Gold Ornaments
-
జయలలిత వస్తువుల అప్పగింత షురూ!
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 టూ ఇన్ వన్ టేప్రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్ల పిటిషన్ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. -
ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధర!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధరలు పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర పాతికేళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. గురువారం మార్కెట్లో మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.79 వేల మార్కును దాటింది. 2000 సంవత్సరంలో తులం బంగారం రూ. 4,400 ఉండగా ఇప్పుడు రూ.79 వేలకు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువుగానీ, లోహం ధరగానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. శుభకార్యాలలో ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానుకలుగా బంగారం ఇస్తుంటారు.పెళ్లిళ్లలో అయితే తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. ఐదు తులాలు అంటే ప్రస్తుతం రూ. 4 లక్షలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలామంది బంగారు ఆభరణాలను కొనలేని పరిస్థితిలో ఇమిటేషన్ జ్యువెలరీని ఆశ్రయిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలపై కామారెడ్డికి చెందిన మూడు తరాలవారితో ‘సాక్షి’ మాట్లాడింది. ఒక తరంలో ఉన్న ధరకు, తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.నూరు రూపాయలుండే..నా పెళ్లి 1954 సంవత్సరంలో అయ్యింది. అప్పుడు బంగారం తులం నూరు రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయి నా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగి పోయాయి. బంగారం ధర వింటేనే భయమేస్తుంది.– పొగాకు నర్సుబాయి, కామారెడ్డితులానికి రూ. 1400 ఉండేది..నా పెళ్లి 1980 లో జరిగింది. అప్పట్ల తులం బంగారం ధర రూ. 1,400 ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పటిది అప్పుడు, ఇçప్ప టిదిప్పుడు అన్నట్టుగా నే ఉంది. బంగారం ధరలు బాగా పెరిగి, సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి చేరింది.– మైలారపు అంజలి, పొగాకు నర్సుబాయి కూతురు, కామారెడ్డితులానికి రూ.5,500 ఎక్కువ అనుకున్నం...నా వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు తులం బంగారం ధర రూ.5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నం. తరువాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రూ.79 వేలు అంటుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇరవై ఏళ్లల్లో ధర అడ్డగోలుగా పెరిగింది. – ముప్పారపు అపర్ణ, పొగాకు నర్సుబాయి మనవరాలు, కామారెడ్డి -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్కుమార్, లోక్నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
అసలే పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనడం కష్టమే.. ధర ఎంతో తెలుసా..
బంగారం ధర ఎప్పుడూ లేనంతగా రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.66,400 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు. కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది. గురువారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,440గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. -
తిరుమల శ్రీనివాసుడికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకలు
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ కానుకలు సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం(జూలై 16) తిరుమలకు చేరుకున్న నారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన బంగారు కానుకలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గాను బంగారుతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. రెండు కేజీల పరిమాణంతో ఉన్న ఈ స్వర్ణాభరణాల విలువ కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి ➤ ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని, అప్పటి నుంచి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
బెంగళూరులో వర్ష బీభత్సం.. రూ.2 కోట్ల బంగారం కొట్టుకుపోయింది!
బెంగళూరు: గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమానికి తీవ్రంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళితే.. మల్లీశ్వర్లోని 9వ క్రాస్లోని ఓ నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత అధికంగా వరద నీరు షాపులోకి రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వానల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
విక్రమార్కుడు సీన్ రిపీట్.. నగలు ఇస్తే పూజలు చేసి ఇస్తామని చెప్పి
సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు. నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కడప కల్చరల్ : శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...అంటున్నారు పురోహితులు. అవును మరి...వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ఉండవు. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముమూర్తాలు తక్కువ కావడం...ఉన్నా...కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు...నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్ తదితరాలకు కూడా టోకన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. గండం దాటుకుంటాం ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్న బంగారం రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల సమాచారం. వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. -
వారసత్వ కళావైభవం
పెళ్లి కుదిరిందంటే చాలు అలంకరణ వస్తువుల ఎంపికలో హడావిడి మొదలవుతుంది. వాటిలో అందమైన దుస్తులదే అగ్రస్థానం. నవ వధువు అన్ని సమయాల్లో అందంగా ఉండటం అంటే ఆమె భావి జీవితం ఆనందంగా ఉండబోతోందనడానికి సూచిక. పెళ్లిరోజు మాత్రమే కాదు ముందు జరిగే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత జరిగే రిసెప్షన్.. ప్రతి వేడుక ఘనంగా ఉండాలని చూస్తారు. అందుకు మరో ఎంపిక అవసరం లేని కళా వైభవాన్ని పంకజ్.ఎస్ డిజైన్లు అందిస్తాయి. రాచకళలో సమైక్యత రాజసం, కవిత్వం, ఆధ్యాత్మికం, కళాత్మకం గురించి ఒకేసారి వివరించాలంటే పంకజ్.ఎస్ డ్రెస్ డిజైన్స్ను చూస్తే చాలు. భారతీయ చిత్రకళా సోయగం, కళాకారుల పనితనానికి గౌరవం తన డిజైన్స్ ద్వారా చూపుతారని ఎవ్వరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కృష్ణ సౌందర్యం రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యాన్ని డిజైన్స్లో రూపుకట్టాలంటే అందుకు ఇతిహాస ఘట్టాలు చాలా ప్రధానమైనవి అంటారు ఈ డిజైనర్. ఢిల్లీలోని నోయిడాలో ఉంటున్న ఈ డిజైనర్ తన డిజైన్స్కి ఉదయపూర్లోని కళాకారులచే శ్రీకృష్ణుని చిత్రాలను ఫ్యాబ్రిక్పై డిజైన్స్గా తీసుకున్నారు. రాధాకృష్ణుల నృత్యం, ఆవులు, మర్రి ఆకులు, ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని అంచులుగా కళ్లకు కడతారు. ఈ డిజైన్స్లో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గోటాపట్టీలు గ్రాండ్గా అమరిపోతాయి. కృష్ణుడి గురించి శ్లోకాలను కాలిగ్రాఫిక్ పద్ధతిలో దారంతో తీసుకు వచ్చిన డిజైన్స్ వీటిలో చూడవచ్చు. శ్యామవర్ణంలో గొప్పగా అలంకరించిన బెనారసీ టిష్యూ చీరపైన యమునానది, నాట్యం చేస్తున్న నెమళ్లు, వికసించే తామరల మధ్య వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి చిత్రంతో భారీగా అలంకరించిన పల్లూ ఉంటుంది. బ్లౌజ్ డిజైన్స్ మీద జరీతో చేసిన నవరత్న భూషితమైన ఎంబ్రాయిడరీ నవవధువులను మరింత గ్రాండ్గా చూపుతాయి. -
అమ్మ చేసిన అలవాటు.. ఆయన 5 కిలోల ‘గోల్డ్మన్’
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): ఒంటిమీద కిలోలకొద్దీ బంగారం ధరించిన వ్యక్తులను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వారిని ఆ ప్రాంతంలో గోల్డ్మన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు మన వైజాగ్లో కూడా ఒక గోల్డ్మన్ ఉన్నాడు. ఆయనే సీతమ్మ ధారకు చెందిన ముక్క శ్రీనివాస్. ఆయన నిత్యం కనీసం కిలో బంగారాన్ని ధరిస్తారు. ఆయన వద్ద మొత్తంగా 5 కిలోల బంగారం ఉందట. చిన్నప్పుడు అతికోపిష్టి అయిన శ్రీనివాస్కు కోపం తగ్గాలని వాళ్ల అమ్మ ఆయనకు చైను, రెండు ఉంగరాలు నిరంతరం పెట్టేదట. అప్పటి నుంచి అది అలవాటుగా మారి శ్రీనివాస్ ఇప్పుడు గోల్డ్మన్గా అవతరించాడు. బీచ్రోడ్డులో ఓ కార్యక్రమంలో ఆయన్ను సందర్శకులు ఎంతో ఆసక్తితో గమనించారు. చదవండి👉🏻 చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్.. -
భర్త వర్క్ ఫ్రం హోమ్లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో.
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: ఇంట్లో చొరబడిన ఓ మహిళ బంగారు ఆభరణాలతో పాటు సెల్ఫోన్ను దొంగిలించగా సీసీ కెమెరాల ఆధారంగా కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ ధర్మారెడ్డి ఎల్ఐజీ గృహాల్లో నివాసమండే రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఈ నెల 22న వర్క్ ఫ్రంహోంలో భాగంగా బెడ్రూమ్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతని భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. చదవండి: అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మక్కల లక్ష్మి అలియాస్ హలీమా బేగం (36) రాజేశ్వర్రెడ్డి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఫోన్ను దొంగిలించి పారిపోయింది. రాజేశ్వర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ సి కెమెరాల ఆధారంగా శనివారం లక్ష్మిని అదుపులో తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా అరెస్టయిన లక్ష్మి శేరిలింగంపల్లిలో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
బంగారంపై జీఎస్టీ తగ్గించండి
ముంబై: ఆభరణాల పరిశ్రమపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 3 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్ ముందస్తు సిఫారసులు చేస్తూ బంగారం, విలువైన లోహాలు, రత్నాలు అటువంటి వాటితో తయారు చేసిన ఆభరణాలపై ఆదాయ సమానత్వ సూత్రం ఆధారంగా 1.25 శాతం జీఎస్టీ రేటును అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ భారతదేశంలోని అనేక కుటుంబాలు పాన్ కార్డులను కలిగి ఉండవని, ఈ పరిస్థితుల్లో అవసరమైన సమయాల్లో అవసరమైన కనీస ఆభరణాలను పొందడంలో వారు ఇబ్బందుల పడుతున్నారని తెలిపింది. ఈ ఇబ్బందులను ఎదుర్కొనడంలో భాగంగా పాన్ కార్డ్ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని ఆర్థికమంత్రిని కోరింది. ఏ శాఖ అధికారులు ప్రశ్నించకుండా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్) కింద ఒక వ్యక్తి డిపాజిట్ చేయగలిగే బంగారం కనీస పరిమాణంపై తగిన స్పష్టత ఇవ్వాలనీ కేంద్రానికి కోరింది. 22 క్యారెట్ల బంగా రు ఆభరణాల కొనుగోలు కోసం రత్నాలు,ఆభరణాల పరిశ్రమకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఈఎంఐ) సౌకర్యాన్ని అనుమతించాలని పరిశ్రమ సంఘం అభ్యర్థించింది. మహమ్మారి నేపథ్యంలో పరిశ్రమ వ్యాపార పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. చదవండి: ‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్టీ తగ్గాల్సిందే’ -
అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది. అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా -
పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు. 1920లలో బంగారం వ్యాపారానికి పునాది దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్ను ప్రారంభించారు. రాజస్థాన్కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి. రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్సేల్గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్కతా, చెన్నై, అమృత్సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు. 30 మంది వరకూ హోల్సేల్ వ్యాపారులు.. నరసాపురంలో 30మంది వరకూ హోల్సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది. గోల్డ్ ఎగ్జిబిషన్లో నరసాపురం స్టాల్స్ ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లా ప్రజలతో జైన్లు మమేకం బంగారం వ్యాపారం కోసం గణేష్మల్, శాంతలాల్, జోట్మల్ నట్మల్, గులాబ్చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్లో కూడా ఇది కొనసాగాలి – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం అన్ని డిజైన్లూ దొరుకుతాయి ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు. – మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం మా పెద్దల కృషే కారణం నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది. – వినోద్కుమార్జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
Hyderabad: రెండు కేజీల బంగారు నగల బ్యాగు మిస్సింగ్
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అమీర్పేట్ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. -
‘ఆభార్’ కలెక్షన్ను లాంఛ్ చేసిన రిలయన్స్ జువెల్స్
ముంబై: రిలయన్స్ జువెల్స్ 14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్ను లాంచ్ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్కు ‘ఆభార్’ ను ఎక్స్టెన్షన్గా లాంచ్ చేసింది. ఈ కలెక్షన్ లాంచ్తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్కాధాగా అనే థీమ్తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్ కలెక్షన్లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్లో అద్బుతమైన బంగారం, వజ్రాల ఇయర్ రింగ్స్ కొత్త డిజైన్లు కస్టమర్లకు లభించనున్నాయి. రిలయన్స్ జువెల్స్ జూలై 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్తో రిలయన్స్ జువెల్స్ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్ కలెక్షన్తో రిలయన్స్ జువెల్స్కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి సొంతింట్లో లూటీ, టైం చూసి జంప్
తాడిపత్రి : బంగారం అపహరణ కేసులో మిస్టరీని తాడిపత్రి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య వెల్లడించారు. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు సమీపంలో పక్కపక్క ఇళ్లలో సోదరులు హాజీవలి, షాజహాన్ నివాసముంటున్నారు. ఈ ఏడాది మే 22న ఈ రెండు ఇళ్లలో రూ.7.50లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సొంతింటికే కన్నం షాజహాన్ భార్య షాహీనా. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా ఉండే బాలబ్రహ్మయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం మే 22న తన ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పొరుగున ఉన్న తన బావ ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలను బ్రహ్మయ్యకు అందజేసి, ఏమీ తెలియని దానిలా ఇంటిలోనే ఉండిపోయింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే.. అదే నెల 28న కుమార్తెతో కలిసి షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో భార్య కనిపించడం లేదంటూ షాజహాన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడిన చిక్కుముడి షాహీనా కనిపించడం లేదంటూ భర్త షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ ఖాజాహుస్సేన్ అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన చోరీకి, ఆమె కనించకుండా పోవడానికి కారణాలను అన్వేషిస్తూ వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఆమె ఆచూకీ పసిగట్టారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను అరెస్ట్ చేసి తాడిపత్రికి పిలుచుకువచ్చారు. చోరీ చేసుకెళ్లిన 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, కేసులో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్మార్కింగ్తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
మూడు వారాల కింద పెళ్లి.. పాలల్లో మత్తు మందు కలిపి
లక్నో: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్తరప్రదేశ్లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే కలిసిపోయినట్లు నటించింది. కాగా సోమవారం రాత్రి భర్తకు, అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలు తాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా ఉదయం నిద్ర లేచి చూసేసరికి శాలిని ఇంట్లో కనిపించలేదు.దీంతో ఉపేంద్ర, అతని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, చీరలు మాయమయ్యాయి. దాంతో కొత్త కోడలే ఈ పని చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: భర్త ఫోన్పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
జూన్ నుంచి గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. 2019 నవంబర్లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్మార్కింగ్ తప్పనిసరి. హాల్మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (బీఐఎస్)తో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు. -
బంజారాహిల్స్లో పని మనిషి అరెస్టు
బంజారాహిల్స్: నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన ఘట నలో నిందితురాలిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 లోని ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ అపార్ట్మెంట్స్లో నివసించే ఉదయ్భాస్కర్ అనే అధికారి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన సరోజ అనే మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. యజమాని లేని సమయంలో తొమ్మి ది తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయ్భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితురాలిని రిమాండ్కు తరలించారు. క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా హైదరాబాద్లో దారుణం: సోదరిపై అత్యాచారం -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల
బాలానగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లుగుల్ల చేసిన ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ. వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ –1 లో ముక్కు పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 11న బీరువాలో 5.5. తులాల బంగారు ఆభరణాలు దాచి పెట్టారు. అయితే.. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చి బీరువా తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.20లక్షల నగల్ని..
చెన్నై : ఆటోలో పోగొట్టుకున్న 50 సవర్ల నగలను తిరిగి సొంతదారునికి అప్పగించి తన నిజాయితీని ఆటో డ్రైవర్ చాటుకున్నాడు. ఈ ఘటన చెన్నై, క్రోంపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. క్రోంపేటకు చెందిన ఆల్బ్రైట్ వ్యాపారుల సంఘం నేత. ఇతని కుమార్తెకు గురువారం ఉదయం అదే ప్రాంతంలో వున్న చర్చిలో వివాహం జరుగనుంది. దీ నిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం రిసెప్షన్ జరుగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చర్చి నుంచి ఆటోలో ఆల్బ్రైట్ ఇంటికి వెళ్లాడు. రూ. 20 లక్షల రూపాయలు విలువ చేసే 50 సవర్ల నగల సంచిని ఆటోలో పెట్టి మరిచి దిగి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్బ్రైట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటోలో నగల సంచి ఉండడం గమనించిన ఆటో డ్రైవర్ శరవణకుమార్ (30) ఆ నగలను తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. నగలను పోలీసు లు సరి చూసి ఆల్బ్రైట్ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. 50 సవర్ల నగలు తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న శరవణ కుమార్కు పోలీసులు అభినందించారు. -
పెళ్లి మంటపంపైనే నగలు చోరీ
డిచ్పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఈ ఘటన జరిగింది. సిద్దిపేటకు చెందిన ఫణీంద్రకు, మహారాష్ట్ర ఉమ్రికి చెందిన కావ్యతో డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్స్లో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లి జరగుతున్న సమయంలో 25, 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి ముందు వరస కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ఫొటోలు దిగేందుకు తన బంగారు నగలను తరచూ మార్చుతూ ఉంది. నగలను సమీప బంధువైన ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో ఉంచారు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకరు స్టేజీ పైకి చేరుకుని నగలు పట్టుకున్న మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ మహిళ మైకంలో ఉన్న సమయంలోనే ఆమె వద్ద ఉన్న నగల బ్యాగును ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఇద్దరు దొంగలు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి మైకం నుంచి కోలుకున్న మహిళ నగల బ్యాగు కన్పించక పోవడంతో ఆందోళనగా విషయాన్ని పెళ్లి వారికి తెలిపింది. దీంతో అప్పటివరకు ఎంతో హుషారుగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్కుమార్ సీసీ టీవీ పుటేజీలతో పాటు పెళ్లి వేడుకల్లో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. -
‘అపరిచిత ప్రేమికుడి’ బండారం బట్టబయలు..
ప్రేమ పేరిట యువతుల్ని దగా చేయడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. గూగుల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగినంటూ యువతుల్ని మోసం చేసి దండుకోవడంలో ఆరితేరిపోయాడు. ఇతని ‘ప్రేమ’మాయలో పడిన ఓ యువతి లక్షలు సమర్పించింది. బంగారు ఆభరణాలూ ఇచ్చింది. సెల్ఫోన్లో పరిచయమై మూడేళ్లైనా కనిపించకుండా, అడ్రస్ చెప్పకుండా దాటవేస్తుండడంతో అనుమానించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ‘అపరిచిత ప్రేమికుడి’ బండారం బట్టబయలైంది. సాక్షి, పాకాల(చిత్తూరు) : గూగుల్ కంపెనీలో పని చేస్తున్నానని పాకాలకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం సెల్ఫోన్లో ఓ యువకుడు పరిచయం చేసుకున్నాడు. తన పేరు గుణశేఖర్(27) అని, తనది అనంతపురం జిల్లా అని చెప్పాడు. ప్రేమ పేరిట ఆమెను బుట్టలో పడేశాడు. యువతి అతన్ని ప్రత్యక్షంగా చూడలేదు. తనకు అత్యవసరం ఉందంటూ మూడేళ్ల వ్యవధిలో ఆమె నుంచి దాదాపు రూ.10 లక్షలు తీసుకున్నాడు. అతడు కోరినంత మొత్తాన్ని ఆన్లైన్లో పంపుతూ వచ్చేది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు వివాహం నిమిత్తం ఉంచిన నగలు, నగదును అతగాడికి సమర్పించింది. వీడియో కాల్ చేసినా ముఖం కనిపించకుండా చాట్ చేస్తుండడంతో చివరకు అనుమానించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే పేరుతో ఒకసారి అతడే నేరుగా వచ్చి డబ్బులు తీసుకున్నా ఆ యువతి గుర్తించకపోవడం కొసమెరుపు. ఫిర్యా దును సీరియస్గా తీసుకున్న సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ రాజశేఖర్ సెల్ నంబర్, ఆన్లైన్ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడు మండలంలోని మొగరాల పంచాయతీ గొల్లపల్లెకు చెందిన చిన్నస్వామి కుమారుడు అని తేలింది. కృష్ణాపురం వద్ద అతడిని అరెస్టు చేశారు. చదవండి: ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ.. రికవరీ ఏం చేశారంటే.. నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదు, అతడు తన తమ్ముడు జానకిరామ్ పేరుతో కొన్న రాయల్ ఎన్ఫీల్డ్, యువతి నుంచి తీసుకున్న బంగారు నల్లపూసల దండ, ఒక జత బంగారు కమ్మలు, చెంపసారాలు, నిందితుడు ఉపయోగించిన స్మార్ట్ఫోన్, కీప్యాడ్ ఫోన్, ఏటీఎం కార్డులు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇతడు వన్యప్రాణులను కూడా వేటాడి విక్రయించే వాడని తేలిందని బుధవారం విలేకరులకు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు ముక్తీశ్వర్, శివకు సీఐ రివార్డును అందజేశారు. మరికొందరు యువతుల్ని కూడా ఇతడు మోసగించి డబ్బులు పొందినట్లు తేలిందని, బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. చదవండి: 9 మంది ప్రాణం తీసిన నూడిల్స్ -
జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్లైట్ వ్యవహారం
సాక్షి, ప్రకాశం: కందుకూరు మెప్మాలో ఓ బంగారు బ్రాస్లెట్ వ్యవహారం తీవ్ర చర్చగా మారింది. పొదుపు సంఘాల గ్రూపుల నిర్వహణలో జరుగుతున్న అవినీతి వ్యవహారానికి ప్రతీకగా ఈ బ్రాస్లెట్ కథ చర్చనీయాంశమైంది. ఓ మహిళా సీఓ మెప్పు కోసం ఆర్పీలు అంతా కలిసి సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయడం... ఆ డబ్బులతో అమ్మగారికి బ్రాస్లెట్ చేయించడం, ఇది కాస్త బయటకు వచ్చి వ్యవహారం రచ్చగా మారింది. దీంతో బ్రాస్లెట్ డబ్బులను సదరు సీఓ తిరిగి ఆర్పీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. మెప్మాలో జరుగుతున్న అవినీతి, మహిళల నుంచి డబ్బుల వసూలు కార్యక్రమానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. అసలేం జరిగింది..? పట్టణ మెప్మా విభాగంలో పనిచేసే ఓ మహిళా సీఓ అవినీతి వ్యవహారానికి ఈ బ్రాస్లెట్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఇటీవల కాలంలో ఆమె ఇంట్లో ఓ వేడుక జరిగింది. ఈ వేడకకు ఆమెకు విలువైన కానుక ఇవ్వాలని రిసోర్స్ పర్సన్స్(ఆర్పీలు) నిర్ణయించారు. దీనికి గాను వారి పరిధిలోని ప్రతి సంఘం నుంచి కొత్త మొత్తాన్ని వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన డబ్బులతో సదరు సీఓకు కానుక ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో విలువైన బంగారు బ్రాస్లెట్ను చేయించారు. వేడుక రోజు బ్రాస్లెట్ను సదరు సీఓకి అందజేశారు. ఈ వ్యవహారం కాస్త రచ్చగా మారింది. విషయం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి దాకా చేరింది. దీంతో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఇప్పుడు మెప్మాలో పెద్ద చర్చనీయాశంగా మారింది. వెంటనే అప్రమత్తమైన సదరు సీఓ బ్రాస్లెట్ కోసం చేసిన ఖర్చు మొత్తాన్ని ఆర్పీలకు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. దీంతో అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే దానిపై ఇటు సీఓ, అటు ఆర్పీల్లో చర్చగా మారింది. అయితే మెప్మాలో ఈ వ్యవహారం కొత్తేమి కాదు, రుణాలు ఇప్పించాలన్నా, ప్రభుత్వం ఏమైనా పథకాలు వచ్చినా ప్రతి సంఘం నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ తరుపున ఆర్పీలు జోరుగా ఓటర్లకు డబ్బులు పంచారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పట్టణ మెప్మాలో జరుగుతున్న అవినీతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విషయం నా దృష్టికి వచ్చింది.. విచారణ చేయిస్తా.. కందుకూరు మెప్మాలో బ్రాస్లెట్ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. అలాగే డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై త్వరలోనే విచారణ చేయిస్తాను. ఇలా డబ్బులు వసూలు చేయడం అనేది నిజంగా క్షమించరాని విషయమే. ఈ వ్యవహారాలపై త్వరలోనే విచారణ జరుపుతాం, కందుకూరులో సమావేశాలు నిర్వహించి మెప్మా సిబ్బందిలో మార్పు తీసుకుచ్చేందుకు కృషి చేస్తాను. -రఘు, మెప్మా ఇన్చార్జి పీడీ కమీషన్ వ్యాపారం.. ఇటీవల కాలంలో పొదుపు సంఘాల మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు వంటి పథకాలను అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకాల్లో వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తుండగా, చేయూత పథకం కింద రూ.18,750లను ఆర్థిక సాయం అందిస్తుంది. జగనన్నతోడు పథకం కింద చిరువ్యాపారులకు రూ.10వేల రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకాల్లో ఆసరా, జగనన్నతోడు పథకాలతో సీఓలు, ఆర్పీలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ క్రమంలో పొదుపు సంఘాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సీసీల వ్యవహారశైలిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది ఒక్క కేవలం మెప్మాకి మాత్రమే పరిమితం కాదు, వెలుగు విభాగంలో మండలాల్లో పనిచేసే సీసీలది ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు కందుకూరు, ఉలవపాడు వంటి ప్రాంతాల్లో వెలుగులోనికి వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రూరల్ ప్రాంతంలో కూడా సంఘానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని బేరంపెట్టినట్లు సమాచారం. ఇలా అధికారులే నేరుగా పొదుపు సంఘాలతో కమీషన్ వ్యాపారం చేస్తున్నట్లు తయారైంది పరిస్థితి. డబ్బులు అడిగే సీసీల సమాచారం ఇవ్వాలని, తమకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రచారం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు రావడం లేదు. -
ఈఎంఐలు చెల్లించలేక దంపతుల దుర్మార్గం..
ముంబై : టీవీలో ప్రసారమయ్యే నేర వార్తల ప్రభావంతో ఓ జంట తమ పొరుగింటి వృద్ధురాలిని చంపి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన కలకలం రేపింది. థానేలో జరిగిన ఈ దారుణ ఘటనలో వృద్ధురాలిని చంపి విలువైన వస్తువులను కాజేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. భివండి జిల్లా వధునవ్గర్ ప్రాంతంలో నవంబర్ 22న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్మార్టంనిర్వహించగా వృద్ధురాలిని పదునైన ఆయుధంతో గట్టిగా తలపై కొట్టడంతో మరణించినట్టు గుర్తించారు. మృతదేహాన్ని 70 ఏళ్ల సోనూభాయ్దిగా ఆమె కుమారుడు గుర్తించడంతో హత్య కేసును చేధించేందుకు పోలీసులకు బలమైన ఆధారం లభ్యమైంది. తొలుత వృద్ధురాలి ఇంటి నుంచి ఆమె మృతదేహం పడవేసిన ప్రాంతం వరకూ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినా పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాలేదు. సోనుభాయ్ పొరుగున ఉన్న దంపతులపై అనుమానంతో వారిని తమదైన శైలిలో ప్రశ్నించిన ఖాకీలు కీలక విషయం రాబట్టారు. ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించేందుకు సోనుభాయ్ను తామే హత్య చేశామని వారు అంగీకరించారు. చిరుద్యోగులైన తాము ఇటీవల ఏసీ, కారు, ఐఫోన్ వంటి పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశామని, వాటి ఈఎంఐలను చెల్లించలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టామని చెప్పారు. సోనుభాయ్కు పెద్దమొత్తంలో పెన్షన్ వస్తుండటంతో ఆమె బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టు తెలుసుకుని వాటిని చేజిక్కించుకునేందుకే ఆమెను హత్య చేశామని వారు వెల్లడించారు. టీవీల్లో ప్రసారమయ్యే నేర వార్తల సీరియల్స్ క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా వంటి షోలను చూసి తమకు హత్య ఆలోచన మొలకెత్తిందని ఆ దంపతులు చెప్పడం కొసమెరుపు. -
పసిడి నగలకు ‘హాల్మార్క్’
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న హాల్మార్క్లేని ఆభరణాలను పూర్తిగా ఖాళీ చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది’’ అని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్మార్క్తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. ‘‘విలువైన పసిడి విషయంలో స్వచ్ఛతకు హామీనివ్వడమే మా లక్ష్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం’’ అని వివరించారు. 2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్మార్క్ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్మార్క్వి ఉంటున్నాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆభరణాల జోలికి తాము వెళ్లబోమని మంత్రి పాశ్వాన్ స్పష్టం చేశారు. హాల్మార్కింగ్ తప్పనిసరికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను అభిప్రాయాల కోసం ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో) వెబ్సైట్లో అక్టోబర్ 10న ఉంచామని చెప్పారు. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు. హాల్మార్కింగ్ మూడు రకాలు.. ఆభరణాల హాల్మార్కింగ్ను బీఎస్ఐ మూడు రకాలుగా వర్గీకరించింది. 14 కేరట్, 18 కేరట్, 22 కేరట్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఈ మూడు విభాగాల ధరలను ఆభరణాల విక్రేతలు తమ దుకాణాల్లో ప్రదర్శించడాన్ని కూడా తప్పనిసరి చేయనున్నట్టు పాశ్వాన్ తెలిపారు. బీఐఎస్ వద్ద నమోదైన ఆభరణాల వర్తకులు బీఐఎస్ లైసెన్స్ పొందిన అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ కేంద్రాల నుంచి హాల్మార్క్ సర్టిఫికేషన్ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. 26,019 మంది జ్యువెలర్లు బీఐఎస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం రూ.లక్ష నుంచి ఆభరణాల విలువకు గరిష్టంగా ఐదు రెట్ల వరకు జరిమానాతోపాటు, బీఐఎస్ చట్టం కింద ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఐఎస్ అధికారి ఒకరు తెలిపారు. అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వర్తకుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి
పాట్నా : బిహార్లోని బేగుసారయి జిల్లాలో మంగళవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కారు డ్రైవర్ను కాల్చి చంపడమే గాక ఇద్దరు నగల వ్యాపారలును గాయపరిచి రూ. 25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దాడిలో చనిపోయిన డ్రైవర్ను దీపక్కుమార్గా గుర్తించినట్లు తెలిపారు. బేగుపారయి డీఐజీ రాజేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగుసారయికి చెందిన ప్రిన్స్ సోనీ, అభయ్ కుమర్ సింగ్, సంతోష్ కుమార్లు నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్ను పురస్కరించుకొనిహోల్సేల్గా బంగారం కొందామని మంగళవారం కోల్కతాకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో కోల్కతా నుంచి బరౌని వరకు రైళ్లో వచ్చిన వీరు అక్కడి నుంచి బేగుసారయి వెళ్లడానికి దీపక్ కుమార్కు చెందిన ఎస్యూవీ కారులో బయలుదేరారు. ఠాకూరిచౌక్ వద్దకు రాగానే అప్పటికే మాటు వేసిన దోపిడి దొంగలు కారును అడ్డుకొని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆభరణాలు ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పులల్లో కారు నడుపుతున్న డ్రైవర్ దీపక్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, సంతోష్, సోనీలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 25 కోట్లు వరకు ఉన్నట్లు తెలిసింది. కాగా, దీపక్కుమార్ మృతదేహానన్ని పోస్టుమార్టంకు తరలించామని.. గాయపడిన సంతోష్, సోనీలను బేగుసారయిలోని ఆసుపత్రికి తరలించినట్లు డీఐజీ పేర్కొన్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే గాక, ఒకరి మృతికి కారణమైన దుండగులపై ఐపీసీ సెక్షన్ 302, 307, 395 కింద గర్హారా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాజేశ్ కుమార్ వెల్లడించారు. అయితే దుండగులు వారిని ఉదయం నుంచే వెంబడిస్తూ పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. -
విన సొంపు
చెవులకు దుద్దుల్లా పెట్టుకోనక్కర్లేదు... బుట్టల్లా బరువును మోయక్కర్లేదు హుక్ని తగిలించుకుంటే చాలు... చెవిని మొత్తం కప్పుతూ... హ్యాంగింగ్లా మెరుస్తూ జూకాలా జిగేల్మంటూ... మదిని దోచుకుంటున్నాయి. ‘బంగారమైనా సరే అలా చెవిని మొత్తం కప్పేస్తే ఎలా వినపడుతుందంటావూ...’ అనే గుసగుసలు మానేసి అంతా కళ్లప్పగించి చూడాల్సిందే! గిరిజనుల ఆభరణాలు ఫ్యాషన్ జువెల్రీలో ఎప్పుడూ ట్రెండ్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ బంగారు ఆభరణాలనూ హత్తుకుని కనువిందు చేస్తుంది. చెవికి నిండుదనాన్ని తీసుకువచ్చే ఈ ఆభరణాలలో జూకాల నుంచి ఎన్నో వైవిధ్యమైన డిజైన్లు వస్తున్నాయి. రంగు రంగు రత్నాభరణాలతో చేసిన లేయర్డ్ హ్యాంగింగ్ కఫ్స్ కూడా ఇండోవెస్ట్రన్ స్టైల్లో మెరిపిస్తుంటే.. చెవిని పూర్తిగా కప్పినట్టుగా ఉండే ఈ గోల్డ్ కఫ్స్ సంప్రదాయ వేడుకలలో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ►కింది బుట్ట, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్తో ఉంటాయి. ►వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. ►వీటిలో నెమిలి, పువ్వులు–లతలు, దేవతామూర్తుల డిజైన్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. -
బాబు పెట్టిన శఠగోపం
-
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం!
సాక్షి, తిరువూరు : తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని ఒక నివాసంలో చోరీ జరిగింది. అటవీశాఖలో పనిచేస్తున్న పెరికె మోహినీ విజయలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చా రు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో తమ నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విలువైన దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి. క్లూస్ టీం దర్యాప్తు మచిలీపట్నం క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ ప్రాథమిక సమాచారం సేకరించిన అనంతరం తిరువూరు సర్కిల్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా అగంతకులు చోరీలకు పాల్పడుతున్నందున ముందస్తు బందోబస్తు కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, గుర్తుతెలియని వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసుస్టేషనుకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
20 కిలోల ‘బంగారు’బాబా
హరిద్వార్: బంగారం ధరించి తీర్థయాత్రలు చేసే సాధువు మరోసారి వార్తల్లో నిలిచారు. గోల్డెన్ బాబాగా పేరొందిన సుధీర్ మక్కర్ సుమారు 20 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ధరించి హరిద్వార్లో జరుగుతున్న కన్వార్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఆయనకి 25వ యాత్ర కావడం విశేషం. గతంలోనూ కన్వార్ యాత్రలో మక్కర్ సుమారు రూ.4 కోట్ల విలువచేసే 12–13 కిలోల బంగారం, చేతికి రూ.27 లక్షల రోలెక్స్ గడియారం ధరించి సంచలనం సృష్టించారు. ఏటా ఆయన ఒంటి మీది బంగారం పెరుగుతూ ఉంది. గతేడాది 14.5 కిలోల బంగారు ఆభరణాలు ధరించగా, ఈ ఏడాది రూ.6 కోట్ల విలువైన 20 కిలోల ఆభరణాలతో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మక్కర్ తన ఖరీదైన వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 2016 జనవరిలో జరిగిన అర్ధకుంభమేళాలో ఆయన్ని చూడటానికి సాటి యాత్రికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఆయనకు ఎల్లవేళలా ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు వెళ్లినా అక్కడి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. -
బంగారం కూడా పెట్టుబడే!!
అమ్మాయిల చిన్న వయసు నుంచే వారి వివాహ అవసరాల కోసం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బంగారు ఆభరణాలు కొంటుంటారు. పెళ్లి సమయంలో ఒకేసారి అంత సమకూర్చుకోలేమనుకునే వారు ఇలా చేస్తుంటారు. అయితే, బంగారం కోసమని ఆభరణాలు కొనడం అధిక వ్యయాలతో కూడినదే. ఎందుకంటే ఆమె పెద్దయ్యాక ఆ ఆభరణాలు నచ్చకపోతే వాటిని మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల కొంత నష్టపోవాల్సి ఉంటుంది. 10 శాతం వరకూ తరుగు తీసేస్తారు. కొత్త ఆభరణాలు కొనేటపుడూ 10–15 శాతం వరకు తయారీ వృ«థా పేరిట తీసేస్తారు. కనుక అమ్మాయి భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కావాలనుకుంటే అందుకు సార్వభౌమ బంగారం బాండ్లు అనువైనవి. కేంద్రం అందిస్తున్న బాండ్లు ఇవి. బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి కొనొచ్చు. పెట్టుబడి మొత్తానికి ఎన్ని గ్రాముల బంగారం వస్తుందో ఆ మేరకు బాండ్లను జారీ చేస్తారు. బంగారం మార్కెట్ రేటు ఆధారంగానే ఈ బాండ్ల విలువ పెరగడం, తరగడం జరుగుతుంది. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందుగా వైదొలగవచ్చు. అయితే, బాండ్లు జారీ అయిన 15 రోజుల తర్వాత అవి స్టాక్ ఎక్సే్చంజ్లలో లిస్ట్ అవుతాయి. దాంతో ఎప్పుడు అవసరమైనా వాటిని విక్రయించుకోవచ్చు. ఆభరణాలకు ఉన్నట్టు తయారీ చార్జీలు, తరుగు వంటి చిల్లులు ఇందులో ఉండవు. బాండ్ల రూపంలో ఉండడం వల్ల భద్రత సమస్య కూడా ఉండదు. ఇందులో ఉన్న మరో ఆకర్షణీయత ఏటా 2.5 శాతం వడ్డీని బాండ్ హోల్డర్లకు చెల్లించడం. బాండ్ కాల వ్యవధిలో ఒకవేళ బంగారం రేటు పెరిగితే ఆ మేరకు విలువ పెరుగుతుంది. ఏటా లభించే 2.5 శాతం వడ్డీ అదనం. ఈ లెక్కన చూస్తే భౌతిక బంగారం కంటే సౌర్వభౌమ బంగారం బాండ్లే లాభదాయకం. -
బంగారు నగలకు... హాల్మార్కింగ్ తప్పనిసరి!!
ముంబై: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్మార్కింగ్ నిబంధనలను సత్వరం అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఇది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దకు ఈ ప్రతిపాదన చేరింది. బంగారు ఆభరణాల హాల్మార్కింగ్ను తప్పనిసరి చేస్తామంటూ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు సత్వరం ఆమోదం లభిస్తుందని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముసాయిదా నిబంధనల ప్రకారం మొత్తం మూడు రకాల బంగారు ఆభరణాల (22, 18, 14 క్యారట్)కు హాల్మార్కింగ్ తప్పనిసరి కానుంది. సమగ్ర పసిడి విధానంలో భాగంగా ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలంటూ గత నెల కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సు చేసింది. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు సమస్యలు తలెత్తకుండా దీన్ని అమలు చేసే మార్గాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత పసిడి విధానంలో మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా ముందుగా హాల్మార్కింగ్ అంశాన్ని అమల్లోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గా లు తెలిపాయి. నోటిఫికేషన్ అమల్లోకి వచ్చాక.. హాల్మార్కింగ్ లేని ఆభరణాలను విక్రయించుకుని, క్లియర్ చేసుకునేందుకు జ్యుయలర్స్కి సుమారు 6 నెలల వ్యవధి దొరకవచ్చని పేర్కొన్నాయి. ఆన్లైన్లో అనుమతులపై దృష్టి.. హాల్మార్కింగ్ను సత్వరం అమల్లోకి తెచ్చే దిశగా .. దరఖాస్తుల ప్రాసెసింగ్ను కూడా వేగవంతం చేయడంపై బీఐఎస్ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లోనే జ్యుయలర్స్కి లైసెన్సు జారీ చేసే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రతిపాదన ప్రకారం ముందుగా.. 22 ప్రధాన నగరాల్లో తప్పనిసరి హాల్మార్కింగ్ నిబంధనను అమల్లోకి తేనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాల రాజధానులు, తర్వాత జిల్లాల హెడ్క్వార్టర్స్లోనూ అమలు చేస్తారు. 566 హాల్మార్క్ సెంటర్స్..: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 566 హాల్మార్కింగ్ సెంటర్స్ ఉన్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హాల్మార్కింగ్ సెంటర్స్ ప్రెసిడెంట్ హర్షద్ అజ్మీరా తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం సగటున ఇరవై శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నాయన్నారు. ఒకవేళ హాల్మార్కింగ్ తప్పనిసరి చేసిన పక్షంలో పెరిగే పనిభారాన్ని తట్టుకోవడం కష్టమేమీ కాబోదన్నారు. హాల్మార్కింగ్ తప్పనిసరి చేసే యోచన నేపథ్యంలో కొత్త హాల్మార్క్ సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించి మరో 100 పైచిలుకు దరఖాస్తులు బీఐఎస్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం జ్యుయలర్స్ బీఐఎస్ నుంచి తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మొత్తం ఆభరణాల విక్రేతల్లో పది శాతం కన్నా తక్కువ .. సుమారు 25,000 జ్యుయలర్స్ మాత్రమే లైసెన్సు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 3,00,000 పైచిలుకు జ్యుయలర్స్ ఉన్నారని అంచనా. మరోవైపు పది బులియన్ రిఫైనరీలు కూడా లైసెన్సు తీసుకున్నాయి. -
నీట్గా వచ్చి దోచేస్తాడు!
సాక్షి,, హైదరాబాద్: నలభై ఆరేళ్ల వయస్సు.. 27 ఏళ్ల నేర జీవితం.. 15 ఏళ్లుగా స్టార్ హోటళ్లే లక్ష్యం.. 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 32 చోరీలు.. రూ.12 కోట్లకు పైగా సొత్తు అపహరణ.. ఐదు కేసుల్లో మాత్రమే అరెస్టు.. మిగిలిన కేసుల్లో వివిధ రాష్ట్రాలకు ఆరేళ్లుగా మోస్ట్ వాంటెడ్.. బంజారాహిల్స్ పరిధిలోని పార్క్ హయత్ హోటల్ రూమ్ నుంచి ఈ నెల 6న రూ.30 లక్షల విలువ చేసే నగలు ఎత్తుకుపోయిన అంతర్రాష్ట్ర గజదొంగ జయేశ్ రావ్జీ సెజ్పాల్ నేపథ్యమిది. ఆహార్యం, వాక్చాతుర్యం పెట్టుబడిగా పెట్టి చోరీలు చేస్తూ.. వివిధ రాష్ట్రాల పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతున్న ఈ ఘరానా దొంగను పశ్చిమ మండల పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం వెల్లడించారు. వెస్ట్జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావులతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కొత్త జంటలు, ఫంక్షన్లకు వెళ్లేవారే టార్గెట్ గుజరాత్కు చెందిన జయేశ్ రావ్జీ సెజ్పాల్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్, ముంబైలలో కొన్ని హోటల్స్/ఫుడ్ పాయింట్స్లో క్యాటరింగ్ వర్కర్గా పని చేశాడు. అలా వచ్చే ఆదాయం చాలక 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. వీసీపీని ఎత్తుకు పోయి పోలీసులకు చిక్కి ఆథర్ రోడ్ జైలుకు వెళ్లాడు. అక్కడే ఇతడికి రమేశ్ ఛాగ్ అనే మరో నేరగాడితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఇద్దరూ కలిసి కొన్ని నేరాలు చేశారు. ఆపై జయేశ్ సొంతంగా ఆ పని ప్రారంభించాడు. ముందుగా ఓ నగరాన్ని టార్గెట్గా చేసుకునే జయేశ్.. అక్కడి ఒక స్టార్ హోటల్ వద్ద రెక్కీ చేసి.. కొత్తగా పెళ్లైనజంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు. వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం ఉంటుందనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఆ హోటల్ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు. ఆపై హోటల్ లాబీల్లో ఆ జంటలో ఒకరితో మాట కలుపుతాడు. ఇలా ఒకటి రెండుసార్లు తన టార్గెట్తో మాట్లాడుతూ హోటల్ సిబ్బంది కంటపడతాడు. దీంతో వారు జయేశ్ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయి ఉంటాడని భావిస్తారు. ఆపై రిసెప్షన్ వద్దకు వెళ్లి ఫలానా రూమ్లో తమ వారు బస చేశారని, ఆ ఫ్లోర్కు/గది యాక్సెస్ కార్డు మర్చిపోయానంటూ వారి నుంచి మరో యాక్సెస్ కార్డు తీసుకుని టార్గెట్ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు. చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి ముంబైకి పారిపోతుంటాడు. ముంబైలోని బోరేవలి ప్రాంతంలో ఉన్న హిరేన్ ఎం.షాకు చోరీ సొత్తు విక్రయిస్తుంటాడు. 19 నగరాల్లో 32 చోరీలు చోరీల ద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్స్ సైతం నిర్వహిస్తుంటాడు. ఈ పంథాలో హైదరాబాద్, విశాఖపట్నం, కోల్కతా, ముంబై, బెంగళూరు తదితర 19 నగరాల్లో 32 నేరాలు చేశాడు. ఈ నెల 6న బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్ నుంచి రూ.30 లక్షల బంగారు నగలు ఎత్తుకుపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ కేఎస్ రావు, బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎంవీఎస్ కిశోర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జయేశ్ను పట్టుకుని పార్క్ హయత్ నుంచి చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుకు సంబంధించి వాంటెడ్గా ఉన్న నగరాల పోలీసులకు సమాచారం ఇస్తామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. -
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
ఎస్ఆర్నగర్(హైదరాబాద్): నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్ మీర్జా మహమూద్ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్ ఆయన్నుసన్మానించారు. -
నగల కోసం ప్రియురాలి మెడ కోశాడు..!
సాక్షి, తిరుత్తణి (తమిళనాడు): ప్రియురాలి మెడను కోసి నగలు ఎత్తుకుపోయాడు ఓ దుర్మార్గుడు. ఈ కిరాతక ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలివి..చెన్నై అంబత్తూరుకు సమీపం పట్రవాక్కంకు చెందిన లక్ష్మీ అలియాస్ రేవతి(42) భర్త రామచంద్రన్తో విభేదాల కారణంగా.. పదేళ్ల నుంచి తన ముగ్గురి పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. అదే సమయంలో తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారి అలియాస్ మారియప్పన్(37) రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. ఈ సందర్భంగా రేవతి, మారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 10న రేవతి, మారి బైక్పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరువాలాంగాడు సమీపంలోని లక్ష్మీ విలాసపురం వద్ద ఆగారు. ఆ సమయంలో తాను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి కోరగా సాయపడేందుకు రేవతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన మారి కత్తితో తలను కోసి మెడలోని ఆరు సవర్ల నగలు తీసుకుని తలను అక్కడికి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 14వన మారిని అరెస్ట్ చేశారు. -
జనవరి తర్వాత గోల్డ్ కొనాలంటే...
సాక్షి,న్యూఢిల్లీ: బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకొచ్చింది. బంగారం విక్రయించేముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్మార్కింగ్, కారట్ కౌంట్ను అనివార్యం చేయనుంది. జనవరి తర్వాత కేవలం హాల్మార్కింగ్ బంగారాన్నే విక్రయించాలనే నిబంధన తీసుకురానున్నట్టు ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తాము కొంటున్న బంగారు ఆభరణాల నాణ్యత గురించి వారికి తెలియడం లేదని, జనవరి కల్లా బంగారు ఆభరణాలకు హాల్మార్క్ను తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నామని పాశ్వాన్ తెలిపారు. కొన్ని ఆభరణాలపై బీఐఎస్ మార్క్ ఉంటున్నా అది ఆభరణాల నాణ్యతను వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించేలా లేదన్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆభరణాల్లో ఉపయోగిస్తున్న బంగారం కారట్ల గురించి కూడా హాల్మార్క్లో పొందుపరుస్తారు. ఆభరణాలకు 14, 18, 22 కారట్ల మూడు కేటగిరీల్లో హాల్మార్కింగ్ ఇస్తారని మంత్రి తెలిపారు. -
‘మీ సొమ్ము ఎత్తుకెళ్తున్నాం బాధపడొద్దు’
లేఖ రాసి పెట్టి మరీ చోరీ చేసిన ఘనుడు నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): ‘మీ ఇంట్లో బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతున్నాం.. బాధపడకండి, ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు’ అని లేఖ రాసి పెట్టి మరీ చోరీకి పాల్పడిన ఉదంతం నిజామాబాద్లో బుధవారం రాత్రి జరిగింది. నగరంలోని నాందేవ్వాడకు చెందిన సురకుట్ల భాస్కర్ తండ్రి చిన్నయ్య ఇటీవల మృతి చెందాడు. ఆర్యనగర్లో ఉంటున్న భాస్కర్ అత్తగారు అతడిని బుధవారం నిద్ర కోసం తీసుకెళ్లారు. దీంతో నాందేవ్వాడలోని తన ఇంటికి తాళం వేసి భాస్కర్ భార్యాపిల్లలతో కలిసి అత్తగారింటికి వెళ్లగా.. రాత్రి తాళం తొలగించిన ఓ దొంగ బీరువాలో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు.. రూ. 28 వేల నగదును ఎత్తుకు పోయాడు. వెళ్తూ వెళ్తూ ఓ చీటి రాసి పెట్టి వెళ్లాడు. అందులో ‘మీ బంగారం ఎత్తుకుపోతున్నాం బాధపడవద్దు.. దేవుడు మీకు ఇంకా ఇస్తాడు.. మీరు చూస్తూ ఉండండి’ అని రాశాడు. గురువారం ఉదయం వచ్చిన భాస్కర్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ రాసిన చీటిని స్వాధీనం చేసుకున్నారు. -
ఘరానా దొంగ అరెస్ట్
రూ.9.20లక్షల సొత్తు స్వాధీనం వరంగల్: ఘరానా దొంగను అరెస్ట్ చేసి అతడి నుంచి 302 గ్రాముల బంగారు ఆభరణాలు, 105 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు, మొత్తం రూ.9.20లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సిటీ క్రైం ఏసీపీ ఇంజారపు పూజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏసీపీ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బక్కశెట్టి కొమురయ్య అలియాస్ అజయ్కుమార్ సెంట్రింగ్, రాడ్ బైండింగ్ పనిచేసుకునేవాడు. తాగుడుకు బానిసై సైకిల్ దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుపడి జైలు శిక్ష అనుభవించాడు. 2005లో హైదరాబాద్కు వెళ్లి నారాయణగూడ, చిక్కడపల్లి, ఇందిరాపార్కు ప్రాంతాల్లో, 2010–11లో వరంగల్లోని ఇంతేజార్గంజ్, సుబేదారి, కేయూసీ పీఎస్ల పరిధిలో దొంగతనాలు చేసి స్థానిక సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. 2014లో నిజామాబాద్లో రెండు, 2015–16లో జగిత్యాల జిల్లాలో పది దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఇతడిపై పలు జిల్లాలకు చెందిన నాన్ బెయిలబుల్ వారెంట్లు, 17 పెండింగ్లో ఉన్నాయి. అప్పటి నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఉండేవాడు.ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ నెల వరకు కమిషనరేట్ పరి«ధిలోని కాజీపేట, మట్వాడ, కేయూసీ, జనగామ పీఎస్ పరి«ధిలో నాలుగు దొంగతనాలకు పాల్పడి 302 గ్రాముల బంగారు, 105 గ్రాముల వెండి అభరణాలతో పాటు రూ.17వేల నగదును దోచుకుపోయాడు. దొంగిలించిన బంగారు, వెండి నగలను విక్రయించి ఒక టాటా ఏస్ వాహనం కొనుగోలు చేయాలని బుధవారం జగిత్యాల నుంచి వరంగల్కు బస్సులో వస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు కేయూసీ క్రాస్ రోడ్డు వద్ద కొమురయ్యను అదుపులోకి తీసుకొని రూ. 9.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అంతరాష్ట్ర దొంగ కొమురయ్యను చాకచక్యంతో పట్టుకున్న క్రైం ఏసీపీ పూజ, ఇన్స్పెక్టర్ డేవిడ్రాజు, ఎస్ఐ బీవీ సుబ్రమణ్యేశ్వర్రావు, హెడ్కానిస్టేబుళ్లు వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, హరికాంత్, జంపయ్యలను సీపీ సుధీర్బాబు అభినందించారు. -
కొమ్ముచిక్కాలలో చోరీ
పోడూరు : మండలంలోని కొమ్ముచిక్కాలలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు సుబ్బలక్ష్మి తాటాకింట్లో నివసిస్తోంది. ఆమె భర్త కొంతకాలంగా గల్ఫ్లో ఉంటున్నాడు. శనివారం ఆమె జిన్నూరులో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఆమె తిరిగొచ్చేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించింది. దొంగలు బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండున్నర కాసుల బంగారు నగలు చోరీ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నలుగురు చెయిన్ స్నాచర్ల అరెస్ట్
ఏలూరు అర్బన్: నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 13 గొలుసు దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. స్థానిక వన్టౌన్ పరిధిలోని వంగాయగూడెంలో నివాసముంటున్న వాసే దిలీప్, పిల్లి విజయ్కుమార్, బాణోతు రాజు, రౌతు నాగిరెడ్డి అనే నలుగురు యువకులు జల్సాలు, చెడు అలవాట్లకు బానిసై చోరీలకు పాల్పడుతున్నారు. చెయిన్ స్నాచింగ్ను ఆదాయమార్గంగా ఎంచుకుని నగరంలో బైకులపై తిరుగుతూ వన్టౌన్ పరిధిలో 6, టూటౌన్ పరిధిలో 2, త్రీటౌన్ పరిధిలో 4, ఏలూరు రూరల్ పరిధిలో 1 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, వన్టౌన్ ఎస్సై కె.రామారావు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వంగాయగూడెంలో నివాసముంటున్న ఈ యువకులు విలాసవంతంగా గడుపుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని గుర్తించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టిన సీఐ రాజశేఖర్, ఎస్సై రామారావు వారిని నిందితులుగా నిర్ధారించి అరెస్ట్ చేసేందుకు గాలింపు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సెంటర్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైకులపై అటుగా వస్తున్న నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. వారి నుంచి సుమారు 27 కాసుల బంగారు నగలు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్సై కె. రామారావు సిబ్బంది పాల్గొన్నారు. -
భద్రాద్రి రామన్నకు స్వర్ణ కవచం బహూకరణ
భద్రాచలం: భద్రాద్రి రాముడికి ఓ భక్తుడు స్వర్ణ కవచాలను అందజేశారు. బెంగళూరుకు చెందిన జె.వి.రంగరాజు సీతా సమేత రాములవారికి బంగారు సర్వాంగ కవచాన్ని తయారు చేయించారు. ఈ కవచాన్ని ఒక్కొక్కటిగా విడదీస్తే 21 వస్తువులు వస్తాయి. ఇలాంటి అద్భుత కవచాన్ని ఆదివారం సాయంత్రం ఆ కుటుంబం ఆలయ కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేష్బాబుకు అందజేసింది. సోమవారం ఉదయం స్వామి వార్ల మూలవరులకు ధరింపజేశారు. ఆ కుటుంబానికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
పెళ్లిరోజు రాత్రే నగలతో వధువు పరార్
కాన్పూర్: వినయవిధేయతలతో మెలుగుతూ ఓ యువకుడితో మూడు ముళ్లు వేయించుకున్న యువతి.. కొద్ది గంటల్లోనే బంగారు నగలతో ఉడాయించింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సరోజనీనగర్కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు, దేవరియా గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 23వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు రాత్రి నుంచి పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. వధువరులకు చెందిన రూ.2.50 లక్షల విలువైన నగలు కూడా మాయమయ్యాయి. ఆమె సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కంగుతిన్న వరుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పట్టపగలే దోచేశారు
పెదపాడు (దెందులూరు): పెదపాడు మండలం ఏపూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే దొంగలు పడి 12 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. పెదపాడు పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఏపూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని సీతారామాంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న పడాల గోపి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాలోని 12 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయా రు. బాధితుడు గోపి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్ఐ ఎ న్ వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అశోక్నగర్లో చోరీ
కడప అర్బన్: కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో చోరీ జరిగింది. బాధితురాలు మేరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. తాను ఎదిరింటిలో ఉన్న తన బంధువు ఇంట్లో గత రాత్రి నిద్రించానని, ఉదయం చూసేలోపు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 వేల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు. -
టీవీనటి దారుణ హత్య, బంగారం మాయం
చెన్నై: తమిళనాడులో సాలిగ్రాం లో దారుణం చోటు చేసుకుంది. పథకం ప్రకారం టీవీ నటిని హత్యచేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. టీవీ సీరియల్ నటి, మోడల్ డీ జయశీలి (49) ఆదివారం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. పెరియార్ వీధిలో ఉన్న ఆమె ఫ్లాట్ నుంచి చెడువాసన రావడంతో పొరుగు వారు పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే 50 సవర్ల బంగారం మాయమైందని ఆమె సోదరుడు సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఆమె ఒంటిమీద ఉన్న నకిలీ బంగారు ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు. తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు. నగ్నంగా, పాక్షికంగా కుళ్ళిపోయిన డెడ్ బాడీని బెడ్ మీద కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. లైంగికదాడి అనంతరం దిండుతో అదిపి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మరోవైపు ఇమిటేషన్ గోల్డ్ ని దుండగుడు టచ్ చేయకపోవడంతో పాటు, గదిలో పెర్ ఫ్యూం చల్లడం, సంఘటనా స్థలంలో కండోమ్ లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ మొదలుపెట్టినట్టు చెప్పారు. -
బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత
న్యూఢిల్లీ: బ్రాండెడ్ బంగారు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. వెండి కాయిన్లకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ చర్యతో బంగారు కారుున్లు చౌకగా మారతాయని, వ్యవస్థీకృత రంగాన్ని ప్రోత్సాహాన్నిస్తుందని పీజీ జ్యుయలర్ ఎండీ బల్రామ్గార్గ్ అన్నారు. వాస్తవంగా బ్రాండెడ్ ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని 2011లో అమల్లోకి తెచ్చారు. -
బంగారు ఆభరణాల సూట్కేస్ చోరీ
హైదరాబాద్ : బస్టాండ్లో ప్రయాణికుడి వద్ద బంగారు ఆభరణాలు ఉన్న సూట్కేస్ అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫీర్జాదీగూడ కృష్ణనగర్కు చెందిన రాము (45) ప్రైవేటు ఉద్యోగి. గుంటూరు నర్సారావుపేటలో వివాహం ఉండగా మూడు సూట్కేసులతో సోమవారం రాత్రి ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద బస్సు ఎక్కేందుకు వచ్చాడు. అందులో దాదాపు రూ.60వేల విలువైన ఆభరణాలు ఉన్న సూట్ కేసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు మంగళవారం ఉదయం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
చేబ్రోలు : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. చేబ్రోలులోని ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్థానిక అగ్రిగోల్డ్ ఫ్లాట్ల వద్ద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించిన దుండగులు సువర్చలదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓంకారేశ్వర ఆలయంలో చోరీ
వెంకటాపురం (మోపిదేవి): మండలంలోని వెంకటాపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వరస్వామివారి దేవస్థానంలో దొం గలు పడ్డారు. శ్రీ అన్నపూర్ణమ్మ వారి రెండు మంగళసూత్రాలు, కల్యాణం బొట్టు, ముక్కుపుడక దొంగతనమయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఈవో మోపిదేవి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. వీటి విలువ రూ. 30 వేలుగా చెబుతున్నారు. మచిలీపట్నం క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. దొంగలు అమ్మవారి బంగారు నగలు దొంగిలించడంతో పాటు గర్భాలయంలోని హుండీని పగలగొట్టారు. అందులో పెద్దమొత్తంలో సొమ్ములేమీ లేవని చెబుతున్నారు. పోయిన నగలు చేయిస్తా: జడ్పీటీసీ శ్రీ అన్నపూర్ణమ్మ అమ్మవారికి పోయిన బంగారు నగలను తాను సమర్పిస్తానని జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లిఖార్జునరావు హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో మురళీకృష్ణ తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. -
ఇంట్లో చోరీ
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు – భీమవరం రోడ్డులోని పూలపల్లి ఎస్బీఐకు సమీపంలోని ఓ ఇంట్లో గురువారం వేకుజామున చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరాజు రవి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి పదిహేనున్నర కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సీఐ కోలా రజనీకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. -
ఇంట్లో నక్కి చోరీ
11 సవర్ల నగలు అపహరణ నెల్లూరు (క్రైమ్) : ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లో నక్కాడు. కప్ బోర్డులో ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలించాడు. పడక గదిలో ఉన్న మహిళ మెడలోని బంగారు తెంచేందుకు విఫలయత్నం చేసి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి తల్పగిరి కాలనీలో చోటు చేసుకుంది. తల్పగిరి కాలనీలో నాగిశెట్టి వెంకటేశ్వర్లు, పద్మ దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు నెల్లూరు ఆర్టీసీ–2 డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం ఉదయం డ్యూటీపై బెంగళూరుకు వెళ్లారు. ఆయన భార్య పద్మ, కుమార్తె అర్చనలు ఇంట్లో ఉన్నారు. మంగళవారం రాత్రి వారు కింద పోర్షన్లో ఉన్న ఇంటి యజమాని వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో గుర్తుతెలియని దుండగుడు వారి కళ్లు గప్పి పద్మ ఇంట్లోకి చొరబడి ఓ మూలన దాక్కున్నాడు. కొద్దిసేపటికి పద్మ, తన కుమార్తెతో కలిసి పడుకునేందుకు ఇంట్లోకి వచ్చింది. ఇంటి లోపల తలుపునకు తాళం వేసి పడక గదిలో తల్లి, కుమార్తెలు నిద్రపోయారు. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు పద్మ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును తెంచే వెళ్లే క్రమంలో అతని చేయి తగిలి ఆమె నిద్రనుంచి మేల్కొంది. దుండగుడిని చూసి పెద్దగా కేకలు వేస్తూ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశాడు. పడక గదికి బయట నుంచి తలుపు పెట్టి కప్ బోర్డులో ఉన్న 7 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుని వెళ్లాడు. తల్లి, కుమార్తెలు తలుపును తెరిచే ప్రయత్నం చేయగా ఎంతకీ తలుపు రాలేదు. దీంతో జరిగిన విషయాన్ని పద్మ తన భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఆయన పద్మ సోదరి అరుణకు ఫోన్లో విషయం చెప్పడంతో అరుణ, ఆమె కుమారుడు ఇంటికి వచ్చి తలుపులు తెరిచారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు బాధితురాలు బుధవారం ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదో నగర ఇన్స్పెక్టర్ జి. మంగరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్టీం వేలిముద్రలను సేకరించింది. ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం పోయి.. దొరికింది ఇలా..
పెనుమాక (తాడేపల్లి రూరల్): పెనుమాకలో చోరీకి గురైన 21 సవర్ల బంగారం దొరికింది. అపహరించిన బంగారాన్ని దొంగ.. బాధితుడి ఇంటిపక్కనే పెట్టగా అది సోమవారం బయటపడింది. గ్రామానికి చెందిన బోనం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో 21 సవర్ల బంగారు ఆభరణాలు, 40 వేల నగదు ఇటీవల అపహరణకు గురయ్యాయి. మొదట 70 సవర్ల బంగారం పోయిందనుకున్న బాధితులకు ఇంటి సమీపంలోని నీళ్లడ్రమ్ములో కొంత, ముళ్ల పొదల్లో కొంత, మరి కొంత ఇంట్లోని బీరువాలోనే కనిపించింది.. మిగిలిన 21 సవర్ల బంగారం అపహరణకు గురైందని నిర్ధరించుకున్నారు. సోమవారం ఉదయం బాధితుడు బోనం వెంకటేశ్వరరెడ్డి భార్య తమ ఇంటి పక్కనే ఉన్న నిర్మాణంలో వెతుకగా బంగారం భద్రపరిచిన బాక్సు ఖాళీ సిమెంటు సంచులపై దొరికింది. దాని తెరిచి చూడగా ప్లాస్టిక్ కవర్లో చుట్టిన బంగారం కనిపిచింది. దీంతో భర్తను, చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి 21 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ జరిగేందేమిటంటే..? ఆదివారం తెల్లవారుజామున పోలీసులు వేలిముద్రలు సేకరించడం, డాగ్ స్వా్కడ్తో తనిఖీలు నిర్వహించారు. మరుసటి రోజు తాము అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసుస్టేషన్కు పిలిపిస్తామంటూ గ్రామంలో హెచ్చరికలు చేశారు. దీంతో భయపడిన దొంగ మిగిలిన బంగారాన్ని కూడా బాధితులకు దొరికేలా పెట్టాడన్న మాట. -
పెళ్లికెళ్లారు.. ఇల్లు గుల్ల చేశారు
29 సవర్ల బంగారు అభరణాలు, రూ. 75 వేలు నగదు చోరీ సూళ్లూరుపేట : కుటుంబ సభ్యులందరూ బంధువుల పెళ్లికెళ్లగా గుర్తుతెలియని దుండగులు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన పట్టణంలోని ఝాన్సీనగర్లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంకు చెందిన కారికాటి జయకృష్ణ శ్రీరామ్చిట్స్ కంపెనీలో కావలిలో పనిచేస్తూ సూళ్లూరుపేటలోని ఝాన్సీనగర్లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయన విధులు నిమిత్తం మంగళవారం కావలికి వెళ్లాడు. బుధవారం రాత్రి తన అక్క కుమార్తె వివాహం కావడంతో భార్య స్వప్నకుమారి ఇద్దరి పిల్లలను తీసుకుని తలుపులకు తాళం వేసి పక్కింట్లో ఇచ్చి కారిపాకం వెళ్లింది. బుధవారం ఉదయాన్ని తలుపు తీసేసి ఉండడాన్ని పక్కింటి వారు చూసి జయకృష్ణ, స్వప్నకుమారికి సమాచారం అందించారు. వారు వెంటనే స్థానిక సీఐ విజయకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించి వేలిముద్రలను నిపుణులను రప్పించి బీరువా, తలుపులు మీద వేలిముద్రలను తీసుకున్నారు. సంఘటనా స్థలంలో తలుపునకు వేసిన తాళం పిట్టగోడ మీద ఉంది. చిన్నపాటి గడ్డపార కూడా అక్కడే కనిపించింది. అయితే గడ్డపారతో తలుపులు పగులగొట్టిన దాఖలాలు కనిపించలేదు. బీరువాను పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. తలుపునకు వేసిన తాళం తీసి బెడ్ కింద ఉన్న బీరువా తాళం తీసి అందులో ఉన్న 29 సవర్ల బంగారు ఆభరణాలు, కట్నం కోసం తెచ్చిపెట్టిన రూ.75 వేల నగదు మాత్రమే చోరీకి గురైంది. బంగారు ఆభరణాలు, నగదు తప్ప అందులో ఉన్న వెండి వస్తువులను తాకలేదు. చోరీ జరిగిన ఇంటిని, పరిసర ప్రాంతాలను ఐడీ పార్టీ సిబ్బంది శ్రీనివాసులురెడ్డి, మునీర్బాషా పరిశీలించారు. అయితే గుర్తు ðlలియని దొంగలు వేసుకుని వచ్చిన చెప్పులు మిద్దెపైన వదిలి వెళ్లడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డపారను కూడా స్వాధీనం చేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని సీఐ విజయకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కోతి
డోర్నకల్ : రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ చేతిలోని నగల పెట్టెను కోతి ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం డోర్నకల్లో చోటుచేసుకుంది. మండలంలోని ఉయ్యాలవాడ శివారులోని ఓ తండాకు చెందిన కళావతి వరంగల్కు వెళ్లేందుకుగానూ డోర్నకల్ రైల్వే స్టేషన్కు వచ్చింది. శాతవాహన ఎక్స్ప్రెస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఇంతలో ఓ కోతి కళావతి చేతిలోని పర్సు లాక్కొని, అందులో ఉన్న ఆభరణాల పెట్టెను ఎత్తుకెళ్లింది. వెంటనే కళావతి కేకలు వేసింది. అప్పటికే కోతి ప్లాట్ఫామ్ గోడ దూకి పరారైంది. కొంతమంది ప్రయాణికులు కోతిని వెంబడించారు. ప్లాట్ఫామ్కు కొద్ది దూరంలో వెతకగా కోతి పడేసిన ఆభరణాల పెట్టె కనిపించింది. పరిసరాల్లో రెండు చెవి దుద్దులు లభ్యమయ్యాయి. ఇంకొక చెవిదుద్దు కనిపించడం లేదంటూ బాధితురాలు కళావతి పేర్కొంది. -
దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు
-
దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే ఇవి కనిపించడంతో ఊపిరి దదపీల్చుకున్నారు. దీంతో తొమ్మిది రోజులపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను ఈవో రమేష్బాబు విలేకరులకు చూపించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయాధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఈవో రమేష్బాబు మాట్లాడుతూ కొందరు అర్చకుల తీరు వల్లే బంగారు ఆభరణాలు కనిపించలేదనేది యధార్థమన్నారు. అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో భద్రాద్రి రామాలయ ప్రతిష్టకు మచ్చతెచ్చే రీతిలో జరిగిన ఈ సంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కొందరు అర్చకులు కావాలనే ఇలా చేసినట్లు తేటతెల్లమవుతోందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ప్రధాన బాధ్యులైన అర్చకులను సస్పెండ్ చేస్తామని, మిగతా వారిని వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు. పోయిన చోటే కనిపించాయి.. దేవాదాయ శాఖ కమిషనర్ దీనిపై సీరియస్ కావటంతో పోయిన బంగారు ఆభరణాలను తిరిగి రాబట్టేందుకు దేవస్థానం ఈవో రమేష్బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన శనివారం మరోమారు అర్చకులతో తన చాంబర్లో సమావేశ మయ్యారు. ఆలయ ప్రతిష్టను మరింత దిగజార్చకుండా ఆభరణాలు ఎక్కడున్నాయో గుర్తించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అర్చకులంతా గర్భగుడిలో వెతుకుతామని వెళ్లి.. బీరువాలోని మరో లాకర్లో ఆభరణాలు ఉన్నట్లు వాటిని తెచ్చి అధికారులకు చూపించారు. దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి పర్యవేక్షణలో గర్భగుడిలోని బీరువా, ఇతర లాకర్లను వెతికినప్పుడు కనిపించని బంగారు నగలు.. ఈవో హెచ్చరికతో అవి అక్కడే కనిపించినట్లు అర్చకులు చెప్పటం అనేక సందేహాలకు తావిస్తోంది. పోయిన ఆభరణాలు లభ్యమైనప్పటికీ దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. -
మంచితనానికి మారుపేర్లు వీళ్లు...
తాడేపల్లి రూరల్: భక్తులు పోగొట్టుకున్న బంగారు వస్తువులను వెతికి అప్పగిస్తూ గజ ఈతగాళ్ళు శభాష్ అనిపించుకుంటున్నారు. సీతానగరం ఘాట్లో ఉంగరం పోయినా నిమిషాల వ్యవధిలోనే వెతికి చేతికి అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ పోగొట్టుకున్న మంగళసూత్రాలు అప్పగించిన గజ ఈతగాళ్ళు సోమవారం ఒక బాలిక పోగొట్టుకున్న ఉంగరాన్ని నీళ్లల్లో నుంచి వెతికి తీసి ఇచ్చారు. -
దాసన్నపేటలో చోరీ
విజయనగరం పూల్బాగ్ : దాసన్నపేట నూకాలమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి రెండు తులాల ఆభరణాలు అపహరించారు. దీనికి సంబంధించి టూ టౌన్ ఎస్సై మారూఫ్ అందించిన వివరాలిలా ఉన్నాయి. అరబిందో కంపెనీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న గోపాలం శ్రీధర్ కుటుంబంతో పాటు నూకాలమ్మ సమీపంలో ఉంటున్నారు. ఈ మధ్య గది కిటికీ పాడవ్వటంతో దానికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఇదే అదునుగా శుక్రవారం రాత్రి దొంగలు కిటికీ గుండా ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న తులంన్నర బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుల\ఫిర్యాదు మేరకు క్రైమ్ సిబ్బందితో పాటు ఎస్సై మారూఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కఠారిపాళెంలో చోరీ: బంగారు అపహరణ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో అందరూ ఉండగానే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున కఠారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హేమంతకిశోర్, సునీత దంపతులు కఠారిపాలెంలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి హేమంతకిశోర్ వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లాడు. సునీత తన తల్లి, తమ్ముళ్లతో కలిసి ఇంట్లో నిద్రపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు తెరచి లోనికి ప్రవేశించారు. బీరువాను తెరచి అందులో ఉన్న సుమారు రూ.1.50 లక్షలు విలువచేసే 5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరించారు. దుండగుల అలికిడి కావడంతో నిద్రనుంచి లేచిన సునీత పెద్దగా కేకలు వేసేసరికే పరారయ్యారు. బాధితులు మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్కానిస్టేబుల్ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు లాకర్ తెరిచిచూసిన మహిళకు షాక్
15 తులాల బంగారు అభరణాలు మాయం హైదరాబాద్: భద్రతకు మారుపేరు బ్యాంకు లాకర్ అంటారు. ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళుతారన్న భయంతో చాలామంది బ్యాంకు లాకర్లలో బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలను దాచిపెడుతుంటారు. ఇదేవిధంగా ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్ లో 15 తులాల బంగారు అభరణాలను పెట్టిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. లాకర్ ఉంచిన బంగారం మాయమైంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని రాజేంద్రనగర్కు చెందిన అస్నా ఫర్ఖుందా తాజ్ అనే మహిళ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లాకర్లో కొన్ని రోజుల క్రితం 15 తులాల బంగారు ఆభరణాలను ఉంచింది. మంగళవారం ఆమె లాకర్ తెరిచి చూడగా.. అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అబిడ్స్ పోలసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీటీ ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్
గుంటూరు : న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. గుంటూరు జిల్లా ఎడ్లపల్లి సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాగేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దొంగలు చైన్ లాగి రైలును ఆపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన ఎస్కార్ట్ పోలీసులు వారిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు దుండగులు పరారీ అవుతూ రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీవారికి ఒడిశా భక్తుడి భారీ కానుక
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ రెండు స్వర్ణ హారాలను విరాళంగా ఇచ్చాడు. 5.5 కిలోల బంగారంతో రెండు సుదర్శన సాలిగ్రామ హారాలను రాజేష్ తయారు చేయించారు. వాటిని టీటీడీ ఈవో సాంబశివరావుకు బుధవారం ఉదయం ఆయన అందజేశారు. వీటి విలువ సుమారు రూ.1.15కోట్ల ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు హారాలను ఉత్సవ సమయాల్లో ఒకటి మూలవిరాట్కు రెండోది మలయప్ప స్వామికి అలంకరించనున్నారు. -
శ్రీవారికి కేసీఆర్ కానుకలు సిద్ధం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి స్వర్ణాభరణాలు చేయిస్తానని మొక్కుకున్న కేసీఆర్.. త్వరలోనే ఆ మొక్కుతీర్చుకోనున్నారు. స్వామివారికి అందజేయనున్న కానుకలలో సాలిగ్రామహారం, బంగారు కంఠె ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో పదిహేను రోజుల్లో మిగతావి కూడా పూర్తయితే కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారైనట్లే. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాళిదాస్ జ్యుయెలర్స్ వీటి తయారీ టెండర్లను దక్కించుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛతతో గ్రాము రూ.2,611కు ఒప్పందం కుదుర్చుకుంది. 14.900 కిలోలతో సాలి గ్రామహారం ఖరీదు రూ.3.70 కోట్లు కాగా.. ఐదు పేటల కంఠె తయారీకి 4.650 కిలోల బంగారం ఖరీదు రూ.1.21కోట్లు ఖర్చయింది. ఇవిగాక మరో మూడు ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటి మొత్తానికి రూ.4.97 కోట్లతో ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. మిగతా ఆభరణాలు మరో పదిహేను రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. ఒప్పందం మేరకు తయారీ సంస్థే తరుగు, నాణ్యత, రవాణా ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఆభరణాలను పూర్తిగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తయారుచేయించారు.ఈ నెలాఖరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల చేరుకుని శ్రీవారికి ఆభరణాలు సమర్పించి మొక్కు చెల్లించుకోనున్నారు. -
బంగారు రింగుల కోసం..
పుంగనూరు: చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పుంగనూరు బైపాస్లో ఓ విద్యార్థిని చెవులు కోసి చెవి రింగులు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై మంగళవారం మధ్యాహ్నం కొందరు యువకులు దాడిచేశారు. బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. సదరు విద్యార్థిని లంచ్ బ్రేక్లో భోజనం చేసి స్కూలు బయటకు వచ్చింది. అప్పుడే కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెపై దాడిచేసి బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే పుంగనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస చైన్ స్నాచింగ్స్తో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. -
చిట్కా తెలియడమే ఆలస్యం..
ఇంటిప్స్ * ఇంట్లో ఉండే మెడ గొలుసులన్నింటినీ ఒకే చోట దాచుకున్నప్పుడు అవి ఒకదానికొకటి మెలిక పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక్కో గొలుసును ఒక్కో స్ట్రాలోకి దూర్చి హుక్ పెట్టేయాలి. అలా ఎన్ని చెయిన్స్నైనా ఒక బాక్స్లో పెట్టుకొని ప్రయాణాలు చేయొచ్చు. అలాగే గొలుసులకు పడిన చిక్కును విడదీయడానికి బేబీ పౌడర్ వాడాలి. ఆ చిక్కుముడికి పౌడర్ రాస్తే సులువుగా విడిపోతుంది. * బంగారం ఆభరణాలను మినహా మిగతా అలంకరణ వస్తువులను జాగ్రత్తగా దాచుకోరు చాలామంది. ముఖ్యంగా చిన్ని చిన్ని చెవి దుద్దులు. ఫంక్షన్కు రెడీ అవుతున్నప్పుడు చూసుకుంటే ప్రతి జతలో ఒక్కో దుద్దు కనిపించకుండా పోవడం అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని పెద్దసైజు బటన్లకు అమర్చితే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రకం కావాలంటే అవి సులువుగా కనిపిస్తాయి, ఎప్పటికీ భద్రంగా ఉంటాయి కూడా. * తలుపులకు, కిటికీలకు పెయింట్ వేయడానికి పెద్ద సైజు బ్రష్లను ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా మోతాదుకంటే ఎక్కువగా పెయింట్ వచ్చేస్తుంది ఆ బ్రష్కు. దాన్ని తీసేయడానికి ఆ డబ్బా అంచులకు రాస్తుంటాం. అలా కాకుండా ఆ డబ్బా చుట్టూ ఓ రబ్బర్ బ్యాండును పెట్టి, దాని సాయంతో ఎక్కువగా ఉన్న పెయింట్ను తొలగించొచ్చు. అలా చేస్తే డబ్బాకు ఎలాంటి రంగు మరకలు ఉండవు. * షర్టు బటన్లు తరచూ ఊడిపోతూ ఉంటాయి. లేదా దారాలు ఒదులుగా ఉండి వేలాడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే బటన్లు కుట్టిన వెంటనే వాటి మధ్యలో కొద్దిగా నెయిల్ పాలిష్ రుద్దాలి. అది ఆరే వరకు కదిలించకూడదు. అలా చేస్తే ఆ దారాలు తొందరగా లూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో కలర్లెస్ నెయిల్ పాలిషులు అందుబాటులో ఉంటున్నాయి. అది ఉపయోగిస్తే ఏ కలర్ బటన్స్కైనా పాలిష్ వేసినట్టు కనిపించదు. * ఫ్లవర్ వాజుల్లో పెట్టిన పూలు త్వరగా వాడిపోకుండా ఉండాలంటే కాస్త వాటిపై శ్రద్ధ పెడితే చాలు. రోజూ రోజూ ఖరీదైన పూలను మార్చి కొత్తవి పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి వాజులోని నీళ్లలో ఒక రాగి నాణెంతో పాటు కొద్దిగా చక్కెర వేయాలి. రోజూ ఆ నీటిని మార్చి చక్కెర వేస్తుండాలి. అలా చేస్తే ఆ పూలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఆ పూల సువాసనకు మార్కెట్లో దొరికే ఏ సెంటూ సాటి రాదు. -
ఇనుపరాడ్లతో బెదిరించి..భారీ దోపిడీ
-
బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు
పోలీసులమంటూ నమ్మబలికి గొలుసు లాక్కునే యత్నం మహిళ, స్థానికులు ప్రతిఘటించడంతో పరారైన యువకులు బద్వేలు అర్బన్ : బద్వేలులో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుటే పోలీసులమని చెప్పి ఓ మహిళ మెడలో గొలుసులాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళతో పాటు చుట్టుపక్కలవారు ప్రతిఘటించడంతో బైక్పై యువకులు పరారయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలలోకెళితే.. స్థానిక గాండ్లవీధిలో నివసిస్తున్న ఓ మహిళ పోరుమామిళ్ల రోడ్డులోని తమ వస్త్రదుకాణానికి వెళ్లి ఇంటికి వెళ్తున్న సమయంలో అర్బన్ స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు మహిళను ఆపి తాము పోలీసులమని, చెన్నైనుంచి బద్వేలుకు దొంగలు వచ్చారని మీ వద్ద ఉన్న బంగారు నగలు దాచుకోవాలని చెప్పారు. అలాగే నగలతో బయట తిరిగితే రూ.1000లు జరిమానా చెల్లించాలని హెచ్చరించారు. ఇదంతా నమ్మే రీతిలో లేకపోవడంతో సదరు మహిళ యువకులను ప్రశ్నించడంతో గుర్తింపుకార్డు కూడా చూపించినట్లు తెలిసింది. దీంతో మహిళ చేసేది లేక చేతికి ఉన్న గాజులను కర్చీప్లో కట్టుకునేందుకు బయటకు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో యువకుడు మహిళ మెడలోని తాళిబొట్టు సరుడును లాక్కునేందుకు ప్రయత్నించాడు. మహిళ పూర్తిస్థాయిలో ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకులు బంగారు గొలుసును వదిలేసి అక్కడినుంచి ద్విచక్రవాహనంలో ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. -
మహిళలకు మత్తు మందు ఇచ్చి..
తిరుమలలో ఇద్దరు మహిళలకు మత్తుమందు ఇచ్చి బంగారునగలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గురువారం తమిళనాడుకు చెందిన సత్యవతి, సుస్మితకుమారి అనే ఇద్దరు మహిళలు బుధవారం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చారు. తిరుమల అన్నదానసత్రం వద్ద ఓ వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. మహిళలతో సన్నిహితంగా ఉంటూ అన్నం పెట్టించాడు. ఉండటానికి కౌస్తుభం అతిధి భవనంలో రూం నెం235 ఏర్పాటు చేశాడు. గురువారం ఉదయం సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పృహ వచ్చాక విషయం తెలుసుకున్న మహిళలు తిరుమల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకోవడానికి సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సింహపురి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం
-
ప్రేమపేరుతో బాలిక నుంచి ఆభరణాలు కాజేశాడు
తుర్కయంజాల్ (హైదరాబాద్) : ప్రేమిస్తున్నానని మాయమాటలతో బాలికను నమ్మించి ఆమె నుంచి బంగారం, నగదును కాజేసిన ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్లో ఏసీపీ భాస్కర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోవిన్పల్లి గ్రామానికి చెందిన మేడ అరుణ్రెడ్డి(24) ... మహబూబ్బాషా, మల్లికార్జున్రెడ్డి, అర్జున్రెడ్డి తదితర పేర్లు చెప్పుకునేవాడు. వృత్తి రీత్యా కారు డ్రైవర్ అయిన అతడు హైదరాబాద్ బీఎన్రెడ్డి నగర్కు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ బాలికతో గత ఏడాది నుంచి పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఫేస్బుక్, ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తూ వచ్చాడు. తరువాత కొన్ని రోజులకు అరుణ్రెడ్డి.. తనకు ఆరోగ్యం బాగాలేదని, డాక్టర్కు చూపించుకుంటానని నమ్మబలికాడు. ఇందుకుగాను ఇంటి నుంచి డబ్బు తీసుకువచ్చి ఇవ్వాలని బాలికను కోరగా ఆమె స్పందించలేదు. దీంతో అరుణ్రెడ్డి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించడంతో బాలిక తల్లికి చెందిన సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డుల ద్వారా రూ.3.50 లక్షల నగదును ఇచ్చింది. అనంతరం బంగారు ఆభరణాలలో కొన్నింటిని అమ్ముకొని మిగతా నగదును మొత్తం జల్సాలకు వాడుకున్నాడు. కాగా ఆభరణాలు, నగదు అరుణ్రెడ్డికి ఇచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కోప్పడతారని భావించిన బాలిక ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లో టీవీ చూస్తుండగా బెడ్రూంలో చదువుకుంటున్నట్లు నటిస్తూ తనకు తానుగా చేతులు, కాళ్ళు కట్టేసుకుని నోట్లో గుడ్డలు కుక్కుకుని ఇంట్లో వారికి వినిపించేలా అరిచింది. దొంగలు వచ్చి తనను ఈ విధంగా కట్టిపడేసి ఇంట్లోని బంగారు ఆభరణాలు తీసుకుపోయారని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇది నిజమేనని నమ్మిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. దీంతో వారు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న అరుణ్రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు రాబట్టగలిగారు. అనంతరం తప్పుడు కేసు పెట్టినందుకు గాను బాలిక, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ను ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని ఏసీపీ తెలిపారు. -
'సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు'
హైదరాబాద్ : అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం బంగారపు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పసిడి కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. గోల్డ్ షాపులు ఉదయం నుంచే తెరిచి ఉంచారు. అక్షయ తృతీయ నాడు ఏవైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆ లక్ష్మిదేవి సిరి,సంపదలు, సౌభాగ్యం, పొందుతారని ప్రజల నమ్మకం. ఇక అక్షయ సెంటిమెంటుకు తోడు పుత్తడి ధర తక్కువగా ఉండటంతో బంగారం కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అక్షయ తృతీయ పేరుతో ఆభరణాల వర్తకులు సెంటిమెంట్ను క్యాష్ చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్లను ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటే రెండు గ్రాముల వెండి నాణాలు ఉచితం ఉంటూ ఊదరగొడుతున్నారు. ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొని దాచుకోవాలన్న తొందరలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కాకి బంగారం అంటగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సెంటిమెంట్ను గౌరవించాల్సిందే కానీ గుడ్డిగా ముందుకెళ్లడం మంచిది కాదు. ఏదైనా తేడా ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. సరైన బిల్లుతో ఆశ్రయించడం ద్వారా మోసాలు నుంచి రక్షణ పొందవచ్చు. -
నగల కోసం స్నేహితురాలిని చంపేసింది
తిరువొత్తియూరు: బంగారు కమ్మలు కోసం స్నేహితురాలిని ఓ విద్యార్థిని కడతేర్చింది. ఈ సంఘటన తమిళనాడులోని దిండివనంలో చోటుచేసుకుంది. దిండివనం సమీపంలోని మోలసూరు గ్రామానికి చెందిన రవి లారీడ్రైవర్. ఆయన కుమార్తె శశిరేఖ (14) ఓమలూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత నెల 31న స్కూల్కు వెళ్లిన శశిరేఖ ఇంటికి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న కిళయనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మోలసూరు ప్రాంతంలో ఉన్న బావిలో శశిరేఖ మృతదేహం బయట పడింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహం చెందిన గ్రామస్తులు హంతకుల్ని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. హత్యకు గురైన శశిరేఖ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనిత స్నేహితులు. శనివారం శశిరేఖకు జన్మదినం కావడంతో కొత్తగా కొనుగోలు చేసిన బంగారు కమ్మలు వేసుకుని పాఠశాలకు వెళ్లింది. ఇంటికి వెళ్లే సమయంలో అనిత ఆమెతో పాటుగా వచ్చినట్టు విచారణలో తేలింది. పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారించారు. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో శశిరేఖ ధరించిన కమ్మలు కోసం హత్య చేయడానికి నిర్ణయించినట్టు పేర్కొంది. పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా బావిలో స్నానం చేయడానికి శశిరేఖను తీసుకె ళ్లినట్టు పేర్కొంది. కొత్త కమ్మలు వేసుకోవాలని శశిరేఖకు చెప్పడంతో కమ్మలు తీసి అనితకు ఇచ్చింది. కమ్మలు తీసుకున్న తరువాత శశిరేఖను బావిలోకి తోసి అనిత ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చేసినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేశారు. దాచి ఉంచిన కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం ధర దిగి రావాలంటే..!
-
బంగారం ధర.. ఒక్కసారే పైకెగిసిందిలా..!