IOC
-
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్కు చెందిన పెట్రోబ్రాస్తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్లో జరగనుంది. నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్గా కీర్తి ఏం చేసిందో తెలుసా? -
ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేయడానికి నెట్వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము? రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది. -
ఇండియన్ ఆయిల్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని. -
ఐదు దేశాలు దాటి ఒలింపిక్స్ వరకు...
పారిస్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేతృత్వంలోని శరణార్థి జట్టు తరఫున ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాటం, పట్టుదలతో విశ్వ క్రీడలకు వెళ్లాలని ప్రయతి్నంచే వారి ప్రయాణం అసాధారణం. ఇలాంటి వారిలో అఫ్గానిస్తాన్కు చెందిన సిబ్గతుల్లా అరబ్ ఒకడు. ఈ ఒలింపిక్స్లో అతను జూడో (81 కేజీల విభాగం)లో బరిలోకి దిగాడు. 2021లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక అక్కడి పరిస్థితులు మారిపోవడంతో అరబ్ ఆ దేశం నుంచి పారిపోయాడు. అప్పటికి 19 ఏళ్ల వయసులో ఉన్న అతను అఫ్గాన్ జాతీయ జూడో జట్టులోకి ఎంపికయ్యాడు కూడా. అక్కడి నుంచి బయల్దేరి తొమ్మిది నెలల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి ఇరాన్, టర్కీ, గ్రీస్, బోస్నియా అండ్ స్లొవేనియాలలో తలదాచుకుంటూ చివరకు జర్మనీ చేరాడు. డార్ట్మండ్ సమీపంలోని శరణార్ధి శిబిరంలో తనలాగే ఇరాన్ నుంచి వచి్చన కోచ్ ఆధ్వర్యంలో జూడోలో శిక్షణ కొనసాగించాడు. అక్కడే ఆటలో రాటుదేలిన అరబ్... యూరోపియన్ ఓపెన్ తదితర టోరీ్నల్లో రాణించి ఎట్టకేలకు ఐఓసీ శరణార్ధి టీమ్లోకి ఎంపికయ్యాడు. ఇప్పటికీ అరబ్ కుటుంబం అఫ్గానిస్తాన్లో ఉంటోంది. తన తల్లి, సోదరుడితో మాట్లాడుతుంటానని... భవిష్యత్తులో తన పరిస్థితి మెరుగవుతుందని అరబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్వర్క్ డ్రెస్లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్ఎస్ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
రంగుల ఒలింపిక్స్ స్వప్నం
ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఈ ‘జెంటిల్మెన్ క్రీడ’ సహా స్క్వాష్, బేస్బాల్/ సాఫ్ట్బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం. ముంబయ్లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్లో 2036 నాటి ఒలింపిక్స్ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్ స్టాస్ క్రికెట్కు ఒలింపియాడ్లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్లోనే క్రికెట్ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్ ఏంజెల్స్లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్ మరింత చేరువవుతుంది. ఫుట్బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్ ఆడుతున్నారు. కనీసం 75 శాతం చోట్ల క్రికెట్ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్ స్పోర్ట్స్. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్ విలేజ్పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! అలాగే, ఒలింపిక్స్లోకి క్రికెట్ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్ గేమ్స్ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉందన్నాయి. ఇండియా అయితే ఏషియాడ్కి క్రికెట్ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్ బోర్డ్ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్ను ఖరారు చేస్తుందని ఒలింపిక్ సంఘం ఆశాభావంలో ఉంది. గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్లో ఫుట్బాల్ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్లో వాన వల్ల మ్యాచ్ రద్దయి, టీ20 ర్యాంకింగ్ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం. ఇక, 2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం. భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య. తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత. -
రిలయన్స్ గ్యాస్కు టాప్ బిడ్డరుగా ఐవోసీ
న్యూఢిల్లీ: కేజీ–డీ6 గ్యాస్ విక్రయానికి సంబంధించి రిలయన్స్–బీపీ నిర్వహించిన వేలంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) టాప్ బిడ్డరుగా నిల్చింది. మే నెలలో రోజుకు 5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ను వేలం వేయగా 2.5 ఎంసీఎండీని దక్కించుకుంది. అంతకు ముందు ఏప్రిల్లో కూడా రిలయన్స్-బీపీ 6 ఎంసీఎండీ గ్యాస్ను వేలం వేయగా దాదాపు అందులో సగభాగాన్ని ఐవోసీ కొనుగోలు చేసింది. తాజాగా మూడేళ్ల పాటు సరఫరా కోసం గత నెల 19 నుంచి 23 వరకు కేజీ–డీ6 గ్యాస్ ఈ–వేలం నిర్వహించగా మొత్తం 16 సంస్థలు కొనుగోలు చేశాయి. యూనిట్ (ఎంబీటీయూ) ఒక్కింటికి సగటున దాదాపు 10 డాలర్ల చొప్పున రేటు పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పెట్ బాటిళ్లతో దుస్తులు.. శ్రీకారం చుట్టిన ఐవోసీ
బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు. సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్తో స్టవ్ పనిచేస్తుంది. అన్బాటిల్డ్ యూనిఫాం, స్టవ్ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్పై లాభం వస్తుండగా, డీజిల్పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్లోని వడోదరలో గత సెప్టెంబర్లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్తో మహిళ వైరల్ స్టోరీ -
ఐవోసీ పెట్రోల్ బంకులకు జియో సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తమ పెట్రోల్ బంకుల అనుసంధానం కోసం రిలయన్స్ జియో మేనేజ్డ్ నెట్వర్క్ సర్వీసులను వినియోగించుకోనుంది. వచ్చే అయిదేళ్లలో 7,200 రిటైల్ అవుట్లెట్స్లో జియో ఇన్ఫోకామ్లో భాగమైన జియో బిజినెస్ సంస్థ తమ ఎస్డీ–డబ్ల్యూఏఎన్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. ఐవోసీకి ఉన్న మొత్తం బంకుల్లో ఇది అయిదో వంతు. పేమెంట్ ప్రాసెసింగ్, రోజువారీ ధరల అప్డేషన్, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ (ఆర్డీపీ)సాఫ్ట్వేర్, 24 గంటల పాటు సపోర్ట్ మొదలైనవి ఈ సర్వీసులో భాగంగా ఉంటాయని ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు రిటైల్ అవుట్లెట్స్ను ఎస్డీ–డబ్ల్యూఎన్ సెటప్లోకి చేర్చినట్లు రిలయన్స్ జియో హెడ్ (ఎంటర్ప్రైజ్) ప్రతీక్ తెలిపారు. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్పీసీఎల్కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
కంపెనీలను మించిన వెంకన్న సంపద
న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే. టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్టైమ్ గ్రాంట్కింద మూడు పీఎస్యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..
పానిపట్: పెట్రోల్లో ఇథనాల్ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు. దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు. 2023 ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ను ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది. -
అదే నా కల, ఐఓఏతో చేతులు కలిపిన రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రీడా రంగంలో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తో చేతులు కలిపింది. రిలయన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లు సంయుక్తంగా దీర్ఘకాలికా భాగస్వామైనట్లు ప్రకటించాయి. తద్వారా భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ క్రీడా దేశంగా భారత్ను నిలబెట్టేలా లక్ష్యాలను నిర్దేశించింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ, “ప్రపంచ క్రీడా రంగంలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే మా కల. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను భారత్లో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. 2024లో పారిస్ ఒలింపిక్ క్రీడలలో మొట్టమొదటిసారిగా ఇండియా హౌస్ని నిర్వహించేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దేశం యెక్క అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని, ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశమని నీతా అంబానీ కొనియాడారు. -
మోటో వ్లాగర్లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!
న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్ కేఫ్లను ఏర్పాటు చేస్తోంది. సిమ్లాలో తొలి కేఫ్ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్–మనాలీ రూట్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్ కేఫ్గా మార్చినట్లు పేర్కొన్నారు. ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్ గార్డ్, సన్స్క్రీన్ లోషన్, గ్లవ్స్, రెయిన్ కోట్లు, టార్పాలిన్ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్ తొలి వారంలో మొదలై అక్టోబర్ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి. -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
ఒకేరోజు డీజిల్పై రూ.75, పెట్రోల్పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది. శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు. ధరలను భారీగా పెంచిన సంస్థకు నష్టాలు తప్పడం లేదు గుప్తా అన్నారు. ఎల్ఐఓసీకి ప్రధాన పోటీదారుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపును ప్రకటించకపోవడం విశేషం. (చదవండి: రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!) -
రష్యాకు భారీ షాక్.. ఫుట్బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ
ఉక్రెయిన్ పై సైనిక దాడులు చేస్తున్న రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగలుతుంది. ఇప్పటికే అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అదే విధంగా రష్యా దుశ్చర్యకు గురి అవుతున్న ఉక్రెయిన్కు క్రీడాలోకం కూడా మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్-2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు, లీగ్ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. ఈ ఏడాది చివర్లో ఖతార్లో జరిగే ప్రపంచ కప్ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్లలో పోలాండ్తో ఆడాల్సి ఉంది. పోలాండ్ ఫుట్బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్లో జూలైలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్షిప్లో రష్యా మహిళల జట్టు ఆడనుంది. ఫుట్బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదరుదెబ్బ తగిలినట్లైంది. అదే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చదవండి: రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ -
ఈ సామీప్యం వెనుక మతలబు ఏంటి?
చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్తో తన సంబంధాలు కూడా కాస్త మృదురూపం తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతపై భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీ యంగా పాక్ ఒంటరి కావడం అనేవే భారత్, పాక్ మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా కాల్పుల విరమణకు కట్టుబడటం ద్వారా శాంతిని నెలకొల్పవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ భారత్, పాకిస్తాన్లు ఫిబ్రవరి 25న సంయుక్త ప్రకటన చేశాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తూట్లు పడి ఎంతో కాలం కాలేదు. అయినప్పటికీ ఈ అసాధారణ పరిణామానికి దారితీసిన కారణాలను అంచనా వేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి పుల్వామా దాడులు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన నేపథ్యంలో ఈ సరికొత్త పరిణామాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ అంతర్జాతీయ ఏకాంతవాసాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ ప్రాధాన్యత మసకబారిపోతోంది. చారిత్రకంగా చూస్తే యూఏఈ, సౌదీ అరేబియా దేశాలతో పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు కలిగిఉండేది. పైగా కశ్మీర్ సమస్యపై ఈ రెండు దేశాలను పాక్ బాగా ఉపయోగించుకునేది. ఎమెన్తో సౌదీ గొడవలకు సంబంధించి తటస్థంగా ఉండాలని పాకిస్తాన్ నిర్ణయించుకోవడంతో సౌదీ– పాక్ బంధాలు కాస్త గడ్డకట్టుకుపోయాయి. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో భారత్ ఆర్థిక, జనాభాపరమైన ప్రభావం ఎక్కువ కావడంతో సౌదీ అరేబియా, యూఏ ఈలతో భారత్ సంబంధం మెరుగుపడుతూ వచ్చింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈలు కశ్మీర్ సమస్యపై తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది పాకిస్తాన్ని బాగా ఇబ్బందిపెట్టింది. అందుచేత, 2020 నవంబర్లో ఓఐసీ (ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) దేశాల సమితిలో కశ్మీర్ అంశాన్ని కీలక ఎజెండాగా పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు యూఏఈ, సౌదీ రెండు దేశాలూ దాన్ని వ్యతిరేకించాయి. దీంతో కశ్మీర్ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీని విమర్శించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బీటలు వారిపోయాయి. పైగా తాను గతంలో పాకిస్తాన్కు ఇచ్చిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించేయాలని సౌదీ నిగ్గదీసింది. పైగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక బిందువుగా మారుతున్న ఇజ్రాయెల్ను గుర్తించడానికి తిరస్కరించినందున పాకిస్తాన్ ఈ ప్రాంతంలో తన ప్రాముఖ్యతను కోల్పోతోంది. ఇకపోతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తూనే వస్తున్నాయి. అందుకే ఫిబ్రవరి 25న కూడా ఆర్థిక కార్యాచరణపై టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను గ్రే లిస్టులో ఉంచేసింది. అంటే ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయడంలో పాకిస్తాన్ విఫలమైతే తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని దీనర్థం. పైగా భారత్తో అమెరికా సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంది. చైనాకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయపరంగా, ఆర్థికంగా భారత్ కీలకస్థానంలో ఉండటం, ఉగ్రవాదులను స్పాన్సర్ చేయడాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలం చెందడం దీనికి కారణాలు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రారంభ సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. దీంతో అమెరికాకు పాకిస్తాన్ మరింత దూరం జరగడం, చైనాపై పాక్ ఆధారపడటం పెరగడం మొదలైంది. ఇక దక్షిణాసియాలో కూడా పాక్ మిత్రదేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులు పాక్తో సంబంధాలపై భారత్ ఆందోళన పట్ల మరింత జాగ్రత్తతో ఉంటున్నాయి. ఫలితంగా ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి చేయవలసిన ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది. అదేసమయంలో భారత్ను అవమానపర్చే క్యాంపెయిన్ను పాక్ పునరాలోచించుకోవాలని పాకిస్తాన్ను కోరుతూనే కశ్మీర్పై భారత్ విధానాన్ని మాల్దీవులు బలపర్చడం విశేషం. మరోవైపు భూటాన్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్ దేశాలు కూడా పాకిస్తాన్పై సదభిప్రాయం కలిగి లేవు. భారత్ ప్రయోజనాలు, దాని భద్రతాపరమైన సమస్యలకు ప్రాధాన్యమిస్తూ భూటాన్ తన విదేశీ విధానాన్ని రూపొందించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ భారత్తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. పైగా, అప్గానిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని, తాలిబన్లను ప్రోత్సహిస్తున్న పాక్ను దుయ్యబట్టడం కొనసాగిస్తూనే ఉంది. దౌత్యపరమైన ఈ వెనుకంజలతో పాకిస్తాన్ టర్కీ, ఇరాన్, రష్యా, చైనా దేశాలతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త సంబంధాలు కూడా పాక్ని ఏకాంతం నుంచి బయటపడవేయలేదు. ఇస్లామిక్ ప్రపంచానికి తామే నాయకులమని భావిస్తున్న టర్కీ, ఇరాన్ ఈ క్రమంలో సౌదీ అరేబియా పాత్రను నిరంతరం ప్రశ్నిస్తూ వస్తున్నాయి. అందుచేత ఈ రెండుదేశాలతో పాక్ సన్నిహితంగా మెలి గితే అది సౌదీ, యూఏఈ దేశాలను బాగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపున పాకిస్తాన్తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటున్న రష్యా.. భారత్కు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పాక్తో మరీ అంటకాగడంపై ఆలోచిస్తోంది. ఇక స్నేహం ప్రాతిపది కన ఏర్పడిన పాక్–చైనా బంధం ఇప్పుడు పాకిస్తాన్కు వేరేమార్గం లేకుండా తప్పనిసరి పరిస్థితిలోకి నెట్టివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎంత ఎక్కువగా వేరుపడిపోతే అంతే స్థాయిలో అది చైనాపై ఆధారపడటం పెరిగిపోతుంది. అప్పులిచ్చి గుప్పిట్లో పెట్టుకునే చైనా దౌత్యం గురించి పాకిస్తాన్కు బాగానే తెలుసు. చైనాపై ఆధారపడటం వల్ల తన భద్రతా విధానాలు ఎంతగా ప్రభావితమవుతున్నాయో పాకిస్తాన్ అర్థం చేసుకుంటోంది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో తన పెట్టుబడుల ప్రాధాన్యతను గుర్తించిన చైనా గిల్గిత్ బాలిస్తాన్ను తన అయిదో ప్రావిన్స్గా మార్చాలని పాక్పై ఒత్తిడి చేస్తోంది. దీంతో చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం, అలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. అందుకనే తన దౌత్యపరమైన, వ్యూహాత్మక సమాన స్థాయిని వేగవంతం చేయడంపై పాక్ మల్ల గుల్లాలు పడుతోంది. దీనిఫలితంగానే ట్రంప్ పాలన మలిదశలో యూఎస్–తాలిబన్ శాంతి చర్చలు ఫలప్రదం కావడంలో పాక్ ముఖ్యమైన పాత్రను పోషించింది. దీనివల్ల దానికి రెండు ఫలితాలు సిద్ధిం చాయి. యూఏఈతో కోల్పోయిన స్థాయిని అది తిరిగి పెంచుకుంది. ఇక రెండోది ఏమిటంటే అప్గానిస్తాన్లో అంతర్గత పరిణామాల ప్రభావంతో పాశ్చాత్య దేశాలు అక్కడినుంచి త్వరగా వెనక్కు తిరగాలని భావిస్తున్నాయి. రెండోది ఏమిటంటే, తాలిబాన్ను బలోపేతం చేయడం ద్వారా అప్గానిస్తాన్లో తనపట్ల వ్యతిరేకత ప్రదర్శించని ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని పాక్ కోరుకుంటోంది. అలాగైనా అంతర్జాతీయంగా తనకెదురవుతున్న ఒంటరితనానికి దూరం కావచ్చని పాక్ భావన. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్తో ఇటీవలి పరిణామాలు కూడా కాస్త మృదురూపం తీసుకుం టున్నాయి. ఈ వ్యూహాత్మక అంచనా కారణంగానే భారత్ కూడా తన స్వరంలో కాస్త మార్పు తీసుకొస్తోంది. దక్షిణాసియా ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావం, ఇటీవలి సరిహద్దు ఘర్షణల కారణంగా పాకిస్తాన్తో సంబంధాల సాధారణీకరణ కోసం భారత్ కూడా ప్రయత్నించాల్సి వస్తోంది. అంతిమంగా అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యత గురించి భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీయంగా పాక్ ఒంటరి కావడం అనేవే ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. ఆదిత్య గౌడర శివమూర్తి వ్యాసకర్త విదేశీ వ్యవహారాల నిపుణులు (‘ది స్టేట్స్మన్’ సౌజన్యంతో) -
వైరస్ విరుచుకుపడుతోంది.. ఒలింపిక్స్ డౌటే!
టోక్యో: ఎట్టిపరిస్థితుల్లోనైనా టోక్యో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఇటీవల జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగుచూడక ముందు వచ్చింది. కానీ ఇప్పుడు కోరలు తిరిగిన కోవిడ్–19 సెకండ్ వేవ్లో అత్యంత వేగంగా, ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విశ్వక్రీడలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు ఒకరు మెగా ఈవెంట్ జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కెనడాకు చెందిన ఐఓసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ ప్రముఖ బ్రాడ్కాస్టర్ బీబీసీతో మాట్లాడుతూ ‘టోక్యో ఒలింపిక్స్ తప్పనిసరిగా జరుగుతాయని చెప్పలేం. వైరస్ విరుచుకుపడుతోంది. ఆతిథ్య నగరంలోనూ కోవిడ్ జడలు విప్పింది’ అని అన్నారు. జపాన్ ప్రధాని యొషిహిదే సుగ గురువారం టోక్యోలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా ‘ఎమర్జెన్సీ’ (ఆరోగ్య అత్యవసర పరిస్థితి) విధించారు. గురువారం ఒక్కరోజే టోక్యో నగరంలోనే 2,447 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఏకంగా 50 శాతం వైరస్ కేసులు పెరగడంతో జపాన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. అక్కడి అధికార వర్గాల ప్రకారం ఈ అత్యవసర పరిస్థితి వచ్చే నెల దాకా కొనసాగే అవకాశముంది. సరిగ్గా ఆరు నెలలే మిగిలున్న టోక్యో ఒలింపిక్స్కు తాజా పరిస్థితి అత్యంత విఘాతం కలిగించేలా ఉంది. అన్నింటికి మించి జపాన్లో వ్యాక్సిన్ ట్రయల్స్ మందకొడిగా సాగుతున్నాయి. ఫలితాల విశ్లేషణ కూడా ఆలస్యమే అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్కడ మే నెల వరకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తెలిసింది. ప్రభుత్వం మాత్రం కొన్ని వ్యాక్సిన్లు ఫిబ్రవరికల్లా వస్తాయని ప్రకటిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాచారాన్ని మాత్రం వెల్లడించడం లేదు. ఎందుకీ పరిస్థితి? అంతర్జాతీయంగా పలు దేశాల్లో మహమ్మారిని నియంత్రించేందుకు రోగ నిరోధక టీకా (వ్యాక్సిన్)లొచ్చాయి. భారత్లో డ్రైరన్లు జరుగుతున్నా... విదేశాల్లో మాత్రం అత్యవసర కేటగిరీ కింద వినియోగం కూడా ప్రారంభమైంది. ఇంతటి పురోగతి ఉన్నప్పటికీ కరోనా కొత్త స్ట్రెయిన్ పలు దేశాలను వణికిస్తోంది. అసలీ టీకాలు కొత్త వేరియంట్పై పనిచేస్తాయా అన్న అనుమానాల్ని కూడా రేకెత్తిస్తోంది. ముఖ్యంగా యూరోప్ దేశాలన్నీ మళ్లీ లాక్డౌన్ అయిన దుస్థితి. అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రూటు మార్చుకున్నాయి. అరకొరగానే సాగుతున్నాయి. బ్రిటన్లాంటి దేశాలకైతే అసలు రాకపోకలే సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో విశ్వక్రీడల నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలో అటు నిర్వాహక దేశం జపాన్కు, ఇటు ఐఓసీకి పాలుపోవడం లేదు. బాల బాహుబలి ఇక లేడు -
సబ్సిడీలేని సిలిండర్లపై మళ్లీ బాదుడు
ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. ఇతర సిలిండర్లకూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి. -
రెండో రోజూ పెట్రో ధరల వడ్డింపు
న్యూఢిల్లీ, సాక్షి: వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో సగటున 15-25 పైసల మధ్య ధరలు ఎగశాయి. తాజాగా న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 81.38ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్కు 20 పైసలు అధికమై 70.88కు చేరాయి. ఇదే విధంగా ముంబైలో పెట్రోల్ లీటర్ 17 పైసలు పెరిగి రూ. 88.09కు చేరగా.. డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 77.34ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర 15పైసలు బలపడి రూ. 84.46కాగా.. డీజిల్ 20 పైసలు పెరిగి రూ. 76.37కు చేరింది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర 16 పైసలు బలపడి రూ. 82.95ను తాకగా.. డీజిల్ 21 పైసలు హెచ్చి రూ. 74.45కు చేరింది. ముందు రోజు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 17-28 పైసల స్థాయిలో ఎగసిన విషయం విదితమే. వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదవుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి! విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ దాదాపు 2 శాతం జంప్చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు పీఎస్యూలు.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ సవరిస్తుంటాయి. -
ఐఓసీ నష్టాలు రూ. 5,185 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.6,099 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.5,185 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఐఓసీ తెలిపింది. మార్చి క్వార్టర్లో చమురు ధరలు బాగా పతనం కావడంతో భారీగా ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. దీనికి రిఫైనరీ మార్జిన్లు తగ్గడం కూడా తోడవడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మరిన్ని వివరాలు..... ► 2018–19 క్యూ4లో రూ.1,787 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గతేడాది క్యూ4లో రూ.14,692 కోట్ల మేర ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. ► క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) మైనస్ 9.64 డాలర్లకు పడిపోయింది. ► లాక్డౌన్ కారణంగా 70 శాతం మేర ఇంధన డిమాండ్ తగ్గింది. జూలై మొదటి వారం కల్లా ఈ తగ్గిన 70 శాతం డిమాండ్లో 90 శాతం పుంజుకునే అవకాశాలున్నాయి. ► 2018–19లో రూ.16,894 కోట్లుగా ఉన్న నికర లాభం 2019–20లో రూ.1,313 కోట్లకు తగ్గింది. ► 2018–19లో రూ.3,227 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,531 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3% నష్టంతో రూ.87 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ జూమ్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్డవున్ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 42 డాలర్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రపంచవ్యాప్తంగా లాక్డవున్కు తెరతీయడంతో ఏప్రిల్లో రెండు దశాబ్దాల కనిష్టం 16 డాలర్లకు పడిపోయిన విషయం విదితమే. గత రెండు వారాలలో బ్రెంట్ చమురు 109 శాతం బలపడటం గమనార్హం! కాగా.. దేశీయంగానూ ఆర్థిక కార్యకలాపాల అన్లాకింగ్ను మొదలుపెట్టడంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంధన రంగ ప్రభుత్వ కంపెనీలు భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఖుషీ ఖుషీగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 6.4 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 398ను అధిగమించింది. ఈ బాటలో హెచ్పీసీఎల్ 6.7 శాతం జంప్చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 222ను దాటింది. ఇక ఐవోసీ 4 శాతం పుంజుకుని రూ. 93 వద్ద కదులుతోంది. తొలుత రూ. 96ను అధిగమించింది. రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్లతోపాటు పూర్తిస్థాయిలో దుకాణాలు, కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదీ తీరు పెట్రోలియం ప్రొడక్టులకు మే నెలలో డిమాండ్ 65-70 శాతానికి చేరగా.. కోవిడ్కు ముందు స్థాయికంటే ఇది 30-35 శాతమే తక్కువని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇక ఏప్రిల్లో 50-60 శాతం క్షీణించిన ఆటో ఇంధన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం 25 శాతమే తక్కువగా నమోదవుతున్నట్లు వివరించాయి. ఈ బాటలో వైమానిక ఇంధన(జెట్ ఫ్యూయల్) డిమాండ్ సైతం 50 శాతం రికవర్ అయినట్లు ఐడీబీఐ క్యాపిటల్ తెలియజేసింది. ఏప్రిల్లో 63 శాతం సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకున్న బీపీసీఎల్ రిఫైనరీ మే నెలలో 77 శాతం, ప్రస్తుతం 83 శాతం ఉత్పత్తికి చేరింది. ఇదే విధంగా ఐవోసీ, హెచ్పీసీఎల్ సైతం 80 శాతానికిపైగా సామర్థ్య వినియోగంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది. -
‘ఒలింపిక్స్ను జరిపి తీరుతాం’
టోక్యో: ఒలింపిక్స్ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒకవైపు చెబుతుంటే, టోక్యో ఒలింపిక్స్ను షెడ్యూల్ ప్రకారమే జరిపి తీరుతామని జపాన్ ప్రధాని షింజో అబే విశ్వాసం వ్యక్తం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతుందని, ఈ విషయంలో ఐఓసీతో కలిసి పని చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడిన నేపథ్యంలో ఒలింపిక్స్ను సైతం రీ షెడ్యూల్ చేస్తే బాగుంటుందని వాదన ఎక్కువైంది. ఈ క్రమంలోనే మాట్లాడిన జపాన్ ప్రధాని షింజో అబే.. ఒలింపిక్స్ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. షెడ్యూల్లో పేర్కొన్నట్లు జూన్ 24వ తేదీ నుంచే ఒలింపిక్స్ జరుగుతుందన్నారు. ఈ విషయంలో స్టేక్ హోల్డర్స్తో కూడా టచ్లో ఉన్నామన్నారు. ఒకవైపు కరోనా విజృంభణ, మరొకవైపు ఒలింపిక్స్ నిర్వహణ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇక ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. -
డబ్ల్యూహెచ్ఓ ఎలా చెబితే అలా!
బెర్లిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్పినట్లే తాము నడుచుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెలిపింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఆ సంస్థ ఎలా చెబితే అలా నడుచుకుంటామని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ తెలిపారు. ఓ ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒలింపిక్స్ను వాయిదా వేస్తేనే మేలని సలహా ఇచ్చారు. దీన్ని జపాన్ తోసిపుచ్చింది. ‘ఐఓసీ, టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ... ఒలింపిక్స్ను వాయిదా లేదంటే రద్దు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సీకో హషిమొటొ తెలిపింది. -
ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్నుంచి ఇంధన ధరలు మోతమోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గాన నిబంధనల నేపథ్యంలో పెట్రోలు ధరలు లీటరుకు 70-120 పైసలు పెంచవలసి వుంటుందని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తక్కువ ఉద్గారాలతో బీఎస్-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుందని ఐవోసీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కొన్నిరిమోట్ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) శుక్రవారం వెల్లడించింది. అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్గ్రేడ్ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. ధరల పెంపు సంకేతాలను ధృవీకరించిన సంజీవ్ సింగ్ ఏ మేరకు పెంపు వుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంధనాల రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ, గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని చెప్పారు. కాగా బీపీసీఎల్ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్జీసీకి చెందిన హెచ్పీసీఎల్ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్పీసీఎల్ ఇప్పటికే ప్రకటించింది. -
కొత్త ఏడాదిలో వంట గ్యాస్ భారం
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బండ భారం పడింది. నాన్ సబ్సిడీ ( సబ్సిడీ లేని) వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ. 19, ముంబైలో రూ. 19.50, ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకూ భారం పడనుంది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. గత ఏడాది ఆగస్టునుంచి ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగినట్లయింది. తాజా పెంపు తరువాత ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ. 684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో రూ. 895కు పెరిగింది. ఇక కోల్కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734గా వుండనుంది పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. -
రిలయన్స్ మరో ఘనత టాప్లోకి
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చూన్ ఇండియా– 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు ఫార్చూన్ ఇండియా పేర్కొంది. వృద్ధి 41.5 శాతం ఉండగా.. పోటీ సంస్థ ఐఓసీతో పోల్చితే ఈ కంపెనీ వృద్ధి 8.4 శాతం అధికంగా ఉంది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి. ఇక గడిచిన 10 ఏళ్ల సగటు పరంగా చూస్తే.. ఈ కాలంలో ఐఓసీ ఆదాయం కంటే ఆర్ఐఎల్ ఆదాయం 3 రెట్లు అధికం. ఇక, 2015 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ రూ. 4,912 కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. ఆర్ఐఎల్ 4 రెట్లు అధికంగా రూ. 23,566 కోట్ల లాభాన్ని కళ్లచూడటం విశేషం. ఓఎస్జీసీ స్థానం పదిలం గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఓఎన్జీసీ మూడవ స్థానంలో నిలిచింది. ఎస్బీఐ(4), టాటా మోటార్స్ (5), బీపీసీఎల్ (6) స్థానాల్లో ఉన్నాయి. అంతక్రితం ఏడాదిలో కూడా ఈ కంపెనీల జాబితా ఇదే వరుసలో ఉంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ 2019 జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది. టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సెన్ అండ్ టూబ్రో వరుసగా 8, 9, 10, 11 వ స్థానంలో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రెండు మెట్లు ఎక్కి 12వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుస స్థానాల్లో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. కాగా, ఫార్చూన్ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది. -
ఐఓసీ చైర్మన్గా శ్రీకాంత్ మాధవ్ వైద్య..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు చైర్మన్గా శ్రీకాంత్ మాధవ్ వైద్య నియమితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే కంపెనీలో డైరెక్టర్ (రిఫైనరీస్)గా ఉన్న ఆయన్ను ప్రభుత్వ రంగ సంస్థల సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత చైర్మన్ సంజీవ్ సింగ్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్తో ముగియనుంది. దీంతో తదుపరి చైర్మన్ కోసం పీఈఎస్బీ ఇంటర్వూ్యలు నిర్వహించింది. అశోక్ లేలాండ్ సీఈఓగా విపిన్ సోంధి న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్నకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్గా విపిన్ సోంధి నియమితులయ్యారు. ఈ పదవి నుంచి వినోద్ కే దాసరి వైదొలగిన విషయం తెలిసిందే కాగా, ఆయన స్థానంలో విపిన్ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 12 (గురువారం) నుంచి 2024 డిసెంబర్ 11 వరకు నూతన సీఈఓ, ఎండీ పదవీకాలం కొనసాగుతుందని ప్రకటించింది. ఇంతకుముందు జేసీబీ ఇండియా, టాటా స్టీల్, శ్రీరామ్ హోండా సంస్థలకు విపిన్ సేవలందించారు. -
వెలుగుల జిగేల్.. గజ్వేల్
సాక్షి, గజ్వేల్ : తానూ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారుతునకగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గ రూపు రేఖలను మార్చేశారు. ముఖ్యంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్కు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో నయా లుక్ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అధునాతన వసతులతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్), ఆడిటోరియం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ మూడింటిని 11 బుధవారం రోజు ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఇప్పటికే కొత్తరూపును సంతరించుకుంది. వందల కోట్ల వ్యయంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రింగురోడ్డు, ఎడ్యుకేషన్హబ్, పాండవుల చెరువు అభివృద్ధి, వంద పడకల ఆసుపత్రి, “డబుల్ బెడ్రూం’ మోడల్ కాలనీ తదితర పనులు పూర్తయ్యాయి. ఇందులో రింగు రోడ్డు, డబుల్ బెడ్ రూం మినహా మిగితావి వినియోగంలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ అత్యాధునిక వసతులతో “వెజ్ అండ్ నాన్వెజ్’ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. 2016 మార్చి నెలలో పట్టణంలోని పాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రభుత్వ భవనాలకు చెందిన 6.04 ఎకరాల భూమిలో ఈ మార్కెట్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రూ.22.85కోట్లతో ఈ పనులు అప్పటి రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో ఆరు భారీ షెడ్ల నిర్మాణం జరిగింది. ఈ షెడ్లను గాల్వెలూమ్ రూఫ్తో నిర్మించారు. షెడ్లలో 38 పండ్లు, పువ్వుల దుకాణాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా కూరగాయల కోసం 150, మటన్, చికెన్, చేపల విక్రయాల కోసం 52 షాపులను నిర్మించారు. మరో 16 వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా ఒక సూపర్మార్కెట్ ఇక్కడ సైతం నిర్మించారు. ఇక్కడ విక్రయించే వస్తువులు ఎప్పుడు తాజాగా ఉండే విధంగా కోల్డ్ స్టోరేజీను సైతం నిర్మించారు. మార్కెట్కు కొత్త లుక్ తీసుకురావడానికి క్లాక్ టవర్ను 30 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. మార్కెట్లోకి వచ్చే ప్రజలకు మంచినీటి వసతి కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటుచేశారు. మొత్తంగా ఎకరన్నర విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతుండగా మిగతా విస్తీర్ణంలో ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. వేలమంది ఒకేసారి క్రయవిక్రయాలు జరిపే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి శబ్ధ కాలుష్యం, కూరగాయలు, ఇతర పదార్థాల నుంచి ఎలాంటి చెడు వాసనలు రాకుండా షెడ్లను 35ఫీట్ల ఎత్తులో నిర్మించారు. అదే విధంగా స్లాబ్ల నిర్మాణాలు 20 ఫీట్ల ఎత్తులో జరిగాయి. ఆకట్టుకుంటున్న విగ్రహాలు ఇందిరాపార్క్ వైపు మార్కెట్ ప్రధాన ద్వారం ఏర్పాటు చేయగా.. మరో రెండు గేట్లను సైతం నిర్మించారు. ఇక్కడ వస్తువులను డంప్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక దారిని ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లో 30 రకాలకు చెందిన నీడ, పూల జాతులకు సంబంధించిన సుమారు 25 వేలకుపైగా మొక్కలు నాటారు. మార్కెట్కు వచ్చే ప్రజలు ఆవరణలోని పచ్చిక బయళ్లలో సేద తీరాలనిపించేలా మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చేవారి పిల్లల కాలక్షేపం కోసం మార్కెట్లోనే పలు రకాల ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. ఇందులో 6 రకాల ఆట వస్తువులు బిగించారు. మార్కెట్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు చిన్నారులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి రైతు దంపతుల విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పల్లె సంస్కృతిని కళ్లకు కట్టే విధంగా ఉన్న మరికొన్ని విగ్రహాలు సైతం చూపరులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో ఎప్పటికప్పుడు కూరగాయల వివరాలు, వాటి ధరలను తెలుసుకునేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చేవారు ఈ స్క్రీన్లపై ఉన్న ధరలను చూసి... తమకు నచి్చన కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో మొత్తం మూడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిఘా నీడలో పెట్టారు. మార్కెట్లో ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను బిగించారు. ప్రధాన ద్వారాలతో పాటు మార్కెట్లోని స్టాళ్ల వద్ద మొత్తం 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతకు పెద్దపీట వేసేందుకు అధునాతనమైన సీసీ కెమెరాలు మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్లో కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం దుకాణాలే కాకుండా మరో 16 దుకాణ షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించారు. ఈ మడిగెల్లో ఇతరుల కోసం వాణిజ్య వ్యాపారం చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 13 దుకాణ సముదాయాలకు వేలం పాట పూర్తికాగా.. మరో 3 దుకాణాలను మార్కెట్ కార్యాలయ కార్యకలాపాల కోసం సిద్ధం చేశారు. అద్భుత కళాక్షేత్రం.. మహతి రవీంధ్రభారతి తరహాలో కళాక్షేత్రం రూ. 19.5కోట్ల వ్యయంతో ఆడిటోరియంను నిర్మించారు. దీనికి “మహతి’ అని నామకరణం కూడా చేశారు. ముట్రాజ్పల్లి రోడ్డు వైపున ఉన్న రెండకరాల స్థలంలో దీనిని నిర్మించారు. 5,500 స్కైర్ మీటర్ల విస్తీర్ణంలో ఆడిటోరియం నిర్మించారు. ఇందులో రెండు ఫంక్షన్ హాల్స్ ఉండగా.. ప్రధాన హాలులో వీఐపీ సీట్లతో కలుపుకొని 1100 సీట్ల సామర్థ్యం, రెండో మినీ హాలును 250 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇంకా కాంపౌండ్ వాల్, ముందు భాగంలో వాటర్ ఫౌంటెన్, ల్యాండ్ స్కేపింగ్ నిర్మించారు. ఈ కళాక్షేత్రానికి వచ్చే చూపరులను ఆకట్టుకునే తరహాలో ఆడిటోరియంలో 8 రకాల తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించే కళాకృతులను ఏర్పాటు చేశారు. ఆవరణలో 2500 స్వైర్ మీటర్ల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రెండు ఫంక్షన్ హాల్స్కు వేర్వురుగా డైనింగ్ హాల్లను పైభాగంలో నిర్మించారు. వృద్ధులు, చిన్నపిల్లలు డైనింగ్ హాల్కు వెళ్లేందుకు వీలుగా ఇప్పటి వరకు ఒక లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. కాగా నారధుని వీణ పేరు “మహతి’గా ఈ ఆడిటోరియానికి నామకరణం చేశారు. గజ్వేల్ను గొప్ప కళాక్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఆడిటోరియం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారు. ఏసీ సౌకర్యంతో త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న ఈ కళాక్షేత్రంలో సాహితీ, కవుల సమ్మేళనాలే కాకుండా ప్రభుత్వ సభలు, సమావేశాలు, ఇతర ప్రధాన కార్యక్రమాలు ఇక్కడ జరుపుకునే విధంగా అవకాశం కలి్పంచనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్.. గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ మార్గంలో రూ.42.50 కోట్ల వ్యయంతో ఐవోసీ(సమీకృత కార్యాలయ భవన సముదాయం) నిర్మాణం పూర్తయ్యింది. లక్షా 44 వేల స్వై్కర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏ, బీ, సీ బ్లాకులుగా భవనాల నిర్మాణం ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు వేర్వేరుగా గదుల నిర్మాణం జరిగింది. ఏ బ్లాకులో డైనింగ్ హాల్, క్యాంటిన్, ఎలక్ట్రిక్ విభాగం ఉండగా.... బీ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్లో 13 కార్యాలయాలు, 52 గదులను నిర్మించారు. అలాగే మొదటి అంతస్తులో 12 కార్యాలయాలు, 48 గదులు, రెండో అంతస్తులో 12 కార్యాలయాలు, 48 గదుల నిర్మాణాలు పూర్తయ్యాయి. అదే విధంగా సీ బ్లాకును “గడా’ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయంతో పాటు మల్టిపర్పస్ కార్యాలయానికి వినియోగించనున్నారు. ఐవోసీలోని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అధికారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలి్పంచారు. -
బీపీసీఎల్ రేసులో పీఎస్యూలకు నో చాన్స్
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. బీపీసీఎల్లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని పీఎస్యూల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. వ్యాపారం... ప్రభుత్వ పని కాదు.. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, 2014 నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నామని ప్రధాన్ పేర్కొన్నారు. టెలికం, విమానయాన రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించినందువల్లే పోటీ పెరిగి వినియోగదారులకు చౌకగా సేవలందు తున్నాయని వివరించారు. బీపీసీఎల్కు అస్సాం లో ఉన్న నుమాలీఘర్ రిఫైనరీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అస్సామ్ ముఖ్యమంత్రి కోరారని ప్రధాన్ చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని వివరించారు. బీపీసీఎల్ ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. పోటీని పెంచడానికే బీపీసీఎల్ను ప్రైవేటీకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాన్ చెప్పారు. అందుకే వాటిల్లో వాటాను విక్రయిస్తున్నామని, ఫలితం గా ఆ సంస్థల పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వివరించారు. ఇక్కడ జరిగిన ఏఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఐఓసీ లాభం 47 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఒక్కో షేర్ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని పేర్కొన్నారు. రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని వివరించారు. గత క్యూ1లో రూ.7,065 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.2,362 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆదాయంలో పెద్దగా మార్పు లేదని, రూ.1.53 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సగానికి పైగా తగ్గిన జీఆర్ఎమ్..... ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) 4.69 డాలర్లకు తగ్గిందని, గత క్యూ1లో ఈ జీఆర్ఎమ్ 10.21 డాలర్లని సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. కాగా గత క్యూ1లో రూ.1,805 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు రాగా ఈ క్యూ1లో రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు వచ్చాయని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 4.3% లాభంతో రూ. 139 వద్ద ముగిసింది. -
ఐఓసీ ఎల్పీజీ ప్రాజెక్ట్లో బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు చేరిక
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) చేపట్టిన భారీ ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్ట్లో బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు కూడా చేతులు కలుపుతున్నాయి. గుజరాత్లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకూ 2,757 కిమీ ఈ పైప్లైన్ ప్రాజెక్ట్ను రూ.9,000 కోట్ల పెట్టుబడులతో ఐఓసీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో చెరో 25 శాతం వాటా తీసుకోనున్నట్లు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ మూడు కంపెనీల జాయింట్వెంచర్ కానున్నది. 3 రాష్ట్రాలు...22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఈ ప్రాజెక్ట్లో భాగంగా కాండ్లా వద్ద ఎల్పీజీని దిగుమతి చేసుకుంటారు. పశ్చిమ తీర ప్రాంతంలో కొన్ని రిఫైనరీల నుంచి కూడా ఎల్పీజీని తీసుకుంటారు. ఆ తర్వాత దీనిని అహ్మదాబాద్, ఉజ్జయిని, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నోలకు పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లోని ఈ మూడు కంపెనీలకు చెందిన 22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లకు ఈ పైప్లైన్ను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా రోడ్డు రవాణా వ్యయాలు కలసిరావడమే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగైనదని నిపుణులంటున్నారు. ఈ పైప్లైన్ ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తుంది. దేశంలో ఇదే అతి పొడవైన ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్ట్ కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా. ప్రస్తుతం గెయిల్ కంపెనీ గుజరాత్లోని జామ్ నగర్ నుంచి న్యూఢిల్లీ సమీపంలోని లోని వరకూ 1,415 కిమీ. ఎల్పీజీ పైప్లైన్ను నిర్వహిస్తోంది. ఈ పైప్లైన్ ద్వారా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తోంది. -
దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15 మిలియన్ టన్నుల) స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 2017లో సింగపూర్లో ప్రత్యేక ట్రేడింగ్ ఆఫీస్ను ఏర్పాటు చేసింది. తాజాగా కంపెనీ అంతర్గతంగా ట్రేడింగ్ టీమ్ను, సాఫ్ట్వేర్ను తయారు చేసుకున్న నేపథ్యంలో దేశీయంగానూ డెస్క్ను ప్రారంభించింది. గత నెల 25న తొలి ట్రేడ్ కింద నైజీరియాలో ఉత్పత్తయ్యే అగ్బామి రకం క్రూడ్ పది లక్షల బ్యారెల్స్ను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలకు దేశీయంగా ట్రేడింగ్ డెస్క్లు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మాత్రం ఇలాంటిది ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఐవోసీనే. సింగపూర్ డెస్క్లో క్రూడ్ కొనుగోలుకు బిడ్స్ రావడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి రెండు గంటల దాకా పట్టేస్తుండగా.. దేశీ డెస్క్ ఏర్పాటుతో ఎప్పటికప్పుడు మారే ధరలపై తక్షణమే బేరసారాలు చేసి, వెంటనే నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఐవోసీ పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్ను కొనేవారే లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్ ఎయిర్వేస్కు లీగల్ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్ చేస్తూ, జెట్ ఎయిర్వేస్ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్-నాగ్) లీగల్ నోటీస్ జారీ చేసింది. సంస్థ యాజమాన్యం బ్యాంకుల చేతికి వచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసిన నాగ్ సంస్థ సీఈవో వివేక్ దుబేకు ఈ నోటీసులు పంపించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతన బకాయిలు ఈ నెల 14 నాటికి జీతాలుచెల్లించాలని, అలాగే ఇకపై ప్రతినెలా 1వ తేదీ కల్లా వేతనాలు అందించాలని కోరుతూ నూతన యాజమాన్యానికి నాగ్ నోటీసులిచ్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వారంలో ఇది రెండవ సారి. అలాగే జెట్ఎయిర్వేస్లోని వాటాలను విక్రయించేందుకు ఎస్బ్యాంకు బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తిని కనబర్చక పోవడంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. జెట్ ఎయిర్వేస్లోని సుమారు 75శాతం వాటాల కొనుగోలుకు బిడ్లను స్వీకరించే గడువును ఏప్రిల్12వ తేదీ శుక్రవారం వరకు పొడిగించామని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ప్రకటించింది. ఇది ఇలా వుంటే నెదర్ల్యాండ్స్ ఆమ్స్టర్డాంలోని చిపోల్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానాన్ని నిలిపిశారు. బకాయిలు చెల్లించని కారణంగానే ముంబైకు చెందిన జెట్ విమానాన్ని దాదాపు ఆరు గంటలపాటు ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణా కారణాల వల్ల జెట్ విమానం 9డబ్ల్యు 231 ఆలస్యంమైందని, ప్రయాణీకుల సౌకర్యార్థం సంబంధిత చర్యలు తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. -
కాంగ్రెస్కు అండగా నిలవండి : టీపీసీసీ ఎన్నారై సెల్
లండన్ : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కోరింది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని టీపీసీసీ ఎన్నారై సెల్ లండన్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి వీరేంద్ర, ఐఓసీ నేతలు గురమిందర్, రష్పాల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్కి ఓట్లు వేయడం వల్ల తెలంగాణకి ఒరిగేది ఏమీలేదని, ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరిన వారందరిని కలిపితే 15 ఎంపీలున్నా ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్కి అండగా నిలవాలని కోరారు. ఐఓసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సచివాలయం రాకుండా ఇంట్లోనే ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17 సీట్లలో కాంగ్రెస్ని గెలిపించి కేసీఆర్ సచివాయం ఎలా రారో చూద్దామన్నారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్, యూకే, ఐఓసీ ప్రధాన కార్యదర్శి గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో మొదటి నుండి ఉండి, అహర్నిశలు పని చేసిన హరీష్ రావు గొంతు కోయడమే కేసీఆర్ ధోరణిగా తెలుస్తుందని నిప్పులు చెరిగారు. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు వేటినీ ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ హరీష్ రావుకి ద్రోహం చేశారా? హరీష్ రావు కేసీఆర్కి ద్రోహం చేశారా? తెలపాలని డిమాండ్ చేశారు. అడ్వైజరీ మెంబర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గత100రోజుల్లో ఏ పని మొదలు పెట్టలేదని, ఎంత సేపు తన కొడుకు చుట్టూ రాజకీయాలు తింపుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి ఓటు వేసినట్లు అని అన్నారు. కో కన్వీనర్ రాకేష్ బిక్కుమండ్ల మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకి కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులని గెలిపించు కోవాలని, కాంగ్రెస్ అధికారం లక్ష్యంగా పని చేయాలనీ కోరారు. కో కన్వీనర్ శ్రీధర్ మంగళారపు మాట్లాడుతూ... ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మద్యేనని టీఆర్ఎస్కి ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయడం వృధా అన్నారు. కార్యదర్శి , శ్రీధర్ నీలా మాట్లాడుతూ.. ఎన్నికల్లో బ్రిటన్ ఎన్నారైలు క్రియాశీలకంగా పని చేస్తున్నారని వరంగల్ వాసినైన తాను వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తానని అన్నారు. మహిళా విభాగం- ప్రధాన కార్యదర్శి మేరీ మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కాంగ్రెస్ శ్రమ ఎంతో ఉందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే దళిత, మైనారిటీ మహిళలకి రక్షణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం కార్యవర్గ సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, నీల శ్రీధర్, మేరీ, రజిత, శశి, అఖిల్, వేణుగోపాల్, సుభాష్, తిరుపతి రెడ్డి, గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళారపు, స్నేహలత, వైష్ణవి, రంజిత్, ప్రకాష్ల ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. -
ఐవోసీ, ఓఎన్జీసీపై డివిడెండ్ ఒత్తిడి
న్యూఢిల్లీ: పన్ను ఆదాయాలు ఆశించినంత స్థాయిలో కనిపించని నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునే మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇచ్చేలా ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 19న ఐవోసీ బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, నెల రోజుల వ్యవధిలో మరోసారి మధ్యంతర డివిడెండ్ చెల్లించేంతగా మిగులు నిధులు తమ వద్ద లేవని కేంద్రానికి ఓఎన్జీసీ తెలిపినట్లు సమాచారం. ఐవోసీ డిసెంబర్లో షేరు ఒక్కింటికి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 4,435 కోట్ల ప్రభుత్వానికి అందించింది. ఇక ఫిబ్రవరి 14న ఓఎన్జీసీ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అలాగే రూ. 4,022 కోట్ల మేర షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం కేవలం నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం కుదరదు. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఆమోదం లభించినా.. ఇప్పటికే ప్రకటించిన మధ్యంతర డివిడెండు, షేర్ల బైబ్యాక్కు నిధులు ఖర్చు చేసేస్తే రెండో మధ్యంతర డివిడెండ్ ఇచ్చేంత నిధులు ఉండవని ఓఎన్జీసీ చెబుతోంది. వస్తు, సేవల పన్నుల వసూళ్లు రూ. 30,000–40,000 కోట్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా దాదాపు అదే స్థాయిలో తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యం 3.4 శాతంలోపు కట్టడి చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయ లోటు భర్తీకి మార్గాలు అన్వేషిస్తోంది. -
ఐవోసీకి నిల్వల సెగ..
న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 7,883 కోట్లు. మరోవైపు టర్నోవరు రూ. 1.32 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి చమురు ధరలు క్షీణించడంతో.. అప్పటికే నిల్వ చేసి పెట్టుకున్న ఇంధన విలువ గణనీయంగా పడిపోయిందని, ఇది ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐవోసీ పేర్కొంది. ఇక దేశీయంగా ఇంధన అమ్మకాలు 3 శాతం పెరిగి 21.5 మిలియన్ టన్నులకు చేరాయని వివరించింది. బుధవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 134.65 వద్ద క్లోజయ్యింది. -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సంవత్సర కానుకగా మహిళలకు తీపికబురు అందింది. వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ 5.91 మేరకు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నెలరోజుల వ్యవధిలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తగ్గించిన వంట గ్యాస్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 1న సబ్సిడీతో కూడిన వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ 6.52 మేర తగ్గించారు. జూన్ నుంచి ఆరు సార్లు వరుసగా సిలిండర్ ధర పెంపు తర్వాత తొలిసారిగా డిసెంబర్ 1న ధరలు దిగివచ్చాయి. కాగా సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ 120.50 తగ్గించినట్టు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు తగ్గడం, డాలర్తో రూపాయి విలువ బలపడటంతో వంట గ్యాస్ ధరలు దిగివచ్చాయని ఐఓసీ వెల్లడించింది. -
ఐఓసీ షేర్ల బైబ్యాక్ @ రూ.4,435 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్ను రూ.149 ధరకు బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్ ధర గురువారం ఐఓసీ షేర్ ముగింపు ధర (రూ.137) కంటే 9 శాతం అధికం. ఈ కంపెనీలో 54.06 శాతం వాటా ఉన్న కేంద్రం ఈ షేర్ల బైబ్యాక్లో పాల్గొని భారీగా నిధులు సమీకరిస్తుందని అంచనా. 67.5 శాతం మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేర్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.75(67.5 శాతం)మధ్యంతర డివిడెండ్ను చెల్లించడానికి కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐఓసీ వెల్లడించింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,566 కోట్లని(పన్నులు కాకుండా), ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,544 కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని, దీనికి అదనంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి లభిస్తుందని పేర్కొంది. డివిడెండ్ చెల్లింపునకు సంబంధించి రికార్డ్ డేట్ ఈ నెల 25 అని, ఈనెల 31లోపు డివిడెండ్ మొత్తాన్ని వాటాదారులకు చెల్లిస్తామని వివరించింది. కోల్ ఇండియా, భెల్, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అరడజను ప్రభుత్వ రంగ బ్యాంక్లు షేర్ల బైబ్యాక్ ప్రణాళికలను ప్రకటించాయి. ఎన్హెచ్పీసీ, భెల్, నాల్కో, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్యార్డ్, కేఐఓసీఎల్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
కేంద్రం నిధుల వేట వేగవంతం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా నాలుగు నెలల కాలమే మిగిలి ఉంది. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు సమీకరించిన మొత్తం రూ.20,000 కోట్లను దాటలేదు. దీంతో మిగిలిన భారీ లక్ష్యాన్ని తక్కువ వ్యవధిలోనే చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలను వేగవంతం చేస్తోంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియాల్లో వాటాల అమ్మకం ద్వారా త్వరలోనే రూ15,000 కోట్లకు పైగా సమీకరించాలన్నది ఒక ప్రతిపాదన అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవే కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ద్వారా మరో రూ.10,000 కోట్లు కూడా రాబట్టుకోవాలన్న (కేంద్రం తన వాటాలను బైబ్యాక్లో విక్రయించి) ఆలోచనతో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఓఎన్జీసీలో 67.48 శాతం, ఐవోసీలో 56.75 శాతం, ఆయిల్ ఇండియాలో 66.13 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి. నిధుల సమీకరణ... ఓఎన్జీసీలో 5 శాతం, ఐవోసీలో 3 శాతం, ఆయిల్ ఇండియాలో 10 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించాలన్నది కేంద్రం పరిశీలిస్తున్న ప్రతిపాదన. దీని ప్రకారం ఓఎన్జీసీలో వాటాల విక్రయం ద్వారా రూ.10,000 కోట్లు, ఐవోసీ వాటాల అమ్మకంతో రూ.4,200 కోట్లు, ఆయిల్ ఇండియాలో వాటాల అమ్మకం ద్వారా రూ.2,300 కోట్లు సమకూరే అవకాశం ఉంది. అయితే, కచ్చితంగా ఎంత వాటా విక్రయిస్తారు? ఎన్ని నిధులు సమీకరిస్తారు? అన్నది ఆఫర్ ప్రారంభం నాటికే తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ నెల మొదట్లో కోల్ ఇండియాలో 3 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే. ఆయిల్ ఇండియా షేర్ల బైబ్యాక్ ఆఫర్ ఫర్సేల్ మార్గంలో వాటాల అమ్మకంతోపాటు మరోవైపు షేర్ల బైబ్యాక్ చేపట్టాలని కూడా కేంద్రం కోరుతోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలించేందుకు ఈ నెల 19న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఆయిల్ ఇండియా తెలిపింది. రూ.1,100 కోట్ల మేర బైబ్యాక్ చేపట్టే అవకాశం ఉందని అంచనా. అలాగే, ఓఎన్జీసీ రూ.4,800 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.4,000 కోట్ల చొప్పున బైబ్యాక్ ఆఫర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్ ఇండియా షేర్ల బైబ్యాక్ ఆఫర్ జనవరి చివరికి ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
ట్యాంకర్లలో అయిల్ తక్కువగా నింపుతున్నారు
-
జగిత్యాలలో సీఎన్జీ సరఫరా హక్కులు ఐఓసీకి
న్యూఢిల్లీ: తెలంగాణలోని జగిత్యాలలో సీఎన్జీ సరఫరా లైసెన్స్ ఐఓసీకి దక్కింది. జగిత్యాలతో పాటు ఔరంగాబాద్(బిహర్), రేవా (మధ్య ప్రదేశ్)ల్లో ఈ కంపెనీ వాహనాలకు సీఎన్జీని, గృహాలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేసే హక్కులను పొందింది. పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్...48 నగరాల్లో సీఎన్జీ గ్యాస్ సరఫరా బిడ్ల వివరాలను వెల్లడించింది. అదానీ గ్రూప్కు చెందిన అదానీ గ్యాస్కు 11 నగరాల్లో సీఎన్జీ సరఫరా లైసెన్స్లు లభించాయి. అలహాబాద్ సహా మొత్తం 11 నగరాల్లో సీఎన్జీని సరఫరా చేసే హక్కులను అదానీ గ్రూప్ సాధించింది. దీంట్లో ఆరు నగరాల్లో సొంతంగానూ, ఇతర నగరాల్లో ఐఓసీతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్తో అదానీ సీఎన్జీని సరఫరా చేస్తుంది. బీపీసీఎల్కు చెందిన భారత్ గ్యాస్ రీసోర్సెస్ సంస్థకు ఆరు నగరాల్లో లైసెన్స్లు లభించాయి. టొరంట్ గ్యాస్ కంపెనీకి కూడా ఆరు నగరాల్లో గ్యాస్ సరఫరా చేయడానికి లైసెన్స్లు వచ్చాయి. గెయిల్కు చెందిన గెయిల్ గ్యాస్ మూడు నగరాల్లో గ్యాస్ రిటైలింగ్ లైసెన్స్లు పొందింది. -
ఒలింపిక్ డే రన్కు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘ఒలింపిక్ డే రన్’కు విశేష స్పందన లభించింది. 3,000 మందికి పైగా చిన్నారులు ఈ పరుగులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒలింపిక్ జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. చార్మినార్, విక్టరీ ప్లేగ్రౌండ్, వైఎంసీఏ, గాంధీ విగ్రహం, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మెహదీపట్నం, యూసుఫ్గూడ మీదుగా నిర్వహించిన ఈ పరుగు ముగింపోత్సవం ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్ని ఎంతో ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తా చాటుతున్నారని కితాబిచ్చారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా సర్కారు 10 నుంచి 50 లక్షల వరకు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ను కల్పించడంతో యువత క్రీడల్ని కెరీర్గా ఎంచుకునేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. దేశంలోనే క్రీడల్లో తెలంగాణను నంబర్వన్ రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్రాజ్, నంది టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తగ్గిన వంటగ్యాస్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అటు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టాన్ని తాకితే ఇటు వంట గ్యాస్ ధరలు దిగి వచ్చాయి. సబ్సిడీ ఎల్పీజీ (ద్రవీకృత పెట్రోలియం వాయువు), నాన్ సబ్సిడీ వంటగ్యాస్ ధరలు తగ్గాయి. సబ్సిడీ సిలిండర్ రూ. 1.77 తగ్గగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర (14.2 కిలోల) రూ.35.36 లు తగ్గింది. అన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సిలిండర్ ధరలను తగ్గించడం ఇది నాలుగవ సారి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం వంటగ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ- రూ.653.5 కోలకతా - రూ.676 ముంబై - రూ.625 చెన్నై- రూ. 663.5 హైదరాబాద్ - 705.00 సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ - రూ. 491.35 కోలకతా - రూ. 494.33 ముంబై - రూ. 489.04 చెన్నై- 479.44 హైదరాబాద్ - 489.50 మరోవైపు ప్రభుత్వ రంగ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో సిఎన్జీ పీఎన్జీ (పైప్డ్ సహజ వాయువు) ధరలను పెంచేసింది. ఏప్రిల్ 2 నుంచి సీఎన్జీ కిలోకు 90 పైసలు, స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సిఎం) కు 1.15 రూపాయలు పెంచింది. -
గ్యాస్ సిలిండర్ల రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు హోలీ కానుక అందించాయి. ఎల్పీజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ల ధరపై తగ్గింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన రేట్లు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది. నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై తగ్గిన సిలిండర్ల ధరలు ఇలా ఉండనున్నాయి. నాన్ సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్ రూ. 47 ధర తగ్గింపు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కి దిగివచ్చింది. కోలకతాలో రూ.45.50 తగ్గి రూ.711.50కు గా ఉండనుంది. ముంబైలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గింపు అనంతరం ప్రస్తుతధర రూ. 699.50కుగా ఉంటుంది. సబ్సిడీ సిలిండర్ల ధర సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోల్కతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ల ధర 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు 77 నుంచి 80 రూపాయలవరకు తగ్గించింది. ఢిల్లీలో 78.50 రూపాయలు తగ్గి రూ.1230 గాను, కోల్కతాలో 77 రూపాయలు తగ్గి రూ. 1270.50 , ముంబైలో రూ.79 తగ్గి రూ.1181కు , చెన్నైలో రూ.80 తగ్గి రూ.1307కు గా ఉంటుంది. -
అదరగొట్టిన ఐఓసీ: బోనస్, డివిడెండ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది. అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. -
గుంతకల్లులో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ఏడు ఆయిల్ ట్యాంకర్ల లారీలను ధ్వంసంచేయడమే కాక, అడ్డు వచ్చినవారిపై దాడికి దిగారు. ఇంధన సరఫరాలో అధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. టీడీపీ నేతల దాష్టీకానికి నిరసనగా బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గుంతకల్ డిపో బంద్కు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. -
సర్కారీ షేర్ల మేళా!
కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్–22’ ► ఆరు రంగాలకు చెందిన షేర్లతో కూర్పు ► ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర 22 షేర్లతో ఏర్పాటు న్యూఢిల్లీ: ‘భారత్–22’ పేరుతో కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రంగాల నుంచి ఎంపికచేసిన షేర్లు ఇందులో వుంటాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ను ఏర్పాటుచేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించిన ప్రభుత్వం తాజాగా రెండో ఈటీఎఫ్కు శ్రీకారం చుట్టింది. ఇంధనం, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్–ఈ ఆరు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్–22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. తాజా ఈటీఎఫ్కు ఆయా రంగాలను ఎంపికచేసేటపుడు, ఆ రంగాల్లో జరిగిన సంస్కరణల్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆయా షేర్ల విలువలపై సంస్కరణల సానుకూల ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ బ్యాంకులు కూడా... భారత్–22 జాబితాలో పైన పేర్కొన్న ప్రైవేటు దిగ్గజాలే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు వున్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్యూ బ్యాంకుల్ని భారత్–22లో చేర్చినట్లు జైట్లీ తెలిపారు. పీఎస్యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను అవసరమైన సమయంలో 52 శాతానికి తగ్గించుకుంటామని ఆయన చెప్పారు. కొత్త ఈటీఎఫ్లో ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్, కోల్, మైనింగ్ ప్రభుత్వ కంపెనీలైన ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కోలు వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీలు కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొద్దికొద్దిగా ప్రభుత్వ వాటాను ఈటీఎఫ్లోకి మళ్లిస్తామని ఆయన వివరించారు. తొలి ఫండ్ ద్వారా ఈటీఎఫ్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా అమలుచేసిందని జైట్లీ చెపుతూ ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్ల కింద 4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయన్నారు. పలు పెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ ఫండ్స్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నందున, వచ్చే నాలుగేళ్లలో ఈ ఆస్తుల విలువ 7 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చన్నది అంచనా అని ఆయన వివరించారు. ఈటీఎఫ్లో పెట్టుబడికి రిస్క్ తక్కువని ఆయన అన్నారు. మ్యూచువల్ ఫండ్ తరహాలోనే... మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే..ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదేతరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. తొలి ఈటీఎఫ్లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐఓసీ, గెయిల్, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్ఈసీ, ఇంజనీర్స్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్లు వున్నాయి. భారత్–22 యూనిట్లను ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు కేంద్ర పెట్టుబడుల శాఖ కార్యదర్శి నీరజ్ గుప్తా వెల్లడించారు. దీని ద్వారా సేకరించబోయే నిధులకు పరిమితి ఏదీ విధించుకోలేదన్నారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ.1.12 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.24పైసలు ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువకు అనుగుణంగా ఈ ధరలను తగ్గించినట్టు తెలిసింది. కాగ, రోజువారీగా సవరించనున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై పెట్రోల్ డీలర్లు కూడా సమ్మతించారు. ధరలను ప్రతిరోజూ అర్థరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో ముందుగా నిర్ణయించిన బంద్ ను కూడా పెట్రో డీలర్లు ఉపసంహరించుకున్నారు. రేపటి నుంచే రోజువారీ ధరల మార్పు ఉండనుంది. కానీ ఒక్క రోజే ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించడం విశేషం. ఇవి కూడా నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ధరలను రోజూవారీ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి. ఈ విధానం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరల్లో పారదర్శకత ఉంటుందని చమురు సంస్థల అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలను పక్షం రోజులకోసారి సమీక్షిస్తుండడం తెలిసిందే. ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రిస్తామనీ, అందరికీ కనిపించేలా పెట్రోల్ పంపుల్లోనూ ప్రదర్శించడమేగాక, మొబైల్ యాప్లు, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా తెలియపరుస్తాని వారు చెప్పారు. -
అత్యంత లాభదాయక పీఎస్యూగా ఐఓసీ
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ కంపెనీగా (పీఎస్యూ) పెట్రో మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆవిర్భవించింది. టర్నోవర్కు సంబంధించి అతిపెద్ద కంపెనీగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐఓసీ నికరలాభం 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 70 శాతం వృద్ధితో రూ. 19,106 కోట్లకు చేరింది. దీంతో లాభాల విషయంలో చమురు ఉత్పాదక దిగ్గజం ఓఎన్జీసీని ఐఓసీ అధిగమించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ రూ. 17,900 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ నికరలాభం రూ. 16,140 కోట్లుకాగా, ఐఓసీ నికరలాభం రూ. 11,242 కోట్లు మాత్రమే. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, నిల్వల ద్వారా వచ్చిన లాభాలు, ఉత్పాదక సామర్థ్యంలో మెరుగుదల వంటి అంశాల కారణంగా అధిక వృద్ధి సాధ్యపడిందని ఐఓసీ సీఎండీ బి అశోక్ తెలిపారు. సహజవాయువుపై ప్రభుత్వ ధరల విధానంతో రూ. 3,000 కోట్ల నికరలాభాన్ని కోల్పోయామని ఓఎన్జీసీ దినేష్ కె సార్రాఫ్ పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో రిలయన్స్ టాప్... ప్రైవేటు రంగ కంపెనీల్లో అత్యధిక లాభదాయక కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాది నిలబడింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 29,901 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. తదుపరి స్థానంలో రూ. 26,357 కోట్ల లాభంతో టీసీఎస్ వుంది. -
ఐవోసీ లాభం 85% అప్
⇔ క్యూ4లో రూ.3,720 కోట్లు ⇔ కలిసొచ్చిన అధిక రిఫైనరీ మార్జిన్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఐవోసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి బంపర్ ఫలితాలను ప్రకటించింది. అధిక రిఫైనరీ మార్జిన్ల అండతో కంపెనీ లాభం ఏకంగా 85 శాతం పెరిగి రూ.3,720 కోట్లకు చేరుకుంది. షేరు వారీ ఆర్జన రూ.7.85గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన లాభం రూ.2,000 కోట్లే. లాభాల్లో భారీ వృద్ధికి అధిక రిఫైనరీ మార్జిన్లకు తోడు ఇన్వెంటరీ గెయిన్స్ కారణమని ఐవోసీ చైర్మన్ బి.అశోక్ విలేకరులకు తెలిపారు. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.1,22,285 కోట్లుగా నమోదైంది. దేశంలో అతి పెద్ద రిఫైనరీ సంస్థ అయిన ఐవోసీ మార్చి త్రైమాసికంలో 17.1 మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ప్రతీ బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 8.95 డాలర్లను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది కేవలం 3 డాలర్లుగానే ఉండడం గమనార్హం. 2015–16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇన్వెంటరీ పరంగా కంపెనీ రూ.3,417 కోట్ల నష్టాలను ఎదుర్కోగా... తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,634 కోట్ల ఇన్వెంటరీ లాభాలు మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయి. కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసి విక్రయించే లోపు ధరలు పెరిగితే దాన్ని ఇన్వెంటరీ లాభాలుగా పేర్కొంటారు. ఒకవేళ ధరలు తగ్గితే నష్టాలు ఎదురవుతాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండలోన్ లాభం 11,242 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు వృద్ది చెందింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా ఐవోసీ చైర్మన్ అశోక్ పేర్కొన్నారు. ఎగుమతులు సహా 2016–17లో 83.49 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విక్రయించినట్టు చెప్పారు. ఇంధన రిటైలింగ్ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని అశోక్ చెప్పారు. కాగా, షేరు ఒక్కింటికీ రూ.1 తుది డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది. -
7సంస్థలు.. రూ. 34,000 కోట్లు
ఐవోసీ, సెయిల్ తదితర సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్!∙∙ మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఏడు దిగ్గజ సంస్థల్లో వాటాల విక్రయానికి కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) వెల్లడించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తదితర బ్లూచిప్ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.34,000 కోట్లు రావొచ్చని అంచనా. డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), ఎన్ఎల్సీ ఇండియా కూడా ఉన్నాయి. వాటాల విక్రయానికి నిర్దిష్ట గడువేదీ పెట్టుకోలేదని, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ .. మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక కోసం మాత్రమే నిర్ణయం తీసుకున్నామని దీపం కార్యదర్శి నీరజ్ గుప్తా చెప్పారు. ‘ఇది డిజిన్వెస్ట్మెంట్ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియలో భాగం మాత్రమే. కచ్చితంగా ఈ పీఎస్యూల్లో డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుందనేమీ లేదు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే 12 పీఎస్యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన సంస్థల్లో వాటాల విక్రయ అంశం ముందుకు కదలడానికి మరికాస్త సమయం పట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017–18 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2016–17లో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించింది. ఎన్టీపీసీ, పీఎఫ్సీల్లో 10 శాతం వాటాలు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రకారం... కేంద్రం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 3 శాతం, సెయిల్.. ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, పీఎఫ్సీల్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించాలని భావిస్తోంది. అలాగే ఎన్ఎల్సీ ఇండియా (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్)లో 15 శాతం, ఆర్ఈసీలో 5 శాతం మేర డిజిన్వెస్ట్మెంట్ యోచన ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే.. ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 34,000 కోట్లు దఖలు పడే అవకాశం ఉంది. ఇందులో ఎన్టీపీసీ నుంచి రూ. 13,000 కోట్లు, ఐవోసీ నుంచి రూ. 6,000 కోట్లు, సెయిల్ నుంచి రూ. 2,500 కోట్లు రావొచ్చు. అలాగే పీఎఫ్సీలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 4,000 కోట్లు, ఎన్హెచ్పీసీ నుంచి రూ. 3,000 కోట్లు, ఎన్ఎల్సీ (రూ. 2,000 కోట్లు), ఆర్ఈసీ (రూ. 1,000 కోట్లు) రావొచ్చని అంచనా. కేంద్రానికి ఐవోసీలో 58.28%, ఎన్టీపీసీలో 69.74%, సెయిల్లో 75%, ఎన్హెచ్పీసీలో 74.50%, ఎన్ఎల్సీ ఇండియాలో 90%, పీఎఫ్సీలో 67.80%, ఆర్ఈసీ 60.64% వాటాలు ఉన్నాయి. -
వార్తల్లో వనిత
భారత మహిళలు కిరణ్ బేడీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా 2016, మే 29న బాధ్యతలు స్వీకరించారు. నీతా అంబానీ: 2016, ఆగస్టులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. నజ్మా హెప్తుల్లా: కేంద్ర మంత్రిగా పనిచేసి 2016, ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. జస్టిస్ మంజులా చెల్లూర్: 2016, ఆగస్టులో బాంబే హైకోర్ట్ చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. శుభా ముద్గల్: ప్రముఖ గాయని శుభా ముద్గల్కు 2016కుగానూ రాజీవ్గాంధీ జాతీయ సద్భావనా అవార్డు లభించింది. అనురాధా రాయ్: ‘స్లీపింగ్ ఆన్ జూపిటర్’ అనే పుస్తకానికి గానూ అనురాధారాయ్కి డీఎస్సీ ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్–2016 దక్కింది. ఆమె రచించిన ఇతర నవలలు.. ‘యాన్ అట్లాస్ ఆ‹ఫ్ ఇంపాజిబుల్ లాంగింగ్’, ‘ది ఫోల్డెడ్ ఎర్త్’. అర్చనా రామసుందరం: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం 2016, ఫిబ్రవరి 1న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఒక పారామిలటరీ బలగానికి చీఫ్గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మెహబూబా ముఫ్తీ: జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా 2016 ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించారు. ఈమె పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు. ఠి ప్రియదర్శిని ఛటర్జీ: గువహటికి చెందిన ఈమె మిస్ ఇండియా–2016గా ఎంపికైంది. మహాశ్వేతాదేవి: ప్రముఖ బెంగాలీ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి 2016, జూలై 28న 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు 1996లో జ్ఞాన్పీఠ్, 1997లో రామన్ మెగసెసే అవార్డు, 2006లో పద్మవిభూషణ్ లభించాయి. ప్రియాంక చోప్రా: యునిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితురాలైంది. అసోం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రచారకర్తగా ప్రియాంక చోప్రాను నియమించింది. మాధురీ దీక్షిత్: తల్లిపాల విశిష్టతను తెలిపే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ (మా) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఠి పి.వి.సింధు: 2016, ఆగస్టులో బ్రెజిల్లో రియో డి జనీరో నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజత పతకం సాధించింది. దీంతో ఒలింపిక్ రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి.సింధు గుర్తింపు పొందింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య 2016, డిసెంబర్లో ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పి.వి.సింధుకు ప్రదానం చేసింది. వైజాగ్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఠి సాక్షి మాలిక్: హరియాణాకు చెందిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈమెను హరియాణా ప్రభుత్వం ‘బేటీ బచావ్, బేటీ పడావ్’ కార్యక్రమ ప్రచారకర్తగా, రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్గా నియమించింది. ఠి దీపా కర్మాకర్: త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్మాస్ట్గా చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ జిమ్నాస్టిక్స్లో రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో పద్మశ్రీ అవార్డు లభించింది. దీపా మాలిక్: పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీపా మాలిక్. 2016, సెప్టెంబర్లో రియో పారాలింపిక్స్లో షాట్పుట్లో రజత పతకం సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్మృతి మంధన మహారాష్ట్రకు చెందిన మహిళా క్రికెటర్. 2016 ఐసీసీ ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రికెటర్. -
గతవారం బిజినెస్
నియామకాలు దేశీ అతిపెద్ద వాణిజ్య సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐఓసీ) చైర్మన్గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఐఓసీలో రిఫైనరీస్ డైరెక్టర్గా ఉన్నారు. కాగా సంజీవ్ సింగ్ జూన్ 1 లేదా తదనంతరం పదవీ బాధ్యతలు చేపడతారు. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్మన్గా అజయ్ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తొమ్మిదవ చైర్మన్గా త్యాగి వ్యవహరించనున్నారు. మెగా చమురు పీఎస్యూ వచ్చేస్తోంది! అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. చమురుగ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్జీసీ.. చమురు మార్కెటింగ్ కంపెనీ హెచ్పీసీఎల్ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.44,000 కోట్లు (6.6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్పీసీఎల్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ ఓపెన్ ఆఫర్ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు.. డిజిటలైజ్! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన ఏజెంట్లకు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను అందించాలని భావిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న ఎల్ఐసీ ఏజెంట్లు సంవత్సరానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ప్రీమియం కలెక్ట్ చేస్తున్నారు. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వ్యూహంలో భాగంగా ఎల్ఐసీ తొలిగా 1.5 లక్షల మంది ఏజెంట్లకు పీవోఎస్ మెషీన్లను అందించనుంది. దీంతో ప్రీమియం వసూళ్లు డిజిటలైజ్ కానున్నవి’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. భారత్కు నోకియా ఫోన్లు ఐకానిక్ ‘నోకియా–3310’ మళ్లీ భారత్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వచ్చే త్రైమాసికంలో భారతీయులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్కు సంబంధించి నోకియాతో పదేళ్ల వరకు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్లను భారత్లో విక్రయించనుంది. ఇది నోకియా–3310 ఫోన్తోపాటు నోకియా–6, నోకియా–5, నోకియా–3 వంటి ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా ఆవిష్కరించింది. ఎన్హెచ్పీసీ షేర్ల బైబ్యాక్ జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ ఎన్హెచ్పీసీ 81 కోట్ల షేర్లను (దాదాపు 7.33 శాతం వాటా) బైబ్యాక్ చేయనున్నది. ఒక్కో షేర్ను రూ.32.25 ధరకు బైబ్యాక్ చేస్తామని ఎన్హెచ్పీసీ తెలిపింది. ఈ బైబ్యాక్ విలువ రూ.2,616 కోట్లు. గత నెల 7న జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో తీర్మానానికి అనుగుణంగా ఈ బైబ్యాక్ జరుగుతుందని ఎన్హెచ్పీసీ వెల్లడించింది. ఈ బైబ్యాక్ ఆఫర్ను ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నిర్వహిస్తుందని పేర్కొంది. లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికే లక్ష్యాన్ని దాటిపోయింది. 2016–17 బడ్జెట్ ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు కాగా, జనవరి నాటికి రూ.5.64 లక్షల కోట్లకు చేరింది. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 105.7 శాతానికి చేరినట్లయ్యింది. డొకోమోతో వివాదానికి ’టాటా’! జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. అంచనాలు మించిన వృద్ధి... జీడీపీ వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య వుండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రమోటర్ల వాటా విక్రయం! డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్ (డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. మౌలిక రంగ ఉత్పత్తి నెమ్మది... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి జనవరిలో తగ్గింది. 3.4 శాతంగా ఇది నమోదయ్యింది. ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి ఇదే తొలిసారి. 2016 డిసెంబర్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి 5.6 శాతం. జనవరి 2016లో ఈ రంగాల వృద్ధిరేటు 5.7 శాతం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య చూస్తే... వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. మోబిలియో సేల్స్ నిలిపివేసిన హోండా జపాన్ కార్ల కంపెనీ హోండా తన మోబిలియో వాహన విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్ లేకపోవడం, కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. ఈ మోడల్లో కొత్త వేరియంట్ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని పేర్కొంది. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ మధ్యంతర డివిడెండ్ రూ.3 హెచ్డీఎఫ్సీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్కు రూ.3 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి డివిడెండ్ చెల్లింపులు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే మొత్తం డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. ఈ క్యూ3లో ఈ కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.14,989 కోట్లకు, నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.2,729 కోట్లకు పెరిగాయి. ఫిబ్రవరిలోనూ తయారీ స్పీడ్: నికాయ్ నికాయ్ మార్కెట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం... తయారీ రంగం వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ మెరుగుపడింది. జనవరిలో 50.4 పాయిం ట్ల వద్ద ఉన్న సూచీ, ఫిబ్రవరిలో 50.7 పాయింట్లకు పెరిగింది. డీల్స్.. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజంట్ జపాన్కు చెందిన బ్రిలియంట్ సర్వీసెస్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఇంగ్లండ్కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.165 కోట్లు. -
ఐఓసీ లాభం రూ.3,995 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొ.(ఐఓసీ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.3,995 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ. 3,096 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది.రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఏ.కె. శర్మ చెప్పారు. ఒక్కో షేర్కు రూ.13.5 (135 శాతం) మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తమ కంపెనీలో ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉండటంతో రూ.3,821 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని తెలిపారు. 7.79 డాలర్లకు జీఆర్ఎమ్ ఒక్కో బ్యారెల్ ముడి చమరును ఇంధనంగా మార్చే విషయంలో 7.79 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) సాధించామని శర్మ వివరించారు. గత క్యూ3లో జీఆర్ఎమ్ 5.96 డాలర్లని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెంటరీ లాభాలు కూడా పెరిగాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,485 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, అయితే ఈ క్యూ3లో మాత్రం రూ.3,050 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాలు రూ.96,783 కోట్ల నుంచి రూ.1,15,161 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3 శాతం క్షీణించి రూ.366 వద్ద ముగిసింది. -
ప్రభుత్వంతో మాట్లాడతా...
నిషేధంపై ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ న్యూఢిల్లీ: కేంద్రం విధించిన నిషేధంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పందించారు. త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)లను సంప్రదించిన అనంతరం ఈ విషయమై క్రీడా శాఖతో మాట్లాడతానని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసు ఇవ్వగా అటు నుంచి స్పందన లేకపోవడంతో నిషేధం విధించింది. నిషేధంపై బింద్రా మద్దతు ఐఓఏపై నిషేధాన్ని మాజీ షూటర్ అభినవ్ బింద్రా సమర్థించారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘కఠినంగా ఉంటేనే భారత క్రీడారంగంలో మార్పు కనిపిస్తుంది. చట్టం తేవాల్సిన అవసరం ఉంది. క్రీడా శాఖ ఐఓఏను నిషేధించడం సరైన చర్య. సుపరిపాలన, నీతి నియమాల కాలం ఇది’ అని బింద్రా ట్వీట్ చేశారు. -
జిల్లా మీదుగా ఐవోసీ పైపులైన్
కామవరపుకోట : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఉత్పత్తి చేసే ఆయిల్ను పరదీప్ నుంచి హైదరాబాద్ వరకు పైపులైన్ ద్వారా సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రాజెక్ట్ కాంపినెంట్ అధారిటీ అనిల్ జెస్సీ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో రైతుల పొలాల మీదుగా 1,150 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నామన్నారు. సర్వే ఆధారంగా ఒక్కో రైతు పొలంలో 18 మీటర్ల మేర భూమి తీసుకుంటామని, ఇందుకు మార్కెట్ విలువలో పదో వంతు ధర చెల్లిస్తామన్నారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 31 మండలాల్లో 34 గ్రామాల ద్వారా పైపులైన్ వెళుతుందని చెప్పారు. కామవరపుకోట మండలంలో యడవల్లి, రామన్నపాలెం, కామవరపుకోట, మంకినపల్లి, మైసన్నగూడెం, ఆర్.నాగులపల్లి, గుంటుపల్లి గ్రామాల మీదుగా పైపులైన్ వెళుతుందన్నారు. ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందని చెప్పారు. పైపులైన్తో ప్రయోజనాలెన్నో.. పైపులైన్ ద్వారా ఆయిల్ సరఫరా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐఓసీ చీఫ్ కనస్ట్రక్షన్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ట్యాంకర్లు, వ్యాగన్ల వంటి వాటి ద్వారా సరఫరా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందన్నారు. అంతే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఆయిల్ సరఫరాకు ఆటంకం ఉందన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ఇక పెట్రోనెట్ గ్యాస్ బంకులు
ఎల్ఎన్జీ అవుట్లెట్ల ఏర్పాటుకు ఓఎంసీలతో సంప్రదింపులు ఐఓసీ, హెచ్పీ, భారత్ పెట్రోలియం బంకుల్లో డిస్పెన్సర్లు సొంత బంకుల ఏర్పాటుకూ చర్యలు ఎల్ఎన్జీ బస్సుల కోసం వాహన సంస్థలతో చర్చలు న్యూఢిల్లీ: ద్రవీకృత గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రోనెట్ ఎల్ఎన్జీ... తాజాగా రిటైల్ విభాగంలోకి ప్రవేశించనుంది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా కనీసం 1,000 రిటైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఎల్ఎన్జీ విక్రయించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) రిటైల్ బంకులను కూడా ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రతిపాదనల ప్రకారం ఓఎంసీల రిటైల్ బంకుల్లో పెట్రోనెట్ తమ ఎల్ఎన్జీ డిస్పెన్సర్స్ను ఏర్పాటు చేయనుంది. సొంతంగా కొన్ని అవుట్లెట్స్ను నిర్వహించనుంది. చమురు శాఖ అనుమతులు వస్తే అవుట్లెట్స్ ద్వారా ఎల్ఎన్జీని విక్రయిం చేందుకు పెట్రోనెట్కు మార్గం సుగమం కానుంది. వాహనాల్లో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్న దరిమిలా పెట్రోనెట్ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే కేరళలో ఎల్ఎన్జీపై నడిచే బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా, అశోక్ లేల్యాండ్తో చర్చలు.. : ఓఎంసీల బంకుల్లో ద్రవీకృత గ్యాస్ విక్రరుుంచాలని యోచిస్తున్న పెట్రోనెట్.. అటు ఎల్ఎన్జీతో నడిచే బస్సులను ప్రవేశపెట్టడంపై టాటా మోటార్స్, అశోక్ లేల్యాండ్ వంటి ఆటోమొబైల్ సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. దేశీయంగా ఏటా రోడ్లపైకి వచ్చే కనీసం 2,00,000 పైచిలుకు వాహనాలను ఎల్ఎన్జీతోనే నడిపే వీలుందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ సీఈవో ప్రభాత్ సింగ్ చెప్పారు. ఇతరత్రా ఇంధనాలతో పోలిస్తే దీనివల్ల ధరలపరంగా 30-40 శాతం మేర ప్రయోజనం ఉండగలదన్నారు. పారిస్ ఒడంబడిక ప్రకారం 2030 నాటికల్లా కార్బన్ ఉద్గారాలను 33-35% మేర తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించింది. ఇంత పెద్ద ఎత్తున వాహనాలను ఎల్ఎన్జీ వైపు మళ్లిస్తే నిర్దేశిత లక్ష్యంలో కనీసం 2.5 శాతం సాధించవచ్చని ప్రభాత్ సింగ్ తెలిపారు. ప్రాథమికంగా రిటైల్ అవుట్లెట్స్లో విక్రయాల ద్వారా సుమారు 1,50,000 పైచిలుకు ఎల్ఎన్జీ ట్రక్కులకు ఇంధనం సరఫరా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఇంధన పరిమాణం 0.5-1.5 మిలియన్ టన్నుల మేర ఉంటుందని వివరించారు. నాలుగేళ్లలో గ్యాస్ వాటా 15%! కాలుష్యకారక వాయువులను నియంత్రించేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా ఇంధన వినియోగంలో సుమారు 6.5 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను మూడు, నాలుగేళ్లలో 15 శాతానికి పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఏటా భారత్ 78 మిలియన్ టన్నుల మేర డీజిల్ను వినియోగిస్తుండగా, ఇందులో ట్రక్కులు.. బస్సుల వాటా 28 మిలియన్ టన్నుల మేర ఉంటుందని పెట్రోనెట్ అంచనా. ప్రస్తుతం ఏటా 21.3 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్న భారత్ 2022 నాటికి 50 ఎంటీపీఏకి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే తూర్పు తీరంలో మూడు ఎల్ఎన్జీ టెర్మినల్స్ను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడతో పాటు తమిళనాడులోని ఎన్నూర్, ఒరిస్సాలోని ధమ్రా పోర్టుల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. -
యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది. ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. -
మరో నలుగురు ఒలింపియన్లపై వేటు
లాసన్నె (స్విట్జర్లాండ్): బీజింగ్ 2008, లండన్ 2012 ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొన్న నలుగురు రష్యా అథ్లెట్లను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అనర్హులుగా ప్రకటించింది. రష్యా అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారని, నిషేధిత ఉత్ప్రేరకం డిహైడ్రోక్లోర్మిథైల్టెస్టోస్టెరాన్ వాడినట్టు రుజువుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అనర్హులైనవారిలో బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్నవారు ముగ్గురు, లండన్ గేమ్స్లో పాల్గొన్న ఓ అథ్లెట్ ఉన్నారు. కాగా వీరి నలుగురిలో ఒక్కరికి మాత్రమే ఒలింపిక్ పతకం వచ్చింది. బీజింగ్లో జావెలిన్ త్రోలో రజతం సాధించిన మరియా అబకుమోవా, 10 వేల మీటర్ల రేసులో ఆరో స్థానంలో ఉన్న ఇంగా అబిటోవా, 400 మీటర్ల ఈవెంట్లో 23వ స్థానంలో నిలిచిన డెనిస్ అలెక్సీవ్.. లండన్లో సైక్లింగ్ ఈవెంట్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఎకటరీనా గ్నిడెంకోపై ఐఓసీ వేటువేసింది. బీజింగ్, లండన్ గేమ్స్ సమయంలో వీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించారు. డోపింగ్ కేసులో పట్టుబడ్డ కొందరు ఒలింపియన్లను ఇటీవల అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐఓసీ లాభం 25% అప్
క్యూ1లో రూ. 8,269 కోట్లు 1:1 బోనస్ షేర్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ చరిత్రలో అత్యధిక తొలి త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ నికర లాభం 25 శాతం ఎగసి రూ.8,269 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,591 కోట్లుగా ఉంది. పటిష్టమైన పెట్రోకెమికల్ మార్జిన్లతో పాటు ఇన్వెంటరీ(నిల్వలు) సంబంధిత లాభాలు దీనికి దోహదం చేశాయి. గతేడాది క్యూ1లో రూ.1,14,200 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,07,671 కోట్లకు చేరింది. అయితే, స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు తగ్గింది. కాగా, ఐఓసీ డెరైక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు ప్రతిగా మరో షేరును(1:1 ప్రాతిపదికన) బోనస్గా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఫలితాల నేపథ్యంలో సోమవారం సల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.572 వద్ద ముగిసింది. -
బ్లాక్ టిక్కెట్ కేసులో ఐఓసీ సభ్యుని అరెస్ట్
రియో డి జనీరో: ఒలింపిక్స్ టిక్కెట్లను అక్రమ పద్దతిలో అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఉన్నతాధికారి ప్యాట్రిక్ హికేను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూరోపియన్ ఒలింపిక్ కమిటీ చీఫ్ కూడా అయిన 71 ఏళ్ల హికేను ఇక్కడి ఓ లగ్జరీ హోటల్లో అరెస్ట్ చేయగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒలింపిక్స్లో జరిగే ముఖ్య పోటీల పోటీల టిక్కెట్లను అక్రమ పద్దతిలో అమ్ముతున్న కేసులో మరో ఆరుగురు కూడా దోషులుగా ఉన్నారు. 2012 నుంచి హికే ఐఓసీ ఎగ్జిక్యూటివ్లో సభ్యులుగా ఉంటున్నారు. తమ పరిశోధనలో హికేకు అంతర్జాతీయ బ్లాక్ టిక్కెట్ అమ్మకాల్లో పాత్ర ఉన్నట్టు తేలిందని రియో పోలీస్ ఫ్రాడ్ యూనిట్ పేర్కొంది. ఒలింపిక్ నిర్వాహకులు నిర్ణయించిన ధరకన్నా అధిక మొత్తానికి ఈ గ్యాంగ్ టిక్కెట్లను అమ్ముకుంటోందని పోలీసులు ఆరోపించారు. రష్యా 4x100మీ. స్వర్ణం వెనక్కి.. డోపింగ్ భూతం రష్యాను ఇంకా వీడడం లేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మహిళల 4ఁ100మీ. రిలేలో సాధించిన స్వర్ణాన్ని తాజాగా వెనక్కి తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పేర్కొంది. జట్టు సభ్యురాలు యూలియా చెర్మోషాన్స్కయా డోపింగ్ రీటెస్టులో విఫలం కావడమే దీనికి కారణం. అప్పట్లో ఇచ్చిన శాంపిల్స్ను తిరిగి అధునాతన పద్దతిలో పరీక్షించాక తను రెండు నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకున్నట్టు తేలింది. దీంతో రెండో స్థానంలో వచ్చిన బెల్జియం జట్టుకు స్వర్ణం దక్కుతుంది. -
కామన్వెల్త్ గేమ్స్ అనుభూతి గుర్తొచ్చింది
సచిన్ టెండూల్కర్ న్యూఢిల్లీ: రియోలోని ఒలింపిక్స్ విలేజ్లో అడుగుపెట్టిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఎలాంటి ఉద్వేగానికి గురయ్యానో రియోలోనూ అలాగే ఫీలవుతున్నట్టు చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సచిన్ విలేజ్లో ఆటగాళ్లను కలుసుకున్నారు. ‘గేమ్స్ విలేజ్లో ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో నేను మరోసారి అనుభవించాను. 1998 కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రికెటర్గా పాల్గొన్నాను. అయితే ఆ గేమ్స్కు దీనికి చాలా వ్యత్యాసమున్నా క్రీడా స్ఫూర్తి, ఉత్సాహం మాత్రం ఒక్కటే. ఇక ఒలింపిక్ క్రీడల్లో నేనేమీ నిపుణుడిని కాను. అందుకే పోటీల్లో ఎలా గెలవాలో వారికి సలహాలివ్వలేను. ఎలా పోరాడాలో ఆటగాళ్లకు తెలుసు. నాకు టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టం’ అని సచిన్ అన్నారు. -
ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) నామినేటెడ్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా భారత్ నుంచి ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఈ మేరకు గురువారం జరిగిన ఎన్నికల్లో నీతా ఎన్నికయ్యారు. విద్య, క్రీడల్లో ఆమె చేస్తున్న కృషికి గాను నీతా పేరును ఒలింపిక్స్ కమిటీ సభ్యత్వానికి ప్రతిపాదించారు. దీంతో 70 ఏళ్ల వయసు వరకు నీతా ఐఓసీ నామినేటేడ్ మెంబర్ గా కొనసాగనున్నారు. గత జూన్లో ఆమె పేరును ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యత్వానికి భారత్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా భారత్ నుంచి ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం మూడో వ్యక్తిగా నీతా నిలిచారు. అంతకుముందు సర్ దొరాబ్జి టాటా, రాజా రాంధీర్ లు ఒలింపిక్స్ కమిటీలో సభ్యత్వం పొందిన వారిలో ఉన్నారు. -
ఐఓసీ కి ఎన్నికైన మొదటి మహిళగా 'నీతా' రికార్డ్..!
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య.. నీతా అంబానీ ఎన్నికయ్యారు. ఐఓసీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా నీతా రికార్డు సృష్టించారు. నీతా అంబానీని ఐఓసీ సభ్యురాలిగా ఎగ్జిక్యూటివ్ బోర్డు జూన్ నెలలో నామినేట్ చేయగా... గురువారం జరిగిన వరల్డ్ బాడీ 129వ సమావేశంలో ఆమె ఐఓసీ మొదటి మహిళా సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఒలింపిక్ అజెండా 2020 సిఫార్స్ ల ఆధారంగా జరిగిన ఐఓసీ సభ్యుల నియామకంలో నీతా ను ఎంపికచేశారు. ఐఓసీ సభ్యురాలిగా ఎంపికవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇదెంతో గర్వకారణమని నీతా అన్నారు. ఈ సందర్భంలో ప్రపంచంలో భారత్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, భారత మహిళలకు ఇచ్చే గుర్తింపు తెలుస్తోందన్నారు. ఒలింపిక్స్ ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.