final match
-
ఇంగ్లండ్, విండీస్ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను నెగ్గింది. ఈ సిరీస్లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్కు వరించింది. -
క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఫైనల్లో భారత్-పాకిస్తాన్ ఢీ
భారత్-పాక్ క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయాని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.జూలై 13(శనివారం) నార్తాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్ధులైన భారత్- పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి భారత్ ఫైనల్కు రాగా.. తొలి సెమీస్లో వెస్టిండీస్ను ఓడించి పాక్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ ఫైనల్ పోరులో గెలిచి లీగ్ స్టేజ్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. గ్రూపు స్టేజిలో పాక్ చేతిలో భారత్ 68 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. అయితే పాక్ను ఓడించడం అంత ఈజీ కాదు. పాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.ఈ టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. కానీ ఆసీస్తో సెమీస్లో ఆడినట్లు భారత బ్యాటర్లు చెలరేగితే పాక్ కచ్చితంగా తలవంచాల్సిందే. భారత బ్యాటర్లలో ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్కు ఇది రెండో టీ20 వరల్డ్కప్ కాగా.. ఓవరాల్గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ద్రవిడ్కు భారత జట్టు హెడ్ కోచ్గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్కప్-2024తో భారత హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్
-
T20 WC 2024: ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరంటే..?
టీ20 వరల్డ్కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. శనివారం(జూన్ 29)న బార్బడోస్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తుది పోరుకు వర్షం వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ జరగనున్న బార్బడోస్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. జూన్ 29న బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే రోజు బార్బోడస్లో ఉదయం 3 గంటల నుండి వర్షం మొదలు కానున్నట్లు అక్కడ వాతవారణ శాఖసైతం వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. శనివారం (జూన్ 29) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్ను నిర్వహిస్తారు.ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. శనివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
IPL 2024: రైజర్స్ VS రైడర్స్
గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్కతా నైట్రైడర్స్ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్లు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్కతా తమ మూడో టైటిల్పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫయర్లో సన్రైజర్స్నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్తో పాటు అంతకు ముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్–2లో రాజస్తాన్ను ఓడించడంతో రైజర్స్ టీమ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్లలో దూకుడైన బ్యాటింగ్తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్ మిడిలార్డర్లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్ను బట్టి క్వాలిఫయర్లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చేసుకొచ్చి టీమ్ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్ను స్పిన్కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్లో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్–1 ఆడిన టీమ్నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్ ఫామ్లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్లో హైదరాబాద్కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్ వరుణ్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్రైజర్స్: కమిన్స్ (కెపె్టన్), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్/ మర్కండే. నైట్రైడర్స్: శ్రేయస్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్పై జరిగి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్ డే ఉంది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం!
కొత్త సీజన్లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్ఫాల్జ్ గాలా మీట్లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణంతో కొత్త సీజన్ను ఘనంగా ఆరంభించింది.ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు! -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్మన్, రాఫ్ మెక్మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయాం. బ్యాటింగ్లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. -
ఆ రోజు మీటింగ్లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
టీమిండియా ఓటమికి ఉద్యోగులకు సెలవు
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. Boss ne sach me leave de di aaj😭 Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3 — Diksha Gupta (@thedikshagupta) November 20, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్స్కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్స్కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
యావత్ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు. ఇదీ చదవండి: వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు. No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1 — anand mahindra (@anandmahindra) November 19, 2023 -
స్లో పిచ్?..టీమిండియానే ఫేవరెట్
-
భారత్ గెలుస్తుందని అభిమానుల ధీమా
-
తిరుపతిలో క్రికెట్ ఫీవర్
-
దేశమంతటా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
ఫైనల్ మ్యాచ్.. సంబరంలో రవళి
-
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్తో ఆడితే.. కోహ్లి ప్యాషన్తో పాటు అగ్రెసివ్గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా, 2003 వరల్డ్కప్లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్గా -
IND vs WI 3rd ODI: విజయమా... ప్రయోగమా!
వెస్టిండీస్తో రెండో వన్డేలో ఓటమి తర్వాత ‘మేం భవిష్యత్తుపై దృష్టి పెట్టాం. ప్రస్తుత ఫలితాలు ముఖ్యం కాదు. అందుకే భిన్నమైన కూర్పుతో తుది జట్టు కోసం ప్రయోగాలు చేస్తున్నాం’ అని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. నిజంగానే ద్రవిడ్ మాటలను చేతలకు అన్వయిస్తే మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఇలాంటి స్థితిలో భారత్ చివరి వన్డేలో నెగ్గి సిరీస్ గెలుచుకుంటుందా లేక గత మ్యాచ్లాగే తలవంచుతుందా చూడాలి. తరూబా (ట్రినిడాడ్): వన్డే వరల్డ్కప్ ఆతిథ్య జట్టు హోదాలో సిద్ధమవుతున్న భారత్ జట్టు వరల్డ్ కప్కు అర్హత సాధించని టీమ్తో సిరీస్ విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా... రెండో వన్డేలో ఓటమిపాలు కావడంతో సిరీస్ 1–1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆ ఇద్దరికీ... రోహిత్, కోహ్లి గత మ్యాచ్లాగే ఆడకపోతే భారత జట్టుకు సంబంధించి ఇద్దరు బ్యాటర్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్లు బరిలోకి దిగుతున్నారు. కోచ్ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరికి మరో అవకాశం ఖాయం. సూర్య వన్డేల్లో ఇంకా తడబడుతుండగా... చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సామ్సన్ ఉపయోగించుకోలేకపోయాడు. మూడు, నాలుగు స్థానాల్లో వీరు రాణిస్తే జట్టుకు మేలు కలుగుతుంది. ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా, గిల్ ఇంకా ప్రభావం చూపలేదు. హార్దిక్ కూడా అంచనాలకు తగిన విధంగా రెండు విభాగాల్లోనూ రాణించలేకపోతున్నాడు. బౌలింగ్లో ఉమ్రాన్, ముకేశ్, కుల్దీప్లు తమ సత్తా మేరకు ఆడితే విండీస్ను కట్టడి చేయగలరు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో... తొలి వన్డేలో కుప్పకూలినా... రెండో మ్యాచ్లో గెలుపు విండీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కెపె్టన్ షై హోప్ చక్కటి ఫామ్తో ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మేయర్స్ గత మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. కింగ్, అతనజ్ కూడా రాణించడంతో పాటు కార్టీ కూడా నిలబడితే జట్టు మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. విండీస్ బౌలింగ్ గత మ్యాచ్లో ఆకట్టుకుంది. పేసర్లలో అల్జారి జోసెఫ్ పదునైన పేస్తో భారత్ను ఇబ్బంది పెట్టగా రొమారియో షెఫర్డ్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి సమష్టిగా రాణించి సొంతగడ్డపై సిరీస్ సాధించాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం బ్రియాన్ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్కు ఆతిథ్యం ఇచి్చంది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్ పరిస్థితికి ఒక సూచిక. మ్యాచ్ రోజు వాన ముప్పు లేదు. -
Asia Cup: చెలరేగిన స్పిన్నర్లు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్! పాకిస్తాన్తో ఢీ
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. కొలంబోలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ను 51 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలి సెమీస్లో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరిన పాకిస్తాన్తో టైటిల్ వేటలో తలపడనుంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. ఇక నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్సిన్హ్ దోడియా 0(నాటౌట్) నిరాశ పరిచారు. 49.1ఓవర్లలో కేవలం 211 పరుగులు మాత్రమే చేసిన యశ్ ధుల్ సేన ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ తలా రెండు వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చెలరేగిన స్పిన్నర్లు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దంచికొట్టింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ 38, తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించారు. వన్డౌన్లో వచ్చిన జాకీర్ హసన్ మాత్రం 5 పరుగులకే చేతులెత్తేయగా.. భారత స్పిన్నర్లు మానవ్ సుతార్, నిశాంత్ సింధు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. మానవ్ 3 వికెట్లు సాధించగా.. నిశాంత్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. యువరాజ్సిన్హ్ దోడియా , అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 160 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. 51 పరుగులతో భారత జయభేరి మోగించింది. యశ్ ధుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక జూలై 23న ఫైనల్లో పాకిస్తాన్ను భారత్ ఢీకొట్టనుంది. చదవండి: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
టెన్నిస్లో ప్రస్తుతం కార్లోస్ అల్కారాజ్ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్వన్గా ఉన్న అల్కారాజ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో తొలిసారి సెమీస్లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అల్కారాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); డానిల్ మెద్వెదెవ్తో అల్కారాజ్ తలపడనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, అల్కారాజ్ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్ తండ్రికి టెన్నిస్ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సందర్భంగా మ్యాచ్లను చూడడానికి వచ్చిన అల్కారాజ్ తండ్రి.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాక్టీస్ వీడియోనూ ఫోన్లో బంధించాడు. అయితే తన కొడుక్కి జొకోవిచ్ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. ''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్ వన్ నుంచి టాప్-20 ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్ను గమనిస్తూనే ఫోన్లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్ లైఫ్లో నేను జొకోవిచ్తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్కే సపోర్ట్ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీ నాన్న జొకోవిచ్ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్ఫామ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: T10 League: బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్కు పండగే Wimbledon 2023: సెమీస్లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్లో ఈసారి కొత్త చాంపియన్! -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్తో తొలి టెస్టు.. ఓపెనర్గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్
కాల్గరీ: ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరో అంతర్జాతీయ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ చాంపియన్గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 22–20తో ప్రపంచ పదో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షి ఫెంగ్ లీ (చైనా)పై గెలుపొందాడు. గత ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాక లక్ష్య సేన్ నెగ్గిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్కు 31,500 డాలర్ల (రూ. 25 లక్షల 99 వేలు) ప్రైజ్మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ సంవత్సరం తాను పాల్గొన్న 12వ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. షి ఫెంగ్ లీపై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 50 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో లక్ష్య సేన్ కీలకదశలో విజృంభించి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో స్కోరు 5–6 వద్ద ఉన్నపుడు షి ఫెంగ్ లీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–6తో ముందంజ వేశాడు. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షి ఫెంగ్ లీ 20–16తో నాలుగు గేమ్ పాయింట్లు సంపాదించాడు. అయితే లక్ష్య సేన్ దూకుడుగా ఆడి ఊహించనిరీతిలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచాడు. తద్వారా రెండో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ‘ఒలింపిక్ అర్హత సంవత్సరం కావడం, దానికి తోడు అన్నీ నాకు ప్రతికూల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ టోర్నీ కొనసాగినకొద్దీ నా ఆటతీరు మెరుగైంది. ఫైనల్లో రెండో గేమ్లో వెనుకబడిన దశలో సంయమనం కోల్పోకుండా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఫలితాన్నిచ్చింది’ అని ఉత్తరాఖండ్కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. Congratulations to the talented @lakshya_sen on his outstanding victory at the Canada Open 2023! His triumph is a testament to his tenacity and determination. It also fills our nation with immense pride. My best wishes to him for his upcoming endeavours. pic.twitter.com/DqCDmNSbhk— Narendra Modi (@narendramodi) July 10, 2023 Sometimes, the hardest battles lead to the sweetest victories. The wait is over, and I am delighted to be crowned the Canada Open winner! Grateful beyond words 🎉🏆 #SenMode #BWFWorldTour#CanadaOpen2023 pic.twitter.com/u8b7YzPX01— Lakshya Sen (@lakshya_sen) July 10, 2023 -
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్.. ఆ సిరీస్కు ముహూర్తం ఖరారు! -
ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం
ఏషియన్ కబడ్డీ చాంపియన్షిప్ 2023 టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణకొరియాలోని బుసాన్ వేదికగా శుక్రవారం ఇరాన్తో జరిగిన ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఓడించింది. కాగా భారత్కు ఆసియా కప్ టైటిల్ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. జూన్ 27న ప్రారంభమైన టోర్నీలో మూడురోజుల పాటు ఆరు మ్యాచ్లు జరిగాయి. టాప్-2లో నిలచిన భారత్, ఇరాన్లు ఫైనల్లో పోటీపడ్డాయి. భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్ఫుల్ రైడ్లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకుంది. ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. చదవండి: #MajidAli: రంపం మెషిన్తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ -
జొకోవిచ్దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్గా 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్దే తొలిసెట్ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్ను ఓడించి సెట్ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో శుబ్మన్ గిల్ క్యాచ్ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్ పెర్ఫామెన్స్కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్ కూల్. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Long live true love and patriarchy #IPLFinals #RavindraJadeja #Rajputboy pic.twitter.com/KXuY3kywGv — History Of Rajputana (@KshatriyaItihas) May 29, 2023 దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వారెవ్వా జడేజా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్పాండే బౌలింగ్లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తుషార్ దేశ్పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాండే బౌలింగ్ను సాయి సుదర్శన్, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాయి సుదర్శన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్ దేశ్పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా ఫెర్గూసన్తో కలిసి దేశ్పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్ వాట్సన్-ఆర్సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్ఆర్హెచ్తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్ కేకేఆర్.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్కేతో ఫైనల్లో) ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్గా తుషార్ దేశ్పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో తుషార్ దేశ్పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్గా తొలి స్థానంలో నిలిచాడు. తుషార్ తర్వాత 2022 సీజన్లో ప్రసిద్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్ సీజన్లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్ కౌల్ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు. Most runs conceded by a bowler in an IPL season: 564 - Tushar Deshpande, 2023 (Eco 9.92) 551 - Prasidh Krishna, 2022 (8.28) 548 - Kagiso Rabada, 2020 (8.34) 547 - Siddarth Kaul, 2018 (8.28) 533 - Dwayne Bravo, 2018 (9.96)#GTvCSK #IPL2023Finals pic.twitter.com/wZTuTZlE3V — Bharath Seervi (@SeerviBharath) May 29, 2023 చదవండి: ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్గా -
శుబ్మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్గా
ఐపీఎల్ 16వ సీజన్ శుబ్మన్ గిల్కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్కు మాత్రం కెరీర్లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ అందుకోనున్ను శుబ్మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో గిల్ 17 మ్యాచ్లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లి 973 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్గానూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2018) వరుసగా ఉన్నారు. ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్ఆర్హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Brief but looking dangerous - Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL— JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: సూపర్ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు -
సూపర్ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ టైమింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో గిల్ను ధోని స్టంపౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చహర్ క్యాచ్ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్ లభించడంతో 39 పరుగులతో గిల్ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. మాములుగానే అలర్ట్గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్ ఎగురగొట్టాడు. అలా చహర్ క్యాచ్ వదిలేసి గిల్కు లైఫ్ ఇచ్చినా ధోని తన స్మార్ట్ స్టంపింగ్తో పెవిలియన్ పంపించాడు. Photo: IPL Twitter అయితే ధోని స్టంపౌట్పై కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికి.. గిల్ మాత్రం డీఆర్ఎస్ కోరాడు. అయితే రివ్యూలో గిల్కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్ మిస్ చేసి ఫ్రంట్ఫుట్ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్ వెనక్కి వచ్చే లోపే సూపర్ఫాస్ట్గా బెయిల్స్ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్ ఔట్ అని బిగ్స్క్రీన్పై కనిపించింది. Still the world's best 'keeper'#EnoughSaid pic.twitter.com/zhgMJEcFUj — JioCinema (@JioCinema) May 29, 2023 MS Dhoni - still the fastest hand behind the stumps. pic.twitter.com/57xOM77nEh — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 Treatment effect 😭 pic.twitter.com/oVDj2RYN7h — Mohammad Junaid (@MDJunaid4377067) May 29, 2023 చదవండి: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఇవాళ ఎంటర్టైన్ చేస్తాం' -
'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్టైన్ చేసి తీరుతాం'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. కాగా టాస్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు. నిన్నటి మ్యాచ్ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు. 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 చదవండి: IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సీఎస్కే అప్డేట్స్ వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్లీవ్స్ కష్టాలు! -
IPL 2023 Final: గెలిపించిన జడేజా.. ఐపీఎల్16వ సీజన్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్కేను గెలిపించాడు. అంతకముందు ఓపెనర్లు రుతురాజ్ 26, డెవాన్ కాన్వే 47 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్ దూబే 32 నాటౌట్, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్కేను ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్ అందుకున్నసీఎస్కే ముంబై ఇండియన్స్తో కలిసి సమంగా నిలిచింది. ధోని గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 25, జడేజా రెండు పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లలో సీఎస్కే 133/3 12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శివమ్ దూబే 25, అంబటి రాయుడు 9 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 171.. వంద పరుగులు దాటిన సీఎస్కే 171 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే వంద పరుగుల మార్క్ను దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అజింక్యా రహానే 26, శివమ్ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు. నూర్ అహ్మద్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ధాటిగా ఆడుతున్న సీఎస్కేను నూర్ అహ్మద్ దెబ్బ తీశాడు. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే రూపంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సీఎస్కే విజయానికి 48 బంతుల్లో 93 పరుగులు కావాలి. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్ ఔట్ 26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ నూర్ అహ్మద్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 72/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. కాన్వే 22 బంతుల్లో 44 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. రుతురాజ్ 25 పరుగులతో సహకరిస్తున్నాడు. దంచుతున్న రుతురాజ్, కాన్వే.. 4 ఓవర్లో సీఎస్కే 52/0 171 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, కాన్వే 29 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. టార్గెట్ 171.. 2 ఓవర్లలో సీఎస్కే 24/0 2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్వర్త్ లూయిస్ పద్దతిలో సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 గంటన్నర పాటు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్ను కుదించారు. 15 ఓవర్లలో సీఎస్కే టార్గెట్ 171 పరుగులుగా నిర్ధేశించారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. టార్గెట్ 215.. మ్యాచ్కు వర్షం అంతరాయం గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య ఫైనల్మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మెరుపులు.. సీఎస్కే టార్గెట్ 215 సీఎస్కేతో జరుగుతున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్లు చెరొక వికెట్ తీశారు. 18 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 182/2 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ ఫిఫ్టీ.. గుజరాత్ 16 ఓవర్లలో 153/2 సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో గుజరాత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57, పాండ్యా ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(54)ఔట్ 54 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 131 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 36, పాండ్యా క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 109/1 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సాహా 48, సాయి సుదర్శన్ 20 పరుగులతో ఆడుతున్నారు. ధోని సూపర్ స్టంపింగ్.. గిల్(39) ఔట్ సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధోని సూపర్ఫాస్ట్ స్టంపింగ్కు గిల్ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్ జడ్డూ బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్ఫాస్ట్గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్ స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. 3 ఓవర్లలో గుజరాత్ స్కోరు 24/0 మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. సాహా 20, గిల్ 4 పరుగులుతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్కు వర్షం ముప్పు అంతలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు.. సీఎస్కే ఒకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో సీఎస్కే గెలిచి ఐదోసారి ఛాంపియన్గా నిలుస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్లీవ్స్ కష్టాలు!
ఐపీఎల్ 16వ సీజన్కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నైట్షిఫ్ట్ సహా లేట్నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సిక్లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్ను షేర్ చేసింది. హెచ్ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..! Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH — JioCinema (@JioCinema) May 29, 2023 ✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60 — JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత #GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్యూవీని శుభ్మాన్ గిల్కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
సీఎస్కే, జీటీ తుది పోరు.. వర్షంలో అభిమానులు ఇలా..!(ఫొటోలు)
-
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
#IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం
ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికి వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. సోమవారం మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికి వర్షం పడే అవకాశం 60శాతం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై ఒక మహిళా అభిమాని దౌర్జన్యం చేసింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది. అయితే ఆ అధికారి మాత్రం ఆమెను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి మహిళ తన కాలితో అతన్ని తన్నడం అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్నవాళ్లు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn't do anything. Is this woman empowerment? Worst Fanbase Ever 🤮🤮@ChennaiIPL #CSKvGT #GTvCSK #Rain #Ahmedabad pic.twitter.com/lH8N0bsSL5 — Harshit 🇮🇳 (@Imharshit_45) May 28, 2023 చదవండి: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా! -
దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ ఆ సీన్ను మొత్తం రివర్స్ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్గా ఐపీఎల్ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్ చేయడం కనిపించింది. అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీఎస్కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్ మ్యాచ్ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగకుండానే టైటిల్ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే లీగ్లో టాపర్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులకు మింగుడుపడని అంశమే. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో ఏ మ్యాచ్కు అడ్డుపడని వరుణుడు ఫైనల్ మ్యాచ్కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g— Silly Context (@sillycontext) May 28, 2023 Rain stoppedToss at 9:10#CSKvGT #IPLFinals #IPL2023Final #Ahmedabad #rain #MSDhoni #Ahmedabad pic.twitter.com/YEyDQef1hm— proper thought. (@ThoughtProper) May 28, 2023 -
IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ సైమన్ డౌల్.. అంపైర్లతో చర్చించి మ్యాచ్ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు. ఇక సోమవారం కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్ను రద్దు చేసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటిస్తారు. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 వర్షం కారణంగా టాస్ ఆలస్యం ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ► ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్కు వేళైంది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. -
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్లో జరిగితే తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్కప్ దృశ్యా ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
టీమిండియా బౌలర్కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్సీబీతో మ్యాచ్లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది. అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్సైట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. See you back on the field soon @JDUnadkat Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN — IndianPremierLeague (@IPL) May 1, 2023 చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి -
IPL 2023: ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలు ఖరారు
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. కోవిడ్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో రెండేళ్ల పాటు కాస్త చప్పగా సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం దుమ్మురేపుతుంది. ప్రతీ మ్యాచ్ ఆసక్తిగా సాగడంతో పాటు స్టేడియాలన్ని ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్ అయితే మునుపెన్నడు లేని విధంగా రికార్డులు సృష్టిస్తోంది. మరో వారంలో లీగ్లో తొలి దశ మ్యాచ్లు ముగియనున్నాయి. అయితే 16వ సీజన్ ప్రారంభంలో కేవలం లీగ్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే రిలీజ్ చేసిన బీసీసీఐ తాజాగా శుక్రవారం ప్లేఆఫ్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ తేదీలు, వేదికల వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ 16వ సీజన్లో లీగ్ మ్యాచ్లు మే21తో ముగియనున్నాయి. అనంతరం మే 23న(మంగళవారం) తొలి క్వాలిఫయర్, మే 24న(బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్, మే 26న(శుక్రవారం) క్వాలిఫయర్-2 జరగనున్నాయి. ఇక మే 28న(ఆదివారం) ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా తొలి క్వాలిఫయర్తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ట్విటర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. IPL 2023 ప్లే-ఆఫ్ మ్యాచ్ల షెడ్యూల్: మే 23(మంగళవారం) - క్వాలిఫయర్-1 మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 24(బుధవారం) - ఎలిమినేటర్ మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 26(శుక్రవారం) - క్వాలిఫయర్-2 మ్యాచ్, వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు మే 28(ఆదివారం) - ఫైనల్ వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్రేట్ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్లపై ఉంది. ఆల్రౌండర్గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్ప్రీత్ ఫామ్లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
సీసీఎల్ విజేత తెలుగు వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం రాత్రి భోజ్పురి దబాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో పోటీలో తెలుగు వారియర్స్ జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్లతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఫైనల్స్లో తెలుగు వారియర్స్ ఆడుతుండడంతో తమ అభిమాన తారల ఆటను వీక్షించేందుకు తరలివచ్చారు. జట్టు మెంటర్ వెంకటేష్ అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ బాక్స్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించారు. వారియర్స్ జట్టుతో కలిసి తొలి ఇన్నింగ్స్ ముగియగానే అభివాదం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. -
నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్ పోరు
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్లో లుత్సయ్ఖాన్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్ ప్రపంచ చాంపియన్లో నీతూ తొలిసారి ఫైనల్కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్లో నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మూడో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–6 (8/6), 7–6 (7/2)తో జాన్ ఇస్నెర్–జాక్ సాక్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ తమ సరీ్వస్లో తొమ్మిదిసార్లు బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇటీవల దోహా ఓపెన్లో బోపన్న–ఎబ్డెన్ జంట టైటిల్ సాధించగా... రోటర్డామ్ ఓపెన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల బోపన్న ఇప్పటి వరకు కెరీర్లో 55 టోరీ్నల్లో ఫైనల్కు చేరగా...23 టోరీ్నల్లో టైటిల్స్ నెగ్గి, 32 టోర్నీల్లో రన్నరప్గా నిలిచాడు. Matt Ebden and Rohan Bopanna are through to the @BNPPARIBASOPEN men's doubles final 💪 This is @mattebden's first ATP Masters 1000 final 👏#GoAussies #TennisParadisehttps://t.co/mpsSu4K0tT — TennisAustralia (@TennisAustralia) March 18, 2023 -
ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది సేన వరుసగా రెండో ఏడాది టైటిల్ను నిలబెట్టుకుంది. అప్పుడు కూడా ఫైనల్ ముల్తాన్ సుల్తాన్స్తో ఆడడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లాహోర్ ఖలండర్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో జమాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని కుష్దిల్ షా మిడాన్ దిశగా ఆడాడు. రెండు పరుగులు పూర్తి చేసిన కుష్దిల్ షా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న డేవిడ్ వీస్ అఫ్రిదికి త్రో వేశాడు. వేగంగా అందుకున్న బంతిని అఫ్రిది క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లకు గిరాటేశాడు. అంతే ముల్తాన్ సుల్తాన్స్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఓడినా ముల్తాన్ సుల్తాన్స్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. షఫీకి 40 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ షాహిన్ అఫ్రిది 15 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ 39 పరుగులు చేశాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలింగ్లో ఉస్మా మీర్ మూడు వికెట్లు తీయగా.. అన్వర్ అలీ, ఇషానుల్లా, కుష్దిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ వికెటఉల పడుతున్న లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. రిలీ రొసౌ(32 బంతుల్లో 52, 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 20, కుష్దిల్ షా 25 పరుగులు చేశారు. లాహోర్ ఖలండర్స్ బౌలింగ్లో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్ రెండు, డేవిడ్ వీస్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్లో తన ప్రదర్శనతో అదరగొట్టిన షాహిన్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. ఇషానుల్లా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. 𝘽𝙡𝙤𝙘𝙠𝙗𝙪𝙨𝙩𝙚𝙧 𝙛𝙞𝙣𝙞𝙨𝙝! 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/QfKcUSSnhj — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 🏆 W I N N E R S 🏆@lahoreqalandars - owners of the Supernova Trophy 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/XIDb9hDRlw — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
సంతోష్ ట్రోఫీ ఫైనల్.. 54 ఏళ్ల నిరీక్షణకు తెర
దేశవాలీ ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలవడం విశేషం. శనివారం రాత్రి మేఘాలయాతో జరిగిన ఫైనల్ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కర్ణాటక 3-2 తేడాతో మేఘాలయాను ఓడించి కప్ను కైవసం చేసుకుంది. కర్ణాటక తరపున సునీల్ కుమార్(ఆట 3వ నిమిషం), బెకి ఓరమ్(20వ నిమిషం), రాబిన్ యాదవ్(44వ నిమిషం) గోల్స్ చేయగా.. మేఘాలయ తరపున బర్లింగ్టన్(8వ నిమిషం), షీన్(60వ నిమిషం) రెండు గోల్స్ కొట్టారు. అయితే ఆట తొలి సగంలోనే ఇరజట్లు కలిపి నాలుగు గోల్స్ కొడితే.. అందులో మూడు కర్ణాటక చేయగా.. ఒకటి మేఘాలయ ఖాతాలోకి వెళ్లింది. అయితే రెండో సగంలో మేఘాలయా మరొక గోల్ చేసినప్పటికి కర్ణాటక డిఫెన్స్ను నిలువరించలేక చేతులెత్తేసింది. ఇక కర్ణాటక 1968-69 సీజన్లో తొలిసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 😄😄😄#MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/1gqSRz8jns — Indian Football Team (@IndianFootball) March 4, 2023 🏆 KARNATAKA ARE CHAMPIONS AFTER 5️⃣4️⃣ YEARS 🏆 It was a close call in the end, but Karnataka get over the line in the end 🤩 MEG 2⃣-3⃣ KAR 📺 @FanCode & @ddsportschannel #MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/tUVsvggPBE — Indian Football Team (@IndianFootball) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్గా బెన్ స్టోక్స్!? ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. -
సమిష్టిగా చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ 174 ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది. ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
వరల్డ్కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ
బిడ్డ దేశం కోసం ఆడుతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి బిడ్డ ఆటను కళ్లారా చూడాలని స్మార్ట్ఫోన్ను కూడా కాదని ఇన్వర్టర్ కొన్న ఒక తల్లి కథ తప్పక చదవాల్సిందే. విషయంలోకి వెళితే.. షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా అండర్-19 మహిళల టి20 వరల్డ్కప్లో సూపర్ ఆటతీరుతో అదరగొట్టి టైటిల్కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదే టీమ్లో ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన అర్చనా దేవి బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు సంపాదించింది. టోర్నీలో ఆమె మంచి ప్రదర్శననే కనబరిచింది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. -సాక్షి, వెబ్డెస్క్ ఉత్తర్ప్రదేశ్లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్లో 24 గంటలు కరెంటు ఉండడం అనేది గగనం. కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఉంటుందట. అండర్-19 టి20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరిందన్న సంగతి సావిత్రి తన కూతురు అర్చన ద్వారా తెలుసుకొని తెగ సంతోషపడింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో బిడ్డ ఆటను కళ్లారా చూడాలని భావించింది. కానీ కరెంటు సమస్య ఉండడంతో మ్యాచ్ చూడడం కాస్త కష్టమే. కూతురు కొనిచ్చిన స్మార్ట్ఫోన్పై ఆమెకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే సావిత్రి ఒక ఆలోచన చేసింది. ఊర్లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి తన బిడ్డ అర్చనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని.. ఆ మ్యాచ్ను చూడాలనుకుంటున్నానని.. తలా ఇంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్ కొందామని చెప్పింది. తమ గ్రామానికి చెందిన ఒక ఆడబిడ్డ దేశానికి ఆడుతుందంటే అది మాకు గర్వకారణమే అని భావించిన ఊరివాళ్లు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. ప్రతీ ఇంటి నుంచి వచ్చిన రూపాయితో సావిత్రి మొత్తానికి ఇన్వర్టర్ కొనేసింది. ఇక ఆదివారం ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్ను చూడడానికి సావిత్రి అంతా సిద్ధం చేసుకుంది. ''మా ఊళ్లో కరెంటు 24 గంటలు ఉంటుందనే దానిపై నమ్మకం లేదు. మొబైల్ ఫోన్లో మ్యాచ్ చూద్దామన్నా బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నా కూతురు ఆడనున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ను ఒక్క క్షణం కూడా మిస్ కాకూడాదని అనుకుంటున్నా. అందుకే ఊరివాళ్లతో మాట్లాడి డబ్బు పోగు చేసి ఇన్వర్టర్ కొనుక్కున్నా. ఇప్పుడు నా కూతురు ఆటను చూడడానికి ఎలాంటి అడ్డంకులు లేవు'' అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొంది. ఇక క్రికెటర్ అర్చనా దేవి తల్లి సావిత్రి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె కల నెరవేరకపోయినా కూతురు రూపంలో దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన సావిత్రి.. అర్చనను మాత్రం కష్టపడి పెంచింది. ''ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పంట పండించడంతో పాటు రెండు ఆవుల నుంచి వచ్చిన పాలను అమ్మి కూతురును పెంచి పెద్ద చేశాను. అయితే అర్చనను చిన్నప్పుడే హాస్టల్కు పంపించిన సావిత్రి గంజిలోని మురదాబాద్లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదివించింది. కూతురును దూరం పెట్టిందని ఊరి వాళ్లంతా సూటిపోటి మాటలు అనేవారు. నాలాగా నా కూతురు పెరగకూడదనే ఎంత కష్టమైనా తనను చదివించుకున్నాను. ఇప్పుడు తను ఉన్నత స్థాయికి ఎదగడంతో తిట్టినోళ్ల నోటి నుంచే పొగడ్తలు రావడం సంతోషంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగడానికి ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్.. భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్ చోప్రా అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. It's down to two 👀 Who will get their hands on the inaugural ICC Women's #U19T20WorldCup? 🏆 pic.twitter.com/CDh5IGnAaa — T20 World Cup (@T20WorldCup) January 28, 2023 A Gold-standard meeting! 👏👏 Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT — BCCI (@BCCI) January 28, 2023 చదవండి: 'స్లమ్డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్లో గోల్డ్ మెడల్ -
AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా
ఒకరు 195 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేస్తున్నారు.... మరొకరు ఏమాత్రం తగ్గకుండా 192 కిలోమీటర్ల వేగంతో జవాబిస్తున్నారు... ప్రతీ పాయింట్ కోసం హోరాహోరీ సమరం... వీరి షాట్లతో బంతి పగిలిపోతుందేమో అనిపించింది... ఒకరు ఇప్పటికే గ్రాండ్స్లామ్ చాంపియన్ కాగా, మరొకరు తొలి టైటిల్ వేటలో పోరాడుతున్నారు...దూకుడు ఎలా ఉందంటే తొలి 13 పాయింట్లలో 7 ఏస్ల ద్వారానే వచ్చాయి... చివరి వరకు కూడా అదే ధాటి కొనసాగింది... గత కొన్నేళ్లుగా ఏకపక్షంగా జరుగుతున్న మహిళల గ్రాండ్స్లామ్ ఫైనల్ మ్యాచ్లతో పోలిస్తే పోటీపోటీగా, అత్యుత్తమ స్థాయిలో ఈ తుది పోరు సాగింది. చివరకు 2 గంటల 28 నిమిషాల ఆట తర్వాత విజేత అవతరించింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ కొత్త చాంపియన్గా అరైనా సబలెంకా నిలిచింది. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో చాంపియన్గా నిలిచిన 29వ క్రీడాకారిణిగా అరైనా సబలెంకా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన తుది పోరులో సత్తా చాటిన 24 ఏళ్ల ఈ బెలారస్ స్టార్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ను అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో 22వ సీడ్ సబలెంకా 4–6, 6–3, 6–4 స్కోరుతో ఐదో సీడ్ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. మ్యాచ్లో సబలెంకా 17 ఏస్లు కొట్టగా, రిబాకినా 9 ఏస్లు బాదింది. ప్రత్యరి్థతో పోలిస్తే 51–31 విన్నర్లతో ఆమె పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 29 లక్షల 75 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.34 కోట్లు), రన్నరప్ రిబాకినాకు 16 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 9.47 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా గెలుపుతో సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. హోరాహోరీగా... ఫైనల్కు ముందు బలాబలాలు చూస్తే ఇద్దరు సమఉజ్జీలుగానే కనిపించారు. ఇప్పటికే గ్రాండ్స్లామ్ గెలిచిన అనుభవంతో పాటు ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్స్లామ్ విజేతలు స్వియాటెక్, ఒస్టాపెంకో, అజరెంకాలను ఓడించిన ఘనతతో రిబాకినా బరిలోకి దిగగా, ఈ ఏడాది ఓటమి ఎరుగని రికార్డుతో సబలెంకా నిలిచింది. తొలి సెట్లో రిబాకినా ఆధిక్యం ప్రదర్శిస్తూ 3–1తో ముందంజ వేసినా, ఆపై కోలుకొని ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసిన బెలారస్ ప్లేయర్ 4–4తో స్కోరు సమం చేసింది. అయితే బ్రేక్ సాధించిన రిబాకినా ఆపై సర్వీస్ నిలబెట్టుకొని తొలి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో తన ఫోర్హ్యాండ్ పదును ప్రదర్శించిన సబలెంకా 4–1 వరకు వెళ్లింది. ఆపై కజక్ ప్లేయర్ ఎదరుదాడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు వరుస ఏస్లతో సబలెంకా సెట్ ముగించింది. మూడో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3కు చేరింది. అయితే ఫోర్హ్యాండ్ విన్నర్తో కీలకమైన ఏడో గేమ్ను బ్రేక్ చేసిన సబలెంకాకు మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది. Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
India Open: ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్కు బిగ్షాక్
ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అక్సెల్సన్ (డెన్మార్క్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) 22–20, 10–21, 21–12తో అక్సెల్సన్ను తన కెరీర్లో తొలిసారి ఓడించి విజేతగా నిలిచాడు. కున్లావుత్కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్మనీ దక్కింది. టాప్ సీడ్పై గెలిచి... విజేతగా నిలిచి... ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోరీ్నలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆన్ సె యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె చాంపియన్గా నిలిచింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 15–21, 21–16, 21–12తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ టైటిల్. విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్కప్లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్ను పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో చిత్తు చేసిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి వరల్డ్కప్ను ఎగురేసుకుపోయింది. అర్జెంటీనా కప్పు కొట్టగానే స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. అయితే ఈ గ్యాప్లోనే ఒక యువతి నగ్న ప్రదర్శన చేయడం హల్చల్గా మారింది. అయితే మెస్సీ మాయలో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకుంటే పెద్ద వివాదం అయ్యుండేది. విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్పై విజయం సాధించాకా అర్జెంటీనా అభిమానులు దేశ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఒక అర్జెంటీనా అభిమానుల గుంపులో ఒక యువతి టాప్లెస్గా దర్శనమిచ్చింది. జెండాల మధ్యలో నిలబడిన యువతి చాతి భాగం కనిపించేలా నగ్న ప్రదర్శన చేసింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన మిగతావారు.. ఇక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమని.. ఎస్కార్ట్ సాయంతో అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ ఫోటోలు బయటికి రావడంతో పెద్దగా దుమారం జరగలేదు. అయితే యువతి చర్యను తప్పుబట్టిన ఖతర్ అధికారులు ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులు ఇస్తామని.. దానికి బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మెస్సీ బృందం గెలిచిన సంతోషంలో పొరపాటున అలా చేసిందో లేక కావాలనో తెలియదు కానీ తన అందాల ప్రదర్శనతో ఆమె పక్కన నిల్చున్న వారి మతులు మాత్రం పోగొట్టింది. చదవండి: వరల్డ్కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె -
నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
డిసెంబర్ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్కప్ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కదలికల్లో చిరుత కంటే వేగంతో పరిగెత్తాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అలా నిర్ణీత సమయంలోగా 2-2తో ఎలాంటి ఫలితం రాలేదు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్తో మ్యాచ్ను షూటౌట్కు తీసుకెళ్లాడు. అందులోనూ విజయం సాధించాడు ఎంబాపె. అయితే తాను ఒక్కడే ఆడితే సరిపోదు కదా.. సహచర ఆటగాళ్లు కూడా ఆడాలి. కానీ వాళ్లు ఆడలేదు.. ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ క్షణం ఎంబాపె మొకాళ్లపై మైదానంలో కూలబడ్డాడు. స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. తాను మాత్రం నిరాశలో మునిగిపోయాడు. కానీ అతని ఆట తీరుకు ముగ్దులైన యావత్ ప్రపంచం వీరుడి పోరాటానికి సలాం కొట్టింది. ఈ తరంలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను.. ఆల్టైమ్ గ్రేట్ ఆటగాళ్లుగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ప్రపంచకప్ కొట్టి మెస్సీ రొనాల్డో కంటే ఒక మెట్టు పైనున్నాడనుకోండి. అది వేరే విషయం. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి వరల్డ్కప్ను దాదాపు ఆడేసినట్లే. వచ్చే వరల్డ్కప్ వరకు అందుబాటులో ఉంటారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫుట్బాల్కు మరో కొత్త సూపర్స్టార్ కావాల్సిన అవసరం వచ్చింది. నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్కప్ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్బాల్లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు. మరి అంతలా పేరు సంపాదించిన ఎంబాపె అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్ నుంచి శరణార్థిగా పారిస్ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె ఫుట్బాల్ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్బాల్ క్రీడాకారిణిగా రాణించింది. 1998లో ఫ్రాన్స్ తొలిసారి ఫుట్బాల్ వరల్డ్కప్ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్ ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్బాల్పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువు కంటే ఆటనే ఎక్కువగా ప్రేమించిన కొడుకును చూసి సంతోషపడిన తండ్రి విల్ఫ్రైడ్ ప్రోత్సహించాడు. ఎంబాపెకు ఫుట్బాల్ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు కూడా అతని తండ్రే కావడం విశేషం. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్ బాండీ క్లబ్లో జాయిన్ చేశాడు. అలా ఫుట్బాల్ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. పారిస్ సెయింట్ జెర్మైన్తో(పీఎస్జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది. అలా 2018 ఫిఫా వరల్డ్కప్ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్ చేరిన ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్కప్ టైటిల్ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్లో నాలుగు గోల్స్ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్కప్లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్బాల్ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం. సలాం కైలియన్ ఎంబాపె. చదవండి: మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు! -
మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు
మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్కు అర్జెంటీనా ‘ఖతర్’నాక్ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్ హాఫ్లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్ అటాక్ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. ‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్ మాత్రం మెస్సీ మ్యాజిక్. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్ కీపర్ జట్టును సేవ్ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్బాట్ ప్రపంచకప్ ఫైనల్ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!) -
గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఎంబాపే.. రికార్డులు బద్దలుకొడుతున్నాడు!
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే, ఫిఫా వరల్డ్కప్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్కప్లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్కప్లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్లో జన్మించాడు. బాండీలో ఫుట్బాల్ కేరీర్ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్స్కోరర్గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్కప్లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు. The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊 — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 -
36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు!
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఫ్రాన్స్ను మట్టికరిపించి మూడోసారి ఫిఫా టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక అర్జెంటీనాకు తొలి రెండు వరల్డ్కప్లు సాధించడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పడితే.. మూడో టైటిల్ సాధించడానికి మాత్రం 36 సంవత్సరాల ఎదురుచూపులు తప్పలేదు. అర్జెంటీనా 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్కప్ను సాధించింది. అప్పట్లో నెదర్లాండ్స్తో జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలి వరల్డ్కప్లో అర్జెంటీనా నెగ్గడంలో మారియో కెంపెస్ది కీలకపాత్ర. ఇక 1986లో అర్జెంటీనా రెండోసారి ఫిఫా వరల్డ్కప్ నెగ్గిన సమయంలో డీగో మారడోనా అన్నీ తానై జట్టును నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఓడించి రెండోసారి విజేతగా అవతరించింది. ఇక మారడోనా తర్వాత అంతటి పేరును సంపాదించిన మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిఫా వరల్డ్కప్ను సాధించింది. 2022లో ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీని అందుకుంది. ఈతరం గొప్ప ఆటగాళ్లలో టాప్ పొజీషన్లో ఉన్న మెస్సీ తన కెరీర్లో ఎన్నో టైటిల్స్ సాధించినప్పటికి ఫిఫా వరల్డ్కప్ లేదన్న లోటు అలాగే మిగిలిపోయింది. తాజాగా మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడడం.. తన చివరి మ్యాచ్లోనే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్కప్ టైటిల్ కొట్టడం అతనికి ఘనమైన వీడ్కోలు అని చెప్పొచ్చు. ఇక ఫుట్బాల్ బతికున్నంతవరకు మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు
అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీ నిరీక్షణ ఫలించింది. మారడోనా లిగసీని ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్బాల్లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్లో ఎన్నో టైటిల్స్, అవార్డులు కొల్లగొట్టాడు. అయినా కానీ ఫిఫా వరల్డ్కప్ కొట్టలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్కప్ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్కప్ ఫైనల్.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని ప్రకటించిన మెస్సీ టైటిల్తో తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఇక మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్కప్ జరిగిందా అన్న అనుమానం రాకమానదు. సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చివేసింది. ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మాయాజాలం ఫైనల్ వరకు అజరామరంగా కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్ కొట్టడమే కాదు అత్యధిక అసిస్ట్లు చేసి విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత తన ఫిఫా వరల్డ్కప్ అందుకోవాలన్న కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు కప్ను అందించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫలితంగా తన వరల్డ్కప్ కలతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్స్టార్గా అభివర్ణించిన మెస్సీని ఇకపై దిగ్గజం అని పిలవాల్సిందే.. కాదు కాదు అలా పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గోట్(GOAT) అని ఒప్పుకోవాల్సిందే. మెస్సీతో రొనాల్డోను పోల్చడం ఇకపై ఆపేస్తారేమో చూడాలి. ఇక ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం అందుకుంది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది.2014లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన మెస్సీ సేన ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టుకుంది. 🏆🏆🏆 The greatest coronation in the history of the #WorldsGreatestShow 💯#Messi guides @Argentina to their third #FIFAWorldCup title 🐐#ARGFRA #ArgentinavsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Tb6KfWndXa — JioCinema (@JioCinema) December 18, 2022 🎶 𝙈𝙐𝘾𝙃𝘼𝘼𝘼𝘾𝙃𝙊𝙊𝙊𝙎 🎶 pic.twitter.com/TVVt04TVMW — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 Lionel Messi with his mum after the game 🥰pic.twitter.com/mvIKQRYfXt — SPORTbible (@sportbible) December 18, 2022 The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్కప్
Updates.. ► మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్కప్ వారెవ్వా ఏమి మ్యాచ్.. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మెస్సీ గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. నిర్ణీత సమయం ముగిసింది.. అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 #FIFAWorldCupFinal | Argentina celebrates after #FIFAWorldCup win 🔗 https://t.co/s26S2Q2R9Q Watch 🇦🇷 🆚 🇫🇷 LIVE on #JioCinema & @Sports18 📺📲#ArgentinaVsFrance #ARGFRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/RHqWLAS2sH — Moneycontrol (@moneycontrolcom) December 18, 2022 ► ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ క్షణక్షణానికి చేతులు మారుతుంది. ఆట అదనపు సమయం 108 వ నిమిషంలో మెస్సీ గోల్ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఫ్రాన్స్కు లభించిన పెనాల్టీ కిక్ను ఎంబాపె మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆట 118 వ నిమిషంలో పెనాల్టీ కిక్ను ఎంబాపె గోల్గా మలిచాడు. దీంతో ఇరుజట్ల స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. ► అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ ఉత్కంఠగా కొనసాగుతుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. అయితే మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. ► ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె నిమిషం వ్యవధిలో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్ గోల్తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్ను సమం చేసింది. ఫిఫా వరల్డ్కప్ కొట్టడానికి అర్జెంటీనా అడుగు దూరంలో ఉంది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన మెస్సీ బృందం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ వరల్డ్కప్లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్తో మెరిశాడు. ఆట 23వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్ను మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్ను బోల్తా కొట్టిస్తూ సూపర్ గోల్తో మెరిసి ఈ వరల్డ్కప్లో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకున్నాడు. ఇక ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్తో మెరవడంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. ఇక రెండో అర్థభాగంలో ఫ్రాన్స్ను నిలువరిస్తే చాలు అర్జెంటీనాతో పాటు మెస్సీ కల నెరవేరినట్లే. Lusail witnesses the @Oficial7DiMaria MANIA 💥 The man for the BIG OCCASION with a splendid finish ⭐ Keep watching the #FIFAWorldCup Final ➡ LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #ArgentinaVsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/1S9SNBnsjq — JioCinema (@JioCinema) December 18, 2022 BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
పెనాల్టీ కిక్ సందర్భంగా మెస్సీ ఎమోషనల్
ఖతర్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా ఫ్రాన్స్పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ వరల్డ్కప్లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్తో మెరిశాడు. ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్తో మెరవడంతో తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెనాల్టీలు కొట్టడంలో తనకు తానే సాటి అని మెస్సీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆట 23వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన పెనాల్టీ అద్భుతమనే చెప్పాలి. అయితే పెనాల్టీ కొట్టడానికి ముందు మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మెస్సీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిపా వరల్డ్కప్ ఫైనల్ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఓడితే కప్ లేకుండానే మెస్సీ కెరీర్ ముగుస్తుంది. అందుకే పెనాల్టీ కొట్టడానికి ముందు అంత ఎమోషనల్ అయ్యాడు. ఇక పెనాల్టీని గోల్గా మలిచిన తర్వాత మెస్సీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఇక అర్జెంటీనాకు గోల్ వచ్చిన తర్వాత స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
టైటిల్కు అడుగుదూరం.. మెస్సీని ఊరిస్తున్న ఆరు రికార్డులు
లియోనల్ మెస్సీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటి నుంచి మెస్సీ జపం మరింత ఎక్కువైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కేవలం మెస్సీ కోసమే చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెస్సీకి ఇదే చివరి వరల్డ్కప్ కానుంది. అంతేకాదు ఫిఫా వరల్డ్కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానుంది. అందుకే అభిమానులు ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఫైనల్ చేరిన మరో జట్టు ఫ్రాన్స్ అభిమానుల్లో మెజారిటి మెస్సీ సేన వరల్డ్కప్ గెలవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. మరి మెస్సీ అందరి అంచనాలను అందుకొని అర్జెంటీనాకు కప్ అందించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బలంగా కనిపిస్తుంది. కైలియన్ ఎంబాపె ఆ జట్టుకు పెద్ద బలం. వరుసగా రెండో ఫిఫా వరల్డ్కప్ నెగ్గి బ్రెజిల్, ఇటలీ సరసన నిలవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇదిలా ఉంటే టైటిల్కు ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీని ఆరు రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్న మెస్సీ ఈ వరల్డ్కప్లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు. ప్రీ క్వార్టర్స్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీకి 1000వ మ్యాచ్. తాజాఆ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఒక రికార్డు.. గోల్ కొడితే మరొక రికార్డు.. ఇలా అన్ని రికార్డులు ఒక్క మ్యాచ్తోనే ముడిపడి ఉన్నాయి. మరి మెస్సీని ఊరిస్తున్న ఆ ఆరు రికార్డులు ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. వరల్డ్కప్లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్కప్స్లో మెస్సీ ఒక ఆటగాడిగా ఇప్పటివరకు 16 విజయాలు అందుకున్నాడు. ఒకవేళ ఫైనల్లో అర్జెంటీనా నెగ్గితే మెస్సీ ఖాతాలో 17వ విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్కప్స్లో అత్యధిక మ్యాచ్ల్లో విజయాలు అందుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ లెజెండరీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోస్ సరసన నిలవనున్నాడు. మిరాస్లోవ్ క్లోస్ తన కెరీర్లో ఫిఫా వరల్డ్కప్స్లో 17 విజయాలు అందుకున్నాడు. అత్యధిక మ్యాచ్ల్లో పాల్గొన్న ఆటగాడిగా.. ఫ్రాన్స్తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్కప్స్లో 26వ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టనున్నాడు. లోథర్ మాథ్యూస్ ఫిఫా వరల్డ్కప్స్లో జర్మనీ తరపున 25 మ్యాచ్లు ఆడాడు. తాజాగా ఫ్రాన్స్తో ఫైనల్ మ్యాచ్ ద్వారా మెస్సీ.. ఫిఫా వరల్డ్కప్స్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. వరల్డ్కప్లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్కప్స్ చరిత్రలో అత్యధిక నిమిషాలు మ్యాచ్లో గడిపిన ఆటగాడిగా ఇటలీ దిగ్గజం పాలో మల్దినీ తొలి స్థానంలో ఉన్నాడు. పాలో మల్దిని 2217 నిమిషాల పాటు మైదానంలో గడిపాడు. ఇక మెస్సీ ఇప్పటివరకు 2197 నిమిషాలతో రెండో స్థానంలో ఉన్నాడు మెస్సీకి, పాలో మల్దినీకి మధ్య వ్యత్యాసం కేవలం 23 నిమిషాలు మాత్రమే ఉంది. తాజాగా ఫ్రాన్స్తో జరగనున్న ఫైనల్లో మెస్సీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అత్యధిక అసిస్ట్లు చేసిన ఆటగాడిగా.. మెస్సీ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్కప్స్లో తొమ్మిది అసిస్ట్లు చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ దిగ్గజం పీలే పది అసిస్ట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఫ్రాన్స్తో ఫైనల్లో మెస్సీ ఇతర ఆటగాళ్లు గోల్స్ చేయడంలో రెండు అసిస్ట్ ఇవ్వగలిగితే పీలే రికార్డు బ్రేక్ చేసి తాను మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మల్టిపుల్ గోల్డెన్ బాల్ అవార్డ్స్.. 2014 ఫిఫా వరల్డ్కప్లో మెస్సీ తొలిసారి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. ఒక వరల్డ్కప్లో బెస్ట్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు అందిస్తారు. ఈసారి వరల్డ్కప్లోనూ మెస్సీ సూపర్ ఫామ్లో ఉండడం అతనికి గోల్డెన్ బాల్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మెస్సీ గోల్డెన్ బాల్ గెలుచుకుంటే.. ఫిఫా టోర్నీ చరిత్రలో రెండుసార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న తొలి ప్లేయర్గా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఈ అవార్డు కోసం మెస్సీతో ఫ్రాన్స్ సూపర్స్టార్ ఎంబాపె పోటీలో ఉన్నాడు. ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అందుకునే అవకాశం.. ఫిఫా వరల్డ్కప్స్లో అత్యధిక గోల్ చేసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్. ఈసారి ఈ అవార్డుకు మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరు చెరో ఐదు గోల్స్తో ఉన్నారు. ఇక ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ఇక ఏకకాలంలో గోల్డెన్ బూట్తో పాటు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకునే అవకాశం మెస్సీతో పాటు ఎంబాపెకు ఉంది. మెస్సీ లేదా ఎంబాపెలలో ఎవరు దక్కించుకున్నా ఫిఫా చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. ఇంతకముందు లియోనిదాస్ సిల్వా(1938), గారించా(1962), రొనాల్డో(1998), పాలో రోసి(1982), సాల్వటోర్ సిలాచి(1990), మారియో కెంప్(1978) ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అవార్డును కొల్లగొట్టారు. అత్యధిక గోల్స్ కాంట్రిబ్యూషన్స్.. మెస్సీ ఇంతవరకు ఫిఫా వరల్డ్కప్స్లో 20 గోల్స్ కాంట్రిబ్యూషన్లో పాల్గొన్నాడు. ఇందులో పదకొండు గోల్స్తో పాటు తొమ్మిది అసిస్ట్లు ఉన్నాయి. బ్రెజిల్ దిగ్గజం పీలే 22 గోల్స్ కాంట్రిబ్యూషన్తో(12 గోల్స్, 10 అసిస్ట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫ్రాన్స్తో జరిగే ఫైనల్ ద్వారా మెస్సీ.. పీలే రికార్డును సమం చేయడమో లేక బద్దలు కొట్టే అవకాశం ఉంది. చదవండి: FIFA WC Final: ప్రైజ్మనీ.. విన్నర్కు ఎంత ; రన్నరప్కు ఎంత? చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9 విజేత జైపూర్ పింక్ పాంథర్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9 ఛాంపియన్స్గా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్తో జరిగిన ఫైనల్లో జైపూర్ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 13 రైడ్ పాయింట్లతో పాటు 15 టాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్గా అవతరించింది. ఇక పీకేఎల్ తొలి సీజన్లో విజేతగా అవరతరించిన జైపూర్ పింక్ పాంథర్స్ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ తర్వాత రెండోసారి చాంపియన్గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్గా నిలవడం విశేషం. 🏆 🏆 🏆 🏆 🏆 🏆 Jaipur 🏆 🏆 Pink 🏆 🏆 Panthers 🏆 🏆 🏆 🏆 🏆 🏆 JAIPUR PINK PANTHERS ARE CROWNED CHAMPIONS OF SEASON 9 🙌#JPPvPUN #vivoProKabaddi #FantasticPanga #vivoPKL2022Final #JaipurPinkPanthers #vivoProKabaddi2022Final #Champions pic.twitter.com/h2Fa7VeI24 — ProKabaddi (@ProKabaddi) December 17, 2022