former mp
-
సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు ఇవాళ్టి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది. ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా సిట్ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఢిల్లీ కంటోన్మెంట్లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్లోని బంకురా లోక్సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత
లక్నో: వైద్య సదుపాయాల కొరతతో సాధారణ పౌరులకే కాదు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయలు లేమి కారణంగా మాజీ ఎంపీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ అందుబాటులో లేక, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఉత్తర ప్రదేశ్కు చెందిన లోక్ సభ మాజీ ఎంపీ కుమారుడు మరణించాడు. లక్నోలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా కొడుకు ప్రకాష్ మిశ్రా(41) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి 11 గంటలకు లక్నోలోని ఎస్పీజీఐ ఆసుప్రతి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే చికిత్స పొదుంతూ ప్రకాశ్ మిశ్రా మృతిచెందారు. కొడుకు మరణంతో కుంగిపోయిన ప్రసాద్ మిశ్రా.. ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో సరిపడ బెడ్స్ లేకపోవడమే కొడుకు మరణానికి కారణమని ఆయన ఆరోపించారు. అత్యవసర వైద్యాధికారి సైతం రోగిని కాపాడేందుకు ప్రయత్నించకుండా అలాగే ఉండిపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాసేపటికి తన కుమారుడు మరణించాడని మాజీ ఎంపీ పేర్కొన్నారు. చదవండి: అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం! కొడుకు మృతదేహంతో ఆసుప్రతి ఎమర్జెన్సీవార్డు వెలువల మిశ్రా ఆందోళన చేపట్టారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్ను సస్పెండ్ చేసి తదుపరి విచారణ చేపట్టేవరకు తన నిరసన కొనసాగుతుందని తెలిపారు. ‘నేను నా కుమారుడిని కోల్పోయాను. ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా డ్యూటీ చేయడం లేదని నిరసనకు దిగాను. నేను నిరసన చేస్తున్నప్పుడు.. చాలా మంది వచ్చి, ఆ డాక్టర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలి,’ అని ప్రసాద్ మిశ్రా తెలిపారు. దీనిపై స్పందింంచిన ఆసుపత్రి యాజమాన్యం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప ్రస్తుతం డాక్టర్ను సస్పెండ్ చేశామని ఆసుపత్రి చీఫ్ ఆరేకే ధీమాన్ తెలిపారు. కాగా కాగా మిశ్రా గతంలో బండా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎస్పీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి వైఫల్యం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఫల్యమని మండిపడ్డారు.. ఆసుపత్రులకు బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రసాద్ మౌర్య.. మిశ్రా ఇంటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు.కమిటీ వేసినట్టు, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జంట హత్యల కేసు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1995లో జరిగిన జంట హత్యల కేసుల్లో లోక్సభ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్(70)కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసును గతంలో ఎన్నడూ చూడలేదన్న ధర్మాసనం.. ఈ కేసులో నిందితుడు ప్రభునాథ్ సింగ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేందుకు ప్రభునాథ్ సింగ్ ప్రయత్నాలు చేశాడని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవ్యవస్థ తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయంది. ఇద్దరి హత్యతోపాటు మరో మహిళపై హత్యాయత్నం కేసుల్లో ఆగస్ట్ 18వ తేదీన ప్రభునాథ్ సింగ్ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించింది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ కారులో వచ్చిన సింగ్ ఆరా తీశాడు. వేరే పార్టీకి ఓటేశామంటూ రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ మరికొందరు సమాధానమిచ్చారు. ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న రైఫిల్తో వారిపైకి కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై చప్రా పోలీస్స్టేషన్లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ సొంతింట్లో హత్యకు గురైన కేసులో సింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో ఉన్నాడు. -
కాంగ్రెస్ గూటికి పొంగులేటి.. ప్రకటన అప్పుడే..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ తొలగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన.. తనతో కలిసి వచ్చే ఇతర నాయకులతో కలిసి ఈనెల 12న ఆ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నారు. పొంగులేటి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలిసింది. జనవరి నుంచే జోరుగా చర్చ ఈ ఏడాది జనవరి ఒకటిన బీఆర్ఎస్పై పొంగులేటి ధిక్కారస్వరం వినిపించినప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటానంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తాను ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారని పొంగులేటి చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద ఐదు నెలలుగా పొంగులేటి ప్రజల మధ్యే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆతీ్మయ సమ్మేళనాలతో పాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దృష్టి సారించారు. మేలో రైతు భరోసా ర్యాలీ, పోడు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో పాటు యువత కోసం భారీ స్థాయిలో జాబ్మేళా ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ యత్నాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి పయనించేందుకు పొంగులేటి సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలతోనూ చర్చలు జరిపారు. బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్లో చేరాలా.. ఏ పార్టీలో చేరకుండా సొంత కూటమి ఏర్పాటు చేయాలా? అనే అంశంపై చర్చలు జరిగాయి. అయితే ఖమ్మం జిల్లాలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. పలు దఫాలు పొంగులేటితో చర్చలు జరపగా, మే 4న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్రావు ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిని కలిశారు. అనంతరం హైదరాబాద్లోనూ వీరు సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. కాగా స్థానిక పరిస్థితులు, ఇతర అన్ని అంశాలనూ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుచరుల నిర్ణయం మేరకు.. ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 7.30కి మొదలయ్యే సమావేశానికి పది నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున హాజరు కావాల్సిందిగా ఆయన అనుచరులకు సమాచారం అందింది. ఈ భేటీలో అభిప్రాయాలు సేకరించాక వారి నిర్ణయం మేరకు అడుగులు వేస్తానని పొంగులేటి చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 12న తన చేరిక విషయమై ప్రకటన చేస్తారని, ఈనెల 28 తర్వాత ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో అనుచర గణంతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. -
మాజీ ఎంపీ కణితి విశ్వనాథం కన్నుమూత
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు. వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్మెంట్కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
మాజీ ఎంపీ పొంగులేటికి షాకిచ్చిన కేసీఆర్ సర్కార్..! భద్రత తగ్గింపు
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్ను, ఇంటి ముందు ఉండే గన్మెన్లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్ఎస్పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చదవండి: ఖమ్మం పాలిటిక్స్లో కలకలం -
కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత.. సీఎం సంతాపం
భువనేశ్వర్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యుడు సుభాష్చంద్ర నాయక్(75) తుదిశ్వాస విడిచారు. ఒడిషాలోని భవానీపట్నలో ఉన్న ఆయన నివాసంలో తీవ్ర గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. కాగా, సుభాష్చంద్ర నాయక్.. 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా కలహండి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం సంఘ సేవకునిగా విశేష గుర్తింపు సాధించారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఉద్యోగానికి స్వస్తి పలికి, పాత్రికేయ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. కార్మిక నాయకుడిగా కూడా సుపరిచుతులు. ఇక, కలహండి ప్రాంతంలో దివ్యాంగుల సమస్యలను అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లి, రాజకీయ రంగంలో గుర్తింపు సాధించారు. కాగా, ఆయన అంత్యక్రియలను పూరీ స్వర్గద్వార్లో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సుభాష్చంద్ర నాయక్ మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. ఇది కూడా చదవండి: పదిరోజుల్లో మూడోసారి.. బీజేపీ పదే పదే అవమానిస్తోందా? -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కీలకనేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వార్లు .. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా, అశోక్ తన్వార్ గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా, కీర్తి ఆజాద్.. 1983లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్లో ఆజాద్ ఒక సభ్యుడు. కీర్తి ఆజాద్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కీర్తి ఆజాద్.. అరుణ్జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఆజాద్ బిహార్లోని దర్భంగా నియోజక వర్గం నుంచి మూడుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా.. మాజీ జెడీయూ నేత పవన్ వర్మా.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. -
ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ..
భువనేశ్వర్: ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నబరంగ్ పూర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మజీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు.. ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల కొంత అసహనంతో ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను పార్టీని విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ మజీ.. 2009లో నబరంగ్పూర్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఒడిశా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ మజీ రాజీనామాపై జేపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపాటి మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ప్రదీప్ మజీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయటకు వెళ్లిపోవడం పార్టీకి మంచిదన్నారు. కాగా, లక్ష్మిపూర్ మాజీ ఎమ్మెల్యే కైలాష్ కులేశికా కాంగ్రెస్ పార్టీకి గత బుధవారం రాజీనామా చేసి బీజీడీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుతం .. ప్రదీప్ మజీ కూడా పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్హి కూడా అధికార బీజేడీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’ -
మాజీ ఎంపీ మనవడి హత్య
తిరువొత్తియూరు: నామక్కల్ సమీపంలో డీఎంకే మాజీ ఎంపీ మనవడిని హత్య చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా సేందమంగళం సమీపం బేలకురిచ్చి వాసి జేపీఎస్ సోమసుందరం. డీఎంకేకు చెందిన ఇతను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈయన మనవడు రాజేంద్రన్ (52) రైతు. బేలకురిచ్చిలో నివాసముంటున్నాడు. అతని భార్య సుగుణ (45). ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో ఈ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రాజేంద్రన్ ఇంటికి వచ్చిన నలుగురు దుండగులు తలుపు కొట్టారు. అతను బయటకు రావడంతో కత్తులతో దాడి చేసి పారిపోయారు. రాజేంద్రన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బేలకురిచ్చి ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్, రాసిపురం డీఎస్పీ సెంథిల్ కుమార్, బెలచ్చేరి ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్ట్ తిరువారూరు జిల్లా వలంగై మాన్ సమీపం నల్లూరుకు చెందిన రోజాపతికి కార్తీక్ (31), ప్రశాంత్ (29), వినోద్ (27)అనే కుమారులు ఉన్నారు. వినోద్ ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో కార్తీక్ తనకు ఎందుకు ఇంకా వివాహం చేయలేదని తల్లితో గొడవ పడ్డాడు. కార్తీక్ తీరును ఖండించే క్రమంలో వినోద్ కత్తితో అన్నపై దాడి చేయడంతో అతడు మరణించాడు. వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు. -
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
చూస్తుండగానే కుప్పకూలింది.. పెద్ద గండం తప్పింది
లక్నో: లక్నోలో మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ ఐదంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా క్షణాల్లో కూలిపోయిన ఆ బిల్డింగ్ కింద ఎవరు లేకపోవడంతో పెద్ద గండం తప్పినట్లయింది. లక్నోలోని రెసిడెన్సీ సురక్షిత స్థలానికి అడ్డుగా ఉందంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అభ్యంతరం తెలపడంతో బిల్డింగ్ను కూలగొట్టారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన చాలా భవనాల వారసత్వ సంపదను దెబ్బతీస్తుందని అక్కడి స్థానికలు ఇటీవలే కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టుకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో బిల్డింగ్ను కూల్చివేశారు. కాగా పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చి బిల్డింగ్ను కూల్చే ప్రయత్నం చేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ కూలిపోగా.. మట్టిపెళ్లలు వచ్చి క్రేన్ ఆపరేటర్కు తగిలాయి. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా అక్కడ ఉన్న వాహనాల్లో చాలా వరకు ధ్వంసం అయ్యాయి. ''బిల్డింగ్ కూల్చడం బాగానే ఉంది.. కానీ పెద్ద గండం తప్పింది..'' అని నెటిజన్లు కామెంట్ చేశారు. बी एस पी के पूर्व एम पी दाऊद का लखनऊ में बन रहा मल्टी स्टोरीड रेजिडेंशियल अपार्टमेंट सरकार ने ज़मींदोज़ कर दिया।इसकी लागत 100 करोड़ बताई जा रही है।यह ए एस आई के मोन्यूमेंट रेजीडेंसी के बहुत क़रीब बन रहा था।जिसने इसे गिराने का आदेश दिया था। pic.twitter.com/Uozb1klqW2 — Kamal khan (@kamalkhan_NDTV) July 4, 2021 -
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : హత్య కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా కారణంగా కన్నుమూశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి వర్గాలు, ఢిల్లీలోని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ఈ విషయాన్ని ధృవీకరించారు. షాహాబుద్దీన్కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యం విషమించిన షాహాబుద్దీన్కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 20 న దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బిహార్లోని సివాన్కు చెందిన షాహాబుద్దీన్ మరణంపై ఆర్జేడీనేత తేజశ్వి యాదవ్ సహా, పప్పు యాదవ్ పలువురు ఇతర నాయకులు ట్విటర్లో నివాళులర్పించారు. ఆయన అకాల మరణం బాధాకరమైన వార్త అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా బిహార్ బాహుబలిగా వ్యవహరించే మహ్మద్ షాహాబుద్దీన్పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్కు ముందు భగల్పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకువవచ్చినా బెయిల్ రద్దు కారణంగా తిరిగి జైలుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్లో తండ్రి షేక్ మహ్మద్ హసీబుల్లా మరణించిన సమయంలో షాహాబుద్దీన్ను పెరోల్కు కూడా అనుమతి లభించలేదు. చదవండి : ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం -
కాంగ్రెస్ సీనియర్ నేత, వాజ్పేయి బంధువు కరోనాతో మృతి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె చత్తీస్గఢ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారు. ఆమె మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు కూడా. దీనిపై పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కరుణ శుక్లా లోక్సభకు చత్తీస్గఢ్లోని జంజ్గిర్ నియోజకవర్గంనుంచి 14వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆతరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో పోలీచేసి ఓటమి పాలయ్యారు. కాగా కరోనా సెకండ్వేవ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రోజుకు మూడున్నర లక్షలకుపైగా కేసులు, 2వేలకు పైగా మరణాలతో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం నాటి గణాంకాల ప్రకారం వరుసగా ఆరో రోజుకూడా మూడుల లక్షల మార్క్ను దాటి 3 23,144 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మే 1 వ తేదీనుంచి 18 సంవత్పరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. -
రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్తకు ఈడీ షాక్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, తృణమూల్ కాంగ్రెస్ మాజీనేత, రాజ్యసభ ఎంపీ కేడీ సింగ్ ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కన్వర్ దీప్ సింగ్ను బుధవారం అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.1900 కోట్ల రూపాయల పోంజీ చిట్ ఫండ్ స్కీం స్కాం కేసు దర్యాప్తులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా రియాల్టీ లిమిటెడ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేడీ సింగ్పై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. చిట్ ఫండ్ స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆయన ఇల్లు,ఆఫీసులపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది. 2019 జనవరిలో ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన రూ. 239 కోట్ల ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. చిట్ఫండ్ పేరుతో సుమారు 1916 కోట్ల నిధులను మూడేళ్లలో సేకరించిందనేది ప్రధాన ఆరోపణ. అయితే సుమారు రూ.1077 కోట్లు తిరిగి చెల్లించినట్లు 2015లో సంస్థ సెబీకి తెలిపింది. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరికొంత సమయం కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సెబీ 2016 మార్చిలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. అటు నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో కూడా కేడీ సింగ్ను సీబీఐ ప్రశ్నించింది. -
కరోనా : జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత
జైపూర్: కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ రాజస్థాన్ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒకప్పటి జైపూర్ పాలకుల నివసించిన ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్ డైరెక్టర్గా ఉన్నారు. దివంగత అధికారిక జైపూర్ మహారాజా సవాయి మాన్ సింగ్, మాజీ మహారాణి కిషోర్ కన్వర్ కుమారుడు పృథ్వీరాజ్. 1962లో స్వతంత్ర పార్టీ టిక్కెట్పై దౌసా నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ కుటుంబానికి చెందిన చివరి వారసుడు అయిన పృథ్వీరాజ్ తదనంతర కాలంలో రాంబాగ్ ప్యాలెస్ను లగ్జరీ హోటల్గా మార్చారు. త్రిపుర యువరాణి అతని సవతి తల్లి గాయత్రీ దేవి మేనకోడలు దేవికా దేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమారుడు విజిత్ సింగ్ ఉన్నారు. తన అంకితభావం, దక్షతతో క్లిష్ట వ్యవహారాలను సైతం చక్కబెట్టగల సమర్ధుడిగా పృథ్వీరాజ్ కీర్తి గడించారు -
కట్టుకథలకు కాలం చెల్లింది
మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్ కేసుల వూర్తి వివరాలను వెంటనే అందించాలి, వీటిని రోజువారీ ప్రాతిపదికన విచారించి, రెండు నెలల్లోగానే పరిష్కరించాలని సుప్రీంకోర్టు.. అన్ని రాష్ట్రాల హైకోర్టులను తాజాగా ఆదేశించింది. వీటిపై త్వరగా విచారణ చేయాలని, హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తినీ, ప్రిన్సిపల్ సీబీఐ జడ్జినీ, ప్రిన్సిపల్ ఏసీబీ జడ్జీలనూ నియమించా లని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఎనిమిదేళ్ల క్రితం ఆనాటి సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను 27–10–2020కి అప్డేట్ చేసింది. – (29–10–2020 వార్తలు) నిజానికి, దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ప్రస్తావించి, వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు అందించి, రాష్ట్రాల హైకోర్టులు రెండు నెలల్లోగా వీటిని పరిష్క రించాలన్న ఆదేశం చాలా ఆలస్యంగా వచ్చినా మెచ్చదగింది. అయితే అంతూ పొంతూ లేకుండా ఏళ్లూపూళ్లుగా, దశాబ్దాలుగా ఈ కేసులు నాన్పుడు బేరంగా సాగడానికి గల కారణాలను కూడా పరిశీలించి వెలికి తీయాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించలేకపోవడం విచార కరం. కొద్ది రోజుల క్రితమే జాతీయ స్థాయి ఏటీఆర్ రిపోర్టు దేశ వ్యాప్తంగా 4,400 పైచిలుకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై.. హత్యలు, బెది రింపులు, మానభంగాలు, వేధింపులు వగైరా అనేక నేరాలకు సంబం ధించిన కేసులు పేరుకు పోయి ఉన్నాయని వెల్లడించి దేశప్రజల్ని తెల్లబోయేలా చేసింది. దాదాపు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత మన దేశం ఇంతటి దుర్భర స్థితిలో ఉండటానికి కారణాలేమిటో, కారకు లెవరో నిర్మొహమాటంగా నిగ్గుదేల్చవలసిన ఘడియలివి. నిజానికి 1970ల నాటికే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏఎన్ ఓహ్రా.. నవభారత రాజ్యాంగ స్ఫూర్తిని కుమ్మరి పురుగులా నిలువెల్లా తొలచివేస్తున్న మూర్తిత్రయం ఎవరంటే రాజ కీయనాయకులు.. వారు ఆధారపడిన నేరగాళ్లు, బేర గాళ్లు.. వారికి అండగా నిలిచిన పోలీసు యంత్రాంగం అని ప్రకటించారు. ప్రమోషన్ల కోసం లేదా పదవీ విరమణానంతరం పదవులకోసం ఎగబడే కొందరు మాజీ ప్రధాన న్యాయ మూర్తుల వల్ల కూడా వ్రజాస్వామ్య వ్యవస్థా చట్రానికి తెగులు పట్టి పీడిస్తోంది. ఇందులో దుర్భిణీ వేసి ఏరికోరి వెతికి తీయవలసిన వారి సంఖ్య తక్కువ కాదని ఏటీఆర్ తాజా నివేదిక నిరూపిస్తోంది. ఎందుకంటే మనం కాలక్షేపం చేస్తున్నది పైకి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అయినా, అట్టడుగున పెంచుకున్న పునాది మాత్రం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థది. దాని తాలూకు అవ లక్షణాలను మూలాల దాకా తొలగించుకోనంత కాలం ఆ లక్ష ణాలు వ్యవస్థని వెన్నాడుతూనే ఉంటాయి. వీటి ప్రభావానికి ప్రస్తుత రాజ కీయపక్షాలు, రాజకీయ నాయకులు, పాలకులు, కేంద్ర రాష్ట్రాల శాసనవేదికలు, న్యాయస్థానాలు తరచుగా లోనవుతూనే ఉంటాయి. ఈ పూర్వరంగంలోనే ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్ధాంతరంగా దివంగతులైన తర్వాత రాష్ట్రంలో ఏర్ప డిన రాజకీయ శూన్యతలో ముందుకు దూసుకువచ్చి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానవర్గానికి కంటగింపుగా మారిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు పాదయాత్ర కాస్తా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే కాకుండా, అప్పటికే అడుగూడిపోయిన చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లోకి ఒకవైపున కాంగ్రెస్ కుట్రల మధ్య, కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు మరొకవైపు నుంచి జగన్మోహన్రెడ్డిని అడకత్తెరలో పావు చెక్కను చేసి దెబ్బతీసే ఉద్దేశంతో– జమిలిగా పన్నిన కుట్ర ఫలి తమే ఈ క్షణం దాకా జగన్పై మోపి, ఆయనను నిష్కారణంగా జైలుకు పంపడంలోను సీబీఐ ద్వారా అల్లించిన కేసుల కథాకమా మీషూ! జగన్పై మోపిన 22 కేసుల్లో బలం ఉన్న పక్షంలో, స్పెషల్ కోర్టు విచారణ సందర్భంలోనే జగన్ కంపెనీల్లోకి తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు తర లించాయన్న ఆరోపణ వైఎస్సార్ సజీవుడై ఉన్నప్పుడే దూసుకు రావ లసింది. కానీ వైఎస్సార్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ‘కథ’ అల్లిన వైనం కూడా చిత్రమైన కుట్ర. చనిపోయిన ఆయన ఎలాగూ రాడు, కాబట్టి వైఎస్సార్ కేబినెట్ సమష్టి నిర్ణయాలు ఆధారంగా జగన్ తన ఎదు గుదల కోసం తన కంపెనీల్లోకి ‘గుత్త’గా కొన్ని కంపెనీల నుంచి అప్పనంగా రాబట్టుకున్నాడన్న వాదన బయలుదేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పైగా రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కిరణ్కుమార్రెడ్డి నాయకత్వంలో కొనసాగిన వైఎస్సార్ మంత్రివర్గ సభ్యులు ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానం, చంద్రబాబు ఆరోపణ లను ఖండించారు. వారిలో మంత్రివర్గ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇత్యాది మంత్రులూ ఉన్నారు. ఆమాటకొస్తే– వైఎస్సార్ ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార భాషా సంఘం అధ్యక్షు నిగా నేను 2005 నుంచి 2009 వరకూ సచివాలయంలో పనిచేసిన న్నాళ్లూ– ఏ రోజునా, అందరి ముఖ్యమంత్రుల కొడుకులూ, కూతుళ్లు, అల్లుళ్ల మాదిరిగా జగన్మోహన్రెడ్డి సచివాలయానికి వచ్చినట్లుగానీ, తండ్రిని కలిసివెళ్తున్నట్లుగానీ ఒక్క ఉదాహరణ కూడా లేదు. అనేక మంది మంత్రుల, ముఖ్యమంత్రుల పిల్లలు తరచూ ‘ఆసులో గొట్టాం’లా సచివాలయానికి వస్తూపోతూ ఉండటం ఒక అలవాటుగా మనకు తెలుసు. అదలా ఉంచుదాం. జగన్పై చంద్ర బాబు ముఠా, వాళ్ల ప్రచార బాకాలు చేసిన మరొక విచిత్ర ఆరోపణ– ‘తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల్ని రూ. 35 కోట్ల మేర జగన్ మోసం చేశాడట. ఇలాంటి కట్టుకథల ఆధారంగా ‘ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీబీఐ మోపిన కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంద’ని బీబీసీ తెలుగు ప్రసార వాణి ప్రకటిస్తూ, జగన్పై కేసులు ఏపీలో మోపడం ఎలా ప్రారం భమైందో వివరించింది: ‘తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఎర్రన్నా యుడు, నాటి కాంగ్రెస్ నేత శంకరరావు 2010లో రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. నాడు ఎంపీగా ఉన్న జగన్ ‘క్విడ్ ప్రోకో’ పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ఇతర అవకాశాలు కల్పించి– బదులుగా జగన్ సొంత సంస్థ ‘జగతి’లో పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆరోపణలు నమో దయ్యాయి. ఈ పెట్టుబడుల్ని లంచాలుగా చూపుతూ ఆ డబ్బును హవాలాగా మార్చడంలో జగన్ కీలక పాత్ర పోషించారన్నది అభియోగమని, సీబీఐ విచారణకు పునాది అనీ బీబీసీ చెప్పింది. రుజువులు చూపలేని ఈ కూట రాజ కీయం ఆధారంగానే 2012 మేలో జగన్ను అరెస్టు చేయించి, 16 మాసాలు చంచల్గూడ జైలులో నిర్బంధింపజేయడానికి అటు కాంగ్రెస్, ఇటు చంద్రబాబు పార్టీలు ఎలా కారకులయ్యాయో బీబీసీ నివేదిక చెప్పకనే చెప్పింది. జగన్పై కేసును సీబీఐ విచారణకు హైకోర్టు అప్పగించింది. 2011 ఆగస్టు 10న కేసు నమోదైంది. 2004–2009 మధ్య కాలంలో ‘నేరం జరిగిందన్న’ అనుమానంతో ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా వైఎస్ జగన్, విజయ సాయిరెడ్డిని ఇరికించగా, కేసులో మొత్తం నిందితులుగా పేర్కొన్న వారు 72 మంది. జగన్పై మోపిన కేసులకు ‘నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, లెక్కలు తారమారు చేయడం’ లాంటి పేర్లు తగిలించింది సీబీఐ. ఇలా అల్లిన డజను అభియోగాల ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు అభియోగపత్రాలు తయారీ చేసింది. అయితే 31.3.2012తో ప్రారంభించిన సీబీఐ మొదటి చార్జిషీట్ లగాయతు గత ఎనిమిదేళ్లుగానూ జగన్వల్ల ‘క్విడ్ప్రోకో’ మంత్రం వల్ల లాభించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్క కంపెనీగానీ లేదా సంస్థగానీ సీబీఐ ప్రత్యేక కోర్టు చర్యకు గురికాలేదు, అరెస్టయిన సంస్థలు, వ్యక్తులు, ప్రతినిధులుగానీ విడుదల అయ్యారేగానీ కోర్టు చర్యకు గురికాలేదు. కాగా, ఈ మధ్య కాలంలో సీబీఐ జగన్పై కేసుల నిరూపణలో సాక్ష్యాలు చూపడంలో తరచుగా విఫలమవుతూ నోరెళ్లబె డుతూ ఉండటం గమనించిన ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు ఎప్పుడు మీ సాక్ష్యాలు, ఎక్కడ మీ సాక్ష్యాలు, ఇంకెన్నాళ్లు తీసుకుం టారు సాక్ష్యాలు చూపడానికి అంటూ పదేపదే ప్రశ్నించవలసి రావడం– సీబీఐ కేసు కాంగ్రెస్, టీడీపీల ప్రత్యక్ష ప్రేరేపిత చర్య అని చెప్పక చెబుతోంది. ఇటువంటి కుట్రలు మరెంత కాలమో సాగవు. చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవస్థల్ని, వాటిలోని ప్రధాన అధికారులను, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, కొందరు సీబీఐ స్థానిక అధికారుల్ని సాకడం ద్వారా పలు కేసులనుంచి, బడా కంపె నీలకు వందల ఎకరాల భూమిని దోచిపెట్టిన కేసుల నుంచీ ఈరోజుకీ తప్పించుకు తిరుగుతున్నవాడే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ వాదులుగా, జడ్జీలుగా ప్రమోట్ చేయించి, సుప్రీంకోర్టు దాకా పంపించి, సుప్రీంకోర్టులోనూ, రాష్ట్ర హైకోర్టులోనూ తనకు అనుకూల తీర్పులు పొందడానికి పదవిలో ఉండగానో, పదవి ఊడిన తర్వాత ప్రతిపక్ష నాయక స్థానంనుంచీ చంద్రబాబు ఎటువంటి దుష్టపాత్ర వహిస్తున్నదీ నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇందుకు మహాభారత దుష్ట పాత్రలో దుర్యోధనుడి మాటలే సాక్ష్యం– ‘నిజమేదో నాకు తెలుసు, కానీ దానివైపు నా మనస్సు మళ్లదు, అబద్ధమేదో కూడా నాకు తెలుసు, కానీ దాని నుంచీ నా మనస్సు మళ్లదు’ అన్నాడు. బాబు మనస్సూ అంతే సుమా. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ
అంతేలే పేదల బతుకులు..అశ్రువులే నిండిన కుండలు.. కూలాడితే గాని కుండాడని జీవితాలు.. పిల్లల్ని చదివించాలంటే అప్పులు చేయాలి.. అప్పులు తీరాలంటే అవకాశాలు వెతుక్కోవాలి. ఉన్న ఊరిలో పరిస్థితులు వెక్కిరిస్తే పొరుగూరికి వలస పోవాలి. అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కష్టించి పని చేయాలి. ఆ క్రమంలో అనారోగ్యం బారిన పడితే ఇక అంతే సంగతులు. చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సంకట స్థితినే నవరంగపూర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు చవిచూశారు. ఒడిశా: గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు కుమార్తెతో కలిసి కూలి పనుల కోసం హైదరాబాద్ వలస వెళ్లిన తల్లి అక్కడ జబ్బు పడింది. హాస్పిటల్ ఖర్చుల కోసం, మందులకు తాము పనిచేసే యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇంటికి వెళ్లి వచ్చి అప్పు తీరుస్తానని చెప్పి కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వచ్చింది. జబ్బు విషమించడంతో దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఈ విషయం తెలిసినప్పటికీ కన్నతల్లిని కడసారి చూసేందుకు ఆ బాలిక ఇంటికి రాలేకపోయింది. చివరికి విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించి తన మనిషిని హైదరాబాద్ పంపి ఆ బాలికను విడిపించి తీసుకువచ్చిన సంఘటన జిల్లా ప్రజల హృదయాలను కదిలించింది. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితికి చెందిన అనాది పాణిగ్రహి భర్త మూడేళ్ల కిందట మరణించాడు. ఆమె తన ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాలన్న ఆశతో మైక్రోఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.30 వేలు రుణం తీసుకుంది. ఇద్దరినీ కళాశాలలో చేర్చింది. అయితే తీసుకున్న అప్పు తీరే మార్గం కానరాక పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి తనతో పాటు చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని 5 నెలల కిందట ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. అక్కడ తల్లీకూతుళ్లు ఒక ఇటుకల కంపెనీలో పనికి కుదిరారు. అయితే హైదరాబాద్లో తల్లి అనాది ఆరోగ్యం క్షీణించింది. మందుల కోసం కంపెనీ యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని కుమార్తె సాగరికను ఇటుకల కంపెనీ యజమాని వద్ద తాకట్టు పెట్టి చందాహండి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన కొంత కాలానికే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మరణించింది. అయితే అప్పటికే లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల కుమార్తె సాగరిక తల్లిని చూసేందుకు కూడా ఇంటికి రాలేకపోయింది. గ్రామంలో ఉన్న సాగరిక అక్క ప్రియాంక చెల్లెలి రాక కోసం ఎదురు చూస్తూ విలపిస్తోంది. చదవండి: ప్రియుడు మోసం చేశాడని టీవీ నటి ఆత్మహత్య స్పందించని ప్రభుత్వం హైదరాబాద్లో తాకట్టులో ఉన్న సాగరిక తన గోడును ఒడిశా ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయితే ఎవరూ స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి స్పందించి వెంటనే తన కారులో చందాహండి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చందాహండి సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర హింసను వెంటనే హైదరాబాద్ పంపారు. ఆయన ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల అధికారులతో పాటు ఇటుకల కంపెనీ యజమానితో మాట్లాడి సాగరికను వెంటనే విడిచి పెట్టాలనికోరారు. ఎట్టకేలకు సాగరిక విముక్తి పొంది శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం నవరంగపూర్ చేరుకుంది. లాక్డౌన్ వల్ల పంపలేక పోయాం కాంగ్రెస్ నేతలు ఆమెను ఓదార్చి ఈ విషయం విలేకరులకు తెలియ జేశారు. సాగరిక తన బాధల గాథలను చెబుతూ విలపించింది. అక్కను కలిసి భోరున ఏడ్చింది. హైదరాబాద్లో ఇటుకల బట్టీ యజమాని కె.సుబ్బారావు ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ సాగరిక తల్లి అనారోగ్యం వల్ల ఇంటికి వెళ్లిందని, ఆమె మరణించిన విషయం తెలిసి సాగరికను పంపించాలని భావించామని లాక్డౌన్ కారణంగా పంపించలేక పోయానని చెప్పారు. తల్లిని కోల్పోయి అనాథల్లా మిగిలిన అక్కాచెలెళ్లు ప్రియాంక, సాగరికలను ప్రభుత్వం ఆదుకుని వారిని చదివించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నవరంగపూర్ చేరుకుని భోరున విలపిస్తున్న సాగరిక -
అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్పూర్లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్పూర్లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్ఛైర్కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్కి ఎంపికయ్యారు. కలెక్టర్గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. -
అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు
సాక్షి, డిచ్పల్లి: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ ఎం నారాయణరెడ్డి పారి్థవ దేహానికి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులోని కృషి దర్శన్ కేంద్రంలో (నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రం)అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని కృషి దర్శన్ కేంద్ర వరకు ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, జీవన్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్త, నగర మేయర్ నీతూకిరణ్, మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులరి్పంచారు. నారాయణరెడ్డి కుమారుడు అరుణ్రెడ్డి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరెడ్డి కుమార్తెలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, మేయర్ ఉద్యమకారుడు.. అభ్యుదయవాది అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, అభ్యుదయ వాది, మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై ఆనాడే పార్లమెంట్లో గళం విప్పి 45 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన నాయకుడని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని విషయాలు తెలుసుకుని సభలలో సుదీర్ఘంగా తెలంగాణ వాణి విని్పంచే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు నారాయణరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, నాయకులు తాహెర్బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలను వారంలోగా ఖాళీ చేయాల్సిందిగా లోక్సభ హౌసింగ్ కమిటీ ఆదేశించింది. ఈ కమిటీకి సీఆర్ పాటిల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీలు తమకు కేటాయించిన బంగ్లాలు ఖాళీ చేయని పక్షంలో.. మూడు రోజుల్లో విద్యుత్తు, నీళ్లు, గ్యాస్ కనెక్షన్లు తొలగిస్తామని తెలిపింది. 2014లో ఎన్నికయిన పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వం ఢిల్లీలోని లూటీన్స్ బంగ్లాలను కేటాయించింది అధికార వర్గాల సమాచారం ప్రకారం 16వ లోక్సభ రద్దయినప్పటికీ దాదాపు 200మంది మాజీ ఎంపీలు ఇంకా వారికి కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయలేదు. అయితే, మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయకపోవడం వల్ల కొత్తగా ఎన్నికయిన పార్లమెంట్ సభ్యులు తాత్కాలిక భవనాలలో ఉండాల్సి వస్తుంది. కాగా, మాజీ ఎంపీలు రాష్ట్ర అతిథి గృహాలలో నివసించాలని హౌసింగ్ కమిటీ సూచించింది. -
మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు
చెన్నై: మాజీ ఎంపీ కుళందైవేలు భార్య హత్య కేసులో ఢిల్లీలో దాగి ఉన్న కుమారుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తిరుచెంగోడు నియోజకవర్గం అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇతని భార్య రత్నం (63) చెన్నై శాస్త్రీనగర్ ఆరో అవెన్యూలో నివసిస్తున్నారు. వీరికి సుధా అనే కుమార్తె, ప్రవీణ్ (35) అనే కుమారుడు ఉన్నారు. సుధాకు వివాహమై తిరుపూర్లో ఉంటోంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవీణ్ మార్చి నెలలో స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో అతను విదేశంలో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహ విషయం, ఆస్తికి సంబంధించి తల్లికి, కుమారుడికి మధ్య తగాదా ఉంటూ వచ్చింది. దీంతో ఏప్రిల్ 14న రాత్రి ప్రవీణ్ తల్లి అని కూడా చూడకుండా రత్నం చేతులు, కాళ్లు కట్టివేసి గొంతు కోసి, గుండెలపై కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత ఇంటిలో మృతదేహాన్ని ఉంచి బయట గడియవేసి తప్పించుకున్నాడు. దీని గురించి శాస్త్రినగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్ కోసం గాలిస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సోమవారం అరెస్టు చేశారు. -
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీకి గుజరాత్లో భారీ షాక్ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ శనివారం ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు. పులుల సంరక్షణా కేంద్రం గిర్ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్ చేసిన సీబీఐ అమిత్ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్షీటు దాఖలు చేసింది. కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్ ఎల్ పటేను మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. -
మాజీ ఎంపీ, జర్నలిస్టు రాజ్నాథ్సింగ్ మృతి
లక్నో : బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ రాజ్నాథ్సింగ్ ‘సూర్య’గురువారం ఉదయం మరణించారు. వయో సంబంధిత సమస్యలతో 82 ఏళ్ల సింగ్ గోమతీనగర్లోని ఆయన నివాసంలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో 1937 మే 8న ఆయన జన్మించారు. సింగ్ మృతికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి జర్నలిజానికి తీరనిలోటని అన్నారు. 1960లో గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసిన ఆయన 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. బాల్యంలో ఆరెస్సెస్లో చేరిన ఆయన అనంతరం ప్రాంతీ య ప్రచారక్ స్థాయికి ఎదిగారు. అనంతరం ప్రచారక్ అయ్యారు. హిందుస్థాన్ సమాచార్లో ఆయన జర్నలిజం కెరీర్ ప్రారంభమైంది. ఆజ్ వార్త పత్రికలో బ్యూరో చీఫ్గా పనిచేశారు. 1988లో దైనిక్జాగరణ్లో అసిస్టెంట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించిన సింగ్, అనంత రం స్వతంత్రభారత్కు ఎడిటర్గానూ పనిచేశారు. ఆయన మృతదేహాన్ని లక్నోలోని కింగ్జార్జ్ మెడికల్ వర్సిటీకి అప్పగించారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ్నారాయణ్ దీక్షిత్, యూపీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే, బీజేపీ యూపీ ప్రధాన కార్యదర్శి సునీల్బన్సల్కూడా రాజ్నాథ్సింగ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
ఆటగదరా శివ!
హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం ‘జన’దిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి! ప్రతి వాహనమూ పరామర్శకు బయల్దేరినట్లే కదల్లేక కదిలింది. హరికృష్ణ ఆకస్మిక శివైక్యం.. ‘ఆటగదరా శివ’ అనే వైరాగ్య భావనలోకి ఆయన అభిమానుల్ని నెట్టివేసింది! ‘‘ఈ ఏడాది నా జన్మదిన వేడుకలు వద్దు. కేరళలో వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు నిరాశ్రయులయ్యారు. ఇది మనందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. ఫ్లెక్సీలు, పుష్ప గుచ్ఛాలకు అయ్యే ఖర్చును బాధితులకు అందజేయాలని కోరుకుంటున్నా ’’... అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇది. ఆయన వేడుకలు వద్దనుకున్నారు. అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయం అభిమానులను నిరుత్సాహపరిచినా మంచి కార్యక్రమం కోసమే కదా అనుకున్నారు. అయితే ఇలా హఠాన్మరణం పొంది, విషాదంలో ముంచెత్తుతారని ఊహించలేదు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం. బుధవారం (ఆగస్ట్ 29) రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు, బసవతారకంల పదకొండు మంది సంతానంలో హరికృష్ణ నాలుగో కుమారుడు. 1956లో నిమ్మకూరులో జన్మించిన హరికృష్ణ అక్కడే తాతయ్య లక్ష్మయ్య చౌదరి దగ్గర పెరిగారు. మనవడ్ని నటుడిగా చూడాలనే కోరిక తాతయ్యకు ఉండేది. కొడుకు దగ్గర ఆ విషయం చెప్పగా చెప్పగా చివరికి ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణావతారం’లో చిన్ని కృష్ణుడి పాత్రను హరికృష్ణతో చేయించారు. తండ్రి ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపిస్తే హరికృష్ణ చిన్ని కృష్ణుడిగా కనిపించారు. ఆ సినిమాలో నటించినప్పుడు హరికృష్ణ వయసు దాదాపు పదేళ్లు. రక్తంలోనే నటన ఉంది కాబట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ సినిమా తర్వాత బాల నటుడిగా ‘తల్లా? పెళ్లామా? చిత్రం చేశారు. ‘తాతమ్మ కల’ (1974) చిత్రంతో హరికృష్ణ పూర్తి స్థాయి నటుడిగా మారారు. ఇందులో తమ్ముడు బాలకృష్ణతో కలసి నటించిన హరికృష్ణ ఆ తర్వాత వెంటనే ‘రామ్ రహీమ్’లోనూ సోదరుడితో కలసి నటించారు. అనంతరం స్వీయదర్శకత్వంలో తండ్రి నటించి, తెరకెక్కించిన భారీ చిత్రం ‘దాన వీర శూరకర్ణ’ (1977) సినిమాలో అర్జునుడి పాత్ర పోషించారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరికృష్ణ స్క్రీన్పై కనిపించడానికి 20 ఏళ్లు పట్టింది. హరికృష్ణ తన రాజకీయ వారసుడని, బాలకృష్ణ తన సినీ వారసుడని అప్పట్లో ఎన్టీఆర్ సన్నిహితులతో అనేవారట. హరికృష్ణకు కూడా సినిమాలకన్నా రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో 1977 తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. ‘శ్రీరాములయ్య’తో సెకండ్ ఇన్నింగ్స్ 1998లో మోహన్బాబు టైటిల్ రోల్లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ‘శ్రీరాములయ్య’లో చేసిన కీలక పాత్ర ద్వారా నటుడిగా హరికృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ వెంటనే ‘సీతారామరాజు’ చిత్రంలో నటించారు. హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ సమయంలో వైవీయస్కి, హరికృష్ణకీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఒక వ్యక్తిని నమ్మితే హరికృష్ణ ఎంతదాకా అయినా వెళతారని ఆయన సన్నిహితులు అంటుంటారు. అందుకే చౌదరితో వరుసగా మరో రెండు సినిమాలు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ చేశారు. నిజానికి హరికృష్ణ మాస్ ఆర్టిస్ట్. పవర్ఫుల్ ఫైట్స్ చేసినా, పంచ్ డైలాగ్స్ చెప్పినా ఆయన ఆహార్యానికి తగ్గట్టుగా ఉండేవి. అయినప్పటికీ ‘సీతారామరాజు’లో ‘చాంగురే.. చాంగురే..’లో వేసిన చిన్న స్టెప్స్, ‘సీతయ్య’లో ‘బస్సెక్కి వస్తావో..’, ‘సిగ్గేస్తోంది...’ పాటలకు వేసిన మాస్, క్లాస్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ‘సీతయ్య’లో గర్భవతిగా ఉన్న భార్య సౌందర్యకు శీమంతం చేస్తూ, ‘సమయానికి తగు సేవలు సేయనీ’ పాటలో హరికృష్ణ నటన ఎమోషనల్గా ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘శివరామరాజు’లో కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’లో టైటిల్ రోల్ చేశారు. 2004లో ‘స్వామి’, 2005లో ‘శ్రావణ మాసం’ తర్వాత హరికృష్ణ సినిమాలు చేయలేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లాహిరి లాహిరి..లో’ చిత్రానికి నంది అవార్డు, ‘శ్రీరాములయ్య’కు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. 22 ఫిబ్రవరి 1973లో లక్ష్మీకుమారిని పెళ్లాడారు హరికృష్ణ. వీరికి ఇద్దరు కుమారులు జానకి రామ్, కల్యాణ్ రామ్, కుమార్తె సుహాసిని. జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరో భార్య శాలిని. ఈ దంపతుల తనయుడు ఎన్టీఆర్. తనయులకు ఓ మంచి గైడ్లా మాత్రమే వ్యవహరించారు హరికృష్ణ. సినిమాలు ఎంచుకునే చాయిస్ వాళ్లకే వదిలేశారు. వారి ఆడియో వేడుకల్లో పాల్గొంటుంటారు. ఆ మధ్య కల్యాణ్ రామ్ నటించిన ‘ఇజం’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న హరికృష్ణ.. ‘ఒక కుమారుడు ‘టెంపర్’తో మంచి హిట్, ఇంకో కుమారుడు ‘పటాస్’తో మంచి హిట్ ఇచ్చారు. ఒక తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు. కుమారులు సాధించే మరెన్నో మైల్స్టోన్స్ని ఆస్వాదించాల్సిన తరుణంలో హరికృష్ణ దూరం కావడం ఆ కుటుంబానికి తీరని శోకం. ఆరేళ్లకే జనంలోకి... ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథ్యం.. జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నేషనల్ డిఫెన్స్ ఫండ్స్లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ’’ అంటూ ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను దర్శకుడు క్రిష్ ట్వీటర్లో షేర్ చేశారు. 1962లో దేశ రక్షణ విరాళం కోసం ఎన్టీఆర్ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారనడానికి ఇదో ఉదాహరణ. ‘ఎన్టీఆర్’ బయోపిక్ రీసెర్చ్లో భాగంగా క్రిష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ బయోపిక్లో హరికృష్ణ పాత్రలో కల్యాణ్రామ్ కనిపించనున్నారని సమాచారం. తండ్రి ముందే తనయుడు హరికృష్ణ కోసం కథ రాయించిన తాత లక్ష్మయ్య నిమ్మకూరులో తన దగ్గర పెరుగుతున్న మనవడు హరికృష్ణను తీసుకుని తాత లక్ష్మయ్య మద్రాసు వెళ్లారు. అప్పటికే హీరోగా దూసుకెళుతోన్న ఎన్టీఆర్ మద్రాసులో ఉండేవారు. మనవడ్ని పెట్టి సినిమా తీయమని కొడుక్కి చెప్పారు. అయితే ఆ తర్వాత రెండు రోజులు ఎన్టీఆర్ ఏమీ మాట్లాడకపోవడంతో మళ్లీ అడిగారాయన. చిరునవ్వే సమాధానం అయింది. దాంతో ప్రముఖ రచయిత డీవీ నరసరాజుని పిలిపించి, ‘నా మనవడ్ని హీరోగా పెట్టి సినిమా తీయమంటే నా కొడుకు వినడంలేదు. వీడు హీరో అయితే తన మార్కెట్ పోతుందనే భయం వాడికి ఉన్నట్లుంది. నా మనవడు హీరోగా నిలబడాలి. లక్ష్మయ్య మంచి కథ రాసుకు రండి’ అని హరికృష్ణ చేతుల మీదగానే కొంత మొత్తం ఇచ్చారు. ఎన్టీఆర్కు హరికృష్ణను తమ్ముడిగా పెట్టి ‘తమ్ముడి పెళ్లి మామ భరతం’ అనే కథను రాసుకొచ్చారు నరసరాజు. కథ చెప్పడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నారట. దాంతో అసలు విషయం చెప్పక నరసరాజుకి తప్పలేదు. ‘వాడు హీరో అయితే నా మార్కెట్ పోతుందని భయపడుతున్నానా’ అని పెద్దగా నవ్వారట ఎన్టీఆర్. ఆ స్క్రిప్ట్ తీసుకుని టేబుల్ సొరుగులో పెట్టారట. ఈ విషయాన్ని డీవీ నరసరాజు తన ఆత్మకథలో రాశారు. ఎన్టీఆర్ చనిపోయాక టేబుల్ సొరుగులో ఉన్న ఆ కథను చూసి, నరసరాజుకి బాలకృష్ణ తిరిగి ఇస్తే, ‘‘ఆ కథకు తగిన పారితోషికం నాకు అందింది. ఆ కథ మీదే’’ అని నరసరాజు చెప్పారట. ‘ఇజం’ ఆడియో వేడుకలో తనయులు ఎన్టీఆర్, కల్యాణ్రామ్ సక్సెస్ గురించి ఉద్వేగంగా ప్రసంగించారు హరికృష్ణ. ఆ వేడుకలో హరికృష్ణ మాటల సారాంశం ఇది. ‘‘కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాలి. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. ఈ 60 ఏళ్లలో హరికృష్ణ ఏం చేశాడు? ఏం అనుభూతులు పొందాడు? ఎవరూ అనుభవించలేనివి ఏం పొందాడు అంటే.. ఆనంద సమయాలు.. ఒక మహానుభావుని.. నందమూరి అంటేనే రామారావుగారు. ఆయన దగ్గర నేను 30ఏళ్లు పనిచేశాను. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. హిమాలయ శిఖరాన్ని మరచిపోయేంత గొప్ప అనుభూతి పొందినవాడిని. ఆయనతో ఎన్నో విజయాలు, ఎన్నో పోరాటాలు చూశాం. సినిమా రంగంలో విజయం చూశాం. పార్టీ పెట్టి అందులోనూ విజయం చూశాం. సరే.. ఆయన దగ్గర్నుంచి పొందింది ఏంటీ? అంటే ఎనలేని నందమూరి వీరాభిమానులను. 59 నుంచి 60కి వచ్చే టైమ్లో వీరిద్దరి (కల్యాణ్రామ్, ఎన్టీఆర్) హిట్ సినిమాలు చూశాను. ఒకటి ‘టెంపర్’, రెండు ‘పటాస్’. ఓకే అది 59. 60కి వచ్చే సరికి ‘జనతా గ్యారేజ్’. నా బిడ్డ జూనియర్ ‘మీకు 60ఏళ్లు వస్తున్నాయ్ కాబట్టి ఇది నా తరఫున గిఫ్ట్’ అన్నాడు. అది ఒక ఆనందం. 60 వచ్చిన తర్వాత మరో బిడ్డ ‘ఇజం’ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. ఇట్లు... మీ నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ 2న తన 62వ పుట్టినరోజు వేడుకలు జరపవద్దని హరికృష్ణ తన అభిమానులకు ఓ ఉత్తరం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికొచ్చింది. ఆ లేఖ యధాతథంగా... ‘‘సెప్టెంబర్ 2న నా అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందుచేత నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతే కాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను. ఇట్లు మీ నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతి నందమూరి హరికృష్ణ ఇక లేడు అంటే నమ్మలేకపోతున్నాను. నేను తీసిన ‘డ్రైవర్ రాముడు’కు నిర్మాతగా వ్యవహరించారు. మా ఇద్దరికీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నో వేల కిలో మీటర్లు డ్రైవ్ చేసిన ఆయన ఇలా మరణించడం చాలా విచారకరం. – దర్శకుడు కె. రాఘవేంద్రరావు నందమూరి హరికృష్ణగారు మనతో లేరన్న విషయం షాకింగ్గా ఉంది. అకస్మాత్తుగా మా కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం అనిపిస్తోంది. నా తమ్ముడ్ని నేను మిస్ అయ్యాను. – నిర్మాత అశ్వనీదత్ నా బ్రదర్ నందమూరి హరికృష్ణగారిని నేను కోల్పోయాను. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. మాటలు రావడం లేదు. అంత బాధగా ఉంది. గ్రేట్ లాస్. – నటుడు మోహన్బాబు ఇది చాలా దుర్దినం. మిత్రుడు, ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే నా సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చెందటం బాధగా ఉంది. ఇలా మనందరినీ శోకంలో ముంచి వెళతారని ఊహించలేదు. – నటుడు చిరంజీవి హరికృష్ణగారు మరణించడం చాలా బాధగా ఉంది. దురదృష్టకరం. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. – నటుడు వెంకటేశ్ ‘చాలా రోజులైంది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు...’ అని కొన్ని వారాల క్రితమే హరికృష్ణగారు అన్నారు. కానీ ఇప్పుడు లేరు. మా అన్నయ్య (హరికృష్ణ)ను మిస్ అవుతున్నాను – నటుడు నాగార్జున హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. ఆయన లేరంటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. – నటుడు రాజశేఖర్ హరికృష్ణగారి మరణం నన్ను బాధించింది. నా తమ్ముడు తారక్తో పాటు ఆ ఫ్యామిలీలోని అందరికీ ఈ శోక సమయంలో ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. – నటుడు మహేశ్బాబు హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని బాధపడ్డాను. తారక్, కల్యాణ్రామ్లతోపాటు ఆ ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు ప్రభాస్ ఒక విషాదకరమైన ప్రమాదంలో హరికృష్ణ గారు అకస్మాత్తుగా మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ శోకసమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. – నటుడు రామ్చరణ్ హరికృష్ణగారి మరణవార్త వెరీ వెరీ షాకింగ్లా ఉంది. నా బ్రదర్స్ తారక్, కల్యాణ్రామ్లతో పాటుగా నందమూరి ఫ్యామిలీ అందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – నటుడు అల్లు అర్జున్ నా బ్రదర్స్ తారక్, కల్యాణ్రామ్లు స్ట్రాంగ్గా ఉండాల్సిన సమయం ఇది. ఈ భయంకరమైన సమయంలో వారి కుటుంబంలోని వారందరూ ధైర్యంగా ఉండాలి. – నటుడు రానా తారక్, కల్యాణ్రామ్లతో పాటు, నందమూరి ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – దర్శకుడు వీవీ వినాయక్ హరికృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం నేను షూటింగ్ నిమిత్తం వేరే దేశంలో ఉన్నాను. ఆయన హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి హరికృష్ణగారితో నాకు కొన్ని జ్ఞాప కాలు ఉన్నాయి. ఆయన హఠాన్మరణం షాకింగ్ గా ఉంది. ఈ శోక సమయంలో నా బ్రదర్స్ తారక్, కల్యాణ్రామ్లు ధైర్యంగా ఉండాలి. – దర్శకుడు కొరటాల శివ హరికృష్ణ శివ భక్తుడు. ఇక్కడ ఫొటోలో త్రిశూలం కనిపిస్తోంది కదా. రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ వాహనంలోంచి పడిన త్రిశూలం ఇది. జయశంకర్కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, సాయికృష్ణ, ఎన్.టి.రామారావు, జయకృష్ణ, మోహన్కృష్ణ, బాలకృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లతో హరికృష్ణ బాలకృష్ణుడిగా హరికృష్ణ -
మాజీ ఎంపీ మాణిక్రెడ్డి కన్నుమూత
జోగిపేట (అందోల్): మెదక్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పి.మాణిక్రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూరుకు చెందిన ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1984లో మెదక్ ఎంపీగా అప్పటి కేంద్రమంత్రి శివశంకర్పై గెలుపొందారు. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అం త్యక్రియలు ఆదివారం డాకూరులో నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మాణిక్రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మంత్రి హరీశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు నివాళులర్పించారు. -
ఆ సెల్ఫోన్లోనే సగం సాక్ష్యాలు?
మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ పద్మలత హత్య ఎలా జరిగింది? ఈ హత్య కోసం రౌడీషీటర్ గేదెల రాజుతో ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారు? హత్య చేయడానికి డీల్ ఎంతకు కుదిరింది? గేదెల రాజు హత్యకు గురికాక ముందు అతడితో ఎవరెవరు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పద్మలత హత్య అనంతరం గేదల రాజుకు ఎవరు ఎంత నగదు అందజేశారు. ఆ తరువాత అతడిని వదిలించుకోవడానికి వేసిన పథకంలో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలకు రౌడీషీటర్ గేదెలరాజు మొబైల్ ఫోన్ కీలకమైంది. అతడి సెల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఆ ఫోన్ ఎవరివద్ద ఉందన్నæ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. గాజువాక: గాజువాకలోని క్షత్రియభేరి పత్రికా కార్యాలయానికి రావాల్సిం దిగా పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజు ఫోన్ చేసి గేదెల రాజును పిలిచి నట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన విషయం తెలిసిందే. అప్పటికే అక్కడ మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న కిల్లర్లు గేదెల రాజు వెళ్లిన వెంటనే దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత గేదెలరాజు సెల్ఫోన్ ఏమైందన్న విషయంపై పోలీసులు తాజాగా దృష్టి సారించినట్టు బోగట్టా. సెటిల్మెంట్లు, దందాల సందర్భంగా జరిగే ఫోన్ సంభాషణలను రికార్డు చేసుకొనే అలవాటు గేదెల రాజుకు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రికార్డు చేసిన వాయిస్లను తనకు అనుకూలంగా మార్చుకొని తన పనిని పూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడని పేర్కొంటున్నారు. పద్మలత హత్య కేసులో రవిబాబు నుంచి తనకు రావాల్సిన డీల్ బకాయిని వసూలు చేసుకోవడానికి గేదెల రాజు ఉపయోగించిన ఫోన్ సంభాషణ రికార్డింగే అతడిని హత్య చేయడానికి కారణమైందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులోనే ఒక నిర్ణయానికొచ్చారు. ఈ హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న రవి బా బును, భూపతిరాజు శ్రీని వాసరాజును ఎదురెదురుగా కూ ర్చోబెట్టి విచారించాలని పోలీ సులు నిర్ణయించినట్టు తెలిసింది. పద్మలత హత్య నుంచి గేదెలరాజు హత్య వరకు చోటు చేసుకున్న వివిధ పరిణామాలు, హత్యకు వేసిన పథకాలు, సహకరించిన వ్యక్తులు, హత్యలకు నిధులు సమకూర్చినవారి వివరాలపై నిందితులిద్దరి నుంచీ ఏక కాలంలో వివరాలను రాబట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయిం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిబట్టు భూపతి రాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2వ తేదీవరకు రవిబాబును విచా రించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులపాటు అతడిని విచారించనున్నారు. ఆఖరి రెండు రోజుల్లోను ఇద్దరు నిందితులను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించిన అనంతరం భూపతిరాజు ను కోర్టులో హాజ రుపరిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
‘రాయ’వరం తరహాలో ‘నామా’ పరం!
♦ పోలవరం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లలోనూ చక్రం తిప్పిన ప్రభుత్వ ముఖ్య నేత ♦ మాజీ ఎంపీ నామాను అడ్డుపెట్టుకుని భారీగా కమీషన్లు కాజేసే ఎత్తుగడ ♦ రెండు బహుళ జాతి కాంట్రాక్టు సంస్థలతో కలసి దండుకునేందుకు వ్యూహం సాక్షి, అమరావతి: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టును తన అక్రమార్జనకు అక్షయపాత్రగా మార్చుకున్న ప్రభుత్వ ముఖ్య నేత.. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంస్థకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులోనూ వందల కోట్లను కొట్టేసేందుకు తాజాగా వ్యూహం పన్నారు. ఇందు కోసం టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని పోలవరం హెడ్వర్క్స్ (ప్రధాన పనులు)ను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు కొట్టేస్తోన్న తరహా వ్యూహాన్నే ఎంచుకున్నారు. టెండర్ల గడువును నాలుగు సార్లు పొడిగించారు. తాజాగా షెడ్యూళ్లు దాఖలు చేసే గడువును జూన్ 13గా ఖరారు చేశారు. జూన్ 14న టెక్నికల్ బిడ్.. జూన్ 29న ప్రైస్ బిడ్ ఖరారు చేసి అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు. పోలవరం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే ఉమ్మడి రాష్ట్రంలో తను పెంచి పోషిం చిన రెండు బహుళ జాతి కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వ ముఖ్య నేత మళ్లీ చేరదీశారు. ఆ సంస్థలతో కలసి టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంస్థ మధుకాన్ కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. వర్టికల్ హారిజాంటల్ ఫుల్ కప్లాన్ టర్బైన్లు ఉత్పత్తి చేసి బిగించడం, హైడ్రాలిక్ హోస్ట్ను ఉత్పత్తి చేసి అమర్చిన అనుభవం, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తే తాను ఎంపిక చేసిన సంస్థకే పనులు దక్కుతాయని ముఖ్య నేత భావించారు. ఆ మేరకు జెన్కో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ సంస్థకు అనుకూలంగా టెండర్ల నిబంధనలు రూపొం దించారు. 58 నెలల్లోగా పూర్తి చేయాలనే షరతు విధించి జనవరి 25న టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. అంతకు ముందే పనుల అంచనా వ్యయాన్ని రూ.3,013.68 కోట్ల నుంచి రూ.4,956.39 కోట్లకు పెంచేశారు. 2010 – 11 ధరలతో పోల్చితే ప్రస్తుతం స్టీలు, సిమెంట్, డీజిల్, పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా అంచనా వ్యయం 64.46 శాతం (రూ.1,942.81 కోట్లు) పెంచడంపై నీటి రంగం నిపుణులు విస్తుపోతున్నారు. ప్రాజెక్టు పనులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందనే సంకేతాలను తస్మదీయ కాంట్రాక్టర్లకు పంపినట్లయింది. దాంతో తాను ఎంపిక చేసిన సంస్థ మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నది ముఖ్య నేత ఎత్తుగడగా జెన్కో అధికారులు చెబుతున్నారు. సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్ల దందా పోలవరం హెడ్ వర్క్స్లో ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని కాంక్రీట్ పనులను ఫూజీమీస్టర్, పెంటా, మట్టి పనులు త్రివేణి, డయాఫ్రమ్ వాల్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు బావర్, ఎల్ అండ్ టీ, గేట్ల పనులు బీకెన్, కాఫర్ డ్యామ్ జియో గ్రౌటింగ్ పనులు కెల్లర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించి ప్రభుత్వ ముఖ్యనేత భారీ ఎత్తున కమీషన్లు కొట్టేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు నామా సంస్థకు దక్కాక అదే రీతిలో సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కమీషన్లు కొట్టేయాలన్నది ఆయన ఎత్తుగడ. ఇందుకోసం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు దక్కేలా కీలక నిబంధనలు తప్పనిసరి చేయడం గమనార్హం. ఏటా రూ.1,200 కోట్లకు తక్కువ కాకుండా టర్నోవర్, అన్ని పన్నులు చెల్లిస్తూ లాభాల ఆర్జన, బ్యాంకుల్లో రూ. 210 కోట్ల నగదు నిల్వ, లేక ఆ మేరకు అప్పు ఇవ్వడానికి బ్యాంకు అంగీకా రపత్రం, ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్), ఎస్డీఆర్ (స్ట్రాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్) అమలు చేసి ఉండకపోవడం, ఏటా రూ.140 కోట్ల విలువైన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు చేసి ఉండటం, 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా 12.5 స్ట్రోక్ హైడ్రాలిక్ సిలిండర్తో కూడిన హైడ్రాలిక్ హాయిస్ట్ను ఉత్పత్తి చేసే సంస్థలు, డీలర్లతో అవగాహన ఒప్పందం తదితర నిబంధనలు రూపొందించారు. -
22 ఏళ్లనాటి హత్య కేసు.. జైలుకు మాజీ ఎంపీ
ఎప్పుడో 22 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ను దోషిగా జార్ఖండ్లోని హజారీబాగ్ కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని జైలుకు పంపింది. ఆయనకు ఏ శిక్ష విధించేదీ ఈనెల 23వ తేదీన నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే అలోక్ సింగ్ 1995 జూలై నెలలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రభునాథ్ సింగ్, ఆయన సోదరుడు దీనానాథ్, మాజీ ముఖియా రితేష్ సింగ్లను దోషులుగా కోర్టు తేల్చింది. అలోక్సింగ్ పట్నాలోని తన ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. లాలుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే ప్రభునాథ్ సింగ్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆయన మహరాజ్గంజ్ మాజీ ఎంపీ. అప్పట్లో జనతాదళ్ పార్టీలో ఉండే అలోక్ సింగ్ మీద 1991 డిసెంబర్ 28వ తేదీన కూడా ఒకసారి దాడి జరిగింది. ఆయన మస్రఖ్ జిల్లా కౌన్సిల్ కాంప్లెక్సుకు వెళ్లినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయనపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు అప్పుడు తప్పించుకున్నా, నాలుగేళ్ల తర్వాత జరిగిన దాడిలో మాత్రం ఆయన బలైపోయారు. -
ఐటీ వలయం
♦ మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్కుమార్ హాజరు ♦ ఆర్కేనగర్లో రూ.89 కోట్ల పంపిణీలో రాష్ట్ర మంత్రుల పాత్ర ఆర్కేనగర్లో ఉప ఎన్నికల పుణ్యమా అని పలువురు అధికార పార్టీ ప్రముఖులు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ వలయంలో చిక్కుకున్నారు. రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖాధికారులకు ఆధారాలు దొరికిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ విజయభాస్కర్, మాజీ ఎంపీ సిటిలంపాక్కం రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకుని సోమవారం విచారణకు హాజరయ్యారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీంకే(అమ్మ) అభ్యర్థి దినకరన్ భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాడని, ఓటర్లకు డబ్బు పంచుతున్నాడని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, డీఎంకే, బీజేపీలు ఎన్నికల కమిషన్కు పదేపదే ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల కమిషన్ ఆరాతీయడంతో నిజమేనని తేలింది. దీంతో ఈ నెల 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖాధికారులు 35 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అధికార ప్రభుత్వానికి చెందిన వారిని లక్ష్యంగా వైద్య మంత్రి విజయభాస్కర్ సహా పలువురి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు సాగాయి. తమ ఇంటి నుంచి కనీసం రూ.10 వేలు కూడా స్వాధీనం చేసుకోలేదని ఐటీ దాడుల రోజు మంత్రి విజయభాస్కర్ మీడియా ముందు బుకాయించారు. అయితే ఆర్కేనగర్లో రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులకు పెద్ద ఎత్తున ఆధారాలు దొరికాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా ఏడుగురు మంత్రులు, ఎంపీ వైద్యలింగం తదితరులు 33193 మంది ఓటర్లకు రూ.13.27 కోట్లు పంచినట్లు తెలుసుకున్నారు. మంత్రి సెంగోట్టయ్యన్ బృందం 32,830 మందికి రూ.13.13 కోట్లు పంపకాలు సాగించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అంతేగాక మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్ రూ.12.83 కోట్లు, తంగమణి రూ.12.67 కోట్లు వేలుమణి రూ.14.91 కోట్లు, జయకుమార్ బృందం రూ.11.68 కోట్లు, మాజీ మంత్రి వైద్యలింగం బృందం రూ.11.13 కోట్లు లెక్కన ఓటర్లకు పందేరం చేసినట్లు ఐటీ అధికారులు తేల్చారు. అంతేగాక మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లలో రూ.4.5 కోట్లు నగదు లభ్యమైంది. ఒక మంత్రి, అధికార పార్టీకి చెందిన వారి ఇళ్ల నుంచి రూ.89 కోట్ల మేర ఆధారాలు లభించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను నిశ్చేష్టులను చేసింది. పైగా ఈ వివరాలు సామాజిక మాధ్యమాల ప్రచారం కావడంతో ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. మంత్రి సహా అందరికీ నోటీసులు ఈ నెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో సోమవారం తమ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ గీతాలక్ష్మి, సమక అధ్యక్షుడు, నటుడు శరత్కుమార్లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి విజయభాస్కర్ తదితరులు చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. సరిగ్గా 11 గంటలకు మంత్రి విజయభాస్కర్, 11.30 గంటలకు శరత్కుమార్ వేర్వేరుగా చేరుకోగా నిజానిజాలను రాబట్టుకునేందుకు అధికారులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినట్లు సమాచారం. ఒక మంత్రిని ఐటీ అధికారులు కార్యాలయానికి పిలిపించుకుని నిందితునిలా విచారించడం సంచలనమైంది. అలాగే మిగిలిన వారిని సైతం విచారించారు. మంత్రి సహా పలువురు ప్రముఖులు విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఐటీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి నుంచి రూ.5లక్షలు పుచ్చుకుంది నిజమే మంత్రి విజయభాస్కర్ నుంచి రూ.5 లక్షలను పుచ్చుకుంది నిజమేనని ప్రభుత్వ వైద్యుడు బాలాజీ మరో సంచలన ప్రకటన చేశారు. అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. జయ వేలిముద్రలతో అన్నాడీఎంకే అభ్యర్థులకు బీఫారం జారీచేశారు. ఈ వేలిముద్రలకు ప్రభుత్వ వైద్యుడు బాలాజీ సాక్షి సంతకం చేశారు. ఐటీ దాడుల సమయంలో అధికారులకు లభించిన ఆధారాల్లో రూ.5 లక్షలను జయలలిత వేలిముద్రలకు సాక్షి సంతకం చేసిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీకి చెల్లించినట్లు పేర్కొని ఉంది. దీనిపై డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ, మంత్రి విజయభాస్కర్ అనుచరుల నుంచి గత ఏడాది నవంబరు 1వ తేదీన రూ.5 లక్షలు పొందానని అంగీకరించాడు. అయితే ఈ సొమ్ము లండన్ డాక్టర్ హోటల్ ఖర్చుల కోసం స్వీకరించానని వివరించారు. సీఎం, మంత్రులపై సీబీఐ కేసు పెట్టాలి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఇతర మంత్రుల అవినీతి, అక్రమాల బండారం బట్టయలైందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి, కోట్లాది రూపాయల నగదు బట్వాడా చేసిన సీఎం, మంత్రులపై సీబీఐ విచారణకు ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీ దాడుల్లో అక్రమార్కులుగా తేలిన 9 మంది మంత్రులను అరెస్ట్ చేయాలని టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ డిమాండ్ చేశారు. -
మాజీ ఎంపీ వైరిచర్ల రికార్డులను ప్రభుత్వానికి అందజేయాలి
సాలూరు: అరకు మాజీ ఎంపీ వైరిచర్ల కిశోర్చంద్రదేవ్ కులానికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి కలెక్టర్ అందజేయాలని ఉత్తరాంధ్ర గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వరరావు, భారతీయ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావు, గిరిజన నాయకులు ఆదయ్య, రామ, బీసు డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో వారు శనివారం మాట్లాడారు. వైరిచర్ల ఎస్టీ కాదని, విచారణ జరిపి కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేయాలని 2008లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 3 నెలల్లో విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. అప్పటి డీఎల్ఎస్సీ విచారణలో తను కొండరాజులుగా వైరిచర్ల చెప్పుకున్నారన్నారు. కొండరాజులు, కొండదొరలు ఒక్కటి కాదని నిర్దారించిన కమిటీ నివేదిక రూపొందించిందన్నారు. అప్పటి కలక్టర్ నారాయణరెడ్డి తనకున్న విచక్షణాధికారాల మేరకు వైరిచర్ల ఎస్టీగా నిర్ధారిస్తున్నట్టు వెళ్లడించారన్నారు. దీనిపై ప్రభుత్వానికి అప్పీలు చేశామన్నారు. నాటి నుంచి సదరు అప్పీలు పెండింగ్లోనే ఉందన్నారు. దీనికి వైరిచర్లకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ ప్రభుత్వానికి అందజేయకపోవడమే కారణమన్నారు. ఎస్టీగా నిర్ధారించే విచక్షణాధికారం కలక్టర్కు లేదని స్పష్టం చేశారు. వైరిచర్ల కేసు విచారణకు సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి త్వరితగతిన అందజేయాలని డిమాండ్ చేశారు. -
‘మాజీ ఎంపీ మరణవార్త ఎందుకు లేటయింది?’
న్యూఢిల్లీ: రాజ్యసభలో గుండెపోటుతో కుప్పకూలి అనంతరం ప్రాణాలు కోల్పోయిన మాజీ కేంద్రమంత్రి ఈ అహ్మద్ మరణం ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాప్యం చేసిందని, ఆటలాడుకున్న పరిస్థితి కనిపించిందని సీపీఎం సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్ సమయంలో ఈ అంశంపై ప్రశ్నను లేవనెత్తారు. తనకు పలువురు వైద్యుల నుంచి సమాచారం ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయానికే అహ్మద్ చనిపోయాడని చెప్పారని, ఇంకొంతమంది మాత్రం అహ్మద్ ఐసీయూలో చనిపోయాడని చెప్పారని అన్నారు. ఏదేమైనా ఆయన మరణంపై చాలా ఆలస్యంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని, వైద్యుల నుంచి భిన్నమైన సమాధానాలు వచ్చాయని ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి నిజనిజాలు తెలిపాల్సిన అవసరం ఉందని ఆయన స్పీకర్ను కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు మాజీ కేబినెట్ మంత్రి అహ్మద్ గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ను ఒక రోజు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్రం బడ్జెట్ పెట్టింది. ఈ సమయంలో సీతారాం ఏచూరి దర్యాప్తు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘అనంత’ పోరాటం మరువలేనిది!
- ఆయన స్ఫూర్తితోనే సాగు, తాగునీటి ఉద్యమాలు - అనంత వెంకటరెడ్డి వర్థంతిలో వక్తలు అనంతపురం : అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించినప్పుడే అభివృద్ధి చెందుతుందని భావించి అనేక పోరాటాలు చేసిన వారిలో అనంత వెంకటరెడ్డి ముఖ్యుడని, ఆయన పోరాటాలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. అనంత వెంకటరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గురువారం వారు పెద్దాస్పత్రి ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనిద్వారా మన జిల్లాలో 3.42 ఎకరాలకు, 387 చెరువులకు సాగునీరు అందుతుందన్నారు. ఈ దిశగా కృషి చేసిన అనంత వెంకటరెడ్డి పేరు ఈ పథకానికి పెట్టారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలిగించడమే కాకుండా 380 చెరువులను 1,260 చెరువులుగా చేస్తానని చెబుతూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు తిలోదకాలు ఇచ్చేందుకు పూనుకుందని మండిపడ్డారు. వైఎస్ పేరును శాశ్వతంగా కనుమరుగు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. అనంత లాంటి నాయకులæ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం చివరిదాకా పోరాటాలు చేసిన యోధుడు అనంత వెంకటరెడ్డి అన్నారు. కృష్ణాజలాలు అనంతకు మళ్లించేందుకు జరిగిన పోరాటంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించారన్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గొప్ప మనసుతో రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క ప్రాజెక్టునూ పట్టించుకోలేదన్నారు. హంద్రీ - నీవా పథకానికి అనంత వెంకటరెడ్డి పేరు తొలిగించడం ప్రభుత్వ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు హంద్రీ - నీవా నీరు తెచ్చుకునేందుకు వెంకటరెడ్డి స్ఫూర్తితో పోరాడేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. - మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు ఈరోజు అనంతకు వచ్చాయంటే వెంకటరెడ్డి చలువేనన్నారు. ఆయన పోరాటాలు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన కృషి ఫలితంగానే హంద్రీ - నీవా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారన్నారు. - పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. - కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాం«ధీ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాగేపరుశురాం, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్రెడ్డి, చవ్వా రాజశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీంఅహ్మద్, మీసాలరంగన్న, మహిళ,బీసీ,ట్రేడ్, ఎస్సీ విభాగాల జిల్లా అధ్యక్షులు బోయ సుశీలమ్మ, పామిడి వీరా, ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, అంబటి ఆదినారాయణరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా తదితరులు పాల్గొన్నారు. - అంతకుముందు రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నగరంలోని అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పూర్తిగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి కోసం ఆయన చేసిన ఉద్యమం మరువలేనిదన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. -
'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్లోని జయ సమాధిని శనివారం విజయశాంతి సందర్శించారు. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ జయలలిత గొప్ప నాయకురాలు అని కొనియాడారు. అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు శశికళకు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఆమె చెప్పారు. -
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
-
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమకు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు. నదుల అనుసంధానం తానే చేశానంటూ చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి మాటలని హర్ష కుమార్ చెప్పారు. పట్టి సీమకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసిందని హర్ష కుమార్ తెలిపారు. -
హామీలన్నింటినీ గాలికొదిలేశారు..
-
'ప్రభుత్వ ఉత్తర్వులు ఆచరణలో లేవు'
-
'ప్రభుత్వ ఉత్తర్వులు ఆచరణలో లేవు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం తెలుగులో ప్రచురించిన శిలాఫలకం సీఆర్డీఏ ఆఫీస్లో ఒక మూలన మూలుగుతుందని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వతీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా దాన్ని బయటకు తీసి రాజధాని ప్రారంభోత్సవ శిలాఫలకం పక్కన పెట్టాలన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. పవిత్ర సంగమం వద్ద రూ.100 కోట్ల ఖర్చుతో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునురాలోచించుకోవాలన్నారు. తెలుగు సంస్కృతి వికాసం కోసం పాటుపడిన తెలుగు వారి విగ్రహాలు నెలకొల్పాలన్నారు. ఠాగూర్ విగ్రహం పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా మన రాష్ట్రానికి చెందిన వారి విగ్రహమే పెడతామని చెప్పాలి. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆచరణ కావడం లేదన్నారు. -
చంద్రబాబును కలిసిన మోహన్బాబు
హైదరాబాద్: విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన మోహన్ బాబు వెంట ఆయన కుమార్తె మంచు లక్ష్మి కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయే అని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు అన్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. -
సెటిల్మెంట్లలో కేసీఆర్ కుటుంబం
-
సెటిల్మెంట్లలో కేసీఆర్ కుటుంబం: యాష్కీ
సాక్షి, హైదరాబాద్: భూముల సెటిల్మెంట్లలో సీఎం కేసీఆర్ కుటుంబం మునిగిపోయిందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన సోమవారం మాట్లాడుతూ కేసీఆర్ కూతురు భూముల సెటిల్మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ, కొడుకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ దేశంలోనే భారీ కుంభకోణమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం జరిగిపోయినట్టుగా గతంలో ప్రచారం చేసిన కేసీఆర్ను గాడిదలపై ఊరేగించాలన్నారు. కేసీఆర్ సన్నిహితునితో జరిగిన వివాదం వల్లనే నయీమ్ను పోలీసులతో కాల్చి చంపించారని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో కలసి కేసీఆర్ కుటుంబం బినామీ వ్యాపారాలు చేస్తున్నదన్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
మాజీ ఎంపీకి ఉరి శిక్ష
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ మాజీ ఎంపీకి ఉరి శిక్ష వేశారు. ఆ దేశ స్వాతంత్ర పోరాటం సమయంలో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అతడికి ఉరి శిక్ష ఖరారు చేసి మరికొంతమందికి జీవిత కారాగార శిక్ష వేసింది. అయితే, ఆ ఎంపీకి సంబంధించిన న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసును మరోసారి అపీల్ చేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్లో యుద్ధ నేరాల పేరిట పలువురుని ఇటీవల కాలంలో ఉరి తీస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం జమాతే ఈ ఇస్లామి పార్టీకి చెందిన షాకావత్ హుస్సేన్ గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ చత్ర సంఘలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో దేశ విముక్తికోసం పోరాడాల్సిందిపోయి.. బంగ్లాపై యుద్ధానికి దిగిన పాక్కు సహాయం చేసి ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలను విచారించిన ట్రిబ్యునల్ అతడికి ఉరి శిక్షను వేసింది. -
'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. అమలాపురం జానకీపేటకు చెందిన ఇద్దరి వ్యక్తులపై 8 మంది అమానుషంగా దాడి చేశారు. వీరిద్దరు ఆవులను ఎత్తుకెళ్లారనే అనుమానంతో స్థానిక శ్మశానం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. నిందితులను 48 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అమలాపురం డీఎస్పీ మాట్లాడుతూ...ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. -
మాజీ ఎంపీయే ఆత్మాహుతి బాంబర్!
ఆయనో మాజీ ఎంపీ.. అలాంటి ఉన్నత పదవి వెలగబెట్టి కూడా చివరకు ఆత్మాహుతి బాంబర్గా మారారు, 13 నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ దారుణం ఆఫ్రికా దేశమైన సోమాలియాలో జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషు విమానాశ్రయంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగి 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడులు చేసిన ఆత్మాహుతి బాంబర్లలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నట్లు తేలింది. 2004 నుంచి 2010 వరకు సోమాలియా పార్లమెంటులో సభ్యుడిగా పనిచేసిన సలా బాడ్బాడో (53) ఆ తర్వాత వెంటనే అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. సోమాలియాలోని అల్ కాయిదా అనుంధ సంస్థలో చేరేందుకు తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు ఆయన అప్పట్లో ఆయన ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. మంగళవారం నాటి ఇద్దరు బాంబర్లలో ఆయనొకరని అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ ఇద్దరు యోధుల్లో సలా బడ్బాడో ఒకరని, హలేన్ మిలటరీ బేస్ మీద జరిగిన దాడుల్లో ఆయన కూడా పాల్గొన్నారని టెలిగ్రామ్ యాప్ ద్వారాను, అండాలస్ రేడియో స్టేషన్ ద్వారాన విడుదల చేసిన ప్రకటనల్లో చెప్పారు. అల్లా కోసం తాము కొద్ది సేపట్లో ఆత్మాహుతి దాడి చేస్తున్నామంటూ పది నిమిషాల ముందే ప్రకటించారు. కార్లలో బాంబులు పెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఈ ఉగ్రవాదులు.. విమానాశ్రయం ప్రధాన బేస్కు 200 మీటర్ల దూరంలో వాటిని పేల్చేశారు. దాంతో ప్రధానంగా చాలామంది సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఉగ్రవాద దాడిని ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. -
అమర్నాథ్ యాత్రికులు పట్టరా?: పొన్నం
సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు ఇబ్బందులుపడుతున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దేశంలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారని అన్నారు. కశ్మీర్లో ఉద్రిక్తత నెలకొన్నా ప్రధాని మోదీకి కనిపిం చడం లేదా అని ప్రశ్నించారు. -
'ప్రాజెక్టు పూర్తికి 5వేల ఏళ్లు పడుతుంది'
ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలు తీరాలంటే 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ అన్నారు. దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టు పురోగతిలో ఎలాంటి ముందడుగు పడలేదని అన్నారు. 2014, 2015, 2016ల్లో ప్రాజెక్టుకు ఏడాదికి మూడు కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను నిర్మాణానికి ఉపయోగించలేదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి రూ.7,214 కోట్ల అంచనా వ్యయం కాగా.. సంవత్సరానికి మూడు కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఐదు వేల ఏళ్లు పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీరుకు నోచుకుని 15 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. 16 చిన్న, మధ్య తరహా నదుల ఉన్న ఈ ప్రాంతంలో ఏటా 207 టీఎంసీ నీరు లభ్యమవుతుండగా.. కేవలం 100 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నామని ప్రాజెక్టు పూర్తయితే మిగతా 107 టీఎంసీలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి వెంటనే టెండర్లు పిలిచి సంవత్సరానికి కనీసం రూ.5,000 కోట్లయినా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
‘చంద్రబాబుకు ఆగస్టు సంక్షోభం తప్పదు’
పాలకొల్లు టౌన్ (పశ్చిమ గోదావరి): ముద్రగడ తలపెట్టిన ఆమరణ దీక్ష విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనవసరమైన పట్టుదలకు పోతే ఆయనకు మరో ఆగస్ట్ సంక్షోభం తప్పదని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ఆగస్ట్ సంక్షోభం తలెత్తితే చంద్రబాబు ప్రభుత్వం మనుగడకు ప్రమాదం వాటిల్లే విషయాన్ని కాదనలేమని అభిప్రాయపడ్డారు. వైద్య నిపుణుల నివేదికలను బట్టి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎటు దారితీస్తుందోననే ఆందోళన నెలకొందన్నారు. ముద్రగడ పద్మనాభం మొండివైఖరి, పట్టుదల కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సమస్య పరిష్కరించడం అంత సులువైనదిగా భావించలేమని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగల ఒకే వ్యక్తి పవన్కల్యాణ్ అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు మిత్రపక్షేయుడిగా.. ముద్రగడ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిగా పవన్కల్యాణ్ ఒక్కరే దీనిని పరిష్కరించగలడన్నారు. ప్రజలందరి తరఫున పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాలని జోగయ్య కోరారు. -
మహానందిలో జయప్రద ప్రత్యేక పూజలు
కర్నూలు: సినీనటి, మాజీ ఎంపీ జయప్రద బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని సందర్శించారు. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజ, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. జయప్రద ఆలయ చరిత్ర, కోనేరు ప్రాశస్త్యం గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. -
'కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు'
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : మతం పేరుతో ప్రధాని మోదీ, కులం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొడుతూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. -
కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి విఠల్ రావు లోక్ సభకు ఎన్నికయ్యారు. -
'దళిత సీఎం హామీని మరచిన కేసీఆర్'
మందమర్రి (ఆదిలాబాద్) : దళితులను తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ హామీని విస్మరించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత జి.వివేక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగరేణి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రథమ మహాసభలలో పాల్గొన్న సందర్భంగా వివేక్ మాట్లాడారు. కుటుంబ పాలనే తప్ప ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు పట్టవన్నారు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఫ్యాక్టరీలను మూసి ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని ఆరోపించారు. కాగా నాయకుడి కంటే కార్మికుడే తెలివైనవాడని ఐఎన్టీయూసీ అఖిల భారత అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. కార్మికుడి కష్టాలు తీర్చకుండా ఓటు అడిగే హక్కు ఏ నాయకుడికీ లేదన్నారు. ఐఎన్టీయూసీ ఎప్పుడూ కాంగ్రెస్కు అనుబంధంగానే కొనసాగుతుందని చెప్పారు. -
చంద్రబాబుకు హర్హకుమార్ లేఖ
కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దళితులు వివక్షకు గురవుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎంపీ హర్షకుమార్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. దాన్ని ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతోందన్నారు. చంద్రబాబులా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. దళితులను పైకి తీసుకురావాలని నిజంగా ఉంటే ఎస్సీ, ఎసీ సబ్ప్లాన్ నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణ మాదిరిగా మార్కెటింగ్ చైర్మన్ పోస్టులలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అమరావతిలో నిర్మించే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలన్నారు. -
పాలేరు బరిలోకి ‘నామా’ !
* రాష్ట్ర టీడీపీలో చర్చ * అధినేత నిర్ణయమే తరువాయి సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీపై రాష్ట్ర టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభ్యర్థిత్వం ఖరారైనట్లు ప్రకటన వెలువడడంతోనే టీడీపీలో కూడా పోటీపై చర్చ మొదలైంది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావును బరిలోకి దింపాలన్న డిమాండ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి వచ్చింది. ఈ మేరకు గురువారం ఖమ్మంలో భేటీ అయిన జిల్లా నేతలు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. టీడీపీ అధినేత నిర్ణయం కోసం పార్టీవర్గాలు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ నుంచి తుమ్మల టీఆర్ఎస్లోకి రావడం, మంత్రిగా నియమితులవడం, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వరుసగా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో తనకు పాలేరు అసెంబ్లీ టికె ట్ కావాలని తుమ్మల పట్టుబట్టినా కుదరలేదు. ఆయనకు పాలేరు టికెట్ రాకుండా నామా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అదే పాలేరు నుంచి ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగుతుండడంతో టీడీపీ కూడా బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. -
సమాధులపై కట్టుకోలేకపోయారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాల్సిన మాట నిజమే అయినా రైతుల కడుపుకొట్టి, బలవంతంగా బయటకు పంపి నిర్మిస్తారా? ఇంతకన్నా రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమాధులమీద నిర్మించుకోలేకపోయారా?’’ అని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అతుల్కుమార్ అంజన్ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి భూమ్యాకాశాల్ని ఏకం చేసిన వ్యక్తికి ఇదో పెద్ద లెక్కా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలివితేటలేమిటో తమకు బాగా తెలుసంటూ.. సీఎం పీఠాన్ని ఎక్కడానికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తన్నారు. గురువారమిక్కడ ప్రారంభమైన రైతుసంఘం 29వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన అతుల్, ఏపీకి చెందిన మరికొందరు రైతు నేతలు ‘సాక్షి’లో వస్తున్న ‘రాజధాని దురాక్రమణ’ కథనాలపై గురువారం స్పందిం చారు.ఎస్సీ, ఎస్టీలు, చిన్న,మధ్యతరహా రైతుల్ని తరిమివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు. మంత్రులా? రియల్టర్లా? రాజధాని అమరావతిపై గద్దల్లా వాలిన పెద్దలు మంత్రులు కాదు.. రియల్టర్లు. మంత్రులుగా చెలామణి అవుతున్న నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్బాబు బరితెగించారనే దానికి నిదర్శనమే సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలియబట్టే వీళ్లు వందలాది ఎకరాల్ని పేదలనుంచి కొనేసి వాళ్లనోట మట్టికొట్టారు. -రామచంద్రయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు చినబాబు పాత్ర ఉంది ప్రస్తుత భూ కబ్జాలో పెద్దబాబు, చినబాబుల పాత్ర ఉంది. పేదల నోళ్లు కొట్టేలా జోన్లు ఏర్పాటు చేశారు. సీఎం, ఆయన అనుచరులు కొనుగోలు చేసిన భూముల్ని అగ్రికల్చర్ జోన్ నుంచి మినహాయించి ఇప్పుడు రియల్ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. - రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్, రైతుసంఘం జాతీయ నేతలు విచారణకు సిద్ధంకండి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలు రాసిన మీడియాపై చిందులేసే బదులు బహిరంగ విచారణకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిద్ధపడాలి. నీతిమంతులైతే భయపడడమెందుకు? -గుడితి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఎక్కడొస్తుందో సీఎం ముందే చెప్పారు.. సీఎం ముందే తన అనుచరులకు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పారు. రైతుల్ని త్యాగాలు చేయమన్నారు. మంత్రుల్ని కుబేరుల్ని చేశారు. - జి.చంద్ర, వైఎస్సార్ జిల్లా కార్యదర్శి -
లగడపాటీ.. ఇదేంటి!
విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం విరమిస్తున్నారా.. ఎన్నికల ముందు చేసిన ప్రతిజ్ఞను పక్కనపెట్టి వేరే పార్టీలో చేరనున్నారా! ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ వీధుల్లో వెలిసిన పోస్టర్లను చూస్తే ఎవరికైనా సందేహం రాక మానదు. ఈ పోస్టర్లపై నటుడు పవన్కల్యాణ్, బీజేపీ నాయకుల ఫొటోలు ఉండడం విశేషం. పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బర్త్డే జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది నగరవాసుల్లో చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా రాజగోపాల్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన బెంగళూరులో ఉండగా అభిమానులు ఇక్కడి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తమ నాయకుడు రానున్న ఎన్నికలనాటికి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్లెక్సీలపై పవన్ ఫొటోలు వేయడంతో రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కొంతమంది, వైఎస్సార్ సీపీలో చేరతారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ లగడపాటి ఇంతవరకు ఆయా పార్టీల ముఖ్య నేతలెవరినీ కలవలేదు. -
రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు?
కేంద్రానికి మాజీ ఎంపీ ఉండవల్లి ప్రశ్న హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై అనేక కేసులున్నాయని, అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును ఎలా ప్రకటిస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. పద్మవిభూషణ్ వంటి అవార్డులను ప్రకటించేముందు సదరు వ్యక్తుల నేరచరిత గురించి ప్రభుత్వం కచ్చితంగా తెలుసుకుని ఉండాలన్నారు. ‘రామోజీరావు పద్మవిభూషణ్’ అని ఇంటర్నెట్లో సెర్చ్చేస్తే ఆయనపైనున్న కే సులన్నీ బయటపడతాయన్నారు. రామోజీరావుపైనున్న కేసుల వివరాల్ని త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. జర్నలిజం, సాహిత్యం, విద్య విభాగాల్లో రాణించినందుకుగాను పద్మవిభూషణ్ ఇస్తున్నట్లు ప్రకటించారని ఏ పుస్తకాలు రాశారని లిటరేచర్ విభాగంలో అవార్డు ప్రకటించారన్నారు. -
వాపు చూసి బలుపు అనుకుంటున్నారు: పొన్నం
కరీంనగర్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించిందని, వాపును చూసి బలుపనుకోవడం తగదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పుకు కట్టుబడి ఉందని, గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా టీఆర్ఎస్ డివిజన్ల విభజన, రిజర్వేషన్లు చేసి తమకు అనుకూలంగా మలుచుకుందన్నారు. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. విద్యుత్ బకాయిలు, నీటి పన్నుల రద్దు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికార పార్టీ జీహెచ్ఎంసీలో గెలిచిందని ఆరోపించారు. -
బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి గురువారం కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ ఓటు వేయడం చట్ట విరుద్ధమన్నారు. ఏదైనా రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సంబంధిత రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందన్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటెలా వేస్తారని ప్రశ్నించారు. -
మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవి సస్పెన్షన్
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో నిందితురాలిగా ఉన్న రాజయ్య భార్య మాధవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న తెల్లవారుజామున సారిక సజీవ దహనం కాగా, అదే రోజు పోలీసులు మాధవిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీసుల నుంచి రిమాండ్ రిపోర్టు అందలేదు. తాజాగా ఆ రిపోర్టు కేయూ అధికారులకు రిమాండ్ రిపోర్టు అందగా, కేయూ ఇన్చార్జి వీసీ చిరంజీవులు అనుమతి మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం మాధవిని సస్పెండ్ చేశారు. అయితే ఈనెల 5 నుంచి మాధవిపై సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మాధవి సిర్పూర్ కాగజ్నగర్లోని ఓ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 2010లో కేయూ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యూరు. ఈ మేరకు క్యాంపస్లోని బయో టెక్నాలజీ విభాగంలో సుమారు రెండేళ్ల పాటు పనిచేశాక, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యూరు. కేయూ చరిత్రలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. -
పైకి గాంభీర్యం..
వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ కాంగ్రెస్ నేతలు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఫలితం ఎలా ఉంటుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుడిని అభ్యర్థిగా బరిలో నిలిపినందున దాని ప్రభావం ఏ స్థాయిలో, ఏ మేరకు పడుతుందనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. జాతీయ స్థాయిలోని పార్టీ ముఖ్య నేతలు అందులో ఎస్సీ వర్గానికి చెందిన అగ్రనేతలను, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసిన నేతలను ప్రచార రంగంలోకి దించినా ఫలితం ఎలా ఉండబోతుందా అని టెన్షన్ పడుతున్నారట! గట్టి అభ్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ అనూహ్య పరిస్థితుల్లో వైదొలగడం, జిల్లా పార్టీలో ముఖ్యనేతగా ఉన్న నాయకుడు, పార్టీ డమ్మీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా పార్టీకి రాజీనామా చేయడం, ఇతరత్రా ప్రతికూల పరిస్థితులు అనేకం ఉన్నాయని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. చివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఏ స్థానం దక్కుతుందో, ఎన్ని ఓట్లు వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంతర్గత చర్చల్లో హైరానపడుతున్నారట. -
వరంగల్ సెంట్రల్ జైలుకు సనా
వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 27వరకూ రిమాండ్ విధించింది. దీంతో సనాను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా సనా రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సనాను అనిల్ 2010లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని చూసేందుకు రాజయ్య, ఆయన భార్య మాధవి వచ్చేవారని తెలుస్తోంది. అనిల్, అత్త మాధవి ప్రవర్తన వల్ల సారిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అలాగే రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులపై రాహుల్ గాంధీకి సారిక రాసిన లేఖను ...సనా దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అవినీతి ఆరోపణలపై రాజయ్య ఏసీబీకి ఇచ్చిన సంజాయిషీ డైరీని కూడా ఆమె నుంచి పోలీసులు తీసుకున్నారు. ఇక రాజయ్యకు ఎంపీ టికెట్ రావడంతో సారికను ఇంట్లో నుంచి పంపించేయాలని సనా ఒత్తిడి తెచ్చినట్లు సనా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
సారిక కేసులో ఏ4గా సన
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలు, అనిల్ రెండో భార్యగా చెబుతున్న సనను ఏ4 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరుపరచనున్నారు. మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో గత శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తుపాకితో కాల్చుకుని.. మాజీ ఎంపీ ఆత్మహత్య
రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్. రాజేంద్రన్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోవిల్పట్టిలో జరిగింది. కోవిల్పట్టి బస్టాండుకు సమీపంలోని ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఆయన కారు కనిపించింది. కారు ముందుసీట్లు రెండూ రక్తసిక్తమై ఉన్నాయి. పక్కనే రివాల్వర్ కూడా దొరికింది. ఆ దారిలో వెళ్లేవాళ్లకు రక్తసిక్తమైన కారు కనిపించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, అక్కడ కారు అద్దాలు పగలగొట్టి రాజేంద్రన్ మృతదేహాన్ని కోవిల్పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేంద్రన్కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయనకు ఒక ఫంక్షన్ హాలు, బస్సు సర్వీసు వ్యాపారాలున్నాయి. అయితే, కొడుకు కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, దాంతో కోడలి ఇంట్లో గొడవలు జరిగాయని చెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారని, ఇంట్లో దీపావళి పండగ కూడా చేసుకోలేదని స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల సమయంలో తన అసిస్టెంట్ గణేశన్తో ఫోన్లో మాట్లాడారని, తాను ఒంటరిగా కారులో వెళ్తున్నట్లు చెప్పారని, కొద్దిసేపటికే విగతజీవిగా మారారని అంటున్నారు. రాజేంద్రన్ది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో వేరే కోణాఉల ఏవీ లేవని జిల్లా ఎస్పీ అశ్విన్ కొ ట్నిస్ తెలిపారు. కణతమీద రివాల్వర్ పెట్టుకుని కాల్చుకున్నారని, దాంతో రివాల్వర్ ఎడమవైపు నుంచి బయటకు వచ్చిందని వివరించారు. రాజేంద్రన్కు ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు ఆయన వైద్యుడు చెప్పారు. అన్నాడీఎంకే తరఫున 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజేంద్రన్.. తర్వాత డీఎంకేలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు
-
'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు
హన్మకొండ: సంచలనం సృష్టించిన సిరిసిల్ల సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలు సనను వరంగల్ పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంపులో సన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సారిక, ముగ్గురు పిల్లల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, మాధవితో పాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సనను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై వరకట్న వేధింపులు(498-ఎ), ఆత్మహత్యకు ప్రోత్సహించడం(306) సెక్షన్ కింద కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజే అనిల్, రాజయ్య, మాధవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు జడ్జి ఎదుట హాజరు పరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉండగా శనివారం వరంగల్ పోలీసులు ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజులుగా రహస్య విచారణ సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసు అధికారికంగా ధ్రువీకరించలేదు. సారిక గతంలో చేసిన ఫిర్యాదులోని అంశాల మేరకు... సారిక, అనిల్, సనల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన అంశాలను పోలీసులు సన నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. అనిల్తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రూ.10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం. ఇప్పటికీ అనుమానాలే.. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణాలపై అనుమానాలు వీడటం లేదు. సంఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలు ఏమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా సంఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమాలు సైతం వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయూంశంగా మారింది. సారిక, ముగ్గురు పిల్లల మరణం కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సనను రెండు రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవిల విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ వేయలేదు. -
సిరిసిల్ల పై వేటు
-
పోలీసుల అదుపులో సన!
సాక్షి, హన్మకొండ/ఖమ్మం: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా సోమవారం సన అరెస్టును పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉంది. సన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్లోని ఉప్పల్లో ఆమె ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అమె అక్కడి నుంచి పరారయ్యారని భావించి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చివరికి ఈ నెల 7న ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ ప్రాంతంలో సనను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంపులో ఓ క్వార్టరు లో సన నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. కాగా, సనను అరెస్టు చేసిన విషయాన్ని ఖమ్మం జిల్లాలోని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఖమ్మం రూరల్ మండలంలో తన బంధువుల ఇంట సనా ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న హన్మకొండ సుబేదారి పోలీసులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న సోదరుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సిరిసిల్ల పై వేటు
కోడలు, మనవళ్ల మృతి కేసులో అరెస్టయ్యి.. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆదివారం తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రాజయ్య మాజీ ఎంపీయే కావడం, ఏఐసీసీ సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకునే అధికారం పీసీసీకి ఉంది. పార్టీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడిన అనంతరం రాజయ్యపై టీపీసీసీ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. సారిక, ఆమె పిల్లల మృతి కేసులో రాజయ్య జైలుకు వెళ్లడంతో ఆ ప్రభావం పార్టీపై పడే ప్రమాదం ఉందని నాయకులు కలవరపడ్డారు. రాజయ్యను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా దీన్ని ఓ అస్త్రంలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్యపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి అప్రతిష్టగా మారుతుందన్న కాంగ్రెస్ నాయకులు భావించారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ జైల్లో ఉన్నారు. -
సారిక కేసులో అనిల్ రెండో భార్య సన అరెస్ట్
-
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
-
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన వరంగల్ పోలీసులు.. రిమాండు రిపోర్టును సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం 24 మందిని ప్రశ్నించారు. రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారికల వైవాహిక జీవితం గురించి కూడా రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. అనిల్ రెండో భార్య సన మాత్రం తప్పించుకుని తిరుగుతోందని తెలిపారు. కాగా, ఈ కేసులో ఎ1 అనిల్, ఎ2 సిరిసిల్ల రాజయ్య, ఎ3 మాధవీలత, ఎ4 సన అని పేర్కొన్నారు. రిమాండు రిపోర్టులో మరిన్ని విభ్రాంతికర వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. అవి ఇలా ఉన్నాయి... అనిల్ రెండో వివాహంతోనే సారికపై వేధింపులు మొదలయ్యాయి అనిల్కు తల్లిదండ్రుల మద్దతు ఉంది సారికను మామ రాజయ్య, అత్త మాధవీలత వేధించారు ఆమె పలుమార్లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది కేసుల కారణంగా సారికపై వేధింపులు మరింతగా పెరిగాయి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని నిరంతరం వేధించారు ఆత్మహత్య చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు ఈ వేధింపులకు సాక్షులు సారిక, పిల్లలను అత్తింటివారు ఒంటరి చేశారు ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని ఆందోళన చెందింది విసిగిపోయి పిల్లలతో ఆత్మహత్యకు ఒడిగట్టింది తెల్లవారుజామున 4-4.30 మధ్య ఆత్మహత్యకు పాల్పడింది పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు గుర్తించి 100, 108లకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి బెడ్రూంలో రెండు గ్యాస్ సిలిండర్లున్నాయి ఒకటి ఖాళీ, మరోటి నిండుది. మంటలు, పొగ కారణగానే సారిక, పిల్లలు మరణించారు బెయిల్ దరఖాస్తు కాగా, శనివారం వరంగల్ కోర్టులో రాజయ్య, ఆయన భార్య మాధవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము ఒక రోజు ముందుగా అక్కడికి వచ్చామని అందులో పేర్కొన్నారు. అందువల్లే ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమకు బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. వారి పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దానిపై విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. -
జైలుకు వెళ్లడం ఇది మూడోసారి
‘ప్రత్యేకం’గా చూడాలన్న రాజయ్య విజ్ఞప్తి తిరస్కరణ ములాఖత్లో కలిసిన ఓ మిత్రుడు, కార్యకర్త పోచమ్మమైదాన్ : కోడలు, మనవళ్లు అనుమానాస్పద మృతి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య, ఆయన భార్య, కుమారుడిని వరంగల్ కేంద్ర కారాగారానికి గురువారం రాత్రి 11 గంటలకు త రలించిన విషయం విదితమే. అక్కడ అర గంట వారిని తనిఖీ చేసి న సిబ్బందికి లోపలకు పంపించారు. అయితే, తనకు స్పెషల్ కేటగిరీ కేటాయించాలని రాజయ్య కోరగా కోర్టు ఆదేశాలు లేనందున అధికారులు నిరాకరించినట్లు తెలి సింది. ఆ తర్వాత రాజయ్యకు అండర్ ట్రైలర్ ఖైదీ నంబ ర్ 2971, అనిల్కు 2970, మాధవికి 7856 నంబర్లు కేటాయించారు. ఇక శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు సిబ్బంది నిద్ర లేపగా కాలకృత్యాల అనంతరం ఉద యం 7గంటలకు రాజయ్య టామాటా బాత్ తిన్నారు. ఆ తర్వాత దినపత్రికలు చూసి నిద్రపోయిన ఆయన మధ్యాహ్నం, సాయంత్రం సాధారణ భోజనం చేశారుకాగా, ములాఖత్లో భాగంగా వెంకయ్య అనే మిత్రుడు రాజయ్యని కలిసి వెళ్లగా.. మరో కాంగ్రెస్ నేత వచ్చి రాజ య్యకు లుంగీ, ఒక డ్రెస్, అనిల్కు నైట్ ప్యాంట్, ఒక డ్రెస్, మాధవికి రెండు చీరలతో పాటు డజన్ అరటి పండ్లు ఇచ్చి వెళ్లారు. ఓసారి ఉద్యోగంలో ఉన్నప్పుడు... మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య జైలుకు వెళ్లడం ఇది మూ డో సారి. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అవినీతి పాల్పడిన సందర్భంలో 8 డిసెంబర్ 2006లో ఓ సారి, తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో చేస్తుం డగా పోలీసులు అరెస్ట్ చేయడంతో 2013లో మరోసారి జైలుకు వెళ్లిన ఆయన ఇప్పుడు కోడలు, మనువలు అనుమాస్పద మృతితో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేయూలో కొవ్వొత్తుల ర్యాలీ కేయూ క్యాంపస్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతికి సంతాప సూచకంగా కేయూలో టీజీవీపీ ఆధ్వర్యాన శుక్రవా రం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి నివాళులర్పించారు. క్యాంపస్లోని మహిళా హాస్టల్ నుంచి మొదటి గేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. టీజీవీపీ నాయకులు రంజిత్, శ్రావణ్, శివ, సుధీర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాధవిపై సస్పెన్షన్ వేటు ? కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెం ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సిరిసిల్ల మాధవిపై యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేసే యోచనలో ఉన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన సారిక, ఆమె పిల్లల అనుమానాస్పద మృతి కేసులో.. సారిక అత్త అయిన మాధవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం విదితమే. గురువారం రాత్రి ఆమెను జైలుకు తరలించగా.. రిమాం డ్లోనే 48గంటలు ఉంటే పోలీస్ రిపోర్ట్ ఆధారంగా మాధవిని అధికారులు సెస్పెన్షన్ చేయనున్నారు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగి అయినా ఏదేని కేసులో జైలుకు వెళ్లి 48గంటలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టు అందితే సస్పెన్షన్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. కాగా, మాధవిని సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, రాష్ర్ట అధికార ప్రతినిధి ఈశ్వర్ప్రసాద్, బాధ్యులు మండలోజు జగన్, చక్రపాణి, గజ్జెల వీరన్న, మాందాటి వినోద్కుమార్, కె.రవి తదితరులు శుక్రవారం కేయూ వీసీ చిరంజీవులును కలిసి వినతిపత్రం అందజేశారు. -
కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల సస్పెన్షన్?
కోడలు, మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయ్యి.. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సారిక, ఆమె పిల్లల మృతి కేసులో రాజయ్య జైలుకు వెళ్లడంతో ఆ ప్రభావం పార్టీపై పడే ప్రమాదం ఉందని నాయకులు కలవరపడుతున్నారు. రాజయ్యను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా దీన్ని ఓ అస్త్రంలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్యపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి అప్రతిష్టగా మారుతుందన్న ఆందోళన నెలకొంది. రాజయ్య మాజీ ఎంపీయే కావడం, ఏఐసీసీ సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకునే అధికారం పీసీసీకే ఉంటుంది. అయితే దానికి ముందుగా జిల్లా కాంగ్రెస్ నుంచి నివేదిక రావాల్సి ఉంటుంది. దాన్ని పీసీసీ క్రమశిక్షణ సంఘానికి రిఫర్ చేసిన తర్వాత, వాళ్లు చెప్పేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ అసలు ఇప్పటివరకు జిల్లా పార్టీ విభాగం నుంచి ఎలాంటి నివేదిక అందలేదు. ప్రస్తుతం రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ జైల్లో ఉన్నారు. దాంతో త్వరగా జిల్లా పార్టీ విభాగం నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం మేలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. -
కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల సస్పెన్షన్?
-
వైఎస్ జగన్ దీక్ష న్యాయబద్ధమైంది: విజయశాంతి
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ విజయశాంతి, ఆలిండియా దళిత రైతు ఫెడరేషన్ లు జననేత దీక్షను సమర్థించారు. వైఎస్ జగన్ దీక్ష న్యాయబద్ధమైనదని, ప్రగతిశీల వాదులందరూ దీక్షకు మద్దతు పలకాలని విజయశాంతి అన్నారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు టీడీపీ, బీజేపీలు ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఆలిండియా దళిత రైతు ఫెడరేషన్ కన్వీనర్ ఆనందరావు ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ప్రాణాపాయం కల్పించడం మూర్ఖత్వమని అన్నారు. 'ప్రత్యేక హోదాపై ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తానన్న చంద్రబాబు.. వైఎస్ జగన్ దీక్షను అవహేళన చేయడం సరికాదు. బాబు హిట్లర్ లా కాకుండా సీఎంలా వ్యవహరించాలి. ప్రతిపక్ష నేత ప్రాణాలతో చెలగాటమాడటం మూర్ఖత్వం. ప్రధాన మంత్రితో చర్చలు జరిపి వెంటనే ప్రత్యేక హోదాపై ప్రకటనను ఇప్పించాలి' అని ఆనందరావు పేర్కొన్నారు. -
మంత్రులతో తిట్టించడం కాదు..
పట్టిసీమపై సీఎంకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు వివిధ అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులతో తిట్టించడం కాదు.. సూటిగా జవాబివ్వండి అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఆదివారం లేఖరాశారు. ‘‘పట్టిసీమ గురించి నాలాంటి వారేదైనా మాట్లాడితే కారుకూతలంటారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. లక్ష కోట్లు దిగమింగిన మీకు మాట్లాడే అర్హత లేదంటారు. వట్టి వసంత్కుమార్ లాంటివారు పట్టిసీమపై హైకోర్టులో అభ్యంతరాలు లేవనెత్తితే ఆరునెలలైనా కౌంటర్ దాఖలు చేయరు. పాలనలో ఇక మీరు చెప్పే పారదర్శకతకు అర్థమేమిటో మాకర్థం కావట్లేదు’’ అని అన్నారు. ‘‘పట్టిసీమ విషయంలో.. గుడ్డిగూడెం దగ్గర పోలవరం కుడికాల్వలోకి తాడిపూడి నుంచి విడుదలయ్యే నీటిని కలిపారన్నది యథార్థం. 24 పంపులతో 8,500 క్యూసెక్కుల నీటిని పంపు చేయాలన్న పట్టిసీమ ప్రాజెక్టులో ఒకటో, రెండో పంపులు సెప్టెంబర్ 15కు పనిచేస్తాయని మీరే చెబుతున్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 80 టీఎంసీలను కృష్ణాలోకి మళ్లిస్తామనేది మీ ఆలోచన. ఈ మూడేళ్ల ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2015 వరద సమయం అయిపోయింది. ఇక 2016లో నీళ్లు పంపు చేయాలి. ఇది తాత్కాలిక ప్రాజెక్టు. అదీ పదిశాతం పూర్తవకుండా ‘జాతికి అంకితం’ అనే హడావుడి ఎందుకు చేస్తున్నారనే నేను ప్రశ్నిస్తున్నాను’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన మాగంటి, కావూరి
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఏలూరు ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించాలని మంత్రి నిర్మలా సీతారామన్ను వారు ఈ సందర్భంగా కోరారు. -
'దేశానికి హాని చేయాలనుకుంటోంది'
న్యూఢిల్లీ: గోమాంసం నిషేధంతో భారతదేశానికి, సమాజానికి బీజేపీ హానీ చేయాలనుకుంటుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. త్వరలో బక్రీద్ రానున్న నేపథ్యంలో ఇలాగే నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే జైనుల పవిత్ర దినం సందర్భంగా మాంసంపై మహారాష్ట్రలో మాంసం నిషేధించడంపట్ల పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అటు జమ్మూకాశ్మీర్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాల నిషేధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'త్వరలో బక్రీద్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మాంసంపై నిషేధం విధించి ఒకరిని సంతృప్తి పరచడానికి ఇది సరైన సమయం.. సరైనది కూడా కాదు. ఇది వరకే బీజేపీ తాము మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యలకు దిగడం లేదని చెప్పింది. కానీ జైనులు కూడా మైనారిటీలే కదా. అయినా, ఎవరేం తినాలో తినకూడదో అనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చించుకుంటూ ఒక హాస్య వాతావరణం సృష్టించాం' అని ఆయన అన్నారు. -
ధరల అదుపులో కేంద్రం విఫలం
బృందాకారత్ సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జాతీయనాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ విమర్శించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందని, మహిళలకు పౌష్టికాహారం లభించక రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పది వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. పోడుభూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, హైమావతి, ఇందిర, అరుణజ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు. -
జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా బాబూ?
- సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సూటి ప్రశ్నలు దేవీచౌక్ (రాజమండ్రి): ‘గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను పుష్కర స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యం వల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా.. లేక మానసిక స్థితిలో ఏమైనా తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా’ అని సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. రాజ మండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్తో బాధపడ్డారు. సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా నిజాలు నిగ్గుతేలుతాయనే విచారణకు ఆదేశించలేదా అని సీఎంను నిలదీశారు. ఒక్కరు చనిపోయినా విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు. -
కేంద్రం తీరు అప్రజాస్వామికం
నిరసనగా అసెంబ్లీలో ఎంపీ, మాజీ ఎంపీల ధర్నా సాక్షి, హైదరాబాద్: అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, అంజన్కుమార్ యాదవ్, సురేశ్ శేట్కర్, మల్లు రవి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు గాంధీవిగ్రహం దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నించారు. అసెంబ్లీ లోపల గేట్లకు తాళం ఉండటంతో విగ్రహానికి ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... అవినీతిపరులకు కేంద్రం అండగా ఉంటున్నదన్నారు. అవినీతిపరులపై చర్య తీసుకోవాలని కోరిన ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని విమర్శించారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట తరువాత వారిని పోలీసులు అరెస్టు చేశారు. -
సినీతారలతో రైతుల ఆత్మహత్యలకు చెక్!
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సినీ తారలను ప్రచార రంగంలోకి దింపి లబ్ధి పొందడం రివాజే. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు పార్టీకి చెందిన సినీ తారలను రంగంలోకి దింపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతూ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతున్న నేపథ్యంలో ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి సినీ తారలను ఆశ్రయించింది. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే తాము పార్టీకి చెందిన తారలను రైతుల వద్దకు పంపితే తప్పేంటని పాలకపక్ష కాంగ్రెస్ నేతలు బాహటంగానే తమ చర్యను సమర్థించుకుంటున్నారు. కన్నడ సూపర్ స్టార్, పార్టీ మాజీ ఎంపీ రమ్య పార్టీ వ్యూహంలో భాగంగా మాండ్యా జిల్లాలో పర్యటించి రైతులను కలుసుకున్నారు. ఆ జిల్లాలో గత రెండు నెలల్లో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది చెరుకు రైతులే. గతంలో మాండ్యా లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రమ్యకు గ్లామర్ ఎంతున్నా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న కారణంగా గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. చక్కెర మిల్లులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆమె ఆరోపించారు. చెరకు సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ధరను నిర్ణయించకపోవడమూ ఒక కారణమేనని అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం అందించి తన జిల్లా పర్యటనను ముగించారు. ఇప్పుడు ఆమె బాటలోనే మిగతా జిల్లాల్లో పర్యటించేందుకు సినీ తార, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, మరో సినీతార, జవహర్ బాల భవన్ చైర్పర్సన్ భావన సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతుల్లో భరోసా కల్పించేందుకు రేడియా ద్వారా ప్రసంగించినా, స్వయంగా రైతులను కలుసుకున్నా రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, అందుకే సినీ తారలను రంగంలోకి దింపాల్సి వచ్చిందని పేరు వెల్లడించేందుకు ఇష్టం లేని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. -
'ఆ 29మంది మృతికి చంద్రబాబే కారణం'
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ రాజమండ్రి: పుష్కరాల తొలిరోజు ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. క్రైస్తవ శ్మశానవాటిక కోసం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి వచ్చిన సందర్భంగా రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో అరెస్టయిన ఆయన బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. ఘాట్ వద్ద షార్ట్ ఫిల్మ్ తీయడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, అందుకు చంద్రబాబు దోషిగా నిలబడాలని పేర్కొన్నారు. ఓటుకు కోటు ముడుపుల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేకున్నా.. సిగ్గు లేకుండా సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని, మా ఇంటి మహలక్ష్మి అని పేర్లు మార్చి వీటిని తానే ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. పది రోజుల్లోగా క్రైస్తవుల శ్మశాన వాటికకు భూములు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఇతర పార్టీల్లో చేరేందుకే హర్షకుమార్ శ్మశానవాటిక డ్రామా
- వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి ఆల్కాట్తోట (రాజమండ్రి) : ప్రస్తుతం ఏ పార్టీలో లేక ఖాళీగా ఉన్న అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇతర పార్టీల్లో చేరేందుకే క్రైస్తవులకు శ్మశానవాటిక కోసం డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి క్రైస్తవులకు కనీసం శ్మశానవాటిక స్థలాన్ని కూడా కేటాయించలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ముందు గర్జనలు ఏర్పాటుచేసి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు క్రైస్తవుల పేరువాడుకుని శ్మశానవాటిక కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్కు చెందిన రాజీవ్గాంధీ డిగ్రీ కళాశాల ఉన్న స్థలం ఏఈఎల్సీకి చెందినదేనని, దానిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ స్థలంలో ఒక ఎకరాన్ని క్రైస్తవుల శ్మశానవాటిక కేటాయించి, ఆ తరువాత క్రైస్తవుల శ్మశానవాటిక కోసం పోరాటం చేయాలని హితవు పలికారు.పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. -
మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్ష భగ్నం
-
ఎంపీల వేతనాలు 100% పెంపు!
పార్లమెంటరీ కమిటీ సిఫారసులు * రూ. 50 వేలుగా ఉన్న జీతం రెట్టింపు చేయాలి * రూ. 20 వేలుగా ఉన్న పెన్షన్ రూ. 35 వేలకు పెంచాలి * సమావేశాల సమయంలో రోజు వారీ భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలి న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను వంద శాతం పెంచాలని ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. అలాగే.. మాజీ ఎంపీల పెన్షన్ను 75 శాతం పెంచాలని సూచించింది. మాజీ ఎంపీల జీవిత భాగస్వాముల (భార్య లేదా భర్త) స్థానంలో సహచరులకు సదుపాయాలు కల్పించాలని చెప్పింది. పలువురు ఎంపీలు అవివాహితులు లేదా ఇతర కారణాల వల్ల జీవితభాగస్వామి లేకుండా ఒంటరిగా ఉన్నందున.. జీవితభాగస్వామి స్థానంలో సహచరులు అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ. 50,000గా ఉన్న ఎంపీల నెల వారీ వేతనాన్ని రెట్టింపు చేయాలని, ప్రస్తుతం రూ. 20,000గా ఉన్న పెన్షన్ను రూ. 35,000కు పెంచాలని.. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం సూచించింది. పార్లమెంటు సమావేశాల సమయంలో సభలకు హాజరయ్యే ఎంపీలకు ఇచ్చే రోజు వారీ భత్యాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2,000 నుంచి రూ. 4,000కు పెంచాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పిన పలువురు మాజీ ఎంపీలు.. తమకు రైలులో మొదటి తరగతి ప్రయాణానికి టికెట్ ఇచ్చినప్పటికీ.. తమ సహచరులు, తమ జీవిత భాగస్వాములైనా సరే రెండో తరగతిలో ప్రయాణించాల్సి ఉంటుందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీతో పాటు, ఆ ఎంపీ సహచరులు ఒకరికి కూడా మొదటి తరగతి ప్రయాణ టికెట్లు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. సిటింగ్ ఎంపీలు ఏడాదిలో దాదాపు 36 సార్లు ఎగ్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంది. ఎంపీలను కేబినెట్ కార్యదర్శి హోదా కన్నా అధికంగా పరిగణిస్తున్నందున.. వారి విశేషాధికారాలు, సౌకర్యాలు వారి హోదాకు తగ్గట్లుగా ఉండాలని కమిటీ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఎంపీల సంతానంలో వివాహితులకు కూడా ఆరోగ్య పరిరక్షణ ప్రయోజనాలు అందించాలని కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సమావేశాల మినిట్స్లో నమోదైన ఈ సిఫారసుల్లో కొన్నిటిని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మిగతా వాటిని ఈ నెల 13వ తేదీన జరిగే తదుపరి సమావేశంలో ఖరారు చేయటం జరుగుతుంది. స్వతంత్ర వ్యవస్థ నిర్ణయించాలి: సీపీఎం, జేడీ-యూ ఎంపీల జీతభత్యాలను చివరిసారిగా 2010లో సవరించారు. ప్రస్తుత కమిటీ తన సిఫారసులను సమర్పించిన తర్వాత మళ్లీ ఐదేళ్లకు సమీక్షిస్తారు. అయితే.. ఎంపీలు తమంతట తామే తమ జీతభత్యాలను నిర్ణయించరాదని.. ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఆ నిర్ణయాలు తీసుకోవాలని సీపీఎం సభ్యుడు కె.ఎన్.బాలగోపాల్ సూచించారు. జేడీ-యూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే.. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో భారత్ కూడా సభ్యదేశం అయినందున.. ఆ కూటమి లోని మిగతా సభ్యదేశాల్లో ఎంపీలకు సమానంగా భారత ఎంపీల జీతభత్యాలు ఉండాలని మరికొందరు సభ్యులు వాదించారు. -
బైక్ను ఢీకొట్టిన మాజీ ఎంపీ తనయుడి కారు
ముగ్గురికి తీవ్రగాయాలు అతివేగమే ప్రమాదానికి కారణం కోలమూరు(రాజమండ్రిరూరల్) :మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడి కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ మోటరు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోలమూరు గ్రామంలో శనివారం రాత్రి 11గంటలకు జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ద్వితీయ కుమారుడు సుందర్కి చెందిన కారు కోరుకొండ వైపు నుంచి రాజమండ్రి వెళ్తుంది. కోలమూరు గ్రామం వద్దకు వచ్చేసరికి డివైడర్ను ఢీకొట్టి, మళ్లీ కిందకి దిగి, వెంటనే డివైడర్పై నుంచి కోలమూరు వైపు వస్తున్న మోటర్బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుచక్రం విరిగిపోవడంతో వంద మీటర్ల దూరం వెళ్లి ఆగింది. వెంటనే కారులో ఉన్న నలుగురు డోర్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బెక్పై ఉన్న కోలమూరు గ్రామానికి చెందిన చిర్రామహేష్, కొల్లిచంటి, పోసిపో మనోజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్చేసినా సకాలంలో రాకపోవడంతో రాత్రి 01.15గంటలకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొల్లి చంటి తలకు బలమైన గాయం కావడంతో విజయవాడకు తరలించారు. చిర్రా మహేష్ ఫిర్యాదు మేరకు రాజానగరం ఎస్సై దుర్గా శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే కారణం కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడన్న అనుమానాలనూ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉండడంవల్లే డివైడర్పై నుంచి కారు దూసుకువెళ్ళి ఉంటుందని చెబుతున్నారు. కనీసం కారుకు నంబరు లేకపోవడం విశేషం. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అని నంబరు బోర్డులో ఉందే తప్ప ఎటువంటి నంబరు లేదు. కారు వెనుక మాత్రం సుందర్ అనేపేరు ఉంది. దీంతో ఇది హర్షకుమార్ తనయుడి వాహనమని పోలీసులు గుర్తించారు. ప్రాణాలు కాపాడిన బెలూన్లు కారు డివైడర్పైకి దూసుకెళ్లి మొదటి చక్రం విరిగిపోయినా కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడడానికి అందులో ఉన్న బెలూన్లే కారణంగా తెలుస్తోంది. బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్న నలుగురి ప్రాణాలు దక్కాయి. లేకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత కారుకు సంబంధించిన ఎటుంటి ఆదారాలూ దొరక్కుండా అందులోని వారు రికార్డులను పట్టుకు వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి హర్షకుమార్ ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ పరిశీలించి ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి సుధాకర్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరిశీలించి వారికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు సూచించారు. తీవ్ర గాయాలైన కొల్లిచంటిని విజయవాడకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. -
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఆధ్యాయం
వాషింగ్టన్ డీసీ : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో ఓ చీకటి ఆధ్యాయమని రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అభివర్ణించారు. శనివారం యూఎస్ వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలతో శివాజీ సమావేశమయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు... ఆ సమయంలో తాను గడిపిన జైలు జీవితాన్ని శివాజీ ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు ఎన్నారైలకు వివరించారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో న్యాయస్థానాల పరిస్థితి... క్రిమినల్ లా లోని లోపాలు ... పరిపాలన ఎలా పట్టాలు తప్పేందుకు దోహదం చేసిందో ఓ క్రమానుగతంగా యలమంచిలి శివాజీ వివరించారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో పరిస్థితులు మారతాయని భావించానని ఆయన తెలిపారు. అయితే నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు పెద్ద తేడా లేదన్నారు. కొందరు వ్యక్తులు అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నికలో గెలిచి.. అధికారం చేపట్టి పెత్తనం చెలాయిస్తున్నారని యలమంచిలి శివాజీ ఆరోపించారు. అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు శివాజీ జవాబులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హేతువాది ప్రొ. ఇన్నయ్య నరిశెట్టి, మాణిక్య లక్ష్మీ, డాక్టర్ యడ్ల హేమప్రసాద్, జక్కంపూడి సుబ్బారాయుడు, మధు బెల్లం, శ్రీనివాసరావు, జ్యోతి శాఖమూరి, డాక్టర్ నవీనా హేమంత్, రావు లింగాతోపాటు పలువురు ఎన్నారులు పాల్గొన్నారు. 1975 జూన్ 25న అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దేశంలో ఎమర్జెన్సి విధించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యలమంచిలి శివాజీ స్పందించారు. -
పరిస్థితి చక్కదిద్దడంలో గవర్నర్ విఫలం
- గవర్నర్ ఏమీ చేయడంలేదని విమర్శించిన పొన్నం ప్రభాకర్ సాక్షి,తిరుమల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితి చక్కదిద్దటంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచినవారు మరొకపార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారన్నా రు. రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితుల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంద న్నారు. ఇందుకు ఆయా రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు కూడా నేతలకు వత్తాసు పలకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం కూడా జోక్యం చే సుకోకపోవటం దారుణమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేం దుకు ఇద్దరు సీఎంలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. వీరి దూకుడుతో భవిష్యత్ తరా ల్లో వైషమ్యాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీవారి ఆలయ జీయర్లు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వంటి ధార్మిక పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రైతుల ఆత్మహత్యలపై రాజకీయూలా?
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని ఆశించిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం బాధాకరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హమీలో స్పష్టత లేదని ఆరోపించారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై రాజకీయాలు చేయడం టీఆర్ఎస్కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 120 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అధికారికంగా నివేదిక పంపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అంటే ఒక్క మెదక్ జిల్లాయేనా అని అన్నారు. మెదక్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 55 మంది రైతులకు లక్షన్నర చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాలను విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల వివరాలు కేంద్రానికి పంపితే ఎక్కడా పరువు పోతుందోనని.. తెలంగాణ సర్కారు వాస్తవాలను తొక్కిపెట్టడం దారుణమన్నారు. ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ఇంతవరకు అధికార యంత్రాంగం యూక్షన్ప్లాన్, రుణప్రణాళిక తయారు చేయకపోవడం రైతులను విస్మరించడమేనని మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధి పేరిట హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే సరిపోదని.. జిల్లాల్లో అనువుగా ఉండే పరిశ్రమలను నెలకొల్పి తెలంగాణలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు కర్ర రాజశేఖర్, చెన్నాడి అజిత్రావు, ఎర్రోళ్ల రవీందర్, ఉప్పరి రవి, సదానందచారి, గుగ్గిళ్ల శ్రీనివాస్, పొన్నం సత్యం పాల్గొన్నారు. -
జగదీశ్రెడ్డిని బర్తరఫ్ చేయాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంటు వ్యవహారంలో ముడుపులు తీసుకున్న రాష్ట్రమంత్రి జగదీశ్రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి తనకో వేదిక కావాలన్నారు. మంత్రిగా జగదీశ్రెడ్డి పదవిలో కొనసాగుతున్నంత కాలం ఈ కేసు విచారణపై ప్రభావం పడుతుందన్నారు. లోకాయుక్త మూడుసార్లు అడిగినా ప్రభుత్వం ఎందుకు నివేదికను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అనుచితంగా మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు. -
మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ
రూ.5లక్షల సొత్తు మాయం రామచంద్రపురం : ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్న గుర్తించిన దుండగులు లోనికి చొరబడి చోరీకి పాల్పడిన సంఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డులోని శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయం సమీపంలో గల ఇంట్లో మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరిన వీర్రాజు నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంటి వద్ద కాపలాగా ఒక వ్యక్తి ప్రతి రోజు రాత్రి సమయంలో పడుకుంటున్నారు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయం అదే వీధిలో ఉంటున్న ఉప్పలపాటి మాచిరాజు మాజీ ఎంపీపీ వీర్రాజు ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చెల్లా చెదురుగా పడి ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ బి.రవీంద్రనాథ్, ఎస్సై ఎల్.శ్రీనునాయక్లు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. తలుపుల లాక్లను బలవంతగా బద్దలు కొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గమనించారు. ప్రస్తుతం షిర్డీలో ఉన్న వీర్రాజుతో స్థానికులు ఫోన్లో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో సుమారు రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటితో పాటుగా ఇంటి ఆవరణంలో ఉన్న కారును కూడా దొంగలు పట్టుకుపోయారు. కారుతో కలిసి సుమారుగా రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన సొత్తును అపహరణకు గురైనట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీర్రాజు వచ్చిన తరువాత గానీ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుల పూర్తి సమాచారం తెలియదని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యం తాగి ఇంట్లోకి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ నుంచి క్లూస్టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. పట్టణానికి చెందిన గరిగిపాటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూరల్ అధ్యక్షునిగా ‘పప్పల'
- అర్బన్ జిల్లా అధ్యక్షునిగా వాసుపల్లి - ప్రకటించిన టీడీపీ అధిష్టానం సాక్షి, విశాఖపట్నం: టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవి మాజీ ఎంపీ పప్పల చలపతిరావును వరించింది. ఐదు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు అధిష్టానం తెరదించింది. అర్బన్ జిల్లా అధ్యక్షునిగా వాసుపల్లి గణేష్ కుమార్,రూరల్జిల్లా అధ్యక్షునిగా చలపతిరావును ఖరారు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం గురువారం రాత్రి ప్రకటించింది. అర్బన్, జిల్లా కమిటీ లను ప్రకటిం చలేదు. రెండుచోట్ల కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవుల ఎంపిక విషయంలో ఏకాభి ప్రాయం కుదరకపోవడం వలనే కమిటీ ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కమిటీల కోసం ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు రోజంతా చర్చోపచర్చలుసాగించినా మంత్రులు,ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. చివరకు నిర్ణయాధికారాన్ని అధిష్టానం చేతుల్లో పెట్టేశారు. అధిష్టానం కూడా గత ఐదురోజులుగా నాన్చుతూ చివరకు గురువారంరాత్రి అధికారకంగా ప్రకటించింది. రూరల్ అధ్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడ్నిని కొనసాగించాలని అయ్యన్న, వద్దంటూ గంటా పట్టుబట్టారు. గంటా వర్గానికి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస రావు, ఆడారి ఆనంద్, లా లంభాస్కర్ల పేర్లను ప్రతిపాదించినా అయ్యన్న వర్గీయులు ససేమిరా అనడంతో చివరకు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు పరిశీలనకువచ్చింది. ఇ రువురు మంత్రులతో అధినేత చంద్రబాబు చర్చించిన తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మధ్యేమార్గంగా చలపతిరావు పేరును ఖరారుచేసింది. -
కాంగ్రెస్ మాజీ ఎంపీకి జైలు
సాక్షి, చెన్నై :చెక్ బౌన్స్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఇరా అన్భరసుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ జార్జ్ టౌన్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. చెన్నైకు చెందిన ఫైనాన్సియర్ ముకుల్ సన్ గోత్రా 2007లో జార్జ్ టౌన్ కోర్టులో చెక్ బౌన్ కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ గాంధి ట్రస్ట్ నిర్వాహకులు, మాజీ ఎంపి ఇరా అన్భరసు, ఆయన భార్య కమల, ఓ థియేటర్ ప్రతినిధి మణిలు తన వద్ద రూ. 35 లక్షలు తీసుకున్నారని వివరించారు. తనకు చెక్ ఇచ్చారని, అయితే, అది బౌన్స్ అయిందని పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన మొత్తం కోసం పలు మార్లు వారి చుట్టు తిరిగినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను గత ఏడేళ్లుగా జార్జ్ టౌన్ ఎనిమిదో మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తూ వచ్చింది. విచారణ ముగియడంతో న్యాయమూర్తి కోదండ రాజ్ గురువారం తీర్పు వెలువరించారు. అన్భరసు , ఆయన భార్య కమల, మణిలపై చెక్ బౌన్స్ కేసు నిరూపితం కావడంతో తలా రెండేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే, రూ. 35 లక్షలకు గాను 2006 నుంచి ఏడాదికి తొమ్మిది శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించారు. -
రాథోడ్ ఒంటెద్దు పోకడలతో అన్యాయం
ఖానాపూర్ : టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఒంటెద్దు పోకడలతో పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ ఆకుల శోభారాణి, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, సత్తన్పల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆమంద శ్రీనివాస్లు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీ నివాసంలో ఏర్పాటు చేసిన అనుచరులు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. గత 15ఏళ్లుగా పార్టీకి ఎన్నోసేవలు చేసి న తమను విస్మరించారన్నారు. గతంలో అనేక మార్లు కార్యకర్తలు, నాయకులు ప్రజాభిష్టం మేరకు పార్టీ వీడుదామని సూచించినా తమ ఆవేదనను పెడచెవిన పెట్టి ఒంటెద్దు పోకడగా వ్యవహరించారన్నారు. తెలంగాణ వేరుగా మా రిన తరుణంలో ఇంకా సీమాంధ్ర పార్టీలు మనకెందుకని ప్రజలు, కార్యకర్తలు తమను అనేకసార్లు నిలదీశారన్నారు. గతంలో సర్పంచ్, ఎం పీటీసీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని సర్వేలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ సరైననిర్ణయం తీసుకోవడంలో రాథోడ్ విఫలమయ్యారని విమర్శించారు. దీంతో పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏనాడు కూడా రాజకీయ, ఆర్థిక లబ్ధిచేకూరకపోవగా, పార్టీ తర ఫున పోటీ చేసిన వారంతా రూ.లక్షలు నష్టపోయారన్నారు. దీంతో జిల్లాలో టీడీపీకి ఎంపీ, ఎమ్మెల్యేలు, సహా ఏ పదవి దక్కలేదని, చివర కు తెలంగాణలోనూ ప్రతిపక్ష హోదాను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీపీగా పోటీ చేసేందుకు క్యాంపులో రూ.లక్షలు వెచ్చించిన పార్టీనుంచి చిల్లిగవ్వ ఇవ్వలేదని ఎంపీపీ వాపోయూరు. కేవలం సొంత ఖర్చు, వ్యక్తిగత చరిస్మాతోనే గెలుపొందామన్నారు. తాము పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓటేయించిన ఘనత ఆయనకే జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో సొంత పార్టీ జెడ్పీటీసీ సభ్యులతో ప్రతిపక్ష పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికకు ఓటేయించిన ఘనత రాథోడ్ రమేశ్కే దక్కుతుందని మాజీ జెడ్పీటీసీ రామునాయక్ ఆరోపించారు. పార్టీలో ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్లను ఎదగనివ్వకుండా ఎంతోమందిని పక్కనపెట్టి తమ కంటే పార్టీలో చిన్న వయస్సున్న, తన కొడుకు రిథీశ్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కుటుంబ పాలనకు తెరలేపారన్నారు. రాథోడ్ రమేశ్ తీరుతోనే జిల్లాలో టీడీపీకి సైతం నష్టం వాటిల్లిందన్నారు. గతంలో మాజీ ఎంపీ అన్నమాటలను గుర్తు చేస్తూ తాను మాత్రం కోట్లకు పడగలెత్తినా ఏనాడు నాయకులు పల్లెత్తుమాట అనలేదని, పార్టీ నాయకులు ఇల్లు నిర్మించుకుంటే మాత్రం పార్టీలో ఉండి లబ్ధిపొందాడనడం సరికాదన్నారు. విద్యా సంస్థలు, వివిధ కంపెనీలు పెడుతున్నాడని, గత ఎన్నికల్లో సైతం ఇప్పటివరకు తాను, తన కుటుంబం అన్నివిధాల అభివృద్ధి చెందానని, ఇకపై కార్యకర్తల అభివృద్ధికి కృషిచేస్తానని రాథోడ్ స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాథోడ్ కుటుంబకోసం తాము ఇతర పార్టీల వారందరితో శత్రువులమయ్యామన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలోను తనను వేదికపైకి పిలవకుండా అవమానించి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ పార్టీకి వెళ్లినా ఆ పార్టీని వెన్నంటే ఉంటూ , పార్టీ సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. తాను ఎన్నికల్లో పోటీచేసినపుడు మన పార్టీకి చెందిన వారే ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్న విషయం రాథోడ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సత్తన్పల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆమంద శ్రీనివాస్ అన్నారు. త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వందమంది వరకు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన వారిలో ఖానాపూర్ ఎంపీపీతోపాటు టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, సత్తన్పల్లి పీఏసీఎస్ చైర్మన్, ఖానాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముజీబ్, మస్కాపూర్ సర్పంచ్ గుగ్లావత్ రాజేశ్వరి, లక్ష్మణ్, ఉపసర్పంచ్ లు కొడిమ్యాల వీరేశ్, గణేశ్, టీడీపీ యవత మండల అధ్యక్షుడు షబ్బీర్పాషా, పట్టణ అధ్యక్షుడు గోడాపురం సందీప్, వార్డు సభ్యులు సల్ల చంద్రహస్, గోడాపురం గంగాధర్, నారపాక నర్సవ్వ, నర్సయ్య, పోశెట్టి, డెరైక్టర్లు మాన్క శ్రీనివాస్, బక్కన్న, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్లు మేకర్తి సత్యనారాయణ, చిన్నరాజన్న, నాయకులు గౌరికార్ రాజు, జనార్దన్, రాజేశ్వర్,రమేశ్, అశోక్, లక్ష్మిరాజం, శ్రీనివాస్ తదితరులున్నారు. -
మాజీ ఎంపీకి కన్నీటి వీడ్కోలు
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని శ్మశాన వాటికకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి.రాంచంద్రారెడ్డి మధుసూదన్రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర మంత్రులు, తదితరులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి, బోథ్, ముథోల్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డిలతో పాటు ఆయన అభిమానులు, బంధువుల, రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీఆర్ఆర్, కార్యకర్తలు, బీజేపీ నాయకుడు పాయల శంకర్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రామారావు తదితరులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
కోర్టుకు హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ (నకిరేకల్): తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం సాయంత్రం నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించినందున అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి గురువారం సూర్యాపేట కోర్టులో కేసు వేశారు. శుక్రవారం సూర్యాపేట కోర్టులో జడ్జి లేకపోవడంతో దానికి సంబంధించిన వాగ్మూలం ఇవ్వడానికి నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. -
లక్ష ఓట్ల మెజారిటీతో ‘చింతా’కు గుణపాఠం
హోం మంత్రి చిన్న రాజప్ప భవానీనగర్లో రోడ్ షో సుగుణమ్మను గెలిపించాలని విజ్ఞప్తి తిరుపతి మంగళం: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి మాజీ ఎంపీ చింతామోహన్కు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చిన్న రాజప్ప పిలుపునిచ్చారు. భవానీనగర్లో సోమవారం పార్టీ నాయకుడు మునిశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, హోంమంత్రి చిన్న రాజప్ప రోడ్ షో నిర్వహించారు. నగర పరిధిలోని రాయల్నగర్లో టీ డీపీ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్ళపల్లె సుధారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న రాజప్ప మాట్లాడుతూ కేవలం చింతా మోహన్ స్వార్థం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవత్వంతో ఉపఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. భర్త ఆశయాల కోసం ఎన్నిక ల్లో పోటీచేస్తున్న సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్లు మెజారీటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మం త్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత మాట్లాడుతూ చింతా మోహన్ స్వార్ధం కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తూ పేదల సంక్షేమం కోసమే నిరంతరం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడం దారుణమన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కమలాపురం ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ !
హైదరాబాద్: పంజాగుట్టలో మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు మంగళవారం అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. మీల్స్ పార్శిల్ విషయంపై హోటల్ సిబ్బందితో అతనికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం సీసాలతో అతడు హోటల్ సిబ్బందిపై దాడికి యత్నించినట్టు సమాచారం. దాంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. దాంతో మాజీ ఎంపీ తనయుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
మద్యం మత్తులో ఓ మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ !
-
ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్ : చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు దగాకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్లను గుర్తించి స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) పేరుతో క్యూబిక్ మీటరు రూ.620 ప్రకారం అమ్మకాలు చేస్తుండంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతోందన్నారు. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక రూ.1600 నుంచి 1,700గానూ, టిప్పర్ ఇసుక రూ.5 వేల లోపు లభించే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం వల్ల ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి రావాలంటే రూ.4 నుంచి రూ.4,500 గానూ టిప్పర్ ఇసుక అయితే రూ.10 నుంచి రూ.11 వేలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్క పరిగణలోకి తీసుకుంటే కిలో ఇసుక రూ.1 ప్రకారం అమ్ముతున్నారన్నారు. మరోపక్క కొందరు అధికార పార్టీ నాయకులు మాఫీయాగా ఏర్పడి ఇసుకను పక్క జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తూ రోజుకు రూ.8 నుంచి 10 లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో సారాయి మంచి ఆదాయ వనరుగా చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇసుకపై దృష్టి సారించారని విమర్శించారు. టీడీపీ అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల ట్రాక్టర్లు కొన్న రైతులు ఎక్కడైనా మట్టి లేదా ఇసుకను తరలించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రెండు మూడు నెలల పాటు వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు ఆ తరువాత ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. కనీసం కంతులు కట్టడానికి కూడా అవకావం లేకుండా పోయిందన్నారు. మరోపక్క కూలీలకు కూడా ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఇక రైతులు, మహిళల కష్టాలు ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం కాగానే ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయకుండా దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల రుణాలు రూ.6 వేల కోట్లకు పైగా ఉండగా తొలివిడత అంటూ రూ.780 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వడ్డీమీద వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని నెత్తిన వేస్తే తీసుకున్న రుణాలకు చంద్రబాబు చేసిన మాఫీ వడ్డీకి సరిపోయే పరిస్థితి లేదన్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా డ్రిప్ ఇవ్వకుండా ప్రచారంలో మాత్రం అంత ఇంత అంటూ చెబుతున్నారని మండిపడ్డారు. 2013-14కు సంబంధించి రూ.643 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, రూ.227 కోట్ల వాతావరణ బీమా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ నేపథ్యంలో ఈఏడాది పంట పూర్తిగా దెబ్బతిన్నా వాతావరణ బీమా కింద పైసా రాని దుస్థితి కల్పించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరాకు పంట నష్టానికి రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మరచిపోయారన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పూర్తీగా నిరుగార్చేశారన్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరుబాట చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అన్ని పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించినట్లు తెలిపారు. -
పురందేశ్వరి ప్రతిభను ఎన్టీఆర్ గుర్తించలేకపోయారు
* మాజీ ఎంపీ లగడపాటి పావగడ : ‘కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిభను ఆమె తండ్రి ఎన్టీ రామారావు గుర్తించలేకపోయారు. గుర్తించి ఉంటే ఆమె త ప్పకుండా ముఖ్యమం త్రి అయ్యేవారు’ అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన కర్ణాటకలోని పావగడ పట్టణంలో కమ్మ హాస్టల్ వద్ద బాలికల వసతినిలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత వేదికలపై మాట్లాడడం ఇదే మొదటి సారని, అందులోనూ కార్యక్రమ నిర్వాహకుల ఒత్తిడి మేరకు మాట్లాడుతున్నానని చెప్పారు. రాజకీయాల గురించి అసలు మాట్లాడనని చెబుతూనే.. పురందేశ్వరిపై పొగడ్తల వ ర్షం కురిపించారు. ‘ఈమెకు ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నాయి. ఎన్టీఆర్ ఎం దుకో గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఎంతోమంది సీఎంలు అవుతున్నారు. ఆ పదవికి పురందేశ్వరి అన్ని విధాలా అర్హురాలు’ అని అన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగు వాళ్లను మద్రాసీలుగా భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. కులాభిమానం ఉండాలని.. దురభిమానం ఉండకూడదని ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. కులమత భేదం లేకుండా విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, మాజీ మంత్రి సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్సీ ఉగ్రప్ప, ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, కమ్మసంఘం నాయకులు డాక్టర్ వెంకటరామయ్య, డీసీ రామాంజనేయులు, ఎంపీ చంద్రప్ప, చన్నిగప్ప, ప్రత్తిపాటి ఆంజనేయులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం ఐక్య పోరాటం
కొప్పళ మాజీ ఎంపీ విరుపాక్షప్ప హొళగుంద: హక్కుల కోసం కురవలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కర్ణాటక రాష్ట్రం కొప్పళ మాజీ ఎంపీ విరుపాక్షప్ప పిలుపునిచ్చారు. శనివారం హొళగుందలో కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కాళికప్రసాద్ ఆధ్వర్యంలో భక్త కనకదాసు 327వ జయంతిని నిర్వహించారు. భీరప్ప గుడి నుంచి కనకదాసు చిత్ర పటంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కురువలు బీరప్ప డోళ్లు వాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విరుపాక్షప్ప మాట్లాడుతూ..మూఢ నమ్మకాలను వీడి పిల్లలను చదివించాలన్నారు. దేశంలో 12 శాతం ఉన్న కురువలు ఆది నుంచి అన్యాయానికి గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కురువలకు ఉన్న గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో దొరకకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, గడ్డం రామకిృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గంగమ్మ, సుం కన్న, నాగన్న, దేవరగట్టు మాజీ చైర్మన్ ముద్దుబసవనగౌడ్, మాజీ సర్పంచ్ పంపన్నగౌడ్, శేషగిరి పాల్గొన్నారు. -
'ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి కష్టాలతో రాయలసీమ అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్ర బాబు ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు. కండబలం ఉన్న వారే తాగునీరు తీసుకువెళ్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని ప్రశ్నించారు. సీమ ప్రయోజనాలను వదిలి నాగార్జునసాగర్, పులిచింతలకు 80 క్యూసెక్కుల నీరు ఎలా ఇస్తారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలె చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అనంత ఎద్దేవా చేశారు. -
ఐఏపీ పనులకు రాజకీయ గ్రహణం
- రూ.4.66 కోట్ల పనులు రద్దు - జాబితాలో 13 ఆర్వైఎఫ్సీలు - మాజీ ఎంపీ ప్రతిపాదనలకు చెక్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వెనుకబడిన జిల్లాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఐఏపీ నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన జిల్లాలకు ఏటా రూ.30 కోట్లు విడుదల చేసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, అక్కడి యువత పెడదోవ పట్టకుండా ఉపయుక్తమయ్యే నిర్మాణాత్మక పనులకు ఈ నిధులను వెచ్చించాలి. 2012-13 సంవత్సరం విడుదలైన నిధులతో జిల్లాలోని 23 మండలాల్లో రీడింగ్ రూమ్, జిమ్ సదుపాయముండే రాజీవ్ యూత్ ఫెసిలిటేషన్ సెంటర్లు (ఆర్వైఎఫ్సీ) నిర్మించాలని ప్రతిపాదించారు. ఒక్కో సెంటర్కు రూ.20 లక్షల అంచనా వ్యయంతో రూ.4.60 కోట్లతో పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ బాధ్యతలను ఏపీఈడబ్ల్యుడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు అప్పగించారు. కానీ కేటాయించిన నిధులు సరిపోవని ఈ పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రయోగాత్మకంగా బెజ్జంకి మండలంలో ఏపీఈడబ్ల్యుఐడీసీ శాఖాపరంగా మొత్తం రూ.28 లక్షల ఖర్చుతో ఆర్వైఎఫ్సీ నిర్మాణం పూర్తి చేసింది. అందుకే ఒక్కో ఆర్వైఎఫ్సీకి రూ.32 లక్షలు కేటాయించేలా అంచనా ప్రతిపాదనలను సవరించాలని కోరుతూ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు నివేదించారు. అదే సమయంలో ఆర్వైఎఫ్సీలకు అవసరమైనన్ని నిధులు కేటాయించి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్లో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ కలెక్టర్కు లేఖ రాశారు. ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమైన జిల్లా స్థాయి కమిటీ ఈఈ నివేదిక, ఎంపీ లేఖను పరిగణనలోకి తీసుకుంది. 22 ఆర్వైఎఫ్సీలకు బదులు 13 కేంద్రాలు నిర్మించాలని, ఒక్కో సెంటర్కు రూ.32 లక్షలు కేటాయించాలని తీర్మానించింది. ఆ మేరకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, ముస్తాబాద్, కథలాపూర్, గంగాధర, మేడిపల్లి, మానకొండూర్, హుజూరాబాద్ మండలం చెల్పూరు, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, చొప్పదండి, జమ్మికుంట మండలం కొత్తపల్లి, గంభీరావుపేట, రామడుగు ఆర్వైఎఫ్సీల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వరుసగా వచ్చిన ఎన్నికలు, ఫలితాల వెల్లడి అనంతరం కథ మొదటికొచ్చింది. ఈ 13 మండలాలకు మంజూరు చేసిన ఆర్వైఎఫ్సీలతో పాటు మహదేవ్పూర్ మండలానికి మంజూరైన ప్రభుత్వ ఎస్టీ హాస్టల్, కాటారం లైబ్రరీ కమ్యూనిటీ బిల్డింగ్ను రద్దు చేస్తూ మే 21న జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రూ.4.66 కోట్ల పనులు రద్దు చేసింది. స్థలం సమస్య కారణంగా ఎస్టీ హాస్టల్, కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదని, మిగతా ఆర్వైఎఫ్సీ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని అందులో ప్రస్తావించింది. ఐఏపీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.30 కోట్లలో రూ.20 కోట్లు విడుదలయ్యాయి. మూడో విడత రూ.10 కోట్లు ఇప్పటివరకు రాలేదు. అవి చేజారిపోయినట్లే. ఇప్పటికే ఐఏపీలో రూ.30.57 కోట్ల అంచనా వ్యయమయ్యే 222 పనులు కలెక్టర్ మంజూరీ చేశారు. నిధులతో పోలిస్తే రూ.10.57 కోట్లు అదనంగా పనులు మంజూరయ్యాయి. దీంతో బిల్లుల చెల్లింపు కష్టమవుతుందని, అందుకే ఇప్పటివరకు ప్రారంభం కాని ఈ పనులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ.. కొత్తగా కొలువు దీరిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే ఈ పనులను జిల్లా యంత్రాంగం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన పనులు చేపడితే వారికే గుర్తింపు వస్తుందని, అందుకే ఈ పనులపై తాజా ప్రజాప్రతినిధులు కన్నెర్ర జేసినట్లు గుప్పుమంది. -
అధికార నివాసాలు ఖాళీ చేయండి
మాజీ ఎంపీలకు పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంపీలు వచ్చే నెల 18లోగా ఢిల్లీలోని తమ అధికార నివాసాలను ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు జారీచేసింది. పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలని కోరింది. 15వ లోక్సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవడంతో నెల రోజుల్లోగా ఎంపీలు తమ అధికార నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఎంపీలకు కేటాయించిన ఫోన్, ఇంటర్నెట్ సహా ఇతర సౌకర్యాలను తొలగించారు. జూన్ 18 తర్వాత అధికారిక నివాసాలను ఖాళీ చేయని ఎంపీలు నెలకు అన్ని ఖర్చులను కలుపుకొని సుమారు రూ.1.50 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీలు కొందరు తమ పాత బకాయిలను చెల్లించి, సామగ్రిని తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. -
బాబు పచ్చి అవకాశవాది
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది అని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వినోద్కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా జాతీయస్థాయిలో చక్రం తిప్పినట్టుగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణ విషయం వచ్చేసరికి అవకాశవాదంతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగుజాతి అంటే 13 సీమాంధ్ర జిల్లాలేనా లేకుంటే 23 జిల్లాలతో కూడినదో.. చంద్రబాబు చెప్పాలన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే అని చంద్రబాబు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని వినోద్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైతే సీమాంధ్రకు వచ్చే నష్టం ఏమిటో ఈ నెలరోజుల్లో ఎవరూ స్పష్టంగా చెప్పలేదన్నారు. హైదరాబాద్ ఆదాయం గురించి కూడా అసత్య, అర్ధ సమాచారంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయని అన్నారు. చంద్రబాబు తాత పుట్టకముందే దేశంలోని అభివృద్ధి చెందిన ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నాలుగోస్థానంలో ఉందని, ఇదే విషయాన్ని బ్రిటీషు ప్రభుత్వం కూడా చెప్పిందని వినోద్కుమార్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో అవకాశంతోనో, అదృష్టంతోనో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికే హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. అన్ని రాజకీయపార్టీల అధినేతలు విజ్ఞతతో వ్యవహరించాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. తెలంగాణ లేకుంటే సీమాంధ్ర బతకదా అని వినోద్ ప్రశ్నించారు. -
సెప్టెంబర్ 6న కరీంనగర్లో టిఆర్ఎస్ బహిరంగ సభ
ఢిల్లీ: సెప్టెంబర్ 6న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. లక్షలాది మందితో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ఎన్జీవోలు స్పష్టంగా సమస్యలు చెప్పలేకపోతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమం తమ ఇబ్బందులు చెప్పడంలో విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మందా జగన్నాధం మాట్లాడుతూ హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్థాంతాన్ని మళ్లీ మొదలుపెట్టారని కడియం శ్రీహరి విమర్శిచారు. చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. -
అశ్రునయనాలతో లాల్జాన్కు తుదివీడ్కోలు
సాక్షి, గుంటూరు: నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్జాన్బాషా అంత్యక్రియలు శుక్రవారం గుంటూరులో జరిగాయి. బి.ఆర్.స్టేడియంలో ఉంచిన ఆయన భౌతికకాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పలువురు నేత లు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు. స్థానిక ఆనందపేటలోని లాల్జాన్బాషా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ను ఓదార్చారు. బాషా జనాజాను కొంతదూరం మోశారు. బాషా మృతదేహానికి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నారాయణ, సుజనాచౌదరి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి, ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, నన్నపనేని రాజకుమారి, సలీం, లక్ష్మణరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, నూర్బాషా సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చమన్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. బాషా అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.