G. Kishan Reddy
-
బిలియన్ కోల్ ఫీట్.. భారత్కు ఇది గర్వకారణం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో భారత్ ఒక బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పర్యావరణానికి హాని చేయకుండానే బొగ్గు ఉత్పత్తిని పెంచగలిగామని చెప్పారాయన... పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్గా భారత్ ఎదుగుతోంది అని కిషన్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ.. ఎనర్జీ అవసరాలను తీర్చడానికి మన సొంత కాళ్లపై నిలబడుతున్నామని చెప్పారు. కరెంట్ ఉత్పత్తితో పాటు వివిధ ఫ్యాక్టరీలలో బొగ్గును వాడతారన్నది తెలిసిందే. 2023–24 లో 99.78 కోట్ల టన్నుల బొగ్గును ఇండియా ఉత్పత్తి చేయగా, 2024–25 లో 108 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది. -
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
Union Minister G Kishan Reddy: కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్లో ఎన్నికలు
ఆర్ఎస్పురా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్లో ఎన్నికలు జరుగుతా యని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే బీజేపీకే అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లయిన సందర్భంగా సోమవారం జమ్మూ శివారులోని బానా సింగ్ స్టేడియంలో మహోత్సవ్’ ర్యాలీనుద్దేశించిమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు. రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు ‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్రెడ్డి చెప్పారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
ఇప్పుడైనా సర్దుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురితో విడిగా భేటీ రాష్ట్ర కోర్కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ను వేచి ఉండాలని అమిత్ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్ ఆధారంగానే అమిత్ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వారికి గట్టిగానే క్లాస్ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్ షా క్లాసుతోనైనా లోక్సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
‘షా’ రొస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా సన్నాహాలకు బీజేపీ తెరలేపింది. ఈ నెల 28న నగర శివారు కొంగరకలాన్లోని శ్లోక ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న లోక్సభ సన్నాహక సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్షా హాజరవుతున్నారు. పార్టీ మండల అధ్యక్షులు మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాయకుల వరకు హాజరయ్యే ఈ భేటీలో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని ఆహ్వనిస్తున్నారు. మొత్తంగా రెండున్నరవేల మంది వరకు నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులంతా హాజరుకావడం ద్వారా లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో స్పష్టత ప్రధానంగా ఏయే అంశాల ప్రాతిపదికన ప్రజల వద్దకు వెళ్లాలి, లోక్సభ ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏయే అంశాలు ప్రస్తావించాలి, మోదీ సర్కార్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాలపై ఏ విధంగా ప్రచారం నిర్వహించాలన్న దానిపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్లో జరగగా, ఈసారి అంతకంటే ముందుగా మార్చి చివరిలోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం ద్వారా మంచి ఫలితాలు (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్లకు బదులు 10 వరకు గెలిచి.. సీట్లు పెంచుకోవాలనే లక్ష్యంతో జాతీయ నాయకత్వం ఉంది) సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ భేటీ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలపైనా విశ్లేషించవచ్చని చెబుతున్నారు. లోక్సభ ఇన్చార్జిల నియామకంపై కసరత్తు రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పార్టీపరంగా లోక్సభ ఇన్చార్జిల నియామకం (17 మంది సంస్థాగతంగా ఫుల్టైమర్స్కు అదనం)తో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వర్కింగ్ టీమ్ నియామకంపై కూడా ఈ భేటీలో కసరత్తు జరుగనుందని పార్టీ నేతల సమాచారం. ఇటీవల కొత్తగా గెలిచిన 8మంది ఎమ్మెల్యేలతో అమిత్షా ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు... భారతీయ జనతా శాసనసభాపక్షం (బీజేఎల్పి)నేత ఎన్నిక కూడా అదే రోజు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచిన టి.రాజాసింగ్, రెండుసార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్రెడ్డి, కేసీఆర్, రేవంత్రెడ్డిలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిల్లో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో... పార్టీపరంగా లోక్సభకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, సన్నాహకాలపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బంగారు శ్రుతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్తో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సమీక్షించారు. -
బీఆర్ఎస్ అవినీతికి పాతరేద్దాం
గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్హౌస్కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల ఈ ఎన్నికల్లో గజ్వేల్లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్కు ఓటమి తప్పదని కిషన్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. గజ్వేల్ రోడ్షోలో ప్రసంగిస్తున్న కిషన్రెడ్డి. చిత్రంలో ఈటల -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. -
కొడుకును సీఎం చేయడంపైనే ధ్యాస
సాక్షి, హైదరాబాద్: తన కొడుకును సీఎం చేయడం తప్ప తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా సీఎం కేసీఆర్ తీరుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన రైతుసదస్సులో కిషన్రెడ్డి మాట్లా డారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్ పేరుతో రూ.30 వేల కోట్ల బడ్జెట్ను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డా రు. అయినా ఆ ప్రాజెక్టుకు ఫీజబిలిటి లేదని, కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.57 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఒక్క పంపు హౌజ్ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారు: బండి నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో సీఎంవో రూ. 500 కోట్లు దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేసీఆర్ నిర్వాకంవల్ల రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల సంస్థను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. థ్యాంక్స్ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలతాయా?’అని అన్నారు. వారికి స్థానం లేదు: కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి ‘భారత్ మాతా కీ జై.. వందే మాతరం అనని వారికి ఈ దేశంలో స్థానం లేదు. పాకిస్తాన్ జిందాబాద్ అనే వారు అక్కడికి వెళ్లొచ్చు’అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వచ్చే కొద్దిపాటి కరెంటు కూడా ట్రిప్ అయి వస్తోందని చెప్పారు. ‘గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో దోచుకోవాలని చూస్తోంది. ఇది ఘమండి, ఘట్ బంధన్ కూటమి’అని మండిపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ, దుర్మార్గపు ప్రభుత్వం పోవాలని మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అభి ప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్ని కల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామన్నారు. తాము ఎన్నికలకు పూర్తిస్థా యిలో సిద్ధంగా ఉన్నామని, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని, తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి, రాష్ట్ర ఎన్ని కల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ల సమక్షంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేత డి.వసంతకుమార్ (ఢిల్లీ వసంత్), జైపాల్రెడ్డి, పాపయ్య, స్లీవెన్సన్, జహంగీర్, విఠల్, కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్ నేత లక్కి రెడ్డి సురేందర్, లక్కి రెడ్డి సాయి, చీమల లక్ష్మీనారా యణ, బాలాజీ నాయక్, బానోత్ పంతూనాయక్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ హనుమ ఫలాన్ని అందించగా ఈ ‘హనుమఫలమే.. బీజేపీ విజయఫల’మని అన్నారు. మీడియాతో మాట్లా డుతూ ’’మోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలు న్నాయి.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50 రోజులు మేమంతా ఐకమత్యంతో కష్టపడి పనిచేస్తాం. పార్టీని అధికారా నికి తీసుకొస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. 2, 3 స్థానాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ ఇటీవల ప్రధాని రెండు బహిరంగసభల తర్వాత రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని, 2,3 స్థానాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఆదిలాబాద్ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారని, సాయంత్రం నగరంలోని ఇంపీరియల్ గార్డెన్స్లో.. మేధావులు, విద్యా వంతులనుద్దేశించి ఆయన మాట్లాడతారని తెలిపారు. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
అమరవీరుల స్తూపం నుంచి బీజేపీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ గన్పార్క్లోని అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల యం వరకు ర్యాలీ జరిపారు. మొదటగా అమరవీరులకు నివాళులర్పించి, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్కుమార్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జయసుధ, ఆకుల విజయ, బండా కార్తీకరెడ్డి, రాణీరుద్రమ ఇతర నాయకులు, కార్యకర్తలు వెంటనడిచారు. ఈ సందర్భంగా ఎటు చూసినా కాషాయ జెండా పట్టుకుని జయహో మోదీ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక సందర్భమని కిషన్రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. ‘సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్నగర్–వి.చంద్రశేఖర్, నాగర్కర్నూల్– ఎడ్ల ఆశోక్రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్కుమార్గౌడ్. -
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగానే: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉంటాయనే భ్రమల్లో ఎవరూ ఉండొద్దని.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగానే జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నాయకులు, కార్య కర్తల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య స్నేహం లేదని, ఉండబోదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో మార్పు కనిపిస్తోంది.. గతంలో తాను ఉమ్మడి ఏపీ బీజేపీ ఇన్చార్జిగా ఉన్నప్పటికి, ఇప్పుడున్న పార్టీకి ఎంతో మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఆర్ఎస్పై పోరాడి కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదల బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని.. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వివిధ అంశాలపై ఆందోళనలు, నిరసనలు పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేర కు.. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి 14న ఉదయం వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపడతారు. 15వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. అదే రోజున కిషన్రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీ చేపట్టి.. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 17న ఉదయం హైదరాబాద్ విమోచన దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్బూ త్ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ రోజున పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం, బహిరంగ సభ నిర్వహి స్తారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ భేటీలో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, మురళీధర్రావు, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, ఎం.రవీంద్రనాయక్, బూర నర్సయ్యగౌడ్, జి. విజయరామారావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. మూడు రథయాత్రలు.. మోదీ సభ.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మూడు వైపుల నుంచి మూడు జోన్లుగా రథయాత్ర (బస్సుయాత్ర)లను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కొమురంభీం పేరిట బాసర నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో) ఒక యాత్ర.. కృష్ణా యాత్ర పేరిట సోమశిల నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు) మరో యాత్ర.. గోదావరి పేరిట భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు) మరోయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మూడు యాత్రలు కూడా చివరిలో రంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు చేరుకుంటాయి. మొత్తం 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్రలు సాగనున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలైన కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లేదా బండి సంజయ్ల ఆధ్వర్యంలో ఇవి సాగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 14న హైదరాబాద్లో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభతో ఈ యాత్రలను ముగించాలని పదాధికారుల భేటీలో నిర్ణయించారు. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారని కిషన్రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు. గతంలోనే కిషన్రెడ్డి రిపోర్ట్ కార్డ్ హైదరాబాద్లో గత జూన్ 17న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్పాయింట్, డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్ నేత డా.ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 17లోగా అవగాహన కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్రెడ్డి సూచించారు. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్బ్యాక్కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్షాపులో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవలేదు.. భవిష్యత్లో కలవబోదు.’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
దూద్బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్ నగరంలో నేషనల్ సైన్స్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైటెక్ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్ హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్ను ప్రారంభించనున్నామన్నారు. తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జాన్వీ శర్మతో పాటు వినయ్ కుమార్ మిశ్రా, చంద్రకాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
25న డబుల్ ఇళ్ల కోసం ధర్నా
కాచిగూడ/సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ కేసీఆర్ను గద్దె దించడం, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించడం కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, శ్యామ్సుందర్ గౌడ్, నాగూరావు నామాజీ, కేశబోయిన శ్రీధర్, కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారమేశ్ యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇళ్ల అంశంపైనే కిషన్రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ఒక్కో జిల్లానుంచి ఐదువేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లబి్ధదారులకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను ఇవ్వాలనుకోడం సరికాదని, ముందుగా అక్కడి స్థానికులకే ఇళ్లు కేటాయించాలని, తర్వాతే ఇతర ప్రాంతవాసులకు ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇళ్ల సమస్యపై ఆందోళన తర్వాత రేషన్కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలపై కూడా వరుస ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
కిషన్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్షిప్ అవార్డు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్షిప్ అవార్డు’ వరించింది. భారత్–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్–టు–పీపుల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను అందిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు. -
అల్లూరి పోరాటం దేశానికి స్ఫూర్తిదాయకం
బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, ఆయన దేశభక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి అతి చిన్న వయస్సులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే మనమంతా ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి తొలుత అల్లూరి ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి అర్పించారు. మన్యంలోని గిరిజనులకు ఇళ్లు కట్టించిన పద్మశ్రీ ఏవీఎస్ రాజు, అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ఇచ్చిన దాత అల్లూరి సీతారామరాజులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. భీమవరంలోని అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన త్రీడీ చిత్రాన్ని ప్రదర్శించారు. కాగా తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి దేశభక్తిని యువతకు తెలియజేయాలి ‘దేశ ప్రజలందరి తరఫున అల్లూరి సీతారామ రాజుకు నివాళులర్పించడం గౌరవంగా భావిస్తున్నా. అల్లూరి గొప్ప దేశభక్తిని యువతకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సర్దార్ భగత్సింగ్ ఏవిధంగా ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారో..అదే రీతిలో దేశ ప్రజలకు అల్లూరి సైతం ఎప్పటికీ గుర్తుంటారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా అల్లూరి చేసిన పోరాటాలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తిగా నిలిచేలా ఉన్నాయి. పర్వతాల్లో, అడవుల్లో ఉండే గిరిజనుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగల్చడంతోపాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై తెలుగులో రూపొందించిన ఓ సినిమా కోసం ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..’ గీతం తెలుగు ప్రాంతంలోని చిన్నారులకు సైతం సుపరిచితం. బ్రిటిష్ సైన్యాన్ని పలుమార్లు ఓటమిపాలు చేయడంతోపాటు స్థానికులపై బ్రిటిష్ అధికారుల అరాచకాలపై అల్లూరి యుద్ధభేరి మోగించారు. సామాజిక అసమానతలపై అల్లూరి చేసిన పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. ప్రజల కష్టనష్టాలను తన కష్టాలుగా భావించిన గొప్ప నాయకుడు అల్లూరి. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారు. బ్రిటిష్ అధికారులు ఎంత హింసించినా మన్యం ప్రజలెవరూ ఆయన జాడ చెప్పలేదు. అంతలా ఆయన జననాయకుడయ్యారు. అలాంటి గొప్ప నాయకుడిని ఎప్పటికీ గుర్తుంచుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత..’ అని రాష్ట్రపతి చెప్పారు. ‘జై అల్లూరి సీతారామరాజు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు: సీఎం కేసీఆర్ ‘అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ సైతం.. ‘అల్లూరి సీతారామరాజును నేను ప్రశంసించకుండా ఉండలేను’ అని చెప్పినట్టు పలు రికార్డుల్లో ఉంది. ఎక్కడైతే పీడన, దోపిడీ జరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహానుభావులు జన్మిస్తారన్న భగవద్గీత సందేశాన్ని నిరూపించేలా అల్లూరి సీతారామరాజు జీవితం ఉంటుంది. బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. 26 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు జాతి వీరుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. చివరకు చనిపోతూ కూడా ఒక్క అల్లూరి మరణిస్తే..వేలాది మంది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారంటూ స్ఫూర్తిని చాటారు. హీరో కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా..మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా..’ అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు ఎక్కువసార్లు ఈ పాట వినేవాడిని. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్రెడ్డికి తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలుగు వీరుడి గురించి చెప్పేందుకు తెలుగులో ప్రసంగం: గవర్నర్ తెలుగు వీరుడు అల్లూరి కీర్తిని చెప్పేందుకు తాను పూర్తిగా తెలుగులోనే ప్రసంగిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ‘అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి. ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. సీతారామరాజు వంటి గొప్పవారి చరిత్రలు చెప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యం విలువ మరింత తెలుస్తుంది. స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో మన్యం ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగల్చడంతో పాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దిన నాయకుడు అల్లూరి. గిరిజనుల అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలను అభినందిస్తున్నా..’ అని తమిళిసై పేర్కొన్నారు. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఉండే వీరుడు: కిషన్రెడ్డి ‘చరిత్రను ఆవిష్కరించే మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని తెలుగు వీరుడు. యావత్ ప్రపంచానికి తెలుగు కీర్తిని చాటిన శూరుడు. గత ప్రభుత్వాలు విస్మరించినా..అల్లూరి సీతారామరాజును దేశం గుర్తు చేసుకునేలా ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా ఏడాదిపాటు నిర్వహించేలా చర్యలు తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. అల్లూరి 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, కార్యదర్శి నానిరాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున మంత్రి కిషన్రెడ్డి రాష్ట్రపతికి విల్లు, బాణాన్ని బహూకరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేటలో గవర్నర్ డా.తమిళిసై సౌందర్రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. -
ఆర్ఆర్ఆర్ చుట్టూ 'రింగ్ రైల్'..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ మేరకు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు కేంద్రం పచ్చజెండా ఊపిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. సర్వే కోసం తాజాగా రూ. 14 కోట్లను కేటాయించిందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానివెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారిపోతా యని పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు వస్తాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నలువైపులా లైన్లను అనుసంధానిస్తూ.. హైదరాబాద్కు నలువైపులా ఉన్న రైల్వేలైన్లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని.. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్కు త్వరగా, సులభంగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. దీనితోపాటు కరీంనగర్– హసన్పర్తి (వరంగల్) మధ్య 61 కిలోమీటర్ల రైల్వేలైన్ సర్వే కోసం రైల్వేశాఖ రూ.1.5 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.330 కోట్లతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఈ వ్యయంలో మూడింట రెండొంతుల మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఉన్నా ముందుకు రాలేదని.. దీనితో మొత్తం ఖర్చును కేంద్రమే భరించి పనులు చేపట్టాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనితోపాటు ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2023–24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఎన్సీడీసీ కోసం భూమి ఇవ్వండి అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని కిషన్రెడ్డి వెల్లడించారు. కానీ జీనోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బదలాయించలేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు మరో లేఖ రాయనున్నట్టు తెలిపారు. దేశంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సెపె్టంబర్లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎలాంటి చర్చా లేదు తెలంగాణలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం మార్పు వంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష మార్పు అంశమేదీ అధిష్టానం దృష్టిలో లేదని, దీనిపై పారీ్టలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదంతా మీడియా సృష్టించిన గందరగోళమేనన్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష మార్పు వార్తలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ కూడా కొట్టిపారేశారు. అధిష్టానం వద్ద ఇలాంటి ఆలోచనేదీ లేదన్నారు. -
World Tourism Day: లోకం చుట్టేద్దాం
నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు రీ థింకింగ్ టూరిజం పేరుతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి... కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్ టూరిజం’ థీమ్తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్ చేస్తున్నాయి. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితరాలున్నాయి. టాప్ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం! ఎటు చూసినా ఎకో టూరిజమే ఎకో టూరిజం. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపైç ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్ అడవులతో అలరారే బ్రెజిల్ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. పర్యాటకానిది పెద్ద పాత్ర ► పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే! ► ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి. ► ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది. ► 2019లో అత్యధికంగా ఫ్రాన్స్ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది. ► 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది. ► 2019లో 1.8 కోట్ల మంది భారత్ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది. ► 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది. భారత్.. పర్యాటక హబ్ ► పర్యాటక రంగ పురోగతికి భారత్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ► సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్ ఆమోదించారు. ► పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది. ► 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మాస్ టూరిజం’ను కట్టడిచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాస్ టూరిజం కారణంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, భారీ భవంతులు నిర్మించడంతో లేహ్–లద్ధాఖ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జీవావరణ పరిస్థితులు దెబ్బతింటాయని కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ గంజి కమలవర్ధనరావు అభిప్రాయపడ్డారు. లేహ్, కార్గిల్, నుమ్రా లోయ, లద్ధాఖ్లలో మాస్ టూరిజంతో జీవావరణ సమస్యలు తలెత్తకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేలా పరిష్కారాలు కనుగొనాలన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లేహ్లో ‘లద్ధాఖ్: నూతన ప్రారంభం, కొత్త లక్ష్యాలు’ పేరిట జరుగుతున్న మెగా టూరిజం ఈవెంట్లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తూనే మాస్ టూరిజంను కట్టడి చేయాలన్నారు. ఆధునిక హోటళ్ల కోసం కాంక్రీట్ భవనాలు నిర్మించే కన్నా స్థానికుల ఇళ్లలో పర్యాటకులు బస చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫైవ్స్టార్ హోటల్ స్థాయిలో ఆహారం, ఆతిథ్యం అందించేలా భాషా, తదితరాల్లో స్థానికులకు పర్యాటక శాఖ శిక్షణ ఇస్తోందన్నారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల కంటే ఎక్కువగా హెలిప్యాడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరప్లోని ఆల్ప్స్ పర్వతాల్లో 10వేలకుపైగా ప్రాంతాల్లో స్కీయింగ్ క్రీడా వేదికలున్నాయని, దాంతో కోట్లాది మంది పర్యాటకుల రద్దీ కారణంగా మంచు కరిగి, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి జీవావరణ మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలన్నారు. కులూ మనాలీ, ఊటీ, మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు చాలా మారాయన్నారు. లేహ్లోని వందలాది ట్యాక్సీల్లో చాలావరకు 10ఏళ్ల పాతవని, కర్భన ఉద్గారాల కట్టడిపై పటిష్టమైన విజన్ డాక్యుమెంట్ అవసరమన్నారు. కోలుకుంటున్న పర్యాటక రంగం కోవిడ్ కారణంగా పర్యాటకరంగం కుదేలైందని, అయితే గత రెండు నెలలుగా దేశీయ పర్యాటకం మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమని కమలవర్ధనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 1.2కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్కు వచ్చారని, అభయారణ్యాలు, తీరప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో సందడి కనిపిస్తోందని తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యాటకం అభివృద్ధిపై శ్రద్ధవహించాలన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, గ్రామీణ పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్రాలు, పర్యాటకశాఖ దృష్టిసారించాలని కమలవర్ధన రావు సూచించారు. ఈ రంగం వృద్ధి కోసం మీడియాలో ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. సినిమా టూరిజంను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కశ్మీర్, లేహ్–లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోందని పేర్కొన్నారు. స్థానిక భాగస్వామ్యం ఎంతో కీలకం: కిషన్రెడ్డి గత 40 ఏళ్లలో లద్దాఖ్లో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి లద్ధాఖ్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ మెగా టూరిజం ఈవెంట్లో కిషన్రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ‘లద్దాఖ్ అభివృద్ధికి దేశంలోని వేరే రాష్ట్రాల టూర్ ఆపరేటర్లు, స్థానికులతో చర్చలు జరిపేందుకు ఈవెంట్ మంచి వేదిక’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. లద్దాఖ్ పర్యాటక అభివృద్ధిపై చర్చించేందుకు ‘లద్దాఖ్ విజన్ డాక్యుమెంట్’ను కేంద్ర పర్యాటక శాఖ సిద్ధం చేసిందన్నారు. టూరిస్ట్ వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ మల్టీమీడియా షోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23.21 కోట్లను లద్దాఖ్కు అందించిందన్నారు. ఈవెంట్లో లద్దాఖ్ టూరిజం సౌకర్యాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, చర్చా గోష్టిలు జరుగుతున్నాయి. ఈ రంగంలోని నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమాన్యాలు, దౌత్యవేత్తలు, ‘హోం స్టే’ యజమానులు సహా 150 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మూడు శాఖల నిర్వహణ నాకొక ఛాలెంజ్: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. మూడు శాఖల నిర్వహణ ఓ ఛాలెంజ్ అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని.. ఆటంకాలన్నీ తొలగిపోయాయని, మరింత మెరుగుపర్చేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో సంక్షోభం: రాహుల్ గాంధీతో సీఎం భేటీ -
'గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం'
సాక్షి, ఢిల్లీ : విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. బాధితుల కుటుంబసభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఏపీ డీజీపీ గౌతమ్సవాంగ్కు ఫోన్ చేసి పరిస్థితి సమీక్షించినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ డీజీతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురుకు పెరిగింది. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి విజయవాడ : విశాఖ ఎల్జి పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం) (విశాఖకు రానున్న సీఎం వైఎస్ జగన్) -
సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం
ఢిల్లీ : నేపాల్, బంగ్లాదేశ్ , పాకిస్థాన్ సరిహద్దుల గుండా కరోనా పాజిటివ్ లక్షణాలు గల వ్యక్తులు అక్రమంగా ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సరిహద్దులలో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను అనుమతించాలా? వద్దా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమన్నారు. కరోనా హాట్ స్పాట్ లు లేని ప్రాంతాలలో, కేసులు లేని ప్రాంతాలలో ఈ నెల 20 తరువాత కొంత వెసులుబాటు కల్పిస్తామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలల మొదట లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తామని, 5 కంటే తక్కువ కేసులు నమోదు అయిన జిల్లాలలో మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా వాటి రవాణాకు మినహాయింపులు ఉంటాయన్నారు. దేశంలో ప్రజలు పూర్తిగా సహకరించినట్లయితే కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పడితే ఈనెల 20 తరువాత లాక్డౌన్ ఆంక్షలు సడలించే విషయం పై ఆలోచిస్తామన్నారు. కరోనా వైరస్ సమూహాలకు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన భాద్యత దేశ ప్రజల పై ఉందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని ఈ నెల 20తర్వాత స్వస్థలాలకు పంపించే విషయం పై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా హాట్ స్పాట్ లేని ప్రాంతాలలో దుకాణాలు తెరిచే విధంగా, సామాజిక దూరం పాటించేలా పరిశ్రమలు నడుపుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై పనిచేసే వారికి మినహాయింపు ఇచ్చేలా ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేస్తాయని వెల్లడించారు. -
ప్రజలను రెచ్చగొడుతున్నారు: కిషన్రెడ్డి
-
ప్రజలను రెచ్చగొడుతున్నారు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశాలని.. భారత్ సర్వ మతాల కలయిక గల సెక్యులర్ దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ముస్లింలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. సికింద్రాబాద్లోని పద్మరావునగర్లో బీజేపీ నేతలు ఆదివారం ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే.. ఆ మంటల్లో కాంగ్రెస్ చలి కాచుకుంటోందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కిషన్రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) చట్టాలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల కారణంగా భారత్లోకి శరణార్థులు వస్తున్నారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి వారికోసం మాత్రమే కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. శరణార్థులను ఆదుకోవడం, వారికి రక్షణ కల్పించడం కోసం పౌరసత్వం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ముస్లింలకు అన్యాయం జరిగినట్టు, ఆకాశం ఊడిపడ్డట్టు, భూమి బద్దలైనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం ఒక్క ముస్లింను కూడా వెళ్లగొట్టదని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చదవండి: పాకిస్తాన్తో సంబంధాలా? కోర్టుకీడుస్తా..! -
జింకల వేటగాళ్లను తప్పించారు: కిషన్రెడ్డి
సింగరేణి కార్మికుల జీతాల పెంపునకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన వేటగాళ్లు జింకలను వేటాడిన కేసులో దోషులను కావాలనే తప్పించారని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి ఆరోపించారు. ‘‘వేటాడిన జింకలను చిన్నకారులో కుక్కి మిగతా వాహనాలను విడిచిపెట్టారు. అంత చిన్న కారులో పెద్ద పెద్ద జింకలను వేసుకుని ఎవరూ వెళ్లరు. దోషులను వదిలేశారని అక్కడి పరిస్థితి చూస్తేనే స్పష్టమవుతోంది’’ అని గురువారం సభలో ఆయన ధ్వజమెత్తారు. ‘ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. మరి సింగరేణి కార్మికులేం పాపం చేశారు?’ అని ప్రశ్నించారు. వారికి కనీస వేతనాలు కూడా అందటం లేదని విమర్శించారు. యాదాద్రి ప్రాజెక్టుకు సినీ వ్యక్తి ఆర్కిటెక్టా: పద్మావతి యాదాద్రి దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినందుకు ఆనందం వేసినా, సినిమా రంగానికి చెందిన ఆనంద్సాయికి ఆర్కిటెక్ట్ బాధ్యత అప్పగించటం ఆశ్చర్యం, బాధ కలిగించాయని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును మంచి అర్కిటెక్ట్కు అప్పగిస్తే ఆలయం అనుకున్న రీతిలో రూపుదిద్దుకుంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో నిపుణుడైన ఆర్కిటెక్ట్ను నియమిస్తే మేలు అని సూచించారు. -
అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ
సాక్షి, హైదరాబాద్: ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని బీజేఎల్పీనేత జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను ఈ ప్రసంగం ప్రతిబింబించలేదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన విలేకరులో మాట్లాడుతూ ఈ ప్రసంగం మేడిపండు చందంగా ఉందని, కాకిలెక్కలతో కూడుకుని ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల అమలుపై కార్యాచరణ గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఏమి సాధించిందో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు ప్రగతిభవన్ను దాటడం లేదని ఎద్దేవా చేశారు. -
సీఎంకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్రెడ్డి శ్రీరాంపూర్: అసెంబ్లీలో తప్పుడు సమాచారం చెప్పినందుకు సీఎం కేసీఆర్కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తా మని బీజేపీ శాసనసభాపక్షనేత జీ.కిషన్రెడ్డి తెలిపారు. సింగ రేణిలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా.. పనిచేయడం లేద ని ఇటీవల సభలో సింగరేణిపై చర్చలో సీఎం తప్పుడు సమా చారం చెప్పారన్నారు. కిషన్రెడ్డి కోల్బెల్ట్ యాత్ర గురువారం మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలో కొనసాగింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని బొగ్గుగనుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సమస్యలపై అధ్యయనం చేసి వాటికి పరిష్కారం చూపెడుతూ నివేదిక తయారు చేసి సంస్థ యాజమాన్యానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తానన్నారు. -
కాంగ్రెస్కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు
బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలు అమ లుచేసే దిశలో కేంద్ర బడ్జెట్ ఉందని బీజే ఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనరంజకమైన ఈ బడ్జెట్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలకు కాంగ్రెస్ నాయకులు సహకరించాలని లేదా ఏమీ మాట్లాడకుండా ఉండాలన్నారు. -
ముస్లిం రిజర్వేషన్లు పెంచొద్దు
బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన ను టీఆర్ఎస్ ప్రభు త్వం ఉపసంహరిం చుకోవాలని బీజే ఎల్పీ నేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సుధీర్కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, ఎంఐఎం కార్యా లయం దారూస్సలాంలో దాన్ని తయారు చేశారన్నారు. ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావుతో కలసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, 4 రోజుల్లో 312 పేజీల నివేదిక చదివి బీసీ సంఘాలెలా అభ్యంత రాలు తెలపగలరని ప్రశ్నించారు. -
అసెంబ్లీ బోనులో సర్కారును నిలబెట్టాలి
బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఫల్యాలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ బోనులో నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఏడాది 15 రోజులు కూడా అసెంబ్లీ జరగనందున, ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఇరవై రోజులకు తగ్గకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేఎల్పీ సమావేశానంతరం అసెంబ్లీ కమిటీ హాలులో పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 15న బీఏసీ సమావేశం జరగనున్న నేపథ్యంతో ఆ భేటీ తర్వాత మళ్లీ సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేస్తామని చెప్పా రు. టీఆర్ఎస్ సర్కార్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. -
'ఆ డాక్టర్పై క్రిమినల్కేసు పెట్టాలి'
సాక్షి, హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కి డబ్బు సంపాదనే లక్ష్యంగా నిఖిల్రెడ్డి ఎత్తు పెంచడానికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ను వైద్య వృత్తి నుంచి రెండేళ్లు సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి అన్నారు. డాక్టర్, గ్లోబల్ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం కనీసం రూ.కోటి పరిహారమివ్వాలన్నారు. -
ఆలస్యమైనా మంచి నిర్ణయమే: కిషన్రెడ్డి
హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కిన డాక్టర్ చంద్రభూషణ్ను సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరించిన డాక్టర్, గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ కౌన్సిల్ సిఫారసు చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఆరు నెలలుగా నిఖిల్ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్పై ఉందన్నారు. డాక్టర్ చంద్రభూషణ్, సీఈవో శివాజీ చటోపాధ్యాయ, గ్లోబల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి...
ఎంసెట్-3 వైఫల్యంపై కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్ : పరీక్షాపత్రం వెల్లడైన కారణంగా ఎంసెట్-2ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-3ని నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎంసెట్-3 ప్రశ్నాపత్రంలో 160కి గానూ 15 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటే ప్రభుత్వం ఎంత నిరక్ష్యం వహించిందో అర్థమవుతోందన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్కు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మోదీ సభ నుంచే బీజేపీ శంఖారావం
బీజేపీఎల్పీ పక్షనేత జి.కిషన్ రెడ్డి శంషాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. వర్సిటీలకు వీసీల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాయకులను చేర్చుకుని పదవులు కట్టబెట్టి, ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతోపాటు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. -
నిఖిల్ కి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
♦ గ్లోబల్ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి ♦ సీఎస్ రాజీవ్ శర్మను కోరిన బీజేపీ ముఖ్య నేతలు సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంపు పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్రెడ్డి కాళ్లకు అశాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను గురువారం సచివాలయంలో కలసి ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, ఎం.చంద్రయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. నిఖిల్రెడ్డికి చేసిన శస్త్రచికిత్స హైదరాబాద్లో జరగడం ఇదే తొలిసారి అని, వైద్య ప్రయోగాల కోసం నిఖిల్రెడ్డిని పావుగా వాడుకున్నారని, నిఖిల్రెడ్డి ఎక్స్పెరిమెంట్గా ప్రచారం కోసమే ఈ శస్త్రచికిత్స జరిపారని మండిపడ్డారు. వైద్యం పేరుతో ప్రజలను దోచుకోడానికి ఇలా కొత్త మార్గాన్ని కనుక్కున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా శస్త్రచికిత్స నిర్వహించడం అక్రమమన్నారు. వారం రోజుల్లోనే కోలుకుంటావని నిఖిల్రెడ్డికి వైద్యులు హామీ ఇచ్చారని, రెండు నెలలు గడుస్తున్నా అతను కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి సైతం నిఖిల్రెడ్డిని పరామార్శించడానికి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఈ ఘటనపై భారత వైద్య మండలి(ఎంసీఐ)కి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం నుంచి నిఖిల్రెడ్డికి రూ.కోటి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిఖిల్రెడ్డిని మోసం చేసిన ఆస్పత్రి సీఈవో శివాజీ చటోపాధ్యాయ, వైద్యుడు చంద్రభూషణ్పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. -
దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణపై బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు, కుట్రలు జరిగినా బీజేపీ ఎదుర్కొంటుందన్నారు. దేశ ద్రోహులతో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేతులు కలుపుతున్నారని, వందేమాతరంపై చర్చకు రాహుల్, వామపక్షాలు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. హెచ్సీయూ ఘటనను అడ్డం పెట్టుకుని బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జంగారెడ్డి, నామాజీ, చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాసులు, అమర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కండువాలు కప్పడమే టీఆర్ఎస్ అజెండా: కిషన్రెడ్డి
వరంగల్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ఇతర పార్టీల నాయకులకు గులాబీ కండువాలు కప్పడమే అజెండాగా పెట్టుకుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలన కంటే కండువాలను కప్పడమనే అజెండాతోనే టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. తెలంగాణ వద్దన్నవారు, నోటి నుంచి జై తెలంగాణ అనని వారు ఇప్పుడు తెలంగాణ ప్రజలపై పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కిషన్రెడ్డి మంగళవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత అవసరమో... ప్రతి పక్షం అంతే అవసరమని భావించి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రెండు పక్షాలకు అధికారం కల్పించారని చెప్పారు. ప్రతి పక్షం లేకుండా చేసి ఇష్టానుసారంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ వారు చూస్తున్నారని అన్నారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే విషయంలో బీజేపీ అంకితభావంతో ఉందని చెప్పారు. కేంద్ర బడ్టెట్పై టీఆర్ఎస్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదని కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ కూతురు ఎంపీ కవిత కేంద్ర బడ్జెట్ బాగుందని ఢిల్లీలో చెప్పారని, రాష్ట్రంలో మంత్రి హరీష్రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పరాభవం తప్పదని, బీజేపీ సత్తాను చాటుతుందని కిషన్రెడ్డి చెప్పారు. -
ఓడినా ప్రజల మధ్యే ఉంటాం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఒక్కటే లక్ష్యం కాదని, సైద్ధాంతిక భూమికతో ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తామని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 18 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. గెలుపు, ఓటమితో నిమిత్తం లేకుండా ప్రజల్లో ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పని తీరులోని లోపాలను ప్రజలకు వివరించడంలో విఫలమైనట్లు ఆయన విశ్లేషించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికార టీఆర్ఎస్ పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఓటమిపై పార్టీలో అంతర్గతంగా పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్ శాతం తగ్గడంతో బీజేపీకి నష్టం వాటిల్లిందన్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే పరిస్థితి కొంత బాగుండేదన్నారు. ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, పునాదులను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు వల్ల ఓడిపోయామనే ఆలోచన, అభిప్రాయాలు రాలేదన్నారు. -
‘నాగం’పై పార్టీలో చర్చిస్తాం : కిషన్ రెడ్డి
ఆయన ‘మిషన్’కు అనుమతి లేదు సాక్షి, హైదరాబాద్: నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన బచావో తెలంగాణ మిషన్కు పార్టీ అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అనుమతి లేకుండా చేపట్టిన కార్యక్రమాలపై అంతర్గత సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అయితే ప్రజల పక్షాన కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతిస్తామన్నారు. నాగం పార్టీలోనే ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు పిలుస్తామని వెల్లడించారు. బీజేపీ ఉద్యమించడం లేదనడం సరికాదని, ఈ ఏడాది సంస్థాగత సంవత్సరంగా ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో అనుసరించిన తీరును వివరిస్తూ ఆ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ నెల 23న పార్టీ నేతలతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి సమావేశం అవుతారని కిషన్ రెడ్డి వివరించారు. అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులతో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి సమావేశం అవుతారని వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉద్యమబాట పడుతున్నామని ప్రకటించారు. -
‘పాలమూరు’పై ఇష్టారాజ్యం
సర్కార్పై బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజం అధికారంలో ఉన్న వారెక్కడైనా బంద్ చేస్తారా అని ప్రశ్న పుష్కరాల బస్సుచార్జీల పెంపుపై నేడు నిరసనలు హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం గా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుల డిజైన్లమార్పు, శంకుస్థాపన, బంద్ వంటి విషయా ల్లో ఇటు టీఆర్ఎస్ నేతలు, అటు ముఖ్యమం త్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వద్దని కేంద్ర ప్రభుత్వం అన్నదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాలు రాసుకుంటే కేంద్రం తగిన సమాధానం ఇస్తుందన్నారు. దీనిపై అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బంద్ చేపట్టడం ఏమిటని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాలు రాయడం బాబుకు అలవాటని, ఇలాంటి ఉత్తరాలు చాలా రాసుకున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని, వాటిని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శాసనసభలో సమగ్రంగా ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల చెత్త పేరుకుపోయి హైదరాబాద్ దుర్గంధంతో నిండిపోయిందన్నారు. సీఎం జోక్యం చేసుకుని వెంటనే పారిశుద్ధ్య కార్మికులు, నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాగా, పుష్కరాల కోసం ఆర్టీసీ బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 22న అమిత్షా రాక తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న తొలి పుష్కరాల్లో పాల్గొనడానికి ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా వస్తున్నట్టుగా కిషన్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలో అమిత్షా పుష్కర స్నానం ఆచరించే అవకాశాలున్నాయని వివరించారు. 15న ధర్మపురిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, 19న కేంద్రమంత్రి హన్స్రాజ్ బాసరలో పుష్క ర స్నానాలు చేయనున్నట్టు చెప్పారు. -
ఆకాంక్షలను గౌరవించాం!
రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడానికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర-దక్షిణ గ్రిడ్ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మాణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది. దశాబ్దాల నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో పార్టీ కాకినాడ సమావేశాలలో తీర్మానం చేసిం ది. అప్పటి నుంచి 2014లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టేవరకు సభలోపలా, బయటా కూడా బీజేపీ నిర్వ హించిన పాత్ర అద్వితీయమైనది. పార్టీ తెచ్చిన ఒత్తిడి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్లనే యూపీఏ భయపడి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రజల ఆకాంక్ష మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధికి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 12 నెలల కాలంలో ఎన్నో విజయాలు సాధించిన మోదీ ప్రభుత్వం తెలంగా ణకు పూర్తి సహకారం అందించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ఇచ్చే నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి 2015-2016 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం రూ.13,728 కోట్ల నిధులు తెలంగాణకు కేటాయిం చింది. పెరిగిన నిధుల ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.94, 923 కోట్లు కూడా తెలంగాణకు మంజూరు కానున్నాయి. కేంద్రం ఈ ఏడాదిలో పంచాయతీరాజ్ శాఖకు మంజూ రు చేసిన రూ.5,375 కోట్ల గ్రాంట్, పట్టణాభివృద్ధి శాఖకు మంజూరు చేసిన రూ.3,389 కోట్ల గ్రాంటును కలుపుకుని మొత్తం రూ.8, 764 కోట్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్, మెదక్ జిల్లాలో హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం, ఇదే జిల్లా కరక పట్లలో 75 ఎకరాల స్థలంలో జాతీయ ఫార్మా విద్యా పరి శోధన కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం గిరి జన విశ్వవిద్యాలయం, సనత్నగర్లో ఈఎస్ఐ వైద్య కళా శాల ఏర్పాటు, హైదరాబాద్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో విద్య, పరిశోధనలకు కేం ద్రం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నది. కొత్త రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు లేకపోవ డానికి కేంద్రం అందిస్తున్న సహకారమే కారణం. నిరం తర విద్యుత్ సరఫరాకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం సంతోషకరం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో రూ.9,954 కోట్లతో 800 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. దీనితో 1,600 మెగా వాట్ల విద్యుత్ లభ్యం కాగలదు. అలాగే, నల్లగొండ జిల్లాలోని దామెరచర్లలో అతి తక్కువ సమయంలో 10,000 ఎకరాలకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేసి, రూ.15,000 కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్రాజెక్టుల ద్వారా 2,400 మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. దీనితో పాటు మహబూబ్నగర్లో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పా టు చేసి 5,000 మెగావాట్ల విద్యుదుత్పాదనకు కూడా చర్యలు తీసుకుంటున్నది. హరియాణాలోని జజ్జర్ విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్ను కేటాయించడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 330 మెగావాట్ల అదనపు విద్యుత్ను కూడా తెలంగాణకు మళ్లించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఎంతటిదో దీనితో రుజువవుతున్నది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా తెలంగాణకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడా నికి వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఉత్తర -దక్షిణ గ్రిడ్ను అనుసంధానించే సరఫరా లైన్ల నిర్మా ణం పనులను కూడా కేంద్రం వేగవంతం చేసింది. రాష్ట్రం లో విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొ రేషన్ వంటి కేంద్ర సంస్థలు రుణాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ద డానికి సహకారం అందిస్తున్నది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్- పెద్దపల్లి రైల్వేలైన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.183 కోట్లు కేంద్రం కేటాయిం చింది. కాజీపేట నుంచి ముంబైకి కొత్త రైలు మంజూరు కావడం ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఊరటని చ్చింది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3,700 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.1,681 కోట్లతో కేం ద్రం పనులు ప్రారంభించింది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కూడా మొదలై నాయి. 202 జాతీయ రహదారి మీద, అంబర్పేట (హైదరాబాద్)లోని 6వ నంబర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించడంతో పాటు సముద్రతీరం లేని తెలంగాణకు డ్రైపోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రామగుండంలో రూ.5,200 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. రెండువేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు, రాష్ట్రానికి సరిపడే యూరి యా, అమోనియం నైట్రేట్ ఎరువులు ఇక్కడ ఉత్పత్తి కానున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మూతపడిన ఐడీపీఎల్ సంస్థను రూ.960 కోట్లతో పున రుద్ధరించి జూన్, 2015 నుంచి 25 రకాల మందులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం స్వాగతించద గినది. ఇంకా రూ.75 కోట్లు కేటాయించి స్వచ్ఛ భారత్ ద్వారా హైదరాబాద్ను స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్ద డానికి కూడా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలుగువాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయిం చడం దేశం గర్వించదగినది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో పాటు, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలలో రెండు మెగా ఫుడ్ పార్కులను రూ.110 కోట్ల సబ్సిడీతో ఏర్పా టు చేయడం రాష్ర్టంలోని రైతులకు భరోసాను ఇచ్చే విధంగా ఉంది. రూ.250 కోట్లతో నల్లగొండ జిల్లాలో పది ఎకరాలలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. వరంగల్కు హెరిటేజ్ నగ రంగా గుర్తింపును ఇచ్చి మొత్తం రూ.210 కోట్లతో ఆ చారిత్రక ప్రదేశం రూపురేఖలను మార్చేందుకు కేంద్రం నడుం కట్టింది. నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు టెక్స్టైల్ పార్కులను ఏర్పాటుకు చర్యలు చేపట్ట డం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం టెక్స్టైల్ ఇంటి గ్రేటెడ్ పథకాన్ని ప్రారంభించడం, 24,148 మంది చేనే త కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడం వంటి చర్యల ద్వారా చేనేతకు తమ అండ ఉంటుందని మోదీ ప్రభు త్వం భరోసా ఇస్తున్నది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉ క్కు పరిశ్రమ ఏర్పాటుకు సూచనప్రాయంగా అంగీకరిం చడం వరంగల్, ఖమ్మం జిల్లాల యువతకు తీపి కబురే. జి.కిషన్రెడ్డి (వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు) మొబైల్: 9949099997 -
మాఫియాదారులకే బంగారు తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధ్వజం హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం భూకబ్జాదారులు, ఇసుక, మైనింగ్ మాఫియాదారుల కోసం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండ జిల్లా బీజేపీ సభలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రంగా గాయపడి కంచన్బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బరిశెట్టి శంకర్ను గురువారం ఆయన పరామర్శించారు. శంకర్కు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శంకర్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కిషన్రెడ్డి ఆస్పత్రి వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసైన్డ్ భూములను కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజ్పల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి విక్రయించారని.. దీనిని శంకర్ రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం జరగకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తన ఆవేదనను వ్యక్తం చేశాడని చెప్పారు. పాలకులు భూఅక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి చర్యలపై సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. కేశరాజ్పల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి శంకర్ కోరిక మేరకు ఆంజనేయస్వామి ఆలయం నిర్మించేందుకు సహకరిస్తామన్నారు. కాగా, కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ను నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు పెరిగిపోతున్నాయని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నల్లగొండ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. -
ఆలోచించి.. ఓటు వేయూలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి టీఆర్ఎస్ను గెలిపిస్తే భజనపరులే.. హన్మకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయూలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. హన్మకొండ తారా గార్డెన్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు కావాలా.. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి భజనపరుల జాబితాలో చేరుస్తారో.. మేథావులు ఆలోచించాలని అన్నా రు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, సీఎం కేసీఆర్ ఎవరినీ లెక్క చేయడం లేదని, మంత్రులను కూడా దగ్గరకు రానివ్వడం లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలి పిస్తే కుటుంబ పాలన ముందు మోకరిల్లుతారని.. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే విధాన మండలిలో ప్రజల గొంతుకలవుతారన్నారు. పట్టభద్రులైన ఓటరు మేథావులు ఆలోచించి తమ విచక్షణ మేరకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ మాటెత్తని తుమ్మల నాగేశ్వర్రావును, ఉద్యమకారులపై దాడులు, లాఠీచార్జి చేయిం చిన మహేందర్రెడ్డిని, వరంగల్లో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తే చంద్రబాబుపైనే ఎదురు తిరిగి ఆంధ్రప్రదేశ్ను విభజించవద్దని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్యాదవ్ను మంత్రులుగా చేశారని దుయ్యబట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపైన గొంతును వినిపించే బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలి పించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన సీబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఘట్కేసర్ మండలం కొర్రెంల శివారులో సర్వే నం.840లో రూ.1.20 కోట్ల విలువ చేసే ఎకరం స్థలాన్ని హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎకరం స్థలాన్ని ఆక్రమించారన్నారు. ఈ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, రావు పద్మ, డాక్టర్ విజయచందర్రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, మందాడి సత్యనారాయణరెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, రావుల కిషన్, చాడా శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
'కొన్ని తప్పులు చేయడం వల్లే ఢిల్లీలో ఓటమి'
హైదరాబాద్: కొన్ని తప్పుల చేయడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హస్తిన ఎన్నికలపై ఆయన స్పందించారు. ఆప్ ఇచ్చిన ప్రజాకర్షక హామీలవైపు ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్, బీఎస్పీలు బీజేపీని ఓడించాలని ఆప్ కు మద్దతు ఇచ్చాయన్నారు. బలాన్ని పెంచుకోలేక ఓడిపోయామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కిషన్రెడ్డి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలనుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ కోతలతో పరిశ్రమలు కుంటుపడుతున్నాయని చెప్పారు. బిల్డింగ్లు కట్టి అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ భావించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
'కేటాయింపులకు, ఆదాయానికి పొంతన లేదు'
నల్లగొండ: ఆర్థిక బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ సర్కారు తీరు బంగారు తెలంగాణకు అనుకూలంగా లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు, ఆదాయానికి పొంతన లేదని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని అన్నారు. -
దేశంలో మోదీ గాలి వీస్తోంది: కిషన్రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఎక్కడ చూసినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ మీడియా ఇన్చార్జి టి.రామదాసప్ప నాయుడు రచించిన ‘మోదీ భారతం’ పుస్తకాన్ని ఆదివారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పాలనకు దేశ ప్రజలు పట్టం కడుతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి దిక్సూచిగా ఉండే నాయకత్వ లక్షణాలు మోదీలో ఉన్నాయన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు రామచంద్రరావు, ప్రముఖ రచయిత బీఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు.. -
బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలేనా ?
హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలేనా అన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోంటున్నా... సీఎం కేసీఆర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళనతో స్థానికంగా ఉద్రక్త వాతావారణం నెలకొంది. దీంతో పోలీసులు బీజేపీ నేతలు కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
'రజాకార్లు కావాలో... తెలంగాణ ప్రజలు కావాలో... తేల్చుకో'
హైదరాబాద్: రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కిషన్రెడ్డి అధ్యక్షతన ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై కిషన్రెడ్డి నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రా దినోత్సవాలను అధికారికంగా జరుపుతున్నా... ఇక్కడ ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎందుకు ఈరోజుని అధికారికంగా జరపడం లేదో తెలపాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరు వద్దన్నా... కాదన్నా... గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ ... తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాపు ఘాట్ వద్ద... అనంతరం బాపు ఘాట్ వద్దకు కిషన్రెడ్డితో పాటు ఇతర నేతలు చేరుకున్నారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా అధికారిక ప్రకటన చేసేంతవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని కిషన్రెడ్డి స్ఫష్టం చేశారు. వారంతా మరికాసేపట్లో బాపు ఘాట్ నుంచి గోల్కొండ కోటకు ర్యాలీగా బీజేపీ నేతలు వెళ్లనున్నారు. -
స్నేక్గ్యాంగ్ను ఉరి తీయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన స్నేక్గ్యాంగ్ను నిర్భయ కేసు మాదిరిగా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, అధికార ప్రతినిధి ప్రకాష్రెడ్డి, కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్యాదవ్లతో కలసి మాట్లాడారు. నగరంలో విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలకు , కబ్జాలకు పాల్పడుతున్న స్నేక్గ్యాంగ్కు మజ్లిస్ పార్టీ అండ ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పష్టమవుతుందన్నారు. నగరంలో ఎక్కడ జంటలు కనిపించినా వారిని వెంబడించి వారి జీవితాలను విషనాగుల్లా కాటేస్తున్న వీరు సమాజంలో జీవించే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ఏ పార్టీ అడ్డు వచ్చినా, ఎవరు ఒత్తిడి తెచ్చినా భయపడకుండా స్నేక్గ్యాంగ్కు ఉరిశిక్షను అమలు చేయాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దౌర్జన్యాలు, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టాల వల్లే రైతుల ఆత్మహత్యలు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల ముందు 8 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, ఇంటింటికీ ఉద్యోగమిస్తామని వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అధికారం చేపట్టిన తర్వాత చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అప్పులు తెచ్చి విత్తనాలు వేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో నష్టాల పాలై ఆందోళన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల కుటుంబాలను పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, పింఛన్లు, రైతుల రుణమాఫీ తదితర అన్ని పథకాలు వుూలన పడ్డాయుని ధ్వజమెత్తారు. నగరంలోని 30 ప్రాథమిక వైద్యశాలలతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యుత్ బిల్లులు కట్టలేదన్న కారణంగా విద్యుత్ సరఫరాను కట్ చేశారన్నారు. హాస్టళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యార్థులు చదువులెలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'సింగపూర్ మీద ఉన్న అసక్తి రుణమాఫీపై లేదే'
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై దృష్టి పెట్టకుండా హైదరాబాద్ నగరాన్ని సింగపూర్, కరీంనగర్ను లండన్లాగా మారుస్తామని చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సింగపూర్ పై ఉన్న అసక్తి రుణమాఫీపై లేదని ఆయన ఆరోపించారు. తమకు ఉద్యోగాలు కావాలని విద్యార్థులు ఆందోళనలకు దిగుతుంటే... తిన్నది అరకగ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని సాక్షాత్తూ కేసీఆర్ సీఎం స్థానంలో ఉండి వ్యాఖ్యానించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ గుప్పించిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ... అవి తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసి... విపక్షాలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో తమ పార్టీకి బీజేపీ మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ లోక్సభ స్థానానికి గతంలో బీజేపీ పోటీ చేసిన సంగతిని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. -
'సంస్కారహీనంగా కేసీఆర్ విమర్శలు'
హైదరాబాద్: పునర్విభజన బిల్లుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తెలిపారు. అప్పుడు బిల్లుకు అంగీకరించి, ఇప్పుడు వస్తున్న సమస్యలను బీజేపీపైనా, మోడీపైనా నెడుతున్నారని విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంతో కలిసి పనిచేయాలని ఎవ్వరైనా కోరుకుంటారని, కాని దీనికి విరుద్దంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్కు సఖ్యత ఏర్పడ్డ తర్వాత బీజేపీపై అయినదానికీ, కానిదానికీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సంస్కారహీనంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్కు అధికారాల విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. తన కుటుంబం తప్ప మరెవ్వరూ తెలంగాణకు అనుకూలంగా లేరనే తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారన్నారు. -
కేసీఆర్కు ముందే తెలుసు: కిషన్రెడ్డి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలను గవర్నర్ కు అప్పగించే అంశంపై రాష్ట్ర బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు సాగుతోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోనే అధికారాల బదలాయింపు ఉందన్న సంగతి కేసిఆర్కు మందే తెలుసునని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలతో కలిసి వ్యతిరేకిస్తామని కేసీఆర్ అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ మాటలు నమ్మొద్దని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. -
కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ?
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1956 స్థానికతపై కేసీఆర్ అయిన... తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అంటు తెలంగాణ సీఎంను కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాల వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్పీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. పరిపక్వతతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కిషన్ రెడ్డి హితవు పలికారు. -
'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్పోల్ సాయం'
తిరుమల : ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వకుళామాత ఆలయం నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపినా... అధికారుల నిర్లక్ష్యంతోనే ఆ ఆలయ పనులు ఇప్పటికీ ప్రారంభకాలేదని ఆరోపించారు. దేవాలయ ప్రాంతాల్లో అన్యమత ప్రచారం సరికాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
తొలి హమీకే తూట్లు పొడిస్తే ఎలా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో అన్ని రకాల పంట రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. మొదటి హమీకే తూట్లు పొడిచేలా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్ పునఃపరిశీలించాలని సూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తైన తరువాత ముంపు ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు లందరికీ రూ.లక్ష వరకు పంటరుణాలు మాఫీ చేయాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని బీజేపీ నేతలు హైదరాబాద్ లో కోరారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయాలని పోచారంకు విజ్ఞప్తి చేశారు. -
రైతులను కేసీఆర్ మోసం చేశాడు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల ఓట్ల కోసమే రుణమాఫీ హామీ ఇచ్చారని.. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆయన ప్రస్తుతం మాటమార్చడంపై కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2013-14 తర్వాత తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాననడం మాటమార్చడమే అని కిషన్ రెడ్డి అన్నారు. -
‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’
హైదరాబాద్: కష్టించి పనిచేసే వారికి బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా మెలిగేవారికి ఉజ్వల భవిష్యత్ఉంటుందన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కిషన్రెడ్డితోపాటు గోషామహాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్లోథలను బుధవారం రాత్రి దూల్పేట్ గంగాబౌలిలో లోథ క్షత్రియ సదర్ పంచాయతీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డిమాట్లాడుతూ లోథ్ కులస్తుల త్యాగాలు ఎంతో అమోఘమన్నారు. రాజాసింగ్లోథను గెలిపించడంతో లోథ కులస్తుల పాత్ర మరువలేనిదన్నారు. మంగళ్హాట్, ధూల్పేట్ డివిజన్లలో ఉన్న వేలాది మంది లోథ కులస్తులు ఏకమై రాజాసింగ్ లోథ గెలుపుకు కారకులయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్లోథ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన అభివృద్దిని విస్మరించినందునే సమస్యలు నియోజకవర్గంలో పేరుకు పోయాయన్నారు. అంచలంచెలుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన గోషామహాల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు సేవలందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రాజాసింగ్లోథ పేర్కొన్నారు. -
మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిథ్యం కల్పించండి
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలంటూ బీజేపీ తెలంగాణ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినందున తొందరగా అభివృద్ధి చెందాలంటే స్థానిక నేతలు కేంద్రమంత్రివర్గంలో ఉండటం అవసరమని వారు పేర్కొన్నారు. ప్రధానిగా కొలువుదీరిన తర్వాత పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పార్టీ తరపున విజయం సాధించిన ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రివర్గ కూర్పులో ఆయనకు తప్పకుండా అవకాశం ఉంటుందని తామంతా భావించామని, కానీ ఆయనకు అవకాశం రాకపోవటంతో నిరుత్సాహపడ్డామని పేర్కొన్నారు. ఈ విన్నపాన్ని సానుకూలంగా విన్న నరేంద్రమోడీ త్వరలో జరిగే విస్తరణలో పరిశీలిస్తానని సానుకూలంగా స్పందించినట్టు కిషన్రెడ్డి విలేఖరులకు తెలిపారు. బండారు దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటు లభించకపోవటానికి... మోడీకి తెలంగాణ అంటే చిన్నచూపు ఉండటమే కారణమనే భావన సరికాదని ఆయన అన్నారు. -
'వంద పోలింగ్ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్'
హైదరాబాద్: హోంగార్డులకు, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని బీజేపీ నాయకుడు కిషన్రెడ్డి కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి భర్తపై ఇసుక మాఫియా చేసిన హత్యాయత్నంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 7 నుంచి 12 వరకు కిషన్రెడ్డి.. వారణాసిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కార్వాన్లో 100 పోలింగ్కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి ఆరోపించారు. అధికారులపై, ఎంఐఎం కార్యకర్తలపై విచారణ జరిపించాలని, ఈ వంద పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
దత్తాత్రేయ, కిషన్రెడ్డి మధ్య కోల్డ్వార్
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మద్య కోల్డ్వార్ నడుస్తోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ సీటు విషయంలో ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు చెబుతున్నారు. సికింద్రాబాద్ స్థానం కోసం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ముందు వీరిద్దరూ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం.. బీజేపీలో హాట్ సీట్గా మారిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఎక్కువమంది బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డితో పాటు ప్రేమ్సింగ్రాథోడ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
తెలంగాణలో ఆదరణ బాగుంది: జవదేకర్
హైదరాబాద్: ఉగాది నుంచి తమ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందన్నారు. తెలంగాణ అంతటా మోడీ సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ప్రజలంతా నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలను కుంటున్నారని పేర్కొన్నారు. ఈ సాయంత్రం ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చిస్తామని తెలిపారు. కాగా, టీడీపీతో ఎన్నికల పొత్తుపై జవదేకర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఉగాదిలోపు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందంటున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉండదని ఎన్నికల అవగాహన మాత్రమే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తెలిపారు. -
కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్రెడ్డి
హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు పార్టీ పెడతారా, లేదా అనేది తేలాల్సివుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశానని కిరణ్ చెప్పుకోవడం సిగ్గుచేటని కిషన్రెడ్డి అన్నారు. కిరణ్ యువ కిరణాలు దళారులకు వెళ్లాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో బీజేపీదే కీలకపాత్ర అని కిషన్రెడ్డి అన్నారు. మార్చి 11న హైదరాబాద్లో జరగనున్న సభకు తమ పార్టీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరవుతారని చెప్పారు. -
సోనియానే మొదటి ముద్దాయి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్నప్పటికీ ఉద్యమ సందర్భంగా వందలాది మంది యువకులు బలిదానం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే మొదటి ముద్దాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంతంలోని 1100 మంది బలిదానాలతో కాంగ్రెస్ పార్టీ చేతులు రక్తంతో తడిచిపోయాయన్నారు. అలాంటి చేతులను వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు విరిచివేయాల్సిన పరిస్థితి ఉందని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా తెలంగాణ జేఏసీ చైర్మన్ గోరి ఆమరేందర్రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సంకినేని వెంకటేశ్వర్లు, టీడీపీ నేత శ్రీధర్రెడ్డి, ఆదిలాబాద్ పట్టణ టీడీపీ నేత పాయల శంకర్ తదితరులు బుధవారం కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణ ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందన్నది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, అనేక ఇతర పార్టీలు తమ వల్లే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్నప్పటికీ..మూడు నెలలో కేంద్రంలో అధికారం కోల్పోయే కాంగ్రెస్ పార్టీ వల్లనో, ప్రాంత్రీయ పార్టీల వల్లనో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాబట్టి తెలంగాణ అభివృద్ధి బీజేపీకే సాధ్యపడుతుందని చెప్పారు. చాలా మంది నరేంద్రమోడీ అధికారంలోకి రావాలంటే మాకొచ్చే రెండు మూడు సీట్లుపై ఆధారపడాల్సి వస్తుందని ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రాంతీయ పార్టీల ఆవసరం లేకుండానే మోడీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్, కమల్ నాథ్, రాష్ట్ర నేతలు డీఎస్ వంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ.. అలాంటి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలేమీ అమాయకులు కాదని చెప్పారు. ఎవరి ద్వారా తెలంగాణ కల సాకారమైందో ప్రజలు అర్థంచేసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు కేవలం కుటుంబ పార్టీలంటూ దుయ్యబట్టారు. ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం కాకుండా ఆయా పార్టీలు కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని విమర్శించారు. బీజేపీ ఒక్కటే కార్యకర్తల పార్టీగా చెప్పారు. టీ కొట్టు యజమాని కొడుకు ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి మాత్రమే సాధ్యపడిందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం బీజేపీకి శుభసూచకం లాంటిదని.. ఇదే రోజు నల్గొండ జిల్లా నేతలు పార్టీ చేరి దీనికి నాందిపలికారని అన్నారు. రానున్న మూడు నెలల కాలం పార్టీ కార్యకర్తలు నిద్రపోవడం మినహాయించి గంట సమయం కూడా వృధా చేయకుండా పార్టీ సిద్ధాంతాలను రాష్ట్రంలో ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. గవర్నర్ తీరు సరికాదు రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రెండు మూడు రోజులుగా గవర్నర్ తీసుకుంటున్న చర్యలుప్రజాస్వామ్యం దృష్ట్యా సరైనవి కావని పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సాధారణంగా ఒక సీఎం మారాక మరో సీఎం వస్తే పాత ప్రభుత్వ పాలసీలపై రివ్యూ జరుగుతుంటుందని.. కానీ కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఆఖరి రోజులలో తీసుకున్న నిర్నయాలను గవర్నర్ సమీక్షిస్తారంటే నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తారని అనుకున్నామని చెప్పారు. తీరా చూస్తే అధికార బదిలీ నిర్ణయాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ రాజకీయ వాదిగా వ్యవహరించారని, మిగిలిన మూడు నెలల కాలంలోనైనా రాజకీయవాదిగా ఉండరని భావిస్తున్నామని చెప్పారు. పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, చింతా సాంబమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని జి. కిషన్రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు ఏకపక్షంగా ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీదేనని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి తమ పార్టీ చురుగ్గా వెళుతుందని దీమా వ్యక్తం చేశారు. ఎల్లుండి హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ నేతలందరూ సమావేశమవుతున్నారని తెలిపారు. -
ఇక ఓట్లు కొల్లగొడదాం!
మన వల్లే తెలంగాణ సాధ్యమైందని చెబుదాం బీజేపీ వ్యూహం ఖరారు.. ఢిల్లీ రైలు రాష్ట్రంలో ప్రవేశిస్తూనే ‘జైత్రయాత్ర’ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సాధన తమతోనే సాధ్యమైందన్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిం చింది. బిల్లు లోక్సభ ఆమోదం పొందగానే మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ ప్రాంత నేతలు పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, ప్రేమేందర్రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, టి.ఆచారి, మనోహర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. బిల్లు ఆమోదం పొందడానికి తామే కారణమన్న విషయూన్ని ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టేలా కార్యక్రమాలు ఉండాలని భావించారు. దీనికనుగుణంగా పార్టీ నేతలందరూ ఢిల్లీ నుంచి 20వ తేదీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతారు. రైలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించిన వెంటనే దీన్ని జైత్రయాత్రగా మార్చాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు రైలు ఆగే ప్రతి స్టేషన్లో కిషన్రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఢిల్లీ నుంచి వస్తూనే ప్రతి నియోజకవర్గంలో యాత్రలు, పార్టీ పతాకావిష్కరణలు చేపడతారు. కాగా పార్టీకి తక్షణమే రెండు కమిటీలు వేయాలన్న సూచనను కిషన్రెడ్డి ఆమోదించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ను కలిసి టీబిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్ర విభజన విషయంలో ఏర్పడిన గందరగోళానికి కాంగ్రెస్దే బాధ్యతని వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సంతోషపడుతున్నా.. సీమాంధ్రకు జరిగిన అన్యాయం బాధిస్తోందని చెప్పారు. రాజ్నాథ్తో టీ టీడీపీ నేతల మంతనాలు: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు రాజ్నాథ్ను కలిశారు. ఎమ్మెల్యేలు కె.దయాకర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డి, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, రాములు తదితరులతో కలసి రాజ్నాథ్తో భేటీ అరుున సీనియర్ నేత ఎర్రబెల్లి దయూకర్రావు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ భేటీ తెలంగాణకు మద్దతిచ్చినందుకు కేవలం ధన్యవాదాలు చెప్పేందుకు మాత్రమే ఉద్దేశించిందని ఆయన చెప్పారు. అరుుతే ఈ సందర్భంగా రాజకీయపరమైన మంతనాలూ జరిపినట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ కుదేలైన నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీలో చేరాలన్న అభిలాషను టీ టీడీపీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. కిషన్రెడ్డి వీరికి రాజ్నాథ్ అపాయింట్మెంట్ ఇప్పించినట్లు సమాచారం. -
'విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు పరీక్ష'
హైదరాబాద్: సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తెలిపారు. వెంకయ్య నాయుడు ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు ఒక పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు వెంకయ్య నాయుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దంటూ వెంకయ్యను విమర్శించారు. -
ఓటింగ్ జరగాల్సిందే : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చతో పాటు ఓటింగ్ జరగాలనే తమ పార్టీ కోరుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి చెప్పారు. గురువారం నాడిక్కడ మాజీ ఎంపీ జి.ఆత్మచరణ్ రెడ్డి, యువజన సంఘం నేత ఓరం జయచందర్, సేవాసంస్థల నేతలు నాయిని నరోత్తమ్రెడ్డి, బోడ శ్రవణ్, మహిపాల్రెడ్డి తదితరులు తమ అనుచరులతో కలసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషన్రెడ్డి మాట్లాడారు. సభను సజావుగా నడుపుతూ బిల్లు ప్రవేశపెట్టాలని లోక్సభలో తమనేత సుష్మా స్వరాజ్ కోరితే దాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని అడగడమే పాపమా? అని ప్రశ్నించారు. నష్టమేదైనా జరిగితే సోనియా వల్లే జరిగిందని, సోనియా తమ పాలిట దెయ్యమే తప్ప దేవత కాదన్నారు. వెంటిలేటర్పై ఉన్న కేంద్రం పార్లమెంట్లో 39 బిల్లులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లి ఉరేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ, కె లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.రామచంద్రరావు, బి.వెంకటరెడ్డి, ఎస్.కుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. కాగా, విభజన బిల్లుపై అనుమానాల నివృత్తికి కిషన్రెడ్డి నాయకత్వంలో పలువురు తెలంగాణ నేతలు శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, పది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ బృందంలో ఉన్నారు. -
సభలో పెట్టని తీర్మానంపై ఓటేమిటి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: శాసనసభలో ప్రవేశపెట్టని తీర్మానంపై స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించడమేమిటని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ పూర్తయిందని స్పీకర్ ప్రకటించిన తర్వాత ఇక తీర్మానం ప్రసక్తే ఉండదని పేర్కొంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం ఓపక్క అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ మరోపక్క అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి సీఎం ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. సీమాంధ్రుల సమస్యలనూ పరిగణించాలి: జవదేకర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఏమన్నారంటే... - ఢిల్లీ అయినా, వైజాగ్ అయినా, హైదరాబాద్ అయినా బీజేపీ ఒకేలా మాట్లాడుతుంది. కాంగ్రెస్ వేర్వేరు రకాలుగా మాట్లాడుతుంది. - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టే దృశ్యాలు కాంగ్రెస్లోనే కనిపిస్తాయి తప్ప, బీజేపీలో ఉండవు. - తెలంగాణ ఏర్పాటుపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తోంది. తాజాగా సీఎం కిరణ్ కుమార్రెడ్డి బిల్లును తిరస్కరించి మళ్లీ మోసం చేశారు. - సుహృద్భావ వాతావరణంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఎలా చేయాలనే మార్గాన్ని అటల్ బిహారీ వాజ్పేయి చూపారు. విభజన ఎలా చేయకూడదనేది కాంగ్రెస్ చూపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఉన్న స్పష్టమైన తేడా ఇదే. రెండు ప్రాంతాల్లో గొడవలు సృష్టించి కాంగ్రెస్ చెడగొడుతోంది. -
కొత్తపార్టీ కోసమే కిరణ్నాటకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శ కామారెడ్డి, న్యూస్లైన్: రాష్ట్రం లో కిరణ్నాటకం అద్భుతంగా రక్తి కట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నా రు. దీనికి సోనియాగాంధీ నిర్మాతగా, దిగ్విజయ్ దర్శకత్వంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రధానపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో కొత్త పార్టీని పెట్టించి సీట్లు గెలుచుకునేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని, దాన్ని కాపాడుకునేందుకు ఈ నాటకాలకు తెరలేపిందని చెప్పారు. నాలుగున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం, 1200 మంది బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు తీర్మానం పెట్టి ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అలాగే సీమాంధ్ర ప్రజల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు. తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్య వస్తుందంటున్న సీఎం ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. -
తెలంగాణపై మా వైఖరి సుస్పష్టం: వెంకయ్య
బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ వైఖరి సుస్పష్టంగా ఉందని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తామని, సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. పార్టీ నేతలు జి.కిషన్రెడ్డి, ఎన్.ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, అశోక్యాదవ్తో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బిల్లు పార్లమెంటుకు వస్తుందా.. లేదా? వస్తే ఏమవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే తెలంగాణను ఒక్కరోజులో కూడా ఇవ్వొచ్చని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నిజాం నవాబు పాలనను కీర్తించడాన్ని తప్పుబట్టారు. రజాకార్ వారసులు నిజాంను సమర్థించడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. నిజాంను పొగడటాన్ని టీఆర్ఎస్ నేతలు ఎలా సమర్థిస్తారని ఆక్షేపించారు. 1931లో ప్రకటించిన నిజాం గెజిట్ను చూస్తే హిందువులను ఎంత హీనంగా చూశారో అర్థమవుతుందన్నారు. పండక్కీ, పబ్బానికీ, పెళ్లికీ, చివరకు జుట్టుకు కూడా పన్ను విధించిన నిజాంను కీర్తించడం దారుణమని, రజ్వీ దురాగతాలను తెలుసుకోవాలనుకుంటే సురవరం ప్రతాప్రెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదవాలని సలహా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఆందోళనలు చేయడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పనికి రాదని మండిపడ్డారు. కేజ్రీవాల్కు తన సత్తా ఏమిటో తెలిసొచ్చిందని, అందుకే ధర్నా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రసంగం దేశ భవిష్యత్ను ఆవిష్కరించిందని చెప్పారు. -
తెలంగాణలో 12 సీట్లకు బీజేపీ అభ్యర్థులు రెడీ!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే 12 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ముందుగానే ప్రకటించనుంది. ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి సమావే శంలో ఇచ్చిన మార్గనిర్దేశనం మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపికను వీలయినంత త్వరగా ముగించనుంది. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలను ఆ పార్టీ మూడు తరగతులుగా విభజించింది. ఏ కేటగిరీ కింద ఇప్పటికే గుర్తించిన 12 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించినట్టు సమాచారం. కాగా ఈ 12 సీట్లు తెలంగాణలోనివే కావడం గమనార్హం. యువకులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం సూచించినందున అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా తయారయింది. సికింద్రాబాద్ సీటును బండారు దత్తాత్రేయ, భువనగిరి లేదా మల్కాజ్గిరి సీటును నల్లు ఇంద్రసేనారెడ్డి ఆశిస్తున్నారు. కరీంనగర్ స్థానాన్ని సీహెచ్ విద్యాసాగరరావుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కోరుతుండడంతో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వయసు రీత్యా దత్తాత్రేయకు టికెట్ నిరాకరిస్తే సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి లేదా కె.లక్ష్మణ్ పోటీకి దిగుతారని తెలిసింది. పార్టీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు మల్కాజ్గిరి సీటును కోరుతున్నారు. యెండల లక్ష్మీనారాయణ నిజమాబాద్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మహబూబ్నగర్ సీటుపై నాగం జనార్దన్రెడ్డికి ఇప్పటికే హామీ లభించినట్టు తెలిసింది. నరేంద్రనాథ్ లేదా ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్కు మెదక్ టికెట్ లభించే అవకాశం ఉంది. చేవెళ్ల సీటు కోసం బద్దం బాల్రెడ్డి పట్టుబడుతున్నారు. టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ అనంతరం సమావేశం జరిపి తొలిజాబితా అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్తో చేరేవాళ్లా సలహాలిచ్చేది?: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో చేరేవాళ్లు సల హాలిస్తే ఎలా? అని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తమకు లేని పోని ఉచిత సలహాలు ఇచ్చే కన్నా వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటే మంచిదని సూచించారు. పూటకో మాట మార్చే టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించిన నేపథ్యంలో వెంకయ్య ఈ వ్యాఖ్య చేశారు. . కాంగ్రెస్ రహిత భారత్ను తమ పార్టీ కోరుకుంటోందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి 89వ జన్మదినం సందర్భంగా బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నా యుడు మాట్లాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేసిందే వాజ్పేయి అని కొనియాడారు. అవినీతికి అగ్రస్థానం కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత సోనియా, ప్రధాని మన్మో హన్ అని ధ్వజమెత్తారు. అత్యవసర పరిస్థితి నాటికన్నా ప్రస్తుత పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. ఈ తరుణంలో నరేంద్రమోడీ ఓ వెలుగురేఖగా కనిపిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ వైపు రావడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని, తాము మాత్రం యువతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ‘రండి, బీజేపీలో చేరండి’ పేరిట ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మోడీకి ఓటుతో పాటు పది నుంచి వేయి రూపాయల వరకు నోటూ ఇవ్వాలని కోరుతూ మరో ప్రచారోద్యమాన్ని చేపడుతున్నామన్నారు. సేవాకార్యక్రమాలంటే వాజ్పేయికి చాలా ఇష్టమని చెబుతూ పార్టీ రాష్ట్ర శాఖ చేపట్టిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశంసించారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, వి.రామారావు, బి.వెంకటరెడ్డి, అరుణజ్యోతి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ మల్లారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలకు కుట్టు మిషన్లు, మరికొందరికి చీరలు పంపిణీ చేశారు. పలు ఆస్పత్రులలో రోగులకు పాలు, పండ్లు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు కిషన్రెడ్డి తెలిపారు. -
రాజ్నాథ్ను కలిసిన రాష్ట్ర నేతలు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడటం, టీడీపీకి విశ్వసనీయత లేకపోవడం తమకు కలిసివస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు ఆయా పార్టీల నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా పలువురు ఆసక్తి చూపుతున్నారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి ఆ తర్వాత తప్పుకున్న బోడ జనార్దన్, వాసంశెట్టి సత్య, తదితరులు మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు. ఇది బీజేపీలోకి భవిష్యత్లో వలసలకు సంకేతంగా కని పిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఓ సామాజికవర్గం నేతలూ పార్టీ కేంద్రనాయకుల్ని కలిశారు. కొందరు సీమాంధ్ర నేతలు బుధవారం పార్టీ నేత వెంకయ్యనాయుడినీ కలవనున్నారు. టీడీపీలో కీలకంగా ఉన్న ఓ సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఒంటరి పోరే: కిషన్రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్రెడ్డి పునరుద్ఘాటించారు. టీడీపీతో పొత్తేమీ లేదని స్పష్టంచేశారు. పార్టీ నుంచి వలసలను ఆపడానికే టీడీపీ పొత్తుల ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వడంతోపాటు సీమాం ధ్రుల సమస్యలనూ పరిష్కరించాలన్నారు. -
ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండానే అధికారం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందోనని రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ తరువాత కేంద్రంలో జనతా ప్రభుత్వం, 1983లో రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో, 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం అలాగే వస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్కు చెందిన విద్యావేత్త వాసుదేవ ఆదివారం కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ, పొత్తుల రాజకీయాలతో కేంద్రంలో ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరోసారి పార్లమెంట్లో ఈ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీని, మోడీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రానున్న మూడు నెలల్లో కార్యకర్తలు బీజేపీ విధానాలను గ్రామగ్రామానికి, నగరంలో ఇంటింటికీ చేరవేయాలని కోరారు. రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
మాపై మైండ్ గేమ్ ఆడుతున్నారు : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పొత్తులు, ఎత్తులంటూ తమను మానసికంగా దెబ్బతీసేందుకు (మైండ్గేమ్ ఆడేం దుకు) వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న స్థితిలో పొత్తులపై ఎవరైనా చర్చిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీతో తమకు పొత్తులేదని స్పష్టంచేశారు. క్యాడర్ను కాపాడుకునేకునేందుకే టీడీపీ నేతలు పొత్తులంటూ లీకులిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదని, రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలున్న చరిత్రలేదన్నారు. రాష్ట్రంలోని తుపాను బాధిత ప్రాంతాలను ఆదుకునే అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. నిర్భయ చట్టం కింద తేజ్పాల్ను అరెస్టు చేయాలి తెహల్కా సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి డిమాండ్ చేశారు. తోటి ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడిన తేజ్పాల్ను క్షమించకూడదన్నారు. తేజ్పాల్ అరెస్టు కోరుతూ బుధవారం ఇక్కడ ధర్నా నిర్వహించారు. -
ముందు ప్రణాళికేంటో చెప్పండి: బీజేపీ
రెండు రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రికి బీజేపీ లేఖ విభజన బిల్లు గడువు చెప్పకుండా, సీమాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపకుండా అభిప్రాయాలు కోరటం అర్థరహితం హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడ్డాం నీరు, భద్రత, ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలి మంత్రుల బృందానికి మేం నివేదిక ఇవ్వం.. అఖిలపక్ష భేటీకి వెళ్లాలో లేదో పార్టీలో చర్చించి నిర్ణయిస్తాం హైదరాబాద్లో మీడియా సమావేశంలో వెల్లడించిన కిషన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు ఎప్పుడు తెస్తారనే విషయమై కేంద్ర ప్రభుత్వం గడువు చెప్పకుండా, విభజన ప్రక్రియలో సమస్యల పరిష్కారాలపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను కనబరచకుండా తమ అభిప్రాయాలను కోరటంలో అర్థంలేదని బీజేపీ తప్పుపట్టింది. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఓ సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో కేంద్రం ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండేకు ఒక లేఖ రాశారు. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం విధివిధానాలపై పార్టీ తరఫున ఎలాంటి నివేదికా సమర్పించలేదు. షిండేకు మూడు పేరాలతో సంక్షిప్తంగా ఒక లేఖ మాత్రం రాశారు. ‘‘హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే బీజేపీ కట్టుబడి ఉంది. రానున్న శీతాకాల సమావేశాల్లో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. అలాంటి బిల్లుకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. అదే సమయంలో.. నీటి పంపిణీ, భద్రత, రక్షణ, ఉద్యోగులు, విభజనలో ఇమిడిన ఇతర అంశాల విషయంలో సీమాంధ్రులకున్న ఆందోళనలను కేంద్రం పరిష్కరించాలి. బిల్లు ఎప్పుడు తీసుకొస్తారనే విషయమై కేంద్రం ఏ గడువూ చెప్పలేదు. గడువుపై, విభజన ప్రక్రియలోని సమస్యలపై కాంగ్రెస్, కేంద్రం నిబద్ధతను కనబరచకుండా, మా అభిప్రాయాలు కోరడంలో అర్థం లేదు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఓ సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రిమండలి నియమించిన మంత్రుల బృందానికి (జీవోఎం) నివేదిక ఇవ్వం.. ఇవ్వాల్సిన పని లేదు’’ అని కిషన్రెడ్డి తేల్చిచెప్పారు. జీఓఎం అడిగిన 11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ వైఖరేమిటో ముందు చెప్పి తర్వాత తమను అడగాలని స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును చూసిన తర్వాతే బేషరతు మద్దతు విషయం గురించి చెప్తామని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్రెడ్డి, ప్రభాకర్, ఎస్.కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. విభజన వ్యవహారంలో కేంద్రం సమతుల్యత కోల్పోయినట్టు కనిపిస్తోందని.. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘జీవోఎం ఏదో ప్రశ్నపత్రం ఇస్తే రాజకీయ పార్టీలు సమాధానం ఇవ్వాలా? అయినా.. ముందు కేంద్రం తానేం చేయదల్చుకుందో చెప్పాలి కదా! అసలు కాంగ్రెస్ పార్టీలోనే స్పష్టత లేదు. కేంద్ర కేబినెట్లో తీర్మానం చేసిన మంత్రులే బయటో మాట లోపలో మాట మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి ఏమైనా చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఆ 11 ప్రశ్నలను ముందు వాళ్ల సీఎంకు, కాంగ్రెస్ మంత్రులు, నేతలకు పంపి సమాధానాలు రాబట్టి ఉండాల్సింది. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను ఎలా అడుగుతారు? మేమిచ్చే సమాధానాలను బట్టి మీరు నివేదికలు, బిల్లులు రూపొందిస్తారా?’’ అని ధ్వజమెత్తారు. ఇదంతా కాంగ్రెస్ నాటకమని, అందులో కిరణ్ది ఓ పాత్ర అని, దిగ్విజయ్ ఒక జోకరని విమర్శించారు. పార్టీలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా?: విభజన విషయంలో ఈ-మెయిళ్లు పంపమనడమేమిటని కిషన్రెడ్డి తప్పుపట్టారు. ‘‘ఈ-మెయిళ్లు పంపమని కోరినప్పుడు పార్టీలు, అఖిలపక్ష భేటీలు గుర్తుకురాలేదా?’’ అని నిలదీశారు. ‘‘పార్టీలను పిలిచి మాట్లాడాలని జీవోఎంకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా? ముందు ఐదు పార్టీలకే ఆహ్వానాలన్నారు. ఆ తర్వాత 8 పార్టీలన్నారు. పావుగంట, 20 నిమిషాల్లో చర్చించేదేముంటుంది? చిన్న ప్రతినిధి వర్గాన్ని రమ్మని 6న లేఖ పంపారు. ఆ తర్వాత ఇద్దరే రమ్మని 7న లేఖ పంపారు. ఇప్పుడేమో ఒక్కర్నే రమ్మని షిండే చెప్తున్నారు.. ఇదేమన్నా చిన్నపిల్లల ఆటా? మీ డొల్లతనానికి, చిత్తశుద్ధి లేమికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పది జిల్లాల తెలంగాణకే మద్దతు: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు తమ మద్దతు ఇస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తారా?’ అనే ప్రశ్నకు.. ‘‘బిల్లు వచ్చిన తర్వాత చూసి చెప్తాం’’ అని ఆయన బదులిచ్చారు. ‘జీవోఎంను గుర్తిస్తారా? లేదా?’ అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ‘జీవోఎంకు నివేదిక ఇస్తామని చెప్పి.. ఇప్పుడెందుకు లేఖ పంపారు?’ అన్న ప్రశ్నకు.. పార్టీ కేంద్ర నాయకత్వ సూచన మేరకే నడుచుకున్నామని ఆయన బదులిచ్చారు. అసలు జీఓఎంను గుర్తిస్తారా? లేదా? 12న కలుస్తారా? లేదా? అనేదాన్ని పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీ నేతల స్వరం మారినట్టుందని విలేకరులు పేర్కొనగా.. తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. కమలం స్వరం మారిందా?: రాష్ట్ర విభజనపై బీజేపీ స్వరం మారిందా? తెలంగాణపై ఏర్పాటైన జీవోఎంకు పార్టీ తరఫున నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజుల గడువు సైతం కోరిన బీజేపీ.. చివరకు అలాంటి నివేదిక ఏదీ ఇవ్వకుండా కేవలం ఒక లేఖతో సరిపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ లేఖ కూడా జీవోఎంకు కాకుండా.. ముందు కేంద్రం వైఖరి చెప్పాలంటూ షిండేకు రాయటంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. జీవోఎంకు సమర్పించటానికి సుదీర్ఘ కసరత్తుతో రూపొందించిన నివేదికను పార్టీ జాతీయ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పక్కనపెట్టి.. హోంమంత్రికి లేఖ ఇవ్వటంలోనే బీజేపీ స్వరంలో మార్పు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విభజన అంశంలో కాంగ్రెస్ నాయకత్వం గందరగోళ వైఖరితో ముందుకెళుతుండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని చివరి నిమిషంలో బీజేపీ వ్యూహం మార్చుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజనకు సంబంధించి కేంద్రం, కాంగ్రెస్ ఎటువంటి విధానాలు అవలంభిస్తుందో, బిల్లు ముసాయిదా ఎలా ఉంటుందో చూసి దాని ఆధారంగా పార్లమెంటులో అంశాల వారీగా మాట్లాడాలన్నది బీజేపీ నేతల కొత్త ఎత్తుగడగా చెబుతున్నారు. -
తొలిరోజే టీ బిల్లు పెట్టాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎన్ని మీటింగ్లు పెట్టినా పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే తెలంగాణ బిల్లును పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం ఇంకా అందలేని, అది అందాక పార్టీలో చర్చించి వెళ్లేదీ లేనిదీ నిర్ణయిస్తామని చెప్పారు. అయితే మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినా తమ వైఖరిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 138వ జయంతి సందర్భంగా గురువారమిక్కడ అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నేతలు జి.కిషన్రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి, కె.వెంకటరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. దానం ‘దాదాగిరి’ పటేల్ విగ్రహానికి నివాళులర్పించే సందర్భంగా మంత్రి దానం నాగేందర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయపై దాదాగిరి చేసి.. చేతినుంచి మైకులాక్కొని వెళ్లిపోయారు. పుష్పాంజలి ఘటించాక దత్తాత్రేయ మైకులో మాట్లాడుతుండగా మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్అలీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు అక్కడికి వచ్చారు. దత్తాత్రేయ వారిని ఆహ్వానిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ‘జై జై మాతా, భారత్ మాతా’ అంటూ నినదించారు. దీంతో దానం ఏమనుకున్నారో ఏమో.. దత్తాత్రేయ చేతిలో నుంచి మైకు లాక్కుని.. ‘జై కాంగ్రెస్, జై సోనియా, జై జై పటేల్’ అంటూ తన అనుచరులతో నినాదాలు చేయించారు. అంతటితో ఆగక మైకుకుండే కేబుల్ వైరును తీసేసి మౌత్పీస్ను తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిదూరం వెళ్లాక గడ్డిలో విసిరేశారు. దాన్ని ఆయన అనుచరుడొకరు జేబులో పెట్టుకుని వెళ్లిపోవడంతో బీజేపీ నేతలు బిత్తరపోయారు. -
జీవోఎంకు సీమాంధ్ర బీజేపీ నివేదిక
విజయవాడలో పార్టీ నేతల కసరత్తు సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ ఆ ప్రాంత ఉద్యమ కమిటీ ఈసారి మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వానికి, విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి తమ నివేదికను అందజేయాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేత, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత డాక్టర్ కె. హరిబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీనియర్ నాయకులు ప్రొఫెసర్ శేషగిరిరావు, శాంతారెడ్డి, సోము వీర్రాజు, సురేష్రెడ్డి, యడ్లపాటి రఘునాథ్బాబు, జె. రంగరాజు తదితరులు పాల్గొన్న ఈ సమావేశానికి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డిని ఆహ్వానించలేదు. జీవోఎంకు సమర్పించాల్సిన నివేదిక ముసాయిదా తయారీపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో తలెత్తే పది కీలక అంశాలను జిల్లాల వారీగా చర్చించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి నివేదికను పార్టీ కేంద్ర నాయకత్వానికి అందజేస్తామని, వారు సూచించే సవరణలు చేసి జీవోఎంకు నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. అలాగే.. బీజేపీ తెలంగాణ నేతలు వేరుగా జీవోఎంకు మరో నివేదికను అందజేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర బీజేపీ నివేదించే అంశాలివీ... - 1953 నాటి రాష్ట్ర విభజన మాదిరి కాకుండా అత్యధికంగా నష్టపోయే రాయలసీమకుప్రత్యేక ప్యాకేజీతో పాటు చట్టబద్ధమైన హక్కులు ఉండేలా చూడాలి. - పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 200 టీఎంసీల గోదావరి జలాలు - సరఫరా చేసేందుకు చట్టబద్ధత కల్పించాలి. బ్రాహ్మణి స్టీల్ ప్రాజెక్టు చిక్కుల్లో పడి -నందున దాన్ని జాతీయం చేసి రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీగా పేరు మార్చి 20 వేల మందికి ఉపాధి దక్కేలా చూడాలి. విశాఖ, గుంతకల్లో రైల్వే జోన్లు, నందలూరు -కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి, కృష్ణా జలాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. భద్రా చలం డివిజన్ను సీమాంధ్రలో కలిపి పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తిచేయాలి. పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. -
రాష్ట్ర పర్యటనకు అనుమతించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సీబీఐ ప్రత్యేక కోర్టును కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజనపై మా వైఖరిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఎంపీగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా కూడా బెయిల్ షరతులు సడలించండి విచారణ ఈనెల 15కు వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయమై తమ పార్టీ వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, అందువల్ల తాను రాష్ట్రంలో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. అలాగే ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా కూడా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్రెడ్డి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘2009లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా 1.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందా. కొన్ని రాజకీయ కారణాలతో తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 5.43 లక్షల భారీ మెజారిటీతో తిరిగి ఎంపీగా ఎన్నికయ్యా. నా నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎంపీ, 18 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపొందారు. ఉప ఎన్నికల ప్రచారం సమయంలో మా పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. నాకు ప్రజల మద్దతు ఉందని గుర్తించి, 15 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఎన్నికల ప్రచారంలో ఉన్న నన్ను విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది. గత ఏడాది మే 23న ఈ మేరకు నాకు నోటీసులు జారీ అయ్యాయి. అప్పటికి సీబీఐ నాపై కేసు నమోదు చేసి దాదాపు 10 నెలలు గడిచిపోయాయి. మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఆ సమయంలో విచారణ పేరిట పిలిచి సీబీఐ నన్ను అరెస్టు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న నన్ను అరెస్టు చేయడాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది’’ అని జగన్ తన పిటిషన్లో వివరించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ‘‘2010 నవంబర్లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యా. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించా. నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు అనేక ప్రాంతాలకు వెళ్లాను. ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికీ వర్తిస్తాయి. ఇప్పుడు కూడా ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. వారి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాల్సి ఉంది. ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న సమయంలో నేను ప్రజల్లోకి వెళ్లడం తప్పనిసరి’’ అని జగన్ పేర్కొన్నారు. విభజనపై వైఖరిని వివరించాలి ‘‘రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము విభజనను వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతున్నాం. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మా పార్టీ వైఖరిని అన్నివర్గాల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలవాల్సి ఉంటుంది. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. మా పార్టీ రాష్ట్రంలోనే బలమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. అలాంటి పార్టీ కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. సీబీఐ నామీద మోపిన అభియోగాలు విచారణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించండి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించను.’’ అని జగన్ తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు. -
కేసులతో వేధించినా ప్రజలకు దూరం చేయలేరు
కాంగ్రెస్ను వ్యతిరేకిస్తే కేసులతో బెదిరిస్తోంది: కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజాభిమానం చూరగొన్న నేతలను కేసులతో వేధించినా ప్రజల హృదయాల్లోంచి వారిని దూరం చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న వారిని కేసులు, విచారణల ద్వారా అడ్డుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందా? లేక రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకా? అని ప్రశ్నించారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, ఎస్పీ అధ్యక్షుడు ములాయంసింగ్తో పాటు పలువురిని వేధించడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. మహిళా రాజ్యాధికార సంఘం నాయకురాలు ఆకుల లలిత, ఆమె భర్త మోహన్రెడ్డి, సీమాంధ్రకు చెందిన యువపారిశ్రామిక వేత్తలు వల్లభనేని ఆశాకిరణ్, కండ్లగుంట్ల శ్రీనివాసరావు, పి.గోపీకృష్ణ, పలువురు నాయకులు శుక్రవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మాజీ సైనికుల సభలో మోడీతో కలిసి వేదిక పంచుకున్నందుకే ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్పై కాంగ్రెస్ విచారణకు ఆదేశించిందని చెప్పారు. తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకోలేదని టీ టర్న్ తీసుకుందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే తీవ్రవాదం తొలగిపోతుందని బండారు దత్తాత్రేయ చెప్పారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్కు ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని సీహెచ్.విద్యాసాగర్రావు అన్నారు. కార్యక్రమంలో డా.లక్ష్మణ్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎస్.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మహిళా మోర్చా, కిసాన్మోర్చా భేటీలకు కూడా కిషన్రెడ్డి హాజరయ్యారు. వచ్చే నెలలో మహిళా మోర్చా రాష్ర్ట కార్యవర్గ భేటీ జరపాలని నిర్ణయించారు. ఇలా ఉండగా ఎవరె న్ని అసత్య ఆరోపణలు చేసినా తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ వెనకడుగు వేయబోదని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించాలి: జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు, రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెంటనే రోడ్మ్యాప్ ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. కేబినేట్ నోట్ తయారీకే నెల రోజులు పడితే బిల్లు తయారీకి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించారు. ఢిల్లీలో పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య మంగళవారం బీజేపీ నేతలు కిషన్రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, దత్తాత్రేయ, రాజేశ్వరరావు, అశోక్కుమార్ యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం లక్ష్మయ్యతో కలిసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు ఎలా న్యాయం చేయబోతున్నారో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ప్రకటించి అక్కడి నేతల నోళ్లకు తాళం వేయించాలని డిమాండ్ చేశారు. సీమాం ధ్ర రాజధానికి ఎంత ఖర్చయినా వెనకాడబోమని కేంద్రం చెప్పాలన్నారు. సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను లక్ష్మయ్య ఖండించారు. విభేదాలను పక్కనబెట్టి జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకావాలన్న కోదండరాం వినతి మేరకు బీజేపీ నేతలు మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు బుధవారం సాయంత్రం మరోసారి సమావేశం కావాలని వారు నిర్ణయించారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. -
ఈ నెలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలి: జి.కిషన్రెడ్డి
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా ఈ నెలలోనే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ‘తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన మ హాదీక్ష’ జరిగింది. కిషన్రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, పార్టీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మినారాయణ, సీనియర్ నాయకులు బద్దం బాల్రెడ్డి, ప్రభాకర్తో సహా 1,100 మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యుసీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత పది రోజుల్లో రాష్ట్రపతికి,వ ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతామని చెప్పి, ఇప్పటివరకు పెట్టలేదని విమర్శించారు. హైదరాబాద్లో ఐటీని, హైటెక్ సిటీని తాను అభివృద్ధి చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంలో అర్థం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా సీఎం కిరణ్కుమార్రెడ్డిదేనని ఆరోపించారు. పుండు మీద కారం చల్లినట్లుగా ముఖ్యమంత్రి హైదరాబాద్లో సమైక్య సభ పెట్టించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మినహా బంద్కు మద్దతు హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బంద్కు బీజేపీ మద్దతు ఇస్తుందని కిషన్రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీఎన్జీవోల సభ సందర్భంగా సీఎం కిరణ్కుమార్రెడ్డి హైదరాబాద్లో గొడవలు సృష్టించనున్నారని తమకు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్లో ప్రశాంతత ఉండటం కోసమే అక్కడ బంద్లో బీజేపీ పాల్గొనడం లేదని చెప్పారు. ఏపీఎన్జీవోల సభను వ్యతిరేకిస్తున్నా: నాగం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఎపీఎన్జీవోల సభను బీజేపీ వ్యతిరేకించకున్నా వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తున్నానని ఆ పార్టీ నేత నాగం జనార్దన్రెడ్డి చెప్పారు. -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెస్సే: కిషన్రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: అన్నదమ్ముల్లా మెలగుతున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్లో సభకు ఏపీఎన్జీవోలకు అనుమతిచ్చి, టీజేఏసీ ర్యాలీకి అనువుతి నిరాకరించడంతో ఉద్యోగుల మధ్య విభేదాలు మరింత ముదిరాయని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కిషన్రెడ్డి గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జేఏసీ సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరుతూ శుక్రవారం వరంగల్లో దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ బలపరుస్తుందని, లేకుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే సీమాంధ్రులను ఒప్పించి తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణ మంత్రులు ఇపుడు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. వుహబూబ్నగర్లో జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు బీజేపీ సీనియుర్నేత సుష్మాస్వరాజ్ 28న మధ్యాహ్నం వచ్చి, వురుసటిరోజు తిరిగి వెళతారని కిషన్రెడ్డి తెలిపారు. -
బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ సాధ్యమా?: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్లో సీమాంధ్ర ప్రాంత లోక్సభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ను టీఆర్ఎస్ నేతలు విమర్శించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ లేకుండా టీఆర్ఎస్ తెలంగాణను తీసుకురాగలుగుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసమే టీవీ ఛానల్ పెట్టామంటూ అదే చానల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి సుష్మాస్వరాజ్ అని, కావాలంటే పార్లమెంట్ రికార్డులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. పార్లమెంట్కు వెళ్లని టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ను విమర్శిస్తున్నారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. కాంగ్రెస్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాల న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయ డం కాదని, సీడబ్ల్యూసీ నిర్ణయా న్ని వ్యతిరేకిస్తున్న వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమాంధ్ర ఉద్యమం సోనియా ఆడిస్తున్న నాటకమే. ఆమె ప్రమేయం, అంగీకారం లేకుండా ముఖ్యమంత్రి సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఉంటారా? సోని యా అంగీకారం లేకుండా పీసీసీ అధ్యక్షుడు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తారా?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏ పార్టీతోనూ పొత్తులుండవు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ పొత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన.. అసలు టీడీపీ తెలంగాణలోనే ఉండదు. ఇక పొత్తు ఎక్కడ ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక సబ్ప్లాన్ అమలు చేయాలంటూ బీజేపీ ఈ నెల 26, 27 తేదీల్లో ఉపవాస దీక్ష చేపడుతున్నట్టు కిషన్రెడ్డి వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనల్లో న్యాయం లేదు: నాగం మహబూబ్నగర్, న్యూస్లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రులు చేస్తున్న డిమాండ్లో న్యాయం లేదని బీజేపీనేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఆయన 1100 మందితో కలిసి ‘తెలంగాణ స్వయం పాలన సాధనా దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ సీమాంధ్రులు సంపద, ఉద్యోగాలు, నీళ్లు దోచుకుంటూ తెలంగాణ ప్రజల పొట్టకొడుతున్నారన్నారు. పార్లమెంటులో బిల్లుపెట్టే వరకు కాంగ్రెస్ను నమ్మలేమన్నారు. కాగా, ‘మా తెలంగాణ మాకు కావాలనే నినాదంతో ఎంతోమంది ఇంటిల్లి పాదిని వదిలేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఉద్యమంలో పాల్గొని పోలీసు బుల్లెట్లకు బలయ్యారు. ఎందరో ప్రాణత్యాగం చేశారు. నాటి సంఘటనలు గుర్తుకు వస్తే బాధేస్తుంది... ఎంత కాలం ఈ అవమానాలు... అఘాయిత్యాలు’ అంటూ ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నాగం కంటతడిపెట్టారు. -
'విభజన విషయంలో కాంగ్రెస్ నాటకాలు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి శనివారం హైదరాబాద్ ఆరోపించారు. తమ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ను విస్మరించే నైతికత ఆ పార్టీకి ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీయే లేదని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎక్కడిదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి కూడా పార్లమెంట్కు వెళ్లని నేతల సర్టిఫికెట్ తమకు అక్కరలేదని జి.కిషన్రెడ్డి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్కు మోడీ విమర్శించే హక్కు లేదు: కిషన్రెడ్డి
మాట తప్పడం, మడప తిప్పడమే అలవాటైన కాంగ్రెస్కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ నవభారత యువభేరీ సదస్సుకు వచ్చిన స్పందనకు ఓర్వలేకే సీఎం కిరణ్కుమార్రెడ్డి అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి కిషన్రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్లో మోడీ సదస్సు జయప్రదం కావడంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కిరణ్.. సోనియా మెప్పు కోసమే మోడీని విమర్శిస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం లక్ష అబద్ధాలు, కోటి అపశ్రుతులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ చెప్పినట్లు అభివృద్ధిలో గుజరాత్ కంటే ఏపీనే ముందుంటే సోనియా గాంధీ.. నరేంద్ర మోడీకి రాజీవ్గాంధీ ఫౌండేషన్ అవార్డు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.