మన్ ప్యాట్రిక్ పొయాన్, రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇంధన రంగం భవిష్యత్ ముఖచిత్రంపై చర్చించారు. -
జీఎంఆర్ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఐఎల్ నుంచి ఎనర్జీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్పోర్ట్స్ వ్యాపారం మాత్రమే జీఐఎల్లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్కు (జీపీయూఐఎల్) బదిలీ అవుతాయి. గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్ వాటాదారులు జీపీయూఐఎల్లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్ లిస్టింగ్ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. ఎయిర్పోర్టులపై మరింత దృష్టి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్లో ఎయిర్పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్పోర్టుల రంగంలో భారత్లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్.. ఫిలిప్పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్పోర్ట్స్ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది. -
ప్రపంచంలోనే నెంబర్ 2 సంస్థగా రిలయన్స్
సాక్షి, ముంబై : ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మూలురాయిని చేసుకుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. రిలయన్స్ టెలికాం విభాగంరిలయన్స్ జియోలోదిగ్గజ సంస్థలపెట్టుబడులతో రిలయన్స్ అధినేతఇప్పటికే ప్రపంచకు బేరులజాబితాలోఇంతింటై వటుడింతై అన్నట్టుగారోజుకో కొత్త శిఖరానికి ఎగబాకుతున్నారు. తాజాగా రిలయన్స్ కూడా మార్కెట్ క్యాప్ పరంగా కొత్త తీరాలకు చేరింది. రిలయన్స్ షేరు ధర ఇటీవల ఆల్టైం హైంకి చేరడంతో ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్ను అధిగమించి సౌదీ అరామ్కో తరువాత రెండవ స్థానాన్ని సాధించింది. అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ను నిర్వహిస్తున్న రిలయన్స్ 8 బిలియన్ డాలర్లను కొత్తగా సాధించడంతో మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్సాన్ షేర్లు 39 శాతం క్షీణించగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 43 శాతం పుంజుకోవడం గమనార్హం. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 1.76 ట్రిలియన్ డాలర్లతో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా ఉంది. -
కరోనాపై పోరాడే శక్తి కషాయాలు
మన చుట్టూ ఉండే ఔషధ మొక్కల ఆకులతో కషాయాలు తాగుతూ సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తింటూ ఉంటే.. కరోనా వైరస్ వల్ల గాని, మరే ఇతర వైరస్ల వల్ల గాని సాంక్రమిక వ్యాధులు సోకుతాయన్న భయం లేకుండా మనుషులు జీవించవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణకు రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ కింద పేర్కొన్న ఏడు రకాల ఔషధ మొక్కల ఆకులతో తయారు చేసిన కషాయం ఉదయం పరగడుపున, సాయంత్రం ఖాళీ కడుపున 14 రోజుల పాటు తాగాలని ఆయన సూచిస్తున్నారు. ఒక్కో రకం ఆకుతో రెండేసి రోజులు కషాయం తాగాలి. 1. గరిక (CYNADON DACTYLON) 2. తులసి (OCIMUM SANCTUM) 3. తిప్పతీగ (TINOSPORA CORDIFOLIA) 4. బిల్వం (AEGLE MARMELOS) 5. కానుగ (PONGAMIA PINNATA) 6. వేప (AZADIRACHTA INDICA) 7. రావి (FICUS RELIGIOSA) గుప్పిటలో సరిపోయే అన్ని ఆకులను తీసుకొని గ్లాసుడు నీటిలో కేవలం 5 నిమిషాలు ఉడికించి, కాస్త బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకొని గోరు వేచ్చగ గాని, చల్లారిన తర్వాత గాని తాగాలి. పైన పేర్కొన్న వరుసలోనే ఆయా కషాయాలను రెండేసి రోజుల చొప్పున తాగితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. అవసరం అనుకుంటే మరో విడత 14 రోజుల పాటు ఈ 7 కషాయాలు తాగితే మంచిది. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే.. రుస్టాక్స్–200, బ్రయోనియా–200 హోమియో పిల్స్ను మూడేసి చొప్పున తీసుకొని అరకప్పు నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం మూడు రోజులు తాగితే రోగనిరోధక శక్తి వస్తుందని తెలిపారు. ఒకవేళ కరోనా సోకితే. రోగం వచ్చిన తర్వాత తిప్పతీగ, తులసి, పారిజాతం కషాయాలను రోజుకు రెండు సార్లు తాగాలి. కరోనా సోకితే ఆర్సెనిక్ ఆల్బం, ఫాస్ఫరస్, బ్రయోనియా మందులు పనిచేస్తాయి. దగ్గరలోని హోమియో వైద్యుడ్ని సంప్రదించి మీకు ఏ మందు తగినదో నిర్ణయించుకొని వాడుకోవాలని డా.ఖాదర్ వలి సూచించారు. ‘ముఖ్యంగా ఈ రోగాలు మాంసాహారులకు రోగనిరోధక శక్తి దేహంలో తక్కువ ఉండటం వల్ల వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన అదృష్టం కొద్దీ ప్రపంచంలో ఉన్న దేశాల్లో కంటే మన దేశం ఇంకా శాకాహార దేశమే అని చెప్పుకోవాలి. కానీ, ప్రస్తుతం ఆధునిక ఆహార పద్ధతుల్లో మనకు తెలియకుండానే మాంసాహార పదార్థాలు శాకాహారుల ఇళ్లలోకి కూడా ఆహారంలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల పూర్తిగా మనం ‘సిరి’జీవన విధానాన్ని మన జీవనక్రమంలోకి తెచ్చుకుంటే, శాకాహారులుగా ఉంటే, ఏ వైరాణువుల నుంచి వచ్చే సాంక్రమిక రోగానికీ భయపడాల్సిన అవసరం లేనేలేదు. కాబట్టి, మనందరం శాకాహారులుగా మారదాం. నిర్భీతిగా బతుకుదాం అంటున్నారు డా. ఖాదర్ వలి. -
బంధం విస్తృతం
న్యూఢిల్లీ: సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో శనివారం రెండు దేశాల అధికారులు ఈ మేరకు 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ‘మీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోతో చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్ను కీలకమైన భాగస్వామిగా ఆయన వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న జయిర్ బొల్సనారో తన కూతురు లారా, కోడలు లెటిసియా ఫిర్మోతోపాటు 8 మంది మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందంతో శుక్రవారం వచ్చారు. భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా రసాయనాలు, సింథటిక్ దారం, వాహన భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు అలాగే, బ్రెజిల్ నుంచి ముడి చమురు, బంగారం, ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. -
బ్రూక్ఫీల్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హైదరాబాద్కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మిత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్ డాలర్ల డీల్తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్గా నిలవనుంది. ప్రస్తుతం మిత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్ ప్రాజెక్ట్లను నిర్వహిస్తోంది. పిరమల్ గ్రూప్ రుణం చెల్లింపు.. మిత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్లో పిరమల్ గ్రూప్ నుంచి నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బ్రూక్ఫీల్డ్తో డీల్ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్ సక్సెస్లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
సోలార్ ప్యానెల్స్ ముద్రించవచ్చు
కిటికీలతోనే ఇంటికి కావాల్సిన విద్యుత్తు అంతా ఉత్పత్తి చేయగలిగితే ఎలా ఉంటుంది. సౌరశక్తితో కొంత విద్యుత్తు సాధ్యమేగానీ.. అంతా ఎలా అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ అద్భుతం త్వరలోనే నిజం కానుంది. అంతా పోలండ్ శాస్త్రవేత్త ఓల్గా మలినికివజ్ పరిశోధనల ఫలితం. అత్యంత చౌక సోలార్ ప్యానెల్స్ను తయారు చేసేందుకు ఈ లేడీ శాస్త్రవేత్త ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు మరి. పెరోవోస్స్కైట్స్ అనే సేంద్రీయ పదార్థం ద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఓల్గా పెరోవోస్స్కైట్స్ సోలార్ సెల్స్ను అతితక్కువ ఉష్ణోగ్రతల్లోనే తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశారు. సాధారణ ఇంక్జెట్ ప్రింటర్ ద్వారా మనం అక్షరాలను ముద్రించినంత సులువుగా సోలార్ సెల్స్ను, ప్యానెల్స్ను ముద్రించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. అన్నిరకాల ఉపరితలాలపై దీన్ని అతికించుకోవచ్చు. స్వీడన్కు చెందిన స్కాన్స్కా ఈ కొత్త పద్ధతి ద్వారా తయారు చేసిన సోలార్ ప్యానల్స్ను పోలండ్లోని వార్సా నగరంలోని భవనంపై అతికించి పరిశీలిస్తోంది. దాదాపు 1.3 చదరపు మీటర్ల సైజున్న ప్యానెల్తో ఒక పీసీ రోజంతా పనిచేసేంత విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని. తయారీకయ్యే ఖర్చు 4 – 4.5 వేలకు మించదని అంచనా. గుండెజబ్బులనుగుర్తించేందుకు కొత్త పద్ధతి గుండెజబ్బు వచ్చే అవకాశాన్ని ముందుగా గుర్తించగలిగితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ఛాతి, భుజం లేదా ముఖంలోని ఒక పార్శ్వంలో నొప్పి వస్తే.. అర్జెంటుగా ఆసుపత్రిలో చేరడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. అయితే డ్యూక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఒక పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. రక్తనాళాలల్లో పూడికలను చాలాముందుగానే గుర్తించేందుకు వీరో ఒక పద్ధతిని ఆవిష్కరించారు. ట్రెడ్మిల్ పరీక్షల తరువాత రెండు గంటలకు కొంతమంది రక్తాన్ని పరిశీలించినప్పుడు కనీసం ఐదు రకాల జీవరసాయనాల్లో మార్పులు గుర్తించారు శాస్త్రవేత్తలు. కొవ్వులు, అమినోయాసిడ్ల వంటి ఈ రసాయనాల్లో వచ్చిన మార్పులను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తే రక్తప్రసరణలో ఏదో తేడా ఉన్నట్లు స్పష్టమవుతుందని... ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ టి. లింకాకెంగ్ అంటున్నారు. శరీరంలోకి నాళాన్ని పంపించాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. మరింత విస్తత స్థాయిలో అధ్యయనం చేసేందుకు డ్యూక్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. -
సూర్యుడే జీవుడు... జీవుడే ఆత్మ!
ఆత్మ సర్వాంతర్యామి అనే అద్వైత సూత్రాన్ని శక్తి నిత్యత్వ నియమం నిరూపిస్తోంది. సైన్స్ ఆత్మను అనంతశక్తిగా, విశ్వశక్తిగా పేర్కొంటుంది. ఈ ఆత్మ ఒక అద్భుత పరిణామశీలి. పుట్టేది గిట్టేది కాదు కాబట్టి, నిత్యయవ్వనంతో ఆత్మ కళకళలాడుతూ ఉంటుంది. తన నిత్యత్వాన్ని నిలుపుకోవడం కోసం పరిణామమనే ప్రక్రియను సాధనంగా చేసుకుని, తనకు తానుగా పదార్థంగా పరిణామం చెందుతూ వస్తోంది. మళ్ళీ ఆ పదార్థాలు విఘటనం చెందుతూ, నీటి ఆవిరి గాలిలో లయమైపోయినట్టుగా ఆత్మలో లయమైపోతున్నాయి.ఆత్మలాగే, పదార్థమూ అనాదిగా వస్తున్నదే. అయితే, ఆత్మ స్వీయ స్పందనల నుండి ఈ పదార్థం పుడుతూ, విచ్ఛిన్నమవుతూ వస్తోంది. ఈ ఖగోళ పదార్థాల సంఖ్య నిశ్చల, నిరంతర క్రియ కాదు. ఈ ఖగోళ పదార్థాల ప్రవర్తనకు సౌరకుటుంబమే నిదర్శనం. ఆత్మకు, జీవనిర్జీవ ప్రపంచానికి అనుసంధానకర్త అయిన సూర్యుని ద్వారానే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చని ‘ఈశావాస్యోపనిషత్తు’ ఉద్ఘాటిస్తోంది.తరచి చూస్తే సూర్యుడు కూడా జనన, బాల్య, కౌమార, ప్రౌఢ, వార్ధక్య దశలను దాటి నశించేవాడే. సూర్యుని నుండే గ్రహాలు ఉద్భవించాయని ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, నవీన ఖగోళ శాస్త్రవేత్తలూ నిర్ధారించారు. గ్రహాలలో భూమి ఒక్కటే జీవావరణ అనుకూలం. అందునా మానవుడు మేథోపరుడు. ఆలోచిస్తే సౌరశక్తే జీవాలుగా మారినట్లు తెలుస్తుంది. సూర్యుని నుంచి విడిపడి ఏర్పడ్డ భూమిపై సూర్యరశ్మి పడడం, అందులోని శక్తిని తీసుకుని జీవరాశి తయారవడం కనిపిస్తుంది. అంటే ఆ సూర్యుడే అటు గ్రహాల రూపంలో, ఇటు జీవాల రూపంలో భాసిల్లుతున్నాడు. ఇదే విషయాన్ని ‘ఈశావాస్యోపనిషత్తు’ ‘సత్యధర్ము’డైన సాధకుడే సూర్యునిలో నెలకొన్నాడని తీర్మానిస్తోంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మరూపుడు సూర్యుని ద్వారా ప్రయత్నించడం ఆ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇదే కోవలో మరింత లోతుగా ఆలోచిస్తే ఈ గ్యాలక్సీలలో ఉన్న కోటానుకోట్ల సూర్యులలో భాసిల్లేది ఆ ఆత్మనే. అంటే, అనంతమైన ఆత్మే నక్షత్రాలుగాను, గ్రహాలుగాను, పంచభూతాలుగాను, ప్రాణులుగానూ మారి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని గణిత సూత్రంలో పోలిస్తే ఒక విలువ రెండో విలువకు, రెండో విలువ మూడో విలువకు సమానమైనపుడు ఒకటో విలువ మూడో విలువకు సమానమౌతుంది. ఇదీ అంతే. ఆత్మే సూర్యుడు, సూర్యుడే జీవుడు, జీవుడే ఆత్మ. దీన్ని అర్థం చేసుకోవడమే ఆత్మసందర్శన. అదే భగవద్దర్శనం. ఆ సాధనే సత్యస్వరూపం –గిరిధర్ రావుల -
సౌరశక్తిని ఒడిసిపట్టేందుకు కొత్త టెక్నిక్...
సౌరశక్తి ఏటికేడాదీ చౌక అవుతున్నప్పటికీ అది ఇప్పటికే సామాన్యుడి చేతికి అందేస్థాయిలో లేదన్నది నిర్వివాద అంశం. ఈ పరిస్థితి త్వరలో మారనుందని అంటున్నారు ద సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు. సౌరశక్తిని మరింత ఎక్కువగా ఒడిసిపడుతూనే అందుకయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు తాము నానోటెక్నాలజీ ఆధారంగా వినూత్న పదార్థాలను సిద్ధం చేశామని యాండ్రూ లెవీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సింగ్లెట్ ఫిషన్ అనే ఓ భౌతికశాస్త్ర ప్రక్రియ ద్వారా ఈ పదార్థాలు ఎలక్ట్రాన్లు ఎక్కువ సమయంపాటు మనుగడలో ఉండేలా చేస్తాయని లెవీన్ చెప్పారు. దీనివల్ల సూర్యుడి కిరణాల్లోని శక్తిని కనీసం 44 శాతం వరకూ విద్యుత్తుగా మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి 33 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంతేకాకుండా.. ఈ పదార్థాలు తమంతట తామే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అమరిపోతాయని దీనివల్ల సూర్యరశ్మిలోని ఫొటాన్ల శక్తిని పరిసరాల్లోని పదార్థాలతో పంచుకునే వీలేర్పడుతుందని ఫలితంగా అధిక విద్యుదుత్పత్తి సాధ్యమని లెవీన్ వివరించారు. -
కుదిరితే ఓ కప్పు కాఫీ వద్దు...
ఖాళీ కడుపు మీద తీసుకునే పానీయం ప్రాణం పోసేది అయి ఉండాలి. ఆరోగ్యం ఇచ్చేదిగా ఉండాలి.ఉత్సాహాన్ని పెంచేది కావాలి. శక్తిని ఇచ్చేదిగా ఉండాలి.ఎన్నో ఏళ్ల నుంచి అలవాటైన కాఫీలు, టీల కంటె...ఈ పానీయాలు ఇంట్లో వారందరికీ మార్నింగ్ సంజీవని కావాలి.ఇంకెందుకు ఆలస్యం...ఈ రోజు నుంచి నిద్ర లేస్తూనే ఈ ఆరోగ్య పానీయాలను సేవించడం ప్రారంభించండి... టర్మరిక్ అండ్పెప్పర్ వాటర్ కావలసినవి: పచ్చి పసుపు కొమ్ము ముక్క – చిన్నది; మిరియాలు – అర టీ స్పూను; నిమ్మ చెక్క – 1 (చిన్నది); నీళ్లు – కప్పుడు తయారీ: ∙ముందుగా కప్పుడు నీళ్లను గోరు వెచ్చన చేయాలి ∙ చిన్న నిమ్మ చెక్క, పసుపు కొమ్ము, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడబోయాలి ∙గోరువెచ్చగానే తాగాలి. ఉపయోగాలు: ►జీర్ణశక్తి మెరుగవుతుంది ∙క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది ►రోగనిరోధక శక్తి పెరుగుతుంది తేనె – గ్రీన్ టీ కావలసినవి: నీళ్లు – ఒక కప్పు; తేనె – ఒక టీ స్పూను; గ్రీన్ టీ బ్యాగ్ – 1 తయారీ: ∙నీళ్లను బాగా మరిగించాలి ∙గ్రీన్ టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాలు వదిలేయాలి ∙తే¯ð జత చేసి బాగా కలపాలి ∙వేడివేడిగా గ్రీన్ టీ సర్వ్ చేయాలి. ఉపయోగాలు: ∙గుండె ఆరోగ్యానికి మంచిది ∙కొలెస్ట్రాల్ను నివారిస్తుంది ►దుర్వాసన రాకుండా నివారిస్తుంది ∙ఎముకల పటుత్వానికి మంచిది ►చర్మసంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది ∙మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ►జుట్టు పెరుగుతుంది ∙సాధారణ జలుబులు దరిచేరవు. అలోవెరాఆమ్లా జ్యూస్ కావలసినవి: అలోవెరా జ్యూస్ – 5 టీస్పూన్లు (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); ఉసిరి రసం – ఒక టీ స్పూను (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); నీళ్లు – ఒక గ్లాసుడు తయారీ: ఒక గ్లాసులో నీళ్లు పోసి, అలోవెరా జ్యూస్ వేసి కలపాలి ∙ఆ తరవాత ఉసిరి రసం జత చేసి బాగా కలియబెట్టి, చల్లగా తాగాలి. ఉపయోగాలు: ∙అలొవెరా, ఉసిరి రసాలు రెండూ చర్మానికి, జుట్టుకి ఉపయోగపడతాయి ∙మెటబాలిజం పెరుగుదలకు ఉపకరిస్తాయి ∙జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తాయి ∙శరీరంలో టాక్సిన్సు పేరుకుపోకుండా, కొవ్వు నిల్వ ఉండిపోకుండా చేస్తూ కొవ్వుని కరిగిస్తాయి. దాల్చిన చెక్క–తేనె నీళ్లు కావలసినవి: తేనె – ఒక టేబుల్ స్పూను; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు, నిమ్మ రసం – అర టీ స్పూను తయారీ:నీళ్లను మరిగించి, బాగా పొంగుతుండగా మంట ఆపేయాలి ∙దాల్చినచెక్క పొడి వేసి సుమారు పావు గంటసేపు అలాగే ఉంచేయాలి ∙చల్లారిన ఈ నీళ్లకు నిమ్మరసం, తేనె జత చేయాలి ఈ పానీయాన్ని రోజుకి రెండు సార్లు తాగాలి ∙ఉదయమే పరగడుపున ఒకసారి, రాత్రి నిద్రపోవడానికి ముందు ఒకసారి ఈ పానీయం తీసుకోవడం మంచిది. ఉపయోగాలు ►గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి ►వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది ►చర్మసంబంధిత వ్యాధులు దరిచేరవు ►మధుమేహులకు మంచిది ►బ్లాడర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ►అజీర్ణవ్యాధులు దరిచేరవు ►నోటి నుండి దుర్వాసన రాదు ►శరీరానికి శక్తినిస్తుంది ►అలర్జీలు రాకుండా కాపాడుతుంది ►గొంతు సంబంధ వ్యాధులను నివారిస్తుంది ►దగ్గు, జలుబు రాకుండా కాపాడుతుంది ఆపిల్ సైడర్వెనిగర్ ఇన్ వాటర్ కావలసినవి: ఆపిల్ సైడర్ వెనిగర్ – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – చిటికెడు; తేనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ముందుగా ఒక గ్లాసులోకి నీళ్లు తీసుకోవాలి ∙ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడగట్టాలి ∙తేనె జత చేసి తీసుకోవాలి. ఉపయోగాలు: ∙బ్లడ్ సుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది ►బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ►వ్యాధికారకాలను నశింపచేస్తుంది -
ప్రయివేటుకు వెలుగులు.. పేదలకు చీకట్లు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అనేక వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రానివ్వకుండా జాగ్రత్తపడింది. అంకెల గారడీతో పరుగుల పురోభివృద్ధి పెట్టించాలనే ప్రయత్నం చేసినట్టు కన్పిస్తోంది. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సమయంలో తమ నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించలేకపోయింది. ఛార్జీల పెంపు రూపంలో జనం నుంచి పిండుకోవడం మాత్రమే తెలిసిన సర్కారు దండుకునే మార్గాన్వేషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు అనుసరించి ఏకంగా రూ. 5,742 కోట్లకుపైబడి ప్రజలపై భారం మోపడాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్తో డిస్కమ్ల అప్పులన్నీ తీరిపోయినా... విద్యుత్ సంస్థలు మళ్ళీ ఆర్థిక లోటులోకి ఎందుకెళ్లాయో వివరించనే లేదు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా ఏయేటికాయేడు జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ఏ ప్రైవేటు సంస్థల కోసం తగ్గించారో స్పష్టం చేస్తే బాగుండేదేమో! విద్యుత్ వ్యవస్థ విస్తరణ జరిగినట్టు చెబుతున్న ప్రభుత్వం నాలుగేళ్ళుగా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడానికి కారణాలేంటి? అయినవాళ్ళకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులిచ్చి అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం వాస్తవాలకు కడుదూరంలో ఉంది. మిగులు ఓ డ్రామా! రాష్ట్ర విభజన నాటికున్న 22 ఎంయూల విద్యుత్ లోటును అధిగమించి మిగుల్లోకి వెళ్ళామనేది ప్రభుత్వ వాదన. దీన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఈ నాలుగేళ్ళల్లో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,250 మెగావాట్లు పెరిగింది. వైఎస్ హయాంలో ఏర్పాటు చేసిన 1600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు 2016లో వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చింది. ఆర్టీపీపీ నాల్గవ దశ 600 మెగావాట్లు వైఎస్ హయాంలోదే. నాగార్జున టేల్పాండ్ 25 మెగావాట్లు కూడా పాత ప్రభుత్వాల కాలంలో తీసుకొచ్చినవే. ఏపీ జెన్కో పరిధిలో ఒక్క మెగావాట్ ప్లాంట్ కూడా చంద్రబాబు కాలంలో ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ల విద్యుత్ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్లు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోకు 4,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచే రోజుకు 84 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే సత్తా ఉంది. జల విద్యుత్ కేంద్రాల నుంచి మరో 24 మిలియన్ యూనిట్లు తీసుకోవచ్చు. రోజుకు మరో 34 మిలియన్ యూనిట్లు కేంద్ర విద్యుత్ వాటాగా రాష్ట్రానికి అందుతుంది. అంతర్రాష్ట్ర జల విద్యుత్ వాటాగా ఇంకో 25 మిలియన్ యూనిట్లు వచ్చే వీలుంది. ఇవన్నీ కలుపుకుంటే రోజుకు 167 మిలియన్ యూనిట్ల వరకూ ఉంటుంది. ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వం ఏపీ జెన్కో ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గిస్తోంది. 2016–17 లెక్కల ప్రకారం కేవలం 10,119 మిలియన్ యూనిట్లు మాత్రమే జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అంటే రోజుకు 84 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే... కేవలం 27 మి.యూనిట్లకు పరిమితం చేశారు. మరోపక్క ప్రైవేటు విద్యుత్ను రోజుకు 25 నుంచి 30 మిలియన్ యూనిట్లకు పెంచారు. జెన్కో విద్యుత్ ఉత్పత్తి సగటున రూ. 4 లోపే లభిస్తుంది. ప్రైవేటు విద్యుత్ సగటున రూ. 6 వరకూ ఉంటుంది. కాబట్టే డిస్కమ్లు నష్టపోతున్నాయి. 2014–18 మధ్య కాలంలో రాష్ట్రంలో జెన్కో, ప్రైవేటు కలిపి 9,529 మెగావాట్ల నుంచి 19,080 మెగావాట్లకు పెరిగింది. అంటే పెరిగింది 9,551 మెగావాట్లు. ఇందులో జెన్కో సామర్త్యం 2250 మెగావాట్లు పెరిగితే, ప్రైవేటు ఉత్పత్తి సామర్థ్య 7,301 మెగావాట్లు పెరిగింది. ఖరీదైన ప్రైవేటు విద్యుత్ను ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక ఉద్దేశ్యమేమిటి? జనానికి మోత... కార్పొరేట్లకు చేరవేత! విద్యుత్ పంపిణీ సంస్థలను రుణ విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకాన్ని తీసు కొచ్చింది. అందరికంటే ముందే మన రాష్ట్రం ఇందులో చేరింది. డిస్కమ్ల అప్పును 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. ఈ మొత్తాన్ని కేంద్రం అప్పుగా ఇప్పిస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ హామీతో డిస్కమ్లు బాండ్లు విడుదల చేశాయి. మొత్తం మీద 2017 నాటికే డిస్కమ్లు అప్పుల్లోంచి బయటపడ్డాయి. కానీ 2018 నవం బర్లో ఏపీఈఆర్సీకి సమర్పించిన నివేదికల ప్రకారం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటును పేర్కొన్నాయి. కారణమేంటి? వైఎస్ హయాంలో ఆరేళ్ళ పాటు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరగలేదు? బాబు ప్రభుత్వం వచ్చీ రావడం తోనే ఇలా వేల కోట్ల భారం ఎందుకు వేస్తుంది? ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి. డిస్కమ్లు ప్రతీ యూనిట్కు రూ. 5.94 చొప్పున వెచ్చిస్తున్నాయి. కానీ వినియోగదారుడికి దీన్ని యూనిట్ రూ. 4.53 చొప్పునే విక్రయిస్తున్నాయి. కాబట్టి యూనిట్కు రూ. 1.42 చొప్పున నష్టం వస్తోందనేది పంపిణీ సంస్థల వాదన. ఇలా అమ్మితే ముమ్మాటికీ నష్టమే. కానీ ఇలా అమ్మాల్సిన అవసరం ఏమిటి? బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ రూ. 1.99కే లభిస్తోంటే, పంపిణీ సంస్థలు మాత్రం రూ. 5.94 ఎందుకు ఖర్చుపెడుతున్నాయి? అసలు కథ వేరుగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరో పణలూ ఉన్నాయి. అవసరానికి మించి మాత్రం విద్యుత్ కొనుగోలు చేశారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరిపోతుంది. కానీ ప్రభుత్వం 67,948 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అంటే 10,930 మిలియన్ యూనిట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. దీన్నిబట్టి అవసరం లేని ఈ విద్యుత్కు రూ. 6,492 కోట్లు చెల్లిస్తుంది. డిస్కమ్లు కొనుగోలు చేసే విద్యుత్లో 50 శాతం ప్రైవేటు విద్యుత్తే ఉంటుంది. ఇలా జనం నుంచి దోచుకునే డబ్బంతా ప్రైవేటు జేబుల్లోకి వెళ్తుంది. కాబట్టే పంపిణీ సంస్థ లకు నష్టాలొస్తున్నాయి. ఆ భారాన్ని జనంపై వేస్తున్నారనేది సుస్పష్టం. ఏటా షాక్లే! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్ ఛార్జీలను పెంచింది. 2015–16 సంవత్సరంలో ఏకంగా రూ. 941 కోట్ల భారం విద్యుత్ వినియోగదారులపై వేసింది. మరో రూ. 750 కోట్లు ట్రూ అప్ ఛార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ఈసారి కాస్తా జాగ్రత్తగా వ్యవహరించింది. నేరుగా రూ. 242 కోట్ల మేర ఛార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ. 1,200 కోట్లు దండుకుంది. 2014–15 లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ ఇది. మొదటి 50 యూనిట్లకు రూ. 1.45 (యూనిట్కు) చొప్పున చెల్లించే విద్యుత్ వినియోగదారుడు ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్కు రూ. 2.60 చొప్పున చెల్లించాలి. దీనిబట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది. 2017–18 లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది. 1 కేవీ లోడ్ దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే వెయ్యి వాట్స్కు సరిపడా లోడ్ ఉంటే బిల్లు మోతమోగినట్టే. రకరకాల విద్యుత్ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్ దాటని వారు ఎవరుంటారు? నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్య తరగతి వినియోగదారుడి బిల్లు రూ. 150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహి స్తున్న ప్రభుత్వం భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది. సంస్కరణల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా, ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్ళుగా ప్రజాభిప్రాయ సేకరణలో పలు అంశాలు ముందుకొచ్చినా ఏపీఈఆర్సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ము గాస్తోందనే ఆరోపణలున్నాయి. వాస్తవాలు మరుగున పరచిన ప్రభుత్వం అంకెల గారడీతో శ్వేతపత్రం విడుదల చేయడం దురదృష్టకరం. – వనం దుర్గా ప్రసాద్, సాక్షి ప్రతినిధి -
శక్తికి శక్తి... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం
వేరుశనగను త్రీ ఇన్ వన్ అని చెప్పవచ్చు. ఇదొక తక్షణ శక్తివనరు. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వుల కారణంగా తిన్నవెంటనే ఇది శక్తి సమకూరుస్తుంది. అలాగే విటమిన్–బి3, విటమిన్–ఇ కారణంగా ఒంటికి మంచి మెరుపు వస్తుంది. ఇక ఇందులోని పోషకాలన్నీ ఒంటికి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. అంటే తినగానే శక్తి, అందం, ఆరోగ్యం సమకూరుతాయన్నమాట. వేరుశనక్కాయలతో దొరికే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... వేరుశనగల్లోని పి–కౌమేరిక్ యాసిడ్ అనే పోషకం జీర్ణవ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. వేరుశనక్కాయల్లోని బీటా–సైటోస్టెరాల్ అనే ఒక ఫైటోస్టెరాల్ చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుందని ఇంకో అధ్యయనంలో తేలింది. వేరుశనగ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దాంతో గుండెజబ్బులను నివారిస్తుంది. వేరుశనక్కాయలను ‘బ్రెయిన్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు.వేరుశనగలోని విటమిన్–బి3... మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. అంతేకాదు వీటిల్లోని రిస్వెరటాల్ అనే ఫ్లేవనాయిడ్స్ కూడా మెదడుకు జరిగే రక్తప్రసరణకు తోడ్పడి మెదడు పనితీరునూ, చురుకుదనాన్ని 30 శాతం వరకు పెంచుతాయని ఒక అధ్యయనంలో తేలింది. మన మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయనం వల్ల మన మూడ్స్ బాగుంటాయి.ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్ బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశతో నిస్పృహలో ఉన్నవారు –వేరుశనక్కాయలు తింటే మూడ్స్ బాగుపడి డిప్రెషన్ తగ్గుతుంది. బాల్యం వీడుతూ కొత్తగా టీన్స్లో అడుగుపెడుతున్న పిల్లలు వేరుశనక్కాయలు తినడం చాలా మంచిది.ఎందుకంటే ఇవి ఎదుగుదలను వేగవంతం చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు వేరుశనక్కాయలు తినడం మంచిది. ఇది డయాబెటిస్ను నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం వేరుశనక్కాయలు తినేవారిలో డయాబెటిస్ వచ్చే ముప్పు 21 శాతం తగ్గుతుందని తెలిసింది. వీటిలో ఉండే మాంగనీస్ దీనికి కారణమని ఆ అధ్యయన ఫలితాలు తెలుపుతున్నాయి. గాల్బ్లాడర్లో వచ్చే రాళ్లను కూడా వేరుశనక్కాయలు తగ్గిస్తాయని మరో అధ్యయనంలో తెలిసింది. వేరుశనక్కాయల్లో – విటమిన్ బి–కాంప్లెక్స్లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్–బి3గా పిలిచే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది. మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. ఈ ఇమ్యూనిటీ కారణంగా మరెన్నో జబ్బులూ నివారితమవుతాయి. -
బంగారం తింటుంది.. ఇంధనం ఇస్తుంది!
సష్టి చాలా విచిత్రమైంది. మూరెల్లా థెర్మోఅసిటికా అనే బ్యాక్టీరియా విషయమే తీసుకోండి. కాసింత బంగారం పడేస్తే... సౌరశక్తిని వాడుకుని బోలెడంత ఇంధనం ఇస్తుంది. యూసీ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియంపై కొన్ని పరిశోధనలు చేశారు. కాడ్మియం సల్ఫైడ్ నానో కణాలను బ్యాక్టీరియాపై పొరలకు అతికించి చూసినప్పుడు ఒకొక్కటి మినీ రియాక్టర్లు అయిపోయాయి.ఆ తరువాత ఇవి సౌరశక్తిని వాడుకుని కార్బన్డైయాక్సైడ్ను కాస్తా ఉపయోగకరమైన రసాయనాలు ఇంధనాలుగా మారుస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు శక్తిని తయారు చేసుకున్నట్లు అన్నమాట. కాడ్మియం సల్ఫైడ్ స్థానంలో బంగారు నానోకణాలను వాడినప్పుడు ఇంధనాల ఉత్పత్తి మరింత మెరుగైనట్లు యూసీ బెర్క్లీ శాస్త్రవేత్త యాంగ్ చేసిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కాడ్మియం సల్ఫైడ్ కేవలం దశ్యకాంతిని మాత్రం శోషించుకోగలిగేది. అదే సమయంలో బ్యాక్టీరియాకు ఈ రసాయనం విషం. బంగారు నానోకణాలను వాడినప్పుడు మాత్రం ఈ లోపాలు తొలగిపోయి.. కార్బన్ డైయాక్సైడ్ నుంచి 33 శాతం ఎక్కువ అసిటేట్ ఇంధనం లభించిందని యాంగ్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు, ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆ తరువాత ఈ పద్ధతి ద్వారా చౌకైన, మళ్లీమళ్లీ ఉత్పత్తి చేసుకోగల ఇంధనాల తయారీ సాధ్యమవుతుందని వివరించారు. -
దీర్ఘాయుష్ ఫలం!
స్ట్రాబెర్రీస్ రంగు, రుచి కారణంగా వాటిని ఎన్నో పానియాల్లో, ఎనర్జీ డ్రింక్స్లో ఉపయోగిస్తుంటారు. అవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.. ఆరోగ్యానికీ అంతగానే మేలు చేస్తాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. స్ట్రాబెర్రీస్లోని గుండెకు మేలు చేసే ఎలాజిక్ యాసిడ్, యాంథోసయనిన్, క్యాటెచిన్, క్వార్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ కారణంగా అవి గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. రక్తనాళాలు బాగా విప్పారేలా చేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెన్) రాకుండా చూస్తాయి. స్ట్రాబెర్రీస్లోని శాల్సిలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్లు చర్మంపై మృతకణాలను తొలగించడంతో పాటు, మొటిమలు రావడాన్ని నివారిస్తాయి. అంతే కాదు.. దీర్ఘకాలం మేనిని మిలమిల మెరిసేలా చూస్తాయి. వీటిలో విటమిన్–సి చాలా ఎక్కువ. అది చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అందుకే స్ట్రాబెర్రీస్ తినేవాళ్లలో చర్మం ఆరోగ్యకరంగా, యౌవనంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ తినడం వల్ల చర్మానికి అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ కూడా దొరుకుతుంది. స్ట్రాబెర్రీస్ తినేవారిలో కంటినరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి వ్యాధులు నివారితమవుతాయి. కంట్లోని ఆక్యులార్ ప్రెషర్లో హెచ్చుతగ్గులు లేకుండా చూడటం ద్వారా గ్లకోమా వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. ఇందులో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అది రక్తపోటును అదుపులో ఉంచి హైబీపీని నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్లో ఉండే విటమిన్–సి, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ కారణంగా అది అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఆర్థరైటిస్, గౌట్ వంటి ఎముకల వ్యాధుల్లో ఉండే నొప్పిని గణనీయంగా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది. కీళ్లలో కందెన బాగా ఉత్పత్తి అయ్యేలా చూసి, అవి దీర్ఘకాలం పనిచేసేలా తోడ్పడుతుంది. స్ట్రాబెర్రీస్లోని ఫైటోకెమికల్స్ కారణంగా అవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీస్లోని పోషకాలు మనలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే హార్మోన్లను ఎక్కువగా స్రవించేలా చేస్తాయి. ఈ హార్మోన్లు కొవ్వును కరిగేలా చూస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకున్న వారికి స్ట్రాబెర్రీలు తినడం ఒక రుచికరమైన మార్గం. స్ట్రాబెర్రీలలోని పోషకాలన్నీ మన రోగనిరోధక శక్తిని బాగా పెంచేవే. అందుకే స్ట్రాబెర్రీలు తినేవారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. -
రికార్డులూ బద్దలు కొడతారు
కుండలో పట్టనంత ఎనర్జీ ఉంటుంది ఈ పిల్లల్లో! ఇవాళ వీళ్లు ఆగరు... రేపు వీళ్లను పట్టలేం. వీళ్లలో ఉన్న ఈ అత్యుత్సాహం, సూపర్ ఎనర్జీని కంట్రోల్ చేయడం తల్లిదండ్రుల తరం కాదు. కానీ... ఈ దూకుడును దారిలో పెడితే ఫ్యూచర్లో రికార్డులూ బద్దలు కొట్టగలరు. ముందుగా ఒక ఉపకథతో ఈ రుగ్మత గురించి మొదలుపెడదాం. ఇప్పుడతడి వయసు 33 ఏళ్లు. కానీ చిన్నప్పుడు అతడి పరిస్థితి వేరు. దేనిమీదా దృష్టి కేంద్రీకరించేవాడు కాదు. ఉన్నచోట కుదురుగా ఉండేవాడూ కాదు. ప్రతిరోజూ స్కూల్ టీచర్ నుంచి ఫిర్యాదులే ఫిర్యాదులు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే దేనిమీదా దృష్టి సారించలేని ఒక జబ్బు ఉందని తేలింది. దృష్టి కేంద్రీకరించ లేకపోవడం, అతిచురుగ్గా ఉండటం ఆ జబ్బులో భాగం. అతడి అతి చురుకుదనాన్ని ఎలా భరించాలో తల్లికి తెలియలేదు. ఆ అతిచురుకుదనాన్ని చానలైజ్ చేయాలనుకుని స్విమ్మింగ్పూల్ను పరిచయం చేసింది తల్లి. ‘ ముఖం తడిసిపోతుంది... ఈదను’ అన్నాడా పిల్లాడు. ‘సరే బ్యాక్స్ట్రోక్తో మొదలుపెట్టు’ అని మరో సలహా ఇచ్చింది. అంతే. 2016 ఒలింపిక్స్ నాటికి ఈతలో అతడు సాధించిన మొత్తం మెడల్స్ 28. వాటిలో 23 బంగారు పతకాలు. ఆ కుర్రాడి పేరు మైకెల్ ఫెల్ప్స్. అతడికి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆ జబ్బు పేరు ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్’. సంక్షిప్తంగా దాన్నే ఏడీహెచ్డీ అంటారు. అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) అంటే: పిల్లల వికాసంలో లోపాన్ని కలిగించే ఒక రుగ్మత ఇది. ఈ రుగ్మతలో దృష్టి కేంద్రీకరణ లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే తీవ్రమైన అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారి ఒక్కొక్కటి బయట పడుతుంటాయి. గతంలో ఏడేళ్ల వయసులో బయటపడే ఈ రుగ్మత ఇప్పుడు నాలుగేళ్లకే కనిపిస్తోంది. విస్తృతి కూడా ఎక్కువే: మానసిక వైద్యశాస్త్రంలో దీనిని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు. ఏడీహెచ్డీలో అనేక రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 శాతం పిల్లల్లో ఈ రుగ్మత కనిపిస్తోంది. ఇదొక దీర్ఘకాలిక సమస్య. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో ఆ తర్వాత యుక్తవయసుకు వచ్చాక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల్లో ఏడీహెచ్డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ. ఏడీహెచ్డీకి కారణాలు ఏడీహెచ్డీకి కారణాలు ఇప్పటికీ నిర్దిషంగా తెలియదు. జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజికమైన అనేక అంశాలు ఈ రుగ్మతకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటు న్నారు. జన్యుపరమైనవి: ఏడీహెచ్డీకి కారణమైన జన్యుపరమైన లోపాలను పెట్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. ఈ స్కాన్లో మెదడును పరీక్షించినప్పుడు డోపమైన్ ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ తక్కువ స్థాయిలో జరుగుతుందని గుర్తించారు. వాతావరణపరంగా: వాతావరణంలో సీసం (లెడ్) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువ. మద్యం, పొగాకు, పొగతాగడం వంటి నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవం సమయంలో తలకు గాయం అయిన వారు ఏడీహెచ్డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్నెట్, వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో ఏడీహెచ్డీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై నిమగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు. ఆహారం: స్వాభావిక ఆహారంపై పెరగకుండా కృత్రిమరంగులు వేసే ఆహారం, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం తినే పిల్లల్లో ఏడీహెచ్డీ ఎక్కువ. దీనితోపాటు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్ ఇండెక్స్’ ఉన్న ఆహారం... అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువ. జంక్ఫుడ్, ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంతో వండిన పదార్థాలు తినే పిల్లల్లోనూ ఏడీహెచ్డీ అవకాశాలు ఎక్కువ. సామాజిక అంశాలు: కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని పిల్లల్లోనూ, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న చిన్నారుల్లో ఈ రుగ్మత ఎక్కువ. ఇటీవలి పరిశోధనల ప్రకారం కుటుంబం పట్ల మంచి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు, తాతా నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో తమను తాము చక్కదిద్దుకునే సామర్థ్యం చాలా ఎక్కువ అని తెలిసింది. పిల్లలతో ఆరోగ్యవంతమైన మంచి సంబంధాలు నెరపుతూ, వారితో మంచిగా మసలుతుంటే ఏడీహెచ్డీ తీవ్రత తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. చక్కదిద్దడం ఎలా? ఏడీహెచ్డీ ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో... ఇలా రెండూచోట్లా ఒకేసారి (సైమల్టేనియస్గా) జరగాలి. ఈ రెండుచోట్లా పిల్లల ప్రవర్తనను చక్కదిద్దడం (బిహేవియర్ మాడిఫికేషన్), జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్డీని అదుపులో పెట్టవచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన సైతం ఇలాంటి పిల్లల్లో మంచి మార్పు తీసుకుని వస్తుంది. ఇలాంటి పిల్లల పట్ల కఠినంగా ఉండటం, శిక్షించడం సరికాదు. మొదట్లో ఇలాంటి చర్యలతో వెంటనే కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు చాలా తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం చాలా ఓపిక, మంచి సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం. విషయం వారికి తెలియనే తెలియదు... తనకు ఏదో లోపం ఉన్నట్లు పిల్లవాడికి తెలియనే తెలియదు. యుక్తవయసుకు వచ్చేవరకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. ఓరల్స్ విషయంలో వాళ్ల పని తీరు బాగున్నా ఇలాంటి పిల్లలు రాతపని చేయడానికి, హోమ్వర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఫలితంగా వాళ్ల గ్రేడ్స్ తగ్గుతాయి. దాంతో ఇలాంటి పిల్లలు అంత తెలివితేటలు ఉన్నవారు కాదనే ముద్ర పడుతుంది. నిజానికి వీళ్లు కూడా చాలా చురుకైన పిల్లలే. మంచి తెలివితేటలు ఉన్నవారే. అయితే తమ శక్తియుక్తులన్నీ చదువు మీద గాక, ఆటపాటలు, ఇష్టమైన హాబీల వంటి వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సమస్య నియంత్రణకు మార్గాలు ∙రోజూ జరిగినవి అడిగి తెలుసుకోవడం: పిల్లల రోజువారీ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, ఆ రోజు చేసిన తప్పు పనుల వల్ల కలిగే అనర్థాలు వివరించాలి. మంచి విషయాలను ప్రోత్సహించాలి. మర్నాడు తప్పులు జరగకుండా చూడటంతో పాటు, మంచిపనులు చేసేలా ఉత్సాహపరచాలి. మెచ్చుకోవడం: పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ ఉండాలి. మరోమారు అవే చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. క్రమబద్ధంగా గడిపేలా చేయడం: వాళ్ల రోజువారీ కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా ఒక నిర్దిష్టమైన టైమ్టేబుల్ రూపొందించాలి, ఆ ప్రకారం వాటిని చేసేలా చూడాలి. వారు చెడుగా ప్రవర్తించకుండా చూస్తూ ఎప్పుడూ బిజీగా ఉంచాలి. కథలు చెప్పడం: నీతిపాఠాలు హత్తుకునేలా కథలు చెప్పాలి. ఆ కథలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిలా ప్రోత్సహించి, వాటిని నివృత్తి చేయాలి. శారీరక వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు ఆటల్లో, వ్యాయామంలో పాల్గొనేలా చూడాలి. తల్లిదండ్రుల శ్రద్ధ: పిల్లల చదువులతోపాటు అన్ని విషయాల్లోనూ పేరెంట్స్ మంచి శ్రద్ధ తీసుకోవాలి. మందులు: ఏడీహెచ్డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్స్టిమ్యులెంట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను ఆరేళ్లకు పైబడినవారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్ ఆయిల్, ప్రోబయోటిక్ వంటి సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దృష్టి కేంద్రీకరణ లోపాలుండే పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... ∙మతిమరపు. ∙ కమాండ్స్ను సరిగా స్వీకరించలేకపోవడం ∙ఇచ్చిన వ్యవధిలో తమక అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం ∙స్పెల్లింగ్స్ చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం ∙క్లాస్రూమ్లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ∙చాలా ఎక్కువగా మాట్లాడుతుండటం. ∙పగటికలలు కనడం ∙ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం. ఇక దృష్టి నిలపలేకపోవడం అనే ముఖ్య లక్షణం ప్రతిసారీ అతిచురుకుదనం (హైపర్యాక్టివిటీ)తో కలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి పిల్లలను విధేయతా, క్రమశిక్షణా లేనివారిగానూ పరిగణిస్తారు. కానీ అది సరికాదు. దృష్టి కేంద్రీకరణ లోపాలు ఉన్న పిల్లల్లోనూ విధేయత, క్రమశిక్షణ ఉంటాయి. వారిలో తమపై తమకు కొంత నియంత్రణ ఉంటుంది. ఏడీహెచ్డీకి చికిత్స తప్పనిసరి... ఎందుకంటే... ఒక మోస్తరు (మాడరేట్) ఏడీహెచ్డీ నుంచి తీవ్రమైన (సివియర్) ఏడీహెచ్డీ ఉన్న పిల్లలకు చికిత్స అందించకపో 1. దృష్టి కేంద్రీకరణ శక్తి, ఏకాగ్రతా మరింతగా తగ్గిపోతాయి. చదువుల్లో బాగా వెనకబడిపోతారు. స్కూలు నుంచి పేరెంట్స్కు ఫిర్యాదులు ఎక్కువవుతాయి. అది పిల్లలపైనా, తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులకు మనోవేదనగా పరిణమిస్తుంది. 2. పిల్లలు అతిచురుకుదనంతో చేసే అల్లరీ, వారు చేసే విధ్వంసకరమైన పనులు శ్రుతిమించి, ఒక్కోసారి అది పిల్లలకూ లేదా ఇతరులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇంతటి పరిస్థితుల్లోనూ దాన్ని పసితనపు అల్లరిగానే పరిగణించి అప్పటికీ తగిన చికిత్స అందించకపోతే యుక్తవయసు వచ్చే నాటికి అతడు తీవ్రమైన నిస్పృహకులోనై డిప్రెషన్లోకి వెళ్లవచ్చు. అందుకే ఏడీహెచ్డీ పిల్లలకు చికిత్సతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్లు అవసరం. తెలివైనవారు కాదనేది ఒక అపోహ మాత్రమే ఏడీహెచ్డీ ఉన్న పిల్లలు స్వతహాగా తెలివైనవారే అయినప్పటికీ వారు ఇంటెలిజెంట్ కాదనే దురభిప్రాయం ఉంది. ఆ అపోహ వల్ల వాళ్ల ప్రవర్తనలో మార్పులు (బిహేవియరల్ ప్రాబ్లమ్స్) వస్తాయి. పిల్లల్లో వచ్చే దృష్టి కేంద్రీకరణ లోపాలను కొద్దిపాటి ఓపికతో చాలా బాగా పరిష్కరించవచ్చు. సామాజిక బాధ్యతగల టీచర్లు ఉండే స్కూళ్లలో ఇలాంటి పిల్లలను తేలిగ్గా దారికి తేవచ్చు. అయితే కొద్దిగా మానసిక వైకల్యం ఉండి, ఇలాంటి దృష్టి కేంద్రీకరణ సమస్య వస్తే మాత్రం అలాంటి విద్యార్థులకు ప్రత్యేక (స్పెషల్) స్కూల్స్లో చేర్చాలి. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అవసరమవుతాయి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ -
గౌర్వరం
జీవితం ప్లస్ అవ్వాలి..అంతకంటే మంచి విషయం జీవితంలో ప్లస్లుండాలి!!భూకంపాలొస్తాయి.. సునామీలొస్తాయి.. ద్రోహాలు జరుగుతాయి.. అన్యాయం ఉంటుంది!జీవితంలో వేసుకునే లెక్కల్లో ఇవన్నీ మైనస్లే!!మరి ఇన్ని మైనస్లను తలదన్నే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది?ఎవరిస్తారు?నిన్ను నువ్వు గౌరవించుకున్న క్షణం.. ఆ ప్లస్లన్నీ నీలోనే కనపడతాయి!! సునాలీ ఆనంద్ గౌర్ మనందరికీ అద్దం పట్టిచూపించిన గౌరవం అదే!! తెల్లవారి పేపర్ తెరిస్తే హత్యలు, రేప్లు, మోసాలు, లూటీలు. టీవీ ఆన్ చేసినా అవే ఘోరాలు. పక్కవాళ్లను పలకరిస్తే కష్టాల ఏకరువు పెడతారు. స్నేహితులతో మాట్లాడితే ఇంక్రిమెంట్ లేదు వర్క్లోడ్తో స్ట్రెస్ అంటూ సమస్యల పురాణం విప్పుతారు. చుట్టాలను చుట్టొస్తే ఇంటికో రామాయణం.బాబోయ్... ఇంత నెగటివ్ వాతావరణమా? ఎక్కడా సంతోషం లేదా? ఎవరూ ఆనందంగా లేరా? ప్రాబ్లమ్స్తో పరేషాన్ అవడం తప్ప పాజిటివ్ ఆలోచనలతో ఒక్కరూ ఉండరా?తన చుట్టూ కనిపించిన వాతావరణం చూసి షాక్ అయింది సునాలీ ఆనంద్ గౌర్. పాజిటివ్ ఎనర్జీ నింపేందుకు సిద్ధమైంది.మనం బతకొచ్చు.బతుకు మీద ఆశ ఉన్నవాళ్లు మన చుట్టూ ఉన్నారు అని పదే పదే ఆమె చెప్పదల్చుకుంది.ఆమె చేస్తున్న ప్రయత్నానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది.ఎవరీ గౌర్?ఆనంద్ గౌర్ పుట్టింది, పెరిగింది, చదువుకుందీ ఢిల్లీలోనే. ఢిల్లీ యూనివర్శిటీలో లా చేసింది. లాయర్గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. రెండేళ్లు గడిచేసరికి చిరాకేసింది. కోర్టులో అడుగు పెడితే చాలు కలహాలు, కొట్లాటలు వినడంతోనే పొద్దుపొడిచేది. విసుగొచ్చింది.ఆ నెగటివ్ వాతావరణాన్ని భరించలేక నల్లకోటుకి రాంరాం చెప్పేసింది. ఆ తర్వాత? ఢిల్లీలోని గోలే మార్కెట్లో తల్లి నడిపిస్తున్న సెయింట్ పాట్రిక్స్ ప్లే స్కూల్లో టీచర్గా చేరింది. పిల్లలతో గడుపుతూంటే తనలో కలుగుతున్న ఒక కొత్త ఉత్తేజాన్ని గమనించింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లినా అదే ఉత్సాహం.. ఉల్లాసంతో ఉండేది. లాయర్గా ఉన్నప్పుడు గూడు కట్టుకున్న దిగులంతా ఇప్పుడు తుడిచేసినట్టయిపోయింది. అంటే పిల్లల్లో నెగటివ్ ఎనర్జీ లేదు. వాళ్ల కేరింతలు.. అల్లరి.. ఆనందం.. అంతా పాజిటివే! అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషుల్లో కేవలం పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకుంది. పెదవుల మీద చిరునవ్వు ఆ శక్తినిస్తుందనీ గ్రహించింది. పాజిటివ్ జర్నీ... టీచర్గా ఉండగానే గౌర్కు పెళ్లయింది. అత్తగారి ప్రాంతమైన గురుగ్రామ్కు షిఫ్ట్ అయింది సునాలీ. అయినా టీచర్ ఉద్యోగం వదల్లేదు. రోజూ గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి బస్సులో వచ్చేది. వచ్చేటప్పుడు, స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు తన చుట్టూ ఉన్న మనుషులను గమనించడం మొదలుపెట్టింది. బస్స్టాప్లోకి ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చే వాళ్లను చూసి పలకరింపుగా నవ్వేది. అప్పటిదాకా కంగారు పడ్డవాళ్లు ఆమె నవ్వుకు బదులుగా నవ్వేవారు. కొంచెం కుదుటపడ్డట్టుగా అనిపించేవారు. హడావిడిగా బస్ ఎక్కేవాళ్లనూ ‘హాయ్’ అంటూ నవ్వుతూ విష్ చేసేది. సీట్ దొరక్క రాడ్ పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్లు సైతం ఆమె చెప్పిన హాయ్ను మనాసారా ఆస్వాదించేవాళ్లు. ఆ రోజుకి అది చాలు అనుకుని తాను కోరుకున్న ఎనర్జీతో ఇంటికెళ్లేది సునాలి. ఒకసారి.. బడికి బయలుదేరుతుంటే బస్స్టాప్కి వెళ్లే దారిలో ఉన్న ఓ ఇంట్లోంచి ఓ ముసలావిడ అయిదారు బాటిళ్లలో చల్లటి నీళ్లను నింపి తీసుకొస్తూ కనిపించింది. వాటిని ఆమె ఏం చేస్తుందా? అనే కుతూహలం సునాలీలో. బస్స్టాప్కి రాగానే మంచి నీళ్లను అక్కడ ఫుట్పాత్ మీదున్న వాళ్లకు ఇచ్చింది ఆ ముసలావిడ. ఆ పెద్దావిడ పాజిటివ్ ఎనర్జీని తనకు అందించినట్టు ఫీలయింది సునాలీ. బడి నుంచి ఇంటికి వెళ్లాక ఫేస్బుక్లో ఓ పేజ్ క్రియేట్ చేసింది ‘సోల్ స్టరింగ్’ పేరుతో. తాను ఉదయం చూసినదాన్ని ఓ కథలా రాసింది. వందల లైక్లు.. పదుల్లో కామెంట్స్. ఇక ఆ ప్రయత్నం ఆపలేదు. తెలీకుండానే... యాక్సిడెంటల్గా జర్నలిస్ట్ అవతారమెత్తింది. ఇప్పుడు.. ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. తనకు వీలు చిక్కినప్పుడల్లా వీ«ధుల్లోకి వెళ్తుంది. అలాంటి పాజిటివ్ మనుషులు ఎవరు కనిపించినా వాళ్ల గురించి సోల్ స్టరింగ్లో రాస్తుంది. భర్త, కూతురితో బయటకు వెళ్లినా కెమెరా, పేపర్, పెన్నూ వెంట తీసుకెళ్తుంది. మనుషుల్లోని పాజిటివ్నెస్ను వెదుకుతుంది. ఫేస్బుక్లో పెడ్తుంది. అలా ఒకసారి ఆమె ఢిల్లీలోని ఓ మాల్కు వెళ్లింది. మాల్ బయట సిమెంట్ బెంచ్ మీద ఓ వృద్ధుడు కూర్చొని కనిపించాడు. ఒంటరిగా వచ్చిపోయే జనాలనే చూస్తున్నాడు. ఆమె దృష్టి అతని మీద పడింది. వెళ్లి ఆయనను పలకరించింది. నవ్వుతూ బదులిచ్చాడు అతను. ఆ మాటా ఈమాటా మాట్లాడి వివరాలు అడిగింది. అప్పుడు తెలిసింది సునాలికి అతను ఓ క్యాన్సర్ పేషంట్ అని. కీమో థెరపీలో ఉన్నాడని. ‘ప్రతిరోజూ సాయంకాలం అలా రద్దీ ఉన్న చోటికి వచ్చి జనాలను చూస్తూ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాను. క్యాన్సర్తో పోరాడ్డానికి అదెంతో శక్తినిస్తోంది. జీవితం పట్ల ఆశను పెంచుతోంది’ అని అతడు చెప్పాడు. మరణం ఖాయమని తెలిసిన మనిషిలోనూ కనిపించిన ఆ పాజిటివిటీ ఆమెను కదిలించింది. అతని గురించి ఫేస్బుక్లో రాసింది. లైక్లు, కామెంట్లు, షేర్లతో ఆ వార్త మారుమోగింది. అది చూసిన మెయిన్స్ట్రీమ్ పత్రికలూ సునాలీ ద్వారా అతని చిరునామా పట్టుకొని అతని గురించి రాశాయి. క్యాన్సర్ చికిత్స కోసం అతనికి ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందింది. దాంతో సునాలీ ఫేమస్ అయింది. ఆమె ‘సోల్ స్టరింగ్’ కథనాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రధాన స్రవంతి పత్రికలన్నీ సునాలీ ఇంటర్వ్యూను ప్రచురించాయి. ఆమె పాజిటివ్ ప్రయాణంలో చాలామంది అడుగులు కలిపారు. ఢిల్లీలో ఇప్పుడది ఓ ఉద్యమంలా సాగుతోంది. మనిషిలోని మంచినే చూసే ఉద్యమం. ‘పాజిటివ్ థింకింగ్.. ఎన్ని ప్రతికూల పరిస్థితులనైనా జయించేలా చేస్తుంది. ఇప్పుడు మనలో లేనిది అదే. దాన్ని తిరిగి పోందాలనే నా తపన. అందుకే నా చుట్టూ ఉన్న మనుషుల్లోని పాజిటివ్నెస్ను సోల్ స్టరింగ్లో పెడ్తున్నా. దాంతో మిగిలిన వాళ్లూ ఇన్స్పైర్ అవుతారని’ అంటుంది సునాలీ ఆనంద్ గౌర్. ఈ పెద్దాయన ఒక క్యాన్సర్ పేషెంట్. రోజూ సాయంత్రాలు ఫుట్పాత్ మీద కూర్చుని జనాన్ని చూస్తూ వాళ్లలోని ఉత్సాహాన్ని గమనించడం ద్వారా క్యాన్సర్ని ఎదుర్కునే శక్తి పొందుతుంటాడు. మనిషికి మనిషికి మించిన మందు లేదు. ఈ విషయాన్ని గమనించి గౌర్ ఆయన మీద రాసిన ఫేస్బుక్ కథనానికి విశేషమైన స్పందన వచ్చింది. – శరాది -
24/7 కరెంట్ అందించే విశిష్ట టర్బైన్లు
మారమూల గ్రామాల్లో రోజంతా విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా కష్టంగానే ఉంటుంది. ఎక్కడైనా 24 గంటల కరెంట్ అందుతుందంటే చాలా గ్రేట్. ప్రస్తుతం మారమూల ప్రాంతాల వారికి 24/7 విద్యుత్ అందించడానికి విశిష్టమైన టర్బైన్లు అందుబాటులోకి వచ్చాయి. బెల్జియన్ కంపెనీ టర్బ్యూలెంట్ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈ విశిష్ట టర్బైన్ల ద్వారా 60 గ్రామాల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించడానికి వీటిని తీసుకొచ్చినట్టు కెంపెనీ చెప్పింది. వీటిని ఎక్కువగా నదులు, కాలువల వద్ద ఏర్పాటుచేసి, విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంటోంది. చిన్న తరహా విద్యుత్ ఉత్పాదకతకు భవిష్యత్తు ఇదే అంటున్నారు నిపుణులు. అసలెలా ఈ టర్బైన్లు పనిచేస్తున్నాయో ఈ వీడియో ఓ సారి చూడండి. -
ఈలాన్ మస్క్ ప్లాన్... ఇల్లిల్లూ ఓ జనరేటర్
సౌరశక్తిని వాడుకునే విషయంలో ఉన్న ప్రధాన అడ్డంకి... ప్యానెల్స్ కోసం పెట్టే పెట్టుబడి. వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో కరెంటు బిల్లు ఆదా అవుతుంది కాదా అని చాలామంది సౌరశక్తి వాడకం విషయంలో వెనుకంజ వేస్తూంటారు. ఈ సమస్యను తీర్చేందుకు టెస్లా కార్ల కంపనీ వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్ ఓ వినూత్నమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. తన కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సోలార్ పెంకులు, బ్యాటరీలను 50 వేల ఇళ్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ ప్రయోగం జరగబోతోంది. పైకప్పులకు వాడే పెంకుల మాదిరిగానే మస్క్ కంపెనీ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగంలో భాగంగా ముందు వెయ్యి ఇళ్లల్లో ఈ ప్యానెల్స్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా ఆ వెయ్యి కుటుంబాల వారు ఉచితంగా వాడుకుంటారు. వాడుకోగా మిగిలిన విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు గ్రిడ్కు పంపుతారు. ఇలా సంపాదించే డబ్బుతోనే ప్యానెల్స్, బ్యాటరీల ఏర్పాటుకు పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు మస్క్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఐడియా భలే ఉంది కదూ... -
తిన్నా నీరసమే.. తినక పోయినా నీరసమే..
భీమవరం టౌన్: ’’గంగ గోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైన నేమి ఖరము పాలు..’’ అని వేమన ఏనాడో చెప్పారు. సంఘం మేలు కోరి ఎన్నో హితవచనాలు పలికారు. అవన్నీ మనం పట్టించుకోకుండా అధునిక ప్రపంచం, పద్ధతులు అంటూ ఎన్నో కొత్త అలవాట్లు చేసుకున్నాం, చేసుకుంటున్నాం. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. జిల్లాలో 39 లక్షల జనాభా ఉంది. ఆహారం తీసుకోవడంలో పరిమాణం చూస్తున్నామే గాని, వాటి వల్ల ఎంతమేరకు ఉపయోగకరం అనేది పట్టించుకోవడం లేదు. దాంతో జబ్బులతో ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపాటి పనులు కూడా చేసుకోలేక నీరసించి పోతున్నాం. ఇందుకు ఉదాహరణే కింద ఉదహరిస్తున్న ఆలుమగల సంభాషణ. భార్య: చూడు ఆ వయస్సులో కూడా ఎంత బలంగా, చలాకీగా ఉన్నాడో.. భర్త: అవునవును పూర్వకాలం తిండి. అందుకే ఈ వయస్సులో కూడా ఇలా ఉన్నాడు. 80 ఏళ్లు పైబడే ఉన్నట్లు కనిపిస్తోంది. భార్య: మనమూ ఉన్నాం. ముప్పూటలా తిన్నా నీరసమే.. తినకపోయినా నీరసమే. అప్పట్లో మా తాత కుండడు అన్నం, ఒక కోడి, 50 గారెలు, 20 బూరెలు ఒకేసారి తినేసేవాడట మా నానమ్మ చెప్పేది. అదేమిటో వాళ్లకీ మనకీ వ్యత్యాసం అర్థం కావడం లేదు. భర్త: అప్పుడూ ఇప్పుడూ అదే అన్నం, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు, మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, పచ్చళ్లు, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ తింటున్నాం కదా అయినా ఎందుకు ఇంత నీరసంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నావా? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెబుతా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ’’అమ్మచేతి గోరుముద్ద, నానమ్మ చేసిన సున్నుండ, అమ్మమ్మ పట్టిన ఊరగాయ ఇప్పుడెక్కడివి. అంత తీరిక సమయం ఎవరికీ లేదు. నరం లేని నాలుక కోరుకునే రుచులకు అలవాటుపడి ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్లపై ఆధారపడుతున్నాం. టేస్టింగ్ సాల్ట్ వంటకాలు. రంగులు కలిపిన స్వీట్లు, పోషక విలువలు లేని పిజ్జాలు, బర్గర్ల బాట పడుతున్నారు. మరోవైపు పాలు, నెయ్యి, నూనెలు, పప్పు, బియ్యం, ఇలా అన్ని కల్తీమయమే. దంపుడు బియ్యం బలం నేడు ఎవరికీ తెలియదు. అంతా పాలిష్ బియ్యం. పురుగు మందులతో తడిచి ముద్దయిన ఆకు, కూరగాయలు. ఇంటి పెరట్లో, పొలం గట్టున సహజ సిద్ధంగా పెంచిన కూరగాయలు, ఆకుకూరలు ఇప్పుడు గగనమయ్యాయి. సెంటు స్థలం ఉంటే ఒంటి స్తంభం మేడ నిర్మాణం, పొలాలను కనుమరుగు చేసి ఆక్వా చెరువులు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు. పల్లెల్లో పాలు, పెరుగు, కూరగాయలు తీసుకోండి వదినా, అక్కా అంటూ ఒకప్పుడు ఇచ్చిపుచ్చుకునే వారు. ఇప్పుడు నీళ్లు కలిసిన పాలు, పిండి పాలు, ఇక ఒంట్లో బలమెక్కడ ఉంటుంది. పంటకాలువల్లో అప్పటికప్పుడు పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు, పెరట్లో పెంచిన నాటుకోళ్లు, అవిపెట్టిన గుడ్లు ప్రతీ ఇంటా తినేవారు. పదిమందికి పంచేవారు. మరి ఇప్పుడో పురుగుమందుల అవశేషాలున్నాయని బెంబేలెత్తిస్తున్న చేపలు, రొయ్యలు, తలవాల్చే తెల్లకోళ్లు. అవిపెట్టే గుడ్లు. ఇంకెక్కడ పోషక విలువలున్న పౌష్టికాహారం. నచ్చిన కూరతో కొంచెం గట్టిగా ఓపట్టు పడితే ఓ మాత్ర, ఆ తరువాత గ్యాస్కు ఓ మాత్ర, అయినా మంట తగ్గకపోతే సిరప్, ఇది నేటి మన తిండి తిప్పలు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు సేంద్రియ సేద్యం అంటూ పూర్వ వైభవం, ఆరోగ్యం కోసం పరుగులు పెడుతున్నాం’’ అని వివరించాడు భర్త. ఇకనుంచి మనమూ రసాయనాలు లేని, కల్తీలేని, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం అంది భార్య. ఇది ఆ భార్యభర్తల ఆలోచనే కాదు. నేటి సమాజంలో చాలామందిలో వస్తున్న మార్పు. తీసుకునే ఆహారం విషయంలో సహజసిద్ధమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈ మార్పు ముదావహమే గదా. జిల్లా జనాభా, వినియోగించే పరిణామం ఆధారంగా లెక్కిస్తే జిల్లాలో ఆహార పదార్థాల వినియోగం నెలకు ఇలా ఉంది. జిల్లా జనాభా: 39,95,742 మటన్ 200 టన్నులు చికెన్ 420 టన్నులు రొయ్యలు 200 టన్నులు పీత 50 టన్నులు చేప 400 టన్నులు గుడ్లు 6 కోట్లు బియ్యం 30 వేల టన్నులు కందిపప్పు 2,420 టన్నులు పెసరపప్పు 1200 టన్నులు పాలు 3.60 కోట్ల లీటర్లు -
కుండలిని శక్తి అంటే..?
ప్రతి మనిషిలో కుండలిని శక్తి ఉంటుంది. ఇది మూలాధార చక్రంలో అంటే భౌతిక శరీరంలో వెన్నుపూస కింది భాగంలో రెండున్నర చుట్లు చుట్టుకుని సర్పాకారంలో చైతన్యరహితంగా ఉంటుంది. అయితే ఇది సూక్ష్మశరీరంలో ఉంటుంది కాబట్టి భౌతిక శరీరంలో మనం చూడలేం. కుండలిని శక్తికి చైతన్యం కలిగితే కాని ధ్యానయోగం మొదలవదు. ఈ కుండలిని శక్తి మనందరిలో చైతన్యరహితంగా ఉన్న స్థితిని నిద్రించడంగానూ, ఇది చైతన్యవంతం అవడాన్ని కుండలిని నిద్రలేవడంగానూ ఆధ్యాత్మికంగా వ్యవహరిస్తున్నారు. ఈ శక్తి నిద్రలేచాకే ధ్యానయోగం మొదలవుతుంది. అప్పుడే భౌతిక శరీరం ద్వారా మనం ధ్యానంలో అనేక అనుభూతులను పొందగలం. అంటే ధ్యానయోగంలో ప్రవేశించాలనుకుంటే ముందుగా కుండలిని శక్తిని నిద్రలేపాలి. కొందరిలో ఇది సహజంగానే జరుగుతుంది. పూర్వజన్మలో ధ్యానయోగంలో ఉండి మరణించిన వారికి ఈ జన్మలో కర్మశేషం అనుభవించాక కుండలిని మేల్కొని మనసు ధ్యానం వైపు, దైవం వైపు మళ్లుతుంది. కొందరిలో అన్ని జన్మల్లో ఆర్జించిన సంచిత, ఆగామి కర్మలన్నీ ఈ జీవితంలో ఏదో ఒక దశలో అనుభవంతో క్షయం అయిన మరుక్షణం కుండలిని శక్తి చైతన్యవంతమవుతుంది. ఫలితంగా అంతదాకా ఆధ్యాత్మిక మార్గంలో లేనివారు సైతం తక్షణం తీవ్ర వైరాగ్యంతో భక్తిలో పడతారు. ఈ జన్మలో చేసుకున్న కర్మల క్షయానికి ధ్యానయోగం చేపడతారు. వీరినే అవధూతలుగా వ్యవహరిస్తారు. లలితాదేవి కుండలిని మాత. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ధ్యానం చేసిన వారికి కుండలిని త్వరగా చైతన్యవంతం అవుతుందని అంటారు. -
దేహవింతలు
పదిశోధన ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఏడు వింతలు ఎప్పటికీ మనకో వండర్. అయితే.. అంతకంటే విడ్డూరమైన, విచిత్రమైన నిర్మాణాలు మన ఒంట్లోనే ఉన్నాయని మీకు తెలుసా? ఉదాహరణకు గుండెనే తీసుకోండి! దేహం మొత్తం మీద కష్టపడి పనిచేసే కార్మికురాలు గుండె ఒక్కటే. ప్రతిరోజూ ఈ కండరం... ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్లు నడపగలిగేంత శక్తిని (ఎనర్జీని) ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడి పైకి వెళ్లి రావచ్చు! గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయంచోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇక మెదడు! అది మీరీ వండర్. మెదడులో 60 శాతం కొవ్వే ఉంటుంది. ఏ సమయంలోనైనా మన మెదడు 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. ఒక బల్బు వెలగడానికి ఇది చాలు. అంతేకాదు, 50 వేల రకాల వాసనలను మెదడు పసికట్టగలదు. ఏ వయసులోనూ ఉండనన్ని మెదడు కణాలు అత్యధికంగా రెండేళ్ల వయసులో ఉంటాయి. అయినా సరే మెదడు పూర్తిగా పరిణతి చెందడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. ఇవి కాక... మన బాడీలో ఇంకా ఏయే వండర్స్ ఉన్నాయో చూడండి. చర్మం: మానవ దేహంలోని అతి విస్తారమైన భాగం ఇది. నిరంతరం తనని తను పునర్నవీకరించుకుంటూనే ఉంటుంది! ప్రతి నిముషం 50 వేల చర్మకణాలు రాలిపోతుంటాయి. ఇలా జీవితకాలం మొత్తం రాలిన కణాల బరువు 18 కిలోలు ఉంటుంది. మెదడు: మనం మేల్కొని ఉన్నప్పటి కంటే, నిద్ర పోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే... అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకు 70 వేల ఆలోచనలు చేయిస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే... బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం కానీ, బ్రెయిన్కి వచ్చే నొప్పిని గ్రహించలేం! ఎముకలు: మనం 300 కు పైగా ఎముకలతో పుడతాం. పెద్దవాళ్లం అయ్యేనాటికి వాటి సంఖ్య తగ్గి, 206కి చేరుకుంటాయి! కారణం కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమే. జ్ఞాపకశక్తి: గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8 వేల కొత్త కణాలతో వృద్ధి చెందుతుంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. వెంట్రుకలు: ప్రతి నాలుగు వారాలకు అంగుళంలో నాలుగో వంతు పెరుగుతాయి. అంటే 6 మిల్లీమీటర్లు. అలా ఒక్కో వెంట్రుకా ఆరేళ్ల వరకు పెరుగుతుంది. తర్వాత రాలిపోతుంది. అదేచోట కొత్త వెంట్రుక మొలుస్తుంది. ఇనుము: మన దేహంలో ఉండే ఇనుము మొత్తంతో మూడంగుళాల పొడవైన మేకును తయారుచెయ్యొచ్చు. కన్ను: మానవ నేత్రం 576 మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరా వంటిది! అది కోటి రకాల వేర్వేరు రంగుల ఛాయల్ని గుర్తించగలదు. నీరు: మనిషి తన జీవితకాలంలో 75 వేల లీటర్ల నీరు తాగుతాడు. దేహం అంత నీటిని పీల్చేస్తుందన్నమాట. ముక్కు, చెవులు: మనిషి ముక్కు, చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుదల ఒక్కొక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో కనిపించదు. తుమ్ము: ఒక బలమైన తుమ్ము మన ముక్కులోంచి, నోట్లోంచి గంటకు 64 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. -
పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన
జంగమహేశ్వరపురం(గురజాల): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతు సంఘ కమిటీ వారు శుక్రవారం ఎద్దుల బండలాగు పోటీలను నిర్వహించారు. నాలుగు పళ్ల విభాగం, ఆరు పళ్లవిభాగం, సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతి విభాగంలో ఐదు బహుమతులు అందిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు పళ్ళ విభాగంలో : మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎద్దులు 3568 అడుగుల లాగి రూ.20,000 మొదటి బహుమతిని, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన పి.మురళి ఎద్దులు 3500 అడుగులు లాగి రూ.15,000 రెండవ బహుమతిని, అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన రజిత రెడ్డి ఎద్దులు 3250 అడుగులు లాగి రూ.12,000 మూడవ బహుమతిని, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన సీహెచ్. గణేష్రెడ్డి ఎద్దులు 3058 అడుగులు లాగి రూ.8,000 నాల్గో బహుమతిని, దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన పెద్దిశెట్టి రాజశేఖర్ ఎద్దులు 2788 అడుగులు లాగి రూ. 5,000 ఐదో బహుమతిని గెలుపొందాయి. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు.కార్యక్రమంలో నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, ,రెక్కల యలమందారెడ్డి, భవనాశి ఫకీర్రెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి, గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఎడ్లపోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
ఏదీ సౌరభం !
సోలార్ విద్యుదుత్పత్తిలో జిల్లా చతికిలబడింది. నిర్దేశిత లక్ష్యానికి చాలాదూరంలో నిలిచిపోయింది. సబ్సిడీ ఉన్నా.. సౌర ఫలకాల కొనుగోలుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అధికారుల ప్రచార లోపమే దీనికి కారణం. ఏలూరు(ఆర్ఆర్పేట) : సోలార్ విద్యుదుత్పత్తి పథకం ఆశించిన ఫలితాలు సాధించ లేకపోయింది. ఈ పథకం ద్వారా గృహాలపై ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాలను 50శాతం సబ్సిడీపై సర్కారు అందిస్తున్నా.. వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ పథకం అమలులో అధికారులూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. తగిన ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం జిల్లాలో సోలార్ ద్వారా 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు గృహావసరాలకు, పరిశ్రమలకు , కళాశాలలకు సౌరఫలకాలు అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 83 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో సౌరఫలకాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్న 51 మంది దరఖాస్తుదారులకు వాటిని అందించారు. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 881 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అంటే ఒక మెగావాట్ కూడా పూర్తిగా ఉత్పత్తి కావడం లేదన్నమాట. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా సుమారు 1500 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కిలో వాట్కు రూ.85 వేల ఖర్చు గృహావసరాల నిమిత్తం సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోవాలంటే కిలోవాట్ సామర్థ్యానికి రూ.85 వేలు ఖర్చవుతుంది. ఒక్కో గృహానికి ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు ఏసీలు వంటి పరికరాల వినియోగానికి రోజుకు రెండు కిలోవాట్ల (8 యూనిట్లు) కరెంట్ అవసరమవుతుందని విద్యుత్ సంస్థల అంచనా. ఈ లెక్కన ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రూ.1.70 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం రూ.70 వేలు నెడ్క్యాప్ ద్వారా సబ్సిడీగా అందిస్తుంది. అంటే వినియోగదారులు రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు వారు వినియోగించే సుమారు 240 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. మిగిలిన విద్యుత్ను అమ్ముకోవచ్చు. దీనికోసం విద్యుత్ సంస్థలు సౌరఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో బై డైరెక్షనల్ మీటరును అమర్చుతాయి. ఆ మీటరు ద్వారా వినియోగదారుడు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు చేరుతుంది. అలా చేరిన కరెంట్కు యూనిట్కు రూ.5.40 చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారునికి చెల్లిస్తాయి. విద్యా సంస్థలు ముందుకొచ్చాయి సోలార్ విద్యుదుత్పత్తికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. భీమవరం విష్ణు, ఎస్ఆర్కేఆర్ కళాశాలలు, తాడేపల్లిగూడెం వాసవి కళాశాల, తణుకులోని చిట్టూరి విద్యా సంస్థ, ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలూ ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే గృహ వినియోగదారులు ముందుకు రావడం లేదు. వారిలోనూ అవగాహన పెరగాలి. –డి.వి.ప్రసాద్, నెడ్క్యాప్ జిల్లా మేనేజర్ -
రక్షాబంధనం సోదర ప్రేమకు రక్ష
ఆగస్టు 18 రాఖీ పౌర్ణమి ఒకసారి రాక్షసులు దేవతలపై దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధం లో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, ఆయనను ఉత్సాహపరుస్తూ, తిరిగి యుద్ధానికి పురికొల్పింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు. రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో నాటినుంచి ప్రతి శ్రావణ పూర్ణిమనాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కాంక్షిస్తున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణనివ్వవలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షాకంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారంగా రూపుదిద్దుకుంది. రాఖీ ఇలా కట్టాలి శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో- అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు- మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి బహిరంగ ప్రదేశంలో కడుతూ- ‘తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా’నంటూ - బంధుస్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలం పాటూ ఆమెకి అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. రక్షాబంధనం కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలనిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో మాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది. - డి.వి.ఆర్. రాఖీ కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి. ఇది స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే..! -
ప్రధాని ఆఫ్రికా పర్యటనలో..
న్యూఢిల్లీః ప్రధాని ఆఫ్రికా పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆఫ్రికా, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం, సహకారం బలోపేతం చేయడంతోపాటు ఆయాదేశాల్లోని అనేక వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నారు. పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, పప్పుధాన్యాలు, విద్యుత్ శక్తి మొదలైన అంశాలపై చర్చించనున్నారు. జూలై 7న మొదలై.. ఐదురోజులపాటు కొనసాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో విద్యుత్, వాణిజ్య, పెట్టుబడి, ఆహారం, సముద్ర భద్రత, తీవ్రవాదం, సహకారం వంటి విషయాలపై దృష్టి సారించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి అమర్ సిన్హా తెలిపారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఒక్కోదేశంలోనూ అనేక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో.. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించగా... ప్రస్తుతం మోదీ పర్యటన మరింత దోహదం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే భారతదేశం ఆఫ్రికా దేశాలనుంచి భారీ పరిమాణంలో పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటుండగా.. ఈ పర్యటనలో మొజాంబిక్ తో దీర్ఘ కాల సేకరణకు ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొద్ది నెల్లుగా భారత్ లో పప్పుధాన్యాల ధర తీవ్రంగా పెరగడం అనేక విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రధాని పప్పుధాన్యాల దిగుబడులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జోహాన్స్ బర్గ్, నైరోబిల్లో భారత సంతతికి చెందిన ప్రజలు గణనీయంగా ఉండటంతో ప్రధాని ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా నాలుగు దేశాల్లో జరిగే సమావేశాల్లో భారత సమాజంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సిన్హా తెలిపారు. పర్యటనలో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఎంతో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ లో భారత్ లో నిర్వహించిన నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల సదస్సుకు సుమారు 54 ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధినేతలు, 40 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. గురువారం ప్రారంభం కానున్న మోదీ విదేశీ ప్రయాణంలో ముందుగా మొజాంబిక్ కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు ఫిలిఫె న్యూసితో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అనంతరం రెండు రోజులపాటు దక్షిణాఫ్రికాలోని జొహన్స్ బర్గ్, పీటర్ మారిట్జ్ బర్గ్, డర్బన్ నగరాల్లో పర్యటిస్తారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంలో మహాత్మాగాంధీ ప్రయాణించిన చారిత్రక రైలులో మోదీ పీటర్మారిట్జ్ బర్గ్ ప్రయాణించనున్నారు. తెల్లవారు కాని వారికి అనుమతి లేదంటూ అప్పట్లో మహాత్మా గాంధీని మొదటి తరగతి కంపార్ట్ మెంట్ నుంచి బయటకు తోసేసిన కథనం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు, ఇతర రాజకీయ నేతలతో మోదీ సమావేశం అవుతారు. జూలై 10న టాంజానియాలో, 11న కెన్యాలో మోదీ పర్యటన జరగనున్నట్లు ప్రధాని పర్యటనపై పూర్తి వివరాలను సిన్హా తెలిపారు. -
అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియమ్!
అతి పెద్ద వస్తు ప్రదర్శన శాలగా పేరొందిన ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇప్పుడు అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. ప్రాచీన కళలు, పురాతన వస్తువులతోపాటు, చరిత్రకు సంబంధించిన వస్తు ప్రదర్శనతో ఆకట్టుకునే మ్యూజియం పర్యావరణ పరిరక్షణలోనూ తనదైన పాత్ర పోషిస్తోంది. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. కళలు, పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన మూడు విభాగాలతో సుమారు 50 వేల వరకూ వస్తువులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. మొత్తం 140 సోలార్ ప్యానెళ్ళు, కలిగిన మ్యూజియంలో సౌర శక్తి ద్వారా ఇక్కడ నెలకు సుమారు 35 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. అలాగే వర్షపునీరు నిల్వ ఉంచడంలోనూ మ్యూజియం ముందు వరుసలో ఉంది. 2008 లో ఈ వస్తు ప్రదర్శనశాలలో ప్రారంభించిన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా సంవత్సరానికి 24 లక్షల లీటర్ల నీటిని కూడ నిల్వ చేయగల్గుతున్నారు. -
ఎక్కువ కరెంటు వాడితే డబ్బులిస్తారు!
జర్మనీ: సాధారణంగా విద్యుత్ వినియోగించినందుకు గాను ప్రజలు ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి కరెంటు ఎక్కువగా వాడకపోయినా లక్షలకొద్దీ తప్పుడు బిల్లులు రావడం చూశాం. కానీ అక్కడ మాత్రం విద్యుత్ అధికంగా వినియోగించండి... డబ్బులు సంపాదించండి అంటూ ప్రభుత్వమే ప్రజలను ప్రాధేయపడిందట. వింతగా ఉంది కదూ! సహజ విద్యుత్ ఉత్సత్తి సామర్థ్యంలో (35,900 మెగావాట్లతో) ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న జర్మనీ... ప్రజలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. విద్యుత్ ఎక్కువగా వినియోగించినవారికి మేమే డబ్బు చెల్లిస్తామంటూ ప్రకటనలు చేసింది. గతనెల్లో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎండ, గాలులతో జర్మనీలో విద్యుత్ పునరుత్సాదకత భారీగా పెరిగి, కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని సౌర, పవన, జల, బయోమాస్ ప్లాంట్లలో విద్యుత్ 55GW నుంచి 63GW వరకూ... అంటే సుమారు 87 శాతం వరకూ ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ ధరలు ప్రతికూల పరిస్థితుల్లోకి చేరడంతో అత్యధిక విద్యుత్ వినియోగించినవారికి, వాణిజ్య వినియోగదారులకు ప్రభుత్వమే ఎదరు డబ్బు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయి. జర్మనీలో గత ఏడాది సగటున సునరుత్సాదకత 33 శాతం ఉన్నట్లు జర్మన్ క్లీన్ ఎనర్జీ థింక్ ట్యాంక్ 'అగోరా ఎనర్జీ వెండే' నివేదికలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన విద్యుత్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2050 నాటికి వందశాతం ఉత్పాదకతను చేరుకునేందుకు జర్మనీ యోచిస్తుండగా... డెన్మార్క్ గాలి టర్బైన్లు ఇప్పటికే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, మిగులు విద్యుత్ ను జర్మనీ నార్వే, స్వీడన్ లకు ఎగుమతి చేస్తోంది. కాగా.. జర్మనీలో ఏర్పడ్డ మిగులు విద్యుత్ అన్నది మంచి పరిణామం కాదని, ఈ విషయంలో సమయానికి ఇటు సరఫరాదారులు, అటు వినియోగదారులు ధరల సూచికపై స్పందించాల్సి వస్తుందని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. పైగా గ్యాస్ పవర్ ప్లాంట్లు ఆఫ్ లైన్లో ఉన్నపుడు, న్యూక్లియర్, లోకల్ ప్లాంట్లు మూసే వీలుండకపోవడంతో వాటిని గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వారు విద్యుత్తుకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రిఫైనరీలు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక వినియోగదారులు మాత్రం విద్యుత్ ను వాడుకొని డబ్బు సంపాదించగల్గుతున్నారని చెప్తున్నారు. -
రెండేళ్లలో 24 x 7 విద్యుత్
తెలంగాణలో సైతం ‘పవర్ ఫర్ ఆల్ ’ అమలు! సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల స్పందన రాష్ట్రంలో కేంద్ర విద్యుత్ శాఖ బృందం పర్యటన రాష్ట్ర విద్యుత్ అధికారులతో ప్రాథమిక చర్చలు 2017-18 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్కు హామీ తొలి విడత కింద ఇప్పటికే ఎంపికైన ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ సాక్షి, హైదరాబాద్: అంతరాయమే లేకుండా 24 x 7 విద్యుత్ సరఫరా. రెప్పపాటు కూడా విద్యుత్ కోతలుండవు. పల్లె, పట్నం.. గృహ, వాణిజ్య, వ్యవసాయం, పరిశ్రమలు అనే తేడాల్లేకుండా అందరికీ విద్యుత్. మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఈ మైలురాయిని అందుకోనుంది. నిరంతర (24 x 7 ) విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 2017-18 నుంచి తెలంగాణలో సైతం అమలు కానుంది. ఈ కార్యక్రమం తొలి విడత కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎంపిక కాగా, త్వరలో ఈ జాబితాలో రాష్ట్రం సైతం చేరనుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన హామీ లభించింది. ‘అందరికీ విద్యుత్’ కింద తెలంగాణను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ఢిల్లీ పర్యటనలో చేసిన విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం సోమవారం విద్యుత్ సౌధలో రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో సమావేశమై రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ అమలుపై ప్రాథమిక చర్చలు జరిపింది. కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వం వహించిన ఈ బృందంలో 11 మంది అధికారులున్నారు. రాష్ట్రంలో 24 x 7 విద్యుత్ కోసం చేపట్టాల్సిన చర్యలు, వనరులు, నిధులపై ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు నివేదించారు. రాష్ట్రం 4,320 మెగావాట్ల విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. మరో 6,680 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటికితోడు మరో 2,500 మెగావాట్లను సమకూర్చుకుంటే నిరంతర విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. దీనికి తగ్గట్లు విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమని చెప్పారు. ఈ మేరకు అదనపు విద్యుత్, నిధులను సమకూర్చాలని ప్రతిపాదించారు. కొత్తగా నిర్మిస్తున్న థర్మల్ ప్రాజెక్టులకు కావాల్సిన బొగ్గు కేటాయింపులతో పాటు పాత ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర బృందం సైతం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణను సైతం ‘అందరికీ విద్యుత్’ కార్యక్రమం కింద ఎంపిక చేస్తామని కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా స్పష్టమైన హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) సమర్పిస్తే నిర్ణయం తీసుకుంటామని సూచించారు. అనంతరం కేంద్ర బృందం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి ఆయనతో సమావేశమైంది. -
సీఎం చంద్రబాబు రేపు రాక
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13వ తేదీన తలపెట్టిన విశాఖ నగర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో నేరుగా బీచ్రోడ్లోని నోవొట ల్కు చేరుకుంటారు. నోవాటెల్ వి.కన్వెన్షన్లో జరుగనున్న కార్యక్రమంలో మౌలిక సదుపాయల మిషన్ను బాబు ప్రారంభించనున్నారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో తొలుత డిపార్టుమెంట్ సెక్రటరీ ఈ మిషన్ ప్రాధాన్యతను వివరిస్తారు. అనంతరం పోర్టు ఆధారిత అభివృద్ధి, మేకింగ్ ఆఫ్ ఏపీ, లాజిస్టిక్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్పై చర్చిస్తారు. వివిధ సంస్థల సీఈవోలు ప్రసంగిస్తారు. అనంతరం మిషన్ కోసం..మేకింగ్ ఆఫ్ ఏపీ ప్రొగ్రామ్ కోసం ముఖ్యమంత్రిచ చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. చివరగా సీఈవోలతో చంద్రబాబు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఏడుగంటలకు బయల్దేరి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరతారు. -
'శక్తిగా ఎదిగి.. 'నిర్భయం'గా ఉండండి'
- నిర్భయ కేంద్రం, శిశు గృహ భవనాల ప్రారంభోత్సవంలో ఎంపీ కవిత ఇందూరు: తెలంగాణ ఆడబిడ్డలు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకుని నిర్భయంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. సుభాష్నగర్లో నిర్మించిన శిశుగృహ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. భవనంలోని సౌకర్యాలను ఆమె పరిశీలించారు. శిశుగృహలో ఉన్న అనాథలైన ఏడాదిలోపు పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఏడాది వయసు గల పాపను ఆర్మూ ర్ మండలం పెర్కిట్కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. అనంతరం జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన నిర్భయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ రాములుతో మాట్లాడి నిర్భయ కేంద్రంలో కల్పించి న సౌకర్యాలు, పని చేసే సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఫోన్ ద్వారా ట్రయల్ కాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కవిత ప్రారంభించారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆడబిడ్డ బిందెతో రోడ్డెక్కకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పేద ఎస్సీ ఎస్టీ మహిళలను వివాహ సమయంలో ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి, ఆడబిడ్డలను ఆపదలనుంచి కాపాడేందుకు షీ టీంల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారన్నారు. ఆడబిడ్డలపై లైంగిక దాడులు, గృహహింస వేధింపులు జరిగితే వారికి అండగా నిలిచేందుకు నిర్భయ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దాడుల బారిన పడిన మహిళలు, గృహహింస బాధితులు వారి సమస్యను నేరుగా చెప్పుకోవడానికి నిర్భయ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో లీగల్ కౌన్సిలర్, పోలీసులు, డాక్టర్ ఉంటారని, ఎలాంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం లభించడంతో పాటు నిందితులకు శిక్షపడే విధంగా నిర్భయ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయ కేంద్రానికి 08462-225181 ఫోన్ చేయాలని సూచించారు. త్వరలోనే టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్భయ కేంద్రానికి సంబంధించి వాల్ పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
సానుకూలంగానే ఉందాం
ప్రభుత్వం పట్ల టీజేఏసీ వైఖరి ఇదే! సర్కారుతో గొడవలు వద్దు జేఏసీని సజీవంగా ఉంచుదాం.. ప్రజాక్షేత్రంలో పనిచేద్దాం కమిటీ విసృ్తత స్థాయి భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: ‘‘టీజేఏసీ కార్యకలాపాలను సజీవంగా ఉంచుదాం. ప్రభుత్వ విధానాలపై సానుకూలంగానే స్పందిద్దాం. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్తో ఏ స్ఫూర్తితో కలిసి పనిచేశామో.. రాష్ట్ర పున ర్నిర్మాణంలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శిద్దాం’’ అని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(టీజేఏసీ) నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రావతరణ తర్వాత టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ భవిష్యత్ కార్యాచరణపైనే ఎక్కువగా చర్చించారు. డివిజన్, మండల స్థాయిల్లో జేఏసీ కమిటీలు బలంగానే ఉన్నా.. జిల్లా స్థాయిలో కమిటీలపై కాస్త దృష్టి సారించాలని నేతలు అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నా.. ప్రజా క్షేత్రంలో పనిచేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా ప్రభుత్వానికి సానుకూలంగానే వ్యవహరించాలని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వంతో గొడవలు వద్దన్న అభిప్రాయానికి జేఏసీ వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం: కోదండరాం ‘‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాలపై సూచనలు చేస్తాం. ఉద్యమ సమయంలో ప్రజల నుంచి వచ్చిన అనేక సమస్యల పరిష్కారానికి కూడా సూచనలు చేస్తాం. ప్రధానమైన వ్యవసాయం, విద్యుత్, విద్య, ఆరోగ్యం, సంక్షేమం తదితర రంగాల్లో నివేదికలు రూపొందించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రానికి పిటిషన్లు సమర్పిస్తాం. ఏఏ రంగాల్లో ప్రక్రియ నిలిచిపోయిందో వివరిస్తూ కేంద్రానికి నివేదిక ఇస్తాం’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిశాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రానికి సమర్పించే నివేదికను వారం రోజుల్లో పూర్తి చేస్తామని, అంతకంటే ముందు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తామన్నారు. హైదరాబాద్పై సమగ్ర అధికారాలు, జోనల్ నియామకాలు, ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం వంటి విషయాలపై డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం పలు సమస్యలతో ఇబ్బందులు పడుతూనే సంక్షేమ పథకాల ప్రకటన చేసింది. పాలనలో ఏవైనా లోపాలుంటే సూచనలు చేస్తాం.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కృషి చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చిన్న పరిశ్రమలు, చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వర్గం ఎదగాల్సి ఉంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, రఘు, పిట్టల రవీందర్తోపాటు పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
దివ్య చైతన్య దీపిక
జగన్మాత జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో నవరాత్రులూ ఆరాధించి విజయదశమి పర్వదినాన విశ్వజనని దివ్యరూపాన్ని విశేషంగా కొలుస్తారు. వసంతరుతువు, శరదృతువు ప్రాణులకు క్లిష్టకాలాలు. జనులకు అనారోగ్యం కలిగించే ఈ మాసాలలో చెడును ఎదుర్కొని, శుభాలను ప్రసాదించమని కాంక్షిస్తూ జగద్రక్షకి అయిన దుర్గాదేవిని పూజించాలని శాస్త్రోక్తం. మానవుడికి కలిగే ప్రమాదాలను అంతర్ముఖ తత్త్వంతో దర్శించిన వ్యాసాది ఋషిపుంగవులు వాటి నిర్మూలన కోసం, నివారణ కోసం దివ్య చైతన్య దీపిక అయిన జగన్మాత ఆరాధనే అనివార్యం, ఆనంద ప్రదాయకం అని ప్రబోధించారు. జగములనేలే జగన్మాత సత్యానికీ, ధర్మానికీ, సామరస్యానికీ విజయానికీ అధినేత్రి. వివేకం, విజ్ఞానం, శాస్త్రం, శక్తి, సంగీతం, సాహిత్యం అమ్మ విభూతిలోని భాగాలే. జీవితంలో ఒడిదుడుకులు, స్తబ్ధత ఏర్పరిచే పరిస్థితులు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తే భగవంతునిపై భారం వేసి కాలానుగుణంగా జీవిత యజ్ఞం కొనసాగించాలనే ఆంతర్యం, విశ్వకళ్యాణం కోసం, ధర్మపరిరక్షణ కోసం అలౌకిక భావనాతుల్య అవతారాలలో జగన్మాత ఆవిర్భావం జరిగింది. దసరా అంటే పది రోజులని అర్థం. కనుక అమ్మవారిని నవరాత్రులూ విశేషంగా ఆరాధించి జీవన దృక్పథాన్ని విజయ పథంలో నడిపించమనీ వేడుకోవాలి. సంప్రదాయం, సంస్కృతి కలగలసిన విజయదశమి మానవ జీవితాల్లో ఆనంద అనుభవాలను అందిస్తూ పావనం చేస్తుంది. -ఇట్టేడు అర్కనందనాదేవి -
ఎనర్జీ డ్రింకులు..శక్తిని హరించి వేస్తున్నాయ్..!
‘ఎనర్జీ డ్రింకులు ఉన్నఫళంగా మీకు ఎనలేని ఓపికను, శక్తిని ఇస్తాయనేది ఒట్టిమాటే.. అవి మీకు సహజసిద్ధంగా ఉన్న శక్తిని కూడా హరించి వేస్తాయి’ అంటున్నారు హెల్త్ ఫుడ్ మ్యానుఫాక్చరర్స్ (హెచ్ఎఫ్ఎమ్ఏ) వారు. యూరప్కు చెందిన ఈ సంస్థ పరిశోధకులు మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ ఎనర్జీ డ్రింకులు, వాటిలోని పదార్థాల గురించి పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. ఎనర్జీ డ్రింకుల్లోని కంటెంట్ను బట్టి అవి శక్తిని ఇవ్వడం మాట ఎలా ఉన్నా... మనిషిని నిస్తేజపరచడం మాత్రం ఖాయమని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయమైన వివరణ కూడా ఇచ్చారు. ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది! యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్లో దాదాపు 160 ఎమ్జీ కెఫిన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆవిధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి. ఇవీ... ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది. -
జపాన్ బ్యాంక్తో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్తో(జేబీఐసీ) మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జీఎంఆర్ గ్రూప్కు చెందిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే జపాన్ కంపెనీలకు జేబీఐసీ తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణ సహాయం చేస్తుంది. పారిశ్రామిక పార్కులు, విద్యుత్, శక్తివనరులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేల వంటి ప్రాజెక్టుల్లో జపాన్ కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశాలను కల్పించాలన్నది జేబీఐసీ ఉద్దేశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యోలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీఎం ఆర్ తెలిపింది. జపాన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే 12 నెలల్లో ఇరు సంస్థలు కలిసి వివిధ ప్రాజెక్టులను గుర్తిస్తాయి. ప్రైవేటు రంగ కంపెనీతో ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందం జరగడం ఇదే తొలిసారి అని జీఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో భారత మౌలిక రంగంలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని అంచనా. ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు ఈ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయి. -
తవ్వేస్తున్నారు..!
తీరంలో జోరుగా చేపల చెరువుల తవ్వకాలు అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ వ్యాపారం అసైన్డ్, దేవాలయ, మడ అడవుల భూముల్లోనూ తవ్వకాలు కాసుల వర్షం కురిపించే చేపల సాగు కోసం అక్రమారులు అడ్డగోలుగా చెరువులు తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ‘పచ్చ’నోట్లు పుచ్చుకుని నోరు మెదపడంలేదు. కార్యాలయాల నుంచి కాలు కదపడంలేదు. ఫలితంగా తీరం వెంబడి భారీగా చేపల చెరువులు వెలుస్తున్నాయి. మడ అడవులు, దేవాలయాల భూములు కూడా చెరువులుగా మారుతున్నాయి. మచిలీపట్నం : తీరంలో చేపల చెరువులను తవ్వే మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఎకరం, రెండు ఎకరాలకు అనుమతులు తీసుకుని వందలాది ఎకరాలను చెరువులుగా మార్చేస్తున్నారు. అధికారులను మంచి చేసుకుని అసైన్డ్, దేవాదాయ శాఖ భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. ఈ వ్యవహారం తమ కళ్ల ఎదుటే జరుగుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు తవ్వే సమయంలో డ్రెయినేజీ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవలే అధికారం చేజిక్కించుకున్న కొందరు నాయకులు చేపల చెరువుల తవ్వకాల్లో తలమునకలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) నిబంధనలను సైతం అతిక్రమించి మడ అడవులను చేపల చెరువులుగా మారుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రామస్థాయి వీఆర్వో నుంచి డివిజన్ స్థాయి వరకు ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వారికి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బందరు మండలంలో చిన్నాపురం, కోన, కానూరు, పెదపట్నం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని అక్రమార్కులు బాహాటంగానే చెబుతున్నారు. వనామీ రొయ్య అధిక ధర పలుకుతుండటం, సాగు బాగుండటంతో సముద్రపు కరకట్ట పక్కనే ఉన్న మడ అడవులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. కెపీటీపాలెం, కమ్మవారిచెరువులో రొయ్యల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కోన, చిన్నాపురం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి. పెడన మండలంలో బల్లిపర్రు, దేవరపల్లి, నందమూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా చెరువుల తవ్వకం వేగవంతంగా సాగుతోంది. లజ్జబండ డ్రెయిన్ను సైతం ఆక్రమించేస్తున్నారు. పెడన మండల శివారు ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో 90 ఎకరాలకు పైగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో పీతలావ, కృత్తివెన్ను, వాలంక, పల్లెపాలెం తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకం ఊపందుకుంది. వందలాది ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా మార్చేస్తున్నారు. బంటుమిల్లి మండలం పెందుర్రు, చోరంపూడి, నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షం కురిస్తే పనులు నిలిచిపోతాయని భారీ యంత్రాలను తీసుకువచ్చి శరవేగంగా చురువులు తవ్వేస్తున్నారు. నందివాడలో కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువుగా మారుస్తున్నారు. సర్వే నంబర్ 9, 10లో సుమారు 10.14ఎకరాల సాగు భూమిలో రెండు పొక్లేయిన్లతో గత రెండు రోజులుగా చెరువు తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. వరిసాగు చేస్తామని వేలంపాట ద్వారా భూములు దక్కించుకున్న రైతు చేపల చెరువులుగా ఈ భూమిని మార్చటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోడూరు మండలం ఉల్లిపాలెం, పాలకాయతిప్ప వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడకు రావటం.. వెళ్లిపోవటం మినహా పనులు నిలిపివేసింది లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో సొసైటీ పేరుతో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ఇటీవలే పూర్తిచేశారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోకపోవటం గమనించదగ్గ అంశం. అశ్వారావుపాలెంలో ఇటీవల చెరువుల తవ్వకాలు చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు హడావుడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
అనావృష్టి
గత పదేళ్లలో ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదు జూలైలోనూ వడగాడ్పులు ఒక్క ఎకరంలోనూ వరినాట్లు పడలేదు వరుణుడు కరుణ చూపడం లేదు. జూలైలోనూ ఎండలు వేసవిని తలపించేలా కాస్తున్నాయి. వడగాలులు రోహిణీని తలపిస్తున్నాయి. గత పదేళ్లతో పోల్చితే జిల్లా సగటు వర్షపాతం ఈ ఏడాది అతి తక్కువగా నమోదైంది. జిల్లా అంతటా అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పంట పొలాలు నేడు బీడు భూములను తలపిస్తున్నాయి. మచిలీపట్నం : ఈ ఏడాది మే నెలలో మురిపించిన వర్షాలు ఆ తర్వాత జాడ లేకుండా పోయాయి. జూలై నెల వచ్చేసినా వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. జూలై ఒకటి నుంచి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్లు లెక్కిస్తారు. ఈ సీజన్ నవంబరు వరకు కొనసాగుతుంది. జూన్లో జిల్లాలో సగటు వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. ఈ ఏడాది కేవలం 28.2 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 69.2 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదవడంతో పాటు జూలైలోనూ వడగాలులు వీస్తున్నాయి. దీంతో పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో బోరునీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ వరి నారుమడులు పోసేందుకు సైతం రైతులు సాహసించలేకపోతున్నారు. జూలై నాలుగో తేదీ నాటికి కూడా జిల్లాలో ఒక మిల్లీమీటరు వర్షపాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అదును దాటుతోంది... వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వ్యవసాయానికి అదును తప్పుతోందని రైతులు ఆందోళన చెబుతున్నారు. జూలై మొదటి వారంలోనైనా నారుమడులు పోసుకుంటే ఆగ స్టు మొదటి వారంలో వరినాట్లు పూర్తిచేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆగస్టులో వరినాట్లు పూర్తికాకుంటే ఖరీఫ్ వరిసాగుకు సమయం చాలదని రైతులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగుచేసే వరి వంగడాలు కనీసంగా 150 రోజులకు పైబడి కోతకు వస్తాయని, దీంతో సాధారణంగా నవంబరు 15 తరువాత వరికోతలు ప్రారంభమవుతాయని రైతులు భావిస్తున్నారు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్కు సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. సాగునీటి విడుదల తేదీని ఎప్పటికి ప్రకటిస్తారనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. 2012లో అక్టోబరులో, 2013లో ఆగస్టులో కాలువలకు అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో కృష్టానదికి ఉప నదులుగా ఉన్న వజినేరు, మున్నేరు, కొండవీటి వాగు, కట్టలేరు తదితర వాగుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడం, ఆ నీరు కృష్ణానదిలోకి చేరడంతో వాటినే ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరుగా వదిలారు. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అసలు వర్షాలే కురవకపోవడంతో ఉప నదుల నుంచి నీరు వచ్చి చేరే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి అధికారికంగా సాగునీరు ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు, పాలకులు స్పష్టత చెప్పలేకపోతున్నారు. ఆకాశంలో మబ్బులు ఉసూరుమనిపిస్తున్నాయి. వాయుగుండం పడితేనే వర్షం కురుస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో కురవకుంటే 2002, 2003 నాటి పరిస్థితులు తలెత్తి ఒక్క పంటకే పరిమితం అవుతామనే భయం రైతులను వెంటాడుతోంది. అతి తక్కువ వర్షపాతం నమోదు జూన్లో 97.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం జిల్లాలో నమోదు కావాల్సి ఉంది. ఈ ఏడాది కేవలం 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత పదేళ్లలో వ్యవధిలో పరిశీలిస్తే ఇదే అతితక్కువ వర్షపాతం కావడం గమనార్హం. జూన్లో గత పదేళ్లుగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. -
ఈ రహదారులకు మోక్షమెన్నడో?!
అభివృద్ధికి నోచని రహదారులు ప్రతిపాదనలు దాటని వైనం అవస్థల్లో జనం మచిలీపట్నం టౌన్ : పట్టణంలో పలు రహదారుల అభివృద్ధిని సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయా రహదారులు ఏళ్ల తరుబడి అభివృద్ధికి నోచుకోపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో అధ్వానంగా ఉన్న పలు రహదారులను అభివృద్ధి చేసేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పలు రహదారుల పనులు ప్రారంభించి, సగంలోనే ఆపేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మునిసిపల్ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల్లో మునిసిపల్ పాలనా బాధ్యతల్ని స్వీకరించనున్న నూతనంగా పాలకవర్గమైనా రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పట్టణంలోని 1, 42, 38వ వార్డుల మీదుగా ఉన్న ప్రధాన రహదారిని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులను ప్రారంభించి, మెటల్ రోడ్డు నిర్మించారు. ఆతర్వాత రహదారి తారురోడ్డుగా అభివృద్ధి చేయలేదు. ఈ రహదారి పనులు మెటల్ రోడ్ స్థాయిలోనే నిలిచిపోయాయి. ఫలితంగా ఈ రహదారికి ఉపయోగించిన రబ్బీష్ కొట్టుకుపోయి కంకరరాళ్లు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఈ రహదారి దుక్కిదున్నిన చేనులా కనిపిస్తూ, రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు నరకం చూపిస్తోంది. ఈ రహదారి మీదుగా నిత్యం హౌసింగ్బోర్డు, డ్రైవర్స్కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్, టెంపుల్ కాలనీ, వైఎస్సార్ నగర్ వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే స్థానిక 38వ వార్డులోని సుందరయ్య నగర్ నుంచి నెహ్రూనగర్, మేదరకాలనీల మీదుగా బైపాస్ రోడ్ను చేరుకునే రహదారి కూడా ఇలానే అధ్వానంగా ఉంది. మూడేళ్ల క్రితం ఈ రహదారిని సిమెంట్ రోడ్గా జల్ తుఫాన్ నిధులతో అభివృద్ధి చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులను తక్కువకు టెండర్తో దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి మెటల్ రోడ్ వరకూ పనులను పూర్తి చేశాడు. అయితే ఈ జల్తుఫాన్ నిధులు విడుదల కావనే విషయం తెలియడంతో పనులను కాంట్రాక్టర్ ఆపేయటంతో ఇప్పటికీ సిమెంట్ రోడ్గా అభివృద్ధి జరగలేదు. కంకరరాళ్లు లేచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, సిబ్బందితోపాటు ఆ ప్రాంతంలోని పలు కాలనీలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. టెంపుల్ కాలనీ వరకూ సిమెంట్ రోడ్ ఉన్నా, అక్కడి నుంచి ఉన్న రబ్బీష్రోడ్ గుంతల మయమై అధ్వానంగా ఉంది. ఈ రోడ్ పల్లంగా ఉండడంతో వానొస్తేచాలు చిన్న పాటి కాలువను తలపిస్తోంది. వర్షపునీటిలో నిండిన రోడ్లో ప్రయాణించాలంటే అటుగా వెళ్లే వారు సాహసం చేయాల్సిందే. ఈ రహదారిని అభివృద్ధి చేసేం దుకు నాలుగేళ్ల క్రితం అప్పటి మునిసిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీనత వల్ల ఈ రహదారి అప్పటి నుంచీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి నోచలేదు. ఇకనైనా మునిసిపల్ అధికారులు, పాలకులు దృష్టి సారించి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పోర్టు పనులు ప్రారంభించండి
- ముఖ్యమంత్రికి నిడుమోలు లేఖ మచిలీపట్నం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బందరు పోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అనంతరం ఆరు నెలల్లోపు పోర్టు పనులను ప్రారంభిస్తామంటూ ఆయన ఇచ్చిన హామీని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు గడిచినా బందరు పోర్టు అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీని నిర్వహించాలని కోరారు. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ 2010 జూన్ ఏడో తేదీన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఆ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్కు వెళ్లలేదని తెలిపారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 4,800 ఎకరాల భూమిని కేటాయించేందుకు నవయుగ సంస్థ ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ పంపిందని, దీనికి ప్రభుత్వం ఇంతవరకు ఆమోదం తెలపలేదని ప్రస్తావించారు. పోర్టు నిర్మాణానికి భూసేకరణే కీలకమని, ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. భూసేకరణకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో, సేకరించిన భూములను పోర్టు డెరైక్టర్కు ఎప్పటికి అప్పగిస్తారో నిర్మాణ సంస్థ పోర్టు పనులను ఎప్పటికి ప్రారంభిస్తుందో అర్థం కాకుండా ఉందని, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పరిశ్రమలు, విద్యుత్ చంద్రబాబు వద్దే
* కోరుకున్న మేరకు సీనియర్లకు శాఖల సర్దుబాటు * పలు శాఖల విలీనం... మిగతా వారికి కేటాయింపు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను ఖరారు చేశారు. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో చేపట్టాల్సిన అనేక అంశాలకు సంబంధించిన కీలక శాఖలను చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నట్లు శాఖల కేటాయింపును చూస్తే అర్థమవుతుంది. న్యాయ, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను కూడా చంద్రబాబుకే దఖలు పడనున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలతో ముడిపడి ఉన్న మౌలికసదుపాయాలు, పెట్టుబడులు శాఖ చంద్రబాబు వద్దే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరమేర్పడింది. కేంద్రం కూడా పారిశ్రామికాభివృద్ధికి వీలుగా రాష్ట్రానికి ప్రత్యేక పతిపత్తిని కల్పించి పన్ను రాయితీలను కల్పించనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఐదేళ్లపాటు ప్రత్యేక పతిపత్తిని ప్రకటించింది. అది వాస్తవరూపం దాల్చితే పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి వందల కోట్లమేర పన్ను రాయితీ లభించనుంది. పరిశ్రమలకు అనుమతులు, రాయితీల మంజూరు తదితర అనేక అంశాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల పాత్ర చాలా కీలకం కానుంది. యనమల రామకృష్ణుడికి ఇదివరకు ఆయన నిర్వహించిన ఆర్థిక, శాసనసభా వ్యవహారాలతో పాటుగా వాణిజ్యపన్నుల శాఖను కూడా అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖను పట్టుబట్టి దక్కించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖతో గ్రామీణ నీటిసరఫరా, ఎన్నార్యీజీఎస్ విభాగాలను జతచేసి అయ్యన్నపాత్రుడికి ఇచ్చారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా ఈసారి అడవులు, పర్యావరణ శాఖతో సరిపెట్టారు. తమకు శాఖలను కేటాయించినందుకు పలువురు మంత్రులు చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశాఖపట్నంలో గురువారం తొలిభేటీ జరగనుండడంతో అక్కడకు వెళ్లారు. -
గెలుపెవరిదో?
సమాలోచనల్లో అభ్యర్థులు సెలైంట్ ఓటింగ్పైనే తర్జనభర్జనలు అనుయాయులతో కలిసి లెక్కలేస్తున్న అభ్యర్థులు గెలుపోటములపై భారీ బెట్టింగ్లు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు గెలుపు అవకాశాలపై లెక్కల్లో మునిగిపోయారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి.. పోలింగ్ సరళి ఎవరికి లాభించే అవకాశముందనే అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఓటర్ల సెలైంట్ ఓటింగ్ కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. సెలైంట్ ఓటింగ్ ఎటు పడిందో అంచనా వేయడం కష్టంగా మారడంతో అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు కట్టే పనిలో పడ్డారు. మరోపక్క సీమాంధ్ర అంతటా ఫ్యాన్గాలి సెలైంట్గా వీచిందని, వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసినప్పటికీ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిలాక్స్ కాలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన అభ్యర్థులు గురువారం ఉదయం నుంచే ఓట్ల లెక్కలు కట్టే పనిలో పడ్డారు. తమ అనుయాయులతో కూర్చుని అనుకూల, ప్రతికూల పరిస్థితులను బేరీజు వేస్తూ ఓట్ల కూడికలు, తీసివేతల లెక్కల్లో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గాల పరిధిలోని కీలక నాయకులను పిలిపించుకుని ఆంతరంగిక సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, బూత్ల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని పోలయ్యాయి.. వాటిలో ఎవరికెన్ని ఓట్లు వస్తాయి.. తదితర కోణాల్లో అంచనాలు వేస్తున్నారు. సెలైంట్ ఓటింగ్పై టీడీపీలో కలవరం... జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ ప్రధాన పోరు సాగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పురిటిగడ్డలో ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. సెలైంట్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అదే జరిగితే జిల్లాలో చాలా సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థులు తమ అనుయాయులతో కలిసి ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ‘గాలి ఎటువైపు వీచిందంటావ్’ అంటూ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు సైతం తమ అనుయాయులతో కలిసి ఓట్ల శాతం, పోలింగ్ సరళి, సమీకరణలు వంటి వాటిని బేరీజు వేస్తున్నారు. ఓటింగ్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి బలాబలాలు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్ల జోరు.. మరోపక్క ఎన్నికల పోలింగ్ ముగియడంతో పందేల రాయుళ్ల జోరు మొదలైంది. ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహించేందుకు క్రికెట్ బుకీలు రంగంలోకి దిగారు. దీంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ బుకీల వ్యవస్థ మళ్లీ పుంజుకుంది. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం వరకు టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన పందేలు పోలింగ్ అనంతరం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిపోయాయి. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని, 110 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 21 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయని పెద్ద ఎత్తున పందేలు సాగుతున్నాయి. జిల్లాలోనూ ఎక్కువ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని పందేలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల ఓట్లు, మెజార్టీలు తదితర అంశాలపై కూడా బెట్టింగ్లు వేయడం గమనార్హం. విశ్రాంతి కోసం విహార యాత్రలకు సిద్ధం.. వరుస ఎన్నికలతో అలిసిపోయిన రాజకీయ పార్టీల నేతలు, కేడర్ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గురువారం జిల్లా అంతటా బలాబలాలపై లెక్కలు కట్టిన అభ్యర్థులు రానున్న రెండు రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, పార్టీ ముఖ్య నేతలతో మరికొందరు అభ్యర్థులు విహారయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12న మున్సిపాలిటీలు, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ లోగానే విహార యాత్రలు పూర్తిచేసుకునేలా కొంతమంది, ఫలితాలు తేలాకే వెళ్లేలా మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
జగన్ ఆదేశం.. కార్యకర్తల అభీష్టం పోరుకు పేర్ని నాని సిద్ధం
జగన్ ఆదేశం.. కార్యకర్తల అభీష్టం పోరుకు పేర్ని నాని సిద్ధం సాక్షి, మచిలీపట్నం : ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు, అనుక్షణం తనకు వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తల అభీష్టం మేరకు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను..’ అని ఆ పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదనే జగన్మోహన్రెడ్డికి, కార్యకర్తలకు లేఖ రాసి పోటీనుంచి విరమించుకోవాలనుకున్నానే తప్ప ఎవరినో పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉండాలని ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవిని వదిలేశానని వివరించారు. మంత్రి స్థాయి హోదా కలిగిన విప్ పదవిని కాదనుకున్నానని, వైఎస్ జగన్మోహన్రెడ్డికి నష్టం కలిగించే పని ప్రాణం ఉన్నంతవరకు చేయబోనని స్పష్టం చేశారు. అందరి అభీష్టం మేరకు ఈ నెల 19న నామినేషన్ వేస్తానని వెల్లడించారు. ఆర్థిక కారణాలతో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయలేనని నాని రెండు రోజుల క్రితం ప్రకటించటంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పేర్ని అభిమానులు ఆయన ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆయన సోమవారం బందరు చేరుకుని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు చందాలు వేసుకునైనా, తల తాకట్టు పెట్టి అయినా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామంటూ పట్టుబట్టారు. అదే సమయంలో గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి నాని వచ్చి కార్యకర్తల సమక్షంలోనే పేర్ని నానితో మాట్లాడి పోటీకి ఒప్పించారు. మీడియా కథనాలు బాధ కలిగించాయి... అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఆర్థిక కారణాలతో తాను పోటీకి వెనకాడితే.. వాస్తవ విషయాలను వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని తనను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించటం తనకెంతో బాధ కలిగించిందన్నారు. బందరు నియోజకవర్గంలో రెండు పర్యాయాలు గెలిచిన తాను ఇక్కడ ప్రజలకు తగినంత సేవ చేసే అవకాశం వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్యల హయాంలోనే కలిగిందని వివరించారు. వారిద్దరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. బందరు నియోజకవర్గంలో తాను తలపెట్టిన పనుల్లో పోర్టు, డ్రెయినేజీ వంటి వాటిని పూర్తి చేయకుండా అడ్డుతగిలిన వ్యక్తి ఇప్పుడు రెండు చెప్పులు పట్టుకుని ఓటు అడిగేందుకు ప్రజల్లోకి వచ్చారని నాని అన్నారు. గెలుపోటముల రుచులను చూసిన తాను ఈ ఎన్నికల్లో ఏదైనా గుండె నిబ్బరంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఇటీవల మునిసిపల్, పరిషత్ ఎన్నికలు చూసి డబ్బు ఖర్చు పెట్టలేక.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా నష్టపోకూడదనే ఆందోళనతో పోటీ నుంచి తాను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఏదేమైనా అధినేత ఆదేశం, కార్యకర్తల అభిమానం మేరకు 19న నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ అండగా ఉంటుంది : కొడాలి నాని వైఎస్సార్సీపీ కుటుంబంలో పేర్ని నాని ఒకరని, ఎటువంటి పరిస్థితినైనా ఆయనకు అండగా ఉంటామని పోటీచేయాల్సిందేనని జగన్మోహన్రెడ్డి ఆదేశించటంతో తాను ఆయన్ని ఒప్పించేందుకు వచ్చానని కొడాలి నాని చెప్పారు. ఈ నెల 8న అధినేతను తనతో పాటు కలిసిన పేర్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నికల్లో పోటీచేయలేననే విషయాన్ని చెప్పారని ఆయన వివరించారు. అదే సమయంలో జిల్లాకు సంబంధించిన లోక్సభ, శాసనసభ స్థానాలకు గెలిచే అభ్యర్థులు ఎవరినైనా పార్టీలో చేర్చుకునే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అధినేతకు పేర్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇంతమంది ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్న పేర్ని నాని లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాలని, ఆయనకు జగన్మోహన్రెడ్డి అండదండలు ఎప్పుడూ ఉంటాయని కొడాలి నాని అన్నారు. ఆయనవెంట ఉప్పాల రాము కూడా ఉన్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు నాని నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
ఆగేనా.. జరిగేనా..
వాయిదాపై చివరి ఆశ వాయిదా కోరుతూనే ఏర్పాట్లు యథావిధిగా షెడ్యూల్ అమలు హైదరాబాద్లో కలెక్టర్, ఎస్పీ సుప్రీంకోర్టు నిర్ణయంపై అందరి ఆసక్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు నిర్ణయం సాక్షి, మచిలీపట్నం : స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సిన పాలకులు ఏళ్ల తరబడి సాచివేత ధోరణి అవలంబించారు.. చివరకు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాక ఎన్నికలు జరిపే పరిస్థితి వరకు తీసుకొచ్చారు.. పాలకుల వైఫల్యం కారణంగా నిలిచిన ఎన్నికలను వరుసగా నిర్వహించడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది.. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంతో ఎన్నికలు జరుగుతాయా, ఆగుతాయా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఎందుకు కష్టమనే విషయాలపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని, దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అటు అధికారుల్లోను, ఇటు రాజకీయ పార్టీల నేతల్లోను ఆశలు రేపుతున్నాయి. దీంతో జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడితే బాగుండు అనుకునే అధికార యంత్రాంగానికి, పార్టీలకు, ఆశావహులకు నేడు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు, మే 7న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందనరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు గురువారం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదీ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక అధికారులు ఎన్నికల కమిషన్కు నివేదించారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు తోడు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. గత శుక్ర, శనివారాల్లో జిల్లాలోని జెడ్పీ చైర్మన్, 49 మండలాల ఎంపీపీలు, 49 జెడ్పీటీసీలు, 836 ఎంపీటీసీల రిజర్వేషన్లను ఖరారు చేసి విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనంటూ ఎన్నికల కమిషన్ ఈనెల 10న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి నామినేషన్లను స్వీకరించి ఏప్రిల్ 6న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపును చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసినా మరోవైపు అవి వాయిదా పడితే బాగుంటుందన్న ఆశలు అటు అధికారుల్లోను, ఇటు రాజకీయ పార్టీల్లోను చిగురిస్తున్నాయి. భారమే అంటున్న అధికారులు, నేతలు.. వరుస ఎన్నికల నిర్వహణ ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పలువురు అధికారులు వాపోతున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో వాటి ఫలితాలు తమపై పడే ప్రమాదం ఉందని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మధనపడుతున్నారు. దీనికితోడు తమ ఎన్నికలకు ముందే వచ్చే మున్సిపల్, స్థానిక పోరులో ఆయా పార్టీల అభ్యర్థులను దించి వారి విజయం కోసం తామే వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తుందని ఎంపీ, ఎమ్మెల్యే ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
'అనూహ్య' కథనాలు
-
‘అనూహ్య’ కథనాలు
కలవరపెడుతున్న ముంబై పోలీసుల తీరు అత్యాచారం చేశారంటూ గత ప్రచారం ఇప్పుడు దొంగతనం కోసం హత్య చేసినట్టు కథనం ముంబై పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపణలు అనూహ్య కేసులో ముంబై పోలీసులు కట్టుకథలు వినిపిస్తున్నారా? దర్యాప్తు ఏదోరకంగా అయ్యిందనిపించి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారా? మొదట్నుంచీ విమర్శలకు తావిస్తున్న వారి తీరు తాజాగానూ అలాగే ఉంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇప్పుడు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి. సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో ముంబై పోలీసులు మొదట్నుంచీ అపవాదులనే మూటగట్టుకుంటున్నారు. మిస్టరీగా మారిన అనూహ్య హత్య కేసులో ఏదో ఒకరకంగా దర్యాప్తు అయ్యిందనిపించి చేతులు దులిపేసుకునే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలకు పోలీసులు చెబుతున్న కథనాలే ఊతమిస్తున్నాయి. అనూహ్య సామూహిక అత్యాచారానికి గురైందంటూ గతంలో మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పెద్ద కలకలమే రేగింది. తాజాగా దొంగతనం కోసం ఆమెను హత్య చేశారంటూ కొత్త కథనం ప్రచారంలోకి తెచ్చారు. ఏదో సాకు చూపి అనూహ్య హత్య కేసును త్వరగా మూసివేయాలన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు చెబుతున్న కథనాలను ఆమె తండ్రి శింగవరపు జోనాథన్ ప్రసాద్ ఖండిస్తున్నారు. ఒంటరిగా బైక్ పై వెళుతుందా..? తాజాగా అనూహ్య హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ నాసిక్కు చెందిన చంద్రభాను సాసప్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపర్చడంతో అతనికి 15 రోజులు రిమాండ్ విధించారు. అతన్ని అరెస్టు చూపించిన పోలీసులు అనూహ్య కేసును మూసివేసేందుకు ఆతృత చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 5న రైల్వే స్టేషన్లో దిగిన అనూహ్యను మోటార్ బైక్పై తీసుకుని వెళ్లి దొంగతనం కోసం హత్య చేశాడని ముంబై పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. ఒంటరిగా వచ్చిన యువతి క్యాబ్ ఎక్కకుండా మోటార్ బైక్ ఎందుకు ఎక్కుతుందనే ప్రశ్నకు ముంబై పోలీసుల వద్ద సమాధానం లేదు. జనవరి 16న అనూహ్య మృతదేహం లభ్యంకావడంతో హత్యకేసుగా నమోదుచేసిన పోలీసులు దాదాపు 47 రోజులుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ముంబై పోలీసులు మూడు బృందాలు, క్రైం బ్రాంచి రెండు బృందాలు హైదరాబాద్, మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాల్లో దర్యాప్తు నిర్వహించాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అనూహ్య స్నేహితుడు హేమంత్ (హైదరాబాద్)ను ముంబై పిలిచి మరీ విచారణ చేశారు. సెల్ఫోన్ కాల్లిస్ట్లో ఉన్నవారిని, క్యాబ్ డ్రైవర్లను ఇలా రోజులతరబడి వందలాది మందిని విచారించారు. చివరకు ఏదో రకంగా ఈ కేసును మూసివేసేందుకు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి. తన కుమార్తె హత్య కేసును కట్టుకథలతో మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనూహ్య తండ్రి ప్రసాద్ మరోమారు ముంబై పోలీసులపై విమర్శలు చేయడం గమనార్హం. -
ముంచుకొచ్చిన మున్సి‘పోల్స్’
లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి జరిగితే నష్టమే ఓటు జారి గల్లంతయ్యేనా.. కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల ఆందోళన ఎప్పుడైనా సిద్ధమంటున్న వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉంది. అసలు ఎన్నికల పేరెత్తితేనే ఆ రెండు పార్టీల గుండెలు జారిపోతున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ సంకేతాలు ఇవ్వడంతో మరింత కంగారు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు కారణమైన తమపై జిల్లా వాసులు భగ్గుమంటున్నారన్న విషయం ఆ రెండు పార్టీలకు తెలియంది కాదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే ఘోర పరాభవం తప్పదని కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అందుకే విడివిడిగా ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని, అందుకు అనుగుణంగా అవసరమైతే ఎలక్షన్ కమిషన్కు విజ్ఞాపనలు అందించాలని పార్టీ అధిష్టానాలకు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఎలాగు ఆరు నెలలు పడుతుందని కాబట్టి, ఆ తర్వాతే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని రెండు పార్టీలు భావిస్తు న్నాయి. వారి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పడంతో ఆ పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ వర్గాలు కలవరపాటుకు గురయ్యాయి. టీడీపీలో తిరుగుబాట్లు.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేకపోవడంతో నేతలు అయో మయంలో పడ్డారు. లోక్సభలో గుండెపోటుకు గురైన బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ముంబై ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ ఎంపీ టికెట్ కోసం రాయ‘బేరాలు’ నడపడం కొనకళ్ల వర్గీయులను కలచివేస్తోంది. దీనికితోడు పెడన నుంచి ఎంపీ కొనకళ్ల, బూరగడ్డ వేదవ్యాస్ల్లో ఎవరో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పోటీకి ‘కాగిత’ సిద్ధంగా లేరని కొందరు, ఆయనకు టికెట్ ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని ఇంకొందరు ఎవరి వాదన వారు వినిపించడంతో టీడీపీ ఇరుకున పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై సైతం పార్టీలోని కేశినేని నాని, వల్లభనేని వంశీ కోపంగా ఉన్నారు. పెనమలూరు, గన్నవరం, నూజివీడు, మైలవరం, పెడన, బందరు, అవనిగడ్డ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయవాడ, బందరు లోక్సభ నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్ల నడుమ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు మానసికంగా సిద్ధం కాలేకపోతున్నారు. కాంగ్రెస్కు గుడ్బై.. సమైక్యాంధ్ర అంటూ ఆదినుంచీ హంగామా చేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగిపోయాక తీరుబడిగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, మంత్రి కొలుసు పార్థసారథి, అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బూరగడ్డ వేదవ్యాస్ పదవులు దక్కే పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవలే ఆయన కుమారుడు చంద్రబాబును కలిసినట్టు సమాచారం. జనంలోకి వైఎస్సార్ సీపీ.. తొలి నుంచి సమైక్య నినాదంతో ముందుకుసాగిన వైఎస్సార్ సీపీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముందుగానే సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీశ్రేణులు ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగరాధ్యక్షుడు జలీల్ఖాన్ నేతృత్వంలో జిల్లాలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఆ పార్టీ సమన్వయకర్తలు ‘గడపగడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. -
నెల్ప్-10 వేలం ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: కొత్త అన్వేషణ, లెసైన్సింగ్ విధానం కింద పదో విడత(నెల్ప్-10) చమురు-గ్యాస్ బ్లాక్ల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతానికి తాము 46 బ్లాక్లను వేలంలో పెడుతున్నామని.. అన్ని అనుమతులూ లభించాక ఈ సంఖ్య 60-65కు పెరగనుందని ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ఈ 46 బ్లాక్లలో.. రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్ నుంచి వెనక్కితీసుకున్న 6,199 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, కెయిర్న్ ఇండియా రాజస్థాన్ బామర్ బ్లాక్ చుట్టుపక్కలఉన్న 9,000 చదరపు కిలోమీటర్ల ఏరియా కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆర్ఐఎల్ నుంచి చమురు శాఖ వెనక్కితీసుకున్న ప్రాంతంలో రిలయన్స్ అన్వేషించిన డీ4, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు చమురు-గ్యాస్ నిక్షేప క్షేత్రాలు(0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలున్నట్లు అంచనా) ఉండటం గమనార్హం. కాగా, తాను వెనక్కిచ్చేసిన ప్రాంతాన్ని మళ్లీ కెయిర్న్ ఇండియా తిరిగి ఇవ్వాలంటోంది. ప్రస్తుత ఉత్పత్తి క్షేత్రాలను అనుసంధానం చేయడానికి ఇది అవసరమని చెబుతోంది. కాగా, తాజా నెల్ప్-10లో పాల్గొనే బిడ్డర్లు తాము ప్రభుత్వానికి ఉత్పత్తి తొలి రోజు నుంచే ఎంత చమురు-గ్యాస్ వాటా ఇవ్వనున్నారనేది వేలం సందర్భంగా తెలియజేయాలని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఎక్కువ వాటా ఆఫర్ చేసే కంపెనీకే బ్లాక్లు దక్కుతాయని కూడా వెల్లడించారు. ఈ మేరకు రంగరాజన్ కమిటీ నిబంధనలను అమలుచేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నిబంధనలకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే వేలానికి బిడ్లను ఆహ్వానిస్తామని మొయిలీ పేర్కొన్నారు.