Indiramma housing scheme
-
Indiramma Indlu: చూపించిన చోటే ఇల్లు.. వేరే చోట్ల నిర్మిస్తే రద్దు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడు చూపించిన ప్లాటు కాకుండా వేరే చోట్ల ఇల్లు నిర్మిచేందుకు సిద్ధమైతే.. రద్దు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని.. జియో పెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని.. అప్పుడే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ప్రత్యేక యాప్ను తయారు చేసింది. ఆ యాప్ ద్వారా గతంలో సర్వే చేసిన ఇంటి స్థలంలోనే ఇల్లు కట్టేందుకు అనుమతినిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు తావుండదు. జియో పెన్సింగ్ విధానం అమలురాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 చొప్పున ఉమ్మడి జిల్లాకు 42 వేల ఇళ్లను మంజూరు చేసింది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించి.. ఇంటింటి సర్వే పూర్తి చేసింది. సర్వే సందర్భంగా ప్రస్తుతం నివాసం ఉండే ఇల్లు, ఇంటి స్థలం, డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. సొంత జాగా ఉన్న పేదల జాబితాను సిద్ధం చేశారు. ఇల్లు మంజూరైన వారు సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జియో పెన్సింగ్ విధానం ద్వారా అనుమతి ఇస్తుండడంతో.. అక్కడే ముగ్గు పోయాల్సి ఉంటుంది. ముగ్గు పోసే సమయంలో గ్రామ కార్యదర్శి, వార్డు అధికారికి సమాచారం ఇస్తారు. సర్వే సమయంలో చూపిన స్థలం అదేనా కాదా అని వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక యాప్లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో పెన్సింగ్ చేస్తారు. అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద ఉండి యాప్ ద్వారా పరిశీలిస్తారు. సర్వే సమయంలో ఇచ్చిన వివరాలు పరిపోలితేనే.. లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు అన్లైడ్లో అప్లోడ్ అవుతాయి.. తప్పుడు సమాచారం ఇస్తే యాప్ తీసుకోదు.అక్రమాలకు అడ్డుకట్ట..ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే జియో పెన్సింగ్ విధానం ద్వారా పాత ఇళ్లను చూపి గతంలో మాదిరిగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. గతంలో ఒకరికి మంజూరైతే.. మరొకరు నిర్మించుకోవడం, చూపించిన చోట గాకుండా మరోచోట నిర్మాణాలు చేసుకోవడం వంటివి జరిగేవి. కొత్త విధానంతో వాటికి చెక్ పడనుంది. -
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటికే ఓ పర్యాయం పేదల కోసం ప్రభుత్వం కట్టిచ్చే ఇంటిని పొందిన వారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదు’అని ఇటీవలే స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి చిన్న సవరణ చేసింది. 1994 సంవత్సరాన్ని కటాఫ్గా నిర్ణయించినట్లు తెలిసింది. 1994కు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ కటాఫ్ సంవత్సరం తర్వాత ప్రభుత్వం నుంచి పేదల ఇంటిని పొందిన వారు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారు. ఆ ఇళ్లు శిథిలమై ఉంటాయన్న ఉద్దేశంతో.. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టి సాచురేషన్ పద్ధతిలో ఇళ్లను మంజూరు చేశారు. 2004 నుంచి పదేళ్ల కాలంలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అప్పట్లో ఈ ఇళ్లను పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ పథకం కింద ఇల్లు పొందిన వారి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున, ఆ లబ్ధిదారులకు మళ్లీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకు నే అవకాశం ఉంది. ఆధార్ నంబర్తో కూడా ఆ వివరాలను అనుసంధానించినందున వడపోత సులభంగా జరుగుతుంది.అంతకుముందు వరకు ప్రభుత్వ పక్షాన ఇలా ఉధృతంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. పరిమిత సంఖ్యలో ఇళ్లను నిర్మించేవారు. 1995కు పూర్వం అర్బన్ పర్మనెంట్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందేది. ఆ సమయంలో గ్రామాల్లో వ్యక్తిగత పెంకుటిల్లు నిర్మించి ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత ఇళ్లను నిర్మించారు. అప్పట్లో కేంద్ర ప్రభు త్వం కూడా ఇందిరమ్మ ఆవాస్ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సాయం అందించింది.ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ ఇళ్లు పెంకులతో కూడినవి కావటం, 30 ఏళ్ల సమయం అవటం.. వెరసి అవి శిథిలావస్థకు చేరి ఉంటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించినందున, వీరిని కూడా అర్హుల జాబితాలో చేర్చింది. 1994కు ముందు అలా ఇల్లు పొందిన వారు కూడా అర్హులవుతారు. ఇప్పటికీ ఆ ఇళ్లలోనే ఉంటున్నవారూ దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
హైదరాబాద్లోనే ఎక్కువ..!
సాక్షి, సిటీబ్యూరో: సొంత స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు ఆ పనుల్లో పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే జిల్లాలు నాలుగున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏ జిల్లా పరిధిలో ఎందరున్నారో ప్రజాపాలన కార్యక్రమాల్లో అందిన దరఖాస్తుల్ని లెక్కలు తీశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే జీహెచ్ఎంసీ వార్డులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. తర్వాత మేడ్చల్ జిల్లాలోని వారు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల వంతున జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థికసాయం అందనుంది. సర్వేయర్లకు సహకారం.. దరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ‘ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్’లో వివరాలు నమోదు చేసేందుకు సర్వేయర్లుగా జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు ఆయా జిల్లాల సిబ్బంది పని చేయనున్నారు. క్షేత్రస్థాయిలో లబి్ధదారుల చిరునామాను గుర్తించేందుకు జిల్లాల సిబ్బందికి, కంటోన్మెంట్ సిబ్బందికీ జీహెచ్ఎంసీ సర్కిళ్లలో పనిచే స్తున్న యూసీడీ, ఎంటమాలజీ విభాగాల సిబ్బందితోపాటు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు,తదితరులు సహకరించనున్నారు. మొబైల్ యాప్లో వివరాల నమోదు, అప్డేషన్ల కోసం జీహెచ్ఎంసీ జోనళ్లస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో అస్తవ్యస్త పరిస్థితుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. మేం క్రమంగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. అలాగే వదిలేస్తే ఎవరికీ మంచిది కాదు.లేనిపక్షంలో వారిని నియంత్రించేందుకు చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీశ్రావులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ అప్లికేషన్ను పలువురు మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. హోమ్ వర్క్ చేయని విద్యార్థుల్లా..‘కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే.. అప్పుల కుప్పగా మార్చి అప్పుల మిత్తి కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితికి దిగజార్చిన రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాదిలో మేము చేసి చూపుతున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు.. హోమ్ వర్క్ చేయని విద్యార్థులు, హోమ్ వర్క్ చేసిన వారి పుస్తకాల్లోని కాగితాలను చింపేసిన తరహాలో వ్యవహరిస్తున్నారు. మేము చేసే మంచి పనుల లబ్ధి ప్రజలకు చేరకుండా వారు మారీచ సుబాహుల తరహాలో అడ్డుపడుతున్నారు. మా పాలన కూడా వారి తరహాలోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ పంథాను కేసీఆర్ మార్చేశారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చొరవ చూపేందుకు వీలు కలి్పంచారు. ఆ పంథాను కేసీఆర్ మార్చేశారు. భారత్, పాకిస్థాన్ సైనికులు ఎదురుపడితే కాల్పులు జరుపుకొంటున్న చందంగా పాలక, ప్రతిపక్షాల మధ్య శత్రుత్వాన్ని పెంచారు.ప్రజాతీర్పును గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకతకు నిజామే తలవంచారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ ఇంకా గుర్తిస్తున్నట్టు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. శాసనసభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. తన సీనియారిటీకి అనుగుణంగా విలువైన సూచనలు ఇవ్వాలి. మేమంతా ఎదుగుతున్న నేతలమే.. మా మంత్రులు తుమ్మల, జూపల్లి లాంటి వారు తప్ప మిగతా వారమంతా ఎదుగుతున్న నేతలమే. సభలో ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచటం సరికాదు. కేసీఆర్ పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ సూచనలతో మార్గదర్శనం చేయాలి. మా ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచి పనులను గుర్తించాలి. ఏడాది పూర్తయిన సందర్భంగా చేస్తున్న విజయోత్సవాల్లో పాల్గొనాలి. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి మంత్రి పొన్నం ద్వారా ఆహ్వానాలు పంపుతాం. కేసీఆర్, కిషన్రెడ్డి, బండి సంజయ్ హాజరుకావాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షలిస్తున్నది తెలంగాణ ఒక్కటే.. ‘పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. పేదలు పక్కా ఇంటిని కలిగి ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరాగాంధీ చేశారు. దేశంలో గుడి లేని ఊరుంటుందేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని పల్లె ఉండదనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ భూముల సీలింగ్ యాక్టు ద్వారా భూములు సేకరించి పేదలకు పంచిన ఆమె, వారి సొంతింటి కలను నిజం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. నిరుపేదల జాడ తేల్చే యాప్ పేదల్లో అతి పేదలకు ఇళ్లు దక్కేలా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధునికతను వినియోగించుకుంటున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు నిరుపేదల జాడ తేల్చేలా యాప్ను అందుబాటులోకి తెచ్చాం. అర్హులకే లబ్ధి కలిగేలా, అక్రమాలు లేకుండా దీన్ని వినియోగిస్తాం. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారికి సొంతింటి లబ్ధి కలిగేలా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన కోటాతో ప్రమేయం లేకుండా వారికి ఇళ్లను ఇస్తాం. లబ్ధిదారులకు స్తోమత ఉంటే ఇంటిని విస్తరించుకోవచ్చు..’ అని రేవంత్ తెలిపారు. ఎంత భారం అయినా నిధులిస్తాం: భట్టి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టామని, ఎంత భారమైనా దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నా.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.22,500 కోట్ల నిధులను మాత్రం సమకూర్చి తీరతామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం సమకూర్చటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. అతిపేదలకు సొంతిల్లే లక్ష్యం: పొంగులేటి పేదల్లో అతి పేదలకు సొంతింటిని సమకూర్చటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు అందిన లక్షల దరఖాస్తుల్లో అతిపేదలు, నిరుపేద వితంతువులు, వికలాంగులను గుర్తించి ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. యాప్ను ఆవిష్కరించిన తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను, డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన సీఎం ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచన సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం లోపల ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తన చాంబర్ నుంచి నడుచుకుంటూ నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలానికి వచి్చన సీఎం.. విగ్రహం ముందు గ్రీనరీ పనులు, భారీ ఫౌంటైన్, ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సిస్టం పనితీరు గురించి ఆరా తీశారు. గేటు–2, గేటు 4లను అనుసంధానిస్తూ వేస్తున్న రోడ్లను చూశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం పంచేలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు.గేటు–4 పక్కన ప్రధాన గేటు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ విగ్రహావిష్కరణకు ముందురోజే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఏర్పాటులో ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటూ జరగకూడదని, విగ్రహాన్ని తెచ్చేటప్పుడు, వేదికపై ఏర్పాటు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో కూడా రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ , టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వారికే ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు.‘‘ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబి్ధదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందని చెప్పింది. అలాంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అయితే, ఏ ఉద్దేశం మేరకు పథకం ప్రారంభించారో.. దానికి విరుద్ధంగా అమలు జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్కు స్వేచ్ఛనిచి్చంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద తొలిదశలో 4,50,000 గృహాలను నిర్మించాలని, లబి్ధదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి 2024, అక్టోబర్ 11న జీవో 33 జారీచేశారు. స్థానికులతో ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్గా ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో ముగ్గురు (ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి) సభ్యులుగా ఉంటారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాల్ చేస్తూ ఏలేటితోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇటీవల వెలువరించారు. పారదర్శకంగానే అమలు: ఏఏజీ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధం. ఇష్టం వచ్చిన వారిని, పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉంటుంది. గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం సరికాదు. ఈ కమిటీలను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో ఇళ్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలున్నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు. ఆవాస్ ప్లస్ 2024 యాప్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాకే ఎంపిక జరుగుతుంది. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ సాగుతోంది. ఈ పిటిషన్లను కొట్టివేయాలి’అని చెప్పారు.గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు.. ‘పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 6(8) ప్రకారం లబ్దిదారుల ఎంపికకు గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. ఈ కేసులో పంచాయతీలో కార్యదర్శి, మున్సిపల్ వార్డులో వార్డుస్థాయి అధికారి ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తారు. యాప్లో కుటుంబంతోపాటు ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్దిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. యాప్, కమిటీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఇలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నచి్చన వారిని కమిటీలు ఎంపిక చేసుకుంటాయని, పిటిషనర్లు భయపడటం అర్థంలేనిది’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
విజయోత్సవానికి రెడీ.. ఏడాదైనా గూడేది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్న సందర్భంగా ‘ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల’ పేరిట సంబురాలకు శ్రీకారం చుట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయోత్సవాలు సరే.. ఈ ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరు బడుగులకు ఇళ్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు పేదలకు ఒక్క ‘ఇందిరమ్మ’ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో అదిగో అనడమే తప్ప.. పేదలకు ‘గూడు’ఎప్పటివరకు దక్కుతుందో చెప్పలేకపోతోందన్న ఆగ్రహం కనిపిస్తోంది.సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గరపడి, విజయోత్సవాలు ప్రారంభమైనా.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో, ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడినా.. ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి. పండుగ దాటి 20 రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ఈ ఏడాది నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నిర్మించడం ఏమోగానీ, మంజూరైనా చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించినా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత ఏడాది డిసెంబర్–జనవరిలలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయి. దీనిలో రేషన్కార్డు లేని 30లక్షల దరఖాస్తులను పక్కనబెట్టిన అధికారులు.. మిగతా 50 లక్షల దరఖాస్తులను స్రూ్కటినీ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రక్రియ ముందుకు కదలలేదు. ఏడాది అవుతుండటంతో దరఖాస్తులు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఉత్తర్వులు వెలువడి ఎనిమిది నెలలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. మంత్రులందరినీ వెంటబెట్టుకుని అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. పథకం పట్టాలెక్కినట్టే అనే భావన అప్పట్లో నెలకొంది. ఇది జరిగి ఎనిమిది నెలలైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్నికల కోడ్ ముందుండగా.. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడానికి మూడు నెలల ముందే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. పథకాన్ని ప్రారంభించే నాటికే లబ్ధిదారుల జాబితా రూపొందించి ఉంటే... భద్రాచలం వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే వీలుండేది. అదే జరిగితే కొంత మేరకైనా ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేది. అయితే భద్రాచలం సభ ముగిసిన వారం రోజుల్లో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి.. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను చేపట్టలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఎన్నికల కోడ్ వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, అయినా దరఖాస్తుల స్రూ్కటినీ చేపట్టకుండా కాలయాపన చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊసే లేని గ్రామ సభలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే ఉంటుందని మార్చిలో విడుదల చేసిన మార్గదర్శకాల ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు గ్రామసభల ఊసే లేదు. దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితా ఆధారంగా గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులకు కూడా ఎలాంటి స్పష్టత లేకపోవటంతో యావత్తు పథకం నిర్వహణ గందరగోళంగా మారింది. మరోవైపు గ్రామసభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎంపికను మాత్రం హడావుడిగా చేపట్టడం గమనార్హం. ఈ కమిటీలు కూడా నెల రోజులుగా చేసే పనేమీ లేక ఖాళీగా ఉండిపోయాయి. 50 లక్షల దరఖాస్తులు... ఇంటింటి వెరిఫికేషన్ జరిగేదెప్పుడు? పేదల ఇళ్ల పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని.. లేకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఆ మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని, మార్గదర్శకాలు పాటించాలని కాంగ్రెస్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది. అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి, వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్లో నమోదు చేయాలి. అలా 50 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసే బాధ్యతను సుమారు 13 వేల మంది గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. మొదలైనా దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుందని అంచనా. అంటే వచ్చే ఫిబ్రవరికి గాని అర్హుల జాబితా సిద్ధం కాదు. ఇక ఆ జాబితాలలో ఏవైనా లోపాలుంటే పరిశీలించి సరిదిద్దాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని సమాచారం. దాని కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చివరగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. నిధులు సిద్ధం! లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేసులో పునర్విచారణ కీలక మలుపు తిరిగింది. 2015లో సీఐడీ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు ఫైలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (వీ అండ్ ఈ) కోర్టుకు చేరింది. తమ విచారణలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దర్యాప్తు చేసి నివేదికివ్వాలని సీఐడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు లేఖ రాశారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తు 36 గ్రామాల్లోనే సాగింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో విచారణ జరిపేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 2009 తర్వాత ఎంతమంది బిల్లులు పొందారు.. ఏ మేరకు అక్రమాలు జరిగాయి? పాత్రధారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అనే వివరాలనూ ఆరాతీయనుంది. కాగా, విజిలెన్స్ విచారణ అంశాలను బట్టి తాము చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, దర్యాప్తులో ఎదురయ్యే అంశాలను బట్టి ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు విజిలెన్స్ సిఫారసు చేస్తుందని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. -
దేవుడి పేరుతో నాటకం.!
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): తాను కోరిన ధరకు ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని విక్రయించలేదనే అక్కసుతో ఒక నాయకుడు ఆ ఇంటి స్థలం ముందు దేవుడు వెలిసాడనే నాటకాన్ని మొదలు పెట్టడంతో బాధితురాలు లబోదిబోమంటుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలతో వ్యాపారం చేసే భూ భకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతుందనేందుకు దేవునిపేరుతో జరుగుతున్న నాటకమే నిదర్శనం. మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్సింగ్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్లాట్లను కేటాయించారు. కొంత మంది ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో ఇంటి నిర్మాణాలను మధ్యలోనే నిలపివేశారు. అయితే ఈ కాలనీలో ఉండే కొందరు నాయకులు యథేచ్ఛగా ఇంటి స్థలాలను, నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేసి విక్రయించడం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎక్కువ ధరకు విక్రయించి తమ జేబులు నింపుకుంటున్నారు. అయితే ఇటీవల లక్ష్మి అనే మహిళ తనకు కేటాయించిన స్థలంలో ఆమె పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసింది. అంతలోనే ఆమె దత్తత తీసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసింది. అయితే ఈ సమయంలో ఓ నాయకుడు ఆమెను ఇందిరమ్మ ప్లాట్ను విక్రయించాలని వత్తిడి చేశాడు. దీనికి సదరు మహిళ అంగీకరించకపోవడంతో తనకు ప్లాట్ దక్కడం లేదని కక్ష పెంచుకున్నాడు. రాత్రికి రాత్రే బాధిత మహిళకు సంబంధిచిన ప్లాట్లో ఉన్న చెట్టుకింద బండరాయిని పాతించి దేవుడు వెలిసినట్లు తెల్లవారు పూజలు జరిపించారు. ఆలయం ఉన్నచోట ఇంటి నిర్మాణం చేయరాదనే భయాన్ని సృష్టించాడు. అయితే తనకు స్థలంను కేటాయించిన సమయంలో ఎలాంటి దేవుని విగ్రహం లేదని తాను ప్లాటును విక్రయించడానికి అంగీకరించకపోవడంతోనే తనపై కోపంతో నాటకం ఆడుతున్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలువాల్సిన వారు ప్లాటుపై కన్నేసి దేవుని పేరుతో నాటకం ఆడటాన్ని ఆమె దుయ్యట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దేవుడు వెలిశాడని వేధిస్తున్నారు.. నాకు ఇందిర మ్మ ఇంటి స్థ లం కేటాయించినప్పుడు ఎ క్కడ కూడా దే వుని విగ్రహం లేదు. ఇంటి ప్లాట్ను విక్రయించడా నికి అంగీకరించకపోవడంతో కొంద రి ప్రోద్బలంతో కాలనీలోని ఒక నా యకుడు దేవుడు వెలిసినట్లు నాట కం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్న నాకు ఎవరు దిక్కు. అధికారులు స్పందించి దీనిపై విచా రణ జరిపించాలి. – లక్ష్మి,ఇందిరమ్మ లబ్ధిదారు, మోర్తాడ్ -
గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!
-
గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!
సాక్షి, అమరావతి: ఈ రోజుల్లో టీవీలు లేని ఇళ్లు ఎక్కడున్నాయి? కాయకష్టం చేసే పేదలైనా, కాలు కదపని ధనికులైనా వినోదంతో సేదతీరే సాధనం అది. ఇప్పుడదే పేదలకు శాపంగా మారుతోంది. గూడులేని పేదల సొంతింటి కలను సర్కారు నీరుగారుస్తోంది. గుడిసెల్లో నివసించే వారికి చిన్నపాటి టీవీ ఉన్నా సరే ఉన్నత వర్గాల గాటన కట్టేస్తోంది. టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్లలో ఏ ఒక్కటి ఉన్నా వారిని ప్రభుత్వం పక్కా ఇళ్లకు అనర్హులుగా తేల్చేసింది. గుడిసెల్లో ఉంటున్న 10.92 లక్షల పేద కుటుంబాల సొంతింటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. 1/3 వంతు పేదల ఏరివేత రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 31.52 లక్షల కుటుంబాలు సొంతిం టి కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిం చిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. గుడిసెల్లో నివాసముంటున్న వీరం దరికీ గృహ నిర్మాణ పథకం కింద పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రకరకాల పేరుతో 1/3 వంతు మందిని ఏరివేసి అనర్హులుగా చెబుతోంది. గుడిసెల్లో నివసిస్తున వారిలో దాదాపు పది లక్షల మందిని పక్కా ఇళ్లకు అనర్హులుగా నిర్ధారించినట్లు సమాచార, ప్రసార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు సైతం కొద్ది రోజుల కిత్రం అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. అవి లేని ఇళ్లున్నాయా? ప్రజా సాధికార సర్వే ఆధారంగా గుడిసెల్లో నివాసముంటున్న 10.92 లక్షల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత వర్గాలుగా పేర్కొంది. వారు ప్రభుత్వం ఇచ్చే సొంతింటికి అనర్హులని తెలిపింది. దీనికి సర్కారు చెబుతున్న కారణం వారు టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్ లాంటివి కలిగి ఉండటం. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఇలాంటి వస్తువులు కనిపిస్తున్నాయి. స్తోమత లేనివారు పాతవి కొనుగోలు చేయటం లేదంటే ఎవరైనా ఉదారంగా ఇచ్చినవి వాడుకోవటం చేస్తున్నారు. ఇవి ఉన్నాయనే కారణాలతో తమను అనర్హులుగా ప్రకటించటంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన సర్వేలో సొంతిళ్లు లేవని నిర్థారించిన తరువాత అనర్హులుగా పేర్కొనటం ఏమిటని మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకూ బిల్లులివ్వలేదు.. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరై నిధుల కొరత కారణంగా 2.60 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్లో ఆగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం గతంలో గుర్తించింది. వీటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధర రూ.70 వేలుకు అదనంగా మరో రూ.25 వేలు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా ‘ఇందిరమ్మ’ ఇళ్ల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు పేదలు నిర్మించుకునే ఇళ్లకు యూనిట్ ధరను రూ.70 వేలు నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసిన వాటిలో 1.12 లక్షల ఇళ్లు, ఇందిరమ్మ పథకం కింద మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన వాటిలో 10,426 ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇటీవల ప్రకటించారు. అయితే వీటిలో ఏ ఒక్క ఇంటికి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. -
గూడు..గోడు
- గ్రామీణ గృహ నిర్మాణాల్లో నిర్లిప్తత - టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకే గృహాలు - వాటినీ పూర్తి చేయించని వైనం - ఈ నెలాఖరులోపు లక్ష్యసాధన అసాధ్యం - నిరుపేదలు పూరి గుడిసెల్లో మగ్గుతున్నా పట్టించుకోని యంత్రాగం ఆళ్లగడ్డ : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! భూమి ధరలకు రెక్కలు తొడుగుతున్న వేళ.. భవన నిర్మాణ సామగ్రి, కూలి రేట్లు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పేదల సొంతింటి కల సాకారం కావడం కష్టసాధ్యంగా మారింది. అందుకే అందరూ ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్లుగా గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. టీడీపి ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ పథకానికి పేరు మార్చి.. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంగా నామకరణం చేసింది. అలాగే పట్టణ ప్రజల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇళ్లు) అమలు చేస్తున్నారు. 2016 –17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 17,255 ‘ఎన్టీఆర్ గృహాలు’ మంజూరు చేశారు. వీటికి పూర్తి స్థాయిలో ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. పథకంపై లబ్ధిదారుల్లో అవగాహన లేకపోవడంతో పాటు గతంలో ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలకు పట్టాలు పొందిన వారి జాబితాలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు 3,803 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 1,808 ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికీ మొదలుపెట్టలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 –18), వచ్చే ఏడాది (2018– 19)కి కలిపి జిల్లాకు మొత్తం 28,600 ఇళ్లు మంజూరయ్యాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు అదనంగా మరో మూడు వేల గృహాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 14,300 గృహాలు గత ఏడాది ఆగస్టులోనే మంజూరయ్యాయి. అయితే.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, జాబితాలు ఉన్నతాధికారులకు చేరేసరికి నెలలు పట్టింది. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ‘అందరికీ ఇళ్లు’ పథకం దరఖాస్తులు పూరించడంలోనూ ప్రజలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడువులోగా సాధ్యమేనా? గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 లక్షల చొప్పున అందిస్తోంది. మంజూరు చేసిన గృహాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను 4,196 మంది, 2018 – 19కి గాను 1,123 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. వారు నిర్మాణాలు మొదలు పెట్టినట్లు రికార్డుల్లో నమోదైంది. లక్ష్యసాధనకు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోపు మిగిలిన 23,281 గృహాలను పూర్తిచేయడం సాధ్యమయ్యే పని కాదు. ‘ధరా’ఘాతం ప్రస్తుతం గృహ నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం కనిష్టంగా 200 చదరపు అడుగులు, గరిష్టంగా 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే గృహ నిర్మాణాలు చేపట్టాలి. అయితే..చాలామంది లబ్ధిదారులు అంతకంటే ఎక్కువ స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ప్రభత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల కంటే ఎక్కువ వ్యయమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు పూర్తవ్వగానే నిర్మాణాలు నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. లేదంటే అప్పు చేసి కట్టుకోవాలి. మూడు వేల గృహాలు ఏవీ? మంత్రి అఖిలప్రియ వైఎస్సార్సీపీ నుంచి అధికార పార్టీలో చేరిన సమయంలో అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనంగా వెంటనే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మూడు వేల పక్కా గృహాలను ప్రత్యేకంగా మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం నుంచి మంజూరు చేసినవాటికి తోడు అదనంగా మూడు వేల గృహాలు మంజూరైతే చాలామందికి ఇళ్లు దక్కుతాయని నిరుపేదలు ఆశపడ్డారు. అయితే..వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. అఖిలప్రియ పార్టీ మారి ఏడాది దాటినా, మంత్రి పదవి కూడా చేపట్టినా అదనంగా మంజూరు చేయిస్తానన్న మూడువేల ఇళ్ల మాట ఎత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
తమ్ముళ్ల నయాదందా!
ఇందిరమ్మ లేఅవుట్పై కన్ను! కార్యకర్తలకే పట్టాలు ఇప్పించేందుకు గూడుపుఠాణి ఇంటి పట్టాలు అమ్ముకుని రూ.లక్షలు గడిస్తున్న వైనం పేదల సొంతింటి కల చెదిరిపోనుంది. మూడేళ్లుగా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వని టీడీపీ ప్రజా ప్రతినిధులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లే అవుట్పై కన్నేశారు. ఇందులోని ఖాళీ ప్లాట్లను టీడీపీ కార్యకర్తలకే దక్కేటట్లు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారులకు నియోజకవర్గ ప్రధాన నేత మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. - కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలోని ఐదుకల్లు రోడ్డు, శెట్టూరు రోడ్డులో 2010లో సర్వే 384, 385, 386 ,498–1 భూముల్లో 18 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కొనగోలు చేసి ఇందిరమ్మ లేఅవుట్ కింద 1,154 ప్లాట్లను వేసి అర్హులైన పేదలకు స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో ఏడాది క్రితం నాలుగు వందల ప్లాట్లు ఖాళీగా ఉండగా, మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారుల సర్వేలో 288 మాత్రమే ఖాళీగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందకు పైగా ప్లాట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు పట్టాలు పొంది, ఒక్కొక్కటి రూ. 1లక్షకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాలను తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్తున్నారు. అర్హుల పేరుతో దోపిడీ ఎలాగో తమ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వదన్న భావన బలంగా ఉన్న టీడీపీ నేతలు... ఇందిరమ్మ లే అవుట్లపై కన్నేశారు. ఈ లే అవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను తమ అనుయాయులకు ఇప్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నేతలు గూడుపుఠాణీ చేస్తున్నారు. అర్హులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు బాహటంగా చూపుతూ.. లోలోన టీడీపీ కార్యకర్తలకే పట్టాలు దక్కేటట్లు పావులు కదిపారు. ఇంటి పట్టాల కోసం 650 దరఖాస్తులు అందగా, ఇందులో 125 మందికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం. అనర్హులకు ఇస్తే సహించం ఇందిరమ్మ లే అవుట్లో టీడీపీ నాయకులకే పట్టాలిచ్చి పేదలకు అన్యాయం చేస్తే సహించం. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల ప్రకారం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు చేస్తాం. – నాగరాజు, ఎంఆర్పీఎస్ నాయకుడు, కళ్యాణదుర్గం సత్తా ఇంటే భూమి కొని పట్టాలివ్వండి అర్హులకు ఇంటి పటాలిస్తే తప్పుపట్టం. అయితే అనర్హులైన వారికి ఇందిరమ్మ లే అవుట్లో అక్రమంగా పట్టాలిస్తే ఊరుకోం. టీడీపీ నేతలకు సత్తా ఉంటే భూమి కొనుగోలు చేసి ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టి పట్టాలిస్తే అభ్యంతరం లేదు. – బోయ నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు, కళ్యాణదుర్గం న్యాయపోరాటానికి సిద్ధం టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందిరమ్మ లే అవుట్లో ప్లాట్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకపోతే న్యాయం పోరాటం చేస్తాం. – బిక్కి హరి, వైఎస్సార్సీపీ నాయకుడు, కళ్యాణదుర్గం సిఫార్సులకు తలొగ్గామనడం సబబు కాదు అధికార పార్టీ నేతల సిఫార్సులకు తలొగ్గామని చెప్పడం సబబు కాదు. అనర్హులకు పట్టాలిస్తారని విమర్శించడం సరైందికాదు. దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి అర్హులను గుర్తించి వారికే పట్టాలు అందజేస్తాం. – రవీంద్ర, తహసీల్దార్, కళ్యాణదుర్గం -
చిత్తశుద్ధి కనుమరుగు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నా’నని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిండు సభలో చెప్పారు. గత నెల 29న నల్లజర్ల మండలం పోతవరంలో నిర్వహిం చిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఒక్కటి కూడా లేదని.. ఇది జిల్లాకే కాదు రాష్ట్రానికీ గర్వకారణమని ఘనంగా చెప్పారు. వాస్తవంలోకి వెళితే.. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే 7,877 మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పనుల ప్రారంభానికే నోచుకోని మరుగుదొడ్లు 1,700 ఉన్నాయి. అవి అధికారులు చెబుతున్న గణాంకాలు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే.. ప్రతి మండలంలోనూ కనీసం 1,000 నుంచి 1,500 వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయని అంచనా. అయితే, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో గణాంకాల్లో మాయచేసి అన్నిచోట్లా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిపోయినట్టు చూపించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మంజూరైనవి 1.81లక్షల యూనిట్లు జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను మినహాయిస్తే.. 46 మండలాల్లో 1,81,179 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.262.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 22,954 మరుగుదొడ్లు పూర్తి చేశారు. మొత్తం కలుపుకుని 1,71,602 నిర్మాణాలు పూర్తయ్యాయి. 7,877 యూనిట్లు నిర్మాణంలో ఉండగా.. 1,700 యూనిట్ల నిర్మా ణం ఇంకా మొదలు కాలేదు. ఒక్క చింతలపూడి మండలంలోనే 2,938 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా 67 అసలు ప్రారంభం కాలేదు. లింగపాలెం మండలంలో 1,605, గోపాలపురంలో 561, పోడూరులో 705, టి.నర్సాపురంలో 800 నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. ఎక్కడైతే వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారో ఆ నల్లజర్ల మండలంలోనే ఇంకా 310 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా, 165 యూనిట్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. ఏలూరు, భీమవరం, పాలకోడేరు మినహా ఏ మండలంలోనూ వంద శాతం లక్ష్యం చేరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద 2019 మార్చికి వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలని నిర్దేశించింది. జిల్లాలో మాత్రం 2017 మార్చికి పూర్తి కావా లని జిల్లా కలెక్టర్ లక్ష్యం నిర్దేశించి ఆ దిశగా యంత్రాంగాన్ని ముందుకు నడిపారు. తరచూ దీనిపై సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఎంపీడీవోలు జనవరి నుంచి మార్చి వరకూ నిర్మాణాలన్నీ పూర్తయినట్టు చూపించి కొన్ని పేర్లను జాబితాల నుంచి తొలగించారు. ఈ విధంగా మూడు నెలల్లో 25 శాతం వరకూ పేర్లను తొలగించి లక్ష్యం పూర్తయినట్టుగా చూపించారనే ఆరోపణలున్నాయి. అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తే మండలానికి వెయ్యి నుంచి రెండు వేల వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు కనపడతాయని అధికారులే పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద మెప్పు కోసం తమపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. స్కీం అయిపోయిందన్నారు మాది గోపాలపురంలోని కుమ్మరకుంట గ్రామం. వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయాలని అధికారులను అడిగితే.. స్కీం అయిపోయిందని చెప్పారు. మళ్లీ పథకం వచ్చినప్పుడు కట్టుకుందురు గాని అంటున్నారు. మల విసర్జనకు ఆరబయటకు వెళ్లాలి వస్తోంది. మా కాలనీలో 30 ఇళ్లు ఉండగా.. 6 ఇళ్ల వారికి మరుగుదొడ్లు లేవు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. – షేక్ బీబీ, కుమ్మరకుంట, గోపాలపురం మండలం గిరిజన తెగకు చెందిన ఇతని పేరు కూతాడి బూసియ్య. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల దెందులూరులో నివాసం ఉంటున్నాడు. అంధురాలైన భార్య గంగమ్మతో కలిసి పూరి పాకలో తల దాచుకుంటున్నాడు. ఈ కుటుంబానికి ఇప్పటివరకూ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగిలే తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తాను, అంధురాలైన తన భార్య బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మంజూరులో గిరిజనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజ్యాంగ నిబంధనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి బూసియ్య కుటుంబానికే పరిమితం కాదు. ఇలాంటి నిరుపేదలెందరో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాక బహిర్భూమిని ఆశ్రయించాల్సి వస్తోంది. -
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
-
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
♦ అనర్హులు లబ్ధిపొందినట్లు తేలడంతో జాబితా నుంచి తొలగింపు ♦ మిగతా 2.10 లక్షల ఇళ్ల బిల్లుల మంజూరుకు ఓకే ♦ అవకతవకల వడపోత తర్వాత స్పష్టత ♦ తొలివిడతలో రూ.197 కోట్ల విడుదలకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు లబ్ధిపొందినట్లుగా గుర్తించిన లక్షన్నర ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మిగతా 2.10 లక్షల ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా దాదాపు రూ.197 కోట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ 2.10 లక్షల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.1,100 కోట్లు అవసరం. అయితే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గతంలో కేంద్రం మంజూరు చేసిన రూ.510 కోట్లు గృహ నిర్మాణ శాఖ వద్ద ఉన్నాయి. అవి పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. దాదాపు మూడేళ్లుగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణ జరిపించగా.. అక్రమాలు నిజమేనని వెల్లడైంది. దాంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల సంగతి అటకెక్కినట్లేననే భావన వ్యక్తమైంది. అయితే అర్హులైన పేదలు బిల్లులు అందక ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కొన్ని బిల్లులైనా మంజూరు చేయాలని నిర్ణయించి.. 2016లో కొన్ని నిధులు మంజూరు చేసింది. కానీ అది కూడా నిలిచిపోయింది. తాజాగా ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వమని, వారికి మొత్తం బిల్లులు మంజూరు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బిల్లుల మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణ ఎలా? ‘ఇందిరమ్మ’ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.510 కోట్ల ఐఏవై నిధులు పోను.. రాష్ట్రం మరో రూ.600 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధుల్లేక హడ్కో నుంచి రుణంగా తీసు కుంటున్నారు.దీంతో ఇందిరమ్మ బిల్లుల చెల్లిం పు ప్రభుత్వానికి భారంగా మారనుంది. ఇప్పుడు సిబ్బంది కరువు? ఇందిరమ్మ బిల్లుల మంజూరులో కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో గృహ నిర్మాణశాఖ సిబ్బంది బిల్లులు చెల్లించేవారు. ఇటీవల ఆ విభాగాన్ని ప్రభుత్వం రద్దు చేసి.. సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్పై పంపింది. అవినీతి ఆరోపణల మేరకు వంద ల మంది తాత్కాలిక సిబ్బందిని తొలగించిం ది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు సిబ్బంది లేని పరిస్థితి ఎదురైంది. దీంతో పంచాయతీరాజ్ విభాగం నుంచి కొంతమంది సిబ్బందిని రప్పించి వారికి బిల్లుల చెల్లింపుపై తర్ఫీదు ఇస్తున్నారు. వారు ‘ఇందిరమ్మ’ ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి, ఫొటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు. సోమవారం నుంచి బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశముంది. -
మోదీ మరో సంచలనం ఇదేనట..!
-
మోదీ మరో సంచలనం ఇదేనట..!
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్తో పెను సంచలనానికి తెరలేపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోనున్న తదుపరి నిర్ణయంపై షాకింగ్ న్యూస్ ఒకటి వార్తల్లో నిలిచింది. గత ఏడాది జులైలో సిట్ చేసిన కీలక సూచనను అమలు చేసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం రూ.15లక్షలకుమించిన నగదు నిల్వలపై కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలను నిషేధించిన కేంద్రం తాజాగా ఒక వ్యక్తి లేదా సంస్థల క్యాష్ హోల్డింగ్స్ పై కూడా పరిమితులు విధించనుందట. నల్లధనంపై యుద్దంలో భాగంగా జీఎస్టీ అమలుతోపాటు, మరో సంచలనానికి కేంద్రం తెరతీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో నల్ల ధనం చలామణికి చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సిఫారసులు చేసింది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీల రద్దుతో పాటు రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నాయకత్వంలోని సిట్.. ఈ సిఫారసులు చేసింది. అలాగే నగదు నిల్వలపై పరిమితులు లేకుండా ఈ నిషేధం అమలు చేయడం కష్టమని కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం ఏ వ్యక్తి, సంస్థా రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని కోరింది. అయితే మరింత నగదు అవసరమైనపుడు సంస్థలు, వ్యక్తులు తమ ప్రాంతంలోని ఐటి శాఖ అధికారుల అనుమతితో అధిక నగదు ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని నివేదించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ నగదు నిల్వ పరిమితిపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, దీనికోసం ఒక ఆర్థికబిల్లును తీసుకురావాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు తరువాత నగదు ఉపసంహరణలపై రూ.150 బాదుడు నిర్ణయాన్ని ప్రకటించాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ ,యాక్సిస్ బాటలో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుకూడా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
పాశవికం
► కలకలం రేపిన దంపతుల హత్య ► మృగాలను మరపించిన దుండగులు ► పోలీసు జాగిలం, క్లూస్ టీం బృందం నిశిత పరిశీలన ► మంట కలసిపోతున్న మానవ సంబంధాలు ► నిందితులను పట్టుకుని తీరుతాం : పోలీసులు రేణిగుంట: అమావాస్య చీకటిలో ఊహకందని విషాదం. దుం డగులు మానవ మృగాలుగా మారి కళ్లెదుటే భర్తను దారుణంగా హతమార్చారు. ఆపై ఆరు పదుల వయస్సున్న వృద్ధురాలిని కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి పాశవికంగా కామవాంఛ తీర్చుకుని ఊపిరి తీశారు. ఈ హృదయ విదారక సంఘటన రేణిగుంట మండలం ఆర్.మల్లవరం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఊరుగాని ఊరొచ్చి.. పూతలపట్టుకు చెందిన కొత్తపల్లి శీనయ్య(65), ఇందిరమ్మ(58) దంపతులకు కుమారులు రాజశేఖర్, కుమార్, కుమార్తె కళావతి ఉన్నారు. వీరు 30 ఏళ్ల క్రితం రేణిగుంట మండలానికి వచ్చి స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. పంట చేలు, మామిడి తోటల్లో కాపలా ఉంటూ పొట్టపోసుకుంటున్నారు. ఏడాది క్రితం సమీపంలోని గుత్తివారిపల్లె గిరిజనకాలనీలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్కడే ఓ గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. వారి సమీపంలోనే పెద్ద కుమారుడు రాజశేఖర్ కుటుంబం, కూతురు కళావతి, ఆమె భర్త వెంకటేశు కాపురముంటున్నారు. రెండు నెలల క్రితం నుంచి ఆర్.మల్లవరం సమీపంలోని సదాశివరెడ్డి పొలాల వద్ద కాపలా ఉంటున్నారు. వీరికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నారు. గత గురువారం శీనయ్య తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో పూతలపట్టుకు వెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పొలం వద్ద కాపలా ఉండాల్సి రావడంతో శీనయ్య శుక్రవారం గుత్తివారిపల్లెకు చేరుకుని అక్కడి నుంచి పనికి కుదిరిన పంపు షెడ్డు వద్ద వెళ్లాడు. పూతలపట్టు నుంచి ఆదివారం మధ్యాహ్నం గుత్తివారిపల్లెకు చేరుకున్న శీనయ్య భార్య ఇందిరమ్మ ఇంట్లో భర్త లేకపోవడంతో మల్లవరంలోని పంపు షెడ్డు వద్దకు వచ్చింది. సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఇటీవలే శీనయ్య పాముకాటుకు గురై పత్యం ఉండడంతో ఇంట్లో వండిన చేపలకూర పెట్టలేదని అలిగి రాత్రి 8 గంటలకు పంపు షెడ్డుకు బయలుదేరాడు. అతనితోపాటు భార్య కూడా వెళ్లింది. ఇద్దరూ అక్కడే పడుకున్నారు. అతి కిరాతంగా హతమార్చిన వైనం రాత్రి వెళ్లిన తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని సోమవారం ఉదయం సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, అర్బన్ సీఐ బాలయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరూ గదిలో చాపపై పడుకున్న చోటే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. డాగ్స్క్వాడ్ను రప్పించారు. దుండగులు తొలుత ఎలుకలు పట్టేందుకు వినియోగించే ఇనుప గునపంతో శీనయ్య తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని భార్య ఇందిరమ్మను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. గోడ చువ్వలకు తాళ్లను బిగించి విచక్షణా రహితంగా అత్యాచారం చేసి ఆపై తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. పోలీసు జాగిలం అక్కడి నుంచి గది వెనుకకు వెళ్లి మృతుల అల్లుడు వెంకటేశు కూర్చున్న చోట కాసేపు ఆగింది. అక్కడి నుంచి హైవేపై పరుగులు తీసి సమీపంలో ఉన్న మల్లవరం ఎస్టీ కాలనీలోకి వెళ్లింది. పోలీసులు మృతుల అల్లుడు వెంకటేశును విచారించారు. అలాగే గదిలో హత్యకు వినియోగించిన గునపాన్ని, మూడు మందు బాటిళ్లను, సెల్ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. -
ఎంత నగదు వాడుకుంటే అంతే వడ్డీ!
• దేశంలోనే తొలి క్రెడిట్ లైన్ యాప్ మనీటాప్ • రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదు లభ్యత • హైదరాబాద్లో సేవలు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు వ్యాపార సముదాయాలకు మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ సేవలు ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారులకూ చేరాయి. క్రెడిట్ లైన్ అంటే బ్యాంకులు ఎలాంటి వడ్డీలేకుండా రూ.5 లక్షల వరకూ నగదును అందిస్తాయి. అయితే బెంగళూరుకు చెందిన మనీటాప్ స్టార్టప్... ఆర్బీఎల్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని ఈ సేవలను వ్యక్తిగత వినియోగదారులకూ అందుబాటులోకితీసుకొచ్చింది. గురువారమిక్కడ మనీటాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా సంస్థ కో–ఫౌండర్ అనుజ్ కక్కర్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా మనీటాప్ యాప్ను డౌన్లోడ్చేసుకోవాలి. సంబంధిత వివరాలు అందజేశాక... క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ నుంచి అనుమతి రాగానే.. కస్టమర్ కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదును పొందే వీలుంటుంది. అయితే ఈపరిమితిలో ఎంత నగదును వాడుకుంటే దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు కూడా కనిష్టంగా నెలకు 1.25 శాతం ఉంటాయి. అసలును 2 నెలల నుంచి 3 ఏళ్ల లోపు నెలవారి వాయిదా (ఈఎంఐ)పద్ధతుల్లో చెల్లిస్తే సరిపోతుంది. గతేడాది అక్టోబర్లో సేవలను ప్రారంభించిన మనీటాప్.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె, బరోడా నగరాల్లో సుమారు 70 వేల మంది వినియోగించుకుంటున్నారు. -
ఏరుదాటి తెప్ప తగలేస్తారా!
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది ఇందిరమ్మ ఇళ్లు రుణాలు వసూలుకు వెళ్లిన అధికారులపై లబ్ధిదారుల మండిపాటు మునిసిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లను చుట్టుముట్టిన పేదలు భీమవరం : ’ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం రుణాల మాఫీ బాధ్యత తమదేనని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో బ్యాంకోళ్లు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి రుణాలు కట్టాలంటున్నారు. లేదంటే ఇళ్లను స్వాధీనం చేసుకుని తాళాలు వేస్తామంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే జాడలేదు. ఏరు దాటాక తెప్ప తగలేస్తారా. మా బతుకుల్ని రోడ్డున పడేస్తారా’ అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మండిపడ్డారు. ’మా ఇళ్లకు తాళాలు వేస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటా’మని హెచ్చరించారు. భీమవరం పట్టణ పరిధిలోని తాడేరు రోడ్డులో వైఎస్సార్ కాలనీ (టౌన్షిప్) లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం నిమిత్తం తమ బ్యాంకులో తీసుకున్న రుణాలను చెల్లించని దృష్టా్య రెవెన్యూ రికవరీ చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్బీఐ అధికారులు హెచ్చరించారు. పోలీసుల సాయంతో బ్యాంకు అధికారులు బుధవారం అక్కడకు వెళ్లగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 200507 సంవత్సరాల మధ్య టౌన్షిప్లోని సుమారు 139 మంది ఒక్కొక్కరు రూ.74 వేల వ్యయంతో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు› నిర్మించుకున్నారు. వారికి భీమవరం ఏడీబీ శాఖ ఒక్కొక్కరికి రూ.28 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. వీరంతా నిరుపేదలు కావడంతో వాయిదాలు చెల్లించేందుకు అవస్థలు పడ్డారు. ఆ తరుణంలో 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం వచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఇళ్ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వాయిదాలు కట్టాలని ఎవరైనా వస్తే తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. రుణాలు మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనిని నమ్మిన పేదలంతా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా రుణాలు మాఫీ కాలేదు. ఇదిలావుంటే.. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం రుణాలు వసూలు చేసుకోడానికి జిల్లా కలెక్టర్ అనుమతితో ఎస్బీఐ ఛీప్ మేనేజర్ ఐ.ఫణికొండలరావు, ఫీల్ట్ ఆఫీసర్ పీఎస్ఎన్ మూర్తి, తహసీల్దార్ చవాకుల ప్రసాద్ తదితరులు బుధవారం ఉదయం 9 గంటలకు టౌన్షిప్కు చేరుకున్నారు. రుణాలు చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామని హెచ్చరించడంతో లబోదిబోమన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీచేస్తామంటూ హామీ ఇచ్చారని విన్నవించుకున్నారు. తమకు అటువంటి ఆదేశాలేమీ రాలేదని, అప్పు చెల్లించకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించడంతో వారిలో ఆందోళన ఎక్కువైంది. బాధితులకు బాసటగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు టౌన్షిప్కు చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. ఽరుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో అమాయక ప్రజలతో ఓట్లు వేయించుకుని అవసరం తీరిపోయాక పేదలను గాలికి వదిలేస్తారా అని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ హామీతో రుణాలు చెల్లించలేకపోయారని, ఈ పరిస్థితుల్లో పేదల ఇళ్లకు తాళాలు వేస్తామంటూ ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. రుణాలు మాఫీ చేయకుంటే బాధితుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మునిసిపల్ చైర్మన్ను నిలదీసిన లబ్ధిదారులు కొంతసేపటికి మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వార్డు కౌన్సిలర్ యర్రంశెట్టి చందు అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా వారిని చుట్టుముట్టారు. ’ఎన్నికల్లో మీ నాయకుడు హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇదేంటి’ అని నిలదీశారు. కంగుతిన్న మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు రుణాలు ఇప్పటికిప్పుడు చెల్లించలేరని, వారికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు స్వయంగా రుణాలు మాఫీ చేస్తానని చెబితే గడువు కోరడం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులకు నచ్చచెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్లడతో పరిస్థితి చక్కబడింది. ఎన్నికల హామీ ఏమైంది..... ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు, అంజిబాబు టీడీపీకి ఓట్లువేస్తే ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మేమంతా ఓట్లు వేసి గెలిపించాక.. మూడేళ్లకు బ్యాంకోళ్లు వచ్చి రుణాలు చెల్లించాలంటున్నారు. హామీ ఇచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు. రోజు గడవమే కష్టంగా ఉన్న మేం బ్యాంకు రుణాలు ఎలా చెల్లించగలం. నూకలక్ష్మి, లబ్ధిదారు డబ్బున్న పెద్దలకే రుణాలు మాఫీ చేస్తారా డబ్బున్న పెద్దలకు కోట్లకు కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తోంది. మాలాంటి పేదలు గూడు కట్టుకుంటే కొద్దిమొత్తం రుణం మాఫీ చేయడానికి మీనవేషాలు లెక్కించడం దారుణం. ఇప్పుడు రుణాలు చెల్లించాలంటే ఆత్మహత్యలే శరణ్యం. షకీరా, లబ్ధిదారు పనుల్లేక ఇబ్బంది పడుతుంటే ఇదేంటి పెద్ద నోట్లు రద్దు చేయడంతో నెల రోజులుగా చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు దొరకడం లేదు, పేద ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్న తరుణంలో బ్యాంకు రుణాలు వసూలు చేస్తారా. పేదల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా. నాయకులు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి. పార్వతి, లబ్ధిదారు -
‘ఇందిరమ్మ’ కాల్వ పనులకు 108 కోట్లు
నీటి పారుదల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్లో భాగంగా చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఇందిరమ్మ వరద కాల్వ (ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా చేపట్టనున్న పనులకు రూ.108.18 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులిచ్చారు. మిడ్మానేరు కుడి కాల్వల పరిధిలో ప్యాకేజీ-1లోని 17.75 కిలోమీటర్ల పొడవైన కాల్వల పనులకు రూ.54.92 కోట్లు, 17.5 కి.మీ. నుంచి 36.12 కి.మీ. వరకు పనులున్న ప్యాకేజీ-2కి రూ.53.96 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వరద కాల్వ కింద 1.9 లక్షల ఎకరాలుండగా, కొత్తగా దేవాదుల పరిధిలోని 2 లక్షల ఎకరాలు, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలోని 30 వేల ఎకరాలను దీని పరిధిలోకి తేవడంతో ఆయకట్టు 4.2 లక్షల ఎకరాలకు పెరిగింది. గోదావరిలో 120 రోజులే నీటి లభ్యత! గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదులకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే గోదావరిలో వరద కేవలం 120 రోజులే ఉంటుందని, దేవాదులకు 27 టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు. దీంతో ఈ ఆయకట్టుకు వరద కాల్వ ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మిడ్మానేరు కెనాల్ తొలి 36 కి.మీ. వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,650 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి మట్టాన్ని 305.87 నుంచి 307.45కు పెంచాలని కరీంనగర్ ప్రాజెక్టుల అధికారులు సూచించారు. -
ఇందిరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు
లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేసుకోవాలి ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్ పీడీ నర్సింహారావు సమీక్ష ముకరంపుర: ఇందిరమ్మ పథకంలో పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్దిదారులకు బిల్లులు మంజూరైనట్లు హౌసింగ్ పీడీ నర్సింహరావు తెలిపారు. శనివారం ఈ విషయమై ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్శాఖ కార్యాలయంలో సమీక్షించారు. ఇందిరమ్మ పథకంలో ఇంతకు ముందు బిల్లులు పొంది గృహాలు నిర్మాణంలో ఉన్నటువంటి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో క్షేత్రస్థాయి విచారణలో భాగంగా బిల్లులు పొంది నిర్మాణ దశలో 3926 ఇందిరమ్మ లబ్ధిదారులున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనికి రూ.12.75 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా లబ్దిదారుల ఖాతాలు డార్మెంటరీ, నాన్ ఆపరేటివ్లో ఉంటాయని, అర్హత కలిగిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో కొంత డబ్బును జమ చేసుకుని అకౌంట్ను ఆపరేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పాస్బుక్, జిరాక్స్, గృహం నిర్మించినప్రస్తుత స్థాయి ఫొటో, ఆధార్కార్డు జిరాక్స్, సంబంధిత హౌసింగ్ ఏఈకి బిల్లు కొరకు సమర్పించాలని తెలిపారు. ఆ తదుపరి లబ్ధిదారుల బిల్లులు ఆన్లైన్లో జనరేట్చేసి ప్రధాన కార్యాలయానికి సిఫారసు చేసిన అన ంతరం వారి ఖాతాలో జమ చేయబడుతుందన్నారు. -
కల తీరకుండానే
♦ కన్నుమూశారు.. ♦ ఇందిరమ్మ లబ్ధిదారుల దయనీయం ♦ సొంతింటి కల తీరకుండానే కన్నుమూత ♦ ‘సమీక్ష’లో బయటపడిన వాస్తవం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పునాదులు తీశారు.. బేస్మెంట్ కట్టారు.. గోడలు లేపారు. పై కప్పు వేసుకుంటే ఇక గృహప్రవేశమే.. సొంతింటి కల నెరవేరబోతుందనుకున్నారు వాళ్లు.. కానీ ఏళ్లకేళ్లుగా బిల్లులు రాక.. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో దాదాపు వంద మంది చనిపోయారని, వారి ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, ఇప్పుడు వారికి బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, రూ.16 కోట్ల బకాయి ఉదంటూ గు‘బిల్లు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ జిల్లా సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు.. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశానికి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశం అందోల్లో అదీ సంగతి! ‘అందోల్ ఐఏవై ఇళ్ల స్టేటస్ ఏమిటి? డీఈ ఎవరు? ఒకసారి లేవండి. సమావేశానికి రాలేదా?..’ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు. ఓ ఏఈ ధైర్యం చేసి ఆందోల్కు రెగ్యులర్ డీఈ, ఇన్చార్జి డీఈ లేరని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆందోల్ నియోజకవర్గానికి రెండేళ్లుగా గృహనిర్మాణ శాఖ డీఈ లేరు. ఈ విషయం సమీక్ష సమావేశంలో బయటపడే వరకు జిల్లా కలెక్టర్కు కూడా తెలియదు. అందోల్ గృహ నిర్మాణ శాఖ డీఈ ధర్మారెడ్డిని సంగారెడ్డి నియోజకవర్గానికి డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కనీసం ఇన్చార్జి కూడా లేకుండానే రెండేళ్లు గడవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పట్టింది. -
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి
భువనగిరి:మద్యంమత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని రాయిగిరి గ్రామాంలో ఉన్న ఓ డబా హోటల్లో జరిగింది. వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అంతరి బాలస్వామి కేసారం గ్రామానికి చెందిన మకయ్యలు మద్య సేవించేదుకు రాయిగిరి డబాలో కుర్చున్నా రు. ఈ నేపథ్యంలో ఇరువురి మద్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఈ క్రమంలో బాలస్వామిపై సీసా తో మక్కయ్యదాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
షరతులు వర్తిస్తాయి !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇందిరమ్మ పథకంలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన 30వేల ఇళ్లు ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి రూ. 4.5కోట్లు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటి నిర్మాణం పూర్తవ్వాలంటే చెల్లింపుల మొత్తం ఇంకా పెరగాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల బిల్లు చెల్లింపులను నిలిపివేసింది. జియో ట్యాగింగ్ అంటూ జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో లబ్ధిదారులు చాలా మంది అక్కడా ఇక్కడా అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొంతమంది మొండిగోడలతో వదిలేశారు. లబ్ధిదారుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో ఇప్పుడా పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలు రెండేళ్లుగా లావాదేవీలు జరగకపోవడంతో ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు వినియోగించినా సాంకేతికంగా పనిచేయవు. వాటిని పునరుద్ధరించుకుంటేనే బిల్లులు చెల్లిస్తామంటూ ఆంక్షలు విధించింది. అంతేగాదు ప్రస్తుతం అమలు చేస్తున్న 6పాయింట్ల ప్రాతిపదికను పరిశీలిస్తామని చెబుతోంది. అదే ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై దాదాపు ఐదారేళ్లు అవుతోంది. ఆ తర్వాత లబ్ధిదారుల స్థితిగతులు మారుతాయి. ఈ క్రమంలో తాజాగా 6పాయింట్ల ప్రాతిపదికను అవలంబిస్తే కొందరు లబ్ధిదారులు అనర్హులవుతారు. 6 పాయింట్లు ఏంటంటే.., నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ఐదెకరాలు పల్లపు భూములు లేదా 10ఎకరాల మెట్టు భూములు ఉన్న వారు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు, రూ.500కన్నా ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చిన వారు, భార్యభర్తల్లో ఎవరో ఒకరి పేరు మీద ఇంటి పన్ను ఉన్నవారు, వరుసగా నాలుగు నెలలు రేషన్ సరుకులు తీసుకోని వారు అనర్హులవుతారని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా కారు, రూ.500విద్యుత్ బిల్లు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు అనేవి ఇబ్బందికరంగా మారాయి. ఐదేళ్ల క్రితం ఇళ్లు మంజూరైన లబ్ధిదారుని పరిస్థితులు క్రమేపీ మారడానికి అవకాశం ఉంది. ఆ క్రమంలో విద్యుత్ బిల్లు పెరగొచ్చు. కారు కొనుక్కోవచ్చు. భార్యభర్తల్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం రావొచ్చు. అంతమాత్రాన గతంలో పొందిన లబ్ధికి తాజా అంశాలను ముడిపెట్టడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఏదో ఒక కొర్రీ పెట్టి గత లబ్ధిదారులను వదిలించుకోవడమే ప్రభుత్వం ఆలోచనగా కనబడుతోందనే వాదనలు విన్పిస్తున్నాయి. -
ఇందిరమ్మ’కు వాస్తుదోషం!
► చియ్యేడులో మూఢ నమ్మకం ► ఇళ్లు నిర్మించి ఐదేళ్లు పూర్తి అయినా ఒక్కరూ గృహప్రవేశం చేయని వైనం ► రూ.10 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనానికీ తాళం సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో పరుగులు తీస్తున్న రోజులివి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్న కాలమిది.. అయినా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు నేటికీ సమసిపోవడం లేదు. అందుకునిదర్శనమే అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామం. ఈ గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తు సరిగా లేదన్న కారణంగా ఎవరూ గృహప్రవేశాలు చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారుు. వీటి సమీపంలోనే రూ.10 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనానిదీ అదే పరిస్థితి. చియ్యేడు (అనంతపురం అర్బన్/రూరల్): అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడుకు 2010-11 ఆర్థిక సంవత్సరంలో 250 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఊరిలోనే 150 మంది లబ్ధిదారులు సొంత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకున్నారు. సొంత స్థలం లేని 100 మందికి ఇళ్లు కట్టించేందుకు ఊరికి ఎగువ ప్రాంతంలో 2.50 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. తొలుత 50 మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక తలుపులు కిటికీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగిలిన 50 మంది కూడా పునాది పనులు పూర్తి చేసుకున్నారు. మరేమయ్యింది... 50 ఇళ్లు గృహ ప్రవేశాలకు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో ఊరికి ఎగువ భాగంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తుదోషం ఉంది... అందులో ఎవరూ చేరినా బాగుపడరనే ఒక వదంది ఊరంతా పాకింది. దీంతో ‘ఇందిరమ్మ’ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన మొదలయ్యింది. చేరాలా వద్దా అనే సంశయంలో పడిపోయారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చివరికి అందులో చేరకూడదని అంతా నిర్ణయించుకున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం పునాది పనులు చేసిన వారు కూడా అంతటితో నిలిపివేశారు. పంచాయతీ భవనానికి ఇదే గతి... ఇందిరమ్మ ఇళ్ల సమీపంలో రూ.10 లక్షలు వెచ్చించి 2010-11 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. అరుుతే వాస్తుదోషం వదంతితో ఈ కార్యాలయం కూడా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం విశేషం. అప్పుడు వేసిన తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. వాస్తుదోషముందని చెప్పారు ఊరికి ఎగువన నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తు దోషం ఉందని చెప్పారు. దీంతో అందులోకి చేరేందుకు ఎవ్వరమూ ఇష్టపడడం లేదు. ఇళ్లను కట్టేందుకు స్థలం సేకరిస్తున్నప్పుడే ఆ స్థలం వద్దని కూడా చెప్పాం. అయినా వినిపించుకోకుండా అధికారులు స్థలాన్ని కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించారు. - పూజారి పెద్ద వెంకటరాముడు, గ్రామస్తుడు ఎవరూ చేరలేదని మేమూ పోలేదు అక్కడ కట్టిన ఇళ్లలో ఎవరూ చేరడం లేదు. వాస్తు దోషం అంటున్నారు. అదేమిటో మాకు తెలియదు. ఎవరైనా చేరితే మేమూ చేరుదామనుకున్నాం. ఎవరూ పోలేదు కాబట్టి మేము పోవడం లేదు. - చంద్రకళ, గ్రామస్తురాలు -
చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్
స్పష్టం చేసిన ‘పనామా పేపర్స్’ కంపెనీలు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చట్టాల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ‘పనామా పేపర్స్’లో పేర్లున్న కార్పొరేట్ కంపెనీలు స్పష్టం చేశాయి. పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నామని తమపై వచ్చిన వార్తలు సరికాదని డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, ఇండియాబుల్స్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆర్బీఐ పరిమితికి లోబడే ఇన్వెస్ట్మెంట్స్... ఆర్బీఐ, ఫెమా, ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని డీఎల్ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. డీఎల్ఎఫ్ ప్రమోటర్ కుటుంబం బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేశాయని, కోటి డాలర్ల వరకూ నల్లధనాన్ని పోగేసుకున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. 2004లో ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో తమ ప్రమోటర్ గ్రూప్లు ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వివరాలన్నీ ప్రతి ఏటా ఆదాయపు పన్ను విభాగానికి నివేదిస్తునే ఉన్నామని, డీఎల్ఎఫ్ వార్షిక నివేదికలోనూ పొందుపరుస్తామని వివరించారు. అంతా నిబంధనల ప్రకారమే... విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే చట్టాల ప్రకారమే అపోలో టైర్స్ గ్రూప్ చైర్మన్ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారని అపోలో గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని వివరించారు. అపోలో గ్రూప్ చైర్మన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఎన్నారైలని, ఇతర దేశాల చట్టాల ప్రకారమే వారు పెట్టుబడులు పెట్టారని వివరించారు. భారత దేశ ఆదాయపు పన్ను చట్టం, ఆర్బీఐ నియమనిబంధనలు, ఆంక్షలు వారికి వర్తించవని స్పష్టం చేశారు. భారత్లో పూర్తిగా పన్నులు చెల్లించిన తర్వాతనే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని ముంబైకి చెందిన ఇండియాబుల్స్ సంస్థలకు చెందిన సమీర్ గెహ్లాట్ పేర్కొన్నారు. -
'వాళ్లపై కేసులు పెడితే జైళ్లు చాలవు'
సాక్షి, హైదరాబాద్: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకుగాను 250 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు..ఇది ఎవరి పాపం..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు నేరుగా భాగస్వాములయ్యారు..ఇండ్లు కట్టకముందే బిల్లులు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లక్షా 70 వేల ఇందిరమ్మ ఇళ్లను సీబీసీఐడీ పరిశీలిస్తే లక్షా 20 వేల ఇళ్లు కట్టినవేనని తేలిందన్నారు. వీటికి సంబంధించి రూ.273..13 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించామని, మిగిలిన బకాయిలను సైతం చెల్లిస్తామన్నారు. సీబీసీఐడీ నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన ఇళ్లకు చెల్లిస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదని డబుల్ బడ్రూం ఇళ్ల పథకంపై అనుమానాలు అవసరం లేదన్నారు. రూ.1735 కోట్ల హడ్కో రుణంతో 2016-17లో 2లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచామని, అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. డబుల్ బడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నగరంలో 1.51లక్షల ఇళ్లకు సరిపడ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 382 ఎకరాలు, జీహెచ్ఎంసీ వెలుపల 299 ఎకరాలను గుర్తించామన్నారు. కాగా..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు అని మంత్రి చేసిన వ్యాఖ్యాలను కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలను తెలిపింది. -
దోచెయ్
► ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో అక్రమాలు ► విచారణకు ఆదేశించిన కలెక్టర్ ► ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే విచారణకు పంపిన వైనం దీపం ఉండగానే ‘ఇల్లు’ చక్కబెట్టుకోవాలనుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం ఉంది.. ఆపై అధికారి అండా ఉంది. ఇంకేముంది.. అక్రమాలకు యథేచ్ఛగా తెర లేపారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామంటూ ఆర్డీటీ ఇళ్లపక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. వాటిని హౌసింగ్ ఏఈ గుడ్డిగా ఆమోదించారు. 2015 నవంబర్ 7న, డిసెంబర్ 30న ఒక్కొక్కరికి (ఐడీ నంబర్లు : పి 31496959, పి31931994) రూ.41,400 చొప్పున ఇద్దరికి రూ.82,800 మంజూరు చేశారు. మరో 28 మందికి ఇదే తరహాలో బిల్లుల మంజూరుకు రంగం సిద్ధం చేశారు. తలుపుల : మండలంలోని కాయలపల్లిలో 2008 సంవత్సరంలో ఇందిరమ్మ పథకం కింద 30 మందికి పక్కాగృహాలు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులు నిర్మించుకోలేదు. కొందరు పునాదులు వేసి వదిలేశారు. ఇదే సమయంలో ఆర్డీటీ గ్రామంలోని నిరుపేదలకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చింది. సుమారు 50 ఇళ్లను నిర్మించి కాలనీగా ఏర్పాటు చేసింది. కాగా.. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని టీడీపీ నాయకులు రెండేళ్లుగా హౌసింగ్ ఏఈ అశ్వర్థనారాయణపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించకుండానేబిల్లులు మంజూరు చేయడం కుదరని ఆయన తేల్చిచెప్పారు. ఏఈ అశ్వర్థనారాయణ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కులచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈయనతో టీడీపీ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చిన బిల్లుల్లో చెరిసగం పంచుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులను అక్కడ ఆర్డీటీ వారు పూర్తి చేసిన ఇళ్ల వద్ద నిలబెట్టి ఫొటోలు తీయించారు. అయితే.. ఆ ఫొటోలను ఆన్లైన్లో పొందుపర్చలేదు. ఎలాంటి ఇంటి నిర్మాణం చేపట్టకపోయినా గత ఏడాది నవంబర్ ఏడు, డిసెంబర్ 30న ఇద్దరు లబ్ధిదారులకు (ఐడీ నంబర్లు పి 31496959, పి31931994 ) ఒక్కొక్కరికి రూ.41,400 చొప్పున రూ.82,800 మంజూరు చేశారు. మరో 28 మందికి ఇదే తరహాలో బిల్లులు మంజూరు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ అవినీతిపై విచారణ చేపట్టాలని గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు చలపతి నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలెక్టరేట్లో జరిగిన ‘మీకోసం’లో వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా తిరిగి ఏఈ కులచంద్రారెడ్డినే నియమించారు. దీంతో దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. గత నెల 27న ఏఈ కులచంద్రారెడ్డి విచారణకు రాగా.. గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారు. ఆరోపణలున్న అధికారినే పంపితే ఎలా ? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా హౌసింగ్ బిల్లులు అక్రమంగా చేసిన అధికారినే విచారణకు పంపితే నేను ఎందుకు వెళ్లాలి?గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై విచారణకు ఉన్నత స్థాయి అధికారిని నియమిస్తే అంతులేని అవినీతి బయట పడుతుంది. - చలపతి నాయుడు, ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడే విచారణకు రాకుంటే ఎలా ? ఆరునెలల క్రితం నేను ఏఈగా విధుల్లో చేరా. డీఈ స్వయంగా వచ్చి నన్ను ఆ గ్రామానికి తీసుకెళ్లారు. ఆయన సూచించిన ఇళ్లకు బిల్లులు చేయమన్నారు. ఆయన ఆదేశాల మేరకు నేను చేశా. హౌసింగ్ బిల్లుల మంజూరులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుదారుడే విచారణకు రాకపోతే ఎలా?- ఏఈ కులచంద్రారెడ్డి -
రట్టుకానున్న ఇంటిగుట్టు?
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవినీతి చోటు చేసుకుందని తేల్చిన యంత్రాంగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకోసం విచారణాధికారిగా అజయ్ కల్లం ను నియమిం చారు. జిల్లాలో గతంలో నిర్మించిన గృహ నిర్మాణాల్లో ఒక్కొక్కరికీ రెండేసి , మూడేసి ఇళ్ల చొప్పున మంజూరు చేశారని అధికారులు తేల్చారు. జియోట్యాగింగ్ నేపథ్యంలో ఈ అక్రమాలు బయటపడినట్లు నివేదించారు. సుమారు రూ.45 కోట్ల అక్రమాలు జరిగినట్టు నివేదికలు రూపొందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే ఇప్పుడు దీనిపై విచారణాధికారిగా అజయ్ కల్లంను ప్రభు త్వం నియమించడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. అక్రమాలతో పాటు తప్పులు : వాస్తవానికి జిల్లాలో జియోట్యాగింగ్ కార్యక్రమంతోపాటు ఆధార్ అనుసంధానం వంటివి అధికారుల నిర్లక్ష్యంతో సక్రమంగా చేపట్టలేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఒకరి పేరున రెండు మూడేసి పేర్లను నమోదు చేశారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 20 సూత్రాల అమలు కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై అక్రమాల కన్నా తప్పులెక్కువగా చోటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. అవినీతి జరిగి ఉంటుంది కానీ అందులో తప్పులు కూడా జరిగాయని అంటున్నారు. ఏమైనా జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పరంగా జరిగిన అవినీతిపై విచారణ జరిగితే ఎంతమందిపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి నిధులను వెనక్కు తీసుకుంటారోనన్న విషయం మరికొద్ది రోజుల్లో బయటపడనుంది. -
‘ఇందిరమ్మ’ అక్రమాల్లో 2 వేల మందికి జైలే!
రూ. 350 కోట్ల దుర్వినియోగం: హరీశ్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై సీబీసీఐడీ చేసిన ప్రాథమిక విచారణలో రూ.350 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే 2 వేల మంది జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే మరింత అవినీతి బయటకి వచ్చే అవకాశం ఉందని హరీశ్ అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్కు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు తరలిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మిషన్కాకతీయ పథకం తొలివిడత ఫలాలు అందాయని, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేసినట్లు చెప్పారు. -
వ్యక్తిగత సంపదలో భారత్కు 10వ స్థానం
న్యూఢిల్లీ: దేశాల వారీగా వ్యక్తిగత సంపద విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ప్రైవేటు సంపద విలువ 3,492 బిలియన్ డాలర్లు. ఆస్తి, నగదు, ఈక్విటీలు, బిజినెస్ ప్రయోజనాలుసహా ప్రతి దేశంలోని వ్యక్తులందరి ప్రైవేటు సంపద ప్రాతిపదికన న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ 2015కు సంబంధించి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ వరుసలో 48,734 బిలియన్ డాలర్లతో అమెరికా ముందు నిలిచింది. వరుసలో తరువాత 8 స్థానాల్లో చైనా(17,254 బిలియన్ డాలర్లు), జపాన్(15,230 బి. డాలర్లు), జర్మనీ (9,358 బి. డాలర్లు), బ్రిటన్(9,240 బి. డాలర్లు), ఫ్రాన్స్(8,722 బి. డాలర్లు), ఇటలీ (7,308 బి. డాలర్లు), కెనడా(4,796 బి. డాలర్లు), ఆస్ట్రేలియా(4,497 బి. డాలర్లు) నిలిచాయి. తలసరి విషయంలో 20వ ర్యాంక్. కాగా ఈ సంపద తలసరి విషయానికి వచ్చే సరికి భారత్ 20వ స్థానంలో నిలిచింది. భారతీయుని సగటు సంపద 2,800 డాలర్లుగా ఉంది. అధిక జనాభా దీనికి కారణంగా కనిపిస్తోంది. 2,85,100 డాలర్లతో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అయితే 2000వ సంవత్సరంలో భారత్లో వ్యక్తిగత సంపద తలసరి కేవలం 900 డాలర్లు. 2015 నాటికి 211 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ 15 సంవత్సరాల్లో భారీగా సంపద వృద్ధి నమోదుచేసుకున్న దేశం ర్యాంకుల్లో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. -
‘ఇందిరమ్మ’ బిల్లులొచ్చేశాయ్!
రూ.178 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న 39,429 ఇళ్లకు పెండింగు బిల్లులు విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు సంబంధించి రూ.178 కోట్లను విడుదల చేసింది. ఇందులో రూ.40 కోట్లు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ ్ఞ్ఞఅయ్యాయి. మిగిలిన మొత్తాన్ని సోమవారం నుంచి వేగంగా లబ్ధిదారుల ఖాతాలకు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉండగా కేవలం 50వేల ఇళ్లనే ప్రభుత్వం తొలుత పరిగణనలోకి తీసుకుంది. మిగతా వాటిని ‘విచారణ’ పేరుతో ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. కలెక్టర్ల విచారణ అనంతరమే నిధులు: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల బకాయిల విడుదల ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. దాదాపు రూ.500కోట్లు చెల్లించాల్సి రావటంతో తొలుత కొన్నింటినే చెల్లించాలని నిర్ణయించిం ది. నిర్మాణం పూర్తి చేసుకున్న దాదాపు 50 వేల ఇళ్లను ఇందుకు ఎంపిక చేసుకుంది. సీఐడీ దర్యాప్తు చేయించిన ప్రభుత్వం... ఈ 50 వేల ఇళ్లకు సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరిపి అర్హులనే ఎంపిక చేయాలని నిర్ణయించింది. విచారణ జరిపి అందులో 5,600 మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది. కాగా, దీర్ఘకాలంగా బిల్లుల చెల్లింపు లేక బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిచిపోవటంతో లబ్ధిదారుల ఖాతాలను బ్యాంకర్లు స్తంభింపజేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలంటే లబ్ధిదారులు రూ.వంద చెల్లించాలని బ్యాంకర్లు అంటున్నారు. -
కాంగ్రెస్పై ‘ఇందిరమ్మ’ అస్త్రం!
♦ వారి హయాంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేల్చిన సీఐడీ ♦ ఈ నివేదికతో విపక్షంపై ఎదురుదాడికి సర్కారు సమాయత్తం ♦ అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహం సాక్షి, హైదరాబాద్ : శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్పై ఎదురుదాడికి అధికారపక్షం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అక్రమాలపై సభలో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోం ది. నాటి అవకతవకలపై విచారణ జరిపి సీఐడీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎదురుదాడి చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై టీఆర్ఎస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, గృహనిర్మాణ శాఖ మాజీ మంత్రి అయిన ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలను సీఐడీ అందులో పొందుపరిచింది. మొదటి విడత విచారణలో 60 మంది అధికారులను బాధ్యులుగా తేల్చింది. అనర్హులకు ఇళ్లు కట్టబెట్టడం, ఒకే కుటుంబానికి వేర్వేరు కుటుంబ సభ్యుల పేర్లతో రెండు అంతకంటే ఎక్కువ యూనిట్లు మంజూరు చేయడం, ఇళ్లు నిర్మించకపోయినా బిల్లులు మంజూరు చేయడం వంటి అక్రమాలకు ఈ 60 మంది అధికారులు పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లమేరకు అధికారులు తప్పిదాలకు పాల్పడినట్లు పేర్కొంది. జానారెడ్డి నియోజకవర్గం లోని అనుముల మండలంలో ఇళ్లు నిర్మించకుండానే కొందరికి బిల్లులు ఇచ్చారని, ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు మంజూరైన వారు మరికొందరు ఉన్నారని తేల్చింది. ఉత్తమ్కుమార్ గతంలో ప్రాతినిధ్యం వహించిన కోదాడ, డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల నియోజకవర్గంలోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించింది. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి గత 20 ఏళ్ల గణాంకాలను సిద్ధం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలతో కాంగ్రెస్ను ఇరుకునపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు? బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటివిడతలో 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో సీఐడీ విచారణ జరిపింది. భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చి 60 మంది అధికారులను బాధ్యులుగా చేసింది. వీరితో పాటు పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి ఆధారాలు సేకరించింది. బాధ్యులైన అధికారులను ప్రశ్నించడం ద్వారా తమపై ఒత్తిడి తెచ్చిన రాజకీయ నేతల పేర్లు వారితో చెప్పించింది. వారిలో ప్రతిపక్ష నేత జానారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదట తప్పులకు పాల్పడిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ సూపర్వైజర్లపై కేసులు నమోదు చేయాలా లేదా అన్న విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వారిపై కేసులు నమోదు చేస్తే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తోంది. ‘కేసులు నమోదు చేసే విషయం ఎలా ఉన్నా, కాంగ్రెస్ అక్రమాలను అసెంబ్లీలో ఎండగడతాం. వారి అక్రమాల చిట్టా బయటపెడతాం’ అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. -
ముక్కు నేలకు రాస్తా
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడైనా నిర్మించినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇవి పత్రికల్లోనే కనిపిస్తున్నాయి తప్ప.. ఆచరణలో శూన్యమన్నారు. అవినీతి జరిగిందన్న సాకుతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిలిపేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ కాలనీలో చేపట్టిన మౌలిక సదుపాయాలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఆపేశారని తెలిపారు. దీంతో చిలుకూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫోన్లో ఎస్ఎంఎస్ పంపాడన్నారు. -
బిల్లు లొల్లి
‘ఇందిరమ్మ’ ఇళ్లకు డబ్బులు చెల్లించాలని కాంగ్రెస్ ఆందోళనలు వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై జిల్లా దద్దరిల్లింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయూల ఎదుట నిరసనలు హోరెత్తాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చొల్లెటి దామోదర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం హౌసింగ్ పీడీ లక్ష్మణ్కు వినతిపత్రం అందించారు. వారం రోజుల్లో బిల్లులిచ్చే ప్రక్రియ ప్రారంభించకుంటే మళ్లీ నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టంచేశారు. వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నర్సంపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ వుంత్రి బస్వరాజు సారయ్యు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు డబుల్బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయూలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులివ్వాలని కోరారు. సీఎం దిష్టిబొమ్మ దహనం మానుకోటలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి ముత్యాలమ్మ చెట్టు వరకు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగులోని వరంగల్- ఏటూరునాగారం జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆంగోతు బలరాం. కోఆర్డినేటర్ శంకర్నాయక్ తదితరులు రాస్తారోకో చేశారు. హామీలతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. ఇందిరమ్మ బిల్లులు త్వరగా చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి హెచ్చరించారు. పరకాలలో ధర్నా చేశారు. స్టేషన్ఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాజీ మంత్రి విజయరామారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి భువనగిరి ఆరోగ్యం, రాజారపు ప్రతాప్ మాట్లాడారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదని తెలిసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు చిర్ర సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల వాగ్వాదం వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా జనగామలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పారు. పాలకుర్తిలో నియోజకవర్గ ఇన్చార్జి దుగ్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డోర్నకల్లో నియోజకవర్గ ఇన్చార్జి ఎవరూ లేకపోవడంతో ధర్నా సాదాసీదాగా జరిగింది. -
కదంతొక్కిన కాంగ్రెస్..
నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు.. ధర్నాలు ఇందిరమ్మ బిల్లులు చెల్లించాలని డిమాండ్ సాక్షి నెట్వర్క్: ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ►ఖమ్మం జిల్లాలోని మధిరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధర్నాలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే నిర్మాణాలను కూల్చడం కాదని, కట్టుకున్న నిర్మాణాలను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్కు హితవు పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హరి రమాదేవి, డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ►నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్, నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ►మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని నిర్బంధించారు. గద్వాలలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే డీకే అరుణ పాల్గొన్నారు. జచ్చర్లలో పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి ఆందోళన లో పాల్గొన్నారు. ►ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి నాయకత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. చెన్నూరులో జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ►కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు విజయవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సంతోష్కుమార్, పీసీసీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు. పొన్నంతోపాటు కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్బాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బైఠారుుంచడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ►నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. మోర్తాడ్లో డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, నిజామాబాద్లో టీపీసీసీ నేత మహేష్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ►వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. వరంగల్ నగరంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి హౌసింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్లో మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారుు. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆందోళనలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ బకాయిలు రూ.32 కోట్లు
హుజూర్నగర్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బకాయిలు రూ.32కోట్లుగా తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వివిధ దశల్లో నిలిచిపోయిన లబ్ధిదారులకు బిల్లులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక వీరి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. పేదల సొంతింటి కల నిజం చేయడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదుకుడుల మధ్య ఈ పథకాన్ని కొనసాగించింది. అయితే నాడు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ పాలన రావడం, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గత ఏడాది మార్చి 17 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు చెల్లిం చాల్సిన సుమారు రూ. 32 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మా ణం చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి హామీ నేటి వరకు కార్యరూపం దాల్చకపోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు కూడా అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వపాలనలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల లబ్ధిదారులు విధిలేని పరిస్థితులలో కొందరు అప్పు లు చేసి నిర్మాణాలు పూర్తిచేయగా మరికొం దరు అసంపూర్తిగానే వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో 4,03,973 ఇళ్లు మంజూరు కాగా 2,22,943 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతేగాక 14,281 ఇళ్లు రూఫ్ లెవల్లో, 4,389 ఇళ్లు లెంటల్ లెవల్లో, 31,397 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 8,089 ఇళ్లు బేస్మెంట్ లోపు నిర్మాణ దశలో నిలిచిపోగా 1,22,874 ఇండ్ల నిర్మాణం నేటి వరకు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి గాను ఎస్సీ లబ్ధిదారులకు రూ. 1,05,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 1,00,000, ఇతరులకు రూ. 70,000లను వారి ఇంటి నిర్మాణ దశల వారీగా బిల్లులను అందజేసేవారు. అయితే పెరిగిన ధరలు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోకపోవడం, ఇచ్చే బిల్లులు కాస్తా సకాలంలో అందజేయకపోవడంతో నిరుపేదల సొంతింటి కల తీరని కోరికగానే మిగిలి పోయింది. అయితే వివిధ దశ లలో ఇంటి నిర్మాణం ఆగిపోయిన సుమారు 58,156 మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంటి నిర్మాణాలు ఎంత మంది పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారో వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని గతనెలలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హౌసింగ్ మండలస్థాయి అధికారులు ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 6,038 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 24 కోట్ల చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించాక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వివిధ దశలలో నిర్మాణాలు నిలిపివేసిన లబ్ధిదారులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నిర్మాణాలు నిలిపివేసిన తమను.. ప్రభుత్వం ప్రవేశపెడతామన్న నూతన ఇంటి నిర్మాణ పథకంలో అవకాశం కల్పించి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అంతేగాక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇందిరమ్మ ఇళ్లనిర్మాణ సమస్యలను పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేస్తుందో వేచిచూడాల్సిందే. లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లించాలి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలి. వివిధ దశలలో నిర్మాణాలు ఆగిపోయిన లబ్ధిదారులకు కూడా బిల్లులు అందించి నాడు నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలి. - ఇందిరాల వెంకట్రామ్, హుజూర్నగర్ -
అభివృద్ధికి ఆయనే చిరునామా!
సందర్భం తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రమించినంతగా మరెవరూ శ్రమించలేదు. యావద్దేశం ఆశ్చర్యపోయేలా వినూత్న పథకాలతో తెలుగు ప్రజలు జీవించడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. ఆయన నేడు ఒక వ్యక్తిగా మన ముందులేరు. కానీ.. ఒక శక్తిగా, ఆదర్శంగా, ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా, చిరంజీవిగా ప్రజల హృదయాల్లో వెలుగొందుతున్నారు. కాలమాన పరిస్థితులకు తగ్గ ట్టుగా ప్రజల కోసం పనిచేయ డానికి ముందుకు వచ్చే నాయ కులు తమని తాము పరిస్థితు లకు అనుకూలంగా మరల్చు కుంటారు. ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల నుండి ప్రజల కొరకు పనిచేసే నాయ కత్వం ఎలా ఉండాలంటే మనకు గుర్తుకు వచ్చేది వైఎస్ రాజకీయ జీవితం. తాను ఏ ప్రజల కోసం పనిచేశాడో... ఆ ప్రజలు ఆయనను తరచూ గుర్తుంచుకోవడం, ఆయన ఉంటే... ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావు అను కోవడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే... ఆయనను తరచూ విమర్శిస్తూ... విభేదించి ఆయనను తమ రాజ కీయ ప్రత్యర్థిగా భావించిన వారు సైతం.. నేడు రాజశేఖ రరెడ్డి బతికుంటే తెలుగునాట పరిస్థితులు ఇలా ఉండేవి కాదని అంగీకరించారు. తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ శ్రమించినంతగా మరెవరూ తెలుగునాట శ్రమించలేదు. కొందరు కొన్ని రంగాలలో కృషి చేసి ఉండొచ్చు. కానీ సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలుపరచిన తీరు తన రాజకీయ పరిణతికి, దక్షతకు, అకుంఠిత పట్టుదలకు నిదర్శనాలుగా నిలుస్తాయి. పోల వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోవడా నికి వైఎస్ పట్టుదలే అసలు సిసలు కారణం. ఆ ప్రాజెక్టు అనుమతులు సాధించడంలో వైఎస్ కనబర్చిన ఆసక్తి మరే నాయకుడిలోనూ మనకు కనపడదు. అంతేకాదు పోలవరం కుడికాలువకు 4 వేల కోట్లకు మించి వెచ్చిం చారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలకు భిన్నంగా కృష్ణా డెల్టా రైతాంగం చింతలు తీర్చడానికి పులిచింతల ప్రాజెక్టు చేపట్టి దాదాపు 4 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలు వలు చేపట్టారు. అదే ఒరవడిలో గాలేరు-నగరి, వెలి గొండ ప్రాజెక్టులు ఇటు రాయలసీమ, నెల్లూ రు, ప్రకాశం జిల్లాల అవసరాల కోసం అటు తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, తదితర పథకా లకు వేల కోట్లు కేటాయిం చారు. ప్రస్తుతం కేసీఆర్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ ఆచరణలోని కి వస్తాయి. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల సాగు, తాగునీటి అవసరా లు తీరతాయి. అవి చేపట్ట కుండా కేసీఆర్ ఆలమూరు ప్రాజెక్టు ఒకటి చేపట్టి వివా దంలోకి వచ్చారు. చంద్రబా బు రూ.2 వేల కోట్లు ఖర్చు పెడి తే హంద్రీనీవా పథకం పూర్తి అవు తుంది. అలాగే గాలేరు-నగరి, వెలి గొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి అవడానికి 4 వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక్కడ కరువు ప్రాంతాలకు ఈయన చేయడు. అక్కడ కరువు ప్రాంతాలకు ఆయన పనిచేయడు. ఒకరు పట్టిసీమ... మరొకరు ఆలమూరు ప్రాజెక్టు చేపట్టి ఇరు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు పెంచడా నికి ఆజ్యాలు పోయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ తనకు అండగా నిలిచిన లేదా, తనను ఆదు కున్నవారి కోసం శ్రమించారు, తపించారు. ఆయన పోల వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించటమే కాకుం డా, ఆరోగ్యశ్రీ లాంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకా నికి నాంది పలికారు. అలాగే ఆకాశమే హద్దుగా లక్షలాది మంది పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకం అమలు చేశారు. వైఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు రద్దు తదితర కార్యక్ర మాలు ప్రకటించారు. ఆయన అధికా రం చేపట్టాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, మైనార్టీల సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, పా వలా వడ్డీ, రైతుల రుణమా ఫీ.. ఒకమాటలో చెప్పాలం టే తెలుగు ప్రజలకు జీవిం చడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతుల ఆత్మహ త్యలు, వలసలు, అప్పులు, నిరుద్యోగ సమస్యలు తది తర విధానాలతో శ్మశాన వాతావరణం నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చారు. దేశం లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాల నుండి ఏర్పడ్డ దుష్పరిణామాలను అర్థం చేసుకుని వాటిని ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విధానం అమలు పరిచారు. మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశాల నుండి పెట్టుబడులు, దిగుమతులు, ఎగుమతు లు ఉండాలి. ప్రస్తుతం మన ప్రధాని, ముఖ్యమంత్రి విదే శాలలో పర్యటిస్తూ... మన దేశంలో, రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టండి... షరతులు లేకుండా మీకు అన్ని రకా లైన సౌకర్యాలు కల్పిస్తాం అంటూ... ప్రాధేయ పూర్వ కంగా పర్యటనలు చేయడం గమనిస్తే, రాజశేఖరరెడ్డి లాంటి రాజకీయ నాయకుల నుండి వీరు ఎంతో నేర్చు కోవాల్సి ఉంది. వైఎస్ ఎప్పుడూ విదేశీపర్యటనలు చేయ లేదు. ఆయన విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తు లకు ఎర్రతివాచీలు పరచలేదు. మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న శక్తివంతులైన స్థితిమంతులతోనే ఆయన ఎక్కువగా పనిచేశారు. వైఎస్ నేడు ఒక వ్యక్తిగా మనముందు లేడు. ఒక శక్తిగా ఆదర్శంగా ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా చిరంజీవిలా వెలుగొందుతూ... తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు. వైఎస్ను, వైఎస్ కుటుంబాన్ని వేధిం చడానికి జరిపిన ప్రయత్నాలను తెలుగు ప్రజలు తిప్పికొ ట్టారు. చంద్రబాబు అనేక తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను వంచించి అధికారం చేపట్టారు. ఇచ్చిన వాగ్దా నాలు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, చేనేత రుణమాఫీ, విద్యార్థులకు నిరుద్యోగ భృతి లాంటి వాగ్దా నాలు అమలు పరచడంలో వైఫల్యం చెందారు. ఆయన దృష్టి అంతా రాజధాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తాను ఒక్కడే నిజాయితీకి పేటెంటునని విపరీతంగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి విభజన చట్టంలోని సెక్షన్-8 గురించి ఆప సోపాలు పడటం చూస్తే మనకు నవ్వు, జాలి కలుగు తాయి. నేడు దేశంలో వైఎస్ విధానాలు, పథకాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఆయన కుటుంబంపై అక్రమ కల యికతో జరుగుతున్న రాజకీయ సమీకరణలను అవి కేం ద్రంలో జరిగిన, రాష్ర్టంలో జరిగిన ప్రజలు పసిగడు తున్నారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామా లను ప్రజలు అంతే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ నడిచిన దారిలో పయనించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇరు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సర్వ తోముఖాభివృద్ధికి వైఎస్ చూపిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు, వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జయంతి సందర్భంగా తమని తాము ఉన్నతీకరించుకుని వైఎస్ ఆశయాల కోసం నడుంబిగించి పోరాడటమే వైఎస్కు మనం అర్పించే నిజమైన నివాళి. ఇమామ్ (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్: 99899 04389 -
హత్యా.. ఆత్మహత్యా ?
మదనపల్లెలో అనంతపురం జిల్లా వాసి మృతి - అనుమానాస్పద కేసుగా నమోదు - కూలి పనుల కోసం వచ్చి కడతేరిన వైనం మదనపల్లె రూరల్ : అనంతపురం జిల్లా వాసి మదనపల్లెలో హత్యకు గురయ్యాడు. కూలి పనుల కోసం వచ్చి కడతేరిపోయాడు. ఆ వ్యక్తిని పథకం ప్రకారం ఉరి వేసి చంపి కొండకు సమీపంలోని ఓ ఇందిరమ్మ ఇంట్లో పడేసి వెళ్లారు. మదనపల్లెలో శనివారం కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ... అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం వేపకుంటకు చెందిన పిండి లింగన్న అలియాస్ రెడ్డీస్ (55) వారం రోజుల క్రితం కూలి పనుల కోసమంటూ కుటుంబ సభ్యులతో చెప్పి మదనపల్లెకు వచ్చాడు. చంద్రాకాలనీ సమీపంలో ఉంటూ కూలి పనులు చేసుకునేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం లింగన్నకు ఉరివేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పథకం ప్రకారం తట్టివారిపల్లె సమీపంలో ఇందిరమ్మ కాలనీని ఓ ఇంట్లో పడేసి వెళ్లారు. గొర్రెల కాపర్లు మృతదేహాన్ని శనివారం ఉదయం 11.30 గంటలకు గుర్తించి స్థానికంగా ఉన్న హోంగార్డుకు చెప్పారు. అతడు టూ టౌన్ సీఐ హనుంతునాయక్, ఎస్ఐలు నాగేశ్వరావు, గంగిరెడ్డిలకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఉరి తీసినట్లు స్పష్టంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుని జేబులో సెల్ఫోన్ లభించింది. ఫోన్ నెంబర్ల ఆధారంగా మృతుడు అనంతపురం జిల్లావాసిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు. -
ఇందిరమ్మ బిల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండలంలోని యూసుఫ్పేటకు చెందిన సాయిలు (42)కు గతేడాది ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఉన్న గుడిసెను కూలగొట్టి అప్పులు చేసి బేస్మెంట్ వరకు ఇంటిని నిర్మించాడు. కానీ.. నేటి వరకు ఆ బిల్లులు రాలేదు. ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు పూట గడవని పరిస్థితితో ఆందోళనకు గురైన సాయిలు.. మూడు రోజలుగా భోజనం చేయడం లేదు. గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతక సాగారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కొత్తపల్లి గ్రామ శివారులో గల సాంబయ్య వ్యవసాయ బావి వద్ద సాయిలుకు చెందిన దుస్తులు శుక్రవారం కనిపించాయి. గాలించగా అతడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విఠల్ వివరించారు. -
గృహనిర్మాణశాఖకు ‘ఇందిరమ్మ’ వణుకు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై సీఎం సీరియస్ కేసులు నమోదు చేస్తారేమోనని భయం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యత ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం భవిష్యత్తు కార్యాచరణపై సిబ్బంది భేటీకి నిర్ణయం హైదరాబాద్: గృహనిర్మాణ శాఖకు ‘ఇందిరమ్మ’ గుబులు పట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు బాధ్యులను చేసి ఒకేసారి పెద్దమొత్తంలో కేసులు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో అధికారులు, సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. కొత్తగా చేపట్టబోయే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు అప్పగించొద్దనే దిశలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు దీనికి బలం చేకూరుస్తోంది. గతంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని గట్టిగా నమ్ముతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తమకు అందిన ఆధారాల ఆధారంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి సీఐడీ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో అక్రమాలు నిజమేనని తేలడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ అధికారులకు బాధ్యత అప్పగించొద్దని సీఎం నిర్ణయించారనే సమాచారం గృహనిర్మాణ శాఖకు అందింది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో దీనిపై ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. రెండు పడక గదుల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దానికి భారీ వ్యయం అవుతుండడంతో నిధుల సమీకరణపై తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో అందులో అక్రమాలు జరిగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న ముఖ్యమంత్రి... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందికి దాని బాధ్యత అప్పగించొద్దని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి మచ్చపడ్డ వారి సంఖ్య పెద్దదేనని ఆయన దృష్టికి రావడంతో వారిని ఆ బాధ్యత నుంచి తప్పించే క్రమంలో... అసలు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ నేరుగా జోక్యం చేసుకోకుండా చూస్తున్నారు. వీటన్నింటిని గమనిస్తున్న ఆ శాఖ అధికారులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. భారీ సంఖ్యలో సిబ్బందిపై కేసులు నమోదు చేయడం ద్వారా అవినీతికి పాల్పడుతున్న వారిలో భయం కలిగించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని వారు దాదాపు నిర్దారణకు వచ్చారు. ఎమ్మెల్యేలతో సీఎంపై ఒత్తిడి...! ఈ నేపథ్యంలో త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు వారు ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి చేయించాలనే కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అనవసరంగా తమపై అవినీతి ముద్రపడుతోందని, చోటుచేసుకున్న అక్రమాల్లో నేతల ప్రమేయమే ఎక్కువని, కొన్నిచోట్ల లబ్ధిదారులు కూడా తమను తప్పుదారి పట్టించారని చెప్పాలని యోచిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఎన్జీవో నేత దేవీప్రసాద్ కాస్త దూరమవడం కూడా తమకు అండ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బిల్లులొస్తున్నాయ్!
ఇందిరమ్మ ఇళ్లకు ఐఏవై కింద చెల్లింపులు ఏప్రిల్ చివరినాటికి పూర్తయిన వాటికి చెల్లింపునకు కసరత్తు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్న సర్వే బిల్లుల కోసం జిల్లాలో 7 వేల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భువనగిరి, ఆలేరు సబ్ డివిజన్లలో గృహనిర్మాణ సంస్థ అధికారులు సర్వే చేపట్టారు. మార్చి 31 నాటికి భువనగిరి నియోజకవర్గంలో 202 , ఆలేరు నియోజకవర్గంలో 403 ఇళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ చివరి నాటికి భువ నగిరిలో మరో 135, ఆలేరులో 206 ఇళ్లు పూర్తి కానున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ చివరి నాటికి 7వేల ఇందిరమ్మ ఇళ్లు పూర్తికానున్నాయి. వీరందరికీఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద బిల్లులు ఇవ్వనున్నారు. భువనగిరి : ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుని బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ప్రభుత్వం దయతలిచింది. అయితే ఇల్లు పూర్తిగా నిర్మించుకుని బిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ఐఏవై( ఇందిరా ఆవాస్ యోజన) ద్వారా బిల్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మరో మారు విచారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2014-15 సంవత్సరంలో జిల్లాలో ఐఏవై ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. కేంద్రంనుంచి వచ్చిన ఈ నిధులను ఇళ్ల నిర్మాణం కోసం వాడుకున్నట్లు యూసీ( యుటిలైజేషన్ సర్టిఫికెట్) కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అప్పుడే 2015-2016 సంవత్సరానికి 10 శాతం అదనంగా పెంచి నిధులు మంజూరు ఇస్తారు. ఇందుకోసం స్పందించిన ప్రభుత్వం మరోసారి విచారణ జరిపి అర్హులైన వారికి బిల్లులు చెల్లించాలని కలెక్టర్ను ఆదేశించింది. సర్వే ఇలా జరుగుతోంది.. జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సీబీసీఐడీ చేత విచారణ జరిపించినవిషయం తెలిసిందే. ఇందులో అక్రమార్కులతో పాటు అర్హులు ఇల్లు నిర్మించుకున్నారని తేలింది. వారంతా ఏడాది కాలంగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరోసారి సర్వే చేసి అర్హులైన వారికి బిల్లుల ఇవ్వాలని సీఎం కేసీఆర్ కలెక్టర్ను అదేశించారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు ఇప్పటికే ఇళ్లు నిర్మాణ పూర్తి చేసుకున్న వారి జాబితాలను సిద్ధంగా ఉంచారు. ఆయా జాబితాలను గ్రామాల వారీగా తీసుకుని సర్వే కూడా ప్రారంభించారు. ప్రధానంగా ఒక డివిజన్ అధికారి మరో డివిజన్కు వెళ్లి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అర్హులను తేల్చాలి. ఆ జాబితాను కలెక్టర్కు సమర్పిస్తే మరో సారి రెవెన్యూ అధికారులతో రెండో విడత సర్వే జరిపి అప్పుడు అర్హులైన వారికి బిల్లులు చెల్లిస్తారు. ఇదంతా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అసలేం జరిగిందంటే గృహనిర్మాణశాఖలో సంవత్సర కాలంగా నూతన ఇళ్ల నిర్మాణాలకు మంజూరు లేదు. అయితే కేంద్రం ఐఏవై కింద ఇచ్చిన నిధులు ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయే పరిస్థితి వచ్చింది. నిధులు ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ కేంద్రానికి పంపిస్తే తప్ప, వచ్చే సంవత్సరానికి నిధులు వచ్చే అవకాశం లేదు, ఉన్న నిధులను వాడుకోవడంతోపాటు కొత్త నిధులను 10 శాతం అదనంగా రాబట్టుకోవాలంటే వెంటనే ఆ నిధులను ఖర్చు చేసి యూటీ సర్టిఫికెట్ కేంద్రానికి సమర్పించాలి. అందుకోసం ఇప్పటికిప్పుడే అరుణాచలంలా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్లు మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మరో మూడు రోజులైతే ఈ నెల ముగుస్తుంది. అయితే ఇప్పటికే 7 వేలమంది అర్హులుగా తేలినట్లు తెలిసింది. వీరందరికీ బిల్లులు చెల్లించనున్నారు. -
ఎమ్మెల్యేల గుప్పెట్లోకి ‘ఇంటి’ గుట్టు!
జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు కసరత్తు ఇదయ్యాక..ఇళ్ల నిర్మాణాలపై సామాజిక తనిఖీ తరహా విచారణ ఆపైన..బిల్లుల చెల్లింపుల్లో జన్మభూమి కమిటీలకు కీలక బాధ్యత? బిల్లులు ఆగిపోయి ఏడాదైంది... బకాయిలు రూ.40కోట్లపైమాటే? ఇందిరమ్మ పథకం అధికార పార్టీ నేతల చే తుల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇంటి జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ జాబితాలు ఎమ్మెల్యేలకు అంద నున్నాయి. ఈ చర్యతో గ్రామాల్లో అధికారపార్టీ నేతలు చెప్పినట్టుగానే పథకం అమలయ్యే పరిస్థితులు రానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బి.కొత్తకోట: ఇందిరమ్మ పథకం అమలు బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మండలస్థాయి అధికారులకు ఈమేరకు సమావేశాల్లో ఉన్నతాధికారులు వివరించినట్టు తెలిసింది. జన్మభూమి కమిటీలకు కూడా అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కమిటీలకు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను ఇవ్వడమేకాక బిల్లుల చెల్లింపు, లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల పరిశీలనలో ప్రమేయం కల్పించే దిశగా చర్యలు ఉండబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జన్మభూమి కమిటీల్లో అత్యధికులు అధికార టీడీపీ నేతలే ఉండడంతో చర్యలన్నీ వారి కనుసన్నల్లోనే సాగే పరిస్థితులూ లేకపోలేదు. ఏడాదిగా లబ్ధిదారులకు పైసా చెల్లించలేదు. ఇప్పుడు కమిటీలకు బిల్లుల చెల్లింపు వ్యవహారంలో అవకాశం ఇవ్వడం వెనుక అధికార పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చాలన్న లోగుట్టు ఉందన్న విమర్శలూ లేకపోలేదు. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. జియో ట్యాగింగ్ అయ్యాక తనిఖీలు.. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు జియో ట్యాగింగ్ ప్రారంభించాక 3,26,615 ఇళ్లకు ఫొటోలు తీసి ఆన్లైన్ చేశారు. ఇందులో ఆధార్ నంబర్ల సమస్య, ఒకే రకమైన పేర్లు పలు ఇళ్లకు ఉండడంతో వాటిని సరిచేసే పనిలోపడ్డారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఇళ్లసర్వే, లబ్ధిదారుల జాబితా పరిశీలన, వివిధ స్థాయిలో ఆగిపోయిన నిర్మాణాల పరిశీలనతోనే ఏడాది గడిచిపోయింది. మిగిలిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తిచేశాక గ్రామస్థాయిలో తనిఖీలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉపాధి హమీ పథకం పనులపై ఏడాదికోసారి సామాజిక తనిఖీలు నిర్వహించి అవినీతి గుట్టును రట్టు చేస్తున్నారు. ఇదే తరహాలో ఇందిరమ్మ ఇళ్లకు సామాజిక తనిఖీ అవసరమని ప్రభుత్వం నిర్ణయించి, వీటి బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పనుల నాణ్యతను తనిఖీ చేసే థర్డ్ పార్టీ తరహాలో కార్యక్రమం సాగనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికోసమే జిల్లాలో మిగిలిపోయిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పనులు త్వరలో పూర్తిచేయాలని ప్రాజెక్ట్ డెరైక్టర్ అధికారులను ఆదేశించారని తెలిసింది. రూ.1,236 కోట్ల ఖర్చు.. జిల్లా వ్యాప్తంగా 2004-05 నుంచి 2013 వరకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. ఇందులో 2014 మే 24 నాటికి 2,95,134 గృహాలు పూర్తిచేశారు. 31,900 గృహాలు పునాదులు, 2,130 గృహాలు గోడల స్థాయిలో, 13,170 గృహాలు రూఫ్ లెవల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 1,00,671 గృహాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఇందిరమ్మ పథకం కోసం ఇంతవరకు రూ. 1,236.2 కోట్లను ఖర్చుచేశారు. గడచిన ఏడాదిగా ఈ లెక్కల్లో మార్పులేదు. ఇదికాక బిల్లులు నిలిపి వేసిన నాటికి రూ.16 కోట్ల చెల్లింపులు ఆగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో జరిగిన నిర్మాణాల వివరాలు సేకరించిన అధికారులు వాటికీ రూ.25కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. -
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
కల్దుర్కిలో రెండోదఫా పర్యటించిన సీబీసీఐడీ అధికారులు బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించేందుకు సీబీసీఐడీ అధికారులు మండలంలోని కల్దుర్కిలో బుధవారం పర్యటించారు. ఈ గ్రామంలో గత ఆగస్టులో మొదటి విడత పర్యటించి విచారణ చేపట్టిన విషయం విదితమే. మిగిలిన లబ్ధిదారుల వివరాలను ఇప్పుడు సేకరించారు. సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి .. బిల్లులు వచ్చాయూ? ఎంత మేరకు వచ్చాయి.. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు.. అనే వివరాలుతెలుసుకున్నారు. అనంతరం సీబీసీఐడీ ఎస్ఐ సాల్మన్రాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో 794 ఇళ్లు మంజూరు కాగా, 155 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు. ఆయన వెంట స్థానిక హౌసింగ్ ఇన్చార్జి డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోల్కంపేటలో... లింగంపేట : మండలంలోని పోల్కంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై బుధవారం సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య విచారణ చేపట్టారు. ఎంతమంది ఇందిరమ్మ బిల్లులు పొందారు? ఎంతమంది నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశాలపై ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. గ్రామంలో సుమారు 70 మంది నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అదికారులు గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులపై త్వరలో కేసులు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్ఐ నాగేందర్, హెడ్కానిస్టేబుల్ పాషా, రహమత్, స్థానిక ఏఎస్ఐ కుమార్రాజా, కానిస్టేబుల్ కిరణ్, హౌసింగ్ ఏఈ నరేందర్, వీఆర్వో రవి ఉన్నారు. -
వీడని జియోట్యాగ్ ముడి
వీరఘట్టం : జియో ట్యాగింగ్ పేరుతో ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను అవస్థల పాల్జేస్తోంది. నాలుగు నెలలుగా ఇదే సాకుతో కొత్త ఇళ్లు మంజూరు చేయక, కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు చేపట్టండి బిల్లులు చెల్లిస్తామన్న అధికారుల భరోసాతో అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లులు మంజూరు కాక, నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ఏడాది మార్చి 23 నుంచి ఎన్నికల కోడ్ అంటూ ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్ స్వగృహ ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఏడు నెలలు దాటినా.. ఇంతవరకు ఆ పథకం ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో అక్రమంగా ఇందిరమ్మ గృహాలు పొందిన వారిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది జరిగే పరిస్థితి కనిపించడంలేదు. 65 శాతం పూర్తి జిల్లాలో ప్రభుత్వ పథకాల కింద 2.64 లక్షల గృహాలు ఉండగా 65 శాతం అంటే 1.80 లక్షల గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చే స్తామని అధికారులు చెబుతున్నారు. కాగా 2.64 లక్షల ఇళ్లలో సుమారు 2.40 లక్షల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 24 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి చెల్లింపు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమిలో ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లా వ్యాప్తంగా 43 వేలు దరఖాస్తులు, అలాగే ప్రజావాణి ద్వారా మరో 94 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆన్లైన్లో జన్మభూమి వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు సిమెంట్, ఇనుము ఇతర సామాగ్రి ధరలు పెరుగుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బిల్లులు అందక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయిస్తే గాని ప్రభుత్వ ధ్యేయం నెరవేరదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వ సాయం పెంచాలి ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్న ప్రభుత్వ సహాయం ఏ మూలకు చాలడం లేదు. కనీసం 2 లక్షల రూపాయలైనా ఇవ్వందే ఇల్లు కట్టడం అసాధ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే నిర్మాణాలు పూర్తవుతాయి. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి. -వెలగాడ చిన్నమ్మ, కంబరవలస ధరలను అదుపు చేయాలి సిమెంట్, ఇనుము ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రోజురోజుకి పెరిగిపోతున్న వీటి ధరలను ప్రభుత్వం అదుపు చేయాలి. వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముతున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలి. -రెట్టి కమల, వీరఘట్టం -
'త్వరలో పేదలకు ఉచిత గృహ నిర్మాణ పథకం'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 750 కోట్ల ఆర్థిక సాయం కోరుతున్నామని తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం తొలివిడతగా రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా స్నానఘట్టాలను 15 కు పెంచుతున్నామన్నారు. ఇందిరమ్మ గృహాల్లో అవకతవకలపై సీఐడీ నివేదిక వచ్చిన తరువాతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు ఉచిత గృహ నిర్మాణ పథకం త్వరలో మొదలు పెడతామన్నారు. పట్టణాల్లో రెండు అంతస్తులు, గ్రామాల్లో ప్రతి వ్యక్తికి సొంత ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. -
బతుకు బాట
పడిపోయిన మట్టి గోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఊరికి రాక చాలా రోజులైంది. సంక్రాంతికైనా ఇంటికి రావాలనుకున్నారు. బుధవారం భోగి పండుగ రోజున నింగప్ప బెంగళూరులో చనిపోయాడు. సంక్రాంతికి సొంతూరొచ్చి సంబరంగా పండుగ చేసుకోవాల్సిన నింగప్ప నలుగురు కుమారులు.. నాన్న శవాన్ని మోసుకుని వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏళ్లుగా ‘అనంత’ను పీడిస్తున్న కరువు రక్కసి ఈసారీ వదలలేదు. దీనివల్ల రైతులు, కూలీలు పొట్టచేతబట్టుకుని వలస వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 43 వేల కుటుంబాలు సొంతూళ్లను వదిలాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఏటా ఇదే దుస్థితివర్షాభావ పరిస్థితులు ‘అనంత’ రైతును ఏటా దెబ్బతీస్తూనే ఉన్నాయి. వ్యయప్రయాసలకోర్చి ఈ ఏడాది పంట సాగు చేస్తే.. వరుణుడు కాసింత కనికరం కూడా చూపలేదు. పంట మొత్తం ఎండిపోయేలా చేశాడు. పంటను కాపాడుకునేందుకు వందలాది అడుగులు బోర్లు తవ్వినా నీటిజాడ కనిపించలేదు. కాస్తోకూస్తో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏటా జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తోందంటే ఏస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ క్రమంలో రుణాలు తీర్చలేక, అప్పులోళ్ల మాటలు పడలేక, ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయిన రోజు నుంచి ఇప్పటి వరకూ 51మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు చచ్చి సాధించేదేమీ లేదంటూ వలసబాట పడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. భవ న నిర్మాణ కూలీలుగా కొందరు, సెక్యూరిటీ గార్డులుగా మరికొందరు.. ఇలా ఏ పని దొరికితే అది చేస్తున్నారు. కరువు సహాయక చర్యలేవీ? ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, వర్షాభావంతో 5.06 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. ఐదు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని స్వయాన వ్యవసాయాధికారులే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. భూగర్భజలాలు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సగటు నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్నిచోట్ల 800-1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గత రెండేళ్లుగా పంట నష్టం వాటిల్లడం, ఈసారీ పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మూడేళ్లుగా పంట కోసం, పూట గడవడం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. గతేడాదికి సంబంధించి రూ.227 కోట్ల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైనా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అప్పుల కింద ఈ డబ్బును బ్యాంకర్లు జమ చేసుకున్నారు. గతేడాదికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రూ.643 కోట్లు రావాల్సివుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఇచ్చి రైతన్నకు ఊరట కల్గించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించలేదు. ఇన్పుట్సబ్సిడీ సొమ్మును మంజూరు చేయించే దిశగా జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఆలోచించడం లేదు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కలిపితేజిల్లాకు దాదాపు రూ.900 కోట్లు అందుతుంది. రుణమాఫీ రూపంలో అయితే ఈ ఏడాది అందేది కేవలం రూ.780 కోట్లే. ఇకపోతే ఉపాధి హామీ పథకం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం కాలేదు. దీనివల్ల తప్పనిపరిస్థితుల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు. వలసల బాట నల్లచెరువు మండలం బండ్రేపల్లిలో 110 కుటుం బాలు ఉంటే 76 కుటుంబాలు వలసెళ్లాయి. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, మల్లాపురం, కాపర్లపల్లి, పాలవాయి గ్రామాల నుంచి 500 కుటుంబాలు వలసెళ్లాయి. కుందుర్పి మండలం మలయనూరు, తూముకుంట, బెస్తపల్లి, ఎనుములదొడ్డి, జంబుగుంపల, ఎర్రగుంట, మహంతపురం పంచాయతీల్లో దాదాపు 1,500 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలు 6-8 నెలల పాటు అక్కడే ఉంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు అంత కంటే ఎక్కువగా గడుపుతున్నాయి. గుంతకల్లు మండలం పులగుట్టపల్లి తండాలో 300 కుటుంబాలుంటే దాదాపు సగం వలసబాట పట్టాయి. సోమందేపల్లి, రొద్దం మండలాల్లో 2,500 కుటుంబాలు వలసపోయాయి. మడ గూరు మండలం దెందువారిపల్లెలో వంద కుటుంబాలు వలసెళ్లాయి. నియోజకవర్గం వలసెళ్లిన కుటుంబాలు(అంచనా) కదిరి 6 వేలు పెనుకొండ 4500 రాప్తాడు 4300 హిందూపురం 3 వేలు మడకశిర 3 వేలు ఉరవకొండ 3 వేలు గుంతకల్లు 4200 కళ్యాణదుర్గం 4 వేలు రాయదుర్గం 3200 పుట్టపర్తి 4200 ధర్మవరం 2400 అనంతపురం 500 శింగనమల 500 తాడిపత్రి 500 మొత్తం కుటుంబాలు 43,300 -
బతుకు బాట
పడిపోయిన మట్టి గోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఊరికి రాక చాలా రోజులైంది. సంక్రాంతికైనా ఇంటికి రావాలనుకున్నారు. బుధవారం భోగి పండుగ రోజున నింగప్ప బెంగళూరులో చనిపోయాడు. సంక్రాంతికి సొంతూరొచ్చి సంబరంగా పండుగ చేసుకోవాల్సిన నింగప్ప నలుగురు కుమారులు.. నాన్న శవాన్ని మోసుకుని వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏళ్లుగా ‘అనంత’ను పీడిస్తున్న కరువు రక్కసి ఈసారీ వదలలేదు. దీనివల్ల రైతులు, కూలీలు పొట్టచేతబట్టుకుని వలస వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 43 వేల కుటుంబాలు సొంతూళ్లను వదిలాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఏటా ఇదే దుస్థితివర్షాభావ పరిస్థితులు ‘అనంత’ రైతును ఏటా దెబ్బతీస్తూనే ఉన్నాయి. వ్యయప్రయాసలకోర్చి ఈ ఏడాది పంట సాగు చేస్తే.. వరుణుడు కాసింత కనికరం కూడా చూపలేదు. పంట మొత్తం ఎండిపోయేలా చేశాడు. పంటను కాపాడుకునేందుకు వందలాది అడుగులు బోర్లు తవ్వినా నీటిజాడ కనిపించలేదు. కాస్తోకూస్తో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏటా జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తోందంటే ఏస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ క్రమంలో రుణాలు తీర్చలేక, అప్పులోళ్ల మాటలు పడలేక, ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయిన రోజు నుంచి ఇప్పటి వరకూ 51మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు చచ్చి సాధించేదేమీ లేదంటూ వలసబాట పడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. భవ న నిర్మాణ కూలీలుగా కొందరు, సెక్యూరిటీ గార్డులుగా మరికొందరు.. ఇలా ఏ పని దొరికితే అది చేస్తున్నారు. కరువు సహాయక చర్యలేవీ? ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, వర్షాభావంతో 5.06 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. ఐదు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని స్వయాన వ్యవసాయాధికారులే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. భూగర్భజలాలు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సగటు నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్నిచోట్ల 800-1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గత రెండేళ్లుగా పంట నష్టం వాటిల్లడం, ఈసారీ పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మూడేళ్లుగా పంట కోసం, పూట గడవడం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. గతేడాదికి సంబంధించి రూ.227 కోట్ల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైనా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అప్పుల కింద ఈ డబ్బును బ్యాంకర్లు జమ చేసుకున్నారు. గతేడాదికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రూ.643 కోట్లు రావాల్సివుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఇచ్చి రైతన్నకు ఊరట కల్గించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించలేదు. ఇన్పుట్సబ్సిడీ సొమ్మును మంజూరు చేయించే దిశగా జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఆలోచించడం లేదు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కలిపితేజిల్లాకు దాదాపు రూ.900 కోట్లు అందుతుంది. రుణమాఫీ రూపంలో అయితే ఈ ఏడాది అందేది కేవలం రూ.780 కోట్లే. ఇకపోతే ఉపాధి హామీ పథకం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం కాలేదు. దీనివల్ల తప్పనిపరిస్థితుల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు. వలసల బాట నల్లచెరువు మండలం బండ్రేపల్లిలో 110 కుటుం బాలు ఉంటే 76 కుటుంబాలు వలసెళ్లాయి. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, మల్లాపురం, కాపర్లపల్లి, పాలవాయి గ్రామాల నుంచి 500 కుటుంబాలు వలసెళ్లాయి. కుందుర్పి మండలం మలయనూరు, తూముకుంట, బెస్తపల్లి, ఎనుములదొడ్డి, జంబుగుంపల, ఎర్రగుంట, మహంతపురం పంచాయతీల్లో దాదాపు 1,500 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలు 6-8 నెలల పాటు అక్కడే ఉంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు అంత కంటే ఎక్కువగా గడుపుతున్నాయి. గుంతకల్లు మండలం పులగుట్టపల్లి తండాలో 300 కుటుంబాలుంటే దాదాపు సగం వలసబాట పట్టాయి. సోమందేపల్లి, రొద్దం మండలాల్లో 2,500 కుటుంబాలు వలసపోయాయి. మడ గూరు మండలం దెందువారిపల్లెలో వంద కుటుంబాలు వలసెళ్లాయి. నియోజకవర్గం వలసెళ్లిన కుటుంబాలు(అంచనా) కదిరి 6 వేలు పెనుకొండ 4500 రాప్తాడు 4300 హిందూపురం 3 వేలు మడకశిర 3 వేలు ఉరవకొండ 3 వేలు గుంతకల్లు 4200 కళ్యాణదుర్గం 4 వేలు రాయదుర్గం 3200 పుట్టపర్తి 4200 ధర్మవరం 2400 అనంతపురం 500 శింగనమల 500 తాడిపత్రి 500 మొత్తం కుటుంబాలు 43,300 కరువు, అనంత, సహాయక చర్యలు, Drought, indivisible, supporting measures -
తీరనున్న గూడు గోడు
సాక్షి, సంగారెడ్డి: ఇందిరమ్మ గృహనిర్మాణ లబ్ధిదారులపై ప్రభుత్వం ఎట్టకేలకు కరుణ చూపింది. సుమారు ఏడాదికాలంగా నిలిచిన ఇందిరమ్మ బిల్లులను చెల్లించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగానే సాధారణ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం గూడులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇందిరమ్మ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులపై గత ఆరుమాసాలుగా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులపై ఇక్కట్లు గమనించి బిల్లుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. దశలవారీగా బిల్లుల చెల్లింపులు సర్కార్ తాజా నిర్ణయంతో అధికారులు ఇందిరమ్మ బిల్లుల చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ, ఇతర పథకాల ఎంపికైన ఇళ్లను గుర్తించే పనిని హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం గ్రామాల వారీగా సర్వే పనులు ప్రారంభించారు. హౌసింగ్ డీఈల ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారు నిర్మించిన ఇళ్లు ఏ దశలో ఉన్నాయో రికార్డు చేయనున్నారు. బేస్మెంట్, లింటల్ లెవల్, రూఫ్లెవల్ ఇలా వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలను గుర్తించి దశల వారీగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయనున్నారు. 49వేల ఇళ్లకు బిల్లులు చెల్లించే అవకాశం జిల్లాలో 49 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అధికారులు ఆయా ఇళ్ల నిర్మాణం పనులకు సంబంధించి సర్వే జరిపి దశల వారిగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నారు. జిల్లాకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 1,88,440 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 49,682 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం హౌసింగ్ అధికారులు 49,682 గృహాలను సర్వే చేసి దాని ఆధారంగా బిల్లులు చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ. లక్ష, బీసీ లబ్ధిదారులకు రూ.70 వేలు చెల్లిస్తారు. దీంతో ప్రస్తుతం వివిధదశల్లో 49 వేల ఇళ్లకు సుమారు రూ.300 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అనర్హులుగా తేలితే ఇళ్లు రద్దు? ఇందిరమ్మ గృహ నిర్మాణం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సర్కార్, ఇళ్ల బిల్లుల చెల్లింపుకోసం చేపట్టనున్న సర్వేలో సైతం లబ్ధిదారులు అనర్హులుగా తేలిన పక్షంలో ఇంటిని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. -
విచారణ ఎందాకా?
‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి అంతు లేకుండాపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. సీబీసీఐడీని రంగంలోకి దించారు.వారు ఊరూరా తిరిగి విచారణ జరిపారు. నివేదికలు మాత్రం వెలుగు చూడడం లేదు. ⇒ అక్రమాల నిగ్గు తేలేనా! ⇒సీబీసీఐడీ దర్యాప్తు పూర్తయ్యేనా? ⇒నాలుగు నెలలు గడిచినా జాడలేని నివేదిక ⇒ఎంపీడీఓలు, తహశీల్దారుల పాత్రపై మౌనం ⇒గృహ నిర్మాణ సంస్థ అధికారులపై అదే సస్పెన్స్ ⇒ఆరంభంలో ఉన్న జోరు ఇప్పుడు లేదెందుకో! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై సీబీసీఐడీ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,290 ఇండ్లను శాంపిల్గా తీసుకుని చేపట్టిన విచారణ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలోనే రూ. 42.50 కోట్లు స్వాహా అయ్యాయని తేలింది. ఇళ్ల మంజూరు, నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై మొదట థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం సీబీసీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 593 గ్రామాలలో మొదటి విడత థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించింది. రెండో విడతలో మరో 90 గ్రామాలలోనూ తనిఖీలు నిర్వహించి నివేదికలు రూపొందించింది. వీటి ఆధారంగా ఆగస్టు 12 నుంచి సీబీ సీఐడీ రంగంలోకి దిగింది. అధికారులు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో లబ్ధిదారుల జాబితా ఆధారంగా విచారణ జరిపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా విచారణలో ఏం తేలిందో బట్టబయలు కాలేదు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన కొందరు ఎంపీడీఓలు, తహసీల్ దారుల పాత్రపై ప్రభుత్వం ఇంకా మౌనం వహిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులపై సస్పెన్స్ వీడటం లేదు. ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. కట్టకుండానే బిల్లులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై నాలుగు నెలల క్రితం రంగంలోకి దిగిన సీబీసీఐడీ దోషుల గురించి ఇంకా ఏమి తేల్చకపోవడం చర్చనీయాం శంగా మారింది. తెలంగాణ జిల్లాలలోని 245 మండలాలు, 625 గ్రామాలలోని 2,11,290 ఇండ్లపై ప్రభుత్వం థర్డ్పార్టీ సర్వే నిర్వహిస్తే, 26,122 ఇండ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 1,623 ఇండ్లకు రెండుసార్లు, 1,566 పాత ఇండ్లకు బిల్లులు ఇచ్చినట్లు తేలింది. 4,375 కేసులలో ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసినట్లు బయటపడింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 29 గ్రామాలలో 2,705 ఇండ్ల పేరిట రూ. 42.50 కోట్లు స్వాహా కావడం దారుణం. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన జ్ఞానేశ్వర్రావు నిజామాబా ద్ శివారు గ్రామాలలో ఇండ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సష్టించి రూ.53.77 లక్షలు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి లబ్ధిదారుల పేరిట ఓ బ్యాంకు జమచేసిన సొమ్మును కొందరు కాజేయడం తో, డీఎం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ క్ర మంలో ఆయనను 2005లోనే ఉద్యోగం నుంచి తొల గించినా, స్వాహా చేసిన డబ్బు ఇంతవరకు రికవరీ కాలేదు. దీని మీదా సీబీసీఐడీ అధికారులు ఆరా తీశారు. ఊరూరా అక్రమాలే సీబీసీఐడీ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేలినా అందుకు బాధ్యులైనవారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిని సీబీసీఐడీ గమనించింది. కమ్మరపల్లి మండలం మానాలలో ముగ్గురు అధికారులు రూ.6.84 లక్షల అవినీతికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 11 మండలాలలో 73 గ్రామాలకు మంజూరైన 2,121 ఇండ్ల పేరిట భారీగా నిధులు స్వాహా అయ్యాయి. సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీసీఐ డీ నివేదికలు సిద్దమైనట్లు కూడ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని 791 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. వరంగల్ జిల్లాలో 14,003 ఇండ్ల మంజూరు, నిర్మాణాలపై థర్డ్పార్టీ సమర్పించిన నివేదిక ప్రకారం నిఘా అధికారు లు ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో జరిగిన ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు త్వరలోనే నివేదిక సమర్పించనున్నారన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ స్కామ్లో అసలు దోషుల గుట్టురట్టు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కొత్తపల్లిలో సీఐ విచారణ కోటగిరి : మండలంలోని కొత్తపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ సీఐ దామోదర్రెడ్డి విచారణ జరిపారు. గతంలో ‘పేదల సొమ్ము పెద్దల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడం తో స్పందించిన అధికారులు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను సీఐ దామోదర్రెడ్డికి అప్పగిం చారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. అధికశాతం బోగస్ రేషన్ కార్డులతో బిల్లులు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గ్రామంలో సుమారు 244 ఇళ్లకు సంబంధించిన బిల్లులు అక్రమంగా తీసుకున్నట్టు తెలుస్తోందన్నా రు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కోటగిరి ఎస్ఐ బషీర్ ఆహ్మద్, సర్పంచ్ కళ్యాణి తదితరులు ఉన్నారు. -
‘ఇందిరమ్మ’ అవినీతి ప్రపంచంలోనే పెద్దది
సభలో మంత్రి పోచారం * తీవ్ర అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ సభ్యులు * ఎదురుదాడికి దిగిన రసమయి * సభనుంచి కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా జరగనంత అవినీతి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బుధవారం శాసనసభ దద్దరిల్లింది. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సంక్షేమ రంగం, గృహ నిర్మాణానికి కేటాయింపులపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలను విస్మరించిందనే వ్యాఖ్యలపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మేడారం జాతర రెండేళ్లకోసారి మాత్రమే జరుగుతుందని పేర్కొన్న మంత్రి ప్రస్తుత అవసరాల మేరకే బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని సమాధానమిచ్చారు. ‘ప్రతి దానికీ ఆరోపణలు చేయడం సరికాదు. మీకంటే ముందు ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయన పట్ల గౌరవం పెరిగింది. మైక్ ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జరిగినంత అవినీతి ప్రపంచంలో మరెక్కడా జరగలేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. పోచారం వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీనియర్ సభ్యులు గీతారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ సభ్యులు సైతం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగడంతో సభలో కొన్ని నిమిషాల పాటు గందరగోళం ఏర్పడింది. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి హామీ ఇవ్వడంతో సభా కార్యక్రమాలు ముందుకు సాగాయి. కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బలహీనవర్గాల పేదకు 42 లక్షల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి ఇస్తే ఇలా అడ్డగోలు ఆరోపణలు చేయడం తగదన్నారు. సాధారణ దళితుడిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించి సభలో మాట్లాడే అవకాశమిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియాకు దక్కుతుందని వ్యాఖ్యానించగా.. టీఆర్ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ ఘాటుగా స్పందించారు. ఒక కూలీ బిడ్డ..ఒక పాలేరు బిడ్డ..ఒక దళిత బిడ్డ అయిన తనను శాసనసభ్యుడు చేసింది టీఆర్ఎస్ అధ్యక్షుడ్ని కేసీఆర్ అని రసమయి కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పథకం అక్రమాలను ఎండగడూతూ కవి గోరటి వెంకన్న రాసిన పాటలను ప్రసంగం మధ్య మధ్యలో పాడుతూ నాటి కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. రసమయి ఆరోపణలు, సభలో పాటలు పాడడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మాజీమంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో హెడ్ఫోన్స్ను స్పీకర్ చైర్ వద్దకు విసిరి కొడూతూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సభను గురువారానికి వాయిదా వేశారు. అవకతవకలు వాస్తవమే: కేసీఆర్ సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలుకు సంబంధించి 2004-14 మధ్యలో భారీగా అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య, బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్, జి.కిషన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, టి.రాజాసింగ్ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెపుతూ ఈ అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందని, దీనికి నిర్దిష్టమైన కాలపరిమితిని ప్రభుత్వం సూచించలేదని సీఎం తెలిపారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్: నేతలు ఎవరెవరెమన్నారు..
‘ఇందిరమ్మ’ పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఇందిరమ్మ పథకం కింద పెద్ద ఎత్తున గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు రూ.150 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో గృహనిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి నామమాత్ర ంగా నిధులు విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి లబ్ధిదారులను ఆదుకోవాలి. -సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఆరు మాసాలుగా వారి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపి సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. - సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభను తప్పుదోవ పట్టిస్తున్న అధికార పక్షం అధికారపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. శాసనసభా మర్యాదలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఓర్పు సహనం అవసరం. కనీసం సలహాలు, సూచనలను సైతం తీసుకునే స్థితిలో అధికార పక్షం లేదు. టీడీపీ సభ్యులను నామినేట్ ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా అభివర్ణించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. - బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి సభా సమయం వృథా అవుతోంది టీఆర్ఎస్, టీడీపీ అనవసర రాద్ధాంతాలతో విలువైన సభా సమయం వృధాఅవుతోంది. సభా మర్యాదలు పాటించడం లేదు. సభ తీరు గందరగోళంగా ఉంది. ఇరుపక్షాలు సభను రాజకీయ వేదికగా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు శాసనసభను అధికారపక్షం స్వార్థ రాజకీయాలకు వాడుకునేది .ఇప్పుడు కుటుంబం కోసం వాడుకుంటోంది. ఈ విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. -కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సంక్షేమ పథకాల అమలేది.. టీఆర్ఎస్ ఎన్నికల ఎజెండాల్లో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు ఏది..? రైతు రుణాలపై స్పష్టత లేదు. విద్యుత్ సమస్యకు పరిష్కారం లేదు. గిరిజనులకు మూడు ఎకరాల భూమిపై చర్చ లేదు. ఆగస్టు 15న దళితులకు భూమి పంపిణీ చేసి వదిలేశారు. సాగుకు పెట్టుబడేది. ప్రజా సమస్యలపై చర్చ జరుగాలి. సభా సమయం వృథా కావద్దు. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.వెంకటేశ్వర్లు విద్యుత్ కష్టాలకు సూత్రధారి చంద్రబాబే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు. ఆంధ్రబాబు కనుసైగల్లోనే టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా..? సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరిస్తున్నా... అడుగడుగునా అడ్డుకుంటూ ఆంధ్ర బాబుకు వత్తాసు పలుకుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీపీ సభ్యులకు గుణ పాఠం తప్పదు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు -
‘ఇందిరమ్మ’పై సీబీసీఐడీ విచారణ పూర్తి
ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ పథకం ఇళ్ల అవినీతి బాగోతంపై జిల్లాలో సీబీసీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తు పూర్తయింది. నివేదికను విచారణ అధికారి సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ సంబంధిత శాఖ ఐజీకి సమర్పించటంతో అవినీతికి పాల్పడిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో మొత్తం రూ. 14 కోట్లు స్వాహా అయినట్లు గృహనిర్మాణ శాఖ విచారణలో తేలగా సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. విచారణలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నివేదికను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పంపించినట్లు జిల్లాలో విచారణ చేపట్టిన అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ అధికారి డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో క్షేత్ర స్థాయిలో రెండు నెలల పాటు విచారణ చేశారు. గ్రామాల్లో కూడా విచారణ కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలోని రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండలం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కూనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ములకలపల్లి మండలం పూసుగూడెంలో విచారణ చేశారు. గతంలో నిధులు స్వాహచేసి సస్పెండ్ అయ్యి మళ్లీ విధుల్లో చేరిన అధికారుల్లో గుబులు పుడుతోంది. మళ్లీ తమ మెడకు ఉచ్చు బిగుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
కట్టాలా.. వద్దా!
పేదోడి గూడు అయోమయంలో పడింది. అధికారంలోకి వస్తే రూ.మూడు లక్షలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇళ్ల నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో పేదలకు మంజూరైన ‘ఇందిరమ్మ’ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయాలా? వద్దా? అన్న మీమాంస లబ్ధిదారుల్లో ఉంది. ఒక వేళ పూర్తి చేస్తే వాటికి బిల్లులు వస్తాయో రావో తెలియదు. అలాగే వదిలేస్తే.. కొత్త పథకంలో పాత లబ్ధిదారులకు చోటు దక్కుతుందో లేదో తెలియదు.. అప్పుచేసి చాలామంది ఇళ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి కూడా బిల్లులు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ అంశాలపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇళ్ల పనులు ప్రారంభించిన వాళ్లకు ఎటూ పాలుపోవడం లేదు. - చేవెళ్ల, మొయినాబాద్ అయోమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులు జిల్లాలో మంజూరైన మొత్తం ఇళ్లు: 2,09,194 ఇప్పటికీ ప్రారంభించనివి: 46,058 వివిధ దశల్లో ఉన్నవి: 43,914 * ఎనిమిది నెలలుగా అందని బిల్లులు * నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు * కొత్తవి మంజూరుకావు.. కట్టినవాటికి బిల్లులివ్వరు * అసలే మొదలుకాని ఇళ్ల పరిస్థితేంటి.. చేవెళ్ల/ మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో ప్రారంభించిన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు వాటిని నిర్మించాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోయారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంజూరు, నిర్మాణంలో ఉన్న పాతవాటి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడడంతో చాలా మంది డబుల్ బెడ్రూం ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్చి నెల నుంచి బిల్లుల నిలిపివేతతో లబ్ధిదారుల ఇబ్బందులు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కోడ్లో భాగంగా ఎన్నికల కమీషన్ మార్చి నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించడాన్ని నిలిపేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలు దాటినా బిల్లుల చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి నుంచి చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, నవాబ్పేట మండలాల్లో 2065 మంది లబ్ధిదారులకు పలు దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దాంతో అప్పోసప్పో చేసి నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేయలేక అసంపూర్తిగానే మిగిలాయి. కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరి కొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లుకూడా రాలేదు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు గత ఎనిమిది నెలలుగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఎన్నికలు పూరై ్తనా ఇంకా బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇటు బిల్లులు రాక అటు ప్రైవేటుగా అప్పులు చేయలేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను వివిధ దశల్లో నిలిపేశారు. వాటిని పూర్తి చేస్తే ఇందిరమ్మ పథకం ప్రకారమే బిల్లులు చెల్లిస్తారా...? కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం ప్రకారం డబ్బులు చెల్లిస్తారా అనే విషయంలో ప్రభుత్వంనుంచి ఇంకా ఎలాంటి స్పష్టతలేకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిర్మాణాలు మొదలుకాని వాటి పరిస్థితేంటి..? ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నియోజకవర్గం పరిధిలో సుమారు 3వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఆ ఇళ్లకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే అనుమానం సైతం కలుగుతోంది. కొత్త ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదిరి చూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఎలా నిజంచేస్తుందో వేచిచూడాలి. అప్పుచేసి కట్టాం సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. అప్పు చేసి రూప్లెవల్ వరకు గోడలు కట్టాం. బేస్మిట్ బిల్లు ఒక్కటే వచ్చింది. ఇంకా రెండు బిల్లులు రావాలి. ఆ బిల్లులు వస్తే స్లాబ్ వేద్దామని చూస్తున్నాం. ఎనిమిది నెలలుగా బిల్లులు వస్తలేవు. అప్పుచేసి కొంతవరకు కట్టుకోగలిగాం. ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నాం. - జాహెదాబేగం, మొయినాబాద్ ఇళ్లు పూరై్తనా ఒక్క బిల్లు కూడా రాలేదు సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. వెంటనే పనులు మొదలు పెట్టాం. మూడు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పూర్తియింది. ఇప్పటి వరకు ఒక్కసారికూడా బిల్లు రాలేదు. హౌసింగ్ అధికారులను ఎప్పుడడిగినా ఆన్లైన్లో ఉంది. త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. కాని బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. - కమ్మరి పద్మమ్మ, సురంగల్ రెండువారాల్లో బిల్లులు వస్తాయి ఎన్నికల ముందు నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపేసింది. అప్పుటి నుంచి ఎవరికీ బిల్లులు రాలేదు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను మరోసారి పరిశీలిస్తున్నాము. నిర్మాణాలను బట్టి బిల్లులు వస్తాయి. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది. - ప్రేంసాగర్, గృహనిర్మాణ శాఖ డీఈఈ, చేవెళ్ల -
స్కాం 60 కోట్లు.. అక్రమార్కులు 500 మంది!
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కుంభకోణంలో నిగ్గుతేలిన నిజాలు {పాథమిక దర్యాప్తు నివేదికను సీఎం కేసీఆర్కు సమర్పించిన సీఐడీ ఐజీ ఇవి కేవలం 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో దర్యాప్తులో తేలిన నిజాలేనని వెల్లడి సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులోనే రూ. 60 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు సీఐడీ విభాగం ఐజీ చారుసిన్హా నివేదికను సమర్పించారు. ఇవి తొమ్మిది జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గల 36 గ్రామాల్లో సీఐడీ ప్రత్యేక బృందాల దర్యాప్తులో తేలిన నిజాలు మాత్రమేనని నివేదికలో పేర్కొన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాల్లో భారీఎత్తున కుంభకోణాలు జరిగాయనీ, దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే కేసీఆర్ సీఐడీ విభాగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఫిర్యాదును స్వీకరించి కేసులను నమోదు చేసిన సీఐడీ విభాగం దర్యాప్తును ప్రారంభించింది. 30 మందికి పైగా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసిన ఐజీ చారుసిన్హా దర్యాప్తును రెండు నెలల క్రితం ప్రారంభించారు. మొదటి దశలో 9 తెలంగాణ జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంచుకున్నారు. అందులోని 36 గ్రామాల్లో సీఐడీ దర్యాప్తును సాగించింది. అయితే, ఈ దర్యాప్తులో క్రమంగా బయటపడ్డ నిజాలు చూసి దర్యాప్తు అధికారులే విస్మయం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వ భూమి లేనిచోట ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులుండటం, మరోదానిలో ఇళ్ల నిర్మాణం జరగనిచోట జరిగినట్లుగా జిల్లా గృహనిర్మాణ సంస్థ రికార్డుల్లో నమోదు కావడం, అసలు లబ్ధిదారుల నుంచి ఇతరులు చౌకగా ఇళ్లను తీసుకుని.. సొంత నిర్మాణాలు చేసుకోవడం తదితర అక్రమాలు సీఐడీ దర్యాప్తులో బయటపడ్డాయి. దీంతో బలహీనవర్గాల కోసం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం లక్ష్యానికి తూట్లు పడి, కోట్ల రూపాయల్లో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పైనే ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలు, అవినీతిలో పాలు పంచుకున్న వారిలో ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు చెందిన కొందరు అధికారులు మొదలుకొని.. జిల్లాల గృహ నిర్మాణ సంస్థలకు చెందిన మరికొందరు అధికారులు, మధ్య దళారీలు, కొందరు లబ్ధిదారులు కూడా ఉన్నట్లు సీఐడీ అధికారులు జాబితాను రూపొందించారు. ప్రాథమిక దశలోనే వీరంతా ఐదు వందల మందికి పైగానే అక్రమార్కులు ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఎవరెవరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా తేలిన అక్రమాలపై సీఎం కేసీఆర్కు నివేదికను సమర్పించిన సీఐడీ ఐజీ చారుసిన్హా , ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. -
గరీబోళ్ల గూడుపై రాబందులు
గరీబోళ్ల ఇళ్ల స్థలాలపై గద్దలు వాలాయి. ఇందిరమ్మ ఇళ్ల మాటున భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాసులు కురిపించే పారిశ్రామిక వాడను అడ్డగా చేసుకొని భూ దందాకు పక్కా ప్లాన్ వేశారు. గూడులేని నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాలను నాయకులు అక్రమంగా అమ్ముకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కళ్లు తిరిగే మోసానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జిన్నారం మండలం హెచ్ఎండీఏ పరిధిలోకి ఉంది. అందువల్లే ఇక్కడి భూముల ధరలు చుక్కల్లో ఉంటాయి. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీఓను తీసుకువచ్చింది. 2008లో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా బొల్లారంలోని 284 సర్వేనంబర్లో గల 25 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. అప్పటి మంత్రి సునీతారెడ్డి చేతుల మీదుగా ఒక్కో లబ్ధిదారునికి 80 గజాల చొప్పున 1,075 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను అందించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు కొన్ని పట్టాలను తమ అనుకూలమైన వారికిచ్చి, మరికొన్ని పట్టాలను అమ్ముకొని రూ.కోట్లలో ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రతిపక్షాల వేదన అరణ్యరోదనగానే మారిపోయింది. సర్కార్ మార్పుతో మారిన సీన్ తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై అసలైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆర్డీఓతో విచారణ చేయించారు. నెల రోజులపాటు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 1,075 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే, అందులో కేవలం 308 మంది మాత్రమే అర్హులని అధికారులు నిర్ధారించారు. మిగతా 767 పట్టాలను అక్రమార్కులు కొట్టేసినట్లు అనుమానిస్తున్నారు. అక్రమార్కులు ఒక్కో పట్టాను డిమాండ్ను బట్టి రూ. లక్ష నుండి రూ.2 లక్షల ఆపైగా విక్రయించినట్లు తెలిసింది. 1,075 మంది లబ్ధిదారులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో 1,053 సర్టిఫికెట్లకు సంబంధించిన ప్లాట్లను మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా 22 ప్లాట్లకు సంబంధించిన స్థలాన్ని అధికారులు కూడా గుర్తించలేకపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులకు పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో బొల్లారం కాంగ్రెస్ నేతలు ఇళ ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిపారనే అరోపణలు ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇంతవరకూ చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల క్రయ, విక్రయాలు జరపకూడదనేనిబంధనలు ఉన్నా, ఇక్కడి నేతలు మాత్రం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథేచ్ఛగా విక్రయించేసుకుంటున్నారు. బొల్లారం హెచ్ఎండీఏ పరిధిలో ఉండడంతో ఇతర ప్రాంతాలు, పట్ట ణాల వారు ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూమాయగాళ్లు వారికి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం కేటయించిన ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని బొల్లారం ప్రాంత వాసులు కోరుతున్నారు. -
83 వేల ఇండ్లు రద్దు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వివిధ స్కీముల కింద మంజూరైన 83,768 ఇండ్లను రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం మూ డు విడతలతో పాటు రచ్చబండ తదితర పథకాల కింద మంజూరై.. లబ్ధిదారులు ఇంకా నిర్మాణం మొదలు పెట్టని ఇండ్లను రద్దు చేయనున్నారు. 125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో కూడిన పక్కాఇండ్ల నిర్మాణం పథకం త్వరలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో తాజాగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ జిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు మార్గదర్శకాలను సూచించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 83,768 ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులకు సమాచారం అందించి వాటిని రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు రెండు రోజుల్లో కసరత్తు పూర్తి చేయనున్నారు. లబ్ధిదారుల్లో కలకలం మంజూరైనా నిర్మాణం మొదలెట్టని ఇండ్లను రద్దు చేయాలన్న ప్రభుత్వం యోచన ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో కలకలం రేపుతోంది. 2006 సంవత్సరంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభం కాగా మూడు విడతల్లో జిల్లాలోని అర్హులైన పలువురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఇందిరమ్మ మూడు విడతలకు తోడు రచ్చబండ, ఇందిరా అవాస్ యోజన తదితర పథకాల కింద కూడ ఇండ్లు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు ఈ పథకాల కింద 2,42,255 ఇండ్లు మంజూరు కాగా 1,29,202 మాత్రమే పూర్తయ్యాయి. పునాదుల నుంచి రూఫ్, రెంటల్ లెవెల్లో 29,285 ఇండ్ల నిర్మాణం ఉంటే, 83,768 మంది లబ్ధిదారులు అసలే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించ లేదు. ఇందులో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు 5,750 మంది ఉండగా, రెండో విడతలో 14,532 మంది ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందిరమ్మ మూడో విడతతో పాటు రచ్చబండ-1, 2 విడతలు, ఇతర స్కీముల కింద మంజూరైన మరో 63,486 మంది సైతం ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా ఇండ్లు మంజూరైనా కనీసం పునాదులు కూడ తీయని లబ్ధిదారులకు చెందిన ఇండ్లను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లాలో మొత్తంగా 83,768 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను అసలే మొదలు పెట్టలేదని తేల్చిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించేందుకు నివేదిక సిద్ధం చేశారు. రెండు పడక గదుల పక్కాఇండ్లు ఎప్పుడో? ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు జిల్లాలో 83,768 ఇండ్లు రద్దుకానుండగా, 125 గజాల్లో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో నిర్మిస్తామన్న పక్కాఇండ్లు ఎప్పుడు మంజూరవుతాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు పడక గదులు, ఓ వంటగది, బాత్రూమ్తో కూడిన పక్కాఇండ్ల కోసం అర్హులైన పేదలు కలలు కంటున్నారు. గతంలో ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టలేదని రద్దు చేస్తున్నా.. కొత్తగా ప్రారంభించే పక్కాఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను ప్రస్తుతం 240 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 16 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ ఇళ్లపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీయేతరులకు రూ.70 వేలు చెల్లిస్తుంది. షెడ్యూల్ తెగలకు రూ.1.05 లక్షలు, షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు రూ.1లక్ష వివిధ దశలు, రూపాల్లో చెల్లిస్తోంది. అయితే కొత్తగా మంజూరు చేసే ఇండ్ల కోసం 125 గజాల స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50 లక్షలు ఖర్చు చేయనుండటంతో అందరూ ప్రభుత్వ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. -
అక్రమాల పుట్ట పగులుతోంది!
బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వర్నీ వదలం.. బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు. ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్రెడ్డి, శంకర్రెడ్డి, సంపత్రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు. బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
హౌసింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ అండ
ఒంగోలు అర్బన్ : గృహనిర్మాణ సంస్థ(హౌసింగ్)లో విధుల నుంచి తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా సోమవారం 13వ రోజుకి చేరింది. ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇందిరమ్మ పథకంలో భాగంగా నియమించిన ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం టీడీపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. అన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తూ ఒక్క హౌసింగ్లోనే తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 13 జిల్లాల్లో 2,250మంది కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఆందోళన 12రోజుల నుంచి చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలోనూ చర్చించే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హౌసింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు నరాల రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దుంపా చెంచిరెడ్డి ఉన్నారు. ఆకులు మేస్తూ నిరసన ప్రభుత్వ మొండి వైఖరి వీడి తమను విధుల్లోకి తీసుకోకపోతే తమ కుటుంబాలు ఆకులు తిని బతకాల్సి వస్తుందనే సంకేతాలు వచ్చేలా ఆకులు తింటూ ఉద్యోగులు నిరసన తెలిపారు. బీఎస్ఎన్ఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ మహ్మద్ యాసిన్, ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బాలచంద్రం పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హౌసింగ్ యూనియన్ నాయకులు ఎన్. ఆదినారాయణ, పి. మస్తాన్రావు, ఆర్ ఉదయ్కుమార్, పున్నారావు, తిరుమలరావు, బి.వి. నాయక్ ఎస్.వి. శైలజ, అనురాధ, నాగలక్ష్మి, శోభన పాల్గొన్నారు. -
సీఐడీ విచారణ పూర్తి
కౌంసల్యాదేవిపల్లిలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పరిశీలన మంజూరైన గృహాల్లో 85శాతం అవినీతి సీఐడీ డీఎస్పీ సంజీవ్కుమార్ వెల్లడి నర్సింహులపేట : మండలంలోని కౌంసల్యాదేవిపల్లి గ్రామంలో ‘ఇందిరమ్మ’ పథకం అక్రమాలపై సీఐడీ చేపట్టిన విచారణ సోమవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌంసల్యాదేవిపల్లిలో ఇందిరమ్మ పథకం మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హెచ్సీలు 10 బృందాలుగా వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలో 433 ఇళ్లు మంజూరుకాగా మొదటి రోజు 172, రెండవ రోజు 261 ఇళ్లను తనిఖీ చేశారు. ఈగ్రామంతో పాటు రూప్లాతండాలో మంజూరైన ఇళ్లను సైతం పరిశీలించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోజిషన్, ఎంత బిల్లు వచ్చింది, ఎంత సిమెంట్ వచ్చింది, రేషన్కార్డు, బ్యాంక్ పాసుబుక్కు, లబ్ధిదారు అర్హుడా, అనర్హుడా, బిల్లు ఇప్పించిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. రికార్డుల్లో బిల్లు మొత్తం ముట్టినట్లు ఉన్న లబ్ధిదారులు మాత్రం మొత్తం డబ్బు తమకు ముట్టలేదని అధికారులకు విన్నవించారు. 85శాతం అవినీతి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ సంజీవ్కుమార్ అన్నారు. విచారణ పూర్తికాగానే సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి మంజూరైన ఇళ్లలో 85 శాతానికి పైగా అవినీతి జరిగిందని పరిశీలనలో తేలినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ పూర్తి కాగానే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా పాత ఇళ్లపైన, ఒకే పేరు మీద రెండు సార్లు, ఇళ్లు కట్టకుండానే, ఊళ్లో లేని వారి పేర్ల మీద, ఇళ్లు పూర్తి చేయకుండానే డబ్బులు తీసుకున్నవి ఉన్నాయని వివరించారు. ఇళ్లు, మనుషులు లేకుండా 30 వరకు బిల్లులు తీసుకున్నారని తెలిపారు. డబ్బులతో పాటుగా సిమెంటులోనూ ఎక్కువగా అక్రమాలు జరిగాయని చెప్పారు. మండలంలో పెద్దనాగారంతో పాటుగా భూపాలపల్లి మండలంలోని రెండు గ్రామాలలోనూ తనిఖీలు చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు వివరించా రు. తనిఖీల్లో సీఐలు కరుణాసాగర్రెడ్డి, విజయ్కుమార్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది చల్లా యాదవరెడ్డి, జబ్బార్, సూర్యప్రకాశ్, హౌసింగ్ డీఈ రవీందర్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లపై నిఘా
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సీబీసీఐడీ అధికారులే దిగ్భ్రాం తికి గురయ్యేలా సాగిన ఈ బాగోతంలో అసలు దోషులు త్వరలోనే బయట పడనున్నారు. జిల్లాలో వారం రోజులుగా సీబీసీఐడీ అధికారులు జట్లుగా విడిపోయి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి విచారణలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇళ్ల కుంభకోణంపై ప్రభుత్వం థర్డ్ పార్టీతో చే యించిన విచారణలో వెలుగుచూసిన అక్రమాలకు తోడు కొత కోణాలు బయటపడటం చర్చనీయాంశం అవుతోంది. 16 మండలాలలోని 29 గ్రామాలలో సు మారుగా 2,705 ఇళ్ల పేరిట రూ.42.50 కోట్లు స్వాహా అయినట్లు థర్డ్ పార్టీ విచారణలో తేలగా, ఆరు మండలాలలో సీబీ సీఐడీ జరిపిన దర్యాప్తులో మరిన్ని అవకతవకలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగిన లింగంపేట మండలం పొల్కంపేట, సదాశివనగర్ మండలం భూంపల్లికి సంబంధించిన నివేదికను తయారు చేసిన అధికారులు దానిని హైదరాబాద్ కు పంపనున్నారు. శనివారం సాయంత్రం వారు నిజామాబాద్ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలోనూ పలువురిని విచారించారు. అంకెల గారడీపై ఆరా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అధికారులు చేసిన అంకెల గారడీపైనా సీబీసీఐడీ ఆరా తీస్తోంది. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి ? లబ్ధిదారుల సంఖ్య ఎంత? ఒక్కొక్క కుటుంబంలో ఎందరి పేరిట ఇళ్లు మంజూరయ్యాయి? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో 5,91,033 కుటుంబాలు, 5,90,445 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 22,717 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా, ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకంలో 2.80 లక్షల ఇళ్లు మం జూరు చేశారు. ఇందులో 1,27,121 ఇళ్లు కట్టామని, ఇంకో 1.51,984 ఇళ్లకు నిధులు మంజూరైనా పెండింగ్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కుటుం బాల సంఖ్య, మంజూరైన ఇళ్ల సంఖ్యకు, అధికారుల వివరాలకు అసలు పొంతన కుదరడం లేదు. దీనిపైనే సీబీసీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వా రు గృహ నిర్మాణ సంస్థ జిల్లా మాజీ మేనేజర్ జ్ఞానేశ్వర్రావుతోపాటు అయన హయాంలో పనిచేసిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలపైనా ఆరా తీస్తుండటం కలక లం రేపుతోంది. రికార్డులు స్వాధీనం ప్రగతినగర్ : ఐపీఎస్ అధికారి చారుసిన్హా నేతృత్వంలోని ఆరుగురు అధికారుల సీబీసీఐడీ బృందం ‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ జరుపుతోంది. ముందుగా ఎల్లారెడ్డి నియెజకవర్గంలోని లింగంపేట్ మండలం పోల్కంపేట్, సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామాలలో విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐలు ఉదయ్కిరణ్, వెంకటేశ్వర్, ఎస్ఐ సాల్మన్రాజు ఇక్కడ పూర్తి సమాచారాన్ని సేకరించారు. పోల్కంపేట్లో 177 మంది లబ్ధిదారులు, భూంపల్లిలో 531 మంది లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. అనంతరం భోదన్లో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పూర్తి సమాచారాన్ని సేకరించారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా హైదరాబాద్కు పంపించారు. శనివారం మధ్యాహ్నం సీఐడీ ఎస్ఐ సల్మాన్ రాజు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయం నుంచి పోల్కంపేట్, భూంపల్లికి సంబందించిన రికార్డులు స్వాధీనం చేసు కున్నారు. ఈ నెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వే అనంతరం తిరిగి అన్ని గ్రామాలలో విడతలవారీగా విచారణ కొనసాగించనున్నారు. -
ప్రతిపైసాకు లెక్క తేలుస్తాం
అశ్వారావుపేట/దమ్మపేట/ములకలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, అవినీతికి ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, ఖర్చయిన ప్రతి పైసాకు లెక్క తేలుస్తామని సిట్ అధికారులు చెప్పారు. సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్, సీఐ సదానిరంజన్, ఎస్సై మొగిలిల బృందం అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై శనివారం ప్రారంభించింది. అశ్వారావుపేట హౌసింగ్ డీఈఈ కార్యాలయం లో రికార్డులను పరిశీలించారు. గ్రామాల సామర్థ్యం, ఆవాసాల జనాభా, నివాస గృ హాలు, మంజూరయిన ఇళ్లు, బిల్లుల వివరాలను ప్రాథమికంగా పరిశీలించారు. దమ్మపేట మండలం పట్వారీగూడెంలో అత్యధికంగా గృహాలు నిర్మితమైనట్లు రికార్డుల్లో ఉండటం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం ద్వారా పునా ది బిల్లులు చెల్లించడంతో ఆ శాఖ వివరాల తో పాటు హౌసింగ్ రికార్డులను సరిపోల్చే కార్యక్రమం రెండో దశలో చేపడతామన్నారు. తహశీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో ఎన్ రవి నుంచి వివరాలు సేకరించారు. పట్వారీగూడెంలో.. దమ్మపేట మండలంలోని పట్వారీగూడెం పంచాయతీ సధాపల్లి ఎస్టీ కాలనీలో శనివారం హౌసింగ్ అక్రమాలపై విచారణ చేపట్టారు. గ్రామంలో ఇళ్లను అదే గ్రామానికి చెందిన ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మించాడని, అందుకు లబ్ధిదారుల నుంచి అదనంగా వసూళ్లకు పాల్పడ్డాడని, గ్రామం లో రేషన్కార్డులు లేనివారికి, అక్కడ నివాసంలేని వారికి ఇళ్లు మంజూరు చేసినట్లు వి చారణలో తేలింది. రెండు ఇళ్లు కలిపి ఒకే గృ హాంగా నిర్మించిన సంఘనలతో అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ గృహనిర్మాణ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసుగూడెంలో.. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, ఆ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెంలో సీబీసీఐడీ అధికారులు విచారణ చేశారు. ఒక మహిళ పేరు మీద రెండు ఇళ్లు మంజూరు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అవివాహిత, ప్రత్యేకంగా రేషన్కార్డు లేని వారికి ఇళ్లు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. పూసుగూడెంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తై బిల్లులు రావడం లేదని ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు. బిల్లుల చెల్లింపు సమయంలో స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని పిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం త్వరలో మరోమారు పూసుగూడెంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అనంతరం తహశీల్దార్ రాజేశ్వరితో ఇళ్ల మంజూరుపై మాట్లాడారు. విచారణ అనంతరం సమగ్ర సమాచారం, జాబితాలను గ్రామాలవారీగా అందజేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. -
‘ఇందిరమ్మ’పై నిఘా నేత్రం
జియోటాగింగ్ విధానం అమలుకు సన్నాహాలు లబ్ధిదారుల వివరాలు, నిర్మాణాల తీరు ‘ఆన్లైన్’ ఆధార్కార్డుతో అనుసంధానం తప్పనిసరి ఎప్పుడో నిర్మించిన ఇంటికి ఇందిరమ్మ బొమ్మ వేసి బిల్లులు చేసుకోవడం.. అసలు లబ్ధిదారునికి తెలియకుండా బినామీ పేర్లతో నిధుల స్వాహా.. రెండు, మూడు పేర్లతో విలాసవంతమైన భవనాల నిర్మాణం.. ఇదీ కొంత కాలంగా ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో సాగుతున్న తీరు. పేదలకు చెందాల్సిన రూ.వందల కోట్లు అక్రమార్కుల ఖాతాల్లోకి చేరాయి. ప్రతీ పేదవాడికి గూడు కల్పించాలన్న అత్యున్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకంలో గూడుకట్టుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకలించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జియోటాగింగ్ విధానంతో వివరాలను ‘ఆన్లైన్’లో నిక్షిప్తానికి సిద్ధమవుతున్నారు. విశాఖ రూరల్ : ఇందిరమ్మ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 7,04,677 ఇళ్లు మంజూరయ్యాయి. మూడు విడతలుగా పథకాన్ని అమలు చేయగా.. నిర్దేశించుకున్న లక్ష్యాలు మాత్రం పూర్తికాలేదన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ 82,804 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.891.49 కోట్లు విడుదల చేసింది. ఈ పథకంలో అవినీతి సర్వసాధారణమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కయి రూ.కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఏడాది క్రితం అధికారుల లెక్కల్లో 32,244 ఇళ్లు అక్రమంగా నిర్మించినట్టు నిగ్గుతేల్చారు. రూ.వందల కోట్లు పక్కదారి పట్టగా.. రెవెన్యూ రికవరీ యాక్ట్(ఆర్ఆర్) ప్రయోగించి ప్రజాధనాన్ని వెనక్కు తెస్తామని అధికారులు చెప్పినప్పటికీ.. అదీ నామమాత్రమైంది. ఆధార్తో అనుసంధానం : అక్రమాలను అరికట్టేందుకు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఆధార్ వివరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి నెలాఖరుకు ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియ వేగవంతానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా జరిగిన కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేయడ ం ద్వారా మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి. దీంతో రేషన్కార్డు, ఆధార్కార్డుతో ఆన్లైన్ సీడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ‘జియో టాగింగ్’ : ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో మోసాలు చోటుచేసుకోకుండా ఇక నుంచి ప్రభుత్వం జియోటాగింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అల్పాదాయ కుటుంబాలన్నింటికీ రేషన్కార్డుతో పాటు ఆధార్కార్డులున్నాయి. వాటి ఆధారంగా గృహాలు మంజూరు చేసి.. జీపీఆర్ విధానంలో ఆ వివరాలు నమోదు చేయనున్నారు. ప్రతీ ఇంటి ఫొటోను కంప్యూటర్లో లోడ్ చేసి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ తీరును పరిశీలించనున్నారు. బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా ఉండేలా జీపీఆర్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అక్రమాలకు కళ్లెం వే సి పూర్తి స్థాయిలో పారదర్శకంగా పేదలకు పక్కాఇల్లు మంజూరుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘ఇందిరమ్మ’లో అక్రమాలపై విచారణ
పోల్కంపేట(లింగంపేట) : నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామమైన లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రా మంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవకతవకలపై మంగళవారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీబీసీఐడీ సీఐలు జి.వెంకటేశ్, ఉదయ్కిరణ్,ఎస్సైలు సాల్మన్రాజ్,నాగేందర్,హెడ్ కానిస్టేబుల్ రషీద్అలీ గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగు తూ విచారణ చేపట్టారు. గ్రామంలో177 ఇందిరమ్మ గృహాలు నిర్మాణాలు జరుగకపోయినా కొందరు అధికారులు,నాయకులు నిధులను దుర్వినియోగం చేసిన ట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన ఫి ర్యాదు నేపథ్యంలో విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన బొల్లారం రాజమ్మ 1989లో ఇల్లు కట్టుకుం ది. కానీ సంబంధిత అధికారులు ఆమె పేరుమీద 2006లో ఇల్లు కట్టుకున్నట్లు బిల్లులు చెల్లించారు.బిల్లుల విషయం రాజమ్మను సీబీసీఐడీ సీఐ ఉదయ్కిరణ్ ప్రశ్నించగా తనకు నయా పైసా ఇవ్వలేదని జవాబిచ్చింది. అలాగే గ్రామానికి చెందిన తలారి కిషన్ సైతం తాను ఇల్లు కట్టుకున్నా రూపాయి చేతికందలేదని చెప్పాడు. నిబంధనలకు విరుద్ధంగా వంట గది నిర్మించుకున్న వారికి సైతం హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించి తమ శాఖ సత్తా చాటినట్లు విచారణ లో వెల్లడి కావడం గమ నార్హం. అధికారులు ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన వారి ఇంటికి వెళ్లి యజమాని ఫొటోలను తీస్తూ విచారణ చేపడుతున్నారు. అవినీతి అక్రమాలకు చెక్పెట్టేందుకే.. సదాశివనగర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీయడానికే ఇందిరమ్మ గృహాలను పరిశీలిస్తున్నట్లు సీబీసీఐడీ ఇన్స్పెక్టర్లు ఉదయ్కిరణ్, వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని భూం పల్లి గ్రామంలో గతంలో మంజూరైన 599 ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. అవకతవకలు, అక్రమాలు జరిగాయా..రికార్డు ప్రకారం గృహాలు ఉన్నాయా...లేదా...డీఈలు, ఏఈలు అవినీతికి పాల్పడి ఇళ్లు నిర్మించకున్న బిల్లులు మంజూరు చేశారా అనే కోణంలో పరి శీ లన చేస్తున్నట్లు తెలిపారు. గ్రామం లో మూడు బృందాలుగా విడిపోయి అధికారులు ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు మంజూరైనప్పటికీ బిల్లులు తీసుకుని ఇళ్లు నిర్మించకుండా ఉన్న కుటుంబాలను గుర్తిస్తామన్నారు. ఒకే ఇల్లుపై కొందరు మూడు నాలుగు బిల్లులు తీసుకున్నారా..అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ సోదాలు
-
ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ సోదాలు
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అర్హులకంటే అనర్హులకే ఇళ్లు మంజారు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లను కట్టకుండానే బిల్లులు మంజూరు అయినట్లు గుర్తించటం జరిగింది. పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉందని దీనిపై విచారణ చేస్తున్నామని సీఐడీ డీఎస్పీ తెలిపారు. దోషులుగా తేలితే అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణ అవినీతిలో రంగారెడ్డి జిల్లానే మొదటి స్థానంలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. తాండూరు మండల పరిషత్లోని హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో, పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయంలో అధికారులు వివరాలు సేకరించారు. తాండూరు డివిజన్ కార్యాలయం నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంటి దొంగలు
ఖమ్మం వైరారోడ్ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం గత వారం సీబీసీఐడీ విచారణకు ఆదేశించటంతో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు నిధుల స్వాహాకు సంబంధించిన నివేదికలు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్లోని సీబీసీఐడి అడిషనల్ డెరైక్టర్ జనరల్కు నివేదికలు సమర్పించేందుకు గృహనిర్మాణ శాఖ యంత్రాంగం సమాయత్త మవుతోంది. జిల్లాలో 2009 సంవత్సరం నుంచి 6,873 ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగినట్లు లెక్క తేలింది. అయితే ఈ పథకం ద్వారా చేపట్టే గృహనిర్మాణాలలో మూడు దశల్లో నిధులు పక్కదారి పట్టాయి. బోగస్ లబ్ధిదారులతో పాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహ పర్వం యథేచ్ఛగా కొనసాగింది. మొత్తంగా రూ. 3.69 కోట్లు స్వాహా అయినట్లు తేలింది. దీనికి సంబంధించిన నివేదికను రెండు,మూడు రోజుల్లో హైదరాబాద్లోని ఏడీజీకి అందజేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొత్తగూడెంలో 1396, పినపాకలో 1019, సత్తుపల్లిలో 1025, భద్రాచలంలో 966, అశ్వారావుపేటలో 893 ఇళ్ల నిర్మాణాలలో అవినీతి జరగగా ఇల్లందు, మధిర, పాలేరు, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో కొంతమేర తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 74 కేసులు నమోదు చేయగా అందులో 28 కేసుల విచారణ పూరైంది. రూ.10 లక్షల సొత్తు మాత్రమే రికవరీ జరిగింది. ఈ వ్యవహారంలో 80 మంది వరకు ఆ శాఖ సిబ్బందికి భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. వారిలో 18 మంది ఏఈలను సస్పెండ్ చేయగా నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఈ అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించటంతో గృహనిర్మాణ శాఖ సిబ్బందిలో దడపుడుతోంది. ఇంతకాలం తప్పించుకుని యథేచ్ఛగా తిరుగుతున్న ఆ శాఖ సిబ్బందిలో వ ణుకు ప్రారంభమైంది. విచారణలో అవినీతి బాగోతం బయటపడటం ఖాయమని, తాము ఇక తప్పించుకోవటం సాధ్యం కాదని వారు తలలు పట్టుకుంటున్నారు. సీబీసీఐడీ అధికారులు వీరిచ్చే నివేదికను బట్టి కాకుండా మరింత లోతుగా విచారణ జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల అవినీతి బాగోతంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సొంతింటి ఆశలకు ఎసరు
సాక్షి, కాకినాడ :అధికారంలోకి వచ్చింది మొదలు శ్వేతపత్రాల విడుదల.. కమిటీల నియామకం, ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ‘సర్వే’ మంత్రం జపిస్తోంది. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను గాలికొదిలేసి ఏ పథకానికి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన ‘ఇందిరమ్మ’ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. గత ఏడేళ్లుగా గృహనిర్మాణాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిపోయిందంటూ వాటిపై ‘ఇంటిగ్రేటెడ్ సర్వే’ చేయాలని రెండ్రోజుల క్రితం అధికారులను ఆదేశించింది. కొత్తగా ఒక్క రుణం కూడా మంజూరు చేయని తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గతంలో ఏదో అవినీతి జరిగిపోయిందంటూ భూతద్దం పెట్టి వెతికే ప్రయత్నం చేయడం అన్యాయమని గృహనిర్మాణ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ‘అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు సెంట్లలో రూ. లక్షన్నర వ్యయంతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం’ ఇది ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటి. ఇప్పుడు ఈ హామీ ఊసెత్తకుండా టీడీపీ సర్కారు ప్రజల దృష్టి మరల్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇందిరమ్మ పథకానికి మార్చి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. మే నెలలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఈ చెల్లింపులను పునరుద్దరించాల్సి ఉన్నప్పటికీ కోడ్ సమయంలో విధించిన నిషేధాన్ని కొనసాగించడం వల్ల గత ఐదు నెలలుగా రూ.50 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. మరొక పక్క కాంగ్రెస్ హయాంలో మంజూరైన గృహనిర్మాణాలకు సైతం ప్రభుత్వం బ్రేకు లేసింది. గృహ నిర్మాణంపై తమ విధానాన్ని ప్రకటించ కుండా తాత్సారం చేస్తూ ఆ శాఖను నిర్వీర్యం చేసిన బాబు సర్కార్ ఇప్పుడు గత ఏడేళ్లుగా జరిగిన గృహ నిర్మాణంలో అవకతవకలను శోధించే పనిలో పడింది. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్వేలో గుర్తించిన అనర్హుల జాబితాను బయటకు తీస్తోంది. కనీసం క్షేత్ర స్థాయిలో విచారణ కూడా చేపట్టకుండా ఒకరిద్దరు చెప్పిన సమాచారంపై ఆధారపడి అర్హులను సైతం అనర్హులుగా నిర్ధారించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్వే తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ జాబితాలో సంశయ లబ్ధిదారులు (డౌట్ఫుల్ బెనిఫిషియరీస్) పేరిట 16,724 మందిని అనర్హులుగా నిర్ధారించారు. వీరిలో 6306మంది తమ గృహాలను నిర్మించుకోలేదు. మిగిలిన 10,418 మంది అయాచితంగా లబ్ధి పొందారని ఏజెన్సీ అప్పట్లో అభిప్రాయపడింది. ఈ మేరకు రూ.22,43,91,016 మేర దుర్వినియోగమైనట్టుగా లెక్కతేల్చింది. ఇప్పుడు ఈ సొమ్మును రికవరీ చేసే లక్ష్యంతో టీడీపీ సర్కారు ఇంటిగ్రేటెడ్ సర్వేకు సిద్ధమైంది. ఇందుకోసం వారం రోజుల్లో మండల, డివిజన్ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. గృహ నిర్మాణ శాఖ డీఈఈ నేతృత్వంలో ఏర్పాటయ్యే మండలస్థాయి కమిటీలో ఎంఆర్ఐ, వీఏఓ, ఏఈలు, ప్రత్యేకాధికారి నేతృత్వంలో ఏర్పాటయ్యే డివిజనల్ స్థాయి కమిటీలో ఆర్డీఓ, హౌసింగ్ ఈఈలు సభ్యులుగా ఉంటారు. మండల కమిటీలు ప్రతి గ్రామానికి వెళ్లి ఏజెన్సీ జాబితాలో ఉన్న వారితో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న గృహనిర్మాణాలను కూడా పరిశీలిస్తాయి. జీయో టాగింగ్ సిస్టమ్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఫొటోలు తీసి ఆన్లైన్కు అప్లోడ్ చేస్తారు. రేషన్, ఆధార్ సీడింగ్ చేసి రుణం పొందిన వారి అర్హతలు పరిశీలిస్తారు. అనర్హులుగా నిర్ధారిస్తే నోటీసులు జారీచేసి ఆర్ ఆర్ యాక్టు ద్వారా రుణం వసూలుకు చర్యలు తీసుకుంటారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ నంతటిని అక్టోబర్ 14లోగా పూర్తి చేయాలని, దుర్వినియోగమైన సొమ్ము రికవరీ చేయాలని పేర్కొంది. -
సర్కారు ముల్లు
సాక్షి, కర్నూలు:ఇందిరమ్మ పథకం చుట్టూనీలినీడలు కమ్ముకుంటున్నాయి.నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దుచేసేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోంది. పనులు ప్రారంభించినఇళ్లకు బిల్లులు నిలిపేసింది. ఫలితంగాపెండింగ్లోని సుమారు రూ.22 కోట్లబిల్లుల విషయంలో సందిగ్ధంనెలకొంది. అధికారులకు అందిన సంకేతాల ప్రకారం వచ్చే మార్చి వరకు చిల్లిగవ్వ విడుదలయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి లబ్ధిదారులను ఇరకాటంలోకి నెడుతోంది. సొంతింటినిర్మాణం ప్రతి ఒక్కరి కల. సాకారంచేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు.నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలుఇందుకోసం ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలుగడిచినా పేదలకు నిలువ నీడ కల్పించలేని దౌర్భాగ్యం. కనీసం ప్రభుత్వ పథకాలతోనైనా ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. ఇటీవలఅధికారం చేపట్టిన టీడీపీ ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనివ్వకపోవడం ఆశావహులను అయోమయానికి గురిచేస్తోంది. కొత్త ఇళ్ల మంజూరు దేవుడెరుగు.. గతప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన లబ్ధిదారుల పరిస్థితి కూడా గందరగోళానికి తావిస్తోంది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినకాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు 5,79,738 ఇందిరమ్మఇళ్లను మంజూరు చేసింది. వైఎస్ రాజశేఖర్రెడ్డిముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇళ్ల పనులు శరవేగంగా కొనసాగినా.. ఆయన మరణానంతరం పురోగతి లోపించింది. గత మూడున్నరేళ్లలో లక్ష్యం నీరుగారింది. 1,45,796 ఇళ్లు పునాది.. బేస్మెంట్..లెంటల్.. రూఫ్ లెవెల్స్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం చేకూరుతుందని లబ్ధిదారులు ఆశించగా మొదటికే మోసమొచ్చింది. ఇళ్లను రద్దు చేసేందుకు చంద్రబాబుసర్కారు సిద్ధమవుతోంది. నిర్మాణ దశలోని ఇళ్ల బిల్లులను నిలిపేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నఅవకతవకలను గుర్తించేందుకు చేపట్టిన కార్యక్రమం(జియో ట్యాగింగ్ విధానం) పూర్తయ్యే వరకుముందుకెళ్లొద్దని హౌసింగ్ అధికారులకు ఆదేశాలుఅందాయి. కొత్త విధానంలో ఆగస్టు ఒకటో తేదీనుంచి అక్రమాలను గుర్తించనున్నామని.. డిసెంబర్లోగా పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి కిమిడిమృణాళిని స్పష్టం చేశారు. ఆ తర్వాత తీసుకునే చర్యలకు అనుగుణంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులుఉంటాయనే సంకేతాలిచ్చారు. ఇదంతా వచ్చే ఏడాదిమార్చి వరకు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో..అప్పటి వరకు తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులుగగ్గోలు పెడుతున్నారు.ఎక్కడి బకాయిలు అక్కడే..గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఎస్సీలకు రూ.లక్ష,ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఇతర సామాజిక వర్గాల్లోగ్రామీణులకు రూ.70 వేలు, పట్టణవాసులకురూ.80వేల చొప్పున నిధులు కేటాయించింది. ఈనిధులు సరిపోకపోవడంతో లబ్ధిదారులపై భారంపడింది. లక్షలాది మంది అప్పులపాలయ్యారు. అయితేసబ్సిడీ నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. అదేవిధంగా ఇందిరమ్మలే-అవుట్ కాలనీల్లో మంచినీరు, విద్యుత్, అంతర్గతరహదారులు నిర్మించకపోవడంతో నివాసితులు కష్టాలతో సావాసం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీ ప్రభుత్వతీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. -
కట్టేదెట్టా..!
►ఆకాశన్నంటుతున్న నిర్మాణ సామగ్రి ►సిమెంట్ ధరలు పైపైకి ►మధ్యలోనే నిలిచిపోతున్న నిర్మాణాలు ►ఇబ్బందుల్లో 2 లక్షల మంది కార్మికులు నెల్లూరు (దర్గామిట్ట): సామాన్యులకు సొంతింటి కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం నిర్మాణ సామగ్రి అంతకంతకూ పెరుగుతుండటమే. చాలాచోట్ల నిర్మాణ సామగ్రి ఉన్నంత వరకు పనులు పూర్తి చేసి నిలిపి వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా నిర్మాణాలు మధ్యలో నే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్లకుపైగా విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నెల్లూరులోనే సుమారు రూ. 80 కోట్లు నుంచి 90 కోట్లు మేర నిర్మాణ పనులు జరుగుతున్నాయనేది అంచనా. నిర్మాణరంగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోతుండటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సిమెంట్ ధరలు పైపైకి ...: గతంలో 50 కిలోల సిమెంట్ బస్తా రూ. 210 నుంచి రూ.235 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 325కు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కంపెనీలన్నీ సిండికేట్ కావడం వల్లే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఒక మాదిరి ఇంటి నిర్మాణానికి 500 బస్తాలు సిమెంట్ అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక్క సిమెంట్కే అదనంగా రూ. 50వేలు పైనే భారం పడుతుంది. అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు : ప్రస్తుతం జిల్లాలోని ఇసుక రీచ్లకు వేలం నిర్వహించక పోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 2వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 వేలకు పెరిగింది. ఒక్కో ఇంటికి దాదాపు 40 లారీల ఇసుక అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఇసుకపైనే దాదాపు రూ. 2లక్షలపైనే భారం పడుతుంది. సామాన్య ప్రజలు పునాదులకు మట్టినే వాడుతున్నారు. ఇటుక ధరలకు రెక్కలు : ఆరు నెలల క్రితం 2 వేల ఇటుకలు రూ. 6500 ఉండేవి. ప్రస్తుతం రూ. 8 వేలకు పెరిగిది. ఒక్కో ఇంటికి దాదాపు 30 వేలకు పైగా ఇటుకలు అవసరం ఉంటుందని అంచనా. క్వాలిటీ ఇటుక అయితే మరో వెయ్యి రూపాయిలు అదనంగా ఖర్చు చేయాల్సిందే. కొండెక్కిన స్టీల్, ఇనుము ధరలు : ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం వైజాగ్ స్టీల్ ధర టన్ను రూ. 38 వేలు ఉంది. అది ప్రస్తుతం టన్ను రూ. 45వేలకు పైగా పెరిగింది. గతంతో పోలిస్తే టన్నుకు రూ. 8వేలు పెరిగినట్టే. ఒక్కో ఇంటికి దాదాపు నాలుగు టన్నుల ఇనుము వినియోగిస్తున్నారని అంచనా. పెరిగిన కంకర ధర : నిర్మాణంలో కంకర కీలకమైంది. దీని ధరలు పెరిగిపోయాయి. గతంలో యూనిట్ ధర రూ. 4 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 5 వేలకు పెరిగింది. అదే చీమకుర్తి, రాయవేలూరుల నుంచి తీసుకొచ్చిన కంకరైతే యూనిట్కు మరో రూ. 1500 అదనంగా చెల్లించాల్సిందే. ఒక్కో ఇంటికి 8 లారీలు కంకర అవసరం ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన కలప ధరలు : ఇటీవల కలప ధరలు కూడా పెరిగాయి. నాణ్యమైన కలప కొనాలంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తక్కువ కలప కొనాలన్నా అడుగు సుమారు. రూ. 1000 ఉంది. అదే నాణ్యత గల కలప కొనాలంటే అడుగు రూ. 2 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో ఇంటికి దాదాపు 50 నుంచి 60 అడుగుల కలప అవసరం. కొంత మంది కలప వినియోగం తగ్గించి ప్లాస్టిక్, ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు పెరిగిన కష్టాలు : నిర్మాణ సామగ్రి ధర పెరుగుదలతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒక్కో ఇంటికి రూ.75 వేలు నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదు. దీంతో పాటు గత కొన్ని నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి అమాంతంగా పెరిగి పోతున్న నిర్మాణ ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఇంటి’ దొంగల్ని పట్టేద్దాం!
‘ఇందిరమ్మ’ పథకంలో అక్రమాలపై సీబీసీఐడీ విచారణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బినామీలు, ప్రజాప్రతినిధుల మిలాఖత్తో ఈ పథకం పక్కదారి పట్టిందని భావించిన ప్రభుత్వం.. అక్రమాలను వెలికితీయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించింది. ఇందులో భాగంగా బుధవారం సీబీసీఐడీ అధికారులు జిల్లా హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించే క్రమంలో భాగంగా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రికార్డులు, ఆన్లైన్ రిపోర్టులను వారు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా 2008-09 సంవత్సరంలో జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్పార్టీతో విచారణ చేయించింది. జిల్లావ్యాప్తంగా 20,707 గృహాలను పరిశీలించగా 2,350 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలింది. వీటిలో 133 ఇళ్లకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అసలు నిర్మాణ పనులే చేపట్టకుండా 47మంది పేరిట బిల్లులు క్లియర్ చేసినట్లు పసిగట్టారు. ఎనిమిది పాత ఇళ్లకు మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేసినట్లు తేల్చారు. మరో 313 మంది లబ్ధిదారులకు లెక్కకు మించి చెల్లింపులు చేశారు. 105 మంది లబ్ధిదారుల పేర్లు రెండుసార్లు నమోదుచేసి నిధులు కైంకర్యం చేశారు. మొత్తంగా సర్వేచేసిన వాటిలో 11 శాతం అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు రూ. 80.74లక్షలు పక్కదారి పట్టినట్లు నిగ్గుతేల్చారు. ప్రతి ఇంటింటి లెక్క పరిశీలన.. ‘ఇందిరమ్మ’ పథకంలో భాగంగా జిల్లాలో మూడు విడతలుగా 2.09లక్షల ఇళ్లను మంజూరు చేశారు. దశాలవారీగా మంజూరుచేసిన ఇళ్లలో పావువంతు నిర్మాణాలు మొదలుకాలేదు. అయితే పనులు చేపట్టిన, పూర్తిచేసిన వాటిల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులు బుధవారం కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తనిఖీ ప్రక్రియ మరింత పకడ్భందీగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించిన రికార్డు పరిశీలించనున్నట్లు తెలిసింది. మొత్తంగా అక్రమాల లోగుట్టు పూర్తిస్థాయిలో తేల్చేందుకు సీబీసీఐడీ చర్యలు వేగిరం చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లా హౌసింగ్ శాఖలో లోతైన పరిశీలన చేయనున్నట్లు సమాచారం. -
అక్రమాలపై నిఘా
సాక్షి, ఖమ్మం: సంక్షేమ పథకాల్లో అక్రమాలకు కళ్లెం వేసే దిశగా ఒక్కో పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులు, భూదాన్, దేవాలయ భూముల ఆక్రమణలపై కొరడా ఝుళిపించింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారుల్లో దడ పుడుతోంది. మన ఊరు..మన ప్రణాళికలో బిజీగా ఉన్న జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలతో వీటన్నింటిపై వచ్చేనెలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ‘ఇందిరమ్మ’పై విచారణ.. ఇందిరమ్మ పథకం మూడు దశల్లో జిల్లాకు 4.22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 2.22 లక్షల ఇళ్లు పూర్తి కాగా మరో 64 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 1.14 లక్షల ఇళ ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. అయితే గత నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిధులు పక్కదారి పట్టాయి. బోగస్ లబ్ధిదారులతో పాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధుల స్వాహా పర్వం యథేచ్ఛగా కొనసాగింది. మొత్తం మీద రూ.3.69 కోట్లు స్వాహా అయినట్లు తేలింది. ఈ వ్యవహారంలో 80 మంది ఆ శాఖ సిబ్బంది భాగస్వాములని తేలిపోయింది. అయినా ఇప్పటి వరకు 13 మంది ఏఈలు, 6 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ఒత్తిడితో ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మిగతా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు. అయితే అక్రమాలపై నిఘా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవినీతిని మళ్లీ తోడాలని నిర్ణయించడంతో ఇందులో సంబంధం ఉన్న వారి గుండెలు గుభేల్ మంటున్నాయి. వచ్చేనెల రెండో వారంలో సీబీసీఐడీ పర్యవేక్షణలో జిల్లాలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరించనుండడంతో ఏం జరుగుతుందోనని ఆశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో బోగస్ ఇళ్లు తేలితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భయపడుతున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణపై కొత్త సర్కారు సీరియస్ కావడంతో జిల్లాలో అసలు ఎక్కడెక్కడ ప్రభుత్వ, దేవాలయ, భూదాన్, వక్ఫ్ భూములు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు పాత రికార్డులను తిరగేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. మండలాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అక్కడ ప్రభుత్వ పరంగా ఎవరికైనా ఇచ్చారా..? ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే వివరాలను పంపాలని ఇప్పటికే జిల్లా అధికారులు తహశీల్దార్లను ఆదేశించారు. అలాగే దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 206 ఆలయాలకు చెందిన 14 వేల ఎకరాల భూమి ఉంది. వీటిపై ఆశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భూములను ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న వారు తమ భూములే అన్నట్లుగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెయ్యి ఎకరాలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. భూదాన్ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేయడంతో జిల్లాలో ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 వేల ఎకారాలున్న ఈ భూములు కూడా చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే వక్ఫ్ భూముల ఆక్రమణపై ప్రభుత్వం కన్నెర్ర జేయడంతో ఈ భూముల విషయంలో చర్యల పర్వం ఎవరిమెడకు చుట్టుకుంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. వచ్చే నెల డెడ్లైన్.. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల్లో బోగస్ ఏరివేత.. ప్రభుత్వ, దేవాలయ, భూదాన్, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా శాఖల అధికారులు ఈ పనుల్లో తలమునకలయ్యారు. ఉన్న భూములు ఎన్ని ఎకరాలు, ఆక్రమణకు గురైనవి ఎన్ని..? అని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మండల స్థాయి అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మన ఊరు.. మనప్రణాళికలో బిజీగా ఉన్న జిల్లా యంత్రాంగం ఈ నివేదికలను వచ్చే నెలలో ప్రభుత్వానికి ఇవ్వడానికి కుస్తీ పడుతోంది. నివేదికు తయారు చేయడమే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ చేస్తే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో సీబీసీఐడీ విచారణ, బోగస్ రేషన్కార్డుల ఏరివేత, భూముల అన్యాక్రాంతం నివేదికలు రూపొందుతుండడంతో ఇందులో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది వచ్చే నెలలో తమ జాతకాలు ఎలా ఉంటాయోనని టెన్ష్న్ పడుతున్నారు. -
పేదోడి గూడుకూ ఎసరు!
అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల స్థలంతోపాటు లక్షన్నర రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.. - ఇదీ సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ. కానీ.. అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మూడు సెంట్ల స్థలంలో పక్కా ఇంటి సంగతిని పక్కన బెట్టేసింది. ఆన్లైన్లో జరిగే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపును నిలిపేసి వేలాది మంది లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో రచ్చబండ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన వేలాది దరఖాస్తులను బుట్టదాఖలు చేసి పేదలను నిరాశ పరుస్తోంది. సాక్షి, గుంటూరు: అప్పో సప్పో చేసి.. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆన్లైన్లో జరిగే బిల్లుల చెల్లింపును నిలిపివేయటం ద్వారా ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నవారికి రిక్తహస్తం చూపుతోంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆన్లైన్ సైట్ పూర్తిగా నిలిచిపోవటం లబ్ధిదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైఖరిపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదీ సంగతి.: జిల్లాలో ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణ ంలో ఉన్న 23,521 ఇళ్లతోపాటు దాదాపు పూర్తయిన 10 వేలకుపైగా ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి నెలలో బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆన్లైన్ సైట్ను నిలిపివేశారు. టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడు వారాలు గడుస్తున్నా మళ్లీ ఇంతవరకు దాన్ని తెరువలేదు. దీంతో బిల్లుల సొమ్ము కోసం ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగిలింది. మరోవైపు ప్రభుత్వం కొత్త ఇళ్ల మంజూరు ఊసెత్తడం లేదు. వచ్చిన దరఖాస్తులపై పూర్తిస్థారుు విచారణ జరిపాకే కొత్తవాటిని మంజూరు చేయూలని నిర్ణరుుంచినట్టు సమాచారం. రచ్చబండ దరఖాస్తులు బుట్టదాఖలే..: సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 78 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిని కొనసాగించాల్సి ఉంది. కానీ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో రచ్చబండలో వచ్చిన దరఖాస్తులన్నీ బుట్టదాఖలైనట్టేనని అధికారులు అంటున్నారు. ఆన్లైన్ సైట్ను నిలిపివేశారు.. ఈ విషయమై జిల్లా హౌసింగ్ పీడీ సురేష్బాబును వివరణ కోరగా ఆన్లైన్ సైట్ను నిలిపివేయటంతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిచిపోరుునట్టు చెప్పారు. జిల్లాలో కొత్త ఇళ్ల కోసం 78 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిపై విచారణ జరిపి అర్హుల జాబితాను రూపొం దించాల్సి ఉందని తెలిపారు. కానీ ఈ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోరుుందని పేర్కొన్నారు. -
‘ఇందిరమ్మ’ బకాయి..రూ.14 కోట్లు
శ్రీకాకుళం పాత బస్టాండ్: పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ పథకం ఆర్థిక ఇబ్బందులతో చతికిలపడింది. ఈ పథకం కింద ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి ఇంకా అనుమతులే రాలేదు సరి కదా.. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లకు రూ. 14 కోట్ల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఫలితంగా చాలా ఇళ్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. గతంలో లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మించినా.. సకాలంలో వెంటవెంటనే బిల్లులు చెల్లించేసే పరిస్థితి ఉండేది. 2009 నుంచి పరిస్థితి మారిపోయింది. లబ్ధిదారుల ఎంపికతో మొదలై ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు వరకు.. ప్రతి దశలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండటంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి ప్రభుత్వం మంజూరు చేసిన దాని కంటే నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో లబ్ధిదారులు అప్పులపాలై నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కారణంతో గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరకపోగా.. నిర్మించిన వాటికి బిల్లులు కూడా నిలిచిపోయాయి. గృహనిర్మాణ సంస్థ అధికారులు బిల్లులను ఆన్లైన్లో పంపించినా ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో జిల్లాలో 23 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించగా 17 వేల నిర్మాణాలే జరిగాయి. వీటిలోనూ 1975 మందికి చెందిన సుమారు రూ. 14 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం సంత్సరానికి(2014-2015) జిల్లాలో 20 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతవరకు అటునుంచి అనుమతులు రాలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. దీనికి తోడు ఇళ్ల మంజూరుకు ఇన్చార్జి మంత్రితోపాటు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి ఉండాలన్న నిబంధన కారణంగా ఇవన్నీ జరిగేసరికి చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, అధికార పార్టీ మారడంతో ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటీవల కాలంలో భవన నిర్మాణ సామగ్రి, కూలీల రేట్లు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇంటి నిర్మాణ బడ్జెట్ బాగా పెరిగిపోయింది. నిధుల సమీకరణకు బయట అప్పులు చేయాల్సి వస్తోంది. ఇవి చాలవన్నట్లు బిల్లుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆ అప్పులపై వడ్డీలు తలకు మించిన భారంగా మారడంతో ఇంటి నిర్మాణమంటేనే పేదలు భయపడుతున్నారు. -
త్రిశంకు స్వర్గంలో ‘ఇందిరమ్మ’
- నాలుగు నెలలుగా అందని బిల్లులు - కొత్త ప్రభుత్వం రద్దు చేస్తోందని ప్రచారం - ఆందోళనలో లబ్ధిదారులు - బిల్లు చెల్లించి న్యాయం చేయాలంటూ వేడుకోలు సంగారెడ్డి డివిజన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వాలు ‘ఇందిరమ్మ’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయడంతో లబ్ధిదారులు కూడా ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు. అందువల్లే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అర్హులైన పేదలకు రూ.3 లక్షలతో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్తో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 లక్షల పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో అధికారులు విధి విధానాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కొనసాగింపుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్త గృహ నిర్మాణం పథకానికి శ్రీకారం చుడితే తమ పరిస్థితి ఏమిటని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన బిల్లుల చెల్లింపు జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు మాసాలుగా బిల్లులు అందటంలేదు. బిల్లులు రాకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. కొత్త సర్కార్ ఈ పథకాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారంలో లబ్ధిదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఇందరిమ్మ గృహ నిర్మాణం పథకాన్ని చేపట్టగా, మూడు విడతల్లో జిల్లాకు 3,03,083 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేశారు. వీటిలో 41,374 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగతా 2,38,122 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 23,587 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకానికి సంబంధించి ఎక్కువ శాతం ఇళ్లు ఇంకా నిర్మాణ దశల్లోనే కొనసాగుతున్నాయి. పునాదుల దశలో 7,557 ఇళ్లు ఉండగా, పునాది పనులు ప్రారంభించిన ఇళ్లు 27,889, ఇంటిగోడల నిర్మాణం పూర్తయి పనులు కొనసాగుతున్న ఇళ్లు 3952, రూఫ్ స్థాయిలో 10,284 ఇళ్లు ఉన్నాయి. రూఫ్ పనులు పూర్తయి ఇంకా చిన్నపాటి నిర్మాణం పనులు పూర్తి కావాల్సిన గృహాలు సంఖ్య 1,88,440 వరకు ఉంది. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నందున ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ గృహాలు నిర్మాణ దశలో ఉన్నందున లబ్ధిదారులతోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఇందిరమ్మ గృహ నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇదిలావుండగా, సుమారు నాలుగు నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో గృహ నిర్మాణశాఖ అధికారులు సైతం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ప్రారంభం కాని ఇళ్ల మాటేమిటి జిల్లాలో ప్రారంభానికి నోచుకోని ఇందిరమ్మ ఇళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలో 23,587 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. నూతన ప్రభుత్వం ఇందిరమ్మ పథకం స్థానంలో కొత్త గృహ నిర్మాణం పథకం ప్రారంభించిన పక్షంలో గతంలో మంజూరై ఇప్పటికీ ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తారని తెలుస్తోంది. రద్దు చేసిన లబ్ధిదారులకు రూ.3 లక్షల గృహ నిర్మాణం పథకంలో తిరిగి ఎంపిక చేయవచ్చని సమాచారం. -
పింఛన్ ఎప్పుడో..
పింఛన్ పండుటాకులలో కొత్త ఆశలు రేపుతోంది. పాత సర్కారుకు సమర్పించిన దరఖాస్తులు 18 నెల లుగా బీరువాలో భద్రంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చాక వాటికి మోక్షం లభిస్తుందేమోనని లబ్ధి దారులు ఎదురు చూస్తున్నారు. వృద్ధులకు, వితంతు వులకు నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ. 1,500లు పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ పథకాన్ని సత్వరమే అమలులోకి తీసుకురావాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందిరమ్మ పథకం కింద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకు న్న వారికి ఏడాదిన్నరగా ఎదురు చూపులు తప్పడం లేదు. గత ప్ర భుత్వం నిర్వహించిన రచ్చబండలో వృద్ధాప్య, వికలాంగ, వితం తు, చేనేత, కల్లుగీత కార్మిక పింఛన్లకోసం 38,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు.. మంజూరు మాత్రం చేయలేదు. కొత్త ప్రభుత్వమైనా కరుణించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. ప్రస్తుత పింఛన్ల లెక్కలివి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ. 75 ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి దానిని రూ. 200 లకు, వికలాంగ పింఛన్ను రూ. 150 నుంచి రూ. 500లకు పెంచారు. లబ్ధిదారుల సంఖ్యనూ భారీగా పెంచారు. ప్రస్తుతం జిల్లాలో 2,76,118 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. 1,49,415 మంది వృద్ధాప్య, 74,661 మంది వితంతు, 29,509 మంది వికలాంగ, 20,646 మంది అభయహస్తం, 1,134 మంది చేనేత, 753 మంది కల్లుగీత కార్మిక పింఛన్ పొందుతున్నారు. వీరికి నెలనెలా రూ. 7,02,70,100 ఖర్చు చేస్తున్నారు. ఆయన మరణానంతరం పరిస్థితి మొదటికొచ్చింది. వేలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అర్హులైన వారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాంకేతిక లోపంతో.. పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే.. లబ్ధిదారులు సైతం బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. సాంకేతిక లోపాల కారణంగా పలువురికి సక్రమంగా పెన్షన్ అందడం లేదు. బయోమెట్రిక్ పద్ధతిలో లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక నిలిచిపోయిన పెన్షన్లెన్నో ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వృద్ధాప్య పింఛన్లలో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పింఛన్లను ప్రతినెల పదో తేదీలోగా పంపిణీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల సందర్భంగా మార్చి, ఎప్రిల్, మే నెలల్లో 24-30 తేదీల మధ్య ఇచ్చారు. జూన్కు సంబంధించిన ఫించన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంతో పాటు సాంకేతిక లోపాలను సవరించి ప్రతినెల సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నిలిచిపోయిన 'ఇందిరమ్మ' ఇళ్ల నిర్మాణం
125 చదరపు గజాల ఇల్లు కావాలంటున్న లబ్ధిదారులు కొత్త పథకంపైఖరారు కాని విధివిధానాలు గందరగోళంలో అధికారులు ‘రెండు పడక గదులు, హాలు, వంటగది, విడిగా స్నానాలగదితో 125 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఇల్లు. దీన్ని ప్రభుత్వమే రూ.3 లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తుంది’ - ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ. ‘కేవలం 28 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు గదులతో నిర్మితమయ్యే ఇల్లు, దీనికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.70 వేలు’ - ఇప్పటి వరకు అమలవుతున్న ఇందిరమ్మ పథకంలో ఇంటి స్వరూపం ఇది.ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకొమ్మంటే నిరుపేదలు, ఆ మాటకొస్తే ఎవరైనా... దేనివైపు మొగ్గు చూపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇంటికోసం దరఖాస్తు చేసుకునేవారే కాదు.. ఇప్పటికే ఇల్లు మంజూరై పని ప్రారంభించిన వారు కూడా టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పథకంలోనే ఇల్లు కావాలనుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక్కసారిగా ఆగిపోయింది. గతంలో మంజూరై నిర్మాణం ప్రారంభమైన ఈ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఆరు లక్షల ఇళ్లు మంజూరైనా నిధుల సమస్యతో ఇంకా పని ప్రారంభం కాలేదు. వెరసి ఈ పదిన్నర లక్షల ఇళ్ల మంజూరును రద్దు చేసి.. వాటి స్థానంలో కేసీఆర్ ప్రకటించిన ‘125 చదరపు గజాల ఇల్లు’ కావాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఇప్పటి వరకు గృహనిర్మాణ శాఖను ఎవరికీ కేటాయించలేదు. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దనే ఉంచుకున్నారు. ఆయన ముఖ్యమైన సమావేశాలు, ఢిల్లీ టూర్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో గృహనిర్మాణ శాఖ అధికారులతో భేటీ కాలేదు. దీంతో పేదల గృహనిర్మాణ పథకం రూపురేఖలు ఎలా ఉంటాయో, దానికి అర్హులెవరో, ఆ పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుందో.. తదితర వివరాలపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. నిజానికి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందే.. 125 గజాల్లో విశాలమైన ఇల్లును కేసీఆర్ ప్రకటించగానే.. ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేశారు. ఇందిరమ్మ పథకం బిల్లులు తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి రావటంతో.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి కొత్త పథకం కింద తమ పేర్లు నమోదు చేయాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వానికి కొత్త చిక్కు రైతుల రుణమాఫీ తరహాలోనే ఈ పేదల ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వానికి తల నొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. పథకాన్నయితే ప్రకటించారు గాని దాని విధివిధానాలు సిద్ధం చేయలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే పథకాన్ని వర్తింప చేస్తారా? లేక ఇప్పటికే ఇళ్లు మంజూరై పనులు మొదలు కాని వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారా? పనులు మొదలైనా పూర్తికాని వాటికీ ఈ పథకం వర్తిస్తుందా? ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు.