Greater Warangal Municipal Corporation
-
జోరుగా.. హుషారుగా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: పదేళ్ల కిందటే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా 2019 వరకు అవి మెట్రో నగరాలను దాటి రాలేదు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. డిమాండ్కు తగ్గట్టు పలు కంపెనీలు మంచి ఫీచర్ బైక్లతో షోరూంలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్, ఆటోలు, కార్ల అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల బాటలో వరంగల్ పయనిస్తోంది వరంగల్ మహా నగరం రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల సంచారం పుంజుకుంటోంది. ఇవి స్మార్ట్ వాహనాలు కూడా కావడంతో టెక్నాలజీ ప్రియులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీసీ, తారు రోడ్ల సౌకర్యం పెరిగి వాహనాలు, ఈవీ వాహనాల సంఖ్య పెరిగినట్లు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ర్స్టాక్ట్ (అట్లాస్)–2024 గణాంకాలు చెబుతున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం.. పెరుగుతున్న వాహనాలు తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు మెరుగయ్యాయి. ఇదే సమయంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ తదితర ద్వితీయశ్రేణి నగరాల్లోనూ తారు, సీసీ రోడ్లు పెరిగాయి. మొత్తంగా తెలంగాణలో మొత్తం రోడ్ల పొడ వు 1,10,756.39 కిలోమీటర్లు కాగా, ఇందులో సి మెంట్ రోడ్లు 11,438.06 కి.మీ.లు, తారు రోడ్లు (బ్లాక్ టాప్) 59,499.25 కి.మీ.లు, మెటల్ రోడ్లు 8,291.77 కి.మీ.లుగా ఉన్నాయి. ఇందులో 28,707.43 కి.మీ.లు రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో ఉండగా, 68,539.27 కి.మీ.లు పంచాయతీరాజ్ (పీఆర్ఈడీ), 4,497.0 కి.మీ.ల పొడవు గల 30 రోడ్లు జాతీయ రహదారుల పరిధిలో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 9,013 కి.మీ.ల పొడవు రహదారులు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో మూడేళ్లలో బైక్లు, కార్లు, జీపులు, లారీలు తదితర వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా పెరిగినట్లు వెల్లడించారు. 2020–21లో 8,79,826 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2022–23లో 9,51,780, 2023–24లో 9,76,073 వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో కూడా ఈవీ వాహనాల సందడి పెరిగింది. స్మార్ట్ సిటీస్.. ‘ఇ–స్మార్ట్’ వెహికిల్స్ మోడల్, బ్రాండ్, బ్యాటరీ కెపాసిటీ, ఇంజన్ సామర్థ్యం బట్టి రూ.44,900ల నుంచి రూ.3.10 లక్షల ధరతో ఎలక్ట్రిక్ బైక్స్ లభిస్తున్నాయి. రూ.12 లక్షల నుంచి రూ.23.49 లక్షల వరకు కార్లు ప్రస్తుత మార్కెట్లో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఆఫ్టిమా ఎల్ఏ, ప్యూర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, ఓలా, ఒకినవా, ఆంపియర్ తదితర కంపెనీలు షోరూంలను ఏర్పాటు చేశాయి. ఈ–కార్ల విషయానికొస్తే టాటా నెక్సాస్ ఈవీ, మహీంద్రా ఈ2వో ప్లస్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా టిగోర్ తదితర ఈవీలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కంపెనీని బట్టి రూ.8.98 లక్షల నుంచి రూ.26.27 లక్షల వరకు పలుకుతోంది. గంటన్నర నుంచి 9 గంటల వరకు చార్జింగ్ చేస్తే గంటకు 80 నుంచి 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 110 నుంచి 471 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నారు. ఈవీలో వినియోగం పెంచేందుకు తెలంగాణ వ్యాప్తంగా విరివిగా విద్యుత్ కంపెనీల ఆధ్వర్యంలో చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) మేనేజర్ మహేందర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ తర్వాత.. గ్రేటర్ వరంగల్లోనే మెట్రో, స్మార్ట్సిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల తర్వాత వరంగల్ ట్రైసిటీస్లోనే ఎ క్కువగా ఈవీ బైక్లు, కార్లు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం 2022, మార్చి వరకు గ్రేటర్ వరంగల్లో మొత్తం 853 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2023 మార్చి నాటికి 3,289 ఈవీ వాహనాలు నమోదు కాగా.. 2024 డిసెంబర్ వరకు 4,309 ఎలక్ట్రిక్ బైకులు, ఆటోలు, కార్ల విక్రయాలు జరిగాయి. 2023–24 అట్లాస్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్లో 15,290, మేడ్చల్ మల్కాజిగిరిలో 14,860, రంగారెడ్డిలో 11,882, సంగారెడ్డిలో 2,224 ఈవీ బైక్లు, కార్లు, ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహం పర్యావరణానికి మేలు చేసే (ఈవీలు)ఎలక్ట్రిక్ వాహనాల ను కొనుగోలు చేసేలా ప్రభు త్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. రూ.లక్షకు 14 శాతం వరకు ఉండే జీవితకాల పన్ను మినహాయింపు కూడా లభిస్తోంది. నిర్వహణ వ్యయం పూర్తిగా తగ్గింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా విద్యుత్ వాహనాలు 2024–2025లో రెట్టింపుస్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. – జైపాల్రెడ్డి ఎంవీఐ, వరంగల్ ఈవీతో ఖర్చులు తగ్గించుకున్నా గతేడాది ఎలక్ట్రిక్ ఈవీ బైక్ కొనుగోలు చేశా. గతంకంటే రోడ్లు బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. పెట్రోల్ వాహనం ఉన్నప్పుడు నెలకు పెట్రోలుకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.600లు ఖర్చయ్యేవి. ఈవీ బైక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఖర్చులు తగ్గించుకున్నా. రెండు రోజులకోసారి చార్జింగ్ పెడితే 90 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నా. మెయింటెనెన్స్ ఖర్చులు లేవు. చాలా ఆదా అవుతోంది. – నీర్ల శశికుమార్ వరంగల్, ఈవీ బైక్ యజమాని హ్యపీగా ప్రయాణం చేస్తున్నాం ఇటీవల మా బంధువులకు లాంగ్ వేరియంట్ విద్యుత్ కారును కొనుగోలు చేశా. వాహనంతో పాటు 35 కిలోవాట్ల బ్యాటరీ వచ్చింది. 8 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ బ్యాటరీ చార్జింగ్ పెడితే హ్యాపీగా 300 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ట్రాఫిక్ సమస్యలతో మరింత ఎక్కువ ఇంధనం ఖర్చు కావటం వల్ల కార్ల వినియోగం భారమైంది. ఈవీ కారుతో ఖర్చును వేల రూపాయల్లో తగ్గించుకున్నాం. – గోనెల రాంప్రసాద్, వరంగల్ -
కాంగ్రెస్లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు
గీసుకొండ: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గీయుల మధ్య చిచ్చు రేపాయి. «కొండా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్కు చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం వారు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంపై రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే వారిని పోలీస్స్టేషన్లోనే అదుపులోకి తీసుకుని బయటకు పంపడం లేదనే సమాచారం రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తమ వారిని విడిపించేందుకు ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి వస్తే, బంధించి బూట్లతో తన్నుతారా.. విచారణ చేయరా? అని ఆమె పోలీసు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సీఐ కురీ్చలో కూర్చుని ఆమె అధికారులతో వాదిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్ కిషోర్ఝా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రేవూరి వర్గీయుడు పిట్టల అనిల్పై దాడి చేసిన విషయంలో కొండా వర్గానికి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. ఇందులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండా వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిట్టల అనిల్ చేసిన వీడియో వైరల్ అయింది. -
గ్రేటర్ వరంగల్ పరిధిలో 40 కాలనీలు జలమయం
-
Pamela Satpathy: తల్లి హృదయం.. కన్నీరు మున్నీరైన కమిషనర్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి తన పనేదో తాను చేసుకుని ఇంటికి చేరుకునే రకం కాదు. పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సిబ్బందిలో ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలుస్తారు. గత నెలలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా కరోనా బారిన పడిన సత్పతి.. ఇటీవలే కోలుకుని విధుల్లో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో వంట మనిషిగా పనిచేసే తాళ్లపల్లి కమల కుమారుడు, బల్దియాలో తాత్కాలిక కార్మికుడు నాగరాజు(32) ఇటీవల అనారోగ్యం బారిన పడగా శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కమిషనర్, మేయర్ గుండు సుధారాణితో కలసి హన్మకొండలోని వారి ఇంటికి వెళ్లి నాగరాజు మృతదేహం వద్ద నివాళులర్పించారు. తర్వాత మృతుడి తల్లి, భార్యను ఓదార్చారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య తన రెండు నెలల పసిగుడ్డును పట్టుకుని రోదిస్తుండగా కమిషనర్ సత్పతిలోని తల్లి హృదయం మేల్కొంది. పసిగుడ్డును తన చేతిలోకి తీసుకున్న ఆమె కూడా కన్నీరు మున్నీరుగా రోదించారు. ఇటీవల నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరోనాతో బాధపడుతున్న కమిషనర్.. స్వయంగా వెళ్లలేక తన అమ్మానాన్నలను పరామర్శ కోసం పంపించడం విశేషం. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆ ఊపు లేదు.. ఆ హవాలేదు.. ఆ హడావిడి లేదు.. ఆ సంబురం లేదు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల జోరును మినీ మున్సి‘పోల్స్’లో కొనసాగించలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టును నిలుపుకోవాలని పలు వ్యూహాలు పన్నినా అధికార టీఆర్ఎస్ ముందు అవి పారలేదు. ఎక్కడా సత్తా చాటలేకపోయింది. గ్రేటర్ వరంగల్లో మాత్రం కొంత నయం. 10 కార్పొరేటర్ స్థానాలను అతికష్టం మీద గెలుచుకుంది. కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు తొలుత ధీమా వ్యక్తం చేశాయి. కానీ, ఇప్పుడు అందులో సగానికే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో బీజేపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఇక్కడ పది స్థానాలు రావడం కాస్త మెరుగేనని కార్యకర్తలు భావిస్తున్నారు. లింగోజిగూడ లాస్.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఒక కార్పొరేటర్ స్థానాన్ని చేజిక్కించుకొని ఖాతా తెరిచింది. తమ పార్టీ కార్పొరేటర్ మరణంతో ఉపఎన్నిక జరిగిన లింగోజిగూడ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఖమ్మంలో తమకు ఆరేడు స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కు ఏమీ రావని పార్టీ ముఖ్యనేతలు వేసుకున్న అంచనా తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో వరంగల్లో ఉండాలని, కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకోగలిగితే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభం అవుతుందని బీజేపీ శ్రేణులు భావించాయి. మున్సిపోల్స్లో తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. చదవండి: 'పుర' పీఠాలపై గులాబీ జెండా -
మలి విడత పురపోరుకు సై!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మలి విడత మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు వార్డుల పునిర్వభజన షెడ్యూల్ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 25 వరకు వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఆయా పురపాలికలు చర్యలు చేపట్టనున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఏప్రిల్/ మేలో ఎన్నికలు.. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు మార్చి 14తో, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. వీటితో పాటు గ్రామ పంచాయతీల స్థాయి నుంచి మున్సిపాలిటీలుగా మారిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడు పురపాలికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజనతో పాటు వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ మార్చి 25తో ముగియనుండగా, వార్డులు, చైర్పర్సన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రక్రియను మరో 2 వారాల్లోగా పూర్తి చేసే అవకాశముంది. అనంతరం వచ్చే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలో ఈ ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. కార్యక్రమం గడువు తేదీ జనాభా గణన విభాగం నుంచి వార్డుల వారీగా చివరి జనాభా లెక్కల గణాంకాలను సేకరించడం లేదా జిల్లా ఎన్నికల అధికారి నుంచి తాజా ఓటర్ల జాబితాను తీసుకోవడం 24 ఫిబ్రవరి వార్డుల పునిర్వభజన ఉత్తర్వుల్లోని నిబంధనలను పాటిస్తూ మున్సిపాలిటీలు క్షేత్ర స్థాయి సర్వే ద్వారా ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి 25 ఫిబ్రవరి నుంచి 6 మార్చి మున్సిపాలిటీను వార్డులుగా విభజన ప్రతిపాదనలు, సాధారణ ప్రజల నుంచి సలహాల స్వీకరణకు నోటిసు జారీ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేయడం. పత్రికల్లో ప్రచురించడం మార్చి 7 నుంచి 8 వరకు సాధారణ ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సలహాలు/సూచనలు కోరడం మార్చి 9 నుంచి 15 వరకు సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిష్కరించడం మార్చి 16 నుంచి 21 వరకు పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్కు నివేదిక సమర్పించడం మార్చి 22 రాష్ట్ర ప్రభుత్వానికి పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ నివేదిక సమర్పించడం మార్చి 23 నుంచి 24 వరకు వార్డుల పునిర్వభజనపై తుది నోటిఫికేషన్ జారీ మార్చి 25 -
గ్రేటర్ ఫైట్.. ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి ప్రతినిధి, వరంగల్ / వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. పాలకవర్గ పదవీకాలం ముగిసే సమయం సమీపిస్తుండగా అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. మహానగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల పునర్విభజన కీలక ఘట్టం కానుంది. ఆ దిశగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్లోనూ ఇదే విధానం కొనసాగనుంది. ఇప్పుడు ఉన్న 58 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తారు. ఈనేపథ్యంలో వార్డులు, కాలనీల తీసివేతలు, కూడికలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేడో, రేపో పునర్వి భజన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. (చదవండి: చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు) వచ్చే నెల 14 వరకు పాలకవర్గం గడువు గ్రేటర్ వరంగల్ డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా లు, రిజర్వేషన్లు తేల్చేందుకు రెండు నుంచి మూడు నెలల గడువు అవసరమవుతుంది. గ్రేటర్ వరంగల్ ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం మార్చి 14తో ముగియనుంది. ఆలోగా కార్యకలాపాలన్నీ పూర్తి కావు. ఈ మేరకు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించి ఎన్నికల తతంగం పూర్తయ్యేంత వరకు కొనసాగుతారు. గతంలోనూ 2009 అక్టోబర్ నుంచి 2016 మార్చి 13వ తేదీ వరకు ప్రత్యేకాధికారి పాలన బల్దియాలో కొనసాగింది. అదే తరహాలో మార్చి 14వ తేదీ తర్వాత మళ్లీ ప్రత్యేకాధికారి పాలన రాబోతుందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్లోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు బల్దియా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం కాగా, పురపాలక శాఖ నుంచి డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ ఉత్తర్వులు రావడమే తరువాయిగా మిగిలింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పునర్విభజన షెడ్యూల్ విడుదల చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ కోసం అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. జూలై 2019 ఆర్డినెన్సే ప్రామాణికం.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం 2019 జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో జనాభాను వెల్లడించడంతో పాటు వార్డుల సంఖ్యను పెంచారు. ఆ ఆర్డినెన్స్లోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,19,416 మంది జనాభా ఉండగా, 58 వార్డులను 66కు పెంచనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో జనగామ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను సవరించారు. ఆ తర్వాతే గత ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. తద్వారా వార్డుల పునర్విభజన అనివార్యంగా మారింది. గ్రేటర్ వరంగల్లో 2011 నాటి జనాభా, వార్డులు, ప్రభుత్వం 2019 జూలైలో ప్రతిపాదించిన వార్డులు ఇలా... ♦జనాభా- 8,19,406 ♦గతంలో డివిజన్లు- 58 ♦ప్రతిపాదిత డివిజన్లు- 66 -
పెండింగ్ అంటే గిట్టదు!
వరంగల్ అర్బన్ : పెండింగ్ అంటే తనకు ఏ మాత్రం గిట్టదని.. నిబంధనల మేరకు పైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందేనని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో శనివారం ఆమె టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. టౌన్ ప్లానింగ్కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్లు, ల్యాండ్ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్మెంట్ ఫీజుల తదితర అంశాలపై ఇన్చార్జ్ సీపీ నర్సింహ రా ములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్రెడ్డితో ఆరా తీశారు. పైళ్ల పరిష్కారానికి ఆన్లైన్ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, అనధికార భవనాల వివరాలను డివిజ న్ల వారీగా అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు. తనిఖీలతో హల్చల్! కమిషనర్ పమేల సత్పతి తనిఖీలతో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40, 43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, నరేందర్ను కమిషనర్ మందలించారు. ఆర్అండ్బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మిర్యాలాకర్ దేవేందర్ కమిషనర్ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు. దీంతో శిథిలావస్థకు చేరిన చోట నూతన డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్ను ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్లో పబ్లిక్ టాయిలెట్ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ సీహెచ్ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. -
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూపులు
సాక్షి, వరంగల్: విజయ దశమికి తమ దశ తిరుగుతుందన్న ఆశల పల్లకీలో పలువురు టీఆర్ఎస్ నేతలు ఊరేగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పది మంది టీఆర్ఎస్ సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్గా వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్గా గాంధీనాయక్, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా గుండు సుధారాణి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా పెద్ది సుదర్శన్రెడ్డి పదవులు చేపట్టారు. అలాగే ‘కుడా’ చైర్మన్గా మర్రి యాదవర్రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్గా లింగంపెల్లి కిషన్రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కన్నెబోయిన రాజయ్యయాదవ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా బొల్లం సునీల్కుమార్, ఖాదీగ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్గా మౌలానా యూసుఫ్ జాహేద్, రైతు ఆత్మహత్యల న్యాయ విచారణ, విమోచన కమిటీ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్ల దక్కించుకోగా.. మరో ఒకరిద్ద్దరికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు వస్తాయని అనుకుంటున్న తరుణంలోనే ముందస్తుగా టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు పోవడంతో పదవుల పందేరానికి బ్రేక్ పడింది. ముగుస్తున్న పదవుల కాలం.. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారి కమిటీల పదవీకాలం ముగిసిపోతోంది. ఇందులో రెండు నెలల క్రితం వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్ గాంధీనాయక్, మహిళా ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి పదవీకాలం ముగిసింది. అక్టోబర్ 9న అంటే మరో పదిరోజుల్లో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు, గొర్రెలు పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పదవీకాలం ముగిసిపోనుంది. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న పెద్ద సుదర్శన్రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అది ఖాళీ అయ్యింది. డిసెంబర్ నెలతో హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్కుమార్, ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ యూసుఫ్జాహేద్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పది రాష్ట్ర స్థాయి పదవులు ఖాళీ కానున్నాయి. మరోసారి అవకాశం కోసం... ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సంస్థల చైర్మన్లు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రుల చాంబర్లలో సదరు ఆశావహ నేతలే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విశ్వసనీయత, విధేయతే గీటు రాయి అన్న చందంగా టీఆర్ఎస్ అగ్రనేతలు పదవులు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి చేసిన సేవలతోనే పదవులు ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు సమావేశాల్లో స్పష్టం చేయడంతో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటులో నాయకులు పోటీ పడి పనిచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్టైల్లో వారు శ్రమించారని చెప్పక తప్పదు. ఖచ్చితమైన హామీ ఎవరికీ లభించనప్పటికీ ముగ్గురు మినహా గతంలో పొందిన నామినేడెడ్ పదవులను మళ్లీ తమకే కేటాయించాలంటూ ప్రయత్నాలు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆశల పల్లకిలో ఉద్యమకారులు... తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ కేసుల పాలైన పలువురు ఉద్యమకారులు ఈసారి తప్పకుండా నామినేటెడ్ పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయక పోవడం వల్ల డైరెక్టర్ల పోస్టులు సైతం పార్టీ కింది స్థాయి క్యాడర్కు దక్కలేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను నియమించి అసంతృప్తి వాదులను సంతృప్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో అధిష్టానం యోచిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. విజయదశమికి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు కొందరు వ్యక్తం చేశారు. -
అవినీతి వైరస్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఇదే క్రమంలో ఔట్ సోర్సింగ్లోని ఐటీ విభాగంలో కొన్నేళ్ల క్రితం చేరిన ఓ ఉద్యోగి తన ప్రత్యేక నైపుణ్యంతో అధికారులను బుట్టలో పడేశాడు. గ్రేటర్ సాంకేతిక విభాగాన్ని మొత్తం గుప్పిట పట్టి అక్రమాలకు పాల్పడుతున్నాడు. కీబోర్డు, కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్, జిరాక్స్ మిషన్ల కొనుగోళ్లలో బినామీ వ్యాపారిగా మారి ఐటీని లూటీ చేస్తున్నాడు. కొన్ని బినామీ, మరికొన్ని కమిషన్లు.. గ్రేటర్ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో, ఐటీ విభాగంలో ఏ వస్తువు కొనుగోలు చేసిన సదరు బాస్కు ముడుపులు ముట్టాల్సిందే. లేదంటే సవాలక్ష కొర్రీలు ఉంటాయి. కార్పొరేషన్లో వందల సంఖ్యలో కంప్యూటర్లు, స్కానర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఉన్నాయి. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలన్నా ముందుగా ఐటీ బాస్ కమిషనర్కు నోట్ పెడతాడు. కొనుగోలుకు అనుమతి రావడంతో తన అనుభవాన్ని రంగరిస్తాడు. కీబోర్డులు, కంప్యూటర్లు, ట్యాప్టాప్లు, ట్యాబ్లు, జిరాక్స్ యంత్రాలు, మొబైల్ ఫోన్లు ఏదైనా తన కనుసన్నల్లో కొనుగోలు జరుగుతుంటాయి. కొన్ని బినామి పేర్లపై, మరికొన్ని కమిషన్లు పేరిట లావాదేవిలు సాగుతుంటాయి. 2015 ఆగస్టులో గ్రేటర్లో రూ. 2 కోట్లతో కంప్యూటర్లు, ట్యాప్టాప్లు, ట్యాబ్లు, స్కానర్లు, ట్యాబ్లు కొనుగోలు చేపట్టారు. అయితే ఇందులో సదరు ఐటీ బాస్ పెద్ద ఎత్తున కమిషన్లు అందుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఆయన తన సాఫ్ట్ ఆలోచనలతో ఆస్తి పన్నులను పెంచడం, తగ్గించడం, తొలగించడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ప్రతి ఏటా గ్రేటర్ వరంగల్ స్టేషనరీ, ముద్రణా, కంప్యూటర్లు, ఇంట ర్నెట్, మరమ్మతులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు ఏటా రూ.80 లక్షల వరకు బడ్జెట్లో కేటాయిస్తోంది. ఇందులో అవసరాలను ఆధారంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి కొనుగోలు వెనుక సదరు ఐటీ అధికారి భాగస్వామ్యం ఉంటుంది. లేదంటే తన కమిషన్ ముట్టచెప్పాలి. కుదరదు అంటే అనేక సాంకేతిక కారణాలు ఎత్తి చూపి, ఆ కంపెనీలకు బదులుగా మరో కంపెనీ పరికరాలు కొనుగోలు చేయడం జరుగుతోంది. 2000లో గ్రేటర్లో చేరిక.. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో 2000 సంవత్సరంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయడలో భాగంగా అధికారులు నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిపై తీసుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి రూ.4000 జీతంతో ఆపరేటర్గా విధుల్లో చేరాడు. అయితే కొద్ది రోజులకే తనదైన నైపుణ్యంతో ఉన్నతాధికారులకు దగ్గరై తాను పనిచేస్తున్న విభాగానికి బాస్ అయ్యాడు. అన్నీ ఆయనే.. గ్రేటర్లో అన్నింటిలో కంటే ఐటీ విభాగం కీలకమైనది. రూ. కోట్ల ఆర్థిక లావాదేవిలు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంటాయి. ఇక్కడ పన్నుల విధింపు, ఫీజుల వసూళ్లు, వివిధ రకాల సాఫ్ట్వేర్లు, ప్రోగ్రామ్ల తయారీ జరుగుతోంది. అయితే ఇంత ప్రాధాన్యం కలిగిన విభాగానికి పర్మనెంట్ సూపరింటెండెంట్, ఓ అధికారి ఇన్చార్జిగా నియమించడం లేదు. ఈ క్రమంలో 18 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అన్నీతానై ఐటీ బాస్గా కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 50 మంది వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఆపరేటర్లు, ప్రోగామర్లు, ఇతర సిబ్బంది ఈయన కనుసన్నల్లో నడుస్తుంటారు. అతడి దగ్గర తోక జాడించిన వారికి అంతర్గత బదిలీలు చేస్తున్నాడు. ఐటీ ఔట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్గా, బాస్గా పద్దెనిమిది ఏళ్లు ఒకే చోట విధులను చక్కబెడుతున్నాడు. సదరు ఐటీ బాస్ వారం రోజుల పాటు విధుల్లోకి రాకపోతే గ్రేటర్ ఆన్లైన్ లావా దేవీల కుప్పుకూలే విధంగా ప్రోగ్రామ్లు, సాఫ్ట్వేర్లు తన గుప్పిట్లో ఉంచుకోవడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ అన్నీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తింస్తుండగా, అధికారులు వింగ్ అధికారులు ఉన్నారు. కానీ శాశ్వత ఉద్యోగి, ఇన్చార్జి అధికారి లేకుండా నడుస్తున్న ఏకైక విభాగం ఉందంటే అది కేవలం ఐటీ విభాగం మాత్రమేనని చెప్పవచ్చు. ఈ–స్క్రాప్ ఏమైంది..? గత 18 ఏళ్లుగా కొనుగోలు చేసి పాడైన కంప్యూటర్లు, కీ బోర్డులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమయ్యాయో అంతుచిక్కడం లేదు. నిబం ధనల మేరకు పాడైన ప్రతి పరికరాన్ని పక్కా లెక్కతో స్క్రాప్ కింద అమ్మి గ్రేటర్ ఖజానాకు సొమ్ము జమ చేయాలి. కానీ సదరు అధికారి పాడైనా, కాకున్నా పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నాడు. రోజువారీగా స్టేషనరీ, ప్రింటర్ల, జిరాక్స్ ప్రింట్ల రంగు కొనుగోలు గోల్మాల్ జరుగుతోంది. ఐటీ బాస్ అవినీతి, అక్రమాలను తెలుసుకున్న బదిలీ కమిషనర్ ఇక్కడి నుంచి సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే తనపైఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎవరెమన్నా ఓపికగా తలాడిస్తూ ఐటీని లూటీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జగమొండి..!
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ పరిధిలో ప్రజలందరూ పన్నులు కట్టాలి... మహా నగర అభివృద్ధికి తోడ్పడాలి.. అంటూ అధికారులు జోరుగా సందేశాలు ఇస్తున్నారు. అంతేకాదు.. సామాన్యుడి నుంచి మరీ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించని పక్షంలో నల్లా కనెక్షన్ కట్..ఆస్తుల జప్తు.. వ్యాపార, వాణిజ్య సంస్థల సీజ్ అంటూ నడి రోడ్డుకు లాగి పరువు తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో పన్ను బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న మహా నగర పాలక సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి కేవలం 11 శాతం పన్నులు వసూలు కావడం గమనార్హం. దీనిపై గ్రేటర్ పాలకవర్గం సైతం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల రాక దేవుడికెరుక.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులు 1,545 ఉన్నాయి. వీటి నుంచి జీడబ్ల్యూఎంసీకి ఆస్తి పన్ను కింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.99 కోట్లు.. కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.15.70 కోట్లు సమకూరాల్సి ఉంది. వడ్డీలు మినహాస్తే రూ.18.69 కోట్ల బకాయిలు ఉండగా.. గ్రేటర్ అధికారులు ఇప్పటివరకు రూ.2,15 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో సగానికి పైగా సొమ్ము ఆయా శాఖలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించినవే. నోటీసులతో సరి.. ఏళ్ల తరబడి బకాయిలు భారీగా పేరుకుపోతున్నా.. బల్దియా అధికారుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అన్నట్లు.. ఏటా తాఖీదులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు అడిగితే.. తాఖీదులు ఇచ్చామని సమాధానమిస్తున్నారే తప్ప.. బకాయిల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. అయితే.. ఈ ఏడాది బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఏడాది పొడవునా ఒత్తిడి తీసుకొచ్చారు. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వ శాఖల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. మరో 23 రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికైనా మేయర్, కలెక్టర్, కమిషనర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖ పన్ను చెల్లించే విధంగా ఒత్తిడి తేవాలి. పేరుకుపోయిన బకాయిలను రాబట్టగలిగితే ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. మహా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. బకాయిలు చెల్లించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు.. నిట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేయూ, రైల్వే శాఖ, ప్రభుత్వ కాలేజీలు, రెవెన్యూ శాఖ, ఆర్అండ్బీ, పీడబ్ల్యూడీ, పంచాయతీ రాజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్ట్ ఆఫీస్లు, హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్కూళ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, కోర్టు, టెలికాం, ఆల్ ఇండియా రేడియో, ట్రాన్స్కో, సీఆర్పీఎఫ్ పోలీస్, ఎఫ్సీఐ, ఇతర సర్కారు సంస్థల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. స్పెషల్ నోటీసులు ఇస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కొన్ని శాఖల అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రత్యేక నోటీసులు జారీ చేసి వసూలు చేస్తాం. – శాంతికుమార్, టీఓ -
ఉప ఎన్నిక పోరు నేడే..
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 44వ డివిజన్ ఓటర్లు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. ఉపఎన్నిక బరిలో నిలిచిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్ తేల్చేందుకు ఓట ర్లు సిద్ధమయ్యారు. డివిజన్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నాయకులు.. ఓటర్ల స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయ ంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పోలింగ్స్టేషన్లకు.. గ్రేటర్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూం నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక బస్సులో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం తొమ్మిది ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 9,641 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హన్మకొండ నయీంనగర్లోని తేజస్వీ హైస్కూల్లో మూడు ఈవీఎంలు, తేజస్వీ హైస్కూల్ 2వ బ్లాక్లో నాలుగు ఈవీఎంలు, ఏకశిల హైస్కూల్లో రెండు ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తేజస్వీని హైస్కూల్ 2వ బ్లాక్లో మూడో తరగతి గదిలో 1,298 మంది ఓటర్లు, ఇదే స్కూల్లోని ఐదో తరగతి గదిలో 915 మంది ఓటర్లు తమ ఓటను వినియోగంచుకోనున్నారు. ⇒ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య మాక్ పోలింగ్ ⇒ పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ⇒ రిజర్వేషన్– జనరల్ ⇒ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులు ఇద్దరు ⇒ పోలింగ్ సిబ్బంది–40 మంది ⇒ ప్రతి పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడిగ్ అధికారి, ఇద్దరు చొప్పన సహాయకులు ⇒ రిజర్వులో నలుగురు సిబ్బంది ⇒ పోలింగ్లో అభ్యర్థికి ఒక ఎజెంట్ చొప్పన రెండు పార్టీల అభ్యర్థులకు ఇద్దరు ⇒ ఇద్దరు రూట్ ఆఫీసర్లు, ఒకరు జోనల్ ఆఫీసర్ ⇒ ఉప ఎన్నిక కంట్రోల్ రూం ఇండోర్ స్టేడియం ⇒ ఎన్నికల విధుల్లో 50 మంది గ్రేటర్ సిబ్బంది ⇒ రెండు గంటలకోసారి పోలింగ్ శాతం వెల్లడి ⇒ శాంతి భద్రతల కోసం పోలింగ్ కేంద్రానికో ఎస్కార్టు ⇒ నిఘా కోసం వీడియోగ్రాఫర్ను నియమించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి.. 44వ డివిజన్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి కరుణాకర్ తెలిపారు. సోమవారం గ్రేటర్ ఇండోర్ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎం, స్టేషనరీ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉపఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ బ్రహ్మయ్య, సీపీ శ్యాంకుకమార్, ఈఈ లింగమూర్తి, ఏఆర్ఓలు పారిజాతం, శ్రీవాణి, పర్యవేక్షకులు ప్రసన్నారాణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నిక డివిజన్ 44 పోలింగ్ కేంద్రాల సంఖ్య 3 పోలింగ్ బూత్లు 9 డివిజన్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 9,641 మహిళా ఓటర్లు 4,648 పురుష ఓటర్లు 4,993 మొత్తం ఓటర్లు 9,641 ఈవీఎంలు 9 -
24న గ్రేటర్ స్టాడింగ్ కమిటీఎన్నికలు
►నేడు నోటిఫికేషన్ విడుదల ►ఆరుగురు సభ్యుల ఎన్నికకు సమాయత్తం ►నేటి నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ ►17న పరిశీలన, అదే రోజు స్క్రూటినీ ►19న ఉపసంహరణ.. అదేరోజు తుదిజాబితా వెల్లడి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ (స్థాయీ సం ఘం) సభ్యుల ఎన్నికకు నగరా మోగింది. తొలి స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవి కా లం ఏడాదితో ముగిసింది. ఈ మేరకు రెం డో దఫా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక షెడ్యూల్ ఖరారైంది. మం గళవారం గ్రేట ర్ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక నోటిఫికేషన్ను కమిషనర్ శృతి ఓజా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16న మ« ద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న స్టాండిం గ్ కమిటీల సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలో 58 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్ని కోవా ల్సి ఉంటుంది. గతంలో స్థాయీ సం ఘాన్ని ఏర్పాటు చేసేందుకు వరుస క్రమంలో పది డివిజన్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకునే వారు. పది మంది కార్పొరేటర్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మారాయి. వరుస క్రమంలో కాకుండా 58 డివిజన్ల నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఆరుగురు కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్లు దాఖాలు చేయగా, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి మోజార్టీ సభ్యులు ఉండడం వల్ల ఏకగ్రీవ ఎన్నిక సులువైంది. ఈ దఫా కూడా పోటీ లేకుండా సభ్యులను ఖరారు చేయనున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక అనుకున్నట్లుగా జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా... ►8న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ►గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్పొరేటర్ల నుంచి గ్రేటర్ కార్యదర్శి నామినేషన్ల పత్రాలను స్వీకరిస్తారు. ►16న సాయంత్రం 3గంటలకు నామినేషన్ల జాబితా వెల్లడి ►17న నామినేషన్ల పరిశీలన, అదే రోజు స్క్రూటినీ... ఆ తర్వాత చెల్లుబాటు నామినేషన్ల జాబితా ప్రకటన ►19న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచి అభ్యర్థుల పేర్ల ప్రకటన. ►24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో పోలింగ్. సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు విడుదల. 2016 ఏడు సమావేశాలే..! నిబంధనల ప్రకారం 15 రోజులకోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం జరగాలి. ఏడాదిలో 24 సార్లు స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఏడు సార్లు మాత్రమే నిర్వహించారు. తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం 2016 నవంబర్ 9న, రెండో సమావేశం నవంబరు 22న, మూడోది అక్టోబర్ 10న, నాలుగోది డిసెంబర్ 23న, ఐదోది ఫిబ్రవరి 18న, అరోదిజూలై 3న, ఇక చివరి సమావేశం జూలై 18న జరిగింది. -
కాళేశ్వరంలో కాల్వలే ముందు
బ్యారేజీ, పంప్హౌస్లు పూర్తయ్యేలోగా కాల్వలు నిర్మించాలి - అందుకు ప్రత్యేక చొరవ చూపండి: ఎమ్మెల్యేలకు సీఎం సూచన - దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించండి - భగీరథ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి - గ్రేటర్ వరంగల్ గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్మాణం, మరమ్మతులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్హౌస్ల నిర్మాణం పూర్తయ్యేలోగా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ చానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని చెప్పారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, వాటిని అధికారులతో చేయించాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, వాటి ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. బ్యారేజీల నిర్మాణం కన్నా ముందే పంప్హౌజ్ల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమ య్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, స్టీఫెన్ సన్, సుధీర్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రేఖా నాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఇందులో పాల్గొన్నారు. ‘భగీరథ’పై దృష్టి పెట్టండి తమ నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పంప్హౌస్లు, సబ్స్టేషన్లు, పైప్లైన్ల నిర్మాణ పురోగతి? తదితర అంశాలను గమనించాలన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు. ఆ 42 గ్రామాలకూ గొర్రెల పథకం గ్రేటర్ వరంగల్లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, వరంగల్ నగర పరిధిలో చేరిన గ్రామాలు అవకాశం కోల్పోయాయని ఆ జిల్లా మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్యమంత్రిని కలసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించారు. జూన్లో రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో ఎస్టీ బాలికలకు ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు నడపాలని కోరారు. ఈ మేరకు వెంటనే తుది జాబితా రూపొందిం చాలని చందూలాల్ను ఆదేశించారు. గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ రాష్ట్ర అవతరణ వేడుకలు, పెండింగ్ సమస్యలపై చర్చ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన సీఎం.. గవర్నర్తో అరగంటసేపు చర్చలు జరిపారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లు, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోం శాఖ స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా తెలంగాణ వాదనలను గవర్నర్కు సీఎం వివరించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం గవర్నర్ను కోరినట్లు తెలిసింది. -
గ్రేటర్ వరంగల్లో తాగినీటి ఎద్దడి
-
ఆదాయం అవసరం లేదా..?
ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం టార్గెట్ 5.26కోట్లు, వసూళ్లు 1.38కోట్లు పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లకు వ్యాపారులపై వల్లమాలిన ప్రేమో లేక, నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 జనవరి 31 నాటికి వంద శాతం వసూళ్లు చేయాల్సిన సానిటరీ ఇన్స్పెక్టర్లు కేవలం 26 వసూళ్లతో సరిపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని చూస్తే సొంత ఆదాయంపై వీరికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అవగతమవుతోంది. కార్పొరేషన్ పరిధిలో 17,559 మంది ట్రేడ్ లైసెన్స్లతో యాజమానులు వ్యాపారాలు నిర్వహిస్తునట్లు రికార్డులు చూపుతున్నాయి. కానీ నగరంలో రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది స్థానికంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో అధికారికంగా నమోదైన వ్యాపారుల నుంచి కుడా ఏడాదికోకమారు ఫీజు వసూలు చేయడంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా గత కొద్ది సంవత్సరాలుగా వేలాది మంది ట్రేడ్ లైసెన్స్దారుల వద్ద ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి. లక్ష్యం రూ.5.28 కోట్లు.. వసూళ్లు రూ.1.38 కోట్లు గ్రేటర్ వరంగల్ 2016–17 సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ. 5.28 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ణీత గడువు 2017 జనవరి 31 నాటికి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. గడువు దాటింది. కానీ ట్రేడ్ ఫీజు కేవలం రూ. 1.38కోట్లు వసూలు చేశారు. ట్రేడ్ ఫీజు, జరిమానాలతో ఇంకా రూ. 3.90కోట్లు ఫీజులు బాకాయిలు పేరుకుపోయాయి. బిర్రు శ్రీనివాస్ అనే సానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రం 85 శాతం పన్నులు వసూలు చేయగా, భాస్కర్ 63శాతం, కుమారస్వామి 63 శాతం టార్గెట్ వసూలు చేశారు. మారో సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య 15 శాతం, కర్ణాకర్ 17శాతం, భీమయ్య 18శాతం వసూలు చేయడం గమనార్హం. కొత్త డిమాండ్ రూ.5.51కోట్లు ఈ ఏడాది కొత్త డిమాండ్ ఫిబ్రవరి 1న ఖరారైంది. పాత బకాయిలతోపాటు వడ్డీ, ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజుతో రూ.5.51కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాది 3.90 కోట్ల బాకాయిలతో పాటు కొత్త లైసెన్స్ ఫీజు రూ.160కోట్లతో ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లిస్తే దీనిపై జరిమానా విధించరు. కానీ మార్చి తర్వాత 3 నెలల వరకు 25 శాతం జరిమానా, ఏడాది గడిస్తే 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. -
పెద్దలకు ఒక తీరు!
ఫ్లెక్సీల నిషేధంపై గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం అధికార పార్టీ ముఖ్యులకు మినహాయింపు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ప్రతిష్టను పెంచే కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఫెక్ల్సీల నిషేధం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు 2017 జనవరి 1 నుంచి వరంగల్ నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు నగరంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ ఆదేశాలు అధికారులు అమలు చేయాల్సి ఉంది. స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటిం చినా... నిషేధం అమలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికార టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో గ్రేటర్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర టీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. అధికారులు వాటిని తొలగించకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ నగర ప్రజల్లో మొదలైంది. మహానగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) తీసుకున్న నిర్ణయం సామాన్యులకే వర్తిస్తుందా... అందరికి వర్తిస్తుందా అనేది సందేహంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మొరాయించిన మైకు.. ఉద్యోగుల గైర్హాజరు
ఇదీ గ్రేటర్లో స్వాతంత్య్ర వేడుకల తీరు ఏఈ సస్పెన్షన్, డీఈకి నోటీసు గైర్హాజరైన వారికి కూడా నోటీసులు వరంగల్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవమంటే అందరికీ ఉత్సాహమే.. కానీ ఎందుకో తెలియదు కానీ గ్రేటర్ అధికారులు ఇదేమీ పట్టలేదు. సోమవారం ఉదయం 7–10గంటలకు వరంగల్ బల్దియా కార్యాలయానికి మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చేరుకున్నారు. కాసేపు వారి చాంబర్లలో ఉండి 7–25 గంటలకు జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రధాన కార్యాలయం ఎదుటకు వచ్చారు. కానీ అప్పటి వరకు కూడా అడిషనల్ కమిషనర్, గ్రేటర్ కార్యదర్శి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, కొందరు వింగ్ అధికారులు, సూపరింటెండెంట్లు రాలేదు. అయినా సరే మేయర్ జాతీయ జెండా ఎగురవేసి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే మైకు మొరాయించింది. ఎలక్ట్రికల్ సిబ్బంది మరమ్మతులు చేసినా అది ససేమిరా అనడంతో మేయర్ మైకు లేకుండానే తన ప్రసంగం కానిచ్చేశారు. ఆ తర్వాత తాపీగా అధికారులు, ఉద్యోగులు ఒక్కరొక్కరుగా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మేయర్ నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్కు ఫోన్ చేసిన కమిషనర్.. మైకు విషయంలో ఏఈ రవీందర్ సస్పెండ్ చేయాలని, డీఈ లక్ష్మారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ణీత సమయం 7–30 గంటల్లోగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాని అధికారులు, సూపరింటెండెంట్లకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచిం చారు. ఇక బల్దియా ప్రధాన కార్యాలయం కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిషనర్ పబ్లిక్ గార్డెన్కు వెళ్లగా ఉద్యానవన అధికారి మినహా ఎవరూ లేరు. దీంతో కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి కనీసం ఆహ్వాన పత్రాలను ముద్రించకుండా కార్పొరేటర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
నగర వాసులకు మెరుగైన సేవలు అందిద్దాం ‘గ్రేటర్’ స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ నన్నపునేని నరేందర్ వరంగల్ అర్బన్ : మహా నగర సమగ్ర అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ మహా నగ పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన పోరాట ఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలన్నారు. గ్రేటర్లో కొత్త పాలక వర్గం ఏర్పడి ఐదు నెలల కాలం అవుతుందని, తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరయ్యామన్నారు. నగర అభివృద్ధి అన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించామని మేయర్ స్పష్టం చేశారు. స్మార్ట్ నగరం, విశ్వనగరం ఏర్పాటుకు ప్రతి ఒక్కరం తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆయన విలీన గ్రామాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హరితహారం, రూపాయికి నల్లా కనెక్షన్ అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్ఈ అబ్దుల్ రహమాన్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్, వేణుగోపాల్, మేడిది రజిత, రిజ్వనా షమీం, యెలగం లీలావతి, నల్లా స్వరూపరాణి, మరుపల్లి భాగ్యలక్ష్మి, గ్రేటర్ సెక్రటరీ నాగరాజరావు, డిప్యూ టీ కమిషనర్లు ఇంద్రసేనారెడ్డి, సురేందర్రావు,అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు పలు విభాగాల్లో 30 మంది ఉద్యోగులకు మేయర్, కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో వివిధ విభాగాలకు చెందిన ఎస్.వీరస్వామి, భాస్కర్, సంతోష్బాబు, డి.సంతోష్, లైన్మేన్ రాజమౌళి, శ్రీనివాసరావు, జన్ను మొగిళి, శ్యామ ల, స్వామి, ఆరోగ్యం, స్వరూప, షేక్ అబ్దులయ్య, సర్వ ర్ షరీఫ్, వీరప్రతాప్, శ్రీహరి, ప్రకాశ్, శ్రీకాంత్, సం జీవరెడ్డి, సూర్యనారయణ, రాకేష్, షేక్ సిద్ధిక్, రాము లు, స్రవంతి, సునీల్కుమార్, సుజాత, ఎం.నరేష్, ఈ.జోనా, ఇజ్రాయిల్, విజయ్కుమార్ ఉన్నారు. -
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నేడే
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ స్టాండింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియ కొంతమంది కార్పొరేటర్లను ఒత్తిడికి గురిచేస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్య పదవికి పోటీ చేయదల్చే కార్పొరేటర్లు నేడు సాయంత్రం 3 గంటల్లోగా తమ నామినేషన్ల పత్రాలను బల్దియా ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ సమావేశమై స్టాండింగ్ కమిటీలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆశావహులైన కార్పొరేటర్లు ఒత్తిడికి లోనవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐదున్నర సంవత్సరాల వ్యవధి తర్వాత బల్దియాలో పాలక వర్గం ఏర్పడింది. వీరిలో 80 శాతం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉండగా, కొంతమంది సీనియర్లూ ఉన్నారు. వీరిలో పలువురు ఆశావహులు తమకంటే తమకు స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల బలం అత్యధికంగా కలిగి ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ పదవులను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీలోని ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 2 స్టాండింగ్ కమిటీ పోస్టులు, అందులో ఒకటి అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి, మరొకటి వరంగల్ ప్రాంతానికి కేటాయించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇద్దరికి, వర్ధన్నపేట నుంచి ఒకరికి, పరకాలకు ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
‘గ్రేటర్’ సీపీగా రాజేంద్రప్రసాద్
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్(సీపీ)గా ఎం.రాజేంద్రప్రసాద్ నాయక్ నియమితులయ్యారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా వరంగల్ బల్దియాలో ఇన్చార్జి సీపీలే కొనసాగుతుండగా.. ప్రస్తుతం పూర్తిస్థాయి సీపీ నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్ విదు ల్లో చేరాక ప్రస్తుతం ఇన్చార్జి సీపీగా ఉన్న ఏ.కోదండరాంరెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్గా కొనసాగుతారు. -
టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్
కాజీపేట రూరల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ దంపతులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. శ్రీలేఖ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు హన్మకొండ హంటర్రోడ్లోని వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యాలయంలో తన మద్దతుదారులు, కడిపికొండ కుచెందిన పలువురితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ శ్రీలేఖ, ఆమె భర్త కృష్ణ టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాకుల రవీందర్, బి.రాంచంద్రారెడ్డి, దామెరుప్పుల కోటేశ్వర్, శంకర్బాబు, లక్ష్మీనారాయణ, కిశోర్, కన్నయ్య, బస్కె దశరథం, రమణారెడ్డి, కొడవటి అశోక్, బత్తిని సతీష్, బస్కె సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ను కరువు జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి, ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం తోపాటు పెం డింగ్ నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రా జేందర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ జిల్లాలో కరువు నివారణ చ ర్యలు చేపట్టాలని, రుణమా ఫీని పూర్తిగా అ మలు చేయాలన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు కృషి చేయూలని కోరారు. సోషల్ ఆడిట్పై అభినందనలు.. జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణంలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపడుతున్న సామాజిక తనిఖీ బాగుందని కాంగ్రెస్ నాయ కులు అన్నారు. ప్రజాధనం వృథాకాకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమం అద్భుతమని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్రావు, నాయకులు వెంకట్రాంరెడ్డి, డాక్టర్ బండా ప్రకాష్, ఈవీ శ్రీనివాస్రావు, బత్తినిశ్రీనివాస్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం పరిశీలనలో ‘స్మార్ట్’
► మరోసారి పోటీలో వరంగల్ ► మే 15లోపు ఫలితాల వెల్లడి ► రూ.2861 కోట్లతో సమగ్ర నివేదిక ► మొత్తం ఏడు థీమ్లు, 20 ప్రాజెక్టులు ► పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం స్మార్ట్సిటీ పథకం రెండో దశ అమలులో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో లోపాలను సవరించి.. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. సాక్షి, హన్మకొండ: నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ వంద నగరాలకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్)లతో స్మార్ట్సిటీ చాలెంజ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. ఈ కాంపిటీషన్లో వచ్చిన డీపీఆర్ల ఆధారంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేశారు. వరంగల్తో పాటు మరో 23 నగరాలు తృటిలో ఈ అవకాశాన్ని చే జార్చుకున్నాయి.దీంతో ఈ 23 నగరాలకు మరో అవకాశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కల్పించింది. వీటికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కాంపిటీషన్ ఏర్పాటుచేసి,ఈ ఏడాది ఏప్రిల్ 21 లోగా డీపీఆర్లను సమర్పించాల్సిం దిగా ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ కొత్త కార్యవర్గం ఎ న్నికైన వెంటనే మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన డీ పీఆర్ను ఆమోదించారు. ఈ నివేదికను ఈ నెల 20న న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించారు.ఫాస్ట్ట్రాక్ కాం పిటీషన్లో వచ్చిన నివేదికలను మే 15లోగా పరిశీలించి, ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. 86 ప్రాజెక్టులు.. స్మార్ట్సిటీ ఫాస్ట్ట్రాక్ కాంపిటీషన్ కోసం సమర్పించిన నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్సిటీ పథకం నిబంధనల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని (సెంట్రల్ సిటీ) అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ప్రధానం. దీనికి అదనంగా నగరం మొత్తానికి పనికి వచ్చేలా (పాన్సిటీ) ఎంపిక చేసిన విభాగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. సెంట్రల్సిటీ, పాన్సిటీల ద్వారా గ్రేటర్ వరంగల్లో రూ.2861 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. సెంట్రల్ సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ఏడు థీమ్లుగా విభజంచారు. ఈ ఏడు థీమ్ల ద్వారా మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 20 మేజర్ ప్రాజెక్టులు, 66 సబ్ మేజర్ ప్రాజెక్టులుగా విభజించారు. భద్రకాళీ చెరువును పర్యాటక ప్రాంతంగా మా ర్చడం, ఎంపిక చేసిన మురికి వాడల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం, నగరంలో వాణిజ్యరంగం అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయల కల్పన, రవాణ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ పరిరక్షణ, నగరం మధ్యలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రధాన కార్యక్రమంగా సమగ్ర నివేదికలో పే ర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు రూ. 2707 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. పాన్సిటీ పథకం ద్వారా భద్రత, రవాణ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.153 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. నగర అభివృద్ధి నమూనాలో తొలిసారిగా పర్యావరణానికి పెద్దపీఠ వేశారు. సెంట్రల్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో పచ్చదనం పెంచేందుకు రూ.163 కోట్లు కేటాయించారు. స్మార్ట్సిటీ ద్వారా రూ.989 కోట్లు స్మార్ట్సిటీ పథకం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2861 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.989 కో ట్ల నిధులు మంజూరు కానున్నాయి. దీని తర్వా త ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.393,కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల ద్వారా రూ.370 కోట్లు, రుణాల ద్వారా రూ.203 కోట్లు సమీకరిస్తారించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. -
బేకరి బాయ్ నుంచి మేయర్ వరకు
ఆయనది చిన్నప్పటి నుంచి ముళ్లబాటే. చదువుకునే రోజుల్లోనే తండ్రి దూరమయ్యాడు. అందరికంటే చిన్నవాడైనా ఇంటి బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది.. అదీ అని చూడకుండా బేకరీలో, కూరగాయల మార్కెట్లో ఇలా.. అన్ని పనులూ చేశాడు. వైన్షాప్లో బిల్రైటర్గా చేరి.. వర్కింగ్ పార్ట్నర్ అయ్యూడు. అదే ఆయన వ్యాపారానికి తొలి మెట్టు. తప్పుని సహించని తత్వంతో రాజకీయంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామి ఆయనకు పెద్ద ఆస్తి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి ఆయన జీవితంలో నిజమైంది. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా లారీ డ్రైవర్ కొడుకుననే విషయూన్ని మరిచిపోనంటున్న గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ -
హరీశ్ లేకుంటే పరువు పోయేది
♦ వరంగల్ కార్పొరేషన్ ఫలితాలపై కేసీఆర్! ♦ ఆ జిల్లా నే తలకు క్లాస్.. పనితీరుపై తీవ్ర అసంతృప్తి ♦ సొంత అభ్యర్థులను ఓడించేందుకు ఖర్చు పెడతారా అంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నాయకత్వం వేసిన అంచనాలకు, వాస్తవ ఫలితాలకు తేడా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 58 డివిజన్లు ఉన్న వరంగల్లో కనీసం 50కిపైగా స్థానాలను గెలుచుకుంటామని భావించినా... 44 డివిజన్లనే గెలుచుకుంది. టికెట్ల ఖరారు నుంచే మొదలైన అసంతృప్తి... చివరకు ప్రతి డివిజన్లో రెబెల్స్ పోటీలో ఉండడం దీనికి కారణమైంది. కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఇష్టం లేకుండా పోటీకి దిగిన వారిని ఓడించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిచిందన్న సమాచారంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఘా విభాగాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఆ నివేదికలను పరిశీలించిన కేసీఆర్... నేతలకు ఇష్టం లేకుండా అభ్యర్థులుగా అవకాశం వచ్చిన వారి ని ఓడించేందుకు ప్రయత్నాలు జరి గాయన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఇటీవల వరంగల్ నేతలను పిలిపించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘పార్టీకి పూర్తి స్థాయిలో పట్టున్న వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు నిరాశ కలిగించాయి. పార్టీ అభ్యర్థులను ఓడిం చేందుకు పార్టీ నేతలే ఎదురు ఖర్చు పెడతారా..? మంత్రి హరీశ్రావు వరంగల్ ఎన్నికల బాధ్యత తీసుకోకుంటే, అక్కడికి రాకుంటే పరువు పోయేది..’’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, తమను కాదని ఎవరికో టికెట్ ఇస్తే ఎందుకు గెలిపించాలన్న ఉద్దేశంతో పార్టీ పరువును పణంగా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి ప్రమాదకరం.. వరంగల్లో మేయర్ రేసులో ఉన్న అభ్యర్థిని ఓడించేందుకు కూడా భారీ ప్రయత్నాలు జరిగాయని... ఏకంగా ఓ నేత ఎదుటి పక్షం అభ్యర్థికి ఎన్నికల ఖర్చులు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేయర్గా ఎన్నికైన న న్నపనేని నరేందర్ గెలిచిన 19వ డివిజన్లో ఏకంగా రూ.3కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలయ్యేందుకు పార్టీ నేతలే కారణమయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు డివిజన్లు ఉండగా కాంగ్రెస్ గెలుచుకున్న నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లు ఇక్కడే ఉన్నాయి. ఓ మంత్రి సూచించిన 46వ డివిజన్ అభ్యర్థిని ఓడించారు. ఒక ఎమ్మెల్యే తన కు ఇష్టం లేని అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వారిని ఓడించేందుకు ఏకంగా రూ.50లక్షలు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దొరకక రెబెల్స్గా పోటీచేసిన వారిలో 8 మంది గెలుపొందగా... పార్టీ అధికారిక అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులకు తమకు ఎక్కడ పోటీ వస్తారోనని భావించి ఓ ముగ్గురు నాయకులకు అసలు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు పార్టీకి ఒక విధంగా ప్రమాద ఘంటికలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్భాస్కర్, ధర్మారెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు. -
మేయర్.. నరేందర్
డిప్యూటీ మేయర్గా సిరాజొద్దీన్ ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం నేడు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నిక ఉదయం కార్పొరేటర్ల భేటీ : తక్కెళ్లపల్లి వరంగల్ : కార్యకర్తకు గుర్తింపు లభించింది.. విధేయతకు పదవి దక్కింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్ మేయర్గా నన్నపునేని నరేందర్ను, డిప్యూటీ మేయర్గా ఖాజా సిరాజొద్దీన్ను పార్టీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్లో కీలకంగా పని చేసిన నన్నపునేని నరేందర్, సిరాజొద్దీన్ ఎంపికపై టీఆర్ఎస్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం సోమవారం ఉదయమే మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం... నన్నపునేని నరేందర్ గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్గా గెలిచారు. టీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గుర్తింపు నన్నపునేనికి ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేనికి అవకాశం వచేది. కానీ, కొండా సురేఖ టీఆర్ఎస్లోకి రావడంతో వరంగల్ తూర్పు టికెట్ ఆమెకు దక్కింది. త్వరలోనే నన్నపునేనికి సరైన గుర్తింపు ఇస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారని, ఇప్పుడు అమలు చేశారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపికైన ఖాజా సిరాజొద్దీన్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. పార్టీ వరంగల్ నగర, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. ఉదయం సమావేశం : తక్కెళ్లపల్లి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తరపున గెలిచిన కార్పొరేటర్లతో మంగళవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. హన్మకొండలోని హరిత హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఎ.చందులాల్, ఎంపీలు పసునూరి దయాకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కొండా మురళీ, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య హాజరవుతారని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై చర్చిస్తామన్నారు. -
నడిపించే నాథుడేడి ?
టీఆర్ఎస్లో నాయకత్వలేమి గ్రేటర్ ఫలితాలపై అంతర్మథనం సమన్వయ కమిటీ తీరుపై విమర్శలు ఇప్పటికైనా స్పందించాలంటున్న శ్రేణులు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్లో అంతర్మథనం మొదలైంది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. టీఆర్ఎస్ బలంగా ఉన్న గ్రేటర్ వరంగల్లో ఘన విజయం సాధించకపోవడానికి కారణాలు ఏమిటని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జిల్లాలోని నేతలకు కీలక పదవులు అప్పగించినా... గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు గెలవలేదనే అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. వరంగల్ లోక్సభ, గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్కు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని పార్టీ వర్గాలు భావించాయి. 58 డివిజన్లలో కనీసం 50 దక్కించుకుంటామని టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలు ప్రకటించారు. టీఆర్ఎస్ అధిష్టానం సైతం గతానికి భిన్నంగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలకే అప్పగించింది. డివిజన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పడం.. వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితోపాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మె ల్సీ కొండా మురళీధర్రావులను సభ్యులుగా నియమించింది. సమన్వయం కోసం ఏర్పాటైన కమిటీలోని వారే పరస్పరం విభేదించుకున్నారు. టికెట్ల కేటాయింపులో వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నామినేషన్ల దాఖలు గడువు చివరి రోజు వరకూ సమన్వయ కమిటీ టికెట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. పరిస్థితిని గమనించిన టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించి మంత్రి తన్నీరు హరీశ్రావును వరంగల్కు పంపిం చింది. హరీశ్రావు కొద్ది సమయంలోనే టికెట్ల పం పిణీ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. రెబల్స్ను పోటీ నుంచి తప్పించడం, ప్రచారం వ్యూహంలోనూ సమన్వయ కమిటీ చేతులెత్తేయగా.. ఆ బాధ్యతలను కూడా ఆయనే చక్కబెట్టాల్సి వచ్చింది. ప్రచా ర గడువు ముగిసే వరకు హన్మకొండలోనే మకాం వేసి ఎన్నికలను నడిపించారు. దాదాపు అన్ని డివి జన్లలోనూ ప్రచారం చేశారు. దీంతో పరిస్థితి కొంత చక్కబడింది. మిగతా చోట్ల స్థానిక మంత్రులకే... గ్రేటర్ వరంగల్తోపాటు ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగా యి. రెండు జిల్లాల్లోనూ స్థానిక మంత్రులే ఎన్నికల వ్యూహాన్ని చక్కబెట్టారు. ఇదే తరహాలో గ్రేటర్ ఎన్నికల్లో మొదటిసారిగా జిల్లా నేతలకు వ్యూహరచన బాధ్యతలను టీఆర్ఎస్ అధిష్టానం అప్పగిం చింది. ఇక్కడి సమన్వయ కమిటీ టికెట్ల ఎంపికలోనే చేతులెత్తేసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎక్కువ మంది ఉన్నా గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల పం పిణీ సైతం చేయలేని స్థితి ఉండడం దయనీయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమన్వయ కమిటీ సభ్యులు ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంపైనే దృష్టి పెట్టారని, పార్టీ గురించి పట్టించుకోలేదని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్య నేతలు పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న డివిజన్లలోనూ పార్టీని గెలిపించలేకపోయారని కొందరు గుర్తు చేస్తున్నారు. సమన్వయ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకున్న 52, 53 డివిజన్లలో టీఆర్ఎస్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కమిటీ సభ్యుడైన ఎమ్మెల్సీ కొండా మురళీ టికెట్ ఇప్పించిన 13, 15 డివిజన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇలా సమన్వయ కమిటీ సభ్యులు తమ వారి కోసం ప్రయత్నించిన కారణంగా టీఆర్ఎస్ ఐదారు డివిజన్లను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ జిల్లాలో బలంగా ఉంది. అన్ని ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2010 ఉప ఎన్నికల నుంచి టీఆర్ఎస్కు వరుసగా ఘన విజయాలే నమోదవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ ఫలితాలు ఆ పరిస్థితి లేకుండా చేశాయి. జిల్లాలో టీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు, పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసేందుకు చొరవ తీసుకునే కీలక నేత ఎవరూ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారుు. ప్రతి ఎన్నికలకు హరీశ్రావు వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఉండబోదని... ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బం దులు వస్తాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
21లో అత్యధికం.. 46లో అత్యల్పం
పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బరిలో మొత్తం 398 మంది అభ్యర్థు లు నిలిచారు. వీరిలో ఎక్కువ మంది విజయం సాధించాల న్న తపనతో ఇంటింటికీ తిరి గి ఓటర్లను ఆకట్టుకునేం దుకు యత్నించారు. అయితే, ఎవరు ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని ఎత్తులు వేసి నా విజయం సాధించింది 58 మందే. అయితే, గెలిచిన వారిలో కొందరు తమకు పోటీనే లేదంటూ ప్రతీ రౌండ్లో ఆధికత్య ప్రదర్శించగా.. మరికొందరు మాత్రం అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఆ వివరాలు... అతి తక్కువ మెజార్టీతో 46వ డివిజన్ నుంచి విజయం సాధించిన సిరంగి సునీల్కుమార్, 35వ డివిజన్ నుంచి గెలిచిన బస్కె శ్రీలత ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే కావడం.. వీరిద్దరు గెలిచింది టీఆర్ఎస్ అభ్యర్థుల పైనే కావడం విశేషం. ఇక 38 డివిజన్ నుంచి తక్కువ ఓట్లతో బయటపడిన టీఆర్ఎస్ కె.మాధవి తర్వాత బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. పోస్టల్బ్యాలెట్ ఓట్లు 329 46వ డివిజన్ నుంచి 27ఓట్లు హన్మకొండ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ముని సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మొత్తం 329 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల య్యాయి. ఇందులో అత్యధికంగా 46వ డివి జన్ నుంచి 27 ఓట్లు నమోదు కావడం విశే షం. ఇక 38వ డివిజన్ నుంచి 23ఓట్లు పో స్టల్ ఓట్లు వచ్చాయి. -
58లో 50మంది కొత్త వారే...
పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో వివిధ డివిజన్ల నుం చి ప్రాతినిధ్యం వహించనున్న పలువురు కొత్త వారే. మొత్తం 58 డివిజన్లకు 50మంది కొత్త వారే ఎన్నికయ్యూరు. వీరిలో కొందరు వివిధ పార్టీల్లో ఇప్పటికే కొనసాగుతున్నా.. మరికొందరు ఎన్నికలకు ముందే రాజకీయూల్లో రావడం విశేషం. ఈ మేరకు తొలి సారి కార్పొరేటర్గా గెలిచిన వారి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్ పరిధి ఒకటో డివిజన్ నుంచి వీర బిక్షపతి(టీఆర్ఎస్), 2వ డివిజన్ ల్యాదెల్ల బాలయ్య( టీఆర్ఎస్), 3వ డివిజన్ లింగం మౌనిక(టీఆర్ఎస్), నాలుగో డివిజన్ బిల్ల కవిత(ఇండిపెండెంట్), 5వ డివిజన్ పసునూటి స్వర్ణలత(టీఆర్ఎస్), 6వ డివిజన్ చింతం యాదగిరి(టీఆర్ఎస్), 8వ డివిజన్ దామోదర్(టీఆర్ఎస్), 9వ డివిజన్ సోమిశెట్టి శ్రీలత(సీపీఎం), 10వ డివిజన్ కుందారపు రాజేందర్(టీఆర్ఎస్), 11వ డివిజన్ వస్కుల రాధిక(టీఆర్ఎస్), 12వ డివిజన్ తూర్పాటి సులోచన(టీఆర్ఎస్), 13వ డివిజన్ నుగురి స్వర్ణలత(ఇండిపెండెంట్), 14వ డివిజన్ బయ్య స్వామి(టీఆర్ఎస్), 15వ డివిజన్లో శారాదా జోషి(ఇండిపెండెంట్), 16వ డివిజన్ రామ బాబురావు(టీఆర్ఎస్), 17వ డివిజన్ జారతి అరుణ(టీఆర్ఎస్), 18వ డివిజన్ శామంతుల ఉషశ్రీ పద్మ(టీఆర్ఎస్), 21వ డివిజన్ మేడిది రజిత(టీఆర్ఎస్), 22వ డివి జన్ మరుపల్ల భాగ్యలక్ష్మి(టీఆర్ఎస్), 23వ డివిజన్ కత్తెరశాల వేణుగోపాల్(టీఆర్ఎస్) 24వ డివిజన్లో అశ్రీతారెడ్డి(టీఆర్ఎస్) మొదటిసారి ఎన్నికయ్యారు. ఇంకా 25వ డివిజన్ రిజ్వా నా షమీం(టీఆర్ఎస్), 27వ డివిజన్లో వద్దిరాజు గణేష్(టీఆర్ఎస్), 28వ డివిజన్లో యెలగం లీలావతి(టీఆర్ఎస్), 29వ డివిజన్లో కావేటి కవిత(టీఆర్ఎస్), 30వ డివిజన్ బోడ డిన్నా(టీఆర్ఎస్),31వ డివిజన్లో సోబియా సబాహత్( టీఆర్ఎస్), 33వ డివిజన్ తోట్ల రాజు(కాంగ్రెస్), 34వ డివిజన్ జోరి క రమేష్(టీఆర్ఎస్), 35వ డివిజన్ బస్కే శ్రీలేఖ( ఇండిపెం డెంట్), 37వ డివిజన్ కోరబోయిన సాంబయ్య(టీఆర్ఎస్), 38వ డివిజన్ మాధవి(టీఆర్ఎస్), 39వ డివిజన్ వేముల శ్రీని వాస్(కాంగ్రెస్), 40వ డివిజన్ మిర్యాల్కార్ దేవేందర్, 41వ డివిజన్ ఖాజా సిరాజోద్దిన్(టీఆర్ఎస్), 42వ డివిజన్ వీరగంటి రవీందర్(టీఆర్ఎస్), 45వ డివిజన్ చాడ స్వాతి(బీజేపీ), 46వ డివిజన్లో సిరింగి సునీల్కుమార్(ఇండి.), 47వ డివిజన్ నల్ల స్వరుపారాణి(టీఆర్ఎస్), 48వ డివిజన్ బోయిన రంజిత్రావు(టీఆర్ఎస్), 49వ డివిజన్లో కేశబోయిన అరుణ(టీఆర్ఎస్), 50వ డివిజన్ దాస్యం విజయ్భాస్కర్(టీఆర్ఎస్), 51వ డివి జన్ మిడిదొడ్డి స్వప్న(టీఆర్ఎస్), 52వ డివిజ న్ జక్కుల రమ(కాంగ్రెస్), 53వ డివిజన్ లింగం మౌనిక(కాంగ్రెస్), 54వ డివి జన్ గుగులోతు రాజు(ఇండిపెండెంట్), 55వ డివిజన్ క్యాతం సరోత్తంరెడ్డి(ఇండి.), 56వ డివిజన్ నాగమల్ల ఝాన్సీ(ఇండి.), 57వ డివిజన్లో జక్కుల వెంకటేశ్వర్లు(టీఆర్ఎస్), 58వ డివిజ న్ నుంచి బానోతు కల్పన(టీఆర్ఎస్) తొలిసారి గెలుపొంది బల్దియూలో ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. -
ఎదురులేని కారు
తొలి రౌండ్లలో తడబాటు చివరలో ఆకాశమే హద్దు హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కారుకు ఎదురులేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీల కళ్లలో దుమ్ముకొడుతూ విజయపథంలో దూసుకుపోయింది. తొలిరౌండ్లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ ఇచ్చాయి. కానీ ఒక్కో రౌండు లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ టీఆర్ఎస్ ప్రభంజనానికి హద్దు లేకుండా పోయింది. ఐదో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు స్వతంత్ర, కాంగ్రెస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 1 నుంచి ఎనిమిది రౌండ్లలో ప్రతీ రౌండ్కు ఆరు డివిజన్ల ఫలిలాలు వెల్లడించారు. తొమ్మిది, పది రౌండ్లలో మూడు డివిజన్లు, పదకొండు, పన్నెండు రౌండ్లలో రెండు డివిజన్ల వంతున ఫలితాలు వెల్లడించారు. మొత్తం పన్నెండు రౌండ్ల పాటు లెక్కించగా టీఆర్ఎస్ పార్టీ ఐదు రౌండ్లలో ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. 2, 9, 10, 11, 12 రౌండ్లలో లెక్కించిన 14 డివిజన్లు టీఆర్ఎస్ వశమయ్యాయి. ఏనుమాముల మార్కెట్లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో 5, 7 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ రౌండు ఆరు డివిజన్ల వంతున లెక్కించగా టీఆర్ఎస్ పార్టీ ప్రతీ రౌండ్లో సగం డివిజన్లలో ఓటమి పాలైంది. ఐదో రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజయం సాధించారు. ఏడో రౌండ్ జరిగిన లెక్కింపులో ఇద్దరు స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మూడో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచేలా స్వతంత్ర అభ్యర్థులు క్రమం తప్పకుండా విజయం సాధిస్తూ వచ్చారు. ఐదు, ఏడు రౌండ్లలో ఇద్దరు వంతున విజయం సాధించగా 3, 4, 5 రౌండ్లలో ఒక్కొక్కరు వంతున విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే తొలి రౌండ్లో సీపీఎం విజయం సాధించి సంచలనం సృష్టించింది. అనూహ్యమైన ఫలితాలు వస్తాయేమోననే సంకేతాలు పంపింది. కానీ సీపీఎం సంచలనం మొదటి రౌండ్కే పరిమితమైంది. మిగిలిన పదకొండు రౌండ్లలో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. వర్థన్నపేట పరిధిలో 12 డివిజన్లలో ఆరింటిలో టీఆర్ఎస్ ఓడిపోయింది. -
గ్రేటర్పై గులాబీ జెండా
టీఆర్ఎస్కు భారీ మెజారిటీ మేయర్ పీఠం కైవసం 15 ఏళ్ల తర్వాత సాకారం సత్తా చాటిన రెబల్స్ కాంగ్రెస్ ఘోర పరాజయం ఒక్కో స్థానంలో బీజేపీ, సీపీఎం హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయభేరీ మోగించింది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఏ దశలోనూ ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంతో కారు గుర్తు అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోయారు. కారు వేగాన్ని అందుకోలేక జాతీయ పార్టీలు చేతులెత్తేశాయి. దీంతో తొలిసారిగా మేయర్ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మోజార్టీని టీఆర్ఎస్ సునాయాసంగా సాధించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 58 డివిజన్లు ఉండగా.. 44 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ, సీపీఎంలు ఒక్కో డివిజన్లో విజయం సాధించా యి. ఎనిమిది డివిజన్లలో స్వతంత్రులు గెలుపొందారు. గ్రేటర్ ఓట్ల లెక్కింపు ఏనుమాముల మార్కెట్లో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీలపై ఆధిక్యం కనబరిచింది. తొలిసారి గులాబీ పార్టీకి అవకాశం తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. 2005లో వరంగల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఐదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అనంతరం 2015లో వరంగల్ కార్పొరేషన్ను గ్రేటర్ వరంగల్గా అప్గ్రేడ్ చేశారు. గ్రేటర్ హోదాలో తొలిసారిగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేయర్ పదవి సాధించేందుకు అవసరమైన మోజర్టీ సాధించింది. గ్రేటర్లో 58 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి పొందాలంటే 30 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉండగా.. టీఆర్ఎస్ 44 డివిజన్లలో గెలపొందింది. దీంతో టీఆర్ఎస్ ఆవిర్భవించిన పదిహేనేళ్లకు కార్పొరేషన్ పాలన పగ్గాలు ఆ పార్టీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఈ నెల 15న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. సత్తా చాటిన రెబల్స్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్కు, ఆ పార్టీ రెబల్స్కు మధ్యనే సాగింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల మద్దతును ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైన చోట రెబల్స్ సత్తా చాటారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి కొన్ని డివిజన్లలో ముచ్చెమటలు పట్టించారు. ఎక్కువ డివిజన్లలో విజయం సాధించడంలో జాతీయ పార్టీలను సైతం వెనక్కి నెట్టారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై విజయం సాధించారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకర్గం పరిధిలో మూడు డివిజన్లలో టీఆర్ఎస్పై విజయం సాధించిన స్వతంత్రులు.. మరో రెండు డివిజన్లలో రెండో స్థానంలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీల కంటే టీఆర్ఎస్కు రెబల్స్ నుంచే గట్టి ప్రతిఘటన ఎదురుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
మేయర్ ఎవరు
పదవి కోసం నేతల ప్రయత్నాలు అధిష్టానం పరిశీలనలో నన్నపనేని నరేందర్ గుండా ప్రకాశ్ అభ్యర్థిత్వంపైనా చర్చలు తూర్పు నియోజకవర్గానికే అవకాశాలు 15న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల కీలక ఘట్టం ముందుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ నుంచి మేయర్ ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ వరంగల్లోని మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో రెబల్స్గా బరిలోకి దిగిన వారిలో ఎనిమిది మంది గెలిచారు. ఈ ఎనిమిది మంది త్వరలోనే టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ బలం మరింత పెరగనుంది. ఇలా టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఉండడంతో మొదటిసారి క్యాంపు రాజకీయాలు లేకుండా వరంగల్ మేయర్ ఎన్నిక జరుగుతోంది. మేయర్ పదవిని ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు టి.హరీశ్రావు, కె.టి.రామారావులతోపాటు జిల్లాలోని కీలక నేతల వద్దకు వెళ్లి తమ కోరికను తెలియజేస్తున్నారు. మేయర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంలో టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ 19 డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన నన్నపనేని నరేందర్ పేరు మేయర్ పదవికి ప్రధానంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన గర్తింపు నన్నపనేనికి ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ పని చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేనికి అవకాశం వచ్చేది. కొండా సురేఖ, మురళీ టీఆర్ఎస్లోకి రావడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ సురేఖకు దక్కింది. దీంతో పార్టీ అధిష్టానం నన్నపునేని నరేందర్కు గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవిని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం నరేందర్ కీలకంగా పని చేశారు. గత ఏడాది జరిగిన టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో నన్నపనేనికి మరోసారి గ్రేటర్ అధ్యక్ష పదవి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి లక్ష్యంగా నరేందర్ 19వ డివిజన్లో పోటీ చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థితో నరేందర్కు తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ కొండా మురళి.. గంటా రవికుమార్కు సహకరించారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. నరేందర్ చివరికి 881 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు తాజా ఎన్నికల్లో 26వ డివిజన్లో గెలిచిన గుండా ప్రకాశ్రావు మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేయడం, మేయర్ జనరల్ కేటగిరీకి కేటాయించడం అంశాలను అనుకూలంగా భావించి ప్రకాశ్రావు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ నగరంలో కీలకమైన వ్యాపార సామాజికవర్గానికి చెందిన ప్రకాశ్రావు పేరును టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఆయన26వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి రత్నం సతీష్షాపై 1560 ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..
- వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలు నేడు - ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాక్షి నెట్వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగా, సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది. ఈ కార్పొరేషన్లు, నగర పంచాయతీకి ఈ నెల 6న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కు సంబంధించి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 58 డివిజన్లకుగాను ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిపి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 390 మంది సిబ్బందిని నియమించారు. ఖమ్మం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు పత్తిమార్కెట్లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 50 డివిజన్లకు గాను 291 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,79,827 మంది ఓటు వేశారు. మరోవైపు అచ్చంపేట నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు మండల రిసోర్స్భవనంలో జరుగనుంది. 20 వార్డులకుగాను 57 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 70.88 శాతం పోలింగ్ నమోదైంది. -
8:30 గంటలకు తొలి ఫలితం
నేడు గ్రేటర్ వరంగల్ ఓట్ల లెక్కింపు హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కు ప్రాతినిధ్యం వహించబోయే ప్రజా ప్రతినిధులెవరో నేడు తేలనుంది. ఈ నెల 6న జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఏనుమాముల మార్కెట్లో జరగనుంది. ఉదయం 8:30 గంటలకు తొలి ఫలితాలు వెలువడుతాయి. మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్ని డివిజన్ల ఫలితాలు వస్తాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో పోలైన ఓట్లను పన్నెండు రౌండ్లలో లెక్కించనున్నారు. 1 నుంచి 8 రౌండ్ల వరకు ప్రతీ రౌండ్కు ఆరు డివిజన్లు కేటాయించగా 9 , 10 రౌండ్లకు మూడు డివిజన్లు, 11, 12 రౌండ్లకు రెండు డివిజన్లు కేటాయించారు. ఈ డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును పోలింగ్ బూత్ల వారీగా లెక్కిస్తారు. ఒక్కో కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లెక్కింపునకు అరగంట సమయం కేటాయించారు. తొలి రౌండ్ ఉదయం 8గంటలకు మొదలవుతుంది. ఈ రౌండ్కు కేటాయించిన ఆరు డివిజన్ల ఫలితాలు 8:30 గంటలకు వెల్లడవుతాయి. ఇలా ప్రతీ అర గంటకు ఆరు డివిజన్ల వంతున మధ్యాహ్నం 2గంటలకు 58 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయి. తొలి, చివరి ఫలితాలు ఇక్కడ.. గ్రేటర్ వరంగల్లో 1వ డివిజన్ ఫలితం తొలిరౌండ్లో వెలువడనుంది. ఈ డివిజన్లో మొత్తం 14 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ బరిలో ఉన్న 20 డివిజన్ ఫలితం చివరగా వెల్లడికానుంది. ఇక్కడ 8 పోలింగ్ బూత్లకు సంబంధించి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు 1, 9, 21, 33, 41, 49 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు చివరి రౌండ్ లెక్కింపు మొదలవుతుంది. ఈ రౌండ్లో 20, 32 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును చేపడతారు. మొత్తంగా మధ్యాహ్నం 2గంటలకు అ న్ని డివిజన్లకు సంబంధించిన లెక్కింపు పూర్తవుతుంది. 390 మంది సిబ్బంది ఏనుమాముల మార్కెట్లో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 390 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా బు ధవారం ఉదయం 6గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 7గంటలకు స్ట్రాం గ్రూమ్ గదులు తెరుస్తారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎలక్ట్రానిక్ ఓటిం గ్ మిషన్ల సీల్ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో రికార్డు చేస్తారు. ఈవీఎంలలో ఏమై నా లోపాలు తలెత్తితే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తే, నిపుణుల సహాయంతో సాంకేతిక లోపాలను సరిచేస్తారు. ఒక్కో కౌంటింగ్ హాలుకు 14 మంది కౌటింగ్ సూపర్వైజర్లు, 14 మంది సహాయకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు 12 మంది, సీలింగ్ స్టాఫ్గా మరో 66 మం ది సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటున్నారు. బరిలో 398 మంది గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న 58 డివిజన్లకు సంబంధించి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిసి మొత్తం 398 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 6న ఎన్నికలు జరగగా 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రేటర్ పరిధిలో 6,43,196 మంది ఓటర్లు ఉండగా.. 3,87,725 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. ఈ డివిజన్లపైనే ఆసక్తి.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొన్ని డివిజన్ల ఫలితాలపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన టీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు పోటీ చేసిన డివిజ న్ల ఫలితాలు ఎప్పుడెప్పుడా అనే ఆత్రు త నెలకొంది. వీటిలో 15వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శారదా జోషి అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ డివిజన్ను లెక్కింపు ఏడో రౌండ్లో మొదలవుతుంది. ఫలితం 11:30 గంటలకు వెల్లడవుతుంది. అదేవిధంగా 13వ డివిజన్ ఫలితం ఐదో రౌండ్లో వెల్లడవుతుంది. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థి ఓని భాస్కర్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీని ఫలితం ఉదయం 10:30 గంటలకు వెల్లడవుతుంది. మేయర్ బరిలో ఉన్న ముఖ్యనేత నన్నపునేని నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేశారు. ఈ డివిజన్ ఫలితం మధ్యాహ్నం 1:30 గంటలకు వెల్లడవుతుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీగా నడిచిన 26వ డివిజన్ ఫలితం ఉదయం 11 గంటలకు వస్తుంది. -
ఎన్నికల్లో అలాగే..!
సుబేదారి స్టేషన్ సీఐ తీరే వేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వారికి స్వాగతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సహకారం ఇప్పటికీ చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం బలవంతంగా వాహనాలను సేకరించిన సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన నరేందర్ విషయంలో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన ఎన్నికల సమయాల్లో విధులు నిర్వహించే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. 2015 నవంబరులో జరిగిన వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నేతలు నిబంధలను ఉల్లంఘించడానికి కారణమై విమర్శలపాలయ్యూరు. ఉప ఎన్నికల సమయంలో కలెక్టరేట్లో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియ శాంతిభద్రతలను సీఐ నరేందర్ పర్యవేక్షించారు. ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడాల్సిన నరేందర్.. గుంపుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం చెప్పినంత పని చేశారు. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నవంబరు 2న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మరో 25 మంది నేతలతో కలిసి వచ్చి రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురు నేతలే వెళ్లినప్పటికీ మిగిలిన 25 మంది నేతలు కలెక్టరేట్ ఆవరణలోకి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి గేటు మూసి పెట్టినా ఈ నేతలంతా లోపలికి వెళ్లారు. కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ నరేందర్ వీరిని నిరోధించకుండా అందరినీ నవ్వుతూ లోపలికి పంపించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియగానే ముఖ్యనేతలు బయటికి వచ్చారు. అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో ఏదో హడావుడి జరుగుతోందని గమనించిన అదనపు ఎన్నికల అధికారి (డీఆర్వో) శోభ బయటికి వచ్చారు. ఎక్కువ మంది నేతలు లోపలికి వచ్చిన విషయాన్ని గుర్తించారు. అక్కడ విధుల్లో ఉన్న సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమలు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేసే కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురికావడం ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా కలెక్టర్ వి.కరుణ వెంటనే ఈ సంఘటన పూర్వాపరాలను పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబుకు తెలియశేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్ కారణంగానే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అదే అలుసుగా... వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు కారణమైనా ఎలాంటి చర్యా లేకపోవడంతో సుబేదారి సీఐ నరేందర్ తీరు మారలేదు. తాజా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణ కోసం బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి కోసం రవాణా వాహనాలను నడిపే వారిపై జులుం ప్రదర్శించి ఎన్నికల విధులకు వీటిని వినియోగించుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
స్వల్ప గొడవలు మినహా ప్రశాంతం
► 44, 47 డివిజన్లలో ► డబ్బులు పంచుతున్నారని గొడవ ► 36వ డివిజన్లో పోలీసుల లాఠీచార్జి హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చెదురు, ముదురు సంఘటనలు మినహా మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం గా మూడు డివిజన్లలో గొడవలు జరిగాయి. రెండు డివిజన్లలో అధికార పక్షానికి చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని విపక్షాలకు చెందిన నాయకులు తిరగబ డ్డారు. మరో డివిజన్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లపై ఓ ఎస్సై లాఠీ ఝులిపిం చాడు. మిగతా అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే, పోలింగ్ మందకొడిగా సాగడం గమనార్హం. 44 డివి జన్లో అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నాని పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న స్వతంత్య్ర అభ్యర్థి కుందారపు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. 47వ డివిజన్లో గోకుల్నగర్ పోచమ్మ దేవాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆ పార్టీలో ఇటీవల చేరిన ఈ.వీ.సతీష్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఆ ఇం ట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండ గా స్థానికేతరులు వచ్చి ఓటర్లను ప్రభావి తం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నా యకులు మరోసారి అభ్యంతరం చేశారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో సుబేదారి సీఐ నరేందర్, కేయూ పోలీసుస్టేషన్ సీఐ ఎస్ఎం.అలీ పోలీసు బలగాలతో చేరుకుని స్థానికేతరులను చెరగొట్టారు. ఈక్రమంలో హన్మకొండ ఏసీపీ శోభన్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఎసీపీ శోభన్కుమార్, సీఐ నరేందర్ 47వ డివిజన్లోనే మకాం వేసి పోలింగ్ ప్రశాంతగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సహాయక కేంద్రం వద్ద.. కాజీపేట / కాజీపేట రూరల్ : కాజీపేట 36వ డివిజన్లోని రైల్వే మిక్స్డ్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ డివిజన్లో పరిధిలోని రైల్వే క్వార్టర్సకు చెందిన ఓటర్లు ఎక్కువ మందికి పోల్ చీటీలు అందలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన సహాయక కేంద్రం వద్ద పలువురు తమ ఓటరు సీరియల్ నంబర్ తదితర వివరాలు చూసుకుంటున్నారు. ఇంతలో అక్కడ విధుల్లో ఉన్న ధర్మసాగర్ ఎస్సై రాఘవేందర్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నీరటి పుష్ప, ప్రభాకర్, విజయ్తో పాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ వివిధ పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. అయితే, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, శాఖపరమైన విచారణ జరిపిస్తానని కాజీపేట ఏసీపీ జనార్దన్ చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసుల లాఠీచార్జ ఘటనను రైల్వే జేఏసీ నాయకులు రైల్వే జేఏసీ నాయకులు దేవులపల్లి రాఘవేందర్, ఎస్కే.జానీ, సీహెచ్.తిరుపతి, ఎ.శ్రీనివాస్, పి.సురేష్, పాషా ఖండించారు. -
60.28 శాతం పోలింగ్
► ఓటింగ్లో ముందువరుసలో విలీన గ్రామాలు ► పశ్చిమ నియోజకవర్గం డివిజన్లలో తక్కువ ► సాయంత్రం వేళ పుంజుకున్న పోలింగ్ ► 40వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఓటు గల్లంతు ► కాజీపేటలో లాఠీచార్జి.. నాయకుల ధర్నా ► స్వతంత్ర అభ్యర్థులపై పోలీసుల ప్రతాపం ఐదు శాతం తక్కువ వరంగల్ కార్పొరేషన్కు 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. అప్పుడు 65 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఆదివారం జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 60.28 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ దాదాపుగా ఐదు శాతం తక్కువగా నమోదైంది. సాక్షి, హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3గంటల తర్వాత జోరందుకుంది. విలీన గ్రామాలు, వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న డివిజన్లలో పోలింగ్ ఎక్కువగా జరిగింది. మొత్తంగా రీపోలింగ్కు అవకాశం లేకుండా 58 డివిజన్లలో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు నెమ్మదిగా కొనసాగింది. ప్రతీ రెండు గంటలకు కేవలం పది శాతం చొప్పున ఓట్లుపోలవుతూ వచ్చాయి. అలా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి కేవలం 32 శాతమే ఓట్లు పోలయ్యాయి. దీంతో యాభైశాతం పోలింగ్ అవడం కష్టం అనిపించింది. కానీ మధ్యాహ్నం 3గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ పుంజుకుంది. ఇళ్లకు పరిమితమైన ఓటర్లు క్రమంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. విలీన గ్రామాలు, తూర్పులో ఎక్కువ గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లేయడంలో విలీన గ్రామాల ప్రజలు ముందువరుసలో ఉన్నారు. ఆ గ్రామాలకు చెందిన డివిజన్లలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న విలీ న గ్రామాల ప్ర జలు తమ ప్ర జాప్రతినిధిని ఎన్నుకునేందు కు ఉత్సాహం చూపించారు. విలీన గ్రామాల తర్వాత వ రంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న డివిజన్లలో ఓటర్లు చురుగ్గా పోలింగ్లో పాల్గొన్నారు. తూర్పు పరిధిలో చాలా డివిజన్లలో యాభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలా డివిజన్లలో నలభై నుంచి యాభైశాతం మధ్యలో పోలింగ్ నమోదైంది. 36వ డివిజన్ కు సంబంధించిన పోలింగ్ బూత్ను కాజీపేటలో రైల్వేమిక్స్డ్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ బయట రైల్వే జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల్చీటీలు పంచుతుండగా ఇక్కడ విధుల్లో ఉన్న ధర్మసాగర్ ఎస్ఐ దేవేందర్ ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా ఒక్కసారిగా రైల్వే జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలపై లాఠీచార్జీ చేశారు. అకారణంగా లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ రైల్వే జేఏసీ నేతలు పోలింగ్ బూత్ సమీపంలో అరగంట పాటు ధర్నా చేశా రు. సమాచారం తెలుసుకున్న కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్కుమార్, స్టేషన్ ఘన్పూర్ సీఐ కిషన్ అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్నవారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ 44 డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీకిమద్దతిస్తున్న స్వతంత్య్ర అభ్యర్థి కుందారపు శ్రీనివాస్ను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు47వ డివిజన్ పరిధిలో గోకుల్నగర్ పోచమ్మ దేవాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఈవీ సతీశ్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు. 40వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి మారగాని కీర్తి కిరణ్గౌడ్ ఓటు గల్లంతైంది. తన డివిజన్లో పరిధిలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు చెందిన 65 ఓట్లు గల్లంతయ్యాయని కీర్తికిరణ్ ఆరోపించారు.15వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ రెబల్గా బరిలో ఉన్న శారద భర్త సురేష్ జోషిపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్జోషి చేతిపై, ఛాతిలో దెబ్బలు తగిలాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు సురేష్జోషిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు సురేష్జోషిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతని భార్య శారదజోషి, సోదరిలో పాటు పలువురు ధర్నాకు దిగారు. ప్రచారం చేయకుండా ఇంట్లోనే ఉంటామని సురేశ్జోషి హామీ ఇవ్వడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు 13, 20 డివిజన్లలో బరిలో ఉన్న అధికార పార్టీ రెబల్ అభ్యర్థులు, అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. -
స్వతంత్రులపై అధికార దాడులు
► ప్రచారం చేయకుండా నిర్బంధం ► ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు ► జల్లో పెరిగిన సానుభూతి ► ఫలితాలపై ప్రభావం చూపనున్న ఓవరాక్షన్ ? వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు పలు చోట్ల దా డులు చేశారు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు రాకపోవడంతో పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో పాటు.. గెలిస్తే టీఆర్ఎస్లోకి వస్తామంటూ ప్రచారం చేసుకున్నా రు. అయితే, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న ధ్యేయంతో ఆ పార్టీ నేతలు పోలీసులు సహాయంతో స్వతంత్ర అభ్యర్థులను గత నాలుగు రోజులుగా ఇక్కట్లకు గురిచేశారు. పోలింగ్ సమయంలోనూ స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు మొగ్గు చూపడంతో భరించలేని అధికార పార్టీ అభ్యర్థులు స్వతంత్రులపై విరుచుకుపడ్డారు. వా రి తరపున ప్రచారం చేస్తున్న వారిని పోలీ సులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదంతా గమనిస్తున్న ఓట ర్లలో స్వతంత్రుల పట్ల సానుభూతి పెరిగిం ది. ఈ సానుభూతి ఎవరిని ముంచిందో ఫలితాలు వస్తే కానీ తెలియదు. 15వ డివిజన్లో.... వరంగల్ ఎల్బీ నగర్ మాసూం ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్.. టీఆర్ఎస్ రెబల్ స్వ తంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శారద జోషి భర్త సురేష్ జోషిపై దాడికి పాల్పడ్డాడు. విష యం తెలిసిన స్థానిక ఓటర్లు ఇదే అన్యా య మంటూ సురేష్జోషికి అండగా నిలిచారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఇంతేజార్గంజ్ స్టేషన్కు సమాచారం అందించడంతో సీఐ భీంశర్మ పోలింగ్ బూత్కు వచ్చి సురేష్జోషిని అక్కడే నిర్భందించారు. తనపై దాడి చేసిన వారిని వదిలి దెబ్బలు తగిలినా తన ను నిర్భంధించిడం న్యాయమా అని ప్రశ్నిం చినా సమాధానం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. చివరకు దాడి చేసిన అభ్యర్థి భర్తను పోలింగ్ బూత్ వద్దకు ర ప్పించగా.. ప్రచారం కోసం తనను వదలాలని సురేష్ జోషి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఏసీపీ సురేంద్రనాథ్ వచ్చి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వెళ్లా రు. చివరకు సురేష్ జోషి భార్య, అభ్యర్థి శారదజోషి, సోదరితో పాటు పలువురు ధర్నాకు దిగడం, ప్రచారం చేయకుండా ఇం ట్లో ఉంటామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం పోలీసులు జోషిని వది లిపెట్టారు. అయితే, సురేష్పై దాడి విష యం డివిజన్లో ప్రచారం కావడంతో ఓట ర్లలో ఆయనపై సానుభూతి పెరిగి గెలిచే అవకాశాలు మెరుగైనట్లు సమాచారం. డివి జన్లో మొత్తం 12,539ఓట్లు ఉండగా 4,550(36.29 శాతం) ఓట్లు పోలయ్యా యి. ఇంత తక్కువ పోల్ కావడంతో గె లు పుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 13, 15వ డివిజన్లలో.. వరంగల్ 13వ డివిజన్లోని స్వతంత్ర అ భ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ సతీమణి పోటీకి దిగారు. స్థానికుడు కావ డంతో పాటు సామాజిక వర్గ ఓట్లు భాస్కర్కు గెలిచే అవకాశమున్నట్లు ప్రచారం సా గింది. దీంతో అధికార పార్టీనేతలు పోలీ సుల సహకారంతో భాస్కర్ ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు సృష్టించారు. డివిజన్లో భాస్కర్ పట్ల సానుభూతి పెరగడం వల్ల పోలింగ్లో ఓట్లు ఎక్కువ పడు తున్నట్లు ఫ్రచారం సాగింది. దీంతో పో లింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తు న్న స్వతంత్ర అభ్యర్థి అనుచరులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సైతం అధికార పార్టీ అభ్యర్థికి ప్రతి కూలంగా మారినట్లు చెబుతోంది. ఇక పో లింగ్ ముగిసిన అనంతరం 20వ డివిజన్ లో రె బల్ అభ్యర్థి అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు దాడి చేయగా, ఇరువర్గాలకు గాయాలైనట్లు సమాచారం. అంతకుముందు ఇదే డివిజన్లోని శాంతి నగర్ సన్రైస్ స్కూల్లోని పోలింగ్ కేం ద్రం వద్ద టీఆర్ఎస్, స్వతంత్య్ర అభ్యర్థి మ ద్దతుదారుల నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాల ను చెదరగొట్టి పంపించారు. కాగా, తూ ర్పు పరిధి అధికార పార్టీ అభ్యర్థుల పట్ల పోలీసుల ఓవరాక్షన్ ఏ పరిణా మానికి దారి తీసిందో ఓట్ల లెక్కింపుతో తెలుస్తుం ది. అయితే, పోలింగ్ ప్రశాంతంగా జరిగిన ట్లు పోలీసులు ప్రకటించడం విశేషం. -
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
* అచ్చంపేట నగర పంచాయతీకి కూడా... * ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ * ఖమ్మంలో తొలిసారిగా ఓటుకు రసీదు కోసం వీవీ పాట్ అమలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీకి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్లోని 58 డివిజన్లు, ఖమ్మంలోని 50 డివిజన్లు, అచ్చంపేటలోని 20 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 8న(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించి అప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మూడు పురపాలికల పోలింగ్లో పాల్గొనే ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను కట్టబె డుతూ శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఖమ్మం కార్పొరేషన్లోని 35 డివిజన్ల పరిధిలోని ఒక్కో పోలింగ్ స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఓటుకు రసీదు జారీ చేసేందుకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ పాట్) విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వీవీ పాట్ అమలు చేయడం ఇదే తొలిసారి. వరంగల్లో 58 డివిజన్లు.. 398 మంది అభ్యర్థులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 6,43,862 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 3,20,575 ఉండగా.. పురుషులు 3,23,166, ఇతరులు 121 మంది ఉన్నారు. కార్పొరేషన్లో 58 డివిజన్లు ఉండగా 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకంగా 154 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటం విశేషం. అధికారులు మొత్తం 660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్కు ఒకటి చొప్పున మొత్తం 660 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. మొత్తంగా 3,630 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. మరో 500 మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు. ఖమ్మం కార్పొరేషన్లో బహుముఖ పోరు ఖమ్మం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 291 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి 50 మంది, వైఎస్సార్సీపీ నుంచి 48, కాంగ్రెస్ నుంచి 42, టీడీపీ నుంచి 48, సీపీఎం నుంచి 40, సీపీఐ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 11మంది, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, సీపీఎం, టీడీపీలు ఒంటరిగాను, కాంగ్రెస్ సీపీఐలు కలసి పోటీ చేస్తున్నాయి. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అవతరించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఈ ఎన్నికలను అభ్యర్థులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అధికారులు 50 డివిజన్లలో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
సప్పుడు బంద్
ముగిసిన ప్రచారం ఓటర్లకు ప్రలోభాలు మొదలు డబ్బులు, మద్యం పంపిణీలో అభ్యర్థులు అడ్డుకోలేకపోతున్న పోలీసులు వరంగల్ : వారం రోజులుగా రాజకీయ పార్టీల ప్రచారంతో దద్దరిల్లిన వరంగల్ నగరం నిశ్శబ్దమైంది. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రచార గడువు ముగియడంతో మైకులు ముగబోయాయి. రోడ్షోలు నిలిచిపోయాయి.. ఇంటింటి ప్రచారానికి తెరపడింది.. ఓట్ల అభ్యర్థనలు అధికారికంగా ఆగిపోయాయి. ఇక.. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓట్లు పొందేందుకు తమదైన మార్గంలో ప్రయత్నాలు తీవ్రం చేశారు. నగదు, మద్యం పంపిణీ మొదలుపెట్టారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పుడు ఈ పనిలో నిమగ్నమయ్యారు. పలు డివిజన్లలో స్వతంత్రులు కూడా ఇదే పని చేస్తున్నారు. అరుుతే మద్యం, నగదు పంపిణీ విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాగా నమ్మకస్తులైన వ్యక్తులకే పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. డివిజన్లలోని కాలనీల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. వీరిపై పర్యవేక్షణకు సొంత మనుషులను నియమించుకున్నారు. నగదు ఓటర్లకు చేరిందా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భారీ స్థాయిలో డబ్బు, మద్యం... ఓటర్లకు ప్రలోభాల రూపంలో అందుతోంది. ప్రలోభాల నియంత్రణకు అన్ని ఎన్నికల్లోనూ కీలకంగా పని చేసిన పోలీసులు.. గ్రేటర్ వరంగల్ ఎన్నికలో ఆశించిన మేరకు పనితీరు లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి, ప్రలోభాలను అడ్డుకునే విషయంలో నమోదైన కేసుల సంఖ్య దీన్నే స్పష్టం చేస్తోంది. మొత్తంగా అభ్యర్థుల ప్రలోభాలతో చప్పుడులేని రాజకీయ సందడి పెరిగింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవిని భారీ మెజారిటీతో దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగిన టీఆర్ఎస్ అన్ని వ్యవహారాలను ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్రావు చూసుకున్నారు. చివరి రోజు వరకు ప్రచారం చేశారు. ఆఖరి రోజు పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించారు. టీఆర్ఎస్ మరో ముఖ్యనేత కేటీఆర్ సైతం గ్రేటర్ వరంగల్లోని పలు డివిజన్లలో రోడ్షోతో ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి రోడ్షోలో పాల్గొన్నారు. సీపీఎం అభ్యర్థి తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా చివరి రోజు ఎక్కువగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తమను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. -
నేటితో తెర
ఈ సాయంత్రం ముగియనున్న ‘గ్రేటర్’ ప్రచారం టీఆర్ఎస్ కీలక శక్తిగా హరీశ్ రావు చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ బీజేపీ తరఫున దత్తాత్రేయ, హన్స్రాజ్ కాంగ్రెస్ నుంచి వీహెచ్ రాక హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం తెరపడనుంది. వారం రోజులుగా హోరుగా సాగుతున్న ఓట్ల అభ్యర్థనకు నేటి సాయంత్రం ఐదు గంటలకు చివరి గడువు కానుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు నగరంలో ప్రచారంతో సందడి చేస్తున్నారు. టికెట్ల పంపిణీ నుంచి టీఆర్ఎస్కు అన్నీ తానై వ్యవహరిస్తున్న హరీశ్రావు ఇప్పటికే దాదాపు నగరం మొత్తం ప్రచారం చేశారు. చివరి రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికార పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ ప్రచారానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీలు మొదట్లో నెమ్మదించినా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా వేగం పెంచాయి. ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్షోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంది. టీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావు గ్రేటర్ వరంగల్ ప్రచారంలో కేంద్ర బిందువుగా మారారు. వారం రోజుల పాటు ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార వ్యూహంలో హరీశ్రావు ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రేటర్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు ప్రచారంలో పదును తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీర సీతారాంనాయక్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నగరంలో ప్రచారం చేస్తున్నారు. కాగా, చివరి రోజున టీఆర్ఎస్ మరో కీలక నేత కె.తారకరామారావు నగరంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన రోడ్షో నిర్వహించనున్నారు. అధికార పార్టీని ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహం రచించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ గురువారం ప్రచారం నిర్వహించారు. చివరిరోజు ప్రచారానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ రానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి రెండు రోజులుగా వరంగల్లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.{పచారాన్ని నెమ్మదిగా ప్రారంభించిన కాంగ్రె స్ చివరి దశలో వేగం పెంచింది. ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. చివరిరోజున పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రానున్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి రోడ్షోలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రచారం చేశారు. మొదటి నుంచి చివరి వరకు వీరిద్దరే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. బడా నేతలతో సంబంధం లేకుండా రెబల్ అ భ్యర్థులు, స్వతంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రో జులుగా శ్రమిస్తున్నారు. ఎన్నికల గుర్తుల ను పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిఇంటికి వెళుతూ తమను గెలిపిం చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వరంగల్, ఖమ్మం ప్రచారానికి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం ఖమ్మంలో ప్రచారం చేస్తారు. ఉదయం 9 గంటలకు పాండురంగాపురం వద్ద రోడ్డు షో మొదలు పెట్టి రాత్రి 9 గంటల దాకా ప్రచారంలో పాల్గొంటారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రెండు నగరాల్లో సమస్యలు, వాటి పరిష్కారానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఇవ్వాల్సిన హామీలపై మంత్రి ఆ రెండు జిల్లాల మంత్రులు, నాయకులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలపై పూర్తిస్థాయిలో పైచేయి సాధిం చే వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలను పార్టీ సవాల్గా తీసుకుంది. -
హోరుగల్లు
ఉధృతంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం నగరాన్ని చుట్టేస్తున్న హరీశ్ రెండు రోజుల్లో 36 డివిజన్లు పూర్తి బీజేపీ తరఫున కిషన్రెడ్డి ప్రచారం రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ నగరంలో రేవంత్రెడ్డి రోడ్షో వరంగల్ : ప్రధాన పార్టీల ప్రచార హోరుతో గ్రేటర్ వరంగల్ రాజకీయం వేడెక్కింది. గ్రేటర్గా మారిన తర్వాత వరంగల్ నగరంలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతోంది. 6వ తేదీన ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్ఎస్ అన్ని డివిజన్లలో విజయం సాధించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఆ పార్టీలో ఎన్నికల స్పెషలిస్టుగా పేరున్న మంత్రి తన్నీరు హరీశ్రావు కీలకంగా పనిచేస్తున్నారు. టికెట్ల ఖరారు విషయం నుంచి ప్రచార వ్యూహం వరకు అంతా తానై వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి ఏ డివిజన్లోనూ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు సర్దిచెప్పడం వంటి పనులను మొదటే చక్కబెట్టారు. రెండు రోజులుగా ప్రచారంతో దూకుడు పెంచారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 21 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం చేశారు. బుధవారం 15 డివిజన్లలో ప్రచారం పూర్తి చేశారు. మిగిలిన డివిజన్లలో గురు, శుక్రవారం ప్రచారం చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, గత ప్రభుత్వాల పనితీరును ప్రజలకు వివరిస్తున్నారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలనే అంశంపై స్పష్టత ఇస్తూ ప్రసంగిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పూర్తిగా ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రచారం ముగిసిన వెంటనే డివిజన్ల వారీగా రోజు వారీ పరిస్థితులను తెలసుకుంటూ ఏం చేయాలనే విషయాలపై ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రచారంలో సోషల్ మీడియాను వినియోగించుని గ్రేటర్ ప్రజల మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా వ్యాట్సాప్, ఫేస్బుక్లతో యువతరానికి మద్దతు కూడగట్టే పనులు చేస్తున్నారు. వాయిస్ మెసేజ్లను సైతం వినియోగించుకుంటున్నారు. రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గట్టిగానే పోరాడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి రెండు రోజలుగా నగరంలో ప్రచారం చేస్తున్నారు. డివిజన్లలో తిరుగుతూ ప్రజలను ఓటు అడుగుతున్నారు. పార్టీ అభ్యర్థులను, నాయకులను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇక్కడే మాకాం వేసి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సైతం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. బుధవారం నగరంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల పరిస్థితిపై కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో సమీక్షించారు. ఒకే రోజు ప్రచారం నిర్వహించి ఖమ్మం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్లో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇంచార్జీగా ఉన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క రెండు రోజుల క్రితం వరకు ప్రచారం నిర్వహించారు. మళ్లీ గురువారం నగరానికి రానున్నారు. చివరి రెండు రోజులు ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నగరానికి వచ్చి ప్రచారంలో పాల్గొని వెళ్లారు. టీడీపీ శాసనసభాపక్షం నాయకుడు ఎ.రేవంత్రెడ్డి బుధవారం ఆ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. నగరంలోని పలు డివిజన్లలో రోడ్షో నిర్వహించారు. నయీంనగర్, హన్మకొండ చౌరస్తాలలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గురువారం కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
మాతోనే ఓరుగల్లు అభివృద్ధి
♦ మీట్ ది ప్రెస్లో మంత్రి హరీశ్రావు ♦ కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాం ♦ కాంగ్రెస్, టీడీపీలు నగరాన్ని పట్టించుకోలేదు ♦ వరంగల్లోనూ ‘గ్రేటర్’ ఫలితాలే సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజలు మెచ్చే పాలన సాగించిన కాకతీయుల గొప్పదనాన్ని, వారసత్వ సంపదను తిరిగి తెచ్చి వరంగల్ ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. 18 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. వరంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చి దిద్దేందుకు సీఎం ప్రణాళిక రూపొందించారన్నారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్సిటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, కాళోజీ కళా కేంద్రం, పోలీస్ కమిషనరేట్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వరంగల్లో ఐటీ రంగం విస్తరణ మొదలుపెట్టామని, దేశంలో అత్యున్నతమైన టెక్స్టైల్ పార్కును ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తున్నామని, 10 ఎకరాల్లో అత్యాధునిక పండ్ల మార్కెట్ను వరంగల్కు మంజూరు చేశామని పేర్కొన్నారు. ముస్లింలకు షాదీఖానా, క్రిస్టియన్లకు చ ర్చిల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ఘనత టీఆర్ఎస్దేనని చెప్పారు. ‘‘వరంగల్ నగర అభివృద్ధికి బడ్జెట్లో ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. వరంగల్లో పేదల కోసం 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ తర్వాత ఎక్కువ ఇళ్లు మంజూరు చేసింది ఇక్కడే. ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్న ప్రజలు అన్ని ఎన్నికల్లోనూ మాకు మద్దతిస్తున్నారు’’ అని హరీశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలే గ్రేటర్ వరంగల్లోనూ పునరావృతం కాబోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదని, కాంగ్రెస్ కనుమరుగయ్యే దయనీయస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వరంగల్ జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రైల్వే కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీల ఏర్పాటును పట్టించుకోలేదని విమర్శించారు. వరంగల్ను స్మార్ట్సిటీగా ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరారు. -
అక్కడ చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా?
బీజేపీపై మంత్రి హరీశ్రావు ఫైర్ హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ లోని అంబర్పేట నియోజకవర్గంలో పది కార్పొరేటర్ స్థానాల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోలేని వాళ్లు ఇపుడు వరంగల్కు వచ్చి నీతులు చెపుతున్నారని మంత్రి టి.హరీశ్రావు అన్నారు. హైదరాబాద్లో చెల్లని రూపాయి.. వరంగల్లో చెల్లుతుందా అని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నిం చారు. ఆదివారం హన్మకొండలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఆరూరి రమేష్లతో కలసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నా.. గ్రేటర్ ఎన్నికల్లో ఐదుగురు కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేకపోయారన్నారు. తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనన్నారు. ఆరిపోతున్న దీపం అధిక వెలుగునిచ్చినట్లుగా టీడీపీ నాయకులు వెకిలి చేష్టలు చేస్తున్నారని, సొల్లు వాగుడు వాగుతున్నారని, అభూతకల్పనలు మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఖమ్మం కార్పొరేషన్ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. -
పోస్ట్.. లైక్.. షేర్.. కామెంట్!
హై‘టెక్’ ప్రచారం! గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా శుక్రవారం సాయంత్రం వెల్లడైంది. ఇక పోలింగ్ మార్చి 6వ తేదీ ఆదివారం జరగనుంది. అంతకు ఒకరోజు ముందే 4వ తేదీ సాయంత్రం ప్రచారం నిలిపివేయూల్సి ఉంటుంది. అంటే మధ్యలో సోమవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు అంటే కచ్చితంగా ఐదు రోజుల సమయమే మిగులుతుంది. ఈ సమయంలో డివిజన్లోని ప్రతీ ఓటరును కలవడం అభ్యర్థులకు అసాధ్యమేనని చెప్పాలి. ఎందుకంటే 8వేల నుంచి 14వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇంతమందిని తక్కువ సమయంలో కలుసుకోవడం సాధ్యం కాదని గుర్తించిన అభ్యర్థులు రకరకాల ఉపాయూలు ఆలోచిస్తున్నారు. ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే హై‘టెక్’ ప్రచారం! యువతపైనే దృష్టి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ప్రచారంలో ఎప్పటికప్పుడు కొత్త విధానం అవలంబించడం మనం చూస్తూనే ఉంటాం. అరుుతే, ఓటర్ల ఇంటికి వెళ్తే ఉద్యోగస్తులు, గృహిణులను కలుసుకోవడం సాధ్యమవుతుంది. కానీ యువతరాన్ని పట్టుకోవాలంటే కొంత కష్టమే. దీనికి విరుగుడుగా వారి మార్గంలోకే వెళ్లి ప్రచారం చేసేం దుకు ‘గ్రేటర్’ అభ్యర్థులు సిద్ధమయ్యూరు. ఇందులో భాగంగా ఇప్పటి యువతరం ఎక్కువగా ఫాలో అయ్యే ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఈ ప్రచారం ద్వారా అటు యువతరమే కాదు.. ఆండ్రారుుడ్ ఫోన్లు అందరి చేతుల్లో కనిపిస్తున్నందున మిగతా వర్గాల వారికి కూడా చేరువ కావొచ్చన్నది అభ్యర్థుల భావన. అన్ని వర్గాలకు అనుగుణంగా... జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇందులో సగానికి పైగా నగర పరిధిలో ఉంటారని చెప్పొచ్చు. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలు తరచుగా వాడే వారిని కలవడం వీలు కాని పక్షంలో ఆయూ మాధ్యమాల్లో పోస్టులు చేయడం ద్వారా ప్రచారం సులువవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని సోషల్ నెట్వర్క్ సైట్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా తమ ఫొటో, ఏ డివిజన్ నుంచి ఏ పార్టీ ద్వారా పోటీలో ఉన్నాం, తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి చేయనున్న కృషిని వివరిస్తూ అభ్యర్థులు పోస్టులు అప్డేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలు, గ తంలో చేసిన సేవా కార్యక్రమాలు, ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలు, తమ పార్టీ గురించి సైతం సోషల్ నెట్ వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటా మొదలుకుని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్లు, షేరింగ్లు, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికోసం తమ వర్గంలోని యువతను ప్రత్యేకంగా నియమించుకుంటుండడం విశేషం. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని వారు సైతం తమ కుటుంబంలో ఉన్న యువతీయువకుల సహాయంతో అకౌంట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హై‘టెక్’ ప్రచారం అభ్యర్థులకు బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. అందరికి చేరువయ్యేందుకు... ఇప్పటి యువతీ, యువకుల్లో ఫేస్బుక్ అకౌంట్లు లేని వారు ఉండరు. ప్రచారంలో భాగంగా మేం అందరి గృహాలకు వెళ్లినా యువత దొరకడం లేదు. దీంతో ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రచార సరళి, మమ్మల్ని గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ప్రచారానికి సమయం కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రచారం చేస్తున్నాం. -
ఓరుగల్లుకు మరింత గుర్తింపు తెస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి హరీష్రావు కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం బీజేపీ కూడా అన్యాయం చేసింది తెలంగాణలో టీడీపీ ఆరిపోయే దీపం వరంగల్ నగరవాసులు ఆలోచించాలి ‘గ్రేటర్’ ఎన్నికల టీఆర్ఎస్ ఇన్చార్జి హరీశ్రావు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు అన్ని రాజకీయపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటి తర్వాత రాష్ట్రంలో ఇప్పట్లో చెప్పుకోదగ్గ పెద్ద ఎన్నికలు లేవు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీలన్నీ వ్యూహాలు పన్నుతున్నారుు. టీఆర్ఎస్లో ఎన్నికల స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన తన్నీరు హరీశ్రావు ఆ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. నాయకులను, అభ్యర్థులను సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ‘కంటి ముందు అభ్యర్థి ఉన్నాడు.. ఇంటి ముందు ప్రభుత్వ పనితీరు కనిపిస్తోంది.. ఆలోచించి తీర్పు ఇవ్వండి’ అంటూ ఓటర్లను కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై మంత్రి హరీశ్రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... టీఆర్ఎస్తోనే అభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. వరంగల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. వరంగల్ కార్పొరేషన్కు గ్రేటర్ వరంగల్ హోదాను కల్పిం చింది. వరంగల్ నగరం, సమీప ప్రాంతాల్లోని ప్రజల చిరకా ల డిమాండ్గా ఉన్న వరంగల్ పోలీస్ కమిషరేట్ను ఏర్పా టు చేసింది. వరంగల్ను సాంస్కృతిక కేంద్రంగా మార్చేం దుకు రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నాము. హైదరాబాద్ తర్వాత పండ్ల మార్కెట్ను ఇక్కడే ఏర్పాటు చే స్తున్నాం. రూ.10 కోట్లతో కూరగాయలు, ఉల్లిగడ్డ మార్కె ట్ ఏర్పాటవుతున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా వరంగల్ భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి చెరువులను అభివృద్ధి చేసి మినీ ట్యాంక్బండ్లుగా మార్చుతున్నాం. కాకతీ యుల కాలంనాటి చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. కేసీఆర్కు ఇష్టమైన నగరం తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరంగల్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని కీలక దశల్లో వరంగల్ నగరానిది గొప్ప పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు ప్రాధాన్యత పెంచింది. హైదరాబాద్ తర్వాత అన్నింటికీ వరంగల్ కేంద్రం అనే భావన తెచ్చింది. వరంగల్ నగరానికి ఉన్న చారిత్రాక గుర్తింపును నిలబెట్టేలా ప్రభుత్వం పనిచేస్తోంది. సామాన్య ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయ కళా తోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో పెట్టి గుర్తింపు తెచ్చాము. గ్రామాలకు ఆయువుపట్టుగా ఉండే చెరువులను అభివృద్ధి చేసే పథకానికి మిషన్ కాకతీయ పేరు పెట్టాము. ముఖ్యమంత్రిగా కేసీఆర్.. హైదరాబాద్ తర్వాత ఎక్కువ రోజులు వరంగల్లోనే ఉన్నారు. మూడు రోజులు పేదల మధ్యనే గడిపారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించారు. ప్రత్యేక శ్రద్ధతో నగరానికి 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించారు. ఐటీకి మరో కేంద్రంగా.. ఐటీ పరంగా హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్ తర్వాత ఐటీకి మరో కేంద్రంగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పదిరోజుల క్రితమే మడికొండలో ఐటీ మంత్రి కేటీఆర్ సెయైంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు. ఇది ఇక కొనసాగుతోంది. జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఐటీ మంత్రి గా ఉండి వరంగల్ను పట్టించుకోలేదు. విద్యాకేంద్రంగా మార్చే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. రాష్ట్రంలోని ఏకైక వైద్యవిద్యాలయాన్ని వరంగల్లోనే ఏర్పాటు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో మొదటి గిరిజన యూనివర్సిటీ వరంగల్కే మంజూరైంది. సైనిక్స్కూల్ రాబోతోంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తోంది. వ్యవసాయ, పశుసంవర్థక కాలేజీలు, పరిశోధన సంస్థలను గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయి. ప్రజలు మావైపే... తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్వైపే ఉంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు దిగజారు డు రాజకీయాలు చేశారు. అవాకులు చవాకులు పేలారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. గ్రేటర్ హైదరాబాద్, నారాయణ్ఖేడ్ ఎన్నికల్లోనూ ప్రజలను టీఆర్ఎస్నే ఆదరించారు. ప్రతిపక్ష పార్టీల నేతల వైఖరి మారడం లేదు. ప్రజల తీర్పును పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వరంగల్లోనూ అదే చేస్తున్నారు. అంతిమంగా ప్రజలే తీర్పు చెబుతారు. బీజేపీని ప్రశ్నించాలి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ నగరానికి ఏం చేసిందని ప్రజలు నిలదీయాలి. స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్కు చోటు కల్పించకపోవడానికి కారణం ఎవరో బీజేపీ సమాధానం చెప్పాలి. తెలుగువాడినని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఏపీలోని రెండు నగరాలను స్మార్ట్సిటీలుగా ఎంపిక చేసినా తెలంగాణలోని వరంగల్ను పట్టించుకోలేదు. రైల్వే బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. రైల్వే వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీల విషయా న్ని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. వరంగల్కు ఏమీ చేయని బీజేపీకి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోలేదు... చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 65 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు వరంగల్ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగరంలో ప్రతి రోజూ నాలుగు గంటలు కరెంటు పోయేది. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడగాలనేది వారికి అర్థంకావడం లేదు. టీడీపీ తెలంగాణలో ఆరిపోయే దీపం. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయడే తన వల్ల కాదని హైదరాబాద్ను విడిచి వెళ్లిపోయాడు. తెలంగాణలో టీడీపీకి మనుగడే లేదనే ఆవేదనతో ఆ పార్టీలో మిలిగిన కొందరు నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏం చేస్తామనే చెప్పకుండా దిగజారి మాట్లాడుతున్నారు. గుండె మీద చెయ్యి వేసుకుని... వరంగల్ ప్రజలు మేధావులు, విజ్ఞానవంతులు. పోరాటాల చరిత్ర ఉన్నవారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచా రు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అన్ని దశల్లోనూ మద్దతు ఇ చ్చారు. గ్రేటర్ వరంగల్లోని 58 డివిజన్లలో 42 చోట్ల తెలంగాణ ఉద్యమకారులకే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కంటి ముందు అభ్యర్థి ఉన్నాడు.. ఇంటి ముందు ప్రభుత్వ పనితీ రు కనిపిస్తోంది. వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. 65ఏళ్ల గత ప్రభుత్వాల పనితీరు, 20 నెలల టీఆర్ఎస్ అంకితభావాన్ని పరిశీ లించండి. సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వడం అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి మద్దతు ఇచ్చినట్లే. వరంగల్ నగరంపై టీఆర్ఎస్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. -
హరీశ్ కు ‘గ్రేటర్ వరంగల్’ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీశ్రావుకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం రాత్రి తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఆదివారం నుంచి ఎన్నికల తంతు ముగిసే వరకు వరంగల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని హరీశ్ ను ఆయన ఆదేశించారు. ఇప్పటికే వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించిన హరీశ్రావుకు తాజాగా అభ్యర్థులను గె లిపించే బాధ్యత కూడా అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ ్యక్తం చేస్తున్నాయి. -
వారు చచ్చిన వారితో సమానం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానమని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉప్పు, కారం తిని పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా డివిజన్ల నుంచి బరిలోకి దిగిన కార్పొరేట్ అభ్యర్థులతో శుక్రవారం ట్రస్ట్ భవన్లో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందని, కానీ కొందరికి ఆ విశ్వాసం లేకుండా పోయిందని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి లేని వారు పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్కు కానుకగా గ్రేటర్ వరంగల్
సీఎంపై జిల్లా వాసులకు ప్రగాఢ విశ్వాసం సమన్వయంతో పనిచేస్తాం టీఆర్ఎస్దే విజయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ కైవసం చేసుకుని సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్రావు, ఈటెల రాజేందర్, చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆయన మాట్లాడారు. మార్చి 6వ తేదీన జరుగనున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిందన్నారు. ఊహించిన దాని కంటే పార్టీలో అభ్యర్థులు టికెట్లు ఆశించారని అన్నారు. విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరణ చేయించామన్నారు. ఆశావహులకు నచ్చచెప్పడంతో తోడ్పాటు అందించారన్నారు. జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్పై ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్నారన్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జనవరిలో మూడు రోజుల పాటు నగరంలో ఉండి నగర అభివృద్ధిపై ప్రణాళికను రూపొందించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని తరహాలో వరంగల్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఐటీ కంపెనీలు వరంగల్లో ఏర్పాటు చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా రూ.8.69 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఎంపీ, అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. అందరం సమన్వయంతో పని టీఆర్ఎస్ను గెలిపిస్తామన్నారు. మంత్రి తన్నీరు హరీష్రావు మాట్లాడుతూ మిగతా రాష్ట్రాల సీఎంలతో పోల్చితే సీఎం కేసీఆర్ పని తీరు బాగుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసాన్ని నింపాయన్నారు. ఇండియా టుడే అవార్డు రావడమే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ను చూడాలని సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ రోజులు వరంగల్లోనే గడిపారని తెలిపారు. ఉద్యమకారులకు, పని చేసిన వారికి అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించిన మేరకు అభ్యర్థుల ఎంపిక చేశామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ రూపు రేఖలు మారేలా ప్రభుత్వ పని తీరు ఉంటుందన్నారు. టికెట్లు రాని కార్యకర్తలకు భవిష్యత్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్ల ధర్మారెడ్డి, నాయకులు గుడిమల్ల రవికుమార్, భరత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
బరిలో 398 మంది అభ్యర్థులు
→ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ → అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు → పలు డివిజన్లలో బహుముఖ పోటీ వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల రణ రంగంలో పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య తేలింది. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ పక్రియ అనంతరం అభ్యర్థుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులు కూడా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా అన్ని డివిజన్లలోనూ బహుముఖ పోటీ నెలకొంది. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్ల నుంచి మొత్తం 1350 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన అనంతరం 56 నామినేషన్లను తిరస్కరించారు. 1294 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహ రణ గడువు ముగియగా.. 439 మంది అభ్యర్థుల తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 398 మంది అభ్యర్థులు బరిలో తలపడనున్నారు. తీవ్ర ఉత్కంఠ.. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఉత్కంఠ, ఉద్వే గం చోటు చేసుకుంది. బీ-ఫాంల విషయంలో అభ్యర్థులు ఉద్వేగానికి లోనయ్యారు. అధికార పార్టీ అభ్యర్థులు బీ- ఫారం కోసం నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పీఏల ద్వారా పార్టీ బీ- ఫాంలు రిటర్నింగ్ అధికారులకు అందే వరకు ఆందోళన కు గురయ్యారు. సూమారు మూడు గంటల పాటు కలవరపడిన అభ్యర్థులు తీరా బీ-ఫాంలు అందజేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మరోవైపు సొంత పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఉపసంహరించుకునే అంశం కూడా వారిని ఆందోళనకు గురిచేసింది. కొంత మంది బేరసారాలు జరిపారు, మరికొందరు నానా రకాలుగా ఆశలు చూపించారు. పార్టీల అధినేతల నుంచి బుజ్జగింపులు జరిగాయి. చివరికి తీవ్ర నిరాశతో చాలామంది బల్దియా పధాన కార్యాలయానికి వచ్చి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈక్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు, ఉపసంహరించుకున్న ఆశావహులకు నడుమ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చర్చల ద్వారా చాలా తక్కు వ మంది మాత్రమే తప్పుకోగా, ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయనే ఆరోపణలున్నాయి. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరి నుంచి తప్పుకోవాలని అధికార నేతలు సంప్రదింపులు జరపడం గమనార్హం. -
గులాబీ గూటిలో ‘మున్సిపల్’ ముసలం
ఓరుగల్లు టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి సెగలు * అసంతృప్తులను బుజ్జగించే పనిలో నాయకత్వం * వరంగల్లోనే మంత్రి హరీశ్ మకాం * పాత-కొత్త శ్రేణుల సమన్వయమే అసలు సమస్య సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో లొల్లి షురూ అయ్యింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు తమ వెంట తెచ్చిన అనుచురులకు అవకాశాలు ఇప్పించుకోవడంలో పోటీ పడుతున్నారు. దీంతో పాత-కొత్త శ్రేణుల సమన్వయమే సవాలుగా మారిందంటున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆందోళనా వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్లు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనే పాత-కొత్త శ్రేణుల మధ్య పంచాయితీలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి బలం చేకూరుస్తూ వరంగల్లో పాత-కొత్త నేతలు తమ వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కన్వీనర్గా ఉన్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీ ఎదుట ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కొండా మురళీ, మరోవైపు ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్రావులు ఎవరి జాబితాలు వారు పెట్టారు. సహజంగానే ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా, పార్టీ అధినాయకత్వం మంత్రి హరీశ్రావును రంగంలోకి దించింది. అయితే, ఒక్క మంత్రి మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పంచాయితీ లేకపోవడం గమనార్హం. అసలేం జరుగుతోంది... వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో 6, పరకాల నియోజకవర్గంలో 4 డివిజన్లు ఉన్నాయి. మిగిలిన 48 డివిజన్లు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే ఉన్నా యి. వినయ్ భాస్కర్, ముందు నుంచే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అలక బూనారని సమాచారం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ తమ అనుచరులకు ఎక్కువ టికెట్ల కోసం యత్నించారని, వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే కావడంతో పేచీ మొదలైందంటున్నారు. పార్టీ బీ-ఫాం ఇస్తే చాలు తేలిగ్గా గెలిచే అవకాశాలు ఉన్నందున, ఉద్యమంలో పనిచేసిన పాత కేడర్కే అవకాశం ఇవ్వాలని, వారికి డబ్బున్నా, లేకున్నా పట్టించుకోవద్దని ముందు నుంచీ టీఆర్ఎస్లో ఉన్నవారు వాదిస్తున్నారు. దీనికితోడు తాజాగా టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి అనుచరుడు, టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీకి టికెట్ ఇవ్వాలనడంతో తన నియోజకవర్గంలో ఎర్రబెల్లి వేలు పెడుతున్నారని వినయ్ భాస్కర్ పంచాయితీ మొదలుపెట్టారని అంటున్నారు. దీంతోపాటు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరిక తర్వాత ఆయన అనుచరుల్లోనూ ఇద్దరు ముగ్గురికి టికెట్ల హామీ ఇచ్చారని వినికిడి. మొత్తంగా కొత్తవారికి కూడా అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో అధిష్టానం ఉండగా, పాత వారి పరిస్థితి ఏమిటనే అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హరీశ్రావు మంగళ, బుధవారాల్లో వరంగల్లోనే మకాం వేసి అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చారని, నాయకులనూ బుజ్జగించారని అంటున్నారు. అయినా, నామినేషన్లకు చివరి రోజైన బుధవారం టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారని, బీ-ఫారం ఇచ్చేటప్పటికీ (26వ తేదీ) ఈ వివాదం మరింత ముదిరి రెబెల్స్ బెడద తప్పక పోవచ్చని అంచనా వేస్తున్నారు. -
ఆగమనం!
వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వివిధ పార్టీల నాయకుల కోలాహలం టీఆర్ఎస్లో టికెట్ల లొల్లిఅన్ని డివిజన్లలోనూ రెబల్స్..579 నామినేషన్లు దాఖలు 51 డివిజన్లకు అభ్యర్థుల ఖరారుఇంకా జాబితా ప్రకటించని కాంగ్రెస్ 54 డివిజన్లలోనే నామినేషన్లు 55 డివిజన్లలో బీజేపీ, 50 డివిజన్లలో టీడీపీ రసవత్తరంగా గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోరు. వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నామినేషన్ల దాఖలులోనే వరంగల్ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. అన్ని పార్టీల తరఫున కలిపి మూడు రోజుల్లో మొత్తం 1350 నామినేషన్లు దాఖల య్యాయి. అన్ని పార్టీల్లోనూ ఒక్కో డివిజన్కు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలిచారు. దీంతో తిరుగుబా టు అభ్యర్థులతో ఇబ్బందులు నెలకొన్నాయి. టీఆర్ఎస్కు ఈ సమస్య ఎక్కువగా ఉంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ఆపార్టీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. కార్పొరేటర్ గా పోటీ చేసేవారు ఎక్కువగా ఉండడంతో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అధికార అభ్యర్థి ఒక్కరే ఉంటున్నా... తిరుగుబాటు అభ్యర్థుల బెడద టీఆర్ఎస్లో ఎక్కువగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణలోపు ఈ తిరుగుబాట్లను అధిగమించడమే టీఆర్ఎస్కు పెద్ద సమస్యగా మారింది. ప్రతి డివి జన్లోనూ పోటీ అధికంగా ఉండడంతో టికెట్ ఎవరికి ఇవ్వా లో అనేది ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలతోనూ టికెట్ల పంపిణీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో టీఆర్ఎస్ కీలక నేత టి.హరీశ్రావు స్వయంగా జిల్లా కు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ టికెట్ల కేటాయింపు విషయాన్ని కొలిక్కి తెస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లు ఉండ గా, టీఆర్ఎస్ 51 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వదిన స్వర్ణలతకు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కోడలు అశ్రీతరెడ్డికి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సోదరు డు విజయభాస్కర్కు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం మరో ఏడుగురు పేర్లను ప్రకటించనుంది. అందరికీ అదే రోజు బీఫారం ఇవ్వనుంది. టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆయా డివిజన్లలో రెబల్గా పోటీ చేసిన వారిని ఒక్కొక్కరినీ పిలిచి సర్ది చెబుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు గడువు ఉండడంతో ప్రస్తుతం బుజ్జగింపులతోనే సరిపెడుతున్నారు. గడువు దగ్గరపడుతున్నా కొద్ది అన్ని రకాలుగా ప్రయత్నాలు పెంచేం దుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంత మంది టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉంటారో తేలనుంది. బుజ్జగింపులు... నామినేషన్ల దాఖలు గడువు బుధవారం ముగిసింది. శుక్రవారం ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి భారీగా నామినేషన్లు వేయడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. అన్ని డివిజన్లలోనూ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో టీఆర్ఎస్ ముఖ్యనేత టి.హరీష్రావు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉన్న హరీష్... డివిజన్ల వారీగా నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. అవసరమైన హామీలు ఇస్తూ నచ్చజెప్పుబుతున్నారు. కాగా, టీఆర్ఎస్ టికెట్ దక్కని వారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించి నాలుగు డివిజన్లలో ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు. బీజేపీ మూడు, టీడీపీ ఎనిమిది డివిజన్లలో ఒక్క నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక గ్రేటర్ వరంగల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. మేయర్ ఆశలపై నీళ్లు... వారం క్రితం టీఆర్ఎస్లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు సాధారణ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరారు. గ్రేటర్ మేయర్ పదవిని ఆశించిన ప్రదీప్రావు 26వ డివిజన్లో పోటీ చేయాలని భావించారు. టీఆర్ఎస్ ఈ డివిజన్ టికెట్ను గుండా ప్రకాశ్కు కేటాయించడంతో ప్రదీప్రావు 27వ డివిజన్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ డివిజన్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవి ఆశించిన మరో ఇద్దరు టీఆర్ఎస్ ముఖ్య నేతలకు కార్పొరేటర్ టికెట్లే దక్కలేదు. టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎం.సహోదర్రెడ్డి, మర్రి యాదవరెడ్డి 39వ డివిజన్ టికెట్ ఆశించారు. ఈ డివిజన్లో గెలిచి మేయర్ పదవి కోసం ప్రయత్నించాలని భావించారు. టీఆర్ఎస్ అధిష్టానం వీరిద్దరినీ పక్కనబెట్టి చీకటి ఆనంద్కు టికెట్ ఇచ్చింది. దీంతో సీనియర్ నేతలు ఖంగు తిన్నారు. -
వరంగల్ ఎన్నిక : టీఆర్ఎస్ తొలి జాబితా
గ్రేటర్ వరంగల్ ఎన్నికల టిఆర్ఎస్ తొలి జాబితా బుధవారం విడుదల చేసింది. కార్పోరేషన్ లోని 58 డివిజన్లకు గాను 15 డివిజన్లలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో చోటుదక్కించుకున్న అభ్యర్థులు వీరే..భోడ డిన్నా, మాడిశెట్టి అరుణ,మాదవిరెడ్డి, మిడిదొడ్డి స్వప్న,చీకటి ఆనంద్, సాంబయ్య, సులోచన, పసునూరి స్వర్ణలత,జోరిక రమేష్, భైరి వెంకట్రాజం, దర్మనాయక్, బిల్లా ఉదయ్ రెడ్డి, జక్కుల శ్రీనివాసు, భానోతు కల్పన,లీలావతి. కాగా.. మిగతా డివిజన్లకు అభ్యర్థుల పేర్లు తర్వరలోనే ఖరారు చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
వరంగల్ టీఆర్ఎస్లో ముసలం
♦ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి ♦ అజ్ఞాతంలోకి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ ♦ వలస నేతలకు టికెట్లపై అసంతృప్తి ♦ నామినేషన్ల వేళ పార్టీలో గందరగోళం సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరుణంలో అధికార టీఆర్ఎస్లో ముసలం మొదలైంది. పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇస్తుండడం పై గులాబీ నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి పని చేస్తున్న వారికి అవకాశాలు కల్పించలేకపోతున్నామనే భావనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అసంతృప్తితో ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల రాజకీయ పరిణామాలతో వినయభాస్కర్ బాగా కలత చెందారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వినయ్భాస్కర్ టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరితో ఇబ్బందుల పడి 12 ఏళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న తన ఇంటిపై పోలీ సులతో దాడి చేయించేందుకు కారణమైన ఎర్రబెల్లి దయాకర్రావు ఇటీవల టీఆర్ఎస్లో చేరడంపై వినయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎర్రబెల్లి, వినయభాస్కర్ నియోజకవర్గాలు వేరైనప్పడు ఒకే పార్టీలో ఉన్నా ఇబ్బం దులు ఉండబోవని సన్నిహితులు సూచించడంతో కొంత సర్దుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఎర్రబెల్లి అనుచరుడిగా ఉన్న మురళికి కార్పొరేటర్ టికెట్ ఇస్తానని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వరంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ సైతం నాలుగు రోజుల క్రితం టీఆర్ఎస్లో చేరారు. ఈయనకు కూడా టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వీరితోపాటు టీఆర్ఎస్లో చేరిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలకు సైతం టిక్కెట్లపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్లో మొదటి నుంచి పని చేస్తున్న వారి నుంచి వినయభాస్కర్పై ఒత్తిడి పెరుగుతోంది. ఎర్రబెల్లి అనుచరులకు టికెట్ల కేటాయింపుపై, కొత్త వారి రాక తో ఏర్పడిన ఇబ్బందులపై గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద వినయభాస్కర్ సోమవారంరాత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు సర్దుకోవాలని కడియం శ్రీహరి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తన అనుచరుల నుంచి టికెట్ల కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో వినయభాస్కర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగియనుంది. కీలకమైన తరుణంలో వినయభాస్కర్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో టీఆర్ఎస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
చెయ్యికి దెబ్బ
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి సారయ్య వారం రోజులుగా ద్వితీయశ్రేణి నేతల వలస గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు కష్టాలు వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతల వలసలతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. వారం రోజులుగా కాంగ్రెస్కు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ వరంగల్లో కీలక నేతగా ఉన్న బస్వరాజు సారయ్య ఎన్నికల సమయంలో పార్టీని వీడడం కాంగ్రెస్కు నష్టమేనని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన సారయ్యకు సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉంది. 1989లో వరంగల్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లోనే కొనసాగారు. 1994లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో సారయ్య వరుసగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కార్పొరేటర్గా గెలిచి ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టిన సారయ్యకు వరంగల్ నగరంలో కాంగ్రెస్ కీలక నేతగా గుర్తింపు ఉంది. గ్రేటర్ ఎన్నికల తరుణంలో సారయ్య పార్టీకి దూరమవడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీని వీడారు. దీంతో కొత్త నేతల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇబ్బందులతోనేనా... మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కాంగ్రెస్ను వీడుతారనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బస్వరాజు సారయ్య ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. ఇటీవల పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీబీసీఐడీ విచారణ జరిపించింది. సీబీసీఐడీ నివేదికల అంశాలు బస్వరాజు సారయ్యకు ప్రతికూలంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లోనూ సారయ్య కీలకంగా వ్యవహరించ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కొనసాగింపుగానే సారయ్య టీఆర్ఎస్లో చేరారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. సారయ్యతో పాటు పలువురి చేరిక వరంగల్ : మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సారయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, ఎమ్మెల్యే కొండా సురేఖల ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. సారయ్యతో పాటు కుడా మాజీ చైర్మన్ మూగ రాంమోహ్మన్రావు, డాక్టర్ పోలా నటరాజ్, బస్వరాజు కుమారస్వామి, శ్రీమాన్, రోకుల భాస్కర్, తత్తరె లక్ష్మణ్, తోట నవీన్కుమార్, నీలారపు రంజిత్లతో పాటు పలువురు పార్టీలో చేరారు. -
మున్సి‘పోల్స్’పై టీఆర్ఎస్ గురి
♦ పార్టీలో మొదలైన ఎన్నికల సందడి ♦ వరంగల్, ఖమ్మంలో మంత్రుల పర్యటనలు ♦ మొదలైన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ♦ వరాల జాబితా తయారీలో నిమగ్నం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి ఆదివారం ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి పెట్టింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన ఆ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికలపైనా అదే విశ్వాసంతో ఉంది. ఈ నెలలోనే ముగిసిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీ గెలుపొందింది. ఇలా వరసగా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాతో ఉంది. షెడ్యూలు విడుదల కంటే ముందు నుంచే ఈ ఎన్నికలపై హోంవర్క్ చేసిన అధికార పార్టీ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై స్పష్టత ఇచ్చింది. మంత్రులూ ఈ రెండు నగరాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఇప్పటికే విపక్షాలు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతుండటం, కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జులను కూడా నియమించుకోవడంతో టీఆర్ఎస్లోనూ ఎన్నికల వేడి మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తున్నందున ఈ ఎన్నికల్లోనూ అవలీలగా విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంతోపాటు, వరంగల్, ఖమ్మం నగరాల్లో ప్రత్యేకంగా చేపట్టే పనుల గురించి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. నగర ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. వాస్తవానికి వరంగల్లోనూ కేసీఆర్ పర్యటించాల్సి ఉన్నా, అది వాయిదా పడింది. వరంగల్లో ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామావు పర్యటించగా, ఆ జిల్లాల మంత్రులే కాకుండా సీనియర్ మంత్రుల పర్యటనలూ మొదలయ్యాయి. పనిలోపనిగా ఆపరేషన్ ఆకర్ష్ను అధికార పార్టీ కొనసాగిస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వ లసలూ మొదలయ్యాయి. వరంగల్ నగర టీడీపీ అధ్యక్షుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు కూడా గులాబీ గూటికి చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అమలు చేసిన చేరికల వ్యూహాన్నే ఇక్కడా సైతం మొదలుపెట్టినట్లు తాజా చేరికలు రుజువు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు నగరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితరాలను ప్రచారాంశాలుగా ఎంచుకుంది. మరోవైపు రెండు కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వరాల జాబితాను రూపొందిస్తున్నారని చెబుతున్నారు. -
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు మార్చి 6న!
ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మునిసిపాలిటీలకు కూడా.. ♦ నేడు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల జారీ ♦ 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లను ఆదివారమే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్చి తొలి వారంలో రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఎన్నికలు ముగియనున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే మార్చి 6న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పై మూడు పురపాలికల్లోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి. సిద్దిపేటకు తొలగని న్యాయ చిక్కులు మంత్రి టి.హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట పట్టణానికి సైతం ఇదే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యాయి. సిద్దిపేటలో ఆరు శివారు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో కొంత కాలంగా ఈ మునిసిపాలిటీ ఎన్నికలపై స్టే అమల్లో ఉంది. స్టే తొలగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వేచిచూస్తే ఎన్నికలను బడ్జెట్ సమావేశాల కంటే ముందు నిర్వహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత సిద్దిపేటతో పాటు దుబ్బాక, కొల్లాపూర్, మేడ్చెల్ మునిసిపాలిటీలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. -
ఐటీ హబ్గా ఓరుగల్లు
హసన్పర్తి: వరంగల్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) హబ్గా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. వరంగల్ జిల్లాకు మరిన్ని ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు అవసరమైన స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్లోనూ త్వరలోనే ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండలో సైయంట్ న్యూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ టవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఒక్క సైయంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలోనే వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు ఉంటే.. అందులో 7 వేల మంది హైదరాబాద్లోనే ఉన్నారని వివరించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు రెండు, మూడు కంపెనీలు ఉత్సాహం కనబరుస్తున్నాయన్నారు. మున్ముందు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వరంగల్ నిట్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మడికొండలోని ఇంక్యుబేషన్ టవర్ రెండో దశకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. టాస్క్ ద్వారా తర్ఫీదు ఇంజనీరింగ్తో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపా ధి అవకాశాలు మెరుగుపరిచేందుకు టాస్క్ పేరుతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలి పారు. ఈ శిక్షణతో చదువు పూర్తయిన వెంటనే క్యాం పస్ ప్లేస్మెంట్ ద్వారా విద్యార్థులు ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రమేశ్, దాస్యం వినయ్భాస్కర్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, సైయంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ అధినేత మోహన్రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సైయంట్ సెంటర్కు శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను కూడా ప్రారంభించారు. -
సిద్దిపేటలో 6 పంచాయతీల విలీనం
20న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్! మార్చి 5న ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట శివారుల్లో ఉన్న హనుమాన్నగర్, ప్రశాంత్నగర్, నర్సాపూర్, తాడిచర్లపల్లి, ఇమామ్బాద్, రంగనాథ్పల్లి గ్రామ పంచాయతీలను సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరింటి గ్రామ పంచాయతీల హోదాను రద్దు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. వాస్తవానికి సిద్దిపేట మునిసిపాలిటీలో ఈ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ 2012లోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే విలీనం చేశారంటూ స్థానికులు పిటిషన్ దాఖలు చేయడంతో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఆరు గ్రామాల్లో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. స్టే తొలగింపు కోసం ప్రభుత్వం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలోని డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లను ప్రకటిస్తూ సోమవారంగాని, మంగళవారంగాని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ మేరకు 20న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ నాలుగు పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. మార్చి 5న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -
ఓరుగల్లులో ఇన్ఫోసిస్ క్యాంపస్
♦ 19న సీఎం కేసీఆర్ శంకుస్థాపన ♦ చారిత్రక నగరానికి టెక్నాలజీ హంగు ♦ మైసూరు తరహాలో శిక్షణ కేంద్రం ♦ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధికి ఊతం సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రాష్ట్రంలో కొత్త వేదిక ఏర్పాటవుతోంది. చారిత్రక వరంగల్ నగరంలో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ ట్రైనింగ్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండలో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 19న శంకుస్థాపనచేయనున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఐటీ సేవల సంస్థల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఏటా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఈ సంస్థ... వారికి సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తుంది. ఇందుకోసం కర్ణాటకలోని మైసూరులో పదేళ్ల క్రితం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 10 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు అనువుగా 350 ఎకరాల విస్తీర్ణంలో, అత్యాధునిక హంగులతో రెండు వేల గదులు, మల్టీఫ్లెక్స్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్కోర్టు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో వరంగల్లోనూ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. వరంగల్ ఎందుకంటే.. ఇన్ఫోసిస్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. అయితే బెంగళూరుకు దీటుగా ఐటీ రంగంలో విస్తరిస్తున్న హైదరాబాద్ను మరో వేదికగా మలుచుకునేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇన్ఫోసిస్ కేంద్రంలో 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం వద్ద 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా మరో కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్కు హైదరాబాద్ సమీపంలోనూ శిక్షణ కేంద్రం ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులకు గ్రేటర్ వరంగల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్కు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కింద ప్రతిపాదించింది. ఇన్ఫోసిస్ దానికి అంగీకరించి.. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వరంగల్ నగరం చెన్నై-న్యూఢిల్లీ రైలు మార్గంపై ఉండడం, ఆర్థికంగానూ తక్కువ ఖర్చు, ప్రకృతి విపత్తులపరంగా సురక్షితమైన నగరం కావడం కూడా ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడింది. ఐటీ రంగానికి ఊతం.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ రంగల్లో ఇప్పటికే ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం నిర్మాణాన్ని కూడా పూర్తిచేసింది. కాకతీయ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులో రెండేళ్లుగా 25 సార్టప్ కంపెనీలు పని చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ శిక్షణా కేంద్రం వస్తుండడంతో... ఇక్కడ ఐటీ రంగం పుంజుకోనుంది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ‘‘వరంగల్ నగరం ఐటీ రంగానికి కొత్త చిరునామాగా మారబోతోంది. ఇన్ఫోసిస్ శిక్షణ కేంద్రం దీనికి కీలక మలుపని భావించవచ్చు. సీఎం కేసీఆర్ ఈనెల 18న సాయంత్రం వరంగల్కు వస్తున్నారు. 19న ఉదయం మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుంటారు. అనంతరం తిరిగి వరంగల్కు వచ్చి... ఇక్కడ ఇన్ఫోసిస్ ట్రైనింగ్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు..’’ - వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్ -
గొంతెండనివ్వం
వేసవిలో నగర ప్రజలకు సరిపడా నీరందిస్తాం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టు సందర్శన నదిలో నుంచి నీటి పంపింగ్పై దృష్టి అంచనాలు తయూరు చేయూలని అధికారులకు ఆదేశం ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు ఎండాకాలంలో తాగునీటిని పూర్తి స్థాయిలో అందిస్తామని, గొంతులు ఎండకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘గ్రేటర్కు నీళ్లగండం’ శీర్షిక సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డిప్యూటీ సీఎం.. శుక్రవారం గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు ఇన్టేక్వెల్ను, గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు తాగునీటిని అందించడానికి భద్రకాళి, వడ్డెపల్లి, ధర్మసాగర్ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీరు కేవలం 90 రోజులకు మాత్రమే సరిపోతుందని, మూడు రోజులకోసారి ప్రజలకు నీటిని సరఫరా చేయాల్సి దుస్థితి నెలకొన్నదన్నారు. ఎల్ఎండీ, ఎస్సారెస్సీ ప్రాజెక్టులో నీరు తగినంత లేకపోవడంతో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదముందని, దీని నివారణకు దేవాదుల మొదటి దశ ద్వారా నీటిని అందించాలని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించామని కడియం చె ప్పారు. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 68 మీటర్ల ఎత్తులో ఉందని, అరుుతే నదిలో నీటిమట్టం 71 అడుగులు ఉంటేనే దేవాదుల ఇన్టేక్ వెల్లో మొదటిదశ మోటార్లు నడుస్తాయని తెలిపారు. అడ్డుకట్టలతో నీటి నిల్వలు దేవాదుల వద్ద గోదావరి నీరు రెండు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహిస్తోందని, ఈ నీటిని వినియోగించుకోవడానికి ఇసుక బస్తాలు, మట్టికట్టలతో అడ్డుకట్టలు వేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఎస్ఈ వీరయ్య డిప్యూటీ సీఎం కడియం కు వివరించారు. ఎన్ని మోటార్లతో ఎంత ఖర్చుతో ఎన్నిరోజుల్లో నీటిని పంపింగ్ చేయగలుగుతారని అధికారులను కడియం ప్రశ్నించారు. ఇన్టేక్వెల్లోకి నీరు తరలించేందుకు 200 హార్స్పవర్ మోటార్లను పది బిగించి గోదావరి ప్రవాహంలో అమర్చి వాటి ద్వారా ఇన్టేక్వెల్కు పంపింగ్ చేస్తే నగరానికి కొంత మేర నీటి ఎద్దడి తీరుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మోటార్లకు డీజిల్ లేదా విద్యుత్ సమకూర్చుకోవాలని, పనులు 20 రోజుల్లో పూర్తిచేసి నీటిని పంపింగ్ చేయాలని కాంట్రాక్టు సంస్థ పవర్సోలేషన్ కంపెనీ ఎండీ ఉమామహేశ్వర్ను కడియం ఆదేశించారు. దేవాదులలోని రెండు మోటార్ల ద్వారా రోజుకు భీంఘన్పూర్ రిజర్వాయర్కు 15 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్టీ) నీరు సరఫరా అవుతుందని, అక్కడి నుంచి పులుకుర్తి, తర్వాత ధర్మసాగర్ రిజర్వాయర్కు నీటిని అందిస్తే వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు నీటి ఎద్దడి ఉం డదని కడియం అన్నారు. దేవాదుల నీరు తరలించేందుకు ఇంజనీరింగ్ అధికారులు రూపొం దించే అంచనాలకు సీఎం కేసీఆర్ వద్ద అనుమ తి తీసుకుంటామని, పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం క్రమం లో దిగువ భాగంలో చిన్నపాటి బ్యారేజీ నిర్మి స్తే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కా దని, అప్పుడు చాలా తక్కువ ఖర్చుతో బ్యారేజీ నిర్మాణం జరిగి ఉండేదని కడియం అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది వేసవిలో నీటిఎద్దడి రాకుం డా శాయశక్తులా కృషి చేస్తున్నామని, 2017 వేసవిలో ప్రజలకు నీరందించేందుకు మాస్టర్ప్లాన్ ఇప్పటినుంచే తయారుచేస్తున్నట్లు తెలిపారు. తల్లి గోదావరి నీరు ఎంతో పవిత్రం దేవాదుల వద్ద గోదావరిని పరిశీలించిన కడియం.. గోదావరి నది నీటిని తాగి.. తల్లి గోదారి నీరు ఎంతో పవిత్రమని అన్నారు. ప్రాజెక్టు సందర్శించిన వారిలో ఎస్ఈ వీరయ్య, ఈఈ జగదీష్, డీఈఈ రాంప్రసాద్, ఏఈఈలు శ్రీనివాస్రావు, విద్యాసాగర్, కార్పొరేషన్ ఎస్ఈ అబ్దుల్ రహమాన్ తదితరులు ఉన్నారు. -
గ్రేటర్ తొలి ఫలితం టీఆర్ఎస్దే
హైదరాబాద్ : గ్రేటర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారనే ఉత్కంఠకు తెర పడినట్లే. మొట్టమొదటి ఫలితం కూడా వెలువడింది. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ విజయం సాధించారు. గ్రేటర్లో 150 డివిజన్లకు ఈ నెల 2న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి వుండగా పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్ రీపోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఆ తరువాతే అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు కోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,626 మంది విధుల్లో పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే మెదక్ జిల్లాలో గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహెచ్ఈఎల్లో హోలిక్రాప్ నర్సింగ్ స్కూల్లో పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్నారు. ముందుగా పోస్టల్బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లేవారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 127 ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రం ఐదుగంటల తర్వాత ఫలితం వెలువడనుంది. -
గ్రేటర్లో టీడీపీపై ప్రజలకు నమ్మకముంది: చంద్రబాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆనాడు టీడీపీ చేసిన అభివృద్ధే ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటీల ప్రయోగం అప్పట్లోనే తాను అమలు చేశామని చంద్రబాబు అన్నారు. తమ హాయంలో బిల్గేట్స్, క్లింటన్ కూడా హైదరాబాద్ వచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
నా మనసంతా హైదరాబాద్పైనే..
హైదరాబాద్ : 'హైదరాబాద్ నుంచి పారిపోయానని కొందరు విమర్శిస్తున్నారు. భయం అనే పదం నా డిక్షనరీలోనే లేదు. నేనెక్కడికీ పోను. నా మనసంతా హైదరాబాద్పైనే ఉంది. ఇక్కడికి మళ్లీ వస్తా. తగిన సమయాన్ని కేటాయించి పార్టీని బలోపేతం చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేకూరేలా ప్రయత్నిస్తా..’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి నగరంలోని శిల్పారామం వద్ద రోడ్షో ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాదాపూర్ నుంచే నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తోందని, దీంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని పేర్కొన్నారు. కుగ్రామంగా ఉన్న మాదాపూర్ను తానే ఐటీ హబ్గా తీర్చిదిద్దానన్నారు. బిల్క్లింటన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి.. మైక్రోసాఫ్ట్ కంపెనీని నెలకొల్పడంతో మిగిలిన కంపెనీలు వరుస కట్టాయన్నారు. కాగా ఓటుకు కోట్లు దెబ్బతో చంద్రబాబు హైదరాబాద్ వదిలి పరారయ్యారని, ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారిందని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
గ్రేటర్ వార్ 28th January 2016
-
గ్రేటర్ వార్ 27th January 2016
-
గ్రేటర్ వార్ 26th January 2016
-
గ్రేటర్ వార్ 25th January 2016
-
గ్రేటర్ వార్ 24th January 2016
-
గ్రేటర్ వార్ 22nd Janaury 2016
-
గ్రేటర్ వార్ 21st January 2016
-
గ్రేటర్ వార్ 20th January 2016
-
గ్రేటర్ వార్ 19th January 2016
-
గ్రేటర్ వార్ 18th January 2016
-
ఇప్పటివరకు 114 నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 114 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఆయన సోమవారమిక్కడ వెల్లడించారు. ఇంకా 23 వార్డులకు సంబంధించి వివరాలు అందలేదని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, ముగ్గురు సంతానం ఉన్నవారి నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ తెలిపారు. మరోవైపు 126వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అధికారులు నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కాగా 1-6-1994 నాటికి ముగ్గురు పిల్లలు ఉంటే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. -
గ్రేటర్ వార్ 17th January 2016
-
టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా
-
గ్రేటర్.. పవర్
కార్పొరేషన్ ఆఫీస్కు సంప్రదాయేతర విద్యుత్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి తడిచెత్తకు తోడుగా సౌర శక్తి మరిన్ని ప్లాంట్ల ఏర్పాటు దిశగా ‘గ్రేటర్ వరంగల్’ ప్రయత్నాలు హన్మకొండ : రాష్ట్రంలోనే తొలిసారిగా సంప్రదాయేతర విద్యుత్తో నడిచే కార్యాలయంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఖ్యాతి పొందింది. నిత్యం నగరం నుంచి వెలువడే తడి చెత్త, ప్రకృతి నుంచి ఉచితంగా లభించే సౌరశక్తి సాయంతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ కార్యాలయ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వీధి దీపాలు వెలిగించే దిశగా మరో ప్రయోగానికి కూడా కార్పొరేషన్ సిద్ధమవుతోది. మూడు అంతస్తులు ఉన్న గ్రేటర్ వరంగల్ కార్యాలయానికి సగటున నిత్యం 70 కిలోవాట్ల విద్యుత్తు అవసరం. ఇందులో 51 కిలోవాట్ల విద్యుత్ను సౌరశక్తి, తడిచెత్త ఆధారిత విద్యుత్ ప్లాంట్ ద్వారా కార్యాలయ ప్రాంగణంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. వరంగల్ నగర పాలక సంస్థ భవనంపై 2013 ఆగస్టులో రూ. 48 లక్షల వ్యయంతో సోలార్ యూనిట్ నెలకొల్పారు. దీని నుంచి 27 కిలోవాట్ల విద్యుత్ఉత్పత్తి అవుతోంది. తాజాగా 2015 డిసెంబరు 5 నుంచి కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మిం చిన బయోగ్యాస్ ప్లాంట్ పని చేయడం ప్రారంభించింది. దీనినుంచి 24 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు పద్ధతుల్లో ఉత్పత్తి అయిన 51 కిలోవాట్ల విద్యుత్తుతో మూడు అంతస్తులు గల కార్పొరేషన్ కార్యాల యంలోని 104 ఫ్యాన్లు, 232 ట్యూబ్లైట్లు, 83 డీఎస్ఎల్, 11 వాట్ ఎల్ఈడీ బల్బ్స్, ఒక వాటర్ కూలర్, 54 కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 31 ఏసీలకే సంప్రదాయ విద్యుత్ ఉపయోగిస్తున్నారు. డిమాండ్ లేనప్పుడు ఉత్ప త్తి అయ్యే సౌర, తడిచెత్త ఆధారిత విద్యుత్ను గ్రిడ్కు పంపిం చేందుకు నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేశారు. తగ్గిన కరెంటు బిల్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయూనికి సగటున ప్రతీనెల రూ.1.10 లక్షల కరెంటు బిల్లు వచ్చేది. కానీ, 27 కేవీ సోలార్ పవర్ యూనిట్ అందుబాటులో వచ్చిన తర్వాత బిల్లు ఒక్కసారిగా రూ.60 వేలకు పడిపోయింది. తాజాగా 24 కేవీ తడిచెత్త విద్యుత్తు అందుబాటులోకి రావడంతో ప్రతీనెల కరెంటు బిల్లు రూ.20 వేల కు కిందకు పడిపోనుంది. పైగా నెట్మీటర్ అందుబాటులోకి వస్తే ఈ బిల్లు కూడా మరింత తగ్గుతుంది. మరిన్ని తడిచెత్త ప్లాంటు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటుకు రెండేళ్ల కిందట గ్రేటర్ అధికారులు రూపకల్పన చేశారు. ఇందులో ఒక టన్ను తడిచెత్త సామర్థ్యంతో 2013లో బాలసముద్రంలో రూ.13.75 లక్షల వ్యయంతో తొలి తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ ప్లాంటు ఏర్పా టు చేశారు. ఈ ప్లాంటు నుంచి 12 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను సమీపంలో ఉన్న చిల్డ్రన్స్పార్కులో 70 లైట్లతో పాటు మూడు 5 హెచ్పీ మోటార్లకు ఉపయోగిస్తున్నారు. కార్పొరేషన్ ఆవరణలో రెండు టన్నుల చెత్త 24 కేవీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండో ప్లాంటు సైతం విజయవంతంగా పనిచేస్తోంది. ప్రతీరోజు నగరంలో నిత్యం 40 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం మూడు టన్నుల చెత్త ఈ రెండు ప్లాంట్లకు వెళ్తుంది. మిగిలిన చెత్త డంపింగ్ యార్డు చేరుతోంది. దీంతో నగరంలో కనీసం పది చోట్ల తడి చెత్త ఆధారిత విద్యుత్ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వీధి దీపాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తద్వారా పరిశుభ్రతతో పాటు ఏకకాలంలో కాలుష్య, వ్యయ నియంత్రణ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. -
గ్రేటర్ వార్ 16th January 2016
-
90 టీడీపీ...బీజేపీ 60?
-
90 టీడీపీ...బీజేపీ 60?
హైదరాబాద్: బీజేపీ- టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు ఖరారైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తం 150 డివిజన్లకు గాను 60 సీట్లు బీజేపీ, 90 చోట్ల టీడీపీ పోటీ చేయటానికి అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రెండు పార్టీల నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేయటానికి ఆదివారం తుది గడువు కావటంతో ఈ రోజు రాత్రికే అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో వెలువడే అవకాశం ఉంది. పొత్తుపై ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించనున్నాయి. కాగా సీట్ల పంపకాలపై గత రెండు రోజులుగా ఇరు పార్టీ నేతలు ఎగతెగని చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. దీంతో శనివారం ఉదయం మరోసారి టీడీపీ-బీజేపీ నేతలు సమావేశమై పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు. -
పిలిస్తే ఎవరైనా హైదరాబాద్ వస్తారు..
న్యూఢిల్లీ: సంక్రాంతి రైతుల పండుగ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పూర్వీకుల సంప్రదాయాలను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్య పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మతత్వ శక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీని అడ్డుకునేది బీజేపీనే అని అన్నారు. కేంద్రం సహకారంతోనే నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి వివక్ష లేదని, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రావడం లేదని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పిలిస్తే ఎవరైనా హైదరాబాద్ వస్తారని వెంకయ్య అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రధాని తెలంగాణపై వివక్ష చూపుతున్నారనడంలో అర్థం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల తరలింపుపై రైల్వేశాఖ ముందుగా దృష్టి పెడితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. -
అబద్ధాల యూనివర్శిటీకి వీసీగా కేసీఆర్
హైదరాబాద్: అబద్ధాల విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను వీసీగాను, ప్రొఫెసర్లుగా ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితను నియమించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి, టీఆర్ఎస్ ఆకర్ష్ పథకంపై నిన్న విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలో 35 కార్పొరేటర్ స్థానాల్లో 25 గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పూటకో మాటను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని, తెలంగాణ తెచ్చింది తామేనని, కృష్ణా, గోదావరి జలాలు మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనే మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. -
గ్రేటర్ వార్ 14th January 2016
-
కొత్త ఓటర్లు 3.83 లక్షలు
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 3,83,530 మంది ఓటర్లుగా నమోదయ్యారని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 70,67,934 మంది ఓటర్లుండగా, కొత్త ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 74,51,464కు చేరుకుందని చెప్పారు. పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులను సరిగ్గా లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
పొలిటికల్ పతంగి
మార్కెట్లో రాజకీయ పతంగుల హల్చల్ ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్, మోదీ కైట్స్ ఎన్నికల ప్రచారానికి వేదికగా వయ్యారి గాలిపటం! హైదరాబాద్: పద పదవే వయ్యారి గాలి పటమా... ఓట్ల వేటకు బయలు దేరుదామా.. గ్రేటర్ ఎన్నికల వేళ గల్లీ గల్లీలో ఇదే మన చిరునామా.. గెలుపు కోసం ఇద్దాం ఏదో ఒక నజరానా! పద పదవే వయ్యారి గాలి పటమా... ...అంటూ మన హైదరాబాద్ సిటీ నేతలు ఇప్పుడు పతంగుల పాటలు పాడుతున్నారు. వాటితో ఆటలు ఆడుతున్నారు. కార్యకర్తలతో ఆడిస్తున్నారు. ఎన్నికల వేళ ఏ అవకాశాన్ని వదులుకోని మన రాజకీయ నేతలు ఇప్పుడు పతంగుల సీజన్ను మస్తుగా వినియోగించుకుంటున్నారు. సాధారణంగా నగరంలో సంక్రాంతి సీజన్లో ఆకాశ మంతా రంగురంగుల పతంగులే కన్పిస్తాయి. నగర వాసి సంప్రదాయ జీవనంలో పతంగులకు మంచి ప్రాముఖ్యత ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ సంక్రాంతి సీజన్లో సందడి చేస్తారు. నగరంలో ఏటా కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ముఖ్యంగా యువతపై కన్నేశారు. వారికి అవసరమైన పతంగుల సామగ్రిని అందుబాటులోకి తెస్తున్నారు. పతంగులు ఆడుతూనే... పార్టీ ప్రచారంలో పాల్గొనాలని చెబుతున్నారు. పతంగులపై ఆయా పార్టీల గుర్తులు, ముఖ్యనేతల చిత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఈ వరుసలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ముందున్నాయి. ఈ పార్టీల పతంగులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఇక ప్రచార ఆర్భాటంలో నువ్వా..?నేనా..? అన్నట్టుగా పోటీపడే ఆయా పార్టీల నేతలు పొలిటికల్ పతంగుల కొనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో కైట్స్ వ్యాపారం జోరుమీదుంది. ‘సయ్యాట’ కూడా ప్రచారమే... ఇంటింటికి తిరిగి పార్టీల తరఫున ప్రచారం నిర్వహించడం మామూలే. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుండటంతో సామాజిక మాధ్యమాలను విరివిగా వాడేస్తున్నారు. ఏం చేసినా.. అంతిమ లక్ష్యం గెలవడమే అనుకునే నేతల నాడిని పసిగట్టారు వ్యాపారులు. సంక్రాంతికి భారీ స్థాయిలో కొనుగోలు అయ్యే పతంగులకు పొలిటికల్ కలర్ ఇచ్చారు. అంతే తమ నేతల ఫొటోలు, పార్టీ కలర్, గుర్తులతో ముద్రించిన పతంగులను కొనుగోలు చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా, ఆకాశంలో చూసినా తమ పార్టీ పతంగులే ఉండాలన్న ఉద్దేశంతో చాలా మంది కొనుగోలు చేసి తమ ఆత్మీయులకు, కార్యకర్తలకు కూడా పంచుతున్నారట. ‘ఇంటింటికి ప్రచారం చేసినట్టుగానే ఈ పతంగులతో కూడా మంచి పబ్లిసిటీ వస్తోంది. కింది నుంచి ఆకాశంలోకి ఎగిరే ఈ కైట్ల వల్ల ఎన్నికల జోష్ కనబడుతుంది. మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటింగ్కు క్యూ కడతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా రాజకీయాలపై ఓ ఐడియా వస్తుంద’ని అంటున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్ కైట్స్... తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటోలు ముద్రించిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నరేంద్ర మోదీ ఫొటోతో ఉన్న కైట్స్ కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. పసుపు రంగుతో కూడిన టీడీపీ పతంగులు, కాంగ్రెస్ పార్టీ గుర్తు కలిగిన కైట్స్ కూడా కొన్నిచోట్ల లభిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ గుర్తు కైట్ కావడంతో ఆ పార్టీ కలర్ పోలిన పతంగులు కూడా భారీగానే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే కేసీఆర్, మోదీ కైట్స్ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ కైట్ ఒక్కోటి రూ.15 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతున్నాయి. ఒకేసారి బల్క్గా డజన్లకొద్దీ కైట్లు కొనుగోలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది పార్టీ నాయకులే ఉంటున్నారు. ‘కేసీఆర్, మోదీ కైట్స్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మిగతా పార్టీలవి కూడా బాగానే అమ్ముడవుతున్నాయ’ని చెబుతున్నారు పతంగుల విక్రేత జాకీర్ హుస్సేన్. పొలిటికల్ పతంగ్ ఈవెంట్ అన్ని పార్టీల పతంగులతో గగనంలో రాజకీయ సయ్యాట(ఈవెంట్) నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇందుకోసం సరైన వేదిక కోసం వెతుకుతున్నాం. మేం నిర్వహించే ఈ పొలిటికల్ పతంగుల ఈవెంట్ రాజకీయ హడావుడితో పాటు ఓటు ప్రాధాన్యతను తెలిపేలా ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై అవగాహన ఉండాలి. అలా అయితేనే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రాగలుగుతారు. పిల్లలకు ఇలాంటి ఈవెంట్ల ద్వారానైతే ఆసక్తిగా మన లక్ష్యాన్ని వివరించవచ్చు. - పవన్, ద క్లాస్ టెక్నాలజీస్, రామంతాపూర్ -
లక్ష టన్నులు - ఐదేళ్లలో ఈ- వ్యర్థాలు
- కొండలా పేరుకు పోనున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు హైదరాబాద్: ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మహానగరం.. అంతే మొత్తంలో ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే డ్రైనేజీ, కాలుష్యం, నీటి ఎద్దడితో సతమతమవుతున్న భాగ్యనగరికి ఈ-సమస్య గుదిబండలా మారింది. ఐటీ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్లు, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు భాగ్యనగరాన్ని ఈ-వేస్ట్కు అడ్డాగా మార్చేస్తున్నాయి. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలోనే ముంబై అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత ఐదో స్థానంలో మన మహానగరమే నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతుండగా.. గ్రేటర్లో 45 వేల టన్నులు పేరుకుపోతోంది. ఇందులో సుమారు 55 శాతం పర్యావరణానికి హాని కలిగించేవి ఉన్నాయని, సాధారణ చెత్తతో పాటే వీటినీ పడేస్తుండడంతో అనర్థాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఐదేళ్లలో నగరంలో ఈ-వ్యర్థాలు ఏటా లక్ష టన్నులు పోగయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఇళ్ల నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ-వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయని ‘గైడ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సిటీలో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏటా 12 వేల టన్నుల వ్యర్థాలు విడుదలవుతుండగా.. టెలిఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు.. తదితర ఈ-వ్యర్థాలు మరో 33 వేల టన్నులు ఉత్పత్తవుతున్నాయి. -
ఈ సిటీ ఎన్నో ఇచ్చింది..
హైదరాబాద్ తనకు సెలబ్రిటీ స్టేటస్ ను ఇచ్చిందని టెన్సిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సానియాతో ముచ్చటించిన 'సాక్షి'తో నగరంపై తనకున్న ప్రేమను పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే.. 'ఈ మహానగరంతో నా జీవితం ముడిపడి ఉంది. నా స్కూలింగ్, కాలేజీ, స్పోర్ట్స్ లైఫ్ అన్నీ హైదరాబాద్లోనే సాగాయి. నేను పక్కా హైదరాబాదీని. నగర వాతావరణమంటే చాలా ఇష్టం. నేను సాధించిన ప్రతి విజయంలోనూ నగరం వెన్నంటి ఉంది. ప్రతి న్యూ ఇయర్ వేడుకలకు సిటీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సిటీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మా నాన్న నన్ను ఒక సెలబ్రిటీలా చూడాలనుకున్నారు. అందుకే అందరిలా ఇల్లు, చదువు, పెళ్లి అనే కాన్సెప్ట్తో నన్ను పెంచలేదు. మెట్రోసిటీగా అవతరించిన హైదరాబాద్ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ సిటీలో నేనూ భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది'. -
కొత్వాల్ 2 కమిషనర్
- పురపాలన కూడా పోలీస్ బాస్ చేతుల్లోనే - 1902లో బడ్జెట్ రూ.82 వేలే - కానిస్టేబుల్ జీతం ఆరు రూపాయలు - కొత్వాల్ టు కమిషనర్ క్రమంలో ఎన్నో మార్పులు నగర పరిపాలన, పురపాలనకు ఆద్యుడు అప్పటి కొత్వాలే... నిజాం హయాంలో హైద్రాబాద్ భద్రత మొత్తం ఆయనకే కట్టపెట్టారు. శాంతిభద్రతలతో పాటు ప్రజాపాలన కూడా కొత్వాల్ చేతులమీదుగానే సాగింది. ఆయన చేసిందే చట్టం, చెప్పిందే వేదం... 1847 నాటికి హైదరాబాద్.. గోల్కొండ నుంచి శివారు ప్రాంతాలకు విస్తరించింది. దీంతో శాంతిభద్రతల పర్యవేక్షణకు ‘కొత్వాల్’ను నియమించారు. నిజాంకు అతను జవాబుదారీగా ఉండేవాడు. పోలీస్ బాస్ ఏం చెబితే అదే చెల్లుబాటయ్యేది. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారిని ఈ స్థానంలో నియమించేవారు. విదేశీయులు కూడా నగర పోలీసు విభాగంలో పనిచేసేవారు. నిఘా కోసం డిటెక్టివ్స్ను పెట్టి శాంతిభద్రతలు, సమస్యలు తెలుసుకునేవారు. నిజాంకు గూఢచారి కొత్వాల్కు శాంతిభద్రతలు, న్యాయ, సాధారణ పాలనాధికారాలు అప్పగించారు. బ్రిటిష్ సేనల కదలికపై నిఘా కూడా ఆయన బాధ్యతే. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియమించిన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఆఖరి కొత్వాల్. గద్వాల్, వనపర్తి సంస్థానాల మధ్య విభేదాల్ని తొలగించడంలో కీలక పాత్ర పోషించారు. కానిస్టేబుల్ జీతం ఆరు రూపాయలు అప్పట్లో పోలీస్ స్టేషన్లను ఠాణాలుగా పిలిచేవారు. వీటిని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షించేవాడు. ఏసీపీలను మదద్గార్ కొత్వాల్, డీసీపీలను నైబ్కొత్వాల్ అనేవారు. హెడ్-కానిస్టేబుల్ని జమేదార్, హెడ్-కానిస్టేబుల్ను (రైటర్) మెహ్రెరెగా వ్యవహరించేవారు. కానిస్టేబుల్ను మొదట్లో బర్ఖందాజ్ అని తర్వాత జవాన్గా పిలిచేవారు. 1902లో కానిస్టేబుల్ జీతం రూ.6లు. నగరం దాటి విధులు నిర్వర్తిస్తే.. రెండు అణాలు అలవెన్స్గా ఇచ్చేవారు. పురానీ హవేలీలో కొత్వాల్ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం సౌత్జోన్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలు అక్కడే కొనసాగుతున్నాయి. అప్పట్లో నగర పోలీసు విభాగంలో 1,542 మంది పదాతి దళం (ఫుట్ ఫోర్స్), 136 మంది అశ్వికదళం (మౌంటెడ్ పోలీస్) ఉండేవి. సంవత్సర బడ్జెట్ రూ.82,364గా ఉండేది. 1955లో పూర్తి మార్పులు 1955లో నగర పోలీసు వ్యవస్థలో పూర్తి మార్పులు చేశారు. మద్రాస్ నగర పోలీసు విధానాల్ని అమలుచేశారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్ను వేరుచేశారు. హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీస్కి బదిలీ అవడంతో చాలా మార్పులు జరిగాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్లు కిందిస్థాయి సిబ్బందితో పెట్రోలింగ్ చేసేవారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లా అండ్ ఆర్డర్, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు. పోలీసు బలగం 10 వేలు పరిపాలనా సౌలభ్యం కోసం నగర కమిషనరేట్ను నాలుగు సబ్ డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేశారు. 1981లో కమిషనరేట్లో మళ్లీ మార్పులు చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లుగా విభజించడంతో పాటు 12 సబ్-డివిజన్లుగా మార్చారు. జోన్కు డీసీపీలు, సబ్-డివిజన్కు ఏసీపీలను అధికారులుగా చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల్ని నియమించారు. తొలిసారి డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (ప్రస్తుత సీసీఎస్) అమల్లోకి వచ్చింది. 1992లో సంయుక్త పోలీసు కమిషనర్ల ఏర్పాటు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం నగర పోలీసు కమిషరేట్లో ఒక కమిషనర్, అదనపు కమిషనర్లు, ఆరుగురు సంయుక్త పోలీసు కమిషనర్లతో పాటు 15 మంది డీసీపీలు ఉన్నారు. పదుల సంఖ్యలో ఏసీపీలు, వందల సంఖ్యలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో సహా దాదాపు పది వేలమంది హైదరాబాద్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏటా సిటీ పోలీస్ కమిషనరేట్ బడ్జెట్ రూ.100 కోట్ల పైనే ఉంది. -
గ్రేటర్ వార్ 13th January 2016
-
గ్రేటర్ వార్ 12th January 2016
-
గ్రేటర్ వార్..!
-
గ్రేటర్ వార్
-
'వాళ్లు నాయకుల్ని ఆకర్షిస్తే.. మేం ప్రజల్ని ఆకర్షిస్తాం'
నాగోలు(హైదరాబాద్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తామని నల్లగొండ ఎంపీ, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాయమాటలను నమ్మి నగర ప్రజలుమోసపోవద్దని పిలుపునిచ్చారు. మెట్రోరైలు, కష్ణాజలాలు, అనేక అభివద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్లతో కలిసి గుత్తా సోమవారం ఎల్బీనగర్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తోందని, గత ఎన్నికలలో టీఆర్ఎస్కి పోటీ చేసే అభ్యర్థులే లేరని అధికారంలోకి రాగానే ఆకర్ష్ ఆపరేషన్ ద్వారా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటోందని విమర్శించారు. 'టీఆర్ఎస్ నాయకులను ఆకర్షిస్తే మనం ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిద్దాం' అని కార్యకర్తలకు చెప్పినట్లు గుత్తా పేర్కొన్నారు. బీజేపీగానీ, ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి చేసిన ఘనత ఏమీ లేదని ఎద్దేవాచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 స్థానాలను కాంగ్రెసే కైవసం చేసుకుంటుందన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. -
TARGET గ్రేట్ ఓటింగ్!
ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్ఎంసీ వ్యూహం గత ఎన్నికల కంటే మెరుగవ్వాలని ఆదేశాలు చైతన్య, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే రెట్టింపు శాతం పోలింగ్ నమోదు చేయాలని టార్గెట్ విధించుకుంటోంది. 2009 ఎన్నికల్లో 43 శాతం, 2002లో మరీ తక్కువగా 28 శాతం మందే ఓటేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని భావిస్తున్నారు. విద్యావంతులు, సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఓటింగ్లో పాల్గొనక పోవడం, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో సమాచారం లేకపోవడం, ఓటరు చైతన్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించక పోవడం వల్లే ఓటింగ్ శాతం తగ్గుతోందని అధికారులు గుర్తించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలుతో పాటు ఎన్నికల వ్యయం, ఓటింగ్ శాతం పెంపొందించడంపై సోమవారం జీహెచ్ఎంసీ ఆఫీసులో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటింగ్ శాతంపై ప్రధానంగా దృష్టిని సారించనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. తొలిసారిగా స్వయం సహాయక మహిళలకు అవగాహన జీహెచ్ఎంసీ పరిధిలోగల సుమారు 44,280 స్వయం సహాయక బృందాలలో దాదాపు 4 లక్షల 50 వేల మంది మహిళా సభ్యులున్నారు. ఓటింగ్ శాతం పెంపుతో నగర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెంపు, పౌర సేవలు మరింత మెరుగు తదితర అంశాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని కమిషనర్ నిర్ణయించారు. సర్కిల్స్ వారిగా వెంటనే సమావేశాలు నిర్వహించి ఓటరు చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని యూసీడీ విభాగం అదనపు కమిషనర్ భాస్కర్ను ఆదేశించారు. దీంతో పాటు అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని డిగ్రీ వృత్తి విద్యా కళాశాలలను సందర్శించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారం ఓటింగ్ శాతం పెంచేందుకు స్వచ్ఛంద సంస్ధలు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు విడతలుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, హోర్డింగ్ల ద్వారా పెద్దఎత్తున ఓటరు చైతన్య కార్యక్రమాల ద్వారా గణనీయంగా ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టారు. తక్కువ ఓటింగ్ కేంద్రాలపై దృష్టి గత జీహెచ్ఎంసీ, సాధారణ ఎన్నికల సందర్భంగా అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయిన ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ నిర్ణయించారు. ప్రధానంగా నగరంలో విద్యాధికులు, సంపన్న వర్గాలు అధికంగా ఉండే సెంట్రల్, వెస్ట్ జోన్లోనే పలు వార్డుల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీల సహాయ సహకారాలు పొందాలని అధికారులకు సూచించారు. 100 శాతం ఓటర్లకు పోల్ చిట్టీలు గ్రేటర్ పరిధిలోని ప్రతి ఓటరుకు కచ్చితంగా పోల్చిట్టీలు అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకుగాను పోల్చిట్టీలు, ముద్రణ బుధవారంలోగా పూర్తి చేసి వెంటనే ఇంటింటికీ పంపిణీ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ పోల్ చిట్టీలు పంపిణీ చేయడం వల్ల... ఓటరు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత తదితర వివరాలు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దీని వల్ల సమయం వృథా కాకుండా ఓటర్లు పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, జీహెచ్ఎంసీ ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపర్చడంతో పాటు తొలిసారిగా ఓటరు స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. -
Wanted బహుబలి
‘బలమైన’ స్థానిక నేతల కోసం వెతుకులాట ♦ సామాజిక, ఆర్థిక బలాలపై లెక్కలు ♦ 50 డివిజన్లలో బలవంతుల కోసం‘ కార్డన్ సెర్చ్’ బహుబలి.. కండలు తిరిగిన వీరుడు. ఆ సినిమా ఓ సంచలనం. ఆ పాత్ర పెద్ద హిట్... ఇక్కడ సీన్ మారింది. మన నేతలు ఎన్నికల్లో అన్ని విధాలా నెగ్గుకొచ్చే బహుబలుల కోసం వెదుకుతున్నారు. బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. ‘కండ..అండ..ఆర్థిక..సామాజిక.. ఇలా బహుబలాలు ఉన్నవాడే ‘కార్పొరేటర్’కు క్వాలిఫైడ్. అతనే మన పార్టీకి గెలుపుసాధించే ‘బహుబలి’. వెదకండి...పార్టీ నుంచి టికెట్ ఇద్దాం. గెలుపునకు బాటలు వేద్దాం’ అంటూ ప్రధాన రాజకీయ పక్షాలు బలమైన అభ్యర్థులను వెదుకుతున్నాయి. ‘బహుబలి’ని వెదికి పట్టండంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. కనీసం 50 డివిజన్లలో అలాంటి వారినే నిలపాలని భావిస్తున్నాయి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున వ్యక్తుల విషయంలోనూ పట్టింపులు వద్దంటున్నాయి. ‘కేసులు, గీసులు తర్వాత చూద్దాం..గెలిచే వారినే ఎంపిక చేద్దాం’ అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పోస్ట్కు తప్పనిసరిగా గెలిచే అభ్యర్థులనే నిలపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లాలని చూస్తున్నాయి. ‘కండ బలం ఉన్న నాయకులు కావాలి. వీరికి స్థానికంగా సామాజిక, ఆర్థిక బలాలుంటే మరీ మంచిది.. చదువు, నేర చరిత్రలను కాసేపు పక్కన పెట్టేయ్..మనం గెలవటమే ఏకైక లక్ష్యం..అందుకే రాజకీయ శత్రువుని ఎలాగైనా ఓడించే బహుబలిని వెంటనే వెతకండి’ అంటూ ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నాయి. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లకు గానూ రిజర్వేషన్ల మూలంగా సుమారు 50 స్థానాల్లో తమ అంచనాలకు తూగే అభ్యర్థులు సొంత పార్టీలో కనిపించటం లేదు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలందరికీ పార్టీ ముఖ్యనేతలు గెలిచే అభ్యర్థిని ఎంపిక చేసి, గెలిపించుకు రావాలన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా ఈ మారు బరిలోకి దింపే కసరత్తును ప్రధాన పార్టీలు చేస్తున్నాయి. మరో వైపు జంట పోలీస్ కమిషనరేట్లలో ఉన్న సుమారు 1500 మంది రౌడీషీటర్ల సేవలను సైతం వినియోగించుకునేందుకు ఆయా పార్టీలు పక్కా స్కెచ్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. బలాలపై బేరీజు కండ పుష్టి, సంబంధిత డివిజన్లో వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏ మేరకు ఉన్నాయి, అభ్యర్థి సొంతంగా ఏ మేరకు ఖర్చు చేయగలడన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుం దని, ఆ మేరకు సంబంధిత అభ్యర్థి ఆదాయ వ్యయాలను అంచనా వేస్తున్నారు. పాతబస్తీలో ముప్పైకి పైగా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు కార్పొరేటర్లకు తాజా రిజర్వేషన్ సైతం అనుకూలంగా రావటంతో ఈ మారు పోటీకి సిద్ధమవుతున్నారు. సచ్చీలురనే ఎంపిక చేయండి: ఎలక్షన్ వాచ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు సచ్చీలురైన అభ్యర్థులనే పోటీలో నిలపాలని ‘ఎలక్షన్ వాచ్’ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థలు అన్ని రాజకీయపక్షాలకు లేఖలు రాశాయి. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అత్యధిక కేసులున్న వారికి టికెట్లు ఇవ్వగా తర్వాత స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఎంబీటీ పార్టీలున్నాయి. ఈ మారు మాత్రం నేర చరిత్ర లేని అభ్యర్థులతో పాటు స్థానికంగా నివాసం ఉండటం, విద్యార్హత, యాభై ఏళ్ల లోపు వయసు ఉన్న వారికే టికెట్లు ఇవ్వటం వల్ల స్థానిక పాలనలో ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఈ లేఖలను ఎన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకుంటాయనేది సందేహమే. నేరచరితులకు టికెట్లిస్తే... ఆఫీస్ల ముందు బైటాయిస్తాం అసెంబ్లీ, లోక్సభలకు వెళ్లే దిశగా తొలి మెట్టు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల్లో నేర చరితులకు టికెట్లు ఇవ్వకుండా చేయగలిగితే చట్ట సభల్లోనూ వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది. అందుకే అన్ని పార్టీలు నేరస్తులకు టికెట్లు ఇవ్వొద్దు. పౌర సమాజం అభ్యర్థనకు భిన్నంగా వ్యవహరించే పార్టీల కార్యాలయాల ముందు మేం బైటాయించి నిరసన వ్యక్తం చేస్తాం. మంచి వ్యక్తులను పాలకులను చేసేందుకు ప్రజలూ చొరవ చూపాలి. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ 2009లో గెలిచిన కార్పొరేటర్లలో కేసులున్న వారు పార్టీ కార్పొరేటర్ల సంఖ్య ఎంఐఎం 16 టీడీపీ 09 కాంగ్రెస్ 08 బీజేపీ 02 ఎంబీటీ 01 -
70 శాతం పోలింగ్ లక్ష్యంగా...
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 70 శాతం పోలింగ్ జరగాలన్నదే మా సుపరిపాలన వేదిక లక్ష్యం. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 శాతమే ఓటేశారు. ఈ సారి ఓటింగ్ శాతం పెంచేందుకు 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాడవాడలా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాం. ఈ సారి ఎన్నికల్లో నేరచరితులకు, బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వరాదని మేము అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్ -
నీవిక్కడుంటే... నేనక్కడుంటా
'నీవిక్కడుంటే..నేనక్కడుంటా...'అంటూ మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల వేళ...గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఓ ఒప్పందం గురించి వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. శుక్రవారం తార్నాక డివిజన్లో పర్యటించిన ఆయన..గత ఎన్నికల సమయంలో తాను, మంత్రి పద్మారావులు ఓ రహస్య ఒప్పందాన్ని అమలు చేశామని, అదే 'నీవిక్కడుంటే... నేనక్కడుంటా' అంటూ సెలవిచ్చారు. అందులోని పరమార్ధాన్ని ఇలా వివరించారు...'2014 సార్వత్రిక ఎన్నికల ముందు..అన్నా నువ్వు టీఆర్ఎస్ పార్టీ ద్వారా సికింద్రాబాద్లో ఉండు...నేను తెలుగుదేశం పార్టీ ద్వారా సనత్నగర్లో ఉంటాను...ఇద్దరం ఎవరి నియోజకవర్గాన్ని వారు అభివృద్ధి చేసుకుందాం అని పద్మారావుకు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఇద్దరం గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే తాము బదురుకున్నాం' అని తలసాని స్వయంగా తెలపడంతో సభలో నవ్వులు విరిశాయి. సేవ చేసే ఉద్దేశం ఉన్న మాకు గెలిచే అవకాశం కూడా ఉండాలనే ఇలా చేశామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. -
గతమెంతో ఘనం.. పురపాలనం
1869 వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరే మున్సిపల్ కమిషనర్గా, మేజిస్ట్రేట్గా సర్వాధికాధికారిగా ఉండేవారు. 1869లో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు, చాదర్ఘాట్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో నాలుగు, చాదర్ఘాట్ బోర్డులో ఐదు డివిజన్లు ఉండేవి. అప్పట్లో విస్తీర్ణం 55 చ.కి.మీ. మాత్రమే. జనాభా 3.50 లక్షలు. 1886లో చాదర్ఘాట్ మున్సిపల్ బోర్డు పూర్తిస్థాయి మున్సిపాలిటీగా మారింది. 1934 తొలిసారి ఓటుహక్కు వినియోగం: హైదరాబాద్ మున్సిపాలిటీలో చాదర్ ఘాట్ను 1933లో విలీనం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్కు చేసి ‘కార్పొరేషన్’ హోదా కల్పించారు. 1934లో హైదరాబాద్కు తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. నేతల మధ్య విభేదాలతో 1942లో హైదరాబాద్కు కార్పొరేషన్ హోదా రద్దు చేశారు. 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. 1950లో అమల్లోకి వచ్చిన హైదరాబాద్ యాక్ట్తో హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్లో విలీనం చేశారు. 1960 ‘ఎంసీహెచ్’గా మార్పు: 1960, ఆగస్టు 3న జంటనగరాల కార్పొరేషన్లు విలీనమై ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్’ (ఎంసీహెచ్)గా అవతరించింది. ఆ సమయంలో నగర విస్తీర్ణం 73 చ.కి.మీ. కార్పొరేషన్ బడ్జెట్ రూ. 1.5 కోట్లు. 2005 నాటికి వంద డివిజన్లతో 179 చ.కి.మీ. విస్తరించింది. బల్దియా బడ్జెట్ రూ. 400 కోట్లకు పెరిగింది. 2007 జీహెచ్ఎంసీ అవతరణ: నగర పరిపాలన విస్తీర్ణం పెంచాలని నిర్ణయించి 2007 ఏప్రిల్ 16న శివార్లలోని 12 మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)గా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీకి 2009 నవంబర్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. -
ఏడోసారి ఎన్నికలు..
6 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 5 సార్లు, జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక ఒకసారి కలిపి మొత్తం 6 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు విలీనమై ఎంసీహెచ్గా అవతరించినప్పటి నుంచి ఎంసీహెచ్ అంతరించే వరకు ఐదు సార్లు, జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక ఒక పర్యాయం వెరసి ఇప్పటి వరకు మొత్తం ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి నాలుగేళ్లకోమారు 1968 వరకు ఎన్నికలు జరగ్గా, 1968 తర్వాత పద్దెనిమిదేళ్ల వరకు (1986) జరగలేదు. 1986 నుంచి 2002 వరకు 16 సంవత్సరాలు ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోలేదు. -
ఫ్లాష్ బ్యాక్ - న్యూ లుక్
అప్పుడలా.. ఇప్పుడిలా.. మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి పాతికేళ్లలో అయితే ఊహించని రీతిలో మార్పులు జరిగిపోతాయి. ఇలాంటిదానికి ఉదాహరణ ఈ చిత్రం. 1991లో తీసిన ఈ ఫొటోలో కనిపిస్తున్నవి హైదరాబాద్ను పాలించిన కుతుబ్షాహీల సమాధులు. గోల్కొండ సమీపంలో ఉన్న వీటిని ‘కుతుబ్షాహీ టూంబ్స్’గా పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఈ మార్పులకు నిదర్శనం ఈ చిత్రం. -
FRIENDLY ఇండియన్స్
నగరంలో 'ఆంగ్లో ఇండియన్స్'కు ఓ ప్రత్యేకత ఉంది. భాష, ఆహార్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో సమ్మిళిత సంస్కృతికి ప్రతినిధులు వీరు. జీవన విధానంలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది.. వారు ఎక్కడ ఉంటే అక్కడ 'లిటిల్ ఇంగ్లండ్' ఆవిష్కారమవుతుంది. రెండు భిన్న జాతుల సహజీవనానికి ప్రతీకలుగా 200 ఏళ్లకు పైగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఒకప్పటి బ్రిటన్ పూర్వీకులకు వారసులుగా ఇక్కడే పుట్టి పెరిగిన వీరు.. భాగ్యనగర జీవనంలో అంతర్భాగమయ్యారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆంగ్లో ఇండియన్స్పై 'సాక్షి' ప్రత్యేక కథనం.. ఒక సికింద్రాబాద్ - ఒక ఇంగ్లండ్, నిజమే.. ఇది ఇప్పటి సంగతి కాదు. వందల ఏళ్ల నాటి చరిత్ర. నిజాం సంస్థానంలో సైనిక పటాలాలు, పరిపాలన కార్యాలయాలు, నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డ ఆంగ్లేయులతో సికింద్రాబాద్ ఇంగ్లండ్ను తలపించేది. ఆంగ్లేయుల పేరుతో వెలసిన 'జేమ్స్ స్ట్రీట్' వంటి బస్తీలు, ప్యారడైజ్లు, ప్యాట్నీలు ఆ సంస్కృతికి ప్రతిబింబాలు. తెల్లవాళ్ల విలక్షణమైన జీవన విధానం, భాష, దుస్తులు, అలంకరణ ఇక్కడి వారిని బాగా ప్రభావితం చేసింది. ఇక్కడి ప్రజల జీవన విధానంతో బ్రిటీష్ వారు కూడా ప్రభావితమయ్యారు. అలా సికింద్రాబాద్ ఒక సమ్మిళిత సంస్కృతికి కేంద్రబిందువైంది. బొల్లారం నుంచి మెట్టుగూడ వరకు, అల్వాల్ నుంచి లాలాగూడ వరకు కంటోన్మెంట్, పౌర ప్రభుత్వ కార్యాలయాలు వెలసిన ప్రతి చోటా కొత్త సంస్కృతి కూడా వెల్లివిరిసింది. భిన్న సంస్కృతి ఇలా.. ఆంగ్లేయులు ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారి సంతతి ఆంగ్లో ఇండియన్స్. ఈస్టిండియా కంపెనీ కూడా ఈ సాంస్కృతిక సహజీవనాన్ని బాగా ప్రోత్సహించింది. భారతీయ మహిళలను వివాహం చేసుకునేవారికి ఆ రోజుల్లో 5 రూపాయల ప్రోత్సాహక బహుమతి కూడా ఇచ్చేవారు. అలా నగరంలోని సైనిక్పురి, దక్షిణ లాలాగూడ, మెట్టుగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఆంగ్లో ఇండియన్లకు నిలయమయ్యాయి. ‘ఒక్క శాతం’తో మొదలై.. ఆంగ్లో ఇండియన్లకు బ్రిటన్ ప్రభుత్వం సముచితమైన స్థానమిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఈ సమూహం ఆర్థికంగా స్థిరపడింది. రైల్వేలు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, క్రీడలు, సైన్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో చాలా మంది స్థిరపడ్డారు. 1956 నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఆంగ్లో ఇండియన్ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. శాసన సభ్యులుగా నియమితులయ్యారు. తొలి దశాబ్దాల్లో జాన్ ఫెర్నాండెజ్, మెజోరి గాడ్ఫ్రె, క్లారిస్ మోరిస్, ఆస్వాల్డ్ పెడ్రో వంటి వారు ఆ తరువాత, ఇటీవల కాలంలో క్రిస్టీనా లాజరస్, డెల్లా గాడ్ఫ్రె, ప్రస్తుతం ఎల్విస్ స్టీఫెన్సన్ వంటివారు రాజకీయ రంగంలో ఉన్నారు. అభివృద్ధికి దూరంగా.. ఒకప్పుడు ఆంగ్లేయులు కల్పించిన రిజర్వేషన్ సదుపాయం వల్ల ఆంగ్లో ఇండియన్స్ కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ క్రమంగా ఉద్యోగావకాశాలకు దూరం కావడం, ఉన్నత చదువులు కూడా లేకపోవడంతో చాలా మంది సాంకేతిక నిపుణులుగా ఐటీఐ, వెల్డింగ్, మిషన్ రంగాల్లో అనుభవాన్ని ఆర్జించి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు తరలి వెళ్లారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా, ఇక్కడే స్థిరపడ్డా ఇంగ్లిష్ భాష ఒక్కటే వారికి జీవనాధారంగా నిలిచింది. హైదరాబాద్లోని కాల్సెంటర్స్లో పనిచేసేవారిలో చాలామంది ఆంగ్లో ఇండియన్లే. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ వారిని ఈ రంగంలో నిలబెట్టాయి. చాలా మంది విదేశాలకు తరలి వెళ్లడం వల్ల, ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలు ఇతర హిందూ, హిందూయేతర వర్గాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల వీరి జనాభా క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు హైదరాబాద్లో లక్షా 50 వేల మంది ఆంగ్లో ఇండియన్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య వేలకుపడిపోయింది. అవకాశాలు పెరగాలి.. అనేక శతాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక జీవనంలో కలిసిపోయి, ఓటు హక్కుతో సహా అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్న ఆంగ్లో ఇండియన్లను మైనారిటీ కమ్యూనిటీగా గుర్తించాలని ది ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. - పగిడిపాల ఆంజనేయులు -
బస్సుల్లో బలపరీక్ష - నరకం.. నగర ప్రయాణం
మొత్తం బస్సులు 3580 మెట్రో (ఏసీ) 80 మెట్రో ఎక్స్ప్రెస్లు 1000 ఆర్డినరీ బస్సులు 2500 ప్రస్తుత అవసరం 1000 భవిష్యత్ అవసరం 3000 సమయానికి రావు.. వచ్చినా ఆగవు.. బస్సు కోసం రోడ్డు వెంట పరుగు పందేలు.. కిక్కిరిసిన జనం.. ఆగినా ఎక్కలేని దుస్థితి.. నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. ఫుట్బోర్డుపై వేలాడుతూ.. గమ్యం చేరే వరకు బిక్కుబిక్కుమనాల్సిందే. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తప్పని బలపరీక్ష. ఎంఎంటీఎస్ తర్వాత నగరంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల కష్టాలు ఇవి. కాలం చెల్లిన బస్సులతో కాలం వెళ్లదీస్తోంది సిటీ ఆర్టీసీ. లక్షల మందిని గమ్యం చేర్చే బస్సుల సామర్థ్యం తగ్గిపోయి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికీ 40 శాతం పాత బస్సులే సేవలంది స్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వీటితో వేగలేక సిబ్బంది లోనూ అసహనమే కనిపిస్తోంది. కూకట్పల్లి-ఎల్బీనగర్ మార్గంలో తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులో ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. నిత్యం అనుభవించే మనోవేదనను ఆయా వర్గాలు ప్రత్యక్షంగా 'సాక్షి' తో పంచుకున్నాయి. ఇలాంటి తరుణంలో సిటీలో బస్సుల సమస్యను పరిష్కరించే వారితోనే 'గ్రేటర్' జెండా ఎగరేయిస్తామంటున్నాయి. సిటీ ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే సాహసమే. గంటల తరబడి స్టాపులో నిలుచుంటే ఎప్పటికో వస్తాయి. ఎక్కుదామనుకుంటే స్టాపులో ఆగకుండానే వెళ్లిపోతాయి. ఓపికున్నవారు పరుగెత్తి పట్టుకుంటారు. లేనివారు తిట్టుకుంటూ ఆటోను నమ్ముకుంటారు. ఇది ప్రయాణికుల అనుభవం. డ్రైవర్ కొలువు కూడా సాహసమే. స్టాపులో బస్సు నిలపలేదన్న సాకుతో చార్జీ మెమో అందుకోవాలి. అక్కడ ఆగి ఉన్న ఆటోలను మాత్రం ఎవరూ తొలగించరు. పని వేళలు ఎనిమిది గంటలే అయినా.. కనీసం 10 గంటలు తక్కువ కాకుండా విధుల్లో ఉండాల్సిందే. ఇందుకు ట్రాఫిక్జాం కారణమని వేరే చెప్పనక్కర్లేదు. రూట్లను బట్టి ఒక్కో డ్రైవర్ రోజుకు 100-150 కిలోమీటర్లు తిరగాలి. గతుకుల రోడ్లలో నడుములు విరిగిపోయి తక్కువ వయసులోనే బస్సులను షెడ్డుకు, దేహాన్ని ఆస్పత్రికి పంపక తప్పడం లేదు. ఇక రాత్రి వేళల్లో మందుబాబులు, ఆకతాయిల నుంచి డ్రైవర్లకు రక్షణ లేని పరిస్థితి. బస్సు నలువైపులా చూస్తూ టిక్కెట్.. టిక్కెట్.. అంటూ పరిగెత్తే కండక్టర్కూ ఎన్నో కష్టాలు. ఎస్సార్ సరిగా లేదని అధికారులతో అక్షింతలు. తమ స్టాప్ వద్ద ఆపలేదని ప్రయాణికుల చీవాట్లు. బస్సులు పెంచక, సిబ్బందిని నియమించకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కష్టాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించే వారినే 'గ్రేటర్' పీఠం ఎక్కిస్తామంటున్నారు సిటీజనులు. బస్సుల సమస్యలపై వారేమన్నారో వారి మాటల్లోనే. సమయమంతా ఎదురు చూపులకే.. నువ్వు ఎక్కాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. ఇది సరిగ్గా నగర ప్రయాణికులకు సరిపోతుంది. సమయానికి బస్సు రాదు. వచ్చినా కాలు తీసి వేయలేని దుస్థితి మధ్య ప్రయా ణం. నా కోర్సు కోచింగ్ సమయం రెండు గంటలైతే.. సిటీ బస్సు కోసం ఎదురు చూసేది మాత్రం మూడు గంటలు. - రాంభూపాల్, సివిల్స్ అభ్యర్థి పడుతూ లేస్తూ ప్రయాణం సిటీ బస్సుతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. రోజూ పంజగుట్ట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాను. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో రద్దీ తీవ్రంగా ఉంటోంది. కిలోమీటర్ల పడుతూ లే స్తూ ప్రయాణం సాగించాల్సిందే. - సయ్యద్, ప్రయాణికుడు నిత్యం నిలబడాల్సిందే.. పదేళ్ల నుంచి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కోచింగ్ నిమిత్తం జీడిమెట్ల నుంచి అబిడ్స్కు వెళ్తుంటా. సమయానికి గమ్యం చేరతానన్న నమ్మకం ఎప్పుడూ లేదు. ఒకవైపు ట్రాఫిక్జాం, మరోవైపు సరిగా లేని స్టాపులు.. నిత్యం నిలబడి మూడు గంటల బస్సు ప్రయాణం. రాత్రి తొమ్మిది అయితే బస్సుల సంఖ్య మరీ తగ్గిపోతోంది. - నవ్యత, ప్రయాణికురాలు సాయంత్రం షిఫ్ట్ నరకం.. మార్నింగ్ షిఫ్ట్లో డ్యూటీ కాస్త రిలాక్స్గా చేసుకోవచ్చు. రెండు గంటల పాటు రద్దీ ఉన్నా ఆ తరువాత పర్వాలేదు. సాయంత్రం షిఫ్ట్ అయితే మాత్రం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కిక్కిరిసిన ప్రయాణికులను నెట్టుకొని వెళ్లి టికెట్లు ఇచ్చుకోవాల్సిందే. - విజయేందర్రెడ్డి, సిటీ బస్ కండక్టర్ -
జనసిటీ - కోటికి చేరువలో హైదరాబాద్ జనాభా
400 ఏళ్ల ప్రస్థానంతో చారిత్రక, సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో ప్రపంచ పటంపై తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ మహానగరం.. దేశ యవనికపై మరోసారి తన కీర్తిని చాటనుంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులేస్తున్న గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ప్రధాన నగరం కంటే శివార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఐటీ, బీపీఓ, కేపీఓ, పారిశ్రామికాభివృద్ధి కారణంగా నగర జనాభా ఆరు దశాబ్దాలుగా అంచెలంచెలుగా పెరుతోంది. జనాభా పెరుగుదల క్రమాన్ని పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమౌతోంది. 1951లో నగర జనాభా 10.83 లక్షలు మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా ఏకంగా 78 లక్షలకు చేరింది. ఇక 2015 నాటికి జనాభా కోటికి చేరువైనట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని పలు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే జనాభా విషయంలో గ్రేటర్ ఆరోస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 4.60 కోట్ల జనాభాతో తొలి స్థానంలో ఉండగా, 2.07 కోట్ల జనాభాతో ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 1.46 కోట్ల జనాభాతో కోల్కతా మూడో స్థానంలోను, 89.17 లక్షలతో చెన్నై నాలుగో స్థానం, 87.28 లక్షలతో బెంగళూర్ ఐదో స్థానంలో ఉండగా.. 78 లక్షల జనాభాతో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. -
సిటీ వెలిగిందిలా..
1920 దశకంలోనే విద్యుత్ వెలుగులు నగరవాసులను మైమరిపించాయి. ట్యాంక్బండ్ పరిసరాల్లో ప్రస్తుతమున్న మింట్ కాంపౌండ్ ప్రాంగణంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో థర్మల్ పవర్ స్టేషన్ను అన్ని హంగులతో నిర్మించారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తికి నాలుగు యూనిట్లు నెలకొల్పారు. అప్పట్లో నిత్యం 200 టన్నుల బొగ్గుతో 22.5 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి జంట నగరాలకు సరఫరా చేయడం విశేషం. ఈ విద్యుత్ వెలుగులతో హుస్సేన్ సాగర్ కళకళలాడేది. ఈ కేంద్రాన్ని 1972లో పాక్షికంగా, 1995లో పూర్తిగా తొలగించినట్లు ఆధారాలున్నాయి. -
బల్దియా పాత భవనాలు..
ఒకప్పుడు మన బల్దియా ప్రధాన కార్యాలయం పాత నగరంలోని దారుల్ షిఫాలో ఉండేది. ఈ భవనాలను నిర్మించి వందేళ్లు దాటింది. 1878లో కేవలం రాజవంశీయుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల మదర్సా-ఐ-ఐజా ఇందులో ఉండేది. ఈ పాఠశాలను సర్ నిజామత్ జంగ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఈ భవనాలను టంకసాలగా మార్చారు. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రి ఉన్న భవనంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయాన్ని 1906లో దారుల్ షిఫాలోని ఈ భవనాలకు తరలించారు. ట్యాంక్బండ్ వద్ద నూతన భవనాలను నిర్మించిన అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి అందులోకి మార్చారు. గతంలో టంకశాల ద్వారం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానికి పక్కనే ఉండేది. పశ్చిమవైపన అజఖానా-జోహర వైపుగల భవన భాగం నూతనంగా నిర్మించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కొనసాగిన ఈ భవనాల్లో ప్రస్తుతం కులీకుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయం ఉండేది. -
పద్మభూషణ్ మాడపాటి
భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగువాడిగా నగర ప్రథమ మేయర్ మాడపాటి హనుమంతరావు కీర్తిని దక్కించుకున్నారు. ఆయన 1955లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1951లో హైదరాబాద్కు ప్రథమ మేయర్గా ఎన్నికై తన సేవలను అందించారు. ఆంధ్ర మహాసభలో కీలకపాత్రను పోషించిన మాడపాటి... తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాలకులు తెలుగుభాష పట్ల వివక్ష చూపుతున్న తరుణంలో దాన్ని ప్రతిఘటించారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతిక వికాసానికి ఆయన చేసిన సేవ శ్లాఘనీయం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయానికి తోడుగా వేమనాంధ్రభాషా నిలయం, మాడపాటి హన్మంతరావు బాలికోన్నత పాఠశాల ఈయన స్థాపించిన సంస్థలే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాడపాటి హన్మంతరావు శాసనమండలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన 'ఆంధ్రపితామహ' బిరుదును కూడా అందుకున్న గొప్పవ్యక్తి. -
బలగాలు రెడీ!
గ్రేటర్ ఎన్నికలకు సైరన్ మోగడంతో జంట కమిషనర్లు ఎం.మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్ అప్రమత్తమయ్యూరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యూరు. నగరంలోని పరిస్థితులు బేరీజు వేయడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటానికి జంట కమిషనరేట్లలో ప్రత్యేక ఎలక్షన్ సెల్స్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సెల్కు అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ అదనపు సీపీ వై.నాగిరెడ్డి సైతం ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. సైబరాబాద్ ఎలక్షన్ సెల్కు సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన) టీవీ శశిధర్రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రవీందర్రెడ్డి ఈయనకు సహకరిస్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నన్నాళ్ళూ నిత్యం ఓ డీఎస్ఆర్ (డెరుులీ సిట్యువేషన్ రిపోర్ట్) తయూరు చేసి కమిషనర్లకు నివేదించాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచ్లపై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనుల ఇన్ఛార్జ్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను ఎలక్షన్ సెల్స్ ఇన్చార్జ్లు నిర్వర్తిస్తారు. ఎన్నికల నామినేషన్లు మొదలుకుని ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగాలు కొనసాగనున్నాయి. -
'దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్లో తెలంగాణ ఎన్ఎస్యూఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను మోసం చేశాయని ధ్వజమెత్తారు. ఫీజూ రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపర్చడం వల్ల తెలంగాణలో కాలేజీలు మూతపడుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయైందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సీమంధ్రులను దుషించిన టీఆర్ఎస్ నేతలే.. ఇప్పుడు వారి ఓట్ల కోసం పాకులాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. -
రిజర్వేషన్ల తీరు...
విమర్శల జోరు వివిధ వర్గాల అసంతృప్తి హైదరాబాద్ జీహెచ్ఎంసీ వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని డివిజన్లు వరుసగా మహిళలకు రిజర్వయితే... మరికొన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇరుగు పొరుగు వార్డులు ఒకే వర్గానికి రిజర్వు కావడంతో ప్రభుత్వ తీరును పలువురు ఆక్షేపిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ సామాజికవర్గం ఎక్కువగా ఉంటే... వారికి ఆ వార్డులు రిజర్వు కావాల్సి ఉంది. అలా కాకుండా ఇష్టానుసారం చేశారని మండిపడుతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు.. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు వారికి అనుకూలంగా రిజర్వ్ చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలఅభ్యర్థులు బలంగా ఉన్న వార్డుల్లో సంబంధిత నాయకులను పోటీ చేసేందుకు వీలు లేకుండా ఇతర వర్గాలకు రిజర్వు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల వారీగా బీసీల జనాభాను, వార్డుల మ్యాపులను ఎవరికీ తెలియనీయకుండా చేసుకున్నట్లే... రిజర్వేషన్లను సైతం తమకు అనుకూలంగా చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని వార్డులు ఎక్కువగా మహిళలకు... మరికొన్ని నియోజకవర్గాల్లో అన్ని వార్డులూ జనరల్కు రిజర్వు కావడం అనుమానాలకు తావిస్తోంది. మంత్రులు, సర్కారులో హవా చూపించే ఎమ్మెల్యేలు తమ వారసులు గెలిచేందుకు వీలుగా వార్డులు రిజర్వు చేయించుకున్నార ని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో.. ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూక ట్పల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజవర్గాల్లో కింది విధంగా ఉన్నాయి. ఉప్పల్లో మహిళలకు అగ్రతాంబూలం బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గంలో ఏఎస్రావునగర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్ డివిజన్లు జనరల్ మహిళలకు కేటాయించారు. ఒక స్థానాన్ని బీసీ మహిళకు, చర్లపల్లి బీసీ జనరల్, కాప్రా ఎస్సీ జనరల్కు కేటాయించారు. మొత్తానికి అక్కడ మహిళల కు అధిక ప్రాధాన్యమివ్వడం విశేషం. మల్కాజిగిరిలో బీసీలకు నో చాన్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గంలో బీసీలకు మొండి చెయ్యి ఎదురైంది. అల్వాల్, నేరెడ్మెట్, వినాయక్ నగర్, మౌలాలీ,గౌతంనగర్ డివిజన్లు జనరల్ మహిళలకు కేటాయించారు. మచ్చబొల్లారం, వెంకటాపురాలను ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఈస్ట్ ఆనంద్బాగ్, మల్కాజిగిరిలను జనరల్కు పరిమితం చేశారు. జనరల్కు ప్రాధాన్యం కూకట్పల్లి నియోజకవర్గంలో జనరల్కు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అల్లాపూర్, బాలాజీనగర్లను జనరల్ మహిళలకు... పాతబోయిన్పల్లి, కూకట్పల్లి, ఫతేనగర్, కేపీహెచ్బీ, మూసాపేట్, బాలానగర్ డివిజన్లు జనరల్. శేరిలింగంపల్లిలోనూ జనరల్కే ... శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మొత్తం 10 డివిజన్లలో 7 జనరల్ స్థానాలే. మిగిలిన మూడింటిని జనరల్ మహిళకు కేటాయించారు. కొండాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ కాలనీ, మాదాపూర్, మియాపూర్లు జనరల్. హైదర్ నగర్, చందానగర్, హఫీజ్పేట్ జనరల్ మహిళకు కేటాయించారు. మహిళలు... బీసీలకు సమ ప్రాధాన్యం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం, రంగారెడ్డి నగర్, జగద్గిరిగుట్ట బీసీ జనరల్. సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల జనరల్ మహిళ. చింతల్ బీసీ మహిళకు... సూరారం జనరల్కు కేటాయించారు. ఎల్బీనగర్లో జనరల్ మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, చంపాపేట్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట్ జనరల్. నాగోల్ జనరల్ మహిళ. హస్తినాపురం ఎస్టీ మహిళకు కేటాయించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లు ఆర్కేపురం, సరూర్నగర్లు జనరల్ మహిళకే దక్కాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో... సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వార్డులు మహిళలకే రిజర్వ య్యాయి. మంత్రుల ఇలాఖాలోని డివిజన్లు పూర్తిగా మహిళలకే కేటాయించడం విశేషం. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నేతృత్వం వహిస్తున్న నాంపల్లి నియోజకవర్గంలో బీసీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కొసమెరుపు. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తున్నఖైరతాబాద్ నియోజకవర్గంలోని వేంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ డివిజన్లు జనరల్ మహిళ. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లు జనరల్ . సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న సనత్నగర్ నియోజకవర్గంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సనత్నగర్, అమీర్పేట్, బేగంపేట్, మోండ డివిజన్లు జనరల్ మహిళలకు.. రాంగోపాల్పేట బీసీ మహిళకు, బన్సీలాల్పేట్ ఎస్సీ మహిళకు రిజర్వయ్యాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ నేతృత్వం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పురుషులకు మొండి చెయ్యే. అడ్డగుట్ట, మెట్టుగూడ ఎస్సీ మహిళకు... తార్నాక, సీతా ఫల్మండి జనరల్కు, బౌద్ధనగర్ బీసీ మహిళకు కేటాయించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలోనూ మహిళలకే అధిక ప్రాధాన్యం.అడిక్ మెట్, గాంధీనగర్ జనరల్ మహిళ. రాంనగర్ జనరల్. ముషీరాబాద్ బీసీ మహిళ. బోలక్పూర్ బీసీ జనరల్, కవాడిగూడ డివిజన్ ఎస్సీ మహిళ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి నేతృత్వం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గంలో కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్పేట్ డివిజన్లు జనరల్ మహిళ. గోల్నాక బీసీ మహిళ. అంబర్పేట బీసీ జనరల్. టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేతృత్వం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ, రహమత్నగర్, షేక్పేట్, వెంగళ్రావునగర్ జనరల్. ఎర్రగడ్డ బీసీ మహిళ. బోరబండ బీసీ జనరల్. ఐఎం ఎమ్మెల్యే జాఫర్హుస్సేన్ నేతృత్వం వహిస్తున్న నాంపల్లి నియోజకవర్గంలో ఆసిఫ్నగర్, రెడ్హిల్స్, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, అహ్మద్నగర్ బీసీ మహిళ. మెహిదీపట్నం బీసీ జనరల్. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో.... చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏడింటిలో మూడు డివిజన్లు జనరల్... రెండు జనరల్ మహిళ. మిగతా రెండింటిలో ఒకటి జనరల్కు, మరొకటి బీసీ జనరల్. ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న యూకుత్పురా నియోజకవర్గంలో మూడు జనరల్... మూడు బీసీ మహిళ... ఒకటి బీసీ జనరల్. చార్మినార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఒకటి జనరల్, ఒకటి జనరల్ మహిళ, రెండు బీసీ జనరల్, ఒకటి బీసీ మహిళకు రిజర్వు చేశారు. బహదూర్పురా నియోజకవర్గానికి ఎమ్మెల్యేమౌజమ్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగు బీసీ జనరల్, ఒకటి బీసీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్. కార్వాన్ నియోజకవర్గానికి కౌసర్ మొయినుద్దీన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ మూడు బీసీ జనరల్... రెండు బీసీ మహిళ... ఒకటి జనరల్ మహిళ... ఒకటి ఎస్సీ జనరల్. మలక్పేట్ నియోజకవర్గానికి బలాల ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ జనరల్ మహిళకు మూడు, బీసీ మహిళకు ఒకటి, ఒకటి జనరల్కు, మరొకటి బీసీ జనరల్కు రిజర్వు చేశారు. గత ఎన్నికల్లో సైదాబాద్ డివిజన్ లో టీడీపీ నుంచి గెలుపొందిన సింగిరెడ్డి శ్రీనివాస్రెడ్డికి ఈసారి పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. ఈ డివిజన్ను జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఆయన సతీమణిని పోటీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ లోక్సభ నియోజక వర్గ పరిధిలో.. పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు డివిజన్లు జీహెచ్ఎంసీలో ఉన్నాయి. వీటిలో రెండు బీసీ జనరల్కు... ఒకటి జనరల్ మహిళకు రిజర్వు చేశారు. -
కలెక్టర్ చేతిలో మేయర్ ఎంపిక
నగర పాలక సంస్థకు ప్రథమ పౌరుడు మేయర్. అలాంటి వ్యక్తి ఎంపిక మున్సిపల్ చట్టం నిబంధనల ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలకూ, కలెక్టర్కూ ఎలాంటి సంబంధమూ లేకపోయినా మేయను ఎంపిక చేసేది మాత్రం కలెక్టరే. మున్సిపల్ యాక్ట్ 1955 సెక్షన్ 90 ప్రకారం ఎంపిక విధానం జరుగుతుంది. ప్రక్రియలో కలెక్టర్తో పాటు జీహెచ్ఎంసీకి చెందిన ఓ కార్యదర్శి కూడా పాల్గొంటారు. మూడు జిల్లాలకు సంబంధించి డివిజన్లు ఉన్నా.. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో ఎక్కువ డివిజన్లు వస్తాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నిర్ణయించుకున్న వేదికలో అన్ని పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ఆహ్వానిస్తారు. మేయర్ ఎంపిక మెజారిటీని చేతులు పెకైత్తే (షో హాండ్స్) సభ్యుల సంఖ్యను బట్టే నిర్ణయిస్తారు. -
ఆమెకే అగ్రపీఠం
గ్రేటర్లో సగం సీట్లు మహిళలకే... ‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’... మహిళల విషయంలో ఎన్నాళ్లగానో వినిపిస్తున్న మాట ఇది. గ్రేటర్లో ఇన్నాళ్లకు ఈ మాట వాస్తవ రూపం దాల్చబోతోంది. ఇకపై మహిళలు జీహెచ్ఎంసీ పాలనలో ‘సగమే’...కాదు...అగ్రభాగం కాబోతున్నారు. ‘మహా’ చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఓటర్లుగా తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలోనే కాదు... కార్పొరేటర్లుగా భాగ్యనగరి తలరాతను మార్చబోతున్నది మహిళలే. - సాక్షి, సిటీబ్యూరో మహా నగరపాలక సంస్థ ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు 14 నెలల స్పెషలాఫీసర్ పాలన అనంతరం తిరిగి కొత్త పాలకమండలి కొలువు దీరనుంది. ఈమేరకు ప్రభుత్వం శుక్రవారమే వార్డుల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూలు ఒకదాని వెనుక ఒకటిగా ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను జీహెచ్ఎంసీలో తొలిసారిగా అమలు చేస్తున్నారు. దీంతో ఈసారి వారు చక్రం తిప్పనున్నారు. గత పాలకమండలిలో వారికి 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. అన్నింటా పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళలకు స్థానిక పాలనలోనూ సమానావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 సీట్లకుగాను మహిళలకు 75 సీట్లు రిజర్వు చేశారు. గత పాలకమండలిలో వారికి 50 సీట్లు మాత్రమే లభించాయి. ఇక ఓపెన్ కేటగిరీలో గతంలో 58 సీట్లుండగా, ఈసారి అవి 44కు తగ్గాయి. ఎస్సీలకు గతంలో 12 ఉండగా, ప్రస్తుతం 10కి తగ్గాయి. గతంలో మహిళలు ప్రాతినిధ్యం వహించిన వార్డులు.. జంగమ్మెట్, యాప్రాల్, అడ్డగుట్ట, పద్మారావునగర్, అల్వాల్, పుురానాపూల్, నవాబ్సాహెబ్కుంట, మారేడ్పల్లి, రెడ్హిల్స్, చిలకలగూడ, కాచిగూడ, ఫలక్నుమా, రామ్గోపాల్పేట, గుడిమల్కాపూర్, కార్వాన్, జహనుమా,బౌద్దనగర్, నానల్నగర్, ఆసిఫ్నగర్, రామ్నగర్, ఆర్సీపురం, దత్తాత్రేయనగర్. బల్కంపేట, గడ్డిఅన్నారం, పీఅండ్టీ కాలనీ,కర్మాన్ఘాట్,బంజారాహిల్స్, చింతల్బస్తీ, విజయనగర్కాలనీ, దోమలగూడ, గౌతంనగర్, సఫిల్గూడ, బేగంపేట, డిఫెన్స్కాలనీ, మౌలాలి, గాంధీనగర్, ముషీరాబాద్, అత్తాపూర్, రామకష్ణాపురం, హిమాయత్నగర్, తార్నాక, బోరబండ, సరూర్నగర్, ఉప్పల్, ఘాన్సిబజార్, నల్లకుంట, అడిక్మెట్, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్, శ్రీనగర్కాలనీ. హైకోర్టు ఆదేశాలతోనే.. ఎంసీహెచ్గా ఏర్పాటైన నాటినుంచీ పాలకమండలి ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే జరిగాయి. 1970 నాటి నుంచే స్పెషలాఫీసర్లు పాలన కొనసాగించారు. 1970 నుంచి 1986 వరకు , తిరిగి 2007 నుంచి 2016 మధ్య కాలంలో స్పెషలాఫీసర్లుగా పనిచేసినవారు పాతికమందికి పైగా ఉన్నారు. స్పెషలాఫీసర్ పాలన.. మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి రద్దయిన ప్రతిసారీ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుండటం ఆనవాయితీగా వస్తోంది. 1970 నుంచి 1986 వరకు పాలకమండలి ఎన్నికలు జరుగకపోవడంతో స్పెషల్ఆఫీసర్ పాలనే నడిచింది. అనంతరం తిరిగి 1993 నుంచి 2002 వరకు కూడా స్పెషల్ఆఫీసర్ పాలనే కొనసాగింది. 2007లో పాలకమండలి గడువు ముగిశాక రెండునెలలపాటు స్పెషలాఫీసర్ పాలన నడిచింది. 2007లో జీహెచ్ఎంసీగా అవతరించాక 2009 ఎన్నికలు జరిగేంత వరకు స్పెషలాఫీసర్ పాలనే నడిచింది. ఏడోసారి ఎన్నికలు.. హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు విలీనమై ఎంసీహెచ్గా అవతరించినప్పటి నుంచి ఎంసీహెచ్ అంతరించే వరకు ఐదు సార్లు, జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక ఒక పర్యాయం వెరసి ఇప్పటి వరకు మొత్తం ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి నాలుగేళ్లకోమారు 1968 వరకు ఎన్నికలు జరగ్గా, 1968 తర్వాత పద్దెనిమిదేళ్ల వరకు (1986) జరగలేదు. 1986 నుంచి 2002 వరకు 16 సంవత్సరాలు ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోలేదు. నీవిక్కడుంటే... నేనక్కడుంటా ‘నీవిక్కడుంటే..నేనక్కడుంటా...’ అంటూ మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల వేళ...గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఓ ఒప్పందం గురించి వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. శుక్రవారం తార్నాక డివిజన్లో పర్యటించిన ఆయన..గత ఎన్నికల సమయంలో తాను, మంత్రి పద్మారావులు ఓ రహస్య ఒప్పందాన్ని అమలు చేశామని, అదే ‘నీవిక్కడుంటే... నేనక్కడుంటా’ అంటూ సెలవిచ్చారు. అందులోని పరమార్ధాన్ని ఇలా వివరించారు... ‘2014 సార్వత్రిక ఎన్నికల ముందు..అన్నా నువ్వు టీఆర్ఎస్ పార్టీ ద్వారా సికింద్రాబాద్లో ఉండు...నేను తెలుగుదేశం పార్టీ ద్వారా సనత్నగర్లో ఉంటాను...ఇద్దరం ఎవరి నియోజకవర్గాన్ని వారు అభివృద్ధి చేసుకుందాం అని పద్మారావుకు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఇద్దరం గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే తాము బదురుకున్నాం’ అని తలసాని స్వయంగా తెలపడంతో సభలో నవ్వులు విరిశాయి. సేవ చేసే ఉద్దేశం ఉన్న మాకు గెలిచే అవకాశం కూడా ఉండాలనే ఇలా చేశామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. - లాలాపేట 70 శాతం పోలింగ్ లక్ష్యంగా... గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 70 శాతం పోలింగ్ జరగాలన్నదే మా సుపరిపాలన వేదిక లక్ష్యం. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 శాతమే ఓటేశారు. ఈ సారి ఓటింగ్ శాతం పెంచేందుకు 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాడవాడలా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాం. ఈ సారి ఎన్నికల్లో నేరచరితులకు, బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వరాదని మేము అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్ మహిళామణులకు అందలం జీహెచ్ఎంసీ పదవుల్లో మహిళలకు యాభై శాతం సీట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ప్రజలకు దూరమైన పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మొప్పు పొందే పరిస్థితి లేక అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. వీలైనంత మేరకు ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నాయి. విజ్ఞులైన నగర ప్రజలు ఎవరివైపు ఉంటారో త్వరలో తేలుతుంది. - టి.పద్మారావు, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి రిజర్వేషన్లలో శాస్త్రీయత ఏదీ? జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో శాస్త్రీయత లోపించింది. ఈ రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం స్వప్రయోజనాలకు పెద్దపీట వేసింది. రిజర్వేషన్లు ప్రకటించి, తగినంత సమయం ఇచ్చాక ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలి. కానీ రిజర్వేషన్లు ప్రకటించిన మూడు గంటల్లోనే షెడ్యూలు విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో కుట్ర దాగి ఉంది. మొదటినుంచీ గ్రేటర్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తూనే ఉంది. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దళితులను మోసగించారు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తామన్న కేసీఆర్ దాన్ని పాటించలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ వార్డుల కేటాయింపులోనూ దళితులకు అన్యాయం చేశారు. గతంలో దళితులకు 12 స్థానాలు రిజర్వుకాగా వాటిని 10కి తగ్గించారు. దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప ఎన్నికలు జరపని ప్రభుత్వం...అన్ని విషయాల్లోనూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. - మాగంటి గోపీనాథ్, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పారదర్శకతకు పాతరేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పారదర్శకతకు పాతరేసింది. ఓటర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియ కుదింపు, రిజర్వేషన్ల కేటాయింపు అంశాల్లో అన్నింటా చట్టాలను తుంగలో తొక్కింది. మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తప్ప ప్రభుత్వానికి కనువిప్పు కాలేదు. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు వస్తారని జనం ఊహించలేకపోయారు. అన్ని విలువలను వదిలేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. - మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఇవీ మహిళా రాజ్యాలు.. 1. డా.ఏఎస్రావునగర్ 2. నాచారం 3. చిలుకానగర్ 4. హబ్సిగూడ 5. రామంతాపూర్ 6. ఉప్పల్ 7. నాగోల్ 8. హస్తినాపురం 9. సరూర్నగర్ 10. రామకృష్ణాపురం 11. సైదాబాద్ 12. మూసారంబాగ్ 13. ఓల్డ్మలక్పేట 14. ఆజంపురా 15. మొఘల్పురా 16. తలాబ్చంచలం 17. గౌలిపురా 18. కుర్మగూడ 19. ఐఎస్ సదన్ 20. కంచన్బాగ్ 21. బార్కాస్ 22. నవాబ్సాహెబ్కుంట 23. ఘాన్సిబజార్ 24. సులేమాన్నగర్ 25. రాజేంద్రనగర్ 26. అత్తాపూర్ 27. మంగళ్హాట్ 28. లంగర్హౌస్ 29. గోల్కొండ 30. టోలిచౌకి 31. ఆసిఫ్నగర్ 32. విజయనగర్కాలనీ 33. అహ్మద్నగర్ 34. రెడ్హిల్స్ 35. మల్లేపల్లి 36. గన్ఫౌండ్రి 37. హిమాయత్నగర్ 38. కాచిగూడ 39. నల్లకుంట 40. గోల్నాక 41. బాగ్అంబర్పేట 42. అడిక్మెట్ 43. ముషీరాబాద్ 44. గాంధీనగర్ 45. కవాడిగూడ 46. ఖైరతాబాద్ 47. వెంకటేశ్వరకాలనీ 48. సోమాజిగూడ 49. అమీర్పేట, 50. సనత్నగర్ 51. ఎర్రగడ్డ 52. హఫీజ్పేట 53. చందానగర్ 54. భారతీనగర్ 55. బాలాజినగర్ 56. అల్లాపూర్ 57. వివేకానందనగర్ 58. చింతల్ 59. సుభాష్నగర్ 60. కుత్బుల్లాపూర్ 61. జీడిమెట్ల 62. అల్వాల్ 63. నేరేడ్మెట్ 64. వినాయకనగర్ 65. మౌలాలి 66. గౌతమ్నగర్ 67. అడ్డగుట్ట 68. తార్నాక 69. మెట్టుగూడ 70. సీతాఫల్మండి 71. బౌద్దనగర్ 72. బన్సీలాల్పేట 73. రామ్గోపాల్పేట 74. బేగంపేట 75. మోండామార్కెట్ -
‘మాస్టర్ ప్లాన్’పై కలకలం
పాఠశాల స్థలం ధారాదత్తంపై నివేదిక కోరిన డిప్యూటీ సీఎం విచారణ జరిపిన డీఈవో రాజీవ్ స్థలం ఇచ్చినప్పుడు డీఈఓగా చంద్రమోహనే.. వరంగల్ : హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని ప్రైవేటు అవసరాల కోసం అప్పగించిన అంశం విద్యా శాఖలో కలకలం రేపింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సూచన మేరకు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసిన విషయంపై శుక్రవారం సాక్షిలో ‘మాస్టర్ ప్లాన్ మతలబేంది?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారి పి.రాజీవ్ను ఆదేశించారు. డీఈఓ శుక్రవారం విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డెరైక్టర్ యాదయ్యతో కలిసి సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కు అప్పగించిన స్థలం ఫొటోలు, వివరాలు సేకరించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి నివేదిక పంపించారు. ఇచ్చింది చంద్రమోహనే... సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని వరంగల్ నగరపాలక సంస్థకు ఇచ్చిన సమయంలో జిల్లా విద్యా శాఖ అధికారిగా వై.చంద్రమోహన్ ఉన్నట్టు ఉత్తరప్రత్యుత్తరాలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాల వెనుక విద్యా శాఖ పరిధిలో ఉన్న 887 చదరపు మీటర్ల భూమిని రోడ్డుకు వినియోగించనున్నట్లు పేర్కొంటూ వరంగల్ మహా నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్ 29న విద్యా శాఖకు లేఖ రాసింది. దీనికి సమ్మతిస్తూ 2015 మే 22న డీఈవో కార్యాలయం నగరపాలక సంస్థకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మహా నగరపాలక సంస్థ ప్రతిపాదన వచ్చిన సమయంలో, దీనిపై నిర్ణయం తీసుకున్న సమయంలోనూ డీఈఓగా వై.చంద్రమోహన్ ఉన్నారు. ఆయన హయాంలోనే దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన విద్యా శాఖ భూమి పరాధీనమైనట్లు స్పష్టమవుతోంది. భూమిని ఇతర శాఖలకు అప్పగించే విషయంలో డీఈఓకు ఎలాంటి అధికారమూ లేదని నిబంధనలు చెబుతునాయి. వరంగల్ మహానగరపాలక సంస్థ నుంచి భూమి కావాలనే ప్రతిపాదన లేఖ వచ్చినప్పుడు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికిగానీ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దృష్టికిగానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి మేరకే భూమి కేటాయింపుపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అరుుతే, ఇవేమీ పట్టించుకోకుండా వై.చంద్రమోహన్ డీఈవోగా ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూమిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. -
స్మార్ట్ ప్రణాళిక రూ. 3025 కోట్లు
నగర అభివృద్ధిలో కేంద్ర పథకాల సమ్మిళితం పీపీపీ పద్ధతి ద్వారా పెట్టుబడుల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ హన్మకొండ : స్మార్ట్సిటీ ద్వారా రాబోయే ఐదేళ్లలో వరంగల్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సేకరణకు సంబంధించి ప్రాథమిక అంచనాలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రూపొందిం చారు. మొత్తంగా రూ.3025 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపడం ద్వారా స్మార్ట్సిటీ పథకం రెండో అంచెలో పోటీ పడేందుకు గ్రేటర్ వరంగల్ రంగం సిద్ధం చేసుకున్నట్లరుుంది. ఎస్పీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్సిటీ పథకంలో వరంగల్ నగరం ఎంపికైంది. అంతకుముందే అమృత్, హృదయ్ పథకాలకు సైతం అర్హత సాధించింది. స్మార్ట్సిటీ పథకం ద్వారా నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో నేరుగా రూ.500 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులకు తోడు వివిధ మార్గాల ద్వారా మరిన్ని నిధులను జత చేసి నగరంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహరాలన్నీ నిర్వర్తించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేసే ఎస్పీవీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పోరేషన్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టు/పథకాలకు సంబంధించిన ప్రణాళిక, అనుమతులు, నిధులు, రుణసేకరణ, నిధులను ఖర్చుచేయడం తదితర వ్యవహారాలను ఎస్పీవీ చేపడుతుంది. రూ. 3025 కోట్లతో.. వరంగల్ స్మార్ట్సిటీ ప్రణాళికకు సంబంధించి ఎస్పీవీ ద్వారా రూ.2022 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో స్మార్ట్సిటీ పథకం నుంచి రూ.500 కోట్లు, అమృత్ పథకం నుంచి రూ.41 కోట్లు, హృదయ్ నుంచి రూ.39 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.104 కోట్లు, రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.774 కోట్లు, రైల్వేశాఖ నుంచి రూ.47 కోట్లు ప్రధానంగా సేకరిస్తారు. మిగిలిన నిధులను పధ్నాలుగో ప్రణాళిక సంఘం నిధులతో పాటు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సేకరిస్తారు. ఇవి కాకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో రూ.1003 కోట్లు సేకరిస్తారు. ఇలా ఎస్పీవీ, పీపీపీ పద్దతిలో సమకూరిన రూ.3025 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. స్మార్ట్సిటీ ద్వారా చేపట్టబోయే పనుల్లో రూ.1772 కోట్లను రెట్రో ఫిట్టింగ్(పూర్తిగా కొత్త ప్రాజెక్టు) పనులకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 1253 కోట్లను ప్రస్తుతం నగరంలో ఉన్న వనరులు మరింత మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఆదాయ వనరులకు సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని కేంద్రానికి పంపిన నివేదికలో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు. -
టెన్షన్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోటీ చేసేందుకు కొన్నేళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేతలకు చివరి నిమిషంలో ఖరారయ్యే రిజర్వేషన్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. విలీన గ్రామలకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగాయి. గతంలో ఉన్న 53 డివిజన్లు 58కి పెరిగాయి. నగర జనాభా 8.20 లక్షలకు చేరుకోగా ఓటర్ల సంఖ్య ఆరు లక్షలుగా నమోదైంది. వీరి కోసం 619 పోలింగ్ స్టేషన్లు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మిగిలిన ప్రధానఘట్టం వార్డులవారీగా రిజర్వేషన్లు ఒక్కటే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, నగర ప్రజలు రిజర్వేషన్ల ప్రక్రియపై ఆసక్తిగా ఉన్నారు. ఏ డివిజన్, ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కానుందనేది కీలకంగా మారింది. అంతేకాకుండా ఈ దఫా మేయర్ స్థానం రిజర్వేషన్ ఏ వర్గానికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కార్పొరేటర్గా ఎన్నికై మేయర్ పదవి దక్కించుకునేందుకు అన్ని రాజకీయపార్టీల నుంచి కీలక నేతలు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచే రానున్న ఎన్నికలనృ దష్టిలో పెట్టుకొని డివిజన్లలో పట్టు, పార్టీలో పలుకుబడి, ప్రధాననేతల చుట్టూ తిరుగుతున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరితోపాటు కార్పొరేటర్ లక్ష్యంగా పనిచేస్తున్న ద్వితీయశ్రేణి నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. మాజీ కార్పొరేటర్లు, పోయిన దఫా ఎన్నికల్లో ఓడిపోయి మరోసారి తమృఅదష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎవరికి ఏ డివిజన్ దక్కేనో? వరంగల్ నగరంలో ప్రస్తుతం 58 డివిజన్లు ఉన్నాయి. గతంలో 53 డివిజన్లు ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 18 డివిజన్లు మహిళలకు కేటాయించారు. ఇప్పుడు డివిజన్ల సంఖ్య 58కి పెరిగింది. అంతేకాకుండా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. దీని వల్ల ఇంతకాలం డివిజన్పై కన్నేసిన నాయకులు రిజర్వేషన్లలో చిక్కులు ఎదురైతే తమకు బదులుగా తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు మార్గం సుగమం చేస్తుకుంటున్నారు. మరికొందరు నాయకులు ఎందుకైనా మంచిదని రెండు, మూడు డివిజన్లపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. దీనితో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే ఎన్నికల పోటీ చేసే అంశంపై రాజకీయ పార్టీలు, ఆశావహులకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందువల్ల 58 డివిజన్లలో రిజర్వేషన్ల కేటాయింపుల ప్రక్రియ తేలే వరకు పోటీపై ఆసక్తి ఉన్న వారికి ఉత్కంఠ నెలకొంది. ఏ పద్ధతిన చేస్తారో? రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఓటర్ల ప్రతిపాదిక? లాటరీ పద్ధతి పాటిస్తార? అనేది తేలాల్సి ఉంది. జనాభా ప్రతిపాదికన అయితే ఆయా డివిజన్లవారీగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ప్రాతిపదికన తీసుకుంటారా? లేదా ఏకమొత్తంగా తీసుకుంటారా? అనేది నిర్ణయించాలి. రోటేషన్ పద్ధతిని ప్రతిపాదికన తీసుకుంటే ఒక దఫా రిజర్వేషన్లు అమలు పరిచిన డివిజన్లను తప్పించి ఈ దఫా రొటేషన్ పద్ధతిలో ఇతర డివిజన్లు కేటాయిస్తారా తేలాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎంపిక రిజర్వేషన్ల ప్రక్రియలో అడుగు ముందుకు పడేందుకు ఆస్కారం ఉంది. అప్పటి వరకు రిజర్వేషన్ల కోసం ఎదరుచూడడం తప్పదు. తెలంగాణలో రెండో పెద్దనగరంగా వరంగల్కు గుర్తింపు ఉండటంతో మేయర్ పదవి దక్కించుకునేందుకు బడా నాయకులే బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే మేయర్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందనే అంశంపై ఆధారపడి వ్యూహలు అమలవుతాయి. -
ఎవరికి వారే !
టీఆర్ఎస్లో అయోమయం ఊసే లేని జిల్లా కమిటీ ఏర్పాటు ఆత్మీయ విందు భేటీ కూడా.. కేసీఆర్ ఆదేశాలు పట్టని {పజాప్రతినిధులు ‘గులాబీ నేతల్లో’ అసంతృప్తి వరంగల్ : టీఆర్ఎస్ పార్టీలో అమోయమం నెలకొంది. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు ఇప్పుడు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రస్థాయి పదవులను పక్కనబెడితే జిల్లాస్థాయిలో కనీసం 50 ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల సంగతి పక్కనపెడితే కనీసం పార్టీ పదవులను భర్తీ చేయకపోవడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. టీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి సైతం పార్టీలో తమ స్థానం ఏమిటనే విషయంలో గందరగోళం పెరుగుతోంది. టీఆర్ఎస్ జిల్లా కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 16న ముగిసింది. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపనేని నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను సంప్రదించి ఏప్రిల్ 20లోపే జిల్లా, గ్రేటర్ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన మంత్రి జి.జగదీశ్రెడ్డి.. కొత్త అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా కమిటీలో 33 మంది చొప్పున ఉంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కార్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీలో, గ్రేటర్ వరంగల్ కమిటీలోనే ఇంతే సంఖ్యలో నాయకులకు చోటు కల్పిస్తారు. రెండు కమిటీలకు పార్టీ అనుబంధ సంఘాలు ఉంటాయి. ఇలా వందల మందికి జిల్లా కమిటీల్లో చోటు దక్కుతుంది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరిగి మూడు నెలలు పూర్తయినా కమిటీలను నియమించలేదు. పార్టీ కమిటీల నియామకం ఎప్పుడు జరిగేది ఎవరికీ తెలియడంలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్నవారు నైరాశ్యంలో మునిగిపోయూరు. అధికారంలో ఉన్న పార్టీలకు ఇలా కమిటీలు లేని పరిస్థితి ఎప్పుడు లేదని గులాబీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఆత్మీయ భేటీలు లేవు... నామినేటెడ్, పార్టీ పదవుల నియామకాలు లేక టీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీనికి తోడు సాధారణ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన కొందరి వైఖరి గులాబీ శ్రేణులకు ఇబ్బందికరంగా ఉంటోంది. పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు ఇప్పించాల్సిన ముఖ్య నేతలు... తమ గురించి ఆలోచిండంలేదని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. పదవులు విషయం పక్కనబెడితే కొందరు ప్రజాప్రతినిధులు కనీసం కలిసేందుకు సమయం కేటాయించడంలేదని అంటున్నారు. ‘గతంలో అప్పుడప్పుడు జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగేది. పార్టీకి కమిటీలు లేకపోవడంతో ఇప్పుడు అదీ జరగడంలేదు. పార్టీలో ఎవరేమిటో ఏమీ అర్థంకావడలేదు’ అని టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్లోని పాత, కొత్త నేతల మధ్య సమన్వయం పెరిగేందుకు, అధికార పదవుల్లో ఉన్నవారు అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ప్రతి నెల జిల్లా స్థాయిలో ఆత్మీయ విందు కార్యక్రమం నిర్వహించాలని టీఆర్ఎస్ చట్టసభ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మే 15న జిల్లాలోని ముఖ్యనాయకులకు చింతగట్టు గెస్ట్హౌజ్లో ఆత్మీయ విందు ఇచ్చారు. గత నెలలో మంత్రి చందూలాల్ ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు విందులతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. జిల్లా పార్టీ సమావేశాలు లేక, ఆత్మీయ భేటీలు నిర్వహించకపోవడంతో ఒకరికి ఒకరు కలుసుకునే పరిస్థితి సైతం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదని వీరు అంటున్నారు. -
డిసెంబర్లో పోరు!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలను డిసెంబర్ 15లోపు నిర్వహించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. ఇదే షెడ్యూల్లో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కీలక నగరంగా వరంగల్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్కు ఇటీవలే గ్రేటర్ హోదా కల్పించింది. గ్రేటర్ వరంగల్గా మారిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలకు సవాల్గా మారనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ఘన్పూర్.. ఇలా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితం ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు కీలకం కానుంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి లక్ష్యంగా.. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రాజకీయ పార్టీల్లో కదలిక వరంగల్ నగరపాలక సంస్థగా ఉన్నప్పుడు చివరిసారిగా 2005 సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. అదే నెల 27న ఫలితాలు వచ్చాయి. పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 2010 సెప్టెంబరులో పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో 53 డివిజన్లు ఉండేవి. వరంగల్ నగరపాలక సంస్థలో నగర శివారులోని 42 గ్రామాలు విలీనమయ్యాయి. 2011 జనాభా గణాంకాల ఆధారంగా 58 డివిజన్లు అయ్యాయి. డివిజన్ల పునర్విభజన పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ఆమోదం రావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డివిజన్లలో మార్పులు లేకుండానే ఆమోదం వచ్చే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల తర్వాత వెంటనే వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు భావించాయి. పెరిగిన, మారిన డివిజన్లకు అనుగుణంగా రాజకీయ పార్టీల నాయకులు కార్యకలాపాలు మొదలుపెట్టారు. హైదరాబాద్తోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో రెండు మూడు నెలలుగా స్తబ్ధుగా ఉంటున్నారు. హైదరాబాద్ ఎన్నికలపై హైకోర్టు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే ఉండింది. హైకోర్టు తాజా తీర్పుతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. గతేడాది జరిగిన పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోనే వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ పదవి రిజర్వేషన్పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికీ రిజర్వు అయ్యింది. కీలకమైన మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రావడంతో రాజకీయ పార్టీల్లోనూ అంతర్గత పోటీ అధికంగా ఉండనుంది. గ్రేటర్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలిస్తే మేయర్ ఎవరేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకే ఉండనుంది. టీఆర్ఎస్లో గ్రేటర్ వరంగల్ పార్టీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ పేరు మేయర్ పదవికి వినిపిస్తోంది. వరంగల్ పశ్చిమకు చెందిన కోరబోయిన సాంబయ్య కూడా మేయర్ పదవికి రేసులో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలంతో ఎక్కువ కార్పొరేటర్లను గెలుచుకుని మేయర్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వ్యూహా లు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మేయర్ పదవికి రేసులో ఉండనున్నారు. రాజేందర్రెడ్డికి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో మేయర్ విషయంలో నాయినికి పార్టీలో పోటీ ఉండకపోవచ్చు. గతంలో వరంగల్ మేయర్ పదవిని నిర్వహించిన పార్టీగా బీజేపీ ఎన్నికల్లో గట్టిగా పోరాడే పరిస్థితి ఉంది. టీడీపీ పొత్తుతో బరిలోకి దిగితే బలం చూపవచ్చని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీకి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ శ్రీనివాస్రెడ్డి మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. -
వైఎస్సార్ సీపీ గ్రేటర్ అధ్యక్షుడిగా రాజ్కుమార్ యూదవ్
కాజీపేట రూరల్ : కాజీపేటలోని సోమిడికి చెందిన కాయిత రాజ్కుమార్యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నియమితులయ్యూరు. తన ను గ్రేటర్ అధ్యక్షుడుగా నియమించినందుకు వైఎస్ఆర్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్రెడ్డికి ఈ సందర్భంగా రాజ్కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాయిత రాజ్కుమార్ యాదవ్ 1990 నుంచి 2009 వరకు ఒక జాతీయ పార్టీలో కొనసాగుతూ మూడు సార్లు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ సీపీని స్థాపించగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలో చేరాడు. ఈ సందర్భంగా రాజ్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతోపాటు గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల కు దీటుగా పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాజ్కుమార్ యూద వ్ గతంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. కాజీపేటలో స్వీట్ల పంపిణీ.. రాజ్కుమార్ యూదవ్ నియూమకంపై హర్షం వ్యక్తంచేస్తూ కాజీపేటలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు మంచె అశోక్, ముజఫరుద్దీన్ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మేకల రాజు, అంచూరి వెంకటే శ్వర్లు, ఎం.రవీందర్, రమేష్ పాల్గొన్నారు. -
గ్రేటర్పై కాంగ్రెస్ గురి
కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం 11మందితో ఎన్నికల కమిటీ డీసీసీ చీఫ్ నాయినికి సారథ్యం వరంగల్ రూరల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్పై జెండా ఎగుర వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా 11 మంది ముఖ్య నాయకులతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కాంగ్రెస్ కమిటీకి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మహమూద్ను సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి జెట్టి కుసుమకుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు. -
గ్రేటర్గా వరంగల్!
హైదరాబాద్: వరంగల్ కార్పొరేషన్ హోదా పెరుగుతోంది. వరంగల్, కాజీపేట, హన్మకొండలను కలుపుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం తెలిపారు. చారిత్రక, పర్యాటక పరంగా వరంగల్కు ఉన్న ప్రత్యేకతను మరింతగా పెంచుతామని మంత్రి చెప్పారు. పారిశ్రామిక, విద్యారంగాల్లో వరంగల్ను రాజధానికి దీటుగా తీర్చిదిద్దుతామని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హోదా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.