lata mangeshkar
-
నా బిడ్డవు కదూ..!
రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!‘నెట్ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్లోకి వచ్చిన ‘ఎవర్గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక. వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు. ‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే! -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న రాజ్సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!) -
అమితాబ్.. రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్స్తంభ్ ఫౌండేషన్ మనోబల్కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
ఏడేళ్ల వయసులోనే పాటతో దోస్తీ.. లెజెండరీ సింగర్ జర్నీ..
లతా మంగేశ్కర్ రాకతో గానానికి జ్ఞానం వచ్చింది! ఆ జ్ఞానం సినిమా గానాన్నే కాదు మొత్తం సంగీత క్షేత్రాన్నే సుసంపన్నం చేసింది; ఆ జ్ఞానం గాన, సంగీత అభిమానుల్ని పరవశింపజేసింది. శాస్త్రీయ సంగీత గానం, సినిమా గానం, లలిత గానం అనే వర్గీకరణలకు అతీతంగా లతా మంగేశ్కర్ ఒక మహోన్నతమైన గాయని. సంగీత క్షేత్రంలో లత గానం, గాత్రం మహోన్నతంగా వెల్లివిరిశాయి. Rounded even, clear resonant voice లతా మంగేశ్కర్ది. లత Timbre ఆమె వచ్చిన సమయానికి మన దేశంలో న భూతో; సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టారు. తరువాత ఆ Timbre న భవిష్యతి కూడా అయింది. విశిష్టమైన గాత్రం లత గాత్రం. Verve ఉంటుంది లత గాత్రంలో. లత గాత్రం సహస్రాబ్ధి గాత్రం (Voice Of Millennium). ఖేంచంద్ ప్రకాష్ సంగీతంలో మహల్ సినిమాలో "ఆయేగా ఆయేగా..." పాటతో ఊపందుకున్న లత గానం ఆ పాట వచ్చిన సంవత్సరం (1949)లోనే శంకర్-జైకిషన్ సంగీతంలో బర్సాత్ సినిమాలో "జియా బేకరార్ హై...", "బర్సాత్ మే హంసే మిలే...", "హవామే ఉడ్తా జాయే..." పాటలతో మొత్తం దేశాన్నే ఊపేసింది. నాణ్యత, రంజన రెండూ లత గానంలో రాజిల్లాయి. లత స్థాయి నాణ్యమైన, ఆమెలా రాణించిన మఱొక గాయని మనదేశంలో లేరు. Lata has unerring sense of pitch and rhythm. "లతా సుర్ కా అవ్తార్" అని అన్నారు బడే గులామ్ అలీఖాన్. సినిమా పాటలంటే చిన్నచూపు ఉన్న శాస్త్రీయ సంగీత విద్వాన్ బడే గులామ్ అలీఖాన్. ఆయన లతా మంగేశ్కర్ గాత్రానికి, గానానికి ముగ్ధులయ్యారు. "శ్రుతి అవతారం లత" అని అంటూ అలా, అంతలా ప్రస్తుతించారు. ఠుమ్రీ గాన విధానానికి బడే గులామ్ అలీ ఖాన్ మార్గ దర్శకుడు. ఆయన స్ఫూర్తితో బాజూబంద్ (1954) హిందీ సినిమాలో లత గొప్పగా ఒక ఠుమ్రీ పాడారు. మన దేశ చలన చిత్ర గానంలో bel canto పురుషుల పరంగా మొహమ్మద్ రఫీ, మహిళల పరంగా లత తోనే మొదలయింది! స్వర సమం (తాళ సమం కాదు), mood, balance, diction, modulation, expression వీటిపై లతా మంగేశ్కర్కు గొప్ప అవగాహన ఉంది. "Lata sings others make miserable effort" అని అన్నారు మన దేశంలోనే ప్రశస్తమైన చలన చిత్ర సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సైన్. హల్చల్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఆజ్ మేరే నసీబ్..." పాటలో లత గానం metronomical balanceతో ఉంటుంది. మదన్ మోహన్ సంగీతం చేసిన అన్పధ్ సినిమాలోని "ఆప్ కీ నజ్ రోనే సంఝా..." గానం balance అన్నదానికి సరైన అభివ్యక్తి. రుస్తమ్ సొహరాబ్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఏ దిల్ రుబా..." పాట ఒక్క లత మాత్రమే అంత గొప్పగా పాడగలరు. శంకర్-జైకిషన్ సంగీతంలో "జా జారే జా బాలమ్..." (సినిమా: బసంత్ బహార్), "ఓ బసంతీ పవన్..." (సినిమా: జిస్ దేశ్ మే గంగా బహ్ తీ హై), "రసిక్ బల్ మా..."( సినిమా: చోరీ చోరీ), "ఏ షామ్కీ తన్ హాయియా..."(సినిమా: ఆహ్) వంటి ఎన్నో అద్భుతాల్ని పాడారు లత. నౌషాద్ సంగీతంలో బైజుబావ్రా సినిమాలో పాడిన "మొహెభూల్ గయె సావరియా" పాట మరెవరు పాడినా అంత గొప్ప పాట కాకుండా పోయేది. భారతదేశ చలన చిత్రాలలోనే అత్యుత్తమమైన జోల పాట సి. రామచంద్ర సంగీతం చేసిన అల్బేలా సినిమాలో లత పాడిన "ధీరేసే ఆజా..." పాట. అటు తరువాత ధోభీగా జమీన్ సినిమాలో సలిల్ చౌధురీ సంగీతం చేసిన "ఆజారీ ఆ నిందియా...", సన్సార్ సినిమాలో రోషన్ సంగీతం చేసిన "హన్సే టిమ్ టిమ్...", పూనమ్ సినిమాలో శంకర్- జైకిషన్ సంగీతం చేసిన "ఆయీ ఆయీ రాత్ సుహానీ...", కట్పుత్లీ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీతం చేసిన "సోజా రే సోజా మేరీ..." వంటి దేశంలో వచ్చిన గొప్ప జోల పాటలు లత పాడడంవల్ల మరింత గొప్ప జోల పాటలయ్యాయి. సలిల్ చౌధురీ సంగీతంలో లత పాడిన "ఓ సజ్ నా..." , టాంగా వాలీ సినిమాలో "మే లుట్ గయీ దునియా వాలో..." అంటూ పాడిన పాట, అన్నదాత సినిమాలో " రాతో మే క్యా క్యా.." పాట విశేషమైనవి. ఎస్.డి. బర్మన్ సంగీతంలో "మేఘా ఛాయా ఆధీ రాత్..." (సినిమా: షర్మిలీ) వంటి పలు ఉదాత్తమైన పాటలు పాడారు లత. "సునో సజ్నా..." (సినిమా: ఆయే దిన్ బహార్ కే) అంటూనూ, "జీవన్ డోర్ తుమ్ హీ..." (సినిమా: సతీ సావిత్రీ) అంటూనూ, "సత్యమ్ శివమ్ సుందరమ్..." (సినిమా: సత్యమ్ శివమ్ సందరమ్) అంటూనూ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతంలో గొప్ప పాటలు పాడారు లత. ఆర్.డి.బర్మన్ సంగీతంలో లత పాడిన "రేనా బీతి జాయే షామ్ న ఆయే..." పాట గాన కళకు ఉచ్చ స్థితి. గాన కళను మెఱుగు పఱుచుకుంటే పోతే ఒక దశలో రేనా బీతి జాయే పాటలాగా వస్తుంది. ఆర్.డి.బర్మన్ సంగీతంలో "క్యా జానూ సజన్..." ( సినిమా: బహారోంకే సప్నే), "సీలీ హవా ఛూ గయే..."( సినిమా: లిబాస్), "నా కోయీ ఉమంగ్ హై..." (సినిమా: కటీ పతంగ్), "తేరే లియే పల్కోంకీ ఝాలర్..." (సినిమా: హర్జాయీ) వంటి ప్రతేకమైన పాటలు పాడారు లత. "తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్..." అంటూ సి. రామచంద్ర సంగీతంలో (సినిమా: శిన్ శినాకీ బూబ్లబూ) లత చేసిన గానం మరో గాయని అందుకోలేని ఔన్నత్యం. భావ యుక్తంగా బాగా పాడడం అన్నదానికి మించి Mood (మనోధర్మం), spirit, అతీతమైన మేలిమి(super fineness), profoundity, శ్రుతి శుభగత్వం వీటితో ఈ పాటలో లత గానం అత్యుదాత్తంగా ఉంటుంది. ఇలా అత్యుదాత్తంగా రోషన్ సంగీతంలో "ఇస్ దిల్ కీ హాలత్ క్యా కహి యే..." (సినిమా: అన్హోనీ), పండిత్ రవి శంకర్ సంగీతంలో "హాయ్ రే వొ దిన్..." (సినిమా: అనూరాధా), నౌషాద్ సంగీతంలో "మొహే పన్ఘట్..."(సినిమా: ముఘల్-ఎ-ఆజమ్), "తోడ్ దియా దిల్ మేరా..." (సినిమా: అందాజ్) హేమంత్ కుమార్ సంగీతంలో "కుచ్ దిల్ నే కహా..." (సినిమా: అనుపమ), హృదయానాథ్ మంగేశ్కర్ సంగీతంలో "యారా సీలీ సీలీ..." (సినిమా: లేకిన్), ఖయ్యామ్ సంగీతంలో "బహారో మేరా జీవన్ భీ సవారో..." (సినిమా: ఆఖ్రీకత్), ఎస్. డి. బర్మన్ సంగీతంలో "థండీ హవాయే..." (సినిమా: నౌజవాన్) చిత్రగుప్త సంగీతంలో "దిల్ కా దియా జలా కే గయా..." (సినిమా: ఆకాశ్ దీప్) మదన్ మోహన్ సంగీతంలో "లగ్ జాగలే కే ఫిర్ హసీ రాత్..."(సినిమా: వో కౌన్ థీ), "న తుమ్ బేవఫా హో న హమ్ బేవఫా హై..."(సినిమా: ఏక్ కలీ ముస్కాఈ) సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో "వొ రాత్ దిన్ వొ చాందినీ..." (సినిమా: సైయా), "కిస్మత్ మే ఖుషీ కా నామ్ నహీ..." (సినిమా: సైయా), వంటి పాటలూ, ఇంకా పలు పాటలూ పాడారు లత. తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో "నిద్దుర పోరా తమ్ముడా అంటూ గొప్పగా పాడారు లత. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకర శాస్త్రి సంగీతంలో బహుత్ దిన్ హుఎ సినిమాలో "చందా చమ్కే నీల్ గగన్ మే..." అంటూ గొప్పగా పాడారు లత. ఆఖరి పోరాటం సినిమాలో ఇళయరాజా సంగీతంలో "తెల్లచీరకు తకధిమి తపనలు..." అంటూ చక్కగా పాడారు ఆమె. ఎ.ఆర్. రహ్మాన్తో సహా పలువురు సంగీత దర్శకులకు పలు భాషల్లో పలు ఉన్నతమైన పాటలు పాడారు లత. 1929 సెప్టెంబర్ 28న పుట్టిన లత తన 7వయేట తండ్రి మరాఠీ నాటకం సుభద్రాలో నారదుడి వేషంలో పాడుతూ నటించారు. ఆ తరువాత 13యేళ్ల వయసులో మరాఠీ సినిమా పహిలీ మంగల్ గౌర్ (1945) సినిమాలో నటిస్తూ తనకు "నటాలీ చైత్రాచి నవలాయీ" అన్న మరాఠీ పాట పాడుకున్నారు. లత తన మొదటి హిందీ పాట "హిందూస్థానీ లోగో..." అంటూ గజభావూ(1945) అన్న మరాఠీ సినిమాలో నటిస్తూ పాడుకున్నారు. 1945లో వచ్చిన బడీమా హిందీ సినిమాలో నటించి తనకు తాను "తుమ్ హో బడీ మా..." అంటూ ఒక పాట పాడుకున్నారు. ఈ బడీమా సినిమాలో "నట్ కట్ హటీ లే గోపాల్..." అంటూ లత తొలిసారి నేపథ్య గానం చేశారు. ఆ తరువాత 1946లో వచ్చిన ఆప్ కీ సేవా మే హిందీ సినిమాలో "ఏక్ నయే రంగ్ మే...", "పా లాగూ కర్ జోరి రే..." పాటలు పాడారు. ఈ ఆప్ కీ సేవా మే పాటలు బొంబాయిలో రికార్డ్ అయిన లత తొలి పాటలు. ఇవి ఆమె నేపథ్య గానం చేసిన తొలి పాటలు కావు. పూణేలో రికార్డ్ అయిన బడీమా సినిమాలోని "నట్ కట్ హటీ లే గోపాల్..." పాట నేపథ్య గాయనిగా లత పాడిన తొలి పాట. 2019లో "సౌగంధ్ ముఝే ఇస్ మిట్టి కీ..." అంటూ మన దేశ సైన్యానికి నివాళిగా తన చివరి పాట పాడారు లత. సినిమా పాటలు, భజన్లు, గజళ్లు, లలిత గీతాలు, అభంగ్లు, బెంగాలీ సంగీతం, జానపద సంగీతం ఇలా పలు ధోరణుల్లో లత గానం ప్రవహించింది. అన్ని భాషల్నీ కలుపుకుని 6,550 పైచిలుకు సినిమా పాటలూ, ఇంచు మించు 1,000 ఇతర పాటలూ లత పాడారని తెలుస్తోంది. ఎంత ఎక్కువగా ఊహించుకున్నా ఈ సంఖ్య 8,000 పైచిలుకు దాటకపోవచ్చు. లత 40,000 లేదా 30,000 పాటలు పాడారని చెప్పబడుతూండడం సరి కాదు. పాడడం అన్న కళ లతా మంగేశ్కర్వల్ల పరిపుష్టమైంది, పరిఢవిల్లింది, పరిపూజనమైంది. Rendition-intensity లేదా ప్రగాఢమైన గానం లత వైశేష్యం. Profound singingతో, rounded even singingతో లత ఒక గాన శకం అయ్యారు. లతా మంగేశ్కర్ 'ఒక ప్రకృతి అద్భుతం' అన్న మాట ఉంది. సంగీత ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన వర వరం లత. 'Lata, a boon and boost to the world of music". ఎనెన్నో పురస్కారాలు, బిరుదులు ఆమెను దక్కించుకున్నాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత్ రత్న ఆమెవయ్యాయి. రత్నానికి అరగడం ఉండదు; రత్నం ఎప్పటికీ వాడిపోదు. లత గానం శ్రేష్ఠమైన రత్నం. అది ఎల్లప్పుడూ మనలో మెఱుస్తూనే ఉంటంది; మనకై మెఱుస్తూనే ఉంటుంది. 6/2/2022 న లత తుది శ్వాస విడిచారు. లతా మంగేశ్కర్కు వర్ధంతులు వస్తూ ఉంటాయి. కానీ ఆమె గానానికి వర్ధంతులు ఉండవు! ఎందుకంటే ఆ గానం మరణించలేదు కాబట్టి; ఆ గానానికి మరణం రాదు కాబట్టి. ఇవాళ మనతో లత శరీరం లేదు. కానీ ఆమె శారీరం ఈ మట్టిలో, ఈ మట్టి ప్రజలో, సంగీత ప్రపంచంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే గాన తటిల్లత లత. - రోచిష్మాన్, 9444012279 -
లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్ను మిస్ కావడం విచారకరమని అన్నారు. As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi. Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX — Narendra Modi (@narendramodi) January 17, 2024 లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి! -
లతా మంగేష్కర్కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
నేను పాడుతుంటే మధ్యలోనే ఆపించేసింది లతా మంగేష్కర్ గారు
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
ఆమె వల్లే వాణీ జయరాం మద్రాస్కు వచ్చేశారు..!
వాణీ జయరాం గొంతు దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది. దేశంలోని పలు భాషల్లో ఆమె తన గాత్రాన్ని వినిపించింది. ఇటీవలే ఆమె కృషికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్న వాణీ జయరాం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది. 1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. అప్పట్లో బాలీవుడ్లో లతా మంగేష్కర్, తెలుగులో సుశీల, జానకి లాంటి గాయకురాలు జోరు కొనసాగుతోంది. అదే సమయంలో తన ప్రత్యేకమైన కంఠస్వరంతో గుర్తింపు సాధించింది వాణీ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు పదేళ్లపాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు. వాణీ జయరాం కెరీర్ హిందీలోనే ప్రారంభమైంది. అందువల్లే ఆమె హీందీ పాటలంటే మొదటి నుంచి ఇష్టం. ఆమె పాటలకు మంచి ఆదరణ రావడంతో తనకు ఎక్కడా పోటీగా వస్తుందేమోనని లతా మంగేష్కర్ చాలా భయపడ్డారు. తొలి చిత్రం గుడ్డితో పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో లతా ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లింది వాణీ జయరాం. కానీ ఆమెను కలిసేందుకు లతా నిరాకరించారు. లతా మంగేష్కర్తో వైరం ఆ తర్వాత 1979లో విడుదలైన మీరా సినిమాతో వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మీరా సినిమాకు రవిశంకర్ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్కు నచ్చలేదు. తన సోదరుడిని సంగీత దర్శకునిగా తీసుకోకపోతే తాను పాటలు పాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వాణీ జయరాంతో పాటలన్నీ పాడించారు గుల్జార్. అలా వాణీపై లతా మధ్య వైరం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో రాజకీయాలు చూడలేక మద్రాస్కు తిరిగి వచ్చేశారు వాణీ. తెలుగులో 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటివలె కాదురా' అనే పాటతో నన్ను ఎస్పీ కోదండపాణి పరిచయం చేశారు. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా.. అవన్నీ సూపర్ హిట్ సాంగ్సే. -
సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు
సుమన్ కల్యాణ్పూర్, లత ఒక విధంగా ఒకే మెట్టు మీద ఉండాలి. లత అభిమానులు కూడా సుమన్ కల్యాణ్పూర్ గొంతు లతాతో సమానం అంటారు. కాని సుమన్కు చాలా కొద్ది పాటలు లభించాయి. ఆమెను కొందరు ఎదగనివ్వలేదని అంటారు. బిడియం, హుందాతనం ఉన్న సుమన్ కల్యాణ్పూర్ అవకాశాల కోసం కలబడకుండా తప్పుకుని నిలబడింది. కాని ఆమె పాటలు నిలబడే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆమె ఉండే అపార్ట్మెంట్ భవంతిలో అగ్నిప్రమాదం. అదే రోజు పద్మభూషణ్ ప్రకటన.జనవరి 28 ఆమె 87వ పుట్టినరోజు. ఇన్ని సందర్భాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లకైనా తమ అభిమాన గాయనికి గౌరవం దక్కినందుకు అభిమానులు యూ ట్యూబ్లో ఆమె పాటల ప్లే బటన్ నొక్కుతున్నారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే న తుమ్ హమే జానో – న హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్గయా... 1962. ‘బాత్ ఏక్ రాత్ కీ’ సినిమాలో దేవ్ ఆనంద్– వహీదా రెహమాన్ మీద చిత్రించిన ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత రేడియోలో శ్రోతలు తెగ ఫర్మాయిష్ చేయసాగారు... ఈ పాట ప్లే చేయమని. గాయకుడు హేమంత్ కుమార్ అందరికీ తెలుసు. గాయని లతా మంగేష్కర్... అని అందరూ అనుకున్నారు. కాదు. ఆ గొంతు సుమన్ కల్యాణ్పూర్ది. చెప్తే తప్ప తెలియదు. అదే మాధుర్యం. అదే తీపి. అదే పూలరెక్క సౌకుమార్యం. అదే అగరుపొగ ధూపం. అవునా... అని అందరూ నోరు తెరిచారు. లతాలా పాడుతున్న గాయని, లతా అంత బాగా పాడుతున్న గాయని సుమన్ కల్యాణ్పూర్ తెర మీదకు వచ్చిన సందర్భం అది. దానికి కారణం లతానే. అవును. ‘బాత్ ఏక్ రాత్కీ’కి సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు లతాకీ, బర్మన్కూ మాటలు లేవు. లతా లేకపోతే సినీ సంగీతమే లేదు అనుకుంటున్న రోజులు అవి. కాని బర్మన్కు పట్టుదల జాస్తి. సుమన్ను వెతికాడు. పాట చేశాడు. హిట్ కొట్టాడు. కాని లతా ఉండగా ఇతర గాయనులకు సంగీతమే ఉండదు అని మెల్లగా ఆ తర్వాత అర్థమైంది. సుమన్ పాట మీద ఎంత ప్రేమ ఉన్నా అది వినిపించక పోతే ఏమిటి చేయడం? నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే (జబ్ జబ్ ఫూల్ ఖిలే) సుమన్ కల్యాణ్పూర్ది బెంగాల్. వాళ్ల కుటుంబం ఆమె తండ్రి కాలంలో ఢాకా మీదుగా ముంబైకి చేరుకుంది. తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఐదుమంది అమ్మాయిల్లో సుమన్ పెద్దది. ఆ రోజుల్లో అమ్మాయిలను ఆ నాటి తల్లిదండ్రులు ఎలా పెంచారో అలానే సుమన్ను పెంచారు. దానికి సుమన్ స్వభావసిద్ధ సిగ్గు, బిడియం తోడైంది. అది ప్రవర్తనలోనే. కాని గొంతు విప్పితే పక్షి రెక్క విప్పినట్టు ఆమె పాట హాయిగా తరంగాలు సృష్టించేది. ఠెహరియే హోష్మే ఆలూ తొ చలే జాయియేగా... ఆప్కో దిల్ మే బిఠావూ తో చలే జాయియేగా... (మొహబ్బత్ ఇస్కో కెహెతే హై) ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీ వేదిక మీద ఒక పాట పాడితే ఆ వేడుకకు గెస్ట్గా హాజరైన తలత్ మెహమూద్ ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు సుమన్ వయసు 16. అయినా సరే సుమన్ను హెచ్.ఎం.వి.కి రికమండ్ చేశాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు షఫీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. 1954లో వచ్చిన ‘దర్వాజా’ సుమన్ మొదటి సినిమా. కాని 1962లో ‘న తుమ్ హమే జానో’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది స్టార్ అయ్యింది. కాని అప్పటికే లతా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆశా భోంస్లే కూడా కూడదీసుకుంది. వీరిద్దరి కారణాన గీతా దత్, షంషాద్ బేగం... వంటి గాయనులే అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. సుమన్ గొంతు లతా గొంతులా ఉండటంతో లతా దృష్టి ఈమె మీద ఎక్కువగా పడిందని అంటారు. సుమన్తో పాడిస్తే ఆ సంగీత దర్శకులకు లతా పాడటం కష్టం అయ్యేది. ఆ భయంతో సుమన్కు అవకాశాలు రాలేదు. కాని లతా మంగేష్కర్, రఫీలు రాయల్టీ విషయంలో భేదాభిప్రాయాలతో ఒకరికి మరొకరు పాడటం మానుకున్నారు. పాట ఒకసారి పాడి డబ్బు తీసుకున్నాక ఇక రాయల్టీ అవసరం లేదని రఫీ అభిప్రాయం. ఒక పాట తాలూకు రికార్డులు అమ్ముడయినంత కాలం గాయనీ గాయకులకు రాయల్టీ ఇవ్వాల్సిందేనని లతా అభిప్రాయం. ఈ తగాదా సుమన్కు కొద్దిగా లాభించింది. లతా పాడకపోవడం వల్ల రఫీ, సుమన్ కలిసి చాలా డ్యూయెట్లు పాడారు. షమ్మీ కపూర్ కోసం చేసిన ఈ పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ సబ్కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి (బ్రహ్మచారి) తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే దిల్ హతేలీ మే లే ఆయేరే (రాజ్ కుమార్) అదొక్కటే కాదు... సుమన్కు చొరవ లేకపోవడం వల్ల తన సామర్థ్యానికి తగ్గ డిమాండ్ చేయలేకపోవడం వల్ల ఆమె ‘పేదవాడి లత’గా మారింది. అంటే లతా మంగేష్కర్కు ఇచ్చేంత డబ్బు లేనివారు సుమన్ చేత పాడించేవారు. దాంతో చిన్న సినిమాలకు సుమన్ పాడాల్సి వచ్చేది. వాటిలో పాటలు ఎంత బాగా ఉన్నా ప్రచారం పొందేవి కావు. సుమన్కు 1958లో పెళ్లి అయ్యింది. ఆమె నేరుగా సంగీత దర్శకులతో, నిర్మాతలతో మాట్లాడేది కాదు. భర్త అవన్నీ చూసేవాడు. దాని వల్ల కూడా ఆమెకు సంగీత ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియలేదు. కొన్నిసార్లు ఆమె బాగా పాడిన పాటలు సినిమాల్లో తొలగించబడేవి. లేదా అవే పాటలు మరొకరి గొంతులో వినిపించేవి. చాలా సున్నిత స్వభావం ఉన్న సుమన్ ఇదంతా నాకు అవసరమా అనుకుంది. కాని అభిమానులు మాత్రం ఆమె గొంతు అవసరమే అనుకున్నారు. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్సూరత్ న హోతా... (నూర్ జహాన్) సుమన్కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు డాక్టరు. అందరూ ముంబై లోఖండ్ వాలాలోని ఒకే అపార్ట్మెంట్లో వేరు వేరు ఫ్లాట్లలో ఉంటారు. మొన్న బుధవారం ఆ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ అయితే అందరినీ తీసుకుని ఆమె రోడ్డు మీద గడపాల్సి వచ్చింది. కాని అదే రోజు ఆమెకు పద్మభూషణ్ ప్రకటన అందింది. జనవరి 28 ఆమె పుట్టినరోజు. ఇది ఒక అందమైన పుట్టినరోజు కానుక. సుమన్ ఎంతో ప్రతిభావంతురాలు. ఎన్ని వందల పాటలో పాడి ఉండాలి. కాని ఆమె గొంతు మీద నీడ కదలాడుతూనే ఉండిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా వెలుతురు. కాని తీరం చేరిపోయాక పడవకు దొరికిన ఓదార్పు. ‘మమత’ (1966)లో ఈ పాటను లతా పాడింది. చాలా ఫేమస్. కాని ఇదే పాటను రఫీతో (లతా పాడదు కనుక) సుమన్ కల్యాణ్పూర్ డ్యూయెట్గా పాడింది. లతా ఎంత మార్దవంగా పాడిందో సుమన్ కూడా. వినండి. ఈ పాట ఆ సిగ్గరి గొంతుకు బంగారు తొడుగు. రహేనా రహే హమ్ మెహ్కా కరేంగే బన్కే కలి బన్ కే సబా బాగ్ ఏ వఫా మే.... చదవండి: శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు -
లతా మంగేష్కర్ నా సినిమా జీవితానికి ఆమె వీసా ఇచ్చింది
‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు. శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను. లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు. ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్కు ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు. లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది. -
అయోధ్యలో లతామంగేష్కర్ పేరు మీద చౌక్...7.9 కోట్లతో భారీ వీణ ఏర్పాటు..
అయోధ్య: లెజండరీ సింగర్ దివగంత లతామంగేష్కర్ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె పేరు మీద అయోధ్యలో ఒక కూడలిని ఏర్పాటు చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈమేరకు సరయు నది వద్ద ఉన్న కూడలిలో దాదాపు రూ. 7.9 కోట్ల వ్యయంతో భారీ వీణను ఏర్పాటు చేశారు. ఈ వీణ దాదాపు 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తులో 14 టన్నుల బరువు ఉంటుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్లో...లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకోవడమే గాక ఆమె తనపై చూపిన ఆప్యాయతను మరువలేనిదన్నారు. ఈ రోజు అయోధ్యలోని చౌక్కి ఆమె పేరు పెట్టడం అనేది భారతీయ దిగ్గజాలలో ఒకరిగా పేరుగాంచిని లతా దీదీకి దక్కిన తగిన నివాళి అని అన్నారు. ఈ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ సంగీత వాయిద్యం సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉండటమే గాక ఇంత బారీ సంగీత పరికరాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని అధికారులు తెలిపారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఈ ప్రాజెక్టుకి సుమారు 7.9 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఈ భారీ సంగీత వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారని, సుమారు రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అందంగా తీర్చిదిద్దిన ఈ వీణపై సరస్వతి చిత్రం కూడా చెక్కబడి ఉందని అన్నారు. (చదవండి: రాహుల్ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్) -
ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్, కారణం ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్ అవార్డ్స్ ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడమే. 93వ ఆస్కార్ అవార్డ్స్ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్లకు ఆస్కార్ ‘ఇన్ మెమోరియమ్’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్లను విస్మరించడంతో ఆస్కార్ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్ మెమోరియమ్’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. -
క్రికెటర్ను ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే?
ఇది గాయని లతా మంగేష్కర్ ప్రేమ కథ. ‘ఇంటికి పెద్ద కూతురు.. చిన్న వయసులోనే తోబుట్టువుల మంచి,చెడులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతకే జీవితాన్ని అంకింతం చేసి ఒంటరిగా మిగిలిపోయింది’ అని లతా మంగేష్కర్ గురించి తెలిసిన కొందరు చెబుతారు. ‘సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ల చేష్టలు .. వాటి పర్యవసానాలు పిల్లలకు పాఠాలవుతాయి. కానీ లతా విషయంలో అది రివర్స్ అయింది. ప్రేమ, పెళ్లికి సంబంధించి లతా చెల్లెలు ఆశా భోంస్లే తీసుకున్న తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు.. వాటి తాలూకు ఫలితాలు లతాను జీవితాంతం అవివాహితగానే ఉంచాయి’ అనేది ఇంకొందరు సన్నిహితుల అభిప్రాయం. ‘ఆమె ఇష్టపడ్డ మనిషి.. ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లకపోవడంతో ఏ తోడు లేకుండానే జీవితాన్ని గడిపేసింది’ అని మరికొందరి ఆప్తుల మాట. లతా మంగేష్కర్ ప్రేమించిన వ్యక్తి.. క్రికెటర్, దుంగార్పూర్(రాజస్థాన్) సంస్థానాధీశుడు లక్ష్మణ్ దుంగార్పూర్ కుమారుడు.. రాజ్ సింగ్ దుంగార్పూర్. రంజీల్లో రాణించాడు. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కు ప్రెసిడెంట్గా పనిచేశాడు. అభిమాని.. లతా మంగేష్కర్ను, రాజ్ సింగ్ దుంగార్పూర్ను కలిపింది క్రికెటే. ఆమెకు క్రికెట్ మీద చక్కటి అవగాహన ఉంది. ఆ ఆటకు వీరాభిమాని కూడా. లతా ఒక్కరే కాదు మంగేష్కర్ కుటుంబమంతా క్రికెట్ అభిమానులే. దాంతో ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్కి రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య స్నేహం బలపడింది. అలా మంగేష్కర్ కుటుంబానికే ఆత్మీయుడిగా మారిపోయాడు అతను. ఆ సాన్నిహిత్యమే లతా, రాజ్ సింగ్ ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేసింది అంటారు ఇద్దరినీ ఎరిగిన మిత్రులు. పెళ్లిదాకా ఎందుకు రాలేదు? ‘మా తాత, మా అమ్మ, పిన్ని ఒప్పుకోకపోవడం వల్లే’ అంటుంది రాజ్ సింగ్ దుంగార్పూర్ మేనకోడలు రాజశ్రీ కుమారి. ‘సినిమా గాయని రాజ కుటుంబపు కోడలెలా అవుతుందనేది వాళ్ల అభ్యంతరం. నాకింకా గుర్తు.. నా చిన్నప్పటి విషయం ఇది.. ఒకసారి బాంబేలోని బికనీర్ హౌస్కి లతా మంగేష్కర్ని పిలిచారు. మా అమ్మ, పిన్ని.. తమ తమ్ముడిని వదిలేయమని, అప్పుడే అతను తమకు తగినట్టుగా ఏ రాజ్పుత్ అమ్మాయినో లేదంటే ఏ రాజవంశస్తురాలినో చేసుకుంటాడు అని లతాకు చెప్పారు. కానీ లతాతో రిలేషన్షిప్ వదులుకోవడానికి మామయ్య ఇష్టపడలేదు’ అని రాజశ్రీ కుమారి తన ‘ది ప్లేస్ ఆఫ్ క్లౌడ్స్’ అనే పుస్తకంలో రాసింది. ఆమె రాసిన ఈ విషయాన్ని దుంగార్పూర్ వంశస్తులు ఖండించారు. రాజ్ సింగ్ కుటుంబ సభ్యుడొకరు ‘రాజ్ సింగ్ మొదటి నుంచీ సర్వస్వతంత్రుడిగానే ఉన్నాడు. ఎవరో కట్టడి చేస్తే ఆగే మనిషి కాదు అతను. రాజ్ సింగ్ కన్నా లతా ఆరేడేళ్లు పెద్ద. వాళ్లది లేట్ వయసు ప్రేమ. బహుశా ఈ కారణాలతో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోకపోయుండొచ్చు’ అంటాడు. ఇలా వాళ్ల ప్రేమ గురించి వాళ్లిద్దరి సన్నిహితులు చెప్పడమే కానీ ఇటు లతా మంగేష్కర్ కానీ.. అటు రాజ్ సింగ్ కానీ ఎప్పుడూ నిర్ధారించలేదు. అయితే తనకు అత్యంత ఆప్తుల్లో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఒకరని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో లతా మంగేష్కర్ చెప్పారు. ఆమె కోసం రాజ్ సింగ్ లార్డ్స్ స్టేడియం గ్యాలరీలోని సీట్ను పర్మినెంట్గా రిజర్వ్ చేయించారనేది ప్రచారంలో ఉంది. ‘నిజమేనా?’ అని లతాని అడిగారు నస్రీన్ కబీర్ మున్ని.. ‘లతా మంగేష్కర్ .. ఇన్ హర్ ఓన్ వాయిస్’ పుస్తక రచయిత. దానికి లతా నవ్వుతూ ‘కాదు. లార్డ్స్లో నాకెలాంటి రిజర్వేషన్ లేదు. సామాన్య ప్రేక్షకుల్లాగే ఆ స్టేడియంలో మ్యాచ్లు చూస్తా’ అని జవాబిచ్చారు. ‘రాజ్ సింగ్, లతా మంగేష్కర్లది పరిణతి చెందిన ప్రేమానుబంధం. దానికి లేనిపోని కల్పనలు జోడించొద్దు. ఆమెకు అతని ఆస్తి అవసరం లేదు. అతనికి ఆమె కీర్తితో సంబంధం లేదు. ఆ ఇద్దరికీ వాళ్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలున్నాయి. వాళ్ల సహజీవనానికి ఉన్న అడ్డంకులను అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు బలమయ్యారు.. పెళ్లితో కలవకపోయినా.. ప్రేమకు గౌరవమిచ్చారు ’ అని చెప్తారు ఇరు కుటుంబ సభ్యులు. రాజ్ సింగ్ కూడా అవివాహితుడిగానే నిష్క్రమించాడు. ప్రపంచానికేం అవసరం? ‘చాలా కాలంపాటు నేను డైరీలు రాశాను. కొన్ని కథలు, పాటలూ రాశాను హిందీలో. కానీ ఓ రోజు అనిపించింది.. అలా రాయడం వల్ల ఉపయోగమేంటీ అని. అందుకే వాటన్నిటినీ చించేశాను. ఆత్మకథ రాసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆత్మకథ రాసేప్పుడు నిజాయితీగా ఉండాలని నమ్ముతాను. అయితే ఆ నిజాయితీ చాలా మందిని బాధపెట్టొచ్చు. ఇతరులను బాధపెట్టే రాతలెందుకు? నా జీవితం.. అదిచ్చిన అనుభవాలు నా వ్యక్తిగతం. వాటిని రాయడమెందుకు? నా వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా!’ అని చెప్పారు లతా మంగేష్కర్. - ఎస్సార్ -
లతా మంగేష్కర్ ను గుర్తు చేస్తూ సింగర్ యశస్వి పాట
-
లత చితాభస్మ నిమజ్జనం
నాసిక్: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్కుండ్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
లతా మంగేష్కర్ స్మారక నిర్మాణంపై దుమారం
Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్ వద్దే మెమోరియల్ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్.. ఈ డిమాండ్కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్పై స్వరం మార్చారు నానా. ఇక బీజేపీ డిమాండ్పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్తో ఉన్న అనుబంధం. బాల్ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్ నిర్మాణం డిమాండ్పై మౌనం పాటిస్తోంది. ఇక ఈ డిమాండ్..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేనా9MNS) నేత సందీప్ దేశ్పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్ ప్రజలు ఈ పార్క్ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్ ట్వీట్ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు. ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్. లతా మంగేష్కర్ మెమోరియల్ డిమాండ్పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్ కాదని, దయచేసి వివాదానికి పుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు. -
సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి
సరస్వతీ దేవిని ఆరాధించే ‘వసంత పంచమి’ ఘడియల్లో సప్త స్వరాలు మూగబోయాయి. లతా మంగేష్కర్తో పాటు సాక్షాత్ సరస్వతీ స్వరూపం మరో లోకానికి మరలిపోయింది. దేశ సంస్కృతి, చరిత్రల్లో లతాజీ ఒక అంతర్భాగం. అఖండ భారత దేశంలో తన గాన యాత్ర ప్రారంభించి, ఏకంగా 7 దశాబ్దాల పాటు అవిరామంగా ఆ యాత్రను సాగించిన సాంస్కృతిక సమున్నత చిహ్నం ఆమె. మరాఠీ నాటక రంగంలో గాయక– నటుడు దీనా నాథ్ ఐదుగురి సంతానంలో ప్రథమ సంతానం లత. తండ్రి ఆకస్మిక మరణంతో 13వ ఏట తన ముగ్గురు సోదరీమణులు, సోదరుడు హృదయనాథ్ల పోషణ, కుటుంబభారాన్ని ఆమె తనపై వేసుకున్నారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తోబుట్టువులంతా సంగీత రంగంలోనే రాణించడం విశేషమే. లత తన తండ్రి స్నేహితుడు, నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్ (సంగీత దర్శ కుడు, దర్శకుడు) మార్గదర్శనంలో మరాఠీ సినిమాలలో నటించారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. అప్పట్లో నూర్జహాన్, షంషాద్ బేగమ్ల తారస్థాయిలో పాడే విధానంతో పోలిస్తే, లత గొంతు కొంత పీలగా ఉందని సంగీత దర్శకులు నిరుత్సాహపరిచిన సందర్భాలున్నాయి. క్రమంగా జోహ్రాబాయి, అమీర్బాయి కర్నాటకీ, షంషాద్, సురయ్యాల మధ్య... సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో లత పాటలు పాడారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్, నౌషాద్, హుస్న్లాల్ – భగత్రామ్ ద్వయం కూడా లతా మంగేష్కర్ ప్రతిభను గుర్తించి, పాడించారు. 1949లో బాంబే టాకీస్ నిర్మాణం ‘మహల్’లో పాట ‘ఆయేగా ఆయేగా’ పాట దేశమంతటా మారు మోగింది. అప్పట్లో సిలోన్ రేడియోలో ప్రతి రోజూ హిందీ సర్వీస్లో ఈ పాట ప్రసారం చేయమంటూ వేలల్లో ఉత్తరాలు వస్తుండేవట! ఆ ఉత్తరాల్లో గాయకురాలి పేరు కనుక్కోవడానికి వచ్చినవే ఎక్కువ. ఎందుకంటే, అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డులలో సినిమాలోని పాత్రధారి పేరే ఉండేది. (చదవండి: వంద వసంతాల హేతువాది) ఆ తరువాత రాజ్కపూర్ సొంత నిర్మాణంలో వచ్చిన ‘బర్సాత్’ చిత్రగీతాలతో దేశమంతా లతా ప్రభంజనం మొదలైంది. నాయికలు తమకు లతానే ప్లేబ్యాక్ పాడాలనే షరతు కాంట్రాక్ట్లో పెట్టడం వరకూ వెళ్లింది. సంగీత దర్శకులందరూ లత రికా ర్డింగ్ కోసం వేచి చూడడం, ట్రాక్ సింగర్లతో రికార్డ్ చేసి, పాట షూట్ చేసి, ఆ తర్వాత లతాజీతో ఒరిజినల్ వెర్షన్ పాడించిన సందర్భాలు కోకొల్లలు. మాతృభాష మరాఠీపై అభిమానంతో, ‘ఆనంద్ ఘన్’ అనే మారుపేరుతో సంగీత దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారామె. అది జోల పాట కానీ, భజన గీతం కానీ, విషాద గీతం కానీ, ప్రబోధ గీతం కానీ లత ఏర్పరిచిన ప్రమాణాలను వేరెవ్వరూ అందుకోలేనంతగా అన్ని భారతీయ భాషలలో పాడారు. అనిల్ బిశ్వాస్ చొరవతో శ్వాసను ఎక్కువ సేపు నిలిపేలా చేసిన సాధనతో ఆమె సాధించిన విజయాలెన్నో! భారత్–చైనా యుద్ధానంతరం ఆమె పాడిన ‘ఆయ్ మేరే వతన్ కే లోగో’ పాట దేశ ప్రధాని నెహ్రూతో పాటు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఒక జాతీయ గీతం అంతటి స్థాయిని సాధించింది. ఈ పాటను కానీ, ‘ఆనంద్ మఠ్’లోని వందేమాతరం కానీ వినని భారతీయుడు ఉండడు! ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఒకానొక సందర్భంలో ‘అసలీవిడ అపశ్రుతిలో పాడదా?’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆమెకు ‘ఉస్తాదోంకా ఉస్తాద్’గా కితాబిచ్చారు. ఫిలింఫేర్ అవార్డులు, అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పుర స్కారం, జాతీయ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు దాదాపు అన్ని సంగీత, సాంస్కృతిక అవార్డులకూ లత ఓ చిరునామా. (చదవండి: ఆదర్శ జీవితానికి కొలమానం) క్రికెట్ అంటే లతాజీకి వీరాభిమానం. అందుకే, 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు నజరానాలు అందించడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వద్ద నిధులు లేకపోవడంతో తనే పూను కొని, ఒక సంగీత విభావరి నిర్వహించారు. రూ. 20 లక్షలకు పైగా సేకరించడమే కాక, ఎల్పీ రికార్డును విడుదల చేసి, రాయల్టీ కూడా బీసీసీఐకి అందించిన ఔదార్యం లతాజీది. తరాలు మారినా 7 దశాబ్దాల పాటు అన్ని ట్రెండ్లలో తన ఉనికి చాటుకున్నారు. రోషన్–రాజేష్ రోషన్, చిత్రగుప్త– ఆనంద్ మిళింద్, ఎస్డీ బర్మన్ – ఆర్డీ బర్మన్ల తరాలను దాటి నేటి ఏఆర్ రెహమాన్ వరకూ స్వరాన్ని అందించారు. ‘ఆన్’, ‘ఉడన్ ఖటోలా’ చిత్రాలు తమిళంలో డబ్ అయినప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ లతానే పాడారు. ఇక, తెలుగులో ‘సంతానం’ చిత్రంలోని అనిసెట్టి రచన ‘నిదురపోరా తమ్ముడా’, ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు...’ పాటలు పాడారు. దర్శ కుడు వంశీ ‘గాలికొండాపురం రైల్వేగేటు’ నవలను సినిమాగా తీయాలనుకున్నప్పుడు, ఇళయరాజా సంగీతంలో లతాజీతో పాట రికార్డింగ్ చేయిం చారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవ డంతో అందులోని ఆమె పాట వినే అదృష్టం తెలుగు అభిమానులు కోల్పోయారు. ఆమె తన 80వ ఏట అన్నమాచార్య కీర్తనలను టీటీడీ కోసం ఆలపించి, పారితోషికం స్వామికే సమర్పించడం విశేషం. హిందీ, బెంగాలీ, మరాఠీ, ప్రైవేట్ భజన్స్ ఏవైనా లతాజీ పాటల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేయడ మంటే సంద్రాన్ని దోసిట పట్టాలనుకోవడమే!‘నాకు ఒక హార్మోనియం, లతాని ఇవ్వండి. సంగీతం కంపోజ్ చేసిచ్చేస్తా’ అన్నది ఎస్డీ బర్మన్ మాట. నటి నర్గీస్ – ‘లతాజీ పాడిన విషాద గీతం అభినయించా లంటే గ్లిజరిన్ అవసరం రాలేదు. లతాజీ గొంతులో పలికే ఆ భావమే నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించేది’. చలనచిత్ర సంగీతంలో లతాజీ ముద్ర చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. కవి జావేద్ అఖ్తర్ అన్నట్లు ‘ఈ భూగ్రహానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే లతా!’ – రవి పాడి, రైల్వే ఉన్నతాధికారి అరుదైన గ్రామ్ఫోన్ రికార్డుల సేకర్త -
లతా మంగేష్కర్కు ఐరాస కార్యదర్శి నివాళి
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి. (చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం) -
ఐశ్వర్యరాయ్పై అగ్గిమీద గుగ్గిలమవుతున్న నెటిజన్లు
గానకోకిల, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ మరణవార్త సంగీతప్రియులనే కాదు యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాస్త ఆలస్యంగా నివాళులు అర్పించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. లతాజీ ఆదివారం నాడు (ఫిబ్రవరి 6న) మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు ఆమెను చెడామడా తిడుతున్నారు. ఏంటి, ఇప్పుడు నిద్ర లేచారా? మీకీవార్త ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్ వాడదని, అందువల్లే లేట్గా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
షారుక్ వీడియోపై నటి ఊర్మిళ స్పందన, ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?
లెజెండరి సింగర్, గాన కొకిల లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నివాళులు అర్పిస్తుండగా ఉమ్మివేసిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రయల్లో తన మేనేజర్తో కలిసి హజరైన షారుక్ లతాజీ భౌతికఖాయం వద్ద ముస్లిం పద్దతిలో నమస్కారం చేస్తూ ప్రార్థించాడు. అనంతరం మాస్క్ తీసి ఉమ్మాడు. దీంతో షారుక్పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: అవును.. బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, అతనెవరో చెప్పేస్తా.. కానీ: హీరోయిన్ లతాజీ కాళ్ల వద్ద ఉమ్మి షారుక్ ఆమెను అవమాన పరిచారంటూ నెటిజన్లు ఆయనను విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఈ ట్రోల్స్పై స్పందించిన కొందరు ఇది ముస్లిం ప్రార్థనలో భాగమంటూ అసలు సంగతి వివరించారు. ఈ క్రమంలో షారుక్కు పలువురు నటీనటులు మద్దతుగా నిలుస్తారు. తాజాగా సీనియర్ నటి ఊర్మిళ మాటోండ్కర్ కూడా షారుక్కు మద్దతుగా నిలిచింది. చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్ స్టేషన్కు పిటిషనర్.. ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఊర్మిళా మాట్లాడుతూ... ప్రార్థనను కూడా ఉమ్మివేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ఫార్మేట్లో నిలబెట్టిన షారుక్పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధించిందంటూ ఊర్మిళ వ్యాఖ్యానించింది. కాగా ఇండియన్ నైటింగల్గా పేరు తెచ్చుకున్న గాయని లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022 -
కన్నీరు పెట్టిస్తున్న లతా మంగేష్కర్ ఓల్డ్ వీడియో..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్తను ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. లతా జీ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన లతా జీ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు రోజులుగా లతా మంగేష్కర్కు సంబంధించిన పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లతా జీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో.. మళ్లీ జన్మంటూ ఉంటే లతా మంగేష్కర్గా పుట్ట కూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే లతా మంగేష్కర్ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయన్నది ఆమెకు మాత్రమే తెలుసు అంటూ లతాజీ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చదవండి: లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? View this post on Instagram A post shared by Gaurav Ogale (@patranimacchi) -
లతకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు సోమవారం గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు. ‘‘పాటల ఆత్మతో తాదాత్మ్యం చెందడం లతకే సొంతమైన విద్య. అందుకే ఆమె పాటలన్నీ మాస్టర్పీస్లుగా నిలిచిపోయాయి’’ అంటూ కొనియాడారు. లత స్వరం దశాబ్దాల పాటు దేశాన్ని మంత్రముగ్ధం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశ ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని లత బలోపేతం చేశారు. ఆమె 36 భాషల్లో పాడిన తీరే దేశ ఐక్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ’’ అని కొనియాడారు. మెలోడీ క్వీన్ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇండోర్లో లత అకాడమీ లత జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్లో ఆమె జన్మస్థలం ఇండోర్లో సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ మొక్క నాటారు. ఇండోర్లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. లత అస్థికలను అల్లుడు ఆదినాథ్ సేకరించారు. వాటిని ఎక్కడ కలుపుతారనే దానిపై స్పష్టత లేదు. -
లతా మంగేష్కర్ మృతి పట్ల నాట్స్ సంతాపం
ఎడిసన్, న్యూ జెర్సీ: భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది. భారతీయ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణం అమెరికాలోని తెలుగువారితో పాటు యావత్ ప్రవాస భారతీయులందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఓ ప్రకటనలో నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తెలిపారు. తామంతా లతామంగేష్కర్ పాటు వింటూ పెరిగామని అరుణ అన్నారు. లతా జీ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వస్తారని ఆశించామని.. కానీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే పేర్కొన్నారు. లతా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నాట్స్ తెలిపింది. ఆమె కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది. -
Lata Mangeshkar: అజరామరం.. లతాతో ప్రేమలో పడ్డ రాజ్ సింగ్.. అవివాహితుడిగానే...
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. ప్రధాన కారణం కుటుంబం. లతా తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ పోలియో బాధితుడు. తండ్రిని ఆ తమ్ముడిలో చూసుకునేది లతా. అతనంటే ప్రాణం. అతణ్ణి చూసుకుంటే చాల్లే అనుకుని ఉండొచ్చు. తాను కుదురుకునే లోపు ఆశా భోంస్లే పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి పెటాకులు కావడం చిన్న ప్రభావం కాదు. అలాగని ఆమె జీవితంలో పురుషులు తారసపడలేదని కాదు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ సింగర్లు తప్పక క్లాసికల్ నేర్చుకోవాల్సి వచ్చేది. లాహోర్కు చెందిన అద్భుత గాయకుడు సలామత్ అలీ ఖాన్ దగ్గర లతా పాఠాలు నేర్చుకునేది. అతని గానం ఆమెకు వెర్రి. పెళ్లి ఆలోచన వరకూ వెళ్లింది. కాని అప్పటికే సలామత్ అలీ ఖాన్కు పెళ్లయ్యింది. పైగా దేశ విభజన తాజా గాయాలు జనాన్ని వీడలేదు. ఈ సమయంలో తమ పెళ్లి వివాదానికి దారి తీయకూడదని సలామత్ వెనక్కు తగ్గాడు. ఇక సంగీత దర్శకుడు సి.రామచంద్ర, లతా వృత్తిరీత్యా సన్నిహితులు. కాని ఆ స్నేహం చెదిరింది. లతా తమ్ముడు హృదయనాథ్ మిత్రుడైన రాజ్సింగ్ దుంగాపూర్ (క్రికెట్) లతాతో ప్రేమలో పడ్డాడని అంటారు. అయితే లతాతో పెళ్లికి రాజ్ సింగ్ రాజ కుటుంబం అంగీకరించలేదు. దాంతో అతడు అవివాహితుడిగా ఉండిపోయాడు. లతా కూడా. ఇదొక కథనం. లతాను ఆరాధించిన వారిలో గీత రచయిత సాహిర్ లుధియాన్వీ, గాయకుడు భూపేన్ హజారికా కూడా ఉన్నారు. అజరామర ప్రేమ కథ.. రాజస్తాన్లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన రాజ్సింగ్ ‘లా’ చదవడానికి 1959లో ముంబైకి వెళ్లారు. ఆయన క్రికెట్ ప్లేయర్. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్కు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఆట వాళ్లిద్దరినీ స్నేహితులను చేసింది. హృదయనాథ్ కోసం రాజ్ సింగ్ మంగేష్కర్ ఇంటికి వెళ్లేవారు. అక్కడే తొలిసారిగా లతాను కలిశారు. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. చదువు పూర్తి చేసుకుని దుంగాపూర్కు వెళ్లిన తర్వాత రాజ్ సింగ్ లతాతో పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కానీ రాజ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లాడాలన్న షరతు ముందుంచడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అయితే, లత మీద ప్రేమను చంపుకోలేని ఆయన చివరి వరకు అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఈ విషయాలను రాజ్సింగ్ బంధువు, బికనీర్ రాకుమారి రాజశ్రీ పుస్తకంలో రాశారు. రాజ్ సింగ్ లతాను ఆప్యాయంగా మిథూ అని పిలిచేవారని, వారి ప్రేమ అజరామరమని పేర్కొన్నారు. కాగా 2009లో రాజ్ సింగ్ మరణించగా.. కడచూపు కోసం లతా రహస్యంగా దుంగాపూర్ వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక బీసీసీఐ అధికారిగా పనిచేసిన రాజ్ సింగ్... 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్రోత్సాహకం అందించేందుకు లతాతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆమె అందుకు సమ్మతం తెలపడం.. తన పాట ద్వారా 20 లక్షలు సేకరించడం.. తద్వారా ఒక్కో సభ్యుడికి బీసీసీఐ లక్ష రూపాయలు ముట్టజెప్పడం జరిగింది. చదవండి: Lata Mangeshkar: ప్రేమ గుడ్డిదని తెలుసు.. చెవిటిదని మొదటిసారి తెలుసుకున్నా అని లతా ఎందుకన్నారు? -
Lata Mangeshkar: లతా పాట.. టీమిండియా సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష!
లతా మంగేష్కర్ క్రికెట్కు వీరాభిమాని. క్రికెట్తో ఆమె అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటన మాత్రం 1983లో జరిగింది. భారత జట్టు ఇంగ్లండ్లో వన్డే వరల్డ్కప్ను గెలుచుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. విజేతలను అభినందించి నగదు పురస్కారం అందించాలని బీసీసీఐ భావించింది. కానీ బోర్డు నాటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రపంచ కప్ జరిగిన సమయంలో క్రికెటర్లకు రోజూవారీ ఖర్చులకు తలా 20 పౌండ్లు ఇచ్చేందుకే అధికారులు కిందా మీదా పడ్డారు. అలాంటిది ప్రోత్సాహకం ఏమిస్తారు? బీసీసీఐ అధికారి రాజ్సింగ్ దుంగార్పూర్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ సమయంలో భారత సినీ సంగీతాన్ని శాసిస్తున్న తన స్నేహితురాలు లతా మంగేష్కర్తో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న దుంగార్పూర్ విజ్ఞప్తికి వెంటనే ‘ఓకే’ చెప్పిన లతా పైసా కూడా తీసుకోకుండా వేదికపై పాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆ కచేరీకి భారీస్థాయిలో అభిమానులు తరలి వచ్చారు. దాని ద్వారా సుమారు రూ. 20 లక్షలు పోగయ్యాయి. భారత జట్టు సభ్యులు 14 మందికి ఒక్కొక్కరికీ కనీసం రూ. లక్ష చొప్పున బహుమతిగా ఇచ్చేందుకు ఆ డబ్బు సరిపోయింది. అప్పటినుంచి లతాకు, భారత క్రికెట్కు మధ్య అనుబంధం విడదీయరానిదిగా మారిపోయింది. నాటినుంచి ఇప్పటి వరకు భారత్లో జరిగే ఏ అంతర్జాతీయ మ్యాచ్కైనా రెండు వీఐపీ సీట్లు లతా మంగేష్కర్ కోసం రిజర్వ్ చేయడం బీసీసీఐ రివాజుగా మార్చేసింది! చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
నరేంద్రమోదీ తల్లికి గుజరాతీ భాషలో లేఖ రాసిన లతా మంగేష్కర్!
బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ గాయనిగా తన కెరీర్లో అనేక భాషల్లో పాడారు. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్కి లతా దీదీ తొలిసారిగా గుజరాతీ భాషలో లేఖ రాశారు. ఆ లేఖలో లతా దీదీ..."జూన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి అయినందుకు మీ కొడుకు, నా సోదరుడికి అభినందనలు. నేను గుజరాతీలో తొలిసారిగా లేఖ రాస్తున్న ఏదైన తప్పు ఉంటే నన్ను క్షమించండి" అని గాయని లతా మంగేష్కర్ గుజరాతీలో లేఖ రాశారు. లతా ఆ లేఖలో ప్రధాని మోదీని సోదరుడిగా తనను హీరాబెన్ పెద్ద కూమార్తెగా సంభోదించడం విశేషం. 2013లో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ స్మారకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు లతా మంగేష్కర్ మోదీని ఆహ్వానించారు. అంతేకాదు ఆ కార్యక్రమంలో మోదీని ప్రధానిగా చూడాలనుకుంటున్నాను అని అన్నారు. పైగా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అదే మాట అన్నారు. ఈ మేరకు ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రధాని అధికారిక వెబ్సైట్ పోస్ట్ చేయడమే కాక నరేంద్ర మోదీతో లతా మంగేష్కర్కు గల అనుబంధానికి సంబంధించిన విషాయాలను వెల్లడించింది. లతా దీదీకి ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం అని వెబ్సైట్ పేర్కొంది. ఆమె అతన్ని ముద్దుగా 'నరేంద్ర భాయ్' అని పిలిచేదని, ఇద్దరూ ఒకే నెలలో పుట్టినరోజు జరుపుకున్నారని తెలిపింది. ఆమె ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజు శుభాకాంక్షలు తెలపడమే కాక రాఖీని పంపిచేవారు. అయితే 202లో కరోనా మహమ్మారీ కారణంగా మోదీకి రాఖీ పంపలేకపోతున్ననంటూ లతా మంగేష్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మోదీ స్పందనగా ..."మీ హృదయపూర్వక సందేశం నాకు అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. (చదవండి: రాజ్యసభలో లతా మంగేష్కర్కు నివాళి) -
లతా మంగేష్కర్కు నివాళి అర్పించిన ప్రధాని మోదీ
► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ లీడర్గా ఎదుగుతోందన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ అడ్డుకున్నారు. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్ రంజన్ను ఉద్దేశించి మోదీ పంచ్ వేశారు. 1972లో చివరిసారి బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ అధిర్కు కౌంటర్ వేశారు. ► తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వలేదని మోదీ చురకలంటించారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ తీరు మారడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా భారత్ కోవిడ్తో పోరాడుతోందని, కోవిడ్ను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ► వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ►కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకిహోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లో ఒవైసీ కాన్యాయ్పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన షా.. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ► రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు .సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కంటే వైఎస్సార్సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ► గాయిని లతా మంగేష్కర్కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. లోక్సభ బడ్జెట్పై చర్చలో భాగంగా.. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా త్రిపురలోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. -
Fact Check: షారుక్ లతాజీ పాదాల దగ్గర ఉమ్మివేశాడా?
గాన కోకిల లతా మంగేష్కర్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఇక సెలవంటూ అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె ఇంటికి చేరుకుని లతా మంగేష్కర్ పార్థివదేహానికి కడసారి నివాళులు అర్పించారు. చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా లెజెండరీ సింగర్కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చాడు. అయితే నివాళులు అర్పించే సమయంలో ఆయన చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షారుక్ తన మేనేజర్తో కలిసి లతా మంగేష్కర్కు నివాళులు అర్పించేందుకు వచ్చాడు. ఆ సమయంలో సింగర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మాస్క్ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు షారుక్ లతా పాదాల దగ్గర ఉమ్మేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ప్రవర్తనను ఎండగడుతూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ.. షారుక్ ఉమ్మేయలేదని, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానమని ట్రోలర్లపై మండిపడుతున్నారు. Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022 Srk did not spit, he blew to ward off evil for Lataji as per his religion & if people read more like I did, they would understand. As for can Hindus pray at funeral of someone from a Muslim faith, then the answer is Yes. Because, I have & no one had a problem with it. 🙏🏾🕉 — Kr1shna (@krishna_Ind1an) February 6, 2022 Fringe targetting @iamsrk by falsely accusing him of spitting at #LataMangeshkar Ji’s funeral should be ashamed of themselves. He prayed & blew on her mortal remains for protection & blessings in her onward journey. Such communal filth has no place in a country like ours 🤲🏼🙏🏼 pic.twitter.com/xLcaQPu1g8 — Ashoke Pandit (@ashokepandit) February 6, 2022 -
ఆ మాటలను లతా మంగేష్కర్ ఎప్పుడూ మరవలేదట!
ప్రపంచమంతా పడి చచ్చే తన గాత్రం నిజానికి అంత గొప్పదేమీ కాదని వినమ్రంగా చెప్పేవారు లతా మంగేష్కర్. ‘‘నేనో మంచి గాయనిని. అంతే. నాలో అసాధారణ ప్రతిభా పాటవాలేమీ లేవు. నాకంటే గొప్పగా పాడే చాలామంది కన్నా పేరు ప్రఖ్యాతులు దైవదత్తంగా నాకొచ్చాయంతే. అందుకే విజయాన్ని ఎప్పడూ నెత్తికెక్కించుకోకూడదు’’అని చెప్పేవారామె. ‘‘చిన్నప్పుడు సంగీత శిక్షణను తప్పించుకునేందుకు తలనొప్పి, కడుపు నొప్పి అంటూ నాన్నకు చాలా సాకులు చెప్పేదాన్ని. సాధన చేయిస్తుంటే పారిపోయేదాన్ని. ఆయన వెంటపడి పట్టుకుంటే నీ ముందు పాడటానికి సిగ్గేస్తోందంటూ పెనుగులాడేదాన్ని. దాంతో ‘నేను నాన్నను మాత్రమే కాను, నీ గురువును కూడా. ఎప్పటికైనా గురువును మించాలని తపించాలి. అంతే తప్ప పాడటానికి సిగ్గేస్తోందని అనకూడదు’అని ఓ రోజు అనునయించారు. ఆ మాటలను ఎప్పుడూ మరవలేదు’’అని చెప్పారు. సంగీతమంటే అయిష్టం నాన్నతో సహా ఇంట్లో ఎవరికీ సినీ సంగీతం పెద్దగా నచ్చేది కాదని, వాళ్లకు కర్ణాటక సంగీతమే ఇష్టమని లతా మంగేష్కర్ అంటారు. ‘‘నాన్నకు సినిమాలే ఇష్టం లేదు. మమ్మల్ని సినిమాలు కూడా చూడనిచ్చేవారు కాదు’’అని ఆమె పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఫొటోగ్రఫీ అంటే లతకు చాలా ఇష్టం. క్రికెట్ అన్నా అంతే. వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, రోహన్ కన్హాయ్ నుంచి గవాస్కర్, సచిన్ దాకా అందరినీ బాగా ఇష్టపడేవారు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ సంతకం చేసిచ్చిన ఫొటోను ప్రాణంగా దాచుకున్నారు లత. -
Lata Mangeshkar: లత పాటకు పాకిస్తాన్ నియంత కూడా ఫిదా అయ్యాడు!
సుమధుర గాయని, భారత రత్న లతా మంగేష్కర్ గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.పాకిస్తాన్లో సంగీతం, లలిత కళలపై కఠిన నిషేధం విధించిన నాటి కరడుగట్టిన నియంత జనరల్ జియా ఉల్ హక్ కూడా లత గాన మాధుర్యానికి ఫిదా అయ్యాడు. తానామె అభిమానినని 1982లో ప్రఖ్యాత జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 1977లో సైనిక తిరుగుబాటు ద్వారా జుల్ఫికర్ అలీ భుట్టో సర్కారును కూలదోసి జియా అధికారంలోకి రావడం తెలిసిందే. తర్వాత భుట్టోను హత్య కేసులో ఉరి తీయించాడు. దానిపై దేశమంతటా వెల్లువెత్తిన నిరసనలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మహిళలు పాల్గొనే సంగీత, సాహిత్య ప్రదర్శనలపై నిషేధం విధించాడు. అందుకే తన అభిమాన గాయని లతతో కూడిన భారత గాయక బృందం పాకిస్తాన్లో పర్యటించేందుకు అనుమతించలేదు! గోవాలో మూలాలు లత మూలాలు గోవాలో ఉన్నాయి. అక్కడి మంగేషీ గ్రామం ఆమె పూర్వీకుల స్వస్థలం. అక్కడి మంగేషీ ఆలయంలో మంగేశుని పేరుతో కొలువైన శివుడు లత కుటుంబీకుల కులదైవం. ఆయన పేరిటే ఈ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఇంటి పేరు మంగేష్కర్గా స్థిరపడింది. లత తండ్రి అయిన సంగీత దర్శకుడు, రంగస్థల నటుడు దీనానాథ్ మంగేష్కర్ అసలు పేరు దీనానాథ్ అభిషేకీ. తమ ఊరిపై మమకారంతో ఇంటిపేరును మంగేష్కర్గా మార్చుకున్నారు. ఆ ఇంటి పేరుకు పెద్ద కూతురు లత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. -
శ్రీవారికి స్వర‘లతా’ర్చన
తిరుపతి తుడా: లతామంగేష్కర్ పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించి తన భక్తిని చాటుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీవారి ప్రచారకురాలిగా, శ్రీవారి ఆస్థాన విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. శ్రీవారి ముందు తన మధుర గాత్రంతో స్వామి వారిని కీర్తించి అనుగ్రహం పొందారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత సంకీర్తనలను గానం చేశారు. 2010 సంవత్సరంలో ఎస్వీ సంగీత నృత్యకళాశాలలోని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్లో ఆ సంకీర్తనలను రికార్డు చేసి సంగీత ప్రపంచానికి అందించారు. అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ సీడీని నాటి సీఎం రోశయ్య, గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీలో మొత్తం 10 సంకీర్తనలు రికార్డు చేశారు. -
భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె మృతి భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని అన్నారు. లతాజీ మరణంతో పాట మూగబోయిందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘20 భాషల్లో 1,000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ.. సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్లు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. పాటంటే లతాజీ .. లతాజీ అంటేనే పాట. సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది’అని సీఎం స్మరించుకున్నారు. లతా మంగేష్కర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన దివ్యగాత్రంతో ఆమె శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె కొనియాడారు. లత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీరంగానికి తీరని లోటు: కేటీఆర్ లతా మంగేష్కర్ మరణంపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటని ఆయన అన్నారు. కాగా, లతా మంగేష్కర్ మరణంపట్ల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, వి. శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ అర్వింద్ కుమార్ తదిత రులు సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మరణం దేశ సంగీత లోకానికి తీరని లోటని, సంగీత ప్రియుల గుండెల్లో ఆమె చిరస్థాయిలో నిలిచిపోతారని వేర్వేరు ప్రకటనల్లో వారంతా కొనియాడారు. లత మరణం దేశ ప్రజలందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది
ముంబై: పదినెలల చెల్లిని బడిలోకి తీసుకురావద్దన్నారన్న కోపంతో బడి ముఖమే చూడకూడదని పంతం పట్టింది ఒక చిన్నారి. అలా బడి మానేసిన చిన్నారి భారతరత్నగా ఎదగడంలో స్వయం కృషి ఎంతో ఉంది. లతా మంగేష్కర్ చిన్నతనంలో చెల్లెలు ఆశాను తీసుకొని స్కూలుకు వెళ్లింది. అయితే పసిపిల్లను బడిలోకి తేవద్దంటూ టీచర్ అభ్యంతరం పెట్టడంతో కోపంతో వెనక్కు వెళ్లిన లత మళ్లీ బడి ముఖం చూడలేదు. చిన్నప్పుడు మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం ఇంట్లోనే పనిమనిషి సాయంతో నేర్చుకున్నట్లు లతా మంగేష్కర్.. ఇన్ హర్ ఓన్ వాయిస్ పుస్తకంలో చెప్పారు. మరీ పసితనంలో నర్సరీ క్లాసులకు వెళ్లానని, బోర్డు మీద రాసిన శ్రీ గణేశ్ జీ అనే అక్షరాలను అచ్చుగుద్దినట్లు దింపినందుకు అప్పుడు తనకు పదికి పది వచ్చాయని చెప్పారు. తన బంధువు వసంతి మ్యూజిక్ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి అందరు టీచర్ల ముందు మ్యూజిక్టీచర్ పాడమన్నారని, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు. కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాత కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం అర్థమవుతుందని, తమిళ్ అవగాహన చేసుకునే యత్నం చేశానని లత చెప్పారు. -
Lata Mangeshkar Last Rites: లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఫొటోలు
-
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
గగన కోకిల - లతా మంగేష్కర్
-
మీరెక్కడ ఉన్న.. మా కోవెలే..మా ఇంటి కోకిలే
-
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? తొలి రెమ్యునరేషన్ ఎంతంటే..
Lata Mangeshkar Total Net Worth: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను విశేషంగా అలరించారు. అలా సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్కి సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధికంటే రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా జీ సంపాదన. ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. -
తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్
Sachin Tendulkar Pays Tribute To Lata Mangeshkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా.. తన ఆరాధ్య గాయని లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని దర్శించుకుని కన్నీటి నివాళులర్పించాడు. ముంబైలోని శివాజీ పార్క్లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాల సమయంలో సచిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ట్విటర్ వేదికగా సచిన్ తన సంతాప సందేశాన్ని షేర్ చేశాడు. I consider myself fortunate to have been a part of Lata Didi’s life. She always showered me with her love and blessings. With her passing away, a part of me feels lost too. She’ll always continue to live in our hearts through her music. pic.twitter.com/v5SK7q23hs — Sachin Tendulkar (@sachin_rt) February 6, 2022 "లతా ఆయీ (మరాఠీలో అమ్మ అని అర్థం) జీవితంలో నాకు కొంత భాగం దక్కినందుకు గర్వపడుతున్నా. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ చూపించేవారు. ఆమె మరణం నాకు తీరని లోటు. ఆమె తన గాత్రంతో ఎల్లప్పుడూ మన హృదయాల్లో బతికే ఉంటుంది" అంటూ సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, సచిన్కు లతా మంగేష్కర్తో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన తరుచూ ఆమెను కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవాడు. లతాజీని సచిన్ ప్రేమగా ‘ఆయీ’ అని పిలిచేవాడు. ఇదిలా ఉంటే, గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్(92) ఇవాళ ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్లో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోదీ సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్మ్యాన్ -
లతా మంగేష్కర్కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
గానకోకిల లతా మంగేష్కర్కు కన్నీటి వీడ్కోలు..
Lata Mangeshkar funeral live updates: ముగిసిన అంత్యక్రియలు ►కన్నీటి వీడ్కోలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ►లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. ►సచిన్ టెండ్కూర్ ఆయన సతీమణి లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. లెజెండరీ సింగర్, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ స్టార్ హీరోతో లతాజీకి వాగ్వాదం.. అయినా సరే నో చెప్పింది
When Lata Mangeshkar Refused To Sing Raj Kapoor Song: లతా మంగేష్కర్ లెగసీ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగీత సరస్వతి ఆవిడ. చిన్న వయసులోనే స్టార్ సింగర్గా ఫేమ్ తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే ఎడిటింగ్లో ఆ పాటను తీసేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. అసలు ఆమె కాల్షిట్ల కోసం సంగీత దర్శకులు పోటీ పడేవారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే లతాజీ సినిమాల్లో ద్వందర్థాలు వచ్చే పాటలు పాడేందుకు ససేమీరా నిరాకరించేవారు. అలా ఆమె పాడనని మొండికేయడంతో ఎన్నో పాటల లిరిక్స్ని సైతం మార్చాల్సి వచ్చింది. 1964లో సంగం సినిమా కోసం 'మై కా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గాయా' పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్కపూర్తో గంటన్నరకు పైగా లతాజీకి వాగ్వాదం జరిగింది. పాటలో సాహిత్యం బాగుందని ఎంతగా నచ్చజెప్పినా లతాజీ మాత్రం వినలేదట. దీంతో ఆ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఆ పాట సూపర్హిట్గా నిలిచింది. కానీ ఇంతవరకు ఆ పాటను కానీ, ఆ సినిమాను కానీ చూడలేదని లతాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. చదవండి: లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా? -
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా?
Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason: భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లతా జీ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడిన లతా మంగేష్కర్ జీవితం ఎంతో స్పూర్తిదాయకం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆమె కీర్తి ఎనలేనిది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ లెజెండరీ సింగర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో మిగిలిపోయింది. దీనిపై ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతాజీ సమాధానమిచ్చింది. 'జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అంతేకాకుండా పెళ్లిపై లతాజీ చేసిన మరొక కామెంట్ ఏంటంటే.. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు' అని వివరించారు. -
ఆ దిగ్గజ గాయని గౌరవార్థం.. సీఎం అభ్యర్థి ప్రకటన పై సంబరాలు చేసుకోవద్దు!
చండీగఢ్: బాలీవుడ్ లెజండరీ గాయని లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే లతా మంగేష్కర్ గౌరవార్థం ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరింది. ఇక పంజాబ్లో జరిగే ప్రచార ర్యాలిలో లత ఆలపించిన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట ప్లే చేయనున్నారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియంక వాద్రా ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ‘ఆమె అనేక దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత ప్రియమైన గాయనిగా కమనీయమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగేష్కర్ బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక వాద్రా కూడా భారత మాజీ ప్రధాని ఇందిగాంధీతో దిగిన లతామంగేష్కర్ ఫోటోని షేర్ చేస్తూ.. "ఆమె మరణం భారతీయ కళా ప్రపంచానికి కోలుకోలేని లోటు కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ బాధను భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..) -
మీకు తెలుసా? లతా మంగేష్కర్పై గతంలో విష ప్రయోగం జరిగింది!
ఆమె గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది. దానికి అన్ని రకాల ఎమోషన్స్ను పండించగల సామర్థ్యం ఉంది. ఆ కోకిల స్వరం నుంచి జాలువారిన పాటలు వేలల్లోనే ఉన్నా తెలుగులో మాత్రం మూడంటే మూడు పాటలే పాడింది. ఇప్పుడేకంగా ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. 1963లో లతా మంగేష్కర్పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లతా మంగేష్కర్ తర్వాత కోలుకున్నారు కానీ ఈ విషప్రయోగంతో చాలా నీరసపడిపోయారని అందులో పేర్కొన్నారు. చాలా రోజుల పాటు ఆమె మంచంపైనే ఉండిపోయారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పి ఆమెను నవ్వించేవారని, ఆమె తినే ప్రతి వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఇలా కొన్నాళ్లపాటు ఆమె వెన్నంటే ఉంటూ ఆమె కోలుకునేందుకు సుల్తాన్పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
-
గాన కోకిల లతా మంగేష్కర్ అరుదైన ఫోటోలు
-
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ!
గాన గంధర్వురాలు, భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమె మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు ఆమె పార్థివ దేహాన్ని తన నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలోనో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. కానీ మన దురదృష్టం.. తెలుగులో మూడు పాటలు పాత్రమే ఆలపించారు. -
హృదయం ముక్కలయ్యింది.. టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం
పాట మూగబోయింది. సంగీతం సవ్వడి చేయకుండా స్తబ్దుగా ఉండిపోయింది. గాత్రం లేకపోవడంతో నాట్యం నెమ్మదించింది. సంగీత ప్రపంచాన్ని కొన్ని ఏళ్లుగా ఏలిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అందరికీ సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మృతితో సంగీత ప్రపంచంలోనే కాదు సినీ ప్రపంచంలోనూ భరించలేనంత నిశ్శబ్దం ఏర్పడింది. లెజెండరీ సింగ్ లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం మరణించగా ఆమె మృతి పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. భారత గాన కోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. నా గుండె ముక్కలయ్యింది, ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఎంతో అసాధారణమైన జీవితాన్ని గడిపింది. సంగీతం సజీవంగా ఉన్నంతరవకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి అని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken💔 The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar — Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022 Deeply saddened by Lata Mangeshkar ji's demise. A voice that defined Indian music for generations... Her legacy is truly unparalleled. Heartfelt condolences to the family, loved ones and all her admirers. Rest in peace Lata ji. There will never be another. 🙏🙏🙏 — Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2022 మా గానకోకిల మూగబోయింది. మామధ్య మీరు లేకపోవచ్చేమో కానీ మీరందించిన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు. మా అందరి మదిలో మీరెప్పటికీ నిలిచే ఉంటారు. Our nightingale has fallen silent. You are no more but your legendary contribution to the music industry will live on. The number of emotions you could make us feel with just a single line. R.I.P #LataMangeshkar Mam. You will always be in our hearts.Our National Treasure❤️ pic.twitter.com/FmyZnMjm2g — Pooja Hegde (@hegdepooja) February 6, 2022 Deeply saddened by the passing of Lata Ji. A truly irreparable loss for the nation indeed. The Queen of Melody will continue to reign in our hearts and minds and inspire a generation of singers. — Jr NTR (@tarak9999) February 6, 2022 Lata Ji's passing away is a huge and irreplaceable loss. She will live on in our hearts forever. My heartfelt tribute to the nightingale of India. May her soul rest in peace. Wishing the family strength and comfort in these difficult times. — rajamouli ss (@ssrajamouli) February 6, 2022 Love, respect and prayers 🌹 @mangeshkarlata pic.twitter.com/PpJb1AdUdc — A.R.Rahman (@arrahman) February 6, 2022 India has lost its nightingale! You will be terribly missed but your legacy will live forever 😍🙏🏻 Om Shanti ❤️#LataMangeshkar #immortal #legend pic.twitter.com/GndHbeKNEC — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 6, 2022 💔 The GREATEST #LataMangeshkar pic.twitter.com/OewRVKK9CY — Adivi Sesh (@AdiviSesh) February 6, 2022 Legendary singer #LataMangeshkar garu is no more. A big loss to the Indian Film Industry. Our deepest Condolences to her family, friends & fans. May her soul rest in peace. pic.twitter.com/NEZGTXYsvs — Sri Venkateswara Creations (@SVC_official) February 6, 2022 Saddened at the sudden demise of #LataMangeshkar Garu, A voice that won millions of hearts. You'll always be remembered and immortal with your songs. Rest in Peace. Strength to her family and loved ones. — Sai Dharam Tej (@IamSaiDharamTej) February 6, 2022 End of an era in Indian Music ! Saddened by the demise of one of the most legendary singers of all time.. Her magical voice shall remain immortal..Sending my deepest condolences and strength to her family & billions of fans 🙏🏻#LataMangeshkar #NightingaleOfIndia pic.twitter.com/cstUlIzIOj — Pragya Jaiswal (@ItsMePragya) February 6, 2022 We lost a legend today. Truly an end of an era. May her soul rest in peace and glory. #LataMangeshkar 💔 pic.twitter.com/YK1TZ3oXXF — Tamannaah Bhatia (@tamannaahspeaks) February 6, 2022 R.I.p #LataMangeshkar ji You will always be India’s pride and your voice will always be part of our lives and homes forever and ever…💚💚💚 End of an Era 💔 pic.twitter.com/Lnr10aEZIA — Genelia Deshmukh (@geneliad) February 6, 2022 Lata ji 😢. Physically she might not be with us today, but she will live for generations to come through her songs. #LataMangeshkar — Vishnu Manchu (@iVishnuManchu) February 6, 2022 The Nightingale of India sleeps but her melodious voice shall always spread the soothing feel forever that she contributed into the world of music. India lost a Legend today 🙏 #LataMangeshkar #RIP pic.twitter.com/I74U7bMj2a — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) February 6, 2022 Heartbreaking.. #LataMangeshkar ji…💔#OmShanti pic.twitter.com/wIG5UtWzjb — Daksha Nagarkar (@DakshaOfficial) February 6, 2022 -
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
లతా మంగేష్కర్ ఆలపించిన తెలుగు పాటలు.. అవేంటంటే ?
Lata Mangeshkar Death: See Her Top 3 All Time Best Telugu Songs: లెజండరీ గాయనీ లతా మంగేష్కర్ ఇక లేరు. కరోనాతో పోరాడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కొన్ని వారాల క్రితం స్వల్ప కొవిడ్ లక్షణాలతో ముంబైలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన దక్కించుకోలేకపోయాం. సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన లతా మంగేష్కర్ 20 భారతీయ భాషల్లో 980 చిత్రాలకు గాను సుమారు 50 వేలకుపైగా పాటలకు గానం అందించారు. అయితే వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కేవలం మూడంటే మూడు పాటలే పాడారు లతా మంగేష్కర్. తెలుగులో ఆమె ఎక్కువగా పాటలు పాడకపోవడానికి కారణం మాత్రం తెలియదు. ఇండియన్ నైటింగల్ పాడిన తెలుగు పాటల్లో ఒకటి 1955లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన 'సంతానం' చిత్రంలోనిది. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించిన 'నిదురపోరా తమ్ముడా' పాట లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో సీనియర్ నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన 'దొరికితే దొంగలు' సినిమాలోది. ఇందులో 'శ్రీ వెంకటేశా' అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్. ఈ పాటను సాలూరి రాజేశ్వర రావు కంపోజ్ చేశారు. ఇక తెలుగులో లతా మంగేష్కర్ పాడిన మూడో పాట చివరి పాట 'తెల్ల చీరకు' అనే సాంగ్. ఈ పాట కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన 'ఆఖరి పోరాటం' చిత్రంలోనిది. 1988లో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించగా, దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతా మంగేష్కర్. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. 'లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Deeply anguished to know that Lata Mangeshkar ji is no more with us. Her melodious voice will continue to echo for eternity. May her soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 6, 2022 గవర్నర్ సంతాపం ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. 'తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నా' అని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చదవండి: (గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత) -
లతా మంగేష్కర్కు ప్రముఖుల నివాళులు
ఎవరి పేరు చెప్తే కోకిల సైతం గర్వంగా తలెత్తి చూస్తుందో ఆమె గొంతు మూగబోయింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అన్ని రంగాల సెలబ్రిటీలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొంటున్నారు. 'మాటల్లో చెప్పలేనంత వేదనలో ఉన్నాను. లతా దీదీ మనందరినీ వదిలి వెళ్లిపోయారు. రాబోయే తరాలు ఆమెను గుర్తుపెట్టుకుంటాయి. లతాజీ మరణం ఎంతగానో బాధించింది, ఆమె లేని లోటు పూడ్చలేదనిది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంతమగ్ధులను చేసింది. ఆమె ఎనలేని అసమాన సామర్థ్యం కలిగి ఉంది. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మరువలేనిది' అని ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్లో నివాళులు అర్పించారు. I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO — Narendra Modi (@narendramodi) February 6, 2022 Lata Didi’s songs brought out a variety of emotions. She closely witnessed the transitions of the Indian film world for decades. Beyond films, she was always passionate about India’s growth. She always wanted to see a strong and developed India. pic.twitter.com/N0chZbBcX6 — Narendra Modi (@narendramodi) February 6, 2022 'దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల, భారత రత్న గ్రహీత లతా మంగేష్కర్గారి మృతి బాధాకరం. ఆమె మృతి దేశానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు హృదయపూర్వక నివాళులు అరిస్తున్నాను. ఆమె 30 వేలకు పైగా పాటలు పాడింది. సంగీత ప్రియులందరికీ ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దేశప్రజలందరితో పాటు నాకూ లతాజీ పాటలంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆమె పాటలు వింటూ ఉంటాను' అని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. लता दीदी प्रखर देशभक्त थी। स्वातंत्र्यवीर सावरकर जी की विचारधारा पर उनकी हमेशा ही दृढ़ श्रद्धा रही है। उनका जीवन अनेक उपलब्धियों से भरा रहा है। लता जी हमेशा ही अच्छे कामों के लिए हम सभी को प्रेरणा देती रही हैं। भारतीय संगीत में उनका योगदान अतुलनीय है। — Nitin Gadkari (@nitin_gadkari) February 6, 2022 'లతా మంగేష్కర్ మరణవార్త ఎంతగానో బాధిస్తోంది. ఆమె రాబోయే తరాలకు విలువైన పాటల వారసత్వాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని బోనీ కపూర్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. Deeply saddened by the news of @mangeshkarlata Ji’s passing away. She leaves behind a huge legacy of songs which will be treasured for generations to come.May her soul rest in peace. Condolences to the family. #NightingaleofIndia #LataMangeshkar pic.twitter.com/svW9iZsQb4 — Boney Kapoor (@BoneyKapoor) February 6, 2022 There will be always only one Nightingale of India #LataMangeshkar ! Rest in Peace Lata Ji. pic.twitter.com/TDPescIdNw — Yo Yo Honey Singh (@asliyoyo) February 6, 2022 I am extremely saddened by the demise of Lata Mangeshkar Ji, the Nightingale of Indian Cinema and legendary singer. India has lost its voice in the death of Lata ji, who has enthralled music lovers in India & across the globe with her mellifluous & sublime voice for many decades. pic.twitter.com/C9m3PfexyP — Vice President of India (@VPSecretariat) February 6, 2022 जगभरातील कोट्यवधी संगीतप्रेमींच्या कानांना तृप्त करणारे अलौकिक स्वर आज हरपले. लतादीदींच्या आवाजाच्या परीसस्पर्शाने अजरामर झालेल्या गीतांच्या माध्यमातून हा स्वर आता अनंतकाळ आपल्या मनांमध्ये गुंजन करत राहील. गानसम्राज्ञी लता मंगेशकर यांना भावपूर्ण श्रद्धांजली! pic.twitter.com/U9Nhn1KrpE — Sharad Pawar (@PawarSpeaks) February 6, 2022 Short of words and will always be while saying anything about this LEGEND 💔 Learning to sing early on in my childhood, I was always told to follow your path by my father. I am blessed and honoured to have shared my birthday with you 🙏🏻❤️ OM SHANTI 🙏🏻 #LataMangeshkar pic.twitter.com/PbtKmSE2dN — Munmun Dutta (@moonstar4u) February 6, 2022 युग संपले... pic.twitter.com/prMUOK74oW — Sanjay Raut (@rautsanjay61) February 6, 2022 A very sad day and a huge loss for all of us, her fans. Your contribution will live on forever ma’am. My condolences to the family and all her fans across the world. Om Shanti 🙏 #LataMangeshkar pic.twitter.com/lEp50LL8CH — bhumi pednekar (@bhumipednekar) February 6, 2022 A huge loss to the nation... Our nightingale is no more! My heartfelt condolences to Lata Ji's family and near ones. #RestInPeace #LataMangeshkar 💔 pic.twitter.com/52Kc005emu — adaa khan (@adaa1nonly) February 6, 2022 The end of an era as the nightingale falls silent. Rest In Peace. 💐#LataMangeshkar pic.twitter.com/F8LtGm93Z7 — Nivin Pauly (@NivinOfficial) February 6, 2022 Deeply saddened to know about the passing away of legendary singer Bharat Ratna #LataMangeshkar ji. She was the melodious voice of India, who dedicated her life to enriching Indian music in her more than 7 decades long rich contribution. pic.twitter.com/oIXyl55Xl5 — Ashok Gehlot (@ashokgehlot51) February 6, 2022 Death of Lata Mangeshkar is end of a #goldenera of Indian music, which ruled the world. She was very good human being and world-class singer. She will always live with us through her music. My homage. Om Shanthi. #LataMangeshkar pic.twitter.com/zCtss5EP0m — Prakash Javadekar (@PrakashJavdekar) February 6, 2022 So sad to hear that Lataji is no more, going to miss her so much.End of an Era!Lataji,Nightingale of India,whose voice hs made generations sing,dance & cry wil forever feed our emotion.Heartfelt condolences to Ashaji,family & friends.Nation wil miss her. Om Shanti#LataMangeshkar pic.twitter.com/eIOUxydQYm — Sunny Deol (@iamsunnydeol) February 6, 2022 Legends remain immortal.. #RIP #LataMangeshkar thank you for the songs🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/RWyZqT5vM1 — TheFarahKhan (@TheFarahKhan) February 6, 2022 -
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
-
ఇండియన్ నైటింగేల్ సినీ ప్రస్థానం.. ఆమె ఫేవరెట్ సింగర్ ఎవరంటే ?
Nightingale of India Lata Mangeshkar reign of cinema: ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. అప్పుడే కోలుకొని అప్పుడే విజృంభించిన కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. 13 ఏళ్లకే కేరీర్ ఆరంభం.. ఇండియన్ నైటింగేల్గా పేరొందిన లతా మంగేష్కర్ తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఆమె 7 దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఆలపించారు. అందులో 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. 'పద్మ భూషణ్', 'పద్మ విభూషణ్', 'దాదా సాహెబ్ ఫాల్కే', 'బహుళ జాతీయ చలనచిత్ర' అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అవార్డును పొందారు లతా మంగేష్కర్. ఐదేళ్లకే సంగీత శిక్షణ.. లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, 1929న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు. లతా మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. పెద్ద కుమార్తెగా కుటుంబ పోషణ బాధ్యత లతా మంగేష్కర్కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం 'పహ్లా మంగళ గౌర్'లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్కు నచ్చిన గాయకుడు కె. ఎల్. సైగల్ అని తెలిపారు. -
గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం తెలుగులో 1955 లో ఏఎన్నార్ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు. గానమే పరమావధిగా.. 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. ఆ తరువాత పలు చిత్రల్లో నటించారు కూడా. గిన్నిస్ బుక్లోకి.. 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా లత ప్రస్థానంమొదలైంది. మహల్తో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె జనం గుండెల్లో లెజెండరీ సింగర్గా చెరగని ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు సంగీత సారధ్యం వహించారు లతా. సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా. 1948- 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి చేసినవిశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది . అలాగే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. -
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం!
ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరారు. డాక్టర్ ప్రతీత్ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు. 2019 నవంబర్లో లతా మంగేష్కర్కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
మళ్లీ విషమంగా సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి..
నైటింగెల్ ఆఫ్ ఇండియా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సంధాని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఏఎన్ఐ ప్రకారం 'వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని డాక్టర్ ప్రతీత్ సంధాని పేర్కొన్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్కు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ కాగా జనవరి 11న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్ కోవిడ్ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా కోలుకున్నట్లు వివరించారు. Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital (file photo) pic.twitter.com/U7nfRk0WnM — ANI (@ANI) February 5, 2022 -
కోవిడ్ను జయించిన 92 ఏళ్ల లతా మంగేష్కర్.. కానీ!
Lata Mangeshkar Latest Health Update: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ తాజాగా కోవిడ్ను జయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, రెండు రోజుల క్రితమే వెంటిలేటర్ కూడా తీసేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూమోనియా నుంచి కూడా లతాజీ కోలుకున్నట్లు వివరించారు. అయితే మరికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే వైద్యుల బృందం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I spoke with Dr Pratit Samdani who is treating singer Lata Mangeshkar. She's recovering, was on a ventilator for some days, but is better now. She is no more on ventilator. Only oxygen is being given to her. She is responding to the treatment: Maharashtra Minister Rajesh Tope pic.twitter.com/qOSP2H9OLl — ANI (@ANI) January 30, 2022 -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్: వెంటిలేటర్ తీసేసినా..
Lata Mangeshkar Latest Helath Update: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది. ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కాసేపు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతాజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/xDxD43SHsw — Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022 -
లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదన దానం చేసిన అభిమాని
లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పైగా ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుంచే అభిమానులు ఆమెకు అన్ని విధాలుగా మద్దతునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేశాడు. ఈ మేరకు లతా మంగేష్కర్ గత 10 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్కి పెద్ద అభిమాని. అంతేకాదు లతామంగేష్కర్ను అతను సరస్వతి దేవి రూపంగా కూడా భావిస్తాడు. పైగా అతను తన ఆటోను లతామంగేష్కర్ చిత్రాలతో అలంకరించాడు. ఈ మేరకు సత్యవాన్ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలుసుకున్నప్పటి నుంచి నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాని చెప్పాడు. (చదవండి: 'ప్రైవసీ ఇవ్వండి.. దీదీ ఇంకా ఐసీయూలోనే') -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వివరించిన మంత్రి
Lata Mangeshkar Health Is Improving Says Maharashtra Health Minister: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఇదీ చదవండి: లతాజీ గొంతు బావుండదు.. -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్, స్వల్పంగా కోలుకున్న ఇండియన్ నైటింగల్
Lata Mangeshkar Latest Health Bulletin Released: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు వైద్యులు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వల్పంగా కోలుకున్నారని లతా మంగేష్కర్కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పష్టం చేశారు. కాగా 92 ఏళ్ల లతా మంగేష్కర్ గత రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. -
ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసుల మూసివేత
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో కరోనా పడగ విప్పడంతో ప్రైవేటు కార్యాలయాన్ని మూసివేశారు. అత్యవసర ఆఫీసులు మినహాయించి అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబ్బంది అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 23 శాతం దాటింది. దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64% ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల విజృంభణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ పరిస్థితులని సమీక్షించడానికి గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో ఈసారి మకర సంక్రాంతికి గంగానది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. లతా మంగేష్కర్కు కరోనా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్కు (92) కరోనా సోకింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బంధువులు చెప్పారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ లత‡ వయసును (92 ఏళ్లు) దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు మాకు సూచించారు’ అని ఆమె మేనకోడలు రచన చెప్పారు. లత కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా రచన తెలిపారు. లత కరోనా మొదటి వేవ్లోనూ వైరస్ బారినపడి కోలుకున్నారు. -
మెలోడీ క్వీన్, లెజెండ్రీ సింగర్స్, ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు మెలోడీ క్వీన్ పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా.. మీర జాలగలడా నా ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా, ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని రేడియోలో పాట ప్రసారం కాని లేని దీపావళి లేదు. ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి. లతాజీతో గురుబంధం తనకు ఇష్టమైన గాయని లతా మంగేష్కర్ అని స్వయంగా సుశీలమ్మ గారే చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్ ఇండియా లతా మంగేష్కర్ అని కూడా పిలుచుకుంటారట. వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా 1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్. సుశీలమ్మ బయోపిక్, ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏఆర్రహమాన్ ఇటీవల వెల్లడించారు. తొలి ప్రొడక్షన్ , క్లాసిక్ మూవీ ‘‘99 సాంగ్స్’’ ప్రమోషన్లో భాగంగా సుశీల తన బయోపిక్ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన అనంతరం దీనఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్బ్యాక్పై ఈఏడాది మేలో ట్విటర్ స్పేస్ సెషన్లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్ఫ్లిక్స్లో ఉన్న 99 సాంగ్స్ చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా చూసిన సుశీలమ్మ సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్ సింగర్ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో తమ అభిమాన గాయని బయోపిక్పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జానకికి తొలి అవార్డు జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్ పీ బాలూకి, మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ సుశీలమ్మగారి సోదరుడి కోసం వచ్చిన మోహన్రావు గారు సుశీలమ్మను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో ఆశ్చర్యమేముంది. అలా ఆ తరువాత భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్ రహమాన్తో కలసి అరంగేట్రం చేశారామె. అలా రెహామాన్కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. -
లతాజీ గొంతు బావుండదు..
‘బందర్ క్యా జానే అద్రక్ కా స్వాద్’ అంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నామ్ సమీ ట్వీట్ చేశారు. ఈ వాక్యానికి ఇంచుమించు ‘గాడిదకేం తెలుసు గంధపు వాసన’ అనే అర్థం వస్తుంది. ఇంతకూ కారణం కావేరీ అనే అమ్మాయి లతాజీ మీద చేసిన ట్వీట్. ‘‘ఆమె ఉమ్రావ్జాన్ సినిమాలో పాడనందుకు చాలా సంతోషంగా ఉంది. పాకీజా చిత్రం వరకు బాగానే పాడారు. అందుకే అప్పటి పాటల గురించి నేను పట్టించుకోలేదు. ఈ కామెంట్కు 6.8 వేల లైక్లు, 1.5 డిస్లైక్లు వచ్చాయి. ఆమె చేసిన ట్వీట్కి సమాధానంగా చాలా ట్వీట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెట్టడం, విమర్శించటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ‘లతా ఒంటి చేత్తో చాలామంది సింగర్ల కెరీర్ను నాశనం చేశారు. అందులో అనురాధా పొడ్వాల్ కూడా ఉన్నారు’ అంటూ మరొకరు స్పందించారు. ‘లతా మంగేష్కర్ గొంతు అద్భుతంగా ఉందంటూ భారతీయులకు బ్రెయిన్ వాష్ చేసేశారు’ అంటూ కావేరి మరో ట్వీట్ చేశారు. కొందరు ఆమె ట్వీట్కు అనుకూలంగా స్పందిస్తే, మరి కొందరు ఆమె ట్వీట్ను నిరసించారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ, బాలీవుడ్ రచయిత వివేక్ అగ్నిహోత్రి మాత్రం కావేరీ మాటలను తోసి పుచ్చుతూ ఆమెను కోతిని చేశారు. ఈ అపవాదాలను తెలుగు పరిశ్రమలో ఘంటసాల, పి.సుశీల, బాలు కూడా తప్పించుకోలేకపోయారు. (చదవండి: సోనుసూద్ టైలర్ షాప్.. ప్యాంట్ కాస్త నిక్కర్ కావొచ్చు) -
బాలూ–లతా కాంబినేషన్ సూపర్హిట్
కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అతను తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. లతా మంగేష్కర్ పక్కన పాడి హిట్టయిన దక్షణాది గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. వారి మధ్య అనుబంధం, వారి పాటలు, బాలూ చనిపోయాక ఆయన గురించి లతా చెప్పిన విశేషాలు లతా జన్మదినం సందర్భంగా... లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ఆమెను ఉర్దూ నేర్చుకోమన్నారు. తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఉర్దూ భాష తెలిసినవారు కూడా ఒక్కోసారి ‘జరూరీ’ (jaroori)అంటారు. కాని బాలూ పాడితే సరైన ఉచ్ఛారణతో zaroori అంటాడు. ఉర్దూ పదాలు ‘ఖైర్’, ‘ఖయాల్’, ‘సమజ్దార్’ వంటివి కూడా వాటి సరైన ఉచ్ఛారణతో బాలూ పాడటం సంగీతాభిమానులకు తెలుసు. అందుకే ఆయన లతా మంగేష్కర్కు ఇష్టమైన గాయకుడయ్యారు. గొప్పపాటలు పాడగలిగారు. నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ‘ఏక్ దూజే కే లియే’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంటున్న బాలు లతా మంగేష్కర్కు అందరు గాయకులతో పాడటం అంత సౌకర్యంగా ఉండదు. ఆమె గోల్డెన్ పిరియడ్ అంతా రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండ గాయకులతో గడిచింది. ఆమె తెలుగులో ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కాని బాల సుబ్రహ్మణ్యం అదృష్టం వేరు. బాలూ–లతా కాంబినేషన్ సూపర్హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కాని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారు. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్లకు తప్పలేదు. కాని ఆశ్చర్యకరంగా బాలూతో పని చేయడం మొదలెట్టాక వారు ఆయన మోహంలో పడిపోయారు. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు. లతా మంగేశ్కర్ కూడా ‘బాలూ ఒక ప్రత్యేక గాయకుడు’ అని మెచ్చుకున్నారు. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హటాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’ అన్నారు లతా బాలూ మరణవార్త విని. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్గా నిలిచింది. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్గా నిలిపాయి. ‘ఈ సినిమాలో పాట రికార్డింగ్ కోసం లతా పాడుతూ ‘హమ్ ఆప్ కే హై కౌన్’ అనగానే నేను తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని అనేవాణ్ణి. ఆమె పాడటం ఆపేసి– చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’ అని ముద్దుగా కోప్పడేవారు’ అని బాలూ ఒక సందర్భంలో చెప్పారు. ‘బాలూని నేను చాలాసార్లు రికార్డింగ్ థియేటర్లలోనే కలిశాను. కాని ఒకటి రెండుసార్లు ఆయన మా ఇంటికి వచ్చి నాకు బహుమతులు తెచ్చారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఆయనను నేను బాలాజీ అని పిలిచేదాన్ని’ అని లతా అన్నారు. లతా చనిపోయారనే పుకార్లు ఇటీవల వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ బాలూ వీడియో విడుదల చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణవార్త లతా వినాల్సి వచ్చింది. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతా చాలా కంగారు పడటం గురించి బాలూ చెప్పుకునేవారు. హైదరాబాద్లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు లతాకు మిగిలిన బరువైన గుర్తులు. లేదా మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ -
లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్
ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్ నివాసాన్ని బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు శనివారం సీల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ముంబైలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. అందులోనూ వైరస్ యుక్త వయసు వారికన్నా కూడా వృద్ధులకు ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న ప్రభకుంజ్లో వయో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో ఆ భవనాన్ని సీల్ చేశారు. కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు) ఈ విషయంపై గాయని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. "భవనాన్ని సీల్ చేసిన విషయాన్ని అధికారులు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేమంతా క్షేమంగా ఉన్నాం. ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం అంతా సురక్షితంగా ఉంది అని చెప్పుకొచ్చారు". కాగా ఇప్పటికే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అమితాబ్ భవనాన్ని కూడా కొద్దిరోజులపాటు అధికారులు సీల్ చేశారు. (చదవండి: ‘ఇండియా నైటింగేల్ను కోల్పోయామా?’) -
భారత నారీమణుల ఆశీర్వాదం దేశానికి బలం
న్యూఢిల్లీ: ‘ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్ సందేశాలు పంపారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, మోదీతో కలిసి దిగిన ఫొటోలను, తన ఆడియో సందేశాన్ని 90 ఏళ్ల లతా మంగేష్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ పైవిధంగా ట్విట్టర్లో స్పందించారు. -
‘ఇండియా నైటింగేల్ను కోల్పోయామా?’
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యం గురించి వస్తున్న వదంతులపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. లతాజీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె కోలుకుంటున్నారని శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లతా ఇకలేరు అంటూ వస్తున్న వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వదంతులు ప్రచారం చేసి లతాజీ అభిమానులను, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో లతా మంగేష్కర్ సోమవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. ఈ క్రమంలో లతా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. అయితే ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు శోభా డే చేసిన ట్వీట్ లతా అభిమానులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘ ఇది నిజం కాదని చెప్పండి. ఇండియా తన నైటింగేల్ను కోల్పోయిందా’అని ఆమె ట్విటర్లో పేర్కొనడం కలకలం రేపింది. శోభా డే తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో విమర్శలపై స్పందించిన శోభా డే... ‘ ఇప్పుడే లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. దేవుడి దయ వల్ల మన ప్రియమైన నైటింగేల్ ఆరోగ్యంగానే ఉన్నారట అని మరో ట్వీట్ చేశారు. ఇక దిగ్గజ గాయనిగా పేరొందిన మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం గాత్ర దానం చేశారు. సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా... 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఆమెను వరించాయి. Just spoke to the family . By God's grace, our precious nightingale is fine.@mangeshkarlata — Shobhaa De (@DeShobhaa) November 16, 2019 -
కోలుకున్న లతా మంగేష్కర్
ముంబై: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని భావించినట్లు తెలిపారు. మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో వేలాది పాటలు పాడారు. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం పనిచేశారు. 1989లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు. -
ఆ మహిళలకు సెల్యూట్ చేద్దాం!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి, దేశం గర్వించేలా చేసిన మహిళలకు సముచిత గౌరవం, ప్రచారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఆ భరతమాత బిడ్డల విజయాలను గుర్తించి, ప్రశంసించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం కార్యక్రమం మన్ కీ బాత్లో ప్రధాని ఈ రోజు పలు అంశాలను పంచుకున్నారు. జాగింగ్ చేస్తున్న సమయంలో దార్లోని చెత్తను ఏరివేసే ప్లాగింగ్(జాగింగ్ ప్లస్ పికింగ్ అప్ లిటర్)ను ఉద్యమ స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రచారం కల్పిస్తున్న రిపుదమన్ బెల్వీని మోదీ ప్రశంసించారు. విదేశాల్లో ప్లాగింగ్ సాధారణమే కానీ భారత్లో బెల్వీ దీనికి ప్రాచుర్యం కల్పించారని మోదీ తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని అడ్డుకునే కార్యక్రమాన్ని అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేరోజు ‘ఫిట్ ఇండియా ప్లాగింగ్ రన్’ను క్రీడాశాఖ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని, అందువల్ల ఈ – సిగరెట్ల వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యువతను కోరారు. ఈ – సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం కాదన్న దురభిప్రాయం ఉందని, అయితే, అది సరి కాదని, ఈ – సిగరెట్లు కూడా సాధారణ పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే హానికరమని వివరించారు. ఈ కొత్త తరహా వ్యసనం బారిన యువత పడకూడదనే ఈ– సిగరెట్లను నిషేధించామన్నారు. అలాగే, సెప్టెంబర్ 28న జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖ గాయని లత మంగేష్కర్కు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఫోన్కాల్ వివరాలను మోదీ తెలియజేశారు. దీపావళి సందర్భంగా మిఠాయిలు, బహుమతులను పేదలతో పంచుకోవాలని కోరారు. మహిళా విజేతలను గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత్కీలక్ష్మి’ హ్యాష్ట్యాగ్తో సోషల్మీడియాలో వారి గురించి ప్రచారం చేయాలన్నారు. ‘ఈ పండుగ సమయంలో బహుమతులు, మిఠాయిలు తీసుకోవడమే కాకుండా పంచుకోవడాన్ని ప్రారంభిద్దాం. మనకు పనికిరాని వస్తువులను అవసరమైన పేదలకు ఇద్దాం’ అని కోరారు. ఇటీవలి యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ నదాల్ చేతిలో ఓటమి పాలైన రష్యా టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్ చూపిన క్రీడా స్ఫూర్తిని మోదీ కొనియాడారు. లతకు శుభాకాంక్షలు.. అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని మోదీ లతా మంగేష్కర్కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతను తన సోదరిగా భావిస్తానన్నారు. ఆమెలోని నిరాడంబరత ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘మీ బర్త్డే రోజు నేను విమాన ప్రయాణంలో ఉండొచ్చు. అందువల్ల ముందే మీకు శుభాకాంక్షలు చెబుతున్నా. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అని మోదీ కోరారు. అందుకు ప్రతిగా, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లత.. దేశానికి ఎంతో సేవ చేసిన మీ ఆశీస్సులే తనకు కావాలంటూ ప్రధానికి సమాధానమిచ్చారు. దానికి, ‘మీరు, వయసులోను, దేశానికి చేసిన సేవలోను ఎంతో పై ఎత్తున ఉన్నారు. మీ ఆశీస్సులే మాకు కావాలి’ అని మోదీ జవాబిచ్చారు. ‘ఈ సారి ముంబై వచ్చి నప్పుడు మీ ఇంటికి వచ్చి గుజరాతీ వంటకాలను ఆస్వాదిస్తా’ అని లతా మంగేష్కర్కు ప్రధాని చెప్పారు. లతా మంగేష్కర్ తల్లిగారైన శేవంతి మంగేష్కర్ గుజరాత్కు చెందినవారే. -
మోదీకి లతా మంగేష్కర్ ధన్యవాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దిగ్గజ గాయని లతా మంగేష్కర్కు 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం లతా మంగేష్కర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తగా ఒకరోజు ఆలస్యంగా ప్రధాని మోదీ నుంచి ఆమె శుభాకాంక్షలు అందుకున్నారు. తాను ఏడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరేముందు ఆమెకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆరోగ్యకర జీవితం గడుపుతూ ఆహ్లాదంగా ఉండాలని, తమను దీవించాలని ఆకాంక్షించారు. గాయని లతాజీ మనందరి కంటే వయసులో పెద్దవారని, దేశంలో భిన్న దశలను వారు చూశారని, వారిని అందరూ దీదీగా గౌరవిస్తారని పేర్కొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి లతా మంగేష్కర్ ధన్యవాదాలు తెలిపారు. మీ రాకతో దేశ ముఖచిత్రం మారిన విషయం తనకు తెలుసని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె బదులిచ్చారు. కాగా లతాజీ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచన్ నుంచి ధర్మేంద్ర, హేమమాలిని, శ్రేయా ఘోషల్ వంటి ఎందరో నటులు, సెలబ్రిటీలు ఆమెకు ట్విటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. -
లత విమర్శించినా.. రాణు మాత్రం..!
రాణు మొండాల్.. రైల్వే స్టేషన్లో యాచకురాలి నుంచి ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధురాలైన సింగర్ ఆమె. రైల్వే స్టేషన్లో ఆమె పాడిన పాట ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. ఓవర్నైట్ ఆమె స్టార్ సింగర్గా మారిపోయారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రెష్మియా కూడా ఆమెకు అవకాశమిచ్చారు. ఆమె పాడిన పాటలు సంగీత ప్రియుల మదిని దోచుకుంటున్నాయి. కానీ, ఒక్కసారిగా తెరమీదకు వచ్చి పాపులర్ అయిన రాణు మొండాల్ను ఉద్దేశించి ప్రఖ్యాత సింగర్ లతా మంగేష్కర్ స్పందిస్తూ.. పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకరి పాటను ఇమిటేట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందవచ్చేమో కానీ, అది కళ కాబోదని పేర్కొన్నారు. రాణు ఇమిటేట్ చేయడం మానుకొని.. ఒరిజినల్గాఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. లత పాడిన ‘ఏక్ ప్యార్కి నగ్మా హై’ పాటను బెంగాల్లోని ఓ రైల్వే స్టేషన్లో రాణు హృద్యంగా ఆలాపించడం ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. లత విమర్శలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక లెజెండ్ సింగర్ అయిన లత రాణు విషయంలో కొంత ఉదారంగా ఉండాల్సిందని, ఆమె పెద్ద హృదయాన్ని చాటుకోలేకపోయారని పలువురు ఆవేదన చెందారు. కానీ, రాణు మాత్రం లత విమర్శల పట్ల ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా లత తన కంటే సీనియర్ అని, చిన్నప్పటి నుంచి ఆమె పాటలు వింటూ పెరిగానని, ఎప్పుడూ ఆమెకు జూనియర్గానే ఉంటానని ఆమె పట్ల కృతజ్ఞతలు చాటుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాణు చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నాయి. చదవండి: కూతురి పట్ల విమర్శలపై రాణు స్పందన -
‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’
లక్నో: అభిమానుల గురించి తెలుసు.. వీరాభిమానుల గురించి తెలుసు.. కానీ ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి వీరందరిని మించిన వాడు. ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మీద అభిమానంతో తన ఇంటిని మ్యూజియంలా మార్చడమే కాక.. ఏకంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ డై హార్డ్ ఫ్యాన్ కథేంటో చూడండి.. సాధారణంగానే లతా మంగేష్కర్కు అభిమానుల సంఖ్య ఎక్కువ. కానీ మీరట్కు చెందిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి లతాజీ గాత్రానికే కాక ఆమె జీవితంలో పడిన కష్టానికి కూడా అభిమాని అయిపోయాడు. లతా మంగేష్కర్ పాడిన ప్రతి పాటను కలెక్ట్ చేశాడు. కేవలం పాటలు మాత్రమే కాక దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కూడా సేకరించాడు. లతాజీ పేరు మీద ఉన్న ప్రతి దాన్ని సేకరించి తన ఇంటిని నింపేశాడు. మొత్తంగా తన ఇంటిని చిన్న సైజు లతా మంగేష్కర్ మ్యూజియంగా మార్చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. లతా మంగేష్కర్ మీద ఉన్న అభిమానంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని గురించి గౌరవ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి లతాజీ పాటలు అంటే పడి చచ్చేవాడిని. నాతో పాటు ఆమె మీద నా అభిమానం కూడా పెరిగి పెద్దవసాగింది. నా జీవితం అంతా ఆమెని ఆరాధించడానికే సరిపోతుంది. ఆమె నా గురువు, దైవం. నేను ఆమెకు శిష్యుడిని, భక్తుడిని. ఇక వేరే స్త్రీకి నా హృదయంలో, జీవితంలో చోటు లేదు’ అని తెలిపారు. లతా జీకి సంబంధించిన పాటలు, పుస్తకాలు, వస్తువులు మాత్రమే కాదు ఆఖరికి ఆమె చేసిన ట్వీట్లను కూడా కలెక్ట్ చేశాడు గౌరవ్. -
ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!
సోషల్ మీడియా సెన్సేషనల్ గాయని రణు మొండల్ ఉదంతంపై ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ స్పందించారు. మొండల్ గాన ప్రతిభపై ఒక ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన పాట ద్వారా, తన పేరు ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందితే తనకు సంతోషమే.. కానీ గాయకులకు తమకంటూ సొంత ప్రతిభ ఉండాలని లత సూచించారు. కాపీ కొట్టడం ద్వారా స్వల్పకాలిక ప్రయోజనమే తప్ప, దీర్థకాలిక ప్రయోజనాన్ని పొందలేరని అభిప్రాయపడ్డారు. తమకంటూ ఒక ప్రత్యేక శైలిని, ప్రతిభను సాధించాల న్నారు. ఉదాహరణకు తన సోదరి ఆశా భోంస్లే తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకుని ఉండి ఉండకపోతే..ఆమె కూడా మరుగున పడిపోయేదంటూ ఉదహరించారు. ఒకర్ని అనుకరించడం ద్వారా లభించిన పేరు ప్రఖ్యాతులు ఎంతోకాలం నిలవవని, అలాగే ఒకరిమీద ఆధారపడడం కూడా అంత మంచిదికాదని లతా మంగేష్కర్ తెలిపారు. కిషోర్ కుమార్, మొహ్మద్ రఫీ, ముఖేష్ భయ్యా, ఆశా భోంస్లే లాంటి ప్రముఖ గాయనీ గాయకుల పాటలను పాడటం ద్వారా స్వల్ప కాలికంగా అందరి దృష్టిని ఆకర్షించగలం ..అయితే అది ఎక్కువ కాలం ఉండదని ఆమె పేర్కొన్నారు. చాలామంది ప్రతిభావంతులైన పిల్లలు, యువతీయువకులు టీవీలో ప్రసారమయ్యే మ్యూజిక్ షోలలో తమ పాటలు పాడతారు, కానీ కొంతకాలం తర్వాత లేదా విజయం సాధించిన తర్వాత వారికి గుర్తుండదు. ప్రతిభావంతులైన, ఔ త్సాహిక గాయకులందరూ సొంత నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని, తద్వారా సొంత గుర్తింపును సాధించాలంటూ ఈ సందర్భంగా లతాదీ సలహా ఇచ్చారు. లెజెండ్రీ సింగర్స్ పాటలను పాడే అవకాశం వారికెపుడూ వుంటుంది. కానీ సొంత గుర్తింపు ముఖ్యం, అదే నిత్యం అని లతా స్పష్టం చేశారు. ఈ క్రమంలో పరిశ్రమలో నిలదొక్కుకున్న, తనకు తెలిసిన గాయకులు శ్రేయా ఘోసల్, సునిధి చౌహాన్ అని ఆమె ప్రశంసించారు. కాగా లతా మంగేష్కర్ ఆలపించిన బాలీవుడ్ పాట ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాటతో రణు మొండల్ వెలుగులోకి వచ్చారు. మనోహరమైన ఆమె గాత్రానికి నెటిజన్లు ఫిదా అయి పోయారు. అంతేకాదు బాలీవుడ్ గాయకుడు హిమేష్ రేష్మియా ఆమెకు మంచి అవకాశాన్నిచ్చారు. ఇది కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అటు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ దబాంగ్ 3 చిత్రంలో పాడే అవకాశాన్నికల్పించారు. ఇది ఇలావుంటే.. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా.. సల్మాన్ ఖాన్ రణు మొండల్కు రూ.55 లక్షల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని, రణు మొండల్ని లతా మంగేష్కర్ ప్రశంసలతో ముంచెత్తారంటూ ఫేక్ న్యూస్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : ఆమె మొదటి భర్త కూతురిని; గర్వపడుతున్నా! రైల్వే స్టేషన్లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..! -
ఆమె.. లేటెస్ట్ ఫేస్బుక్ సెన్సేషన్!
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిభకు కొదవ లేదు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఎంతో ప్రతిభ గల వ్యక్తులు తారసపడతారు. సాదాసీదా జీవితం గడుపుతూనే తమ అద్భుతమైన టాలెంట్తో అబ్బురపరుస్తుంటారు. తాజాగా అలాంటి ప్రతిభావంతురాలైన మహిళ వెలుగులోకి వచ్చారు. ఓ రైల్వే స్టేషన్లో పనిచేసుకుంటూ.. పొట్టపోసుకుంటున్న ఆమె తన గానంతో ఎందరో హృదయాలను హత్తుకుంటున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పాడిన అలనాటి క్లాసిక్ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాలను పరశింపజేస్తున్నారు. ‘బర్పెటా టౌన్ ద ప్లేస్ ఆఫ్ పీస్’ అనే ఫేస్బుక్ పేజీ ఆమె గానాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది. పశ్చిమ బెంగాల్లోని రణఘాట్ రైల్వే స్టేషన్లో ఉన్న ఆమె.. ‘ఏక్ ప్యార్కి నగ్మా’ అనే పాటను ఆలాపిస్తున్న వీడియోను ఆ పేజీ పోస్టు చేసింది. రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె గానాన్ని, ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయులు అవుతున్నారు. గాంధర్వ గానమంటే ఇదే అయి ఉంటుందని, అచ్చం లత మంగేష్కర్ సుతిమెత్తగా పాట పాడుతుందా? అన్నంత మాధుర్యం ఆమె గొంతులో ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె గానంలో ఓలలాడుతూ ఆనందపారవశ్యులవుతున్నట్టు పేర్కొంటున్నారు. జూలై 28న పోస్ట్ చేసిన ఆమె సింగింగ్ వీడియోను ఇప్పటికే 16లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 35వేల మంది ఆమె వీడియోను షేర్ చేసుకున్నారు. ఆమె పాట సూపర్ హిట్ కావడంతో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో లతా మంగేష్కర్ క్లాసికల్ పాటను ఆమె మధురంగా ఆలపించారు. -
‘ధోని.. రిటైర్మెంట్ ఆలోచన మానుకొండి’
వరల్డ్కప్ సెమీస్లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్లోనే భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ స్పందించారు. ధోని రిటైర్మెంట్ ఆలోచనను మానుకోవాలంటూ ట్విటర్ వేదికగా కోరారు. ‘ధోని జీ. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు అభిమానులు భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ట్వీట్ను 14 వేల మంది లైక్ చేయగా.. 700 మంది రీట్వీట్ చేశారు. ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye.@msdhoni — Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019 -
ఆఖరి పాట
గత రెండు వారాలుగా లతామంగేష్కర్కి సంబంధించిన ఒక అసత్య వార్త వాట్సాప్లో మనోవేగంతో ప్రయాణిస్తోంది. లతామంగేష్కర్ తొంభయ్యవ సంవత్సరంలోకి అడుగుపెట్టారని, ఆఖరి పాటను రికార్డు చేస్తున్నారన్నది ఒక వార్త కాగా.. ఇప్పటికే ఆ చివరి పాట చాలాచోట్ల వినిపిస్తోందని మరో వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ బయటికి వచ్చిన పాట ‘తాను ఇంక విశ్రాంతి తీసుకుంటాను’ అనే అర్థంలో ఉందనీ అంటున్నారు. దీంతో లతా అభిమానులు, ఆరాధకులు ఏకధాటిగా రోదించడం, గుండెలు బాదుకోవడం ప్రారంభించారు. ‘సంగీత స్వర్ణ యుగం ముగిసిపోతోంది’ అంటూ బరువెక్కిన గుండెలతో సందేశాలు కూడా పంపడం మొదలుపెట్టారు. లతామంగేష్కర్ ఇంకా తొంభయ్యవ వసంతంలోకి అడుగుపెట్టలేదు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబరు మాసంలో ఆవిడ తొంభైలోకి వస్తారని, ‘ఆఖరి పాట’గా వినిపిస్తున్న పాట ఇటీవల రికార్డు అయినది కాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. వారిలో ఒకరైన పవన్ ఝా అనే జైపూర్ సంగీత విద్వాంసుడు, తన ఫేస్బుక్ పేజ్లో ఇందుకు సంబంధించిన విషయం పోస్టు చేశారు. నవంబరు చివరి వారంలో లతకు సంబంధించిన అనేక అసత్య సందేశాలు తనకు కూడా వచ్చాయని, ఆఖరి పాట అని చెబుతున్న ‘క్షణ అమృతాచే’ అనే మరాఠీ ఆల్బమ్ కోసం 2013లో రికార్డు చేశారని ఆయన పోస్టు పెట్టారు. ఆ తర్వాతి ఏడాది ఎ.ఆర్.రెహమాన్ చేసిన ‘రౌనాక్’ అనే ఆల్బమ్ కోసం ఒక పాట, బైజు మంగేష్కర్ సంగీతంలో ‘యా రబ్బా’ అనే పాట, నిఖిల్ కామత్ స్వరపరచిన ‘డున్నో వై2’ (2015) పాటలను లత పాడినట్లు ఝా చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా లత గత రెండు సంవత్సరాలుగా పాటలకు దూరంగా ఉన్నారు. కిందటి సంవత్సరం జనవరి మాసంలో, రామరక్షా స్తోత్రం నుంచి రెండు శ్లోకాలు మాత్రమే మయూరేశ్ పాయ్ సంగీత పర్యవేక్షణలో పాడారు. ఒక సెలబ్రిటీ గురించి అసత్యాలు వైరల్ కావడం కొత్తేమీ కాదు. లత కంటే ముందు ఇంకా చాలామంది ఇటువంటి చేదును చవిచూశారు. అర్థంపర్థం లేని కవిత్వం రాసి అది గుల్జార్ రచించినట్లుగా ప్రచారం జరిగింది. అమితాబ్ బచ్చన్, సొనాలీ బింద్రే, ఫరీదా జలాల్, తెలుగు నటి జయంతి... వంటి సెలబ్రిటీలు చనిపోయినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. – జయంతి -
జైత్రయాత్ర నీ కుటుంబం నుంచే ప్రారంభించు
కలాంగారు రాష్ట్రపతి పదవిలో ఉండగా, ఆయన అన్నగార్లు, వాళ్ళపిల్లలు, బంధువులు చాలా మంది రాష్ట్రపతిభవన్ చూడడానికి వస్తామని ఉత్తరం రాసారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు ! అందర్నీ రమ్మన్నారు. వారు వచ్చారు. భోజన ఫలహారాలు తీసుకుంటూ . రెండూమూడురోజులు అక్కడే గడిపి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళంగానే కలాంగారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచి...‘‘మా బంధువులు అక్కడ విడిదిచేసిన ఫలితంగా భోజనాలకు, బసకు, కరెంటుకు ఇతరత్రా వసతులకు ఖర్చెంతయిందో లెక్కగట్టి చెప్పండి’’అని అడిగారు. వాళ్ళు సంకోచిస్తుంటే...‘‘ఈ దేశమంతా నా కుటుంబమే. వాళ్ళు కష్టపడి కట్టిన పన్నులను నా బంధువులకోసం ఖర్చు పెట్టలేను’’ అని చెప్పి వారు ఆ బిల్లు ఎంతో చెప్పంగానే కట్టేసారు. అదీ వ్యక్తిత్వమంటే. ఆయన అలా బతికిచూపించి ఈ దేశ యువతరం ముఖ్యంగా విద్యార్థులు అంతా అలా బతకాలని కలలు కన్నారు. లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు. 30వేల పాటలకు పైగా పాడారు. ఆవిడ పాడని పాటలేదు, ఆలపించని కీర్తనలు, భజనలు లేవు. కానీ ఆమె ఐశ్వర్యవంతురాలిగా పుట్టలేదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆమెకు నలుగురు చెల్లెళ్ళు. కుమార్తెలను కూడా తన నాటక కంపెనీలో సభ్యులుగా చేర్పించి నాటకాలు వేయగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరిపేవారు. తరువాత కాలంలో ఆమె పాటలుపాడి పేరు, హోదా, డబ్బు బాగా సంపాదించినా తన కుటుంబాన్ని వదలలేదు.అందరినీ వృద్ధిలోకి తెచ్చారు. ఎంతో ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారు. ఆదర్శవంతంగా బతికారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత విదుషీమణి. ఆవిడ జీవితం అంతే. అది వడ్డించిన విస్తరేమీ కాదు. మీరాబాయి సినిమాలో ఆమె నటించినప్పుడు కనకవర్షం కురిసింది. అదీగాక దేశవిదేశాల్లో సంగీత కచ్చేరీలద్వారా కూడా సంపాదించారు. ఎన్నో సంస్థలకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టారు. ఎన్నో గుళ్ళూ గోపురాల నిర్మాణాలకు, నిర్వహణకు సాయం అందించారు. ఆస్తులుకూడా అమ్మేసుకున్నారు. ఒక దశలో సొంత ఇల్లు కూడా లేకుండా చేసుకున్నారు. ఆమెకూడా కుటుంబంలో ఒక మంచి సభ్యురాలిగానే జీవితం మొదలుపెట్టి, నలుగురికి ఆదర్శంగా గడిపారు. ఆమె సుబ్బులక్ష్మి...ఆమె మాదన్నారు తమిళులు, ఆమె సుబ్బలక్ష్మి..ఆమె మాది అని దక్షిణాది వాళ్ళంటే, ఉత్తరాదివాళ్ళు ఆమెను శుభలక్ష్మి అని పిలుచుకుని సొంతం చేసుకున్నారు. ఆమె శరీరత్యాగం చేసారని తెలిసిన తరువాత మొదటగా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి కలాంగారు. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళి, ఆమె అంత్యక్రియల్లో ముందు నిలబడి కంటనీరు కారుతుండగా ఒక మాటన్నారు...‘‘నాకు ముగ్గురు తల్లులు. ఒకరు జన్మ ఇచ్చిన తల్లి. మరొకరు ఈ దేశమాత. నాకు మూడవ తల్లి సుబ్బలక్ష్మిగారు. నేను ఎవరి కంఠస్వరం వింటే నా కష్టాలన్నింటినీ మర్చిపోతానో, ఆ తల్లిని ఈ వేళ పోగొట్టుకున్నాను.’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. మీరు పిల్లలు. ఇటువంటివారిని ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఎంత పెద్దకలలు కన్నా వాటి ఆచరణలో ముందు వీరిలాగా ఒక మంచి కుటుంబ సభ్యునిగా మీ పాత్ర సమర్ధంగా నిర్వహించండి. మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం గర్వపడే విధంగా జీవించండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
68 ఏళ్ల క్రితమే సెల్ఫీ!
నేటి టెక్నాలజీ యుగంలో సెల్ఫోన్స్ లేని లైఫ్స్ని ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాలను ఆక్రమించాయి. అలాగే రోజుకో సెల్ఫీ అయినా ఫోన్ గ్యాలరీలో పడకపోతే యూత్కి నిద్రపట్టేలా లేదు. నిజానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా సెల్ఫీ అనే పదాన్ని 2013లో చేర్చారు. ఐదేళ్లుగా సెల్ఫీ ట్రెండ్ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ 1950లోనే సెల్ఫీ తీసుకున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ‘‘నమస్కారం. దాదాపు 68 ఏళ్ల క్రితమే నేను సెల్ఫ్ క్లిక్డ్ ఫొటో తీసుకున్నాను. ఇప్పుడు దీన్నే సెల్ఫీ అంటున్నారు’’ అని ఆమె ఆనాటి సెల్ఫ్ క్లిక్డ్ పిక్చర్ అదేనండీ.. ఇప్పటి భాషలో సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. గాయనిగా చాలా భాషల్లో ఎన్నో పాటలు పాడారు. ఎన్నో అవార్డులను గెల్చుకున్నారు. కానీ ఆమెలో ఈ ఫొటోగ్రఫీ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది కదూ. -
జాన్వీకి పాడాలనుంది!
ధడక్... ఇప్పుడు నలుగురి కళ్లల్లో మెదులుతున్న సినిమా! ప్రఖ్యాత హిందీ గాయని లతామంగేష్కర్ నోటా ధడక్ మాట వినపడింది. అంతేకాదు.. జాన్వీకి ప్లేబ్యాక్ పాడాలనుంది అని కూడా చెప్పారు. ‘సాధారణంగా నేను సినిమాలు చూడను. జాన్వీ సినిమా ధడక్ చూశా. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది. జాన్వీకి నేపథ్యం పాడాలనుకుంటున్నాను’ అన్నారు. ఈ సందర్భంగానే అనిల్ కపూర్ నటిస్తున్న ‘ఫనే ఖాన్’ ట్రైలర్నూ చూశారు లతా. ‘బోనీ, అనిల్... మొదటి నుంచి మా మంగేష్కర్ కుటుంబానికి చాలా దగ్గర. ఇన్ఫాక్ట్ నేనంటే చాలా అభిమానం. అనిల్కైతే మరీను. అనిల్ అంటే మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. ధడక్ సినిమాతో బోనీ మొహంలో నవ్వు చూశాను. శ్రీదేవి మరణంతో చాలా కుంగిపోయాడు. బోనీ మళ్లీ మామూలు మనిషవుతోంది జాన్వీ వల్లే. ఆ పిల్ల సినిమాతో అతనిలో మళ్లీ కొంత హుషారు కనిపించింది’ అంటూ కపూర్స్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానాన్ని వెలిబుచ్చారు లతామంగేష్కర్. ‘ఫన్నేఖాన్’ సినిమాలో అనిల్కపూర్ పాత్ర లతామంగేష్కర్, మహ్మద్రఫీ అభిమానిగా ఉంటుంది. ఆ పాత్ర తన కూతురిని లతా మంగేష్కర్లా చేయాలని అనుకుంటుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘నా పన్నెండో ఏట సినిమా నేపథ్య గాయనిగా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల్లో సినిమారంగంలో నా పట్ల అదే అభిమానం. అది నా అదృష్టం. ఈ సందర్భంగా దేశంలోని సింగర్స్ అందరికీ నేనొక మాట చెప్పదల్చుకున్నాను.. ఇంకో కిషోర్ కుమార్లాగో.. రఫీలాగో.. లతాలాగో కాకండి.. మీలా మీరుండండి.. మమ్మల్ని ఇమిటేట్ చేయకండి.. మీ స్వరం ప్రత్యేకతను చాటుకోండి’ అని సలహా ఇచ్చారు లతామంగేష్కర్. -
భారత కోకిల
-
16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 16 ఏళ్లుగా తాను పెట్టుకున్న వ్రతాన్ని వదిలేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయన అవార్డుల కార్యక్రమాలకు వేటికీ వెళ్లలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఒక అవార్డు అందుకున్న మిస్టర్ పెర్ఫెక్షనిస్టు.. దాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అందుకోవడం మరో విశేషం. తన తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమిర్ను స్వయంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆహ్వానించారు. లతాజీ ఆహ్వానాన్ని కాదనలేని ఆమిర్.. ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకున్నాడు. దంగల్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు గాను ఆమిర్కు విశేష పురస్కారం ఇచ్చారు. ఇంతకుముందు లగాన్ సినిమా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆమిర్.. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ అవార్డు ఫంక్షన్కూ హాజరు కాలేదు. ప్రస్తుతం 'సీక్రెట్ సూపర్స్టార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలలో ఆమిర్ నటిస్తున్నాడు. -
కోహ్లీకి లతాజీ అరుదైన బహుమతి
క్రికెట్ తమ దేశంలోనే పుట్టిందని గప్పాలు కొట్టుకునే ఇంగ్లండ్ టీమ్ను చిత్తుచిత్తుగా ఓడించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక విశిష్టమైన వ్యక్తి నుంచి అరుదైన బహుమతి అందింది. 235 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. జట్టును విజయపథంలో నడిపించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్కు భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా ఎంతగానో మురిసిపోయారు. ఈ టెస్టు మ్యాచ్తో పాటు సిరీస్ కూడా గెలుచుకున్న విరాట్ను పలువురు అభినందనల్లో ముంచెత్తారు. లతాజీ కూడా అలాగే కోహ్లీని అభినందించాలనుకున్నారు. అయితే అందరిలా మామూలుగా విష్ చేసి ఊరుకుంటే ఏం బాగుంటుందని అనుకున్నారో.. ఏమో గానీ తాను పాడిన ఆణిముత్యాల్లాంటి పాటల్లోంచి ఒక మంచి ముత్యాన్ని ఏరి తీసి అతడికి ఇచ్చారు. కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. ''235 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నాను'' అని చెప్పడమే కాక, తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింకును కూడా పెట్టారు. కోహ్లీ ప్రతిభ వినువీధుల్లో ఎక్కడికో దూసుకెళ్లిపోతోందని చెప్పడానికి సింబాలిక్గా ఈ పాటను ఆమె అతడికి బహుమతిగా ఇచ్చారు. Khas taur se Virat Kohli Kohli ko badhaai deti hun jinhone 235 run banaaye.https://t.co/QtLWeBUFx9 — Lata Mangeshkar (@mangeshkarlata) 12 December 2016 -
గానకోకిలకు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భారతరత్న, లెజెండరీ సింగర్ లతామంగేష్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మెలోడీ క్వీన్ లతామంగేష్కర్ భారతదేశ అత్యంత గౌరవనీయ గాయకురాలని, ఆమె నిండునూరేళ్లు జీవించాలని మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు ఫోన్ చేసిన మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. లతామంగేష్కర్ 1928 లో మహారాష్ట్ర్రలో జన్మించారు.ఏడు దశాబ్దాలుగా సినిమాల్లో పాటలు పాడుతున్నారు.ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన గాయకురాలిగా గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించారు. భారత ప్రభుత్వం 2001 లో భారతరత్న అవార్డుతో ఆమెను సత్కరించింది. -
లతా మంగేష్కర్ కు అవార్డు
కోల్ కతా: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు బంగవిభూషణ్ అవార్డును పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగాళ్ భాషలో లత పాడిన పాటలకు గాను ఈ అవార్డును ఆమెకు ఇస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో తెలిపారు. తాను స్వయంగా ముంబైలోని లత ఇంటికి వెళ్లి అవార్డును బహూకరిస్తానని మమత చెప్పారు. ప్రభుత్వం 2011 నుంచి ఈ అవార్డును ఇస్తుంది. గతంలో ఈ అవార్డును సరోద్ విధ్వాంసుడు అమ్జద్ అలీఖాన్, గాయకుడు మన్నాడే, రచయిత్రి మహాశ్వేతా దేవి, హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్, చిత్రకారుడు జోగన్ చౌదరి, రచయిత శీర్షేంద్రు ముఖో పాధ్యాయ, చిత్ర నిర్మాత గౌతమ్ ఘోష్, సౌరబ్ గంగూలీలు అందుకున్నారు. -
అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా?
తరచుగా ప్రభుత్వం వ్యక్తుల కీర్తిప్రతిష్టల ఆకర్షణకులోనై వారికి పురస్కారాలను ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనికి ఇక స్వస్తి పలికాలి. సేవాతత్పరతను ప్రదర్శించిన వారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి. భారతరత్న వంటి పురస్కారాలను అందుకుంటున్న వ్యక్తులు తాము ప్రజలకు చేసిన సేవకు గాక, తమ ప్రతిభకుగానూ వాటిని పొందడం పరిహాసాస్పదం. మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. క్రికెటర్లకు, బాలీవుడ్ ప్రముఖులకు ఉన్న కీర్తిప్రతిష్టలు, ప్రతిభ కారణంగా వారికి ఆ పురస్కా రాన్నిఇవ్వడం తప్పని నా అభిప్రాయం. అలా చేయడం ద్వారా ఆ పురస్కారానికి ఉన్న విలువ తరిగి పోవడమే కాదు, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. రాజ్యసభకు నామినేట్ చేసిన క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందని నేనంటాను. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్లు ఇద్దరి ఉదారణనే తీసుకుందాం. ఆ ఇరువురిలో ఎవరూ భారత రత్న పురస్కారాన్ని అందుకోదగినవారు కారు. ఇద్దరూ దానివల్ల తమకు వచ్చిన ఖ్యాతిని దుర్వినియోగపరచినవారే. సచిన్, తన ఒకప్పటి వ్యాపార భాగస్వామిని రక్షణ మంత్రి వద్దకు తీసుకు వెళ్లి, అతనికి సంబంధించిన ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరినం దుకుగానూ వార్తలకెక్కారు. అది, రక్షణ శాఖకు చెందిన ఒక ప్రాంతానికి సమీపం లోని ఒక వాణిజ్య సముదాయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. ఆ వ్యవ హారంలో తనకు ఎలాంటి వ్యాపార ప్రయోజనాలూ లేవని సచిన్ ప్రకటిం చారు. బహుశా ఉండకపోవచ్చు. కానీ, వ్యాపార సంబంధమైన ప్రయోజనాల వంటి చిల్లరమల్లర విషయాలను మంత్రుల ముందు ఉంచడమేనా భారతరత్నల పని? ఈ విషయాన్ని సరైన కోణం నుంచి చూడాలంటే... సచిన్ రాజ్యసభలో తన మొట్టమొదటి ప్రశ్నను అడగడానికి మూడేళ్లు పట్టిందని తెలుసుకోవాలి. ఆయన రాజ్యసభలో మూడేళ్లు గడిపారంటున్నానూ అంటే అందులో ఎక్కువ సేపు సభకు బయటనే ఉన్నారని అర్థం. రాజ్యసభకు సచిన్ హాజరు 6 శాతం మాత్రమేనని, ఆయన ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదని డిసెంబర్ 2015 నాటి ఒక నివేదిక వెల్లడించింది. అయినాగానీ, ఆయనకు తన స్నేహితులను, వ్యాపార భాగస్వాము లను రక్షణ మంత్రి వద్దకు తీసుకెళ్లి, వారి ఒప్పందాలను ముందుకు నెట్టడానికి మాత్రం సమయం ఉన్నదా? అలాంటి వ్యక్తికి భారతరత్నను ఇచ్చారనేది నాకు ఆమోదయోగ్యంకానిదిగా కనిపిస్తోంది. భారతరత్నను అందుకున్న తర్వాత కూడా సచిన్ బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్లకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఇది, ప్రజా జీవితంలోని వ్యక్తులకు, ప్రత్యేకించి సచిన్ అంతటి సంపన్నవంతులకు తగిన పనేనా? ఇది అత్యంత అవమానకరం, ఆ పురస్కారాన్నే న్యూనపరచేది. అలాంటి వ్యక్తులకు భారతరత్నను ఇచ్చినప్పుడు ఆవశ్యకంగా మనం వారి ప్రతిభను గుర్తించి ఇస్తున్నాం. అంతేగానీ పౌర పురస్కారాలను ఇవ్వడంలోని అసలు లక్ష్యమైన ప్రజాసేవను గుర్తించి మాత్రం కాదు. సచిన్, తనకు ఒక ఫెరారీ కారు బహుమతిగా లభిస్తే, దానికి దిగుమతి సుంకం మినహాయింపును కోరారు. ఒక కోటీశ్వరుని ఆట వస్తువుల కోసం ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? చివరకు ఓ కోర్టు జోక్యం చేసుకుని ఆయన దిగుమతి సుంకాన్ని చెల్లిం చేలా చేయాల్సి వచ్చింది. బాంద్రాలో తాను ఒక పెద్ద భవంతిని నిర్మిస్తున్నపుడు సచిన్ పరిమితికి మించి దాన్ని నిర్మించడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు. అందుకు అతన్ని ఎందుకు అనుమతించాలి? మనలో ఎవరమూ అడగని దాన్ని లేదా అలాంటి ఇతర ఉపకారాలను చేయాలని కోరడం అతని స్వార్థపరత్వం. ఈ ఏడాది జూన్ 13న ‘బెంగాల్ స్కూలుకు రూ. 76 లక్షలు విరాళం ఇచ్చిన సచిన్ టెండూల్కర్’ అనే పతాక శీర్షికలను పత్రికలు ప్రచురించాయి. ఆ కథనమేమిటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. తీరా చూస్తే, సచిన్ ప్రకటించిన ‘విరాళం’ ఆతని సొంత డబ్బు కాదు, తన రాజ్య సభ ఎంపీ నిధి నుంచి ఇచ్చినది అని తేలింది. అంటే అది దేశం డబ్బే. అదసలు ‘విరాళమే’ కాదు. మాజీ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ ఆలీ అన్యాయా నికి, జాతివిద్వేషాలకు వ్యతిరేకంగా నిలకడగా, ధైర్యంగా చేపట్టిన వైఖరి కార ణంగా ఎన్నో పౌర పురస్కారాలను అందుకున్నారు. ఆయన తన విశ్వాసాల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడ్డారు. సచిన్, మహ్మద్ అలీ వంటి క్రీడాకారుడు కాదు. అలాంటి సమస్యలకు సంబంధించి సచిన్ అర్థవంతమైన కృషి ఏమైనా చేసినట్టు ఎప్పుడైనా విన్నారా? లతా మంగేష్కర్కు 2001లో భారతరత్న ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె ముంబై పొద్దర్ రోడ్డులోని తన ఇంటికి ఎదురుగా ఫ్లైఓవర్ను నిర్మిస్తే దుబాయ్కు వెళ్లిపోతానని అన్నారు. ఆమె, ఆమె చెల్లెలు ఆశా భోస్లే దాన్ని ఎంత సమర్థవంతంగా అడ్డుకున్నారంటే ఇప్పటికీ దాన్ని నిర్మించనే లేదు. రాజ్యసభ హాజరు విషయంలో లతా మంగేష్కర్ది అత్యంత అధ్వానమైన రికార్డని 2012 ఏప్రిల్లో వెలువడ్డ ఒక నివేదిక తెలిపింది. ఆమెకు, సచిన్కు ఈ దేశం పట్ల ఉన్న పూర్తి నిరాసక్తతను ఇది తెలియజేస్తుంది. దీన్ని తృణీకార భావమని కూడా నేనంటాను. ఒక భారతరత్న ప్రవర్తించాల్సింది ఇలాగేనా? తమ వ్యక్తిగత అవ సరాలను, స్వార్థపరత్వాన్ని చాలామంది అవసరాలకన్నా ఉన్నతంగా నిలప డమేనా చేయాల్సింది? అలాంటి వ్యక్తులు వారు చేసిన సేవకు గాక, వారి ప్రతి భకు పురస్కారాలను పొందడం పరిహాసాస్పదం. వారి ప్రతిభకు సంబంధించినంతవరకు వారు తగినంత ప్రతిఫలాన్ని పొందలేదా? వారు చాలా చాలా సంపన్నులయ్యారు. బాగుంది, సరైనదే. వారు డబ్బును, కీర్తిని సంపాదించుకున్నారు సరే, దానితోపాటు మరింత ప్రజాప్రయో జనకర స్ఫూర్తిగల నడవడికను కూడా ప్రదర్శిస్తే మన గౌరవాన్ని కూడా సంపా దించుకోగలిగేవారు. అందుకు బదులుగా వారు ఆ విషయంలో ఎలాంటి పట్టింపూ చూపలేదు. పార్లమెంటుకు హాజరుకావడాన్ని సైతం వారు ఖాతరు చేయలేదు (సచిన్ ఎన్నిసార్లు ఒక మ్యాచ్కు లేదా వ్యాపార ప్రకటన షూటింగ్కు హాజరు కాలేకపోయి ఉంటారు?). తరచుగా ప్రభుత్వం వ్యక్తులకున్న కీర్తిప్రతిష్టల ఆకర్షణకు లోనై అలాంటి వారికి పురస్కారాలను ఇవ్వాల్సివస్తుంటుంది (తరచుగా వాటి కోసం చాలా తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతుంటుంది). దీనికి ఇక స్వస్తి పలికాలి. వ్యక్తులకున్న ప్రతిభాప్రపత్తులను, వారి సేవాతత్పరతను వేరు చేసి చూడగలగాలి. సేవాతత్పరతను ప్రదర్శించినవారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆమెను 'సోకాల్డ్' అని ఎందుకన్నామంటే!
న్యూఢిల్లీ: భారత లెజండ్ సినీ గాయని లతా మంగేష్కర్ను ఉద్దేశించి 'సోకాల్డ్' ప్లేబ్యాక్ సింగర్ అంటూ కథనాన్ని ప్రచురించడంపై తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరణ ఇచ్చింది. 'సోకాల్డ్' పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ప్రఖ్యాత గాయనిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చింది. లత, సచిన్ టెండూల్కర్ లను ఉద్దేశించి వెకిలి హాస్యపు వీడియో పెట్టి కమెడియన్ తన్మయ్ భట్ దుమారం రేపిన సంగతి తెలసిందే. ఈ వివాదంపై కథనాన్ని రాస్తూ ఆమె ఒక అనామక గాయని అన్న తరహాలో 'సోకాల్డ్' అని పేర్కొంటూ అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. లతను అవమానపరిచేలా ఈ కథనం ఉండటంతో ట్విట్టర్లో ఆ పత్రిక తీరుపై భారతీయులు మండిపడ్డారు. 1943 నుంచి సినీ పాటలు పాడుతూ.. 13భాషల్లో మధురమైన గీతాలు ఆలాపించి.. భారత రత్న కీర్తిని పొందిన అంత గొప్ప గాయనిని ఇలా అనామక నేపథ్య గాయని అంటూ కథనాన్ని రాస్తారా? అని పలువురు మండిపడ్డారు. దీంతో న్యూయార్క్ టైమ్స్లో పనిచేస్తున్న భారతీయ రచయిత అసీమ్ ఛాబ్రా విమరణ ఇచ్చారు. తాము లతను అవమానపరచలేదని పేర్కొన్నారు. -
సచిన్పై ఎగతాళి వీడియో
- లతా మంగేష్కర్పై కూడా... - కలకలం రేపిన తన్మయ్ వీడియో.. సర్వత్రా నిరసనజ్వాలలు - ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి తొలగించాలన్న పోలీసులు ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లను ఎగతాళి చేస్తూ కమెడియన్ తన్మయ్ భట్ రూపొందించిన వీడియోపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు, రాజకీయనేతలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించా రు. తన్మయ్ను అరెస్టు చేయాలని, వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ బీజేపీ, శివసేన, ఎంఎన్ఎస్తో పాటు పలువురు సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీడియోను ఫేస్బుక్, యూట్యూబ్ల నుంచి తొలగించాంటూ పోలీసులు వాటి యాజమాన్యాలకు సూచించారు. ‘సచిన్ వర్సెస్ లత సివిల్ వార్’ పేరిట ఈనెల 26న వీడియోను ఏఐబీ గ్రూపు తరఫున తన్మయ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఎవరు గొప్ప క్రికెటర్ అన్న అంశంపై లతా మంగేష్కర్, సచిన్ల మధ్య సంభాషణను ఇందులో అసభ్యంగా రూపొందించాడు. తన్మయ్ తన గొంతుతో సచిన్, లతను మిమిక్రీ చేస్తూ వారి ముఖాల్ని తన ముఖంతో ఫేస్ స్వాప్ (ఒక ముఖంలో ఇద్దరి పోలికలు కలిపి మాట్లాడుతున్నట్లు) చేసి వీడియోను తయారుచేశాడు. విరాట్ కోహ్లీని సచిన్ గొప్పవాడని ఒప్పుకుంటూనే మధ్య మధ్యలో తిట్టడం, విరాట్ గొప్ప ఆటగాడని లత అనడంపై సచిన్ కోప్పడటం, అంత్యక్రియలపై పరిహాసం చేస్తూ ఈ పేరడీని చిత్రీకరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీడియోపై శివాజీ పార్క్ పోలీసుస్టేషన్లో ఎంఎన్ఎస్ ఫిర్యాదు చేసిందని ముంబై డీసీపీ(ఆపరేషన్స్) సంగ్రామ్సింగ్ నిషందర్ తెలిపారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వీడియోలో వాడిన పదాల్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకునేముందు నిపుణుల నుంచి న్యాయ సలహాలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ముంబై పోలీసు కమిషనర్కు నగర బీజేపీ అధ్యక్షుడు అశిష్ షేలర్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక విభాగం విచారణ ప్రారంభించిందని డీసీపీ తెలిపారు. తన్మయ్ను కొడతామని, ముంబైలో అతని కార్యక్రమాలు జరగనివ్వమని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. జాతీయ ప్రముఖుల్ని గేళి చేసి సామాజిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని శివసేన ఆరోపించింది. బాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం తన వీడియోను తన్మయ్ సమర్థించుకున్నారు. అందులో ఎలాంటి తప్పులేదని, వీడియో నచ్చినవాళ్లు తన మెయిల్కు అభిప్రాయాలు పంపాలంటూ ట్వీట్ చేశాడు. హాస్యానికి, అవమానానికి మధ్య తేడాను కమెడియన్లుఅర్థం చేసుకోవాలంటూ సచిన్ భార్య అంజలీ స్పందించారు. మరోవైపు తన్మయ్ వీడియోపై ట్విట్టర్లో మాటల యుద్ధం కొనసాగింది. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ స్పందిస్తూ.. ఇలా ఏ మహిళ గురించైనా అసభ్యంగా మాట్లాడడం పాపమని, పైగా మంగేష్కర్ గురించా.. అంటూ ట్వీట్ చేశారు. తన్మయ్ మంచి కమెడియన్ అని.. ఈ సారి మాత్రం చాలా చెడ్డ కామెడీ చేశాడంటూ డెరైక్టర్ మిలాప్ జవేరీ విమర్శించారు. నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. తాను 9 సార్లు ఉత్తమ కమెడియన్గా అవార్డు అందుకున్నానని, హాస్యాన్ని అభిమానిస్తానని, అయితే తన్మయ్ది హాస్యం కాదన్నారు. -
కోకిలత
బయోగ్రఫీ గాన కోకిల లతా మంగేష్కర్పై ఈ నెలలో రెండు పుస్తకాలు విడుదల అవుతున్నాయి. ఒకటి ‘సాంగ్ షీట్స్’. ఇంకొటి ‘ఎ మ్యూజికల్ జర్నీ’. అయితే అవి రెండూ కూడా ఆమె జీవితకథలు కావు. ఆమె పాటల బయోగ్రఫీలు! మరి లత ఆత్మకథ ఎప్పుడొస్తుంది? ఇంతవరకు మనకు తెలిసిన కథేమిటి? ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ అధ్యక్షుడు రాజ్ థాకరే తన పార్టీ పేరుకు మరింత సార్థక్యం చేకూరే పని చేయబోతున్నారు! ప్రముఖ వ్యక్తుల జీవితాలను డాక్యుమెంటరీలుగా చిత్రీకరించే ఆసక్తి, అలవాటు ఉన్న ఈ మహారాష్ట్ర రాజకీయ నాయకుడు ప్రముఖ సినీ నేపథ్య గాయని లతామంగేష్కర్పై ఒక ఖరీదైన కాఫీ-టేబుల్ బుక్ను ముద్రణకు సిద్ధం చేశారు. లత పాడిన వేల పాటల్లోంచి 300 పాటలను ఎంపిక చేసుకుని, వాటిని గుదిగుచ్చి, వాటికో వ్యాఖ్యను చేర్చి రాజ్ థాకరే ఒక పుష్పగుచ్ఛంగా తెస్తున్న ఆ పుస్తకం పేరు ‘సాంగ్ షీట్స్’. ఆవిష్కరణ.. నేడో, రేపో. లతపై ఇంకో పుస్తకం కూడా ఈ నెలలోనే విడుదల అవుతోంది. పేరు.. ‘లతా మంగేష్కర్: ఎ మ్యూజికల్ జర్నీ’. ప్రముఖ సాహితీవేత్త యతీంద్ర మిశ్రా ఆ పుస్తకాన్ని రాస్తున్నారని, దానిని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఇరా పాండే ఇంగ్లీషులోకి అనువదిస్తారని గత ఏడాది సెప్టెంబర్ 28న లత 86వ జన్మదినం సందర్భంగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటించింది. ఈ బయోగ్రఫీలో లత సక్సెస్ ఉంటుంది. స్ట్రగుల్ ఉంటుంది. ‘సాంగ్ షీట్స్’లో మాత్రం మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీ తగిన లత పాట ఒకటి ఉంటుంది. మరి లత ఆటోబయోగ్రఫీ ఎప్పుడు వస్తుంది? రాదు! ఎప్పటికీ రాదు. తన పాటల గురించి తప్ప, తన జీవితం గురించి ప్రపంచం తెలుసుకోవలసింది ఏమీ లేదని లత నమ్మకం! ‘ఆత్మకథలు వ్యక్తుల్ని, కుటుంబాలను బాధపెడతాయి. నాకెవరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు. మంచి చెడు, నిజం అబద్దం జీవితాన్ని నడిపిస్తాయి. వాటిని మనసులోనే నిక్షిప్తం చేసుకోవాలి తప్ప ఆత్మకథలకి ఎక్కించేయకూడదు’. ఇదీ లత అభిప్రాయం. కాబట్టి లత పాటల బయోగ్రఫీనే... ఆమె లైఫ్ బయోగ్రఫీ. పాట తప్ప ఆమె జీవితంలో ఇంకేం లేదు. లత గురించి ముందొక కర్ణక ఠోరమైన సంగతి. లతా మంగేష్కర్ చదువుకోలేదు! ఇప్పుడొక వినసొంపైన విషయం. పాడిన ప్రతి పాటనూ లత అచ్చులు, హల్లులు పొల్లు పోకుండా రాసుకుని ఆ కాగితాలను భద్రపరచుకున్నారు. లత జీవితంలోని ఒక చిన్న వైరుధ్యం మాత్రమే ఇది. అక్షరం రాకపోయినా జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నారు లత.లత పేరులో కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. లత నాన్నగారు పండిట్ దీననాథ్.. గోవా దగ్గరి మంగేషీలో పుట్టారు. మంగేషీ మీద మమకారంతో ఆ ప్రాంతాన్నే ఆయన తన ఇంటిపేరుగా (మంగేష్కర్గా) మార్చుకున్నారు. లత అసలు పేరు కూడా లత కాదు. హేమ. అమ్మ పేరు శేవంతి. దీననాథ్ రెండో భార్య. బాగా చిన్నప్పుడు చిన్న నాటకంలో యాక్ట్ చేసింది హేమ. అందులో హేమ పాత్ర పేరు లత. ఆ తర్వాత లతే ఆమె పేరు అయింది. ఫేమ్ అయింది. ఇంట్లో పెద్దమ్మాయ్ లత. తర్వాత మీనా ఖరీకర్ (84). తర్వాత ఆషా భోస్లే (82). తర్వాత ఉషా మంగేష్కర్ (80). తర్వాత హృదయనాథ్ మంగేష్కర్ (78). లత, ఆష, ఉష, మీనా నలుగురూ సింగర్సే. హృదయనాథ్ స్వరకర్త. మొత్తం మీద సరిగమల ఫ్యామిలీ. తండ్రి క్లాసికల్ సింగర్. ఆ నదివే ఈ నాలుగు ఉప నదులు. మధ్య ప్రదేశ్లోని ఇండోర్ వీటి జన్మస్థలం. నదిగా... ఉపనది! 1942లో లత తండ్రి గుండె జబ్బుతో చనిపోయి నప్పుడు లతకు 13 ఏళ్లు. కుటుంబ భారం లతపై పడింది. అంత వరకు ఉపనదిగా ఉన్న లత నదిగా మారవలసి వచ్చింది. కుటుంబానికి తనే జీవనది కావలసి వచ్చింది. డబ్బులొస్తాయంటే ‘కితి హసాల్’ సినిమాలో ఒక పాట పాడింది. ‘నాచు యా గావో’ అనే మరాఠీ పాట అది. డబ్బులొచ్చాయి. కానీ పాటే.. సినిమాలో లేదు. కట్ అయింది! ఆ పసి మనసు ఉసూరుమంది. అదే ఏడాది... తండ్రి పోయిన ఏడాది.. లతకు ఇంకో చాన్స్ వచ్చింది. ‘పెహలీ మంగళ గౌర్’ అనే మరాఠీ సినిమాలో చిన్న పాత్ర. దాంతో పాటే చిన్న పాట. తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్కి సినిమా కంపెనీ ఉంది. ఆయన ఇచ్చిన అవకాశం ఇది. అవకాశంతో పాటు, కొంత డబ్బు కూడా. లత జీవితంలోని మరో వైరుధ్యం... ఆమె హిందీ కెరీర్ కూడా మరాఠీ చిత్రం నుంచే మొదలవడం! తొలిసారి 1943లో ‘గజాభావ్’ అనే మరాఠీ చిత్రంలో ‘మాతా ఏక్ సపూత్ కి దునియా బదల్ దే తు’ అనే హిందీ పాట పాడారు లత. తర్వాత రెండేళ్లకు మాస్టర్ వినాయక్ కంపెనీతో పాటు ఇండోర్ నుంచి బొంబాయికి వచ్చేసింది లత ఫ్యామిలీ. బొంబాయికి రాగానే లత చేసిన మొదటి పని.. హిందూస్తానీ సంగీతంలో మెళుకువల కోసం ఉస్తాద్ అమానత్ అలీ ఖాన్ దగ్గర చేరడం. స్వరాలతో గొంతు శ్రావ్యమైతే.. పాటలు వరాలై కురుస్తాయని లత ఆశ. ఆయేగా.. అనేవాలా.. ‘మహల్’ సినిమాలో లత పాడిన ‘ఆయేగా ఆనేవాలా...’ అమె కెరీర్లో ఫస్ట్ హిట్. తర్వాతి దశాబ్దమంతా లతదే! అనిల్ బిస్వాస్, శంకర్ జైకిషన్, ఎస్.డి.బర్మన్, ఖయ్యూమ్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల రాగాలతో ఆమె స్వరం సుసంపన్నమైంది. ఆ తర్వాతి టర్నింగ్ పాయింట్ లతకు 1958లో వచ్చింది. ‘మధుమతి’ సినిమాలో ‘ఆజారే పర్దేశీ’ పాటకు వచ్చిన బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ ఫిల్మ్ఫేర్ అవార్డు బాలీవుడ్లో లతకొక గుర్తింపు తెచ్చిపెట్టింది. 1960లో.. ఆ ఒక్క ఏడాది వచ్చిన రెండు హిట్లు.. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ (మొఘల్-ఎ-అజామ్), ‘అజీబ్ దాస్తాన్ హై యే’ (దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా) హిందీ ఇండస్ట్రీలో తిరుగులేని స్వరరాణిగా నిలబెట్టాయి. లత కమ్మటి నాన్-సినీ గాయని కూడా. 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో లత ఆలాపించిన దేశభక్తి గేయం ‘యే మేరే వతన్ కె లోగో’ ఆయన చేత కంటతడి పెట్టించింది. ఆ పాట అర్థానికి, ఆ గొంతులోని మార్ధవానికి నెహ్రూ కదిలిపోయారు. శిఖరాగ్ర దశాబ్దాలు లత కెరీర్లో 1960, 1970, 1980.. మూడూ శిఖరాగ్ర దశాబ్దాలు. ఈ ముప్పై ఏళ్లలోనూ ఒక్క లక్ష్మీకాంత్-ప్యారేలాల్ల దర్శకత్వంలోనే లత 700లకు పైగా పాటలు పాడారు. ఇవిగాక కచేరీలు, విదేశీల టూర్లకైతే లెక్కేలేదు. 1990లలో కొత్త గాయనిలు రావడంతో లత వేగం కొంత తగ్గినా, స్వరంలో వాడి తగ్గలేదు. ఆమె స్థానం ఆమెకే సుస్థిరంగా ఉండిపోయింది. లత ప్రస్తుతం పాటల వ్యాపకాలతో, పాత జ్ఞాపకాలతో కలిసి సాగుతున్నారు. రెండు జీవితాలు నాన్నగారు బతికున్నప్పుడు ఇంటికి వచ్చే అతిథులకు భోజనం పెట్టకుండా పంపించేవాళ్లం కాదు. ఆయన పోయాక మా కుటుంబం అంతా పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. ఒక్కోసారి నాకు, నా చెల్లెళ్లకు, తమ్ముడికి రోజంతా తినడానికి ఏమీ ఉండేది కాదు. అమ్మ సంగతి సరేసరి. నా పాటలు నేను వినను వింటే, ‘ఇంకా బాగా పాడి ఉండాల్సిందేమో’ అనిపిస్తుంది. అందుకే వినను. సాంగ్ రికార్డింగ్ అయ్యాక కూడా వెంటనే రికార్డింగ్ రూమ్ నుంచి వచ్చేస్తాను. పాట ఎలా వచ్చిందని కూడా చూసుకోను. ఈ ధోరణి నా మ్యూజిక్ డెరైక్టర్లను అప్పుడప్పుడు చికాకు పరుస్తుండేది. లతాజీ.. ఒక పరిమళం లతకు కుకింగ్, రీడింగ్, ఫొటోగ్రఫీ, క్రికెట్ ఇష్టం. లత పేరుతో 1999లో ఒక పెర్ఫ్యూమ్ మార్కెట్లోకి వచ్చింది. లత అవివాహితగా ఉండిపోయారు.లత ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో నూర్జహాన్, షంషాద్బేగం గాయనీమణులుగా బాలీవుడ్ను ఏలుతున్నారు. ఆ నిండైన గొంతుల ముందు లత వాయిస్ పీలగా అనిపించేది డెరైక్టర్లకు, నిర్మాతలకు. అంతెత్తున ప్రౌఢల్లా ఉండే హీరోయిన్లు లత గొంతులో ఎలా ఇమిడిపోగలరని వారి సంకోచం! అలా ఆమెకు చాలా చాన్స్లు పోయాయి. పోయాయి కాదు.. అసలుకే రాలేదు.ఆల్టైమ్ అందాల నటి మధుబాలకు నమ్మకం... లత గొంతు మాత్రమే తనకు చక్కగా సరిపోతుందని. అందుకే ఆమె ఏ సినిమాకు ఒప్పుకున్నా, తనకు లతే పాడాలని కండిషన్ పెట్టేవారు. అయితే సైరా బానుకు తన గొంతు బాగుంటుందని లత అనుకునేవారు.లతకు ‘భారతరత్న’ (2001), పద్మవిభూషణ్ (1999), దాదాసాహెబ్ ఫాల్కే (1989) తదితర అవార్డులు అసంఖ్యాకంగా వచ్చాయి. నాన్నకు ప్రేమతో... సినిమాల్లో పాటలు పాడేందుకు వచ్చినంత తేలిగ్గా, నాన్న దగ్గర పాట పాడే చాన్స్ రాలేదు నాకు. ఆయన సంగీతం మాస్టారు. కానీ బయటి పిల్లలకే. నేను కూనిరాగం తీసినా అమ్మ కోప్పడేది. నాన్నకు, అమ్మకు తెలీకుండా నా రాగాలు నేను తీసుకునేదాన్ని. పాటంటే నాకు ఇష్టం. కానీ నాన్నంటే భయం. ఆయన ముందు పాడేదాన్ని కాదు. ఓరోజు నాన్న బయటికి వెళితే ఆయన శిష్యుడు చంద్రకాంత్ గోఖలే (తర్వాత ఆయన మరాఠీలో పెద్ద నటుడు అయ్యారు) పాఠాలు చెప్తున్నారు. ఒక రాగాన్ని ఆలాపిస్తున్నారు. అది అంతకు మునుపు నాన్న పాడుతుండగా నేను విన్నదే. అయితే అది నాన్న పాడినట్లు లేదు. క్లాసులోకి వెళ్లి మీరు తప్పు పాడారు అన్నాను. ‘ఏదీ నువ్వు పాడు’ అన్నారు గోఖలే. పాడాను. ఆ సంగతి నాన్నకు తెలిసింది. మర్నాడు నన్ను క్లాస్రూమ్కి తీసుకెళ్లారు. అదే పాటను మళ్లీ పాడమని అడిగారు. పాడాను. ఆయన ముఖంలో సంతోషం. ‘సంగీతం నేర్చుకుంటావా?’ అని అడిగారు. తలూపాను. తంబూరా తెచ్చి చేతికి ఇచ్చారు. అలా నా సంగీత అభ్యాసం మొదలైంది. ఆ తర్వాత నాన్నకు నమ్మకం ఏర్పడింది... ఎప్పటికైనా నేనో గొప్ప గాయని అవుతానని. నాన్నకు భవిష్యత్తు కూడా తెలుసు. నువ్వు గొప్పదానివయ్యాక చూసేందుకు నేనుండను అని ఓసారి అన్నారు. అన్నట్లే అయింది. నా చిన్నప్పుడే ఆయన చనిపోయారు. (గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా లత పంచుకున్న ఓ జ్ఞాపకం) -
ఆశాభోంస్లే కొడుకు మృతి
బాలీవుడ్ సంగీత దర్శకుడు, ప్రముఖ గాయని ఆశాభోంస్లే తనయుడు అయిన హేమంత్ భోంస్లే క్యాన్సర్ తో మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న హేమంత్.. స్కాట్లాండ్ లో మరణించారు. హేమంత్ 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్న సమయంలో ఇలా జరగటంతో ఆ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. 2012లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే డిప్రెషన్ కారణంగా ఆత్యహత్య చేసుకుంది. -
సెప్టెంబర్ 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లతా మంగేష్కర్ (గాయని) పూరి జగన్నాథ్ (డైరక్టర్), రణబీర్ కపూర్ (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య. దీనివల్ల మీ మీద ఉన్న చెడు ప్రభావం అంటే చెడుస్నేహాల వ ంటి దుర్గుణాల నుండి విముక్తి కలిగి కొత్త జీవితం ప్రారంభిస్తారు. మీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యసంఖ్య. నవగ్రహాలలో సూర్యుడు రాజు, కుజుడు సేనాపతి అవడం వల్ల ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవడం, సంతానప్రాప్తి కలగడం, సొంతు ఇంటి కల నెరవేరడం వంటి మంచి మార్పులు కలుగుతాయి. వచ్చే పుట్టిన రోజు వరకు మీ పుట్టిన రోజు, ఈ సంవత్సరం మీరు తలచిన పనులు ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, మైన్స్, మెకానికల్, మెటీరియల్ రంగాలలో ఉన్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుజప్రభావం వల్ల పై అధికారులతో, యజమానులతో మొండిగా వాదించి గొడవలు పడి, ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వాహనాలను నడపడంలోనూ, మారణాయుధాల వాడకంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: సుబ్ర హ్మణ్యేశ్వరునికి అభిషేకం, సూర్యారాధన, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కానీ ఆదరించడం, పేదరోగులకు ఆహార పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
'అది ఊహించని ఫోన్ కాల్'
ముంబై:ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని లతా మంగేష్కర్ తనకు అభినందనలు తెలపడం పట్ల గాయకుడు అద్నాన్ సమీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇందుకు సల్మాన్ హీరోగా రూపొందుతున్న భజరంగీ భాయ్ జాన్ మూవీలో అద్నాన్ సమీ పాడిన పాటే కారణమట. అందులో 'భర్ దో జోలీ మేరీ'అనే పల్లవితో సాగే పాటను అద్నాన్ పాడాడు. దీనికి గాను లతా మంగేష్కర్ నుంచి ప్రశంసలతో కూడిన ఓ అరుదైన ఫోన్ కాల్ ను తాను రిసీవ్ చేసుకున్నట్లు అద్నాన్ తెలిపాడు. దీనిపై తొలుత ఆశ్యర్యానికి గురైన అద్నాన్ తన సంతోషాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 'నా పాటను అభినందిస్తూ లతాజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు చిన్న పిల్లాడిలా ఫీలయ్యా. ఆమె నుంచి వచ్చిన ఆ ప్రశంస నిజంగా అద్బుతం' అని ఆద్నాన్ పేర్కొన్నాడు. -
రెండు జడలు.. ఉంగరాల జుత్తు..
బొంబాయి లోకల్ ట్రైన్. ఓ సీట్లో రెండు జళ్లమ్మాయి కూర్చుని ఉంది. ఆ వెనక సీట్లోనే ఉంగరాల జుట్టున్న ఓ కుర్రాడు కూర్చున్నాడు. తుంటరి పిల్లాడికి చిరునామాలా ఉన్న అతని ముఖం చిలిపి నవ్వులు నవ్వుతూనే ఉంది. పద్ధతికి మారుపేరుగా ఉన్న ఆ రెండుజళ్లమ్మాయి ఇతగాడి చూపులను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని మిన్నకుండిపోయింది. రైలు ఆగింది. ఆ అమ్మాయి దిగింది. ఆ అబ్బాయి దిగాడు. స్టేషన్ బయటకు వచ్చిన ఆ యువతి ఓ టాంగా ఎక్కింది. ఇతగాడూ మరో టాంగా ఎక్కాడు. సేమ్ సీన్... ఆ టాంగా వెనకాలే ఇదీ ఫాలో అవుతూ వెళ్తోంది. ఈసారి ఆ అమ్మాయి ముఖంలో కంగారు మొదలైంది. ఆవిడగారి టాంగా బాంబేటాకీస్ స్టూడియో గేట్దగ్గర ఆగింది. వెనకాలే వచ్చిన టాంగా కూడా అక్కడే ఆగింది. అంతే అతగాడి వంక చురచుర చూసి చరచరా స్టూడియోలోకి వెళ్లిపోయింది ఆమె. ఇవేమీ పట్టనట్టు ఈయనగారు కూడా ఆమె బాటలోనే సాగిపోయాడు. కట్ చేస్తే.. ఇద్దరూ ఓ పెద్దాయన ఎదుట నిల్చున్నారు. అప్పటిదాకా అణుచుకున్న కోపాన్నంతా కూడదీసుకుని గయ్యిన లేచింది. ‘ఇతనెవరో.. అప్పట్నుంచి నన్ను ఫాలో అవుతున్నా’డ ని కంప్లైంట్ చేసింది. దానికా పెద్దాయన ఓ నవ్వు న వ్వాడు. మళ్లీ కట్ చేస్తే.. అక్కడున్నవాళ్లంతా నవ్వుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆ రెండు జళ్లమ్మాయి గానకోకిల లతామంగేష్కర్, ఉంగరాల జుత్తువాడు గాయకుడు కిషోర్ కుమార్. ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రోజులవి. ముఖపరిచయాలు కూడా లేవు. ఇద్దరూ ఓ పాట రికార్డింగ్ కోసం బాంబే టాకీస్ స్టూడియోకు వెళ్లాల్సివచ్చింది. దీంతో కి షోర్దా తనను ఫాలో అవుతున్నాడని లతాజీ భావించారు. లతా అనుమానానికి తెరదించిన వారు మ్యూజిక్ డెరైక్టర్ క్షేమ్చంద్రప్రసాద్. కిషోర్ కుమార్ అశోక్కుమార్ తమ్ముడనీ, మంచి గాయకుడనీ పరిచయం చేశారు. ఇలా డిఫరెంట్గా పరిచయమైన ఈ ద్విగళాలు.. తర్వాత ఎన్నో యుగళగీతాల్లో పోటాపోటీగా గాత్రదానం చేశాయి. -
మళ్ళీ దగ్గర చేసిన పాట
విభేదాలతో దూరం జరిగిన అక్కాచెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇప్పుడు అనుకోకుండా దగ్గరవుతున్నారు. లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’ ఇప్పుడు ఆశా భోంస్లే పాడుతున్న ఒక పాటను జనానికి అందించనుంది. ‘ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు గానం చేశారు. ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్న లత ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. 1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. -
గాతా రహే మేరా దిల్...
లత పాటలుపది కాలం కడుపుతో ఉండి లతా మంగేష్కర్ను కంది. మరి నిజంగానే కాలం అలాంటిది. దేశం విడిపోయింది. రెండు ముక్కలయ్యింది. పాకిస్తాన్, ఇండియా అట. ఇక ఈ దేశం వాళ్లు ఇటు ఆ దేశం వాళ్లు అటు అట. ‘మల్లికా-ఎ- తరన్నుమ్’ బిరుదాంకితురాలు, పాటల పూలరుతువు నూర్జహాన్ ఇక ఇక్కడ ఉండలేనంటూ బిడారు వెంట పాకిస్తాన్ బయలుదేరింది. ‘మల్లికా-ఎ-గజల్’ పాటల తేనెచినుకు బేగం అఖ్తర్ ఎవరినో పెళ్లి చేసుకొని ఆ పెద్దమనిషి ఆంక్షల వల్ల పంజరంలో కోకిలలా మారింది. సింగింగ్ సూపర్స్టార్, నల్ల పిల్ల, నవ్వుల కోహినూర్ సురయ్య ఒక వెలుగు వెలిగి, దేవ్ ఆనంద్తో ప్రేమలో చిక్కుకుని, చికాకులో ఇరుక్కుని ఫ్లాపులు ఇవ్వడం మొదలుపెట్టింది.ఇప్పుడు దేశానికి ఒక పాట కావాలి. పాట కోసం మాత్రమే బతికే పాట. పాటను వదలక సాగే పాట. పాటంటే కనులుదించి, పెదాలు కూడబలుక్కునేలా చేసి, కంఠానికి కాసింత గంధాన్ని రాసుకొని, మెత్తగా హాయిగా తీగను సుతారంగా తాకినట్టుగా, ఎక్కడ దాచారో తెలియని అత్తరు డబ్బీ నుంచి ఆగి ఆగి తాకే మల్లె పరిమళంలా... దేశానికి ఒక పాట కావాలి. అది లతా మంగేష్కరే కావాలి. అప్పటికే తండ్రి లేడు. లంకంత సంసారం నెత్తిన పడింది. చెల్లెళ్లు... తమ్ముడు..దేవుడు కొన్ని ఆల్చిప్పల నుంచి స..ప..సలను ఏరి మెడలో ముత్యాలుగా కూర్చి పంపాడన్న ధీమా తప్ప వేరే ఏ ధైర్యం లేదు.ముందుకు సాగాల్సిందే. పాటను తెడ్డుగా చేసి భవసాగరాన్ని ఈదాల్సిందే. ఏవో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. వాళ్లూ వీళ్లూ సరేనమ్మా పాడు అంటున్నారు. రికార్డింగ్ థియేటర్లు తారసపడుతున్నాయ్. కొంచెం నూర్జహాన్లా పాడుతున్నావ్ పర్లేదు పైకొస్తావ్ అని ఆశీర్వదిస్తున్నారు. కాని తగలాలి. జాక్పాట్ కొట్టాలి. ఒక పాట దేశమంతా మార్మోగాలి. అది ఏది? ఆయేగా... ఆయేగా... ఆనేవాలా ఆయేగా... నవాబుగారు కమాల్ అమ్రోహి భావుకుడో, సరసుడో, సినిమా ప్రేమికుడో ఇంకా తేలలేదు. కాని అతడు సినిమాలు తీస్తే చూస్తారు. అతడు అంతవరకూ అందరూ అద్దం ముక్క అనుకున్నదానిని వజ్రం అని నమ్మించగలడు. మహల్- 1949లో అతడు తీసిన సినిమా. అంత వరకూ ఫ్లాప్లలో ఉన్న లలన మధుబాలకు స్క్రీన్ టెస్ట్ చేసి కొత్త స్టిల్ తీసి దేశం మీద వదిలితే అది ఇప్పటికీ బేచిలర్ కుర్రాళ్ల గదులలో వెలుగుతోంది. ఇక సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాష్తో లతా మంగేష్కర్కు పాడించే ఆవకాశం ఇస్తే ఆ పాట- ఆయేగా... ఆయేగా... ఆనేవాలా ఆయేగా... దేశాన్ని దుమారంలా చుట్టుముట్టింది. ఎటువాళ్లు అటు కొట్టుకుపోయారు. తప్పుకోండి. లతా వచ్చేసింది. ఏ జిందగీ ఉసీకి హై... సి.రామచంద్రకు ఎన్ని పేర్లున్నాయో చెప్పలేము. చితల్కర్, రామ్ చితల్కర్, అన్నా సాహెబ్, ఆర్.ఎన్. చితల్కర్... బోలెడన్ని. కాని అతడి పాట ఒకటే. హిట్ పాట. చేయి వేస్తే బంగారం అంటారు చూడండి. గోల్డెన్ హ్యాండ్. మట్టి ముద్ద మంగేష్కర్. ఆ స్వరానికో కల్పన కావాలి. స్వర కల్పన చేయగలిగే చేయి. ఫిల్మ్స్తాన్ వాళ్లు ‘అనార్కలి’ (1953) తీస్తూ సి.రామచంద్రను మ్యూజిక్ డెరైక్టర్గా పెట్టుకున్నారు. హీరో ప్రదీప్ కుమార్ ఎలాగూ అందగాడు సరే ఏం హీరోయిన్ బీనారాయ్ తక్కువా? ఆ పలువరుస... ఆ నవ్వు? నా గొంతు కూడా సుమా అని లతా మంగేష్కర్ తోడయ్యింది. ఏ జిందగీ ఉసీకి హై... జో కిసీక హోగయా... ప్యార్ హీ మే ఖోగయా.... పాటతో ప్రేక్షకులు ముడిపడ్డారు. గొంతుతో గుండెలు లంకె పడ్డాయి. ఇక ఇది ఆగదు. మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్ సలీల్ చౌధురి. వేళ్ల చివర నిజంగానే మంత్రదండం ఉన్నవాడు. ఆర్కెస్ట్రా ఎదుట అతడు నిలిచి రెండు చేతుల్నీ ఆమ్మని ఊపితే అక్కడ పాట పుట్టి పొదై పెరిగి పూలు విదిల్చి గలగలమని రాల్చి మనల్ని ఊపేస్తుంది. బెంగాలు జానపద మెరుపు. ఆ గంగలో తుళ్లిపడే చేపపిల్ల కులుకు. రెంటినీ కలిపి లతకు అందిస్తే మరి పాట. మధుమతి (1958) బిమల్ రాయ్కు పేరు తెచ్చింది. సలీల్ చౌధురికి పేరు తెచ్చింది. వైజయంతి మాల, దిలీప్కుమార్లకు పేరు తెచ్చింది. కాని శ్రోతలకు మాత్రం లతా మంగేష్కర్ అనే ఒక పండగ తెచ్చింది. ఆజారే పర్దేశీ... మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్... ఏ అఖియా థక్ గయే పంఖ్ నిహార్.... ప్యార్ కియాతో డర్నా క్యా ఏంటి ఆ పిల్ల పాడేది... ఉర్దూనా... నోట్లో మరాఠి వేసి ముక్కలు కొట్టినట్టుగా ఉంది అని వెక్కిరించాడు దిలీప్ కుమార్ అలియాస్ యూసఫ్ ఖాన్. నాలుక మీద రుచిమొగ్గలు సరిగ్గా ఉండాలేగాని ఏ తేనె అయితే ఏమిటి జుర్రడానికి. ట్యూటర్ని పెట్టుకుంది. అలీఫ్ బే తే... నేర్చుకుంది. నౌషాద్ సాహెబ్... నేను రెడీ అంది. నౌషాద్ అలీ... సంగీత ప్రపంచానికి బెబ్బులి. ‘మొఘల్-ఏ- ఆజమ్’ (1960)లో పాటను సవాలుగా విసిరాడు. అది అక్బర్ షెహెన్షా దర్బారులో ఖంజరులా దిగబడింది. కుంచెడు గజ్జెలతో ఝల్లున మోగింది. ఓహ్... మధుబాల నిలదీస్తోంది. వాహ్... లతా తన కంఠాన్ని చూపుడు వేలు చేసి ఆడిస్తోంది. ప్రేక్షకులు ధన్యులం గురో అని కళ్లప్పగించి చూస్తున్నారు. ప్యార్ కియాతో డర్నా క్యా... జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా.. ప్యార్ కియా కోయి చోరి నహీ కీ... అజీబ్ దాస్తా హై ఏ... జైకిషన్ గుజరాత్ నుంచి హార్మోనియం పెట్టెతో వచ్చాడు. శంకర్ హైదరాబాద్ నుంచి తబలా పట్టుకొని దిగాడు. ఇద్దరికీ వసారా ఇచ్చి వానకు తడవకుండా చేసి రాజ్కపూర్ ‘బర్సాత్’ హిట్తో కలెక్షన్ల కుంభవృష్టి కురిపించుకున్నాడు. ఇవి ఒట్టి పోయే మేఘాలు కావు. ఈ కడవలు ఖాళీ కావు. కూచుంటే పాట. లేస్తే పాట. శంకర్, జైకిషన్, హస్రత్ జైపురి, శైలేంద్ర... ఈ నాలుగు వేళ్లకు ఐదో వేలుగా లతాసమకూరి వీళ్లు పిడికిలిగా మారారు. దిల్ అప్నా ప్రీత్ పరాయ్(1960)... ఎవరు చూశారో ఎవరు చూళ్లేదో తెలీదు. కాని చెవులున్న ప్రతి ఒక్కరూ అందులోని పాటలు విన్నారు. లతను విన్నారు. అంతం లేని ఆ విందు ఆరగిస్తూనే ఉన్నారు. అజీబ్ దాస్తా హై ఏ... కహా షురూ కహా ఖతమ్... ఏ మంజిలే హై కౌన్ సీ... నా ఓ సమజ్ సకే నా హమ్... ఆప్ కే నజరోంనే సంఝా... ఒక తమ్ముణ్ణి తల్లిదండ్రులిచ్చారు. ఒక తమ్ముణ్ణి సంగీతం ఇచ్చింది. మదన్ మోహన్ లతా మంగేష్కర్కు దేవుడిచ్చిన తమ్ముడు. దీదీ... దీదీ.. అంటూ లతా లేనిదే పాట కట్టేవాడు కాదు. జీవితంలో ఒక్క హిట్ సినిమా చేయలేదు. కాని ఒక్క ఫ్లాప్ పాటా ఇవ్వలేదు. పైకి రాని దురదృష్టవంతుడు. లతే పెద్ద పెన్నిధిగా మారిన అదృష్టవంతుడు. వీళ్లిద్దరి ప్రతీ పాటా ఒక సరోవరం. ఇరుచేతులూ కలిసిన ముకుళిత హస్తం. ఏమో... దప్పిక గొన్నవారిని సేద తీర్చే దోసిలి కూడా కావచ్చు. వెతుకులాడేవారి అంతిమ గమ్యమూ కావచ్చు. అన్పడ్ (1962) ఎందరికి తెలుసు? కాని ఈ పాట? అందరికీ తెలుసే! ఆప్కి నజరోంనే సంఝా... ప్యార్ కే కాబిల్ ముఝే... దిల్ కి ఏ ధడ్కన్ ఠహెర్ జా... మిల్ గయీ మంజిల్ ముఝే... రహేనా రహే హమ్ మెహెకా కరేంగే హృతిక్ రోషన్కు తాత ఒకడున్నాడు. రోషన్. రాగాలను జవనాశ్వాలుగా చేసి అధిరోహించినవాడు కూడా హీరోనే. పాపిలా అతడు చిరాయువు కాడు. పువ్వులా పుట్టి వికసించి పరిమళాలిచ్చి నిశ్శబ్దంగా రాలిపోయాడు. లతాతో చాలా మంచి పాటలు చేశాడు. రఫీ-లతాల డ్యూయెట్ జో వాదా కియా ఓ నిభానా పడేగా... వింటూనే ఉన్నాం కదా. లతా ఇతడి సంగీతాన్ని ఎంత ఇష్టపడిందంటే ఇతడి సంగీత దర్శకత్వంలో ‘భైరవి’ అనే సొంత సినిమా కూడా తీద్దామనుకుంది. కుదరలేదు. కాని ఒక్కోసారి పాట నచ్చితే ఫీజు ఒక్క రూపాయే తీసుకునే అదృష్టాన్ని అతడికి ప్రసాదించింది. మమత (1966) ఒక సో సో సినిమా. కాని అందులోని పాట! రహేన రహే హమ్ మెహెకా కరేంగే... బన్కే కలీ.. బన్ కే సభా... బాగ్ ఏ వఫా మే.... హోటోంపె ఐసీ బాత్ ఎస్డి బర్మన్ సంగతి మాట్లాడకపోతే ఆయనా ఊరుకోడు. లతా కూడా ఊరికే ఉండదు. దాదా బర్మన్. ఈ బక్కపలచటి మనిషి పాటల మాటెత్తితే పర్వత సమానుడైపోతాడే! చిన్న హమ్ చేసి పాడూ అనంటే ఆ బరువుకి ఎదురుగా ఉన్న గాయకులు నేలకంటాల్సిందే. ఏ పాటకు ఎవరు కరెక్టో వారికే దక్కుతుంది పాట. రికమండేషన్లు చెల్లవు. తేరే మేరే మిలన్ కీ ఏ రైనా... కిశోర్ పాడాల్సిందే. తేరీ బిందియా రే.. రే హాయ్ హాయ్... రఫీ పాడాల్సిందే. రెంటిలోనూ లతా జోడి కట్టాల్సిందే. జువెల్ థీఫ్ (1967) క్లయిమాక్స్ పాట కోసం వైజయంతీ మాల తనకు బాల్యం నుంచి ఉన్న నృత్యానుభవం అంతా పణంగా పెడదామనుకుంది. లతా ఏం తక్కువా? ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన తపస్సు వల్ల కలిగిన అపరిమిత శక్తి నుంచి ఇదో చిన్న వరం. అంతే! హోటోంపె ఐసీ బాత్ మై దబాకే చలి ఆయి... ఖుల్ జాయే వహీ బాత్ తో దుహాయి హై దుహాయి... చల్తే చల్తే యూహీ కోయి మిల్ గయా థా గులాం ముహమ్మద్ ఈ పాటలతో అమీర్ కావాల్సింది. సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో గరీబుగా మారి జబ్బు పడి రిలీజ్కు ముందే చనిపోయాడు. పోయాడు కదా అని ఇంత మంచి పాటలు చేసినా ఫిలిమ్ ఫేర్ ఇవ్వలేదు. పోనివ్వండి. అతడికి నిజమైన అవార్డు ఏమిటి? లతా పాడటమే. పాకీజా (1972)లో గులాం ముహమ్మద్ కోసం లతా పాడిన ప్రతి పాటా ఒక సురాయి జామకాయ. ఇన్ హీ లోగోంనే... ఒక పాట. మరొకటి- మౌసమ్ హై ఆషికానా... వీటితో పాటు కైఫీ ఆజ్మీ అత్యుత్తమ సృజన... లక్నోలో తాను చూసిన తవాయిఫ్లను తలుచుకుని పాడిన పాట... ఆ వేదనను- దారిన పోయే ప్రతి ఒక్కరితో గడపవలసిన ఆవేదనను- లతా పలికించిన తీరూ అదిమి పెట్టిన కన్నీటి కంఠమూ... చల్తే చల్తే యూహీ కోయీ మిల్ గయా థా సరే రాహ్ చల్తే చల్తే.... తేరే బినా జిందగీ సే కోయీ లత గొప్పతనం ఏమిటి? ఒక గీత రచయిత రాస్తే, ఒక స్వరకర్త రాగం కూర్చితే తను గాయనిగా ఆ పాటను వారిరువురి సృష్టి నుంచి ఒక ఆకాశం ఎత్తుకు పెంచడం. ఏడవ ఆకాశానికి చేర్చడం. బయటకు వచ్చి శ్రోతకు చేరే సమయానికి పాటను అద్భుతంగా మార్చడం. ఒకటి వాస్తవం. లతకు ముందు సంగీత దర్శకులందరూ గాయనీమణుల పరిమితులను దృష్టిలో పెట్టుకుని పాటను కట్టేవారు. లత వచ్చాక ఈ సంకెలలు తెగిపోయాయి. పాటను ఎంత స్వేచ్ఛగా ఎంత విహారప్రాయంగా అయినా కట్టవచ్చు. ఏమిటి బెంగ? లతా ఉందిగా. హిందీ పాటలో ఉచ్చమూ నీఛమూ రెండూ చూపిన ఆర్.డి.బర్మన్ కూడా లతాతో చాలా గొప్ప మెలడీలు రికార్డ్ చేశాడు. అది గుల్జార్ అతడికి పెట్టిన భిక్ష. లేదా లతా మనకు ప్రసాదించిన తిరిపెం. ఆలోచించలేం... ఆమె లేకుండా పాటను ఆలోచించలేం... ఆమె వినా.. ఆమె బినా... నో..నో.. నహీ నహీ. ఆంధీ (1975)లో ఆమె పాడిన పాటతో ముగిద్దాం. తేరే బినా జిందగీ సే కోయీ... షిక్వా... తోనహీ షిక్వా నహీ... షిక్వా నహీ... షిక్వా నహీ.... - ఖదీర్ -
నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు!
చిరు ప్రాయంలోనే స్వర ప్రయాణం మొదలుపెట్టి దశాబ్ద కాలంగా తన గానంతో శ్రోతల్ని తన్మయానికి గురిచేస్తున్నారు ప్రణవి. గాయనిగా, అనువాద కళాకారిణిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న ప్రణవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రణవితో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ. ప్రస్తుతం ఏ ఏ సినిమాలకు పాడుతున్నారు? ముందే చెప్పేయకూడదు. ఎందుకంటే... విడుదలయ్యేంత వరకూ మేం పాడిన పాట అందులో ఉంటుందో లేదో చెప్పలేం. పరిస్థితులను బట్టి ఏమైనా జరగొచ్చు. అందుకే.. మంచి సినిమాలకే పాడుతున్నాను అని మాత్రం చెప్పగలను. ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటే... ఇక్కడ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఒకసారి రికార్డ్ చేసిన పాటను ఆల్బమ్ నుంచి తప్పించడానికి ఎన్నో కారణాలుంటాయి. సరే... గాయనిగా మీకు దక్కిన గొప్ప ప్రశంస? నేటి జనరేషన్లో ప్రణవి పాటంటే నాకిష్టం అని ఓ సందర్భంలో కీరవాణి అన్నారు. అలాగే... చిత్రగారు కూడా నా పాటను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. అక్కినేని జాతీయ అవార్డు అందుకోవడానికి లతా మంగేష్కర్గారు ఇక్కడకు వచ్చినపుడు, ఆమె ముందు పాడే అవకాశం నాకు వచ్చింది. నా పాట విని లతాజీ ‘బహుత్ అచ్చాహై’ అని మెచ్చుకున్నారు. అసలు గానం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? మా అమ్మ వీణ వాయిస్తారు. పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. నాకు స్వరజ్ఞానం అమ్మ నుంచే అబ్బింది. నాన్న తెలుగు టీచర్. అలాగే... మంచి కళాకారుడు కూడా. బాపుగారి వద్ద కూడా పనిచేశారు. వీరిద్దరే నా తొలి గురువులు. నాలోని స్వరజ్ఞానం గమనించి... వారే నాకు సంగీతం నేర్పించారు. తొలి అవకాశం ఎలా వచ్చింది? నేను తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుని. ఇప్పటికి మూడొందల సినిమాల పైచిలుకు డబ్బింగ్ చెప్పాను. సినిమాల్లో చైల్డ్ కారెక్టర్లకు చెప్పేదాన్ని. ‘అతడు’ సినిమాలో త్రిష ఫ్రెండ్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ‘నేను పార్దూ.. నీ పద్దూని’ అనే డైలాగ్ నేను చెప్పిందే. చిన్న డైలాగే అయినా... అది చాలా పాపులర్. అలాగే కళంకిత, అంతరంగాలు, శివలీలలు తదితర సీరియల్స్లో కూడా కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. కెమెరామేన్ సంతోష్శివన్గారు హిందీ, తెలుగు భాషల్లో తీసిన ‘హలో’ సినిమా తెలుగు వెర్షన్కి తొలిసారి పాడాను. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. ఆ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్యగారి ద్వారా కల్యాణ్మాలిక్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ‘ఆంధ్రుడు’ సినిమాలో ఓ శ్లోకం పాడాను. పేరు తెచ్చిన పాటలు? ‘ఛత్రపతి’ సినిమా కోసం నాతో హమ్మింగ్స్ పాడిం చారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయనే... ‘శ్రీరామదాసు’ సినిమా కోసం ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాట ట్రాక్ పాడించారు. ఆ పాట శ్రేయాఘోషల్ పాడాలి. కానీ నా పాట నచ్చి ఉంచేశారు. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. ఇంకా ‘యమదొంగ’లోని ‘రబ్బరు గాజులు’, ‘యంగ్ యమ’, ‘నువ్వు ముట్టుకుంటేనే’ పాటలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కీరవాణిగారు నాకందించిన ప్రోత్సాహం నిజంగా చాలా గొప్పది. మరి ఆర్టిస్టుగా ఎందుకు ప్రయత్నించలేదు? చిన్నప్పుడు ‘హిట్లర్’ సినిమాలో నటించాను. కొన్ని ప్రైవేటు యాడ్స్లో కూడా చేశాను. అయితే.. మా ఇంట్లో ఎవరికీ నటనపై ఆసక్తి లేదు. అందుకే అటువైపు చూడలేదు. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? దానికి టైమ్ ఉంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయితోనే తాళి కట్టించుకుంటా. -
‘జై భారతి. వందే భారతి’
ఇదొక నిరంతర పరిణామం స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్ న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్ఘోష్, ఆనంద్రాయ్, దియామీర్జా, వీర్దాస్, షాహిద్కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఆప్ ఆయే... బహార్ ఆయీ...
హైదరాబాదీ..హేమలత: ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్ను ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో పసితనం వీడక ముందే బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే ‘తూ ఇస్ తరహ్ మేరే జిందగీ మే..’ అంటూ శ్రోతలను ఓలలాడించిన ఆ గొంతు పేరు హేమలత. అసలు పేరు లతా భట్. హైదరాబాద్లోని సంప్రదాయ రాజస్థానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కొద్దికాలానికే ఆమె కుటుంబం కోల్కతా చేరుకుంది. బాల్యం అక్కడే గడిచింది. చిన్ననాటి నుంచే హేమలత సంగీతమంటే చెవి కోసుకునేది. ఆమె తండ్రి జయ్చంద్ భట్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే అయినా, ఛాందసుడైన ఆయనకు కూతురు పాడటం ఇష్టం ఉండేది కాదు. అయినా, ఆమె రహస్యంగా పూజా పెండాల్స్ వద్ద పాడేది. హేమలత తండ్రి జయ్చంద్ భట్ శిష్యుడు గోపాల్ మల్లిక్ ఆమె ప్రతిభ గుర్తించాడు. జయ్చంద్ను ఒప్పించి, కోల్ కతాలోని రవీంద్ర స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఆమె చేత పాడించాడు. అప్పుడామె వయసు ఏడేళ్లు మాత్రమే. అక్కడి నుంచి ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా నుంచి ఆమె కుటుంబం 1966లో బాంబేకు తరలి వచ్చింది. అక్కడే ఆమె ఉస్తాద్ అల్లారఖా ఖాన్, ఉస్తాద్ రియాజ్ ఖాన్ వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ఏసుదాస్తో అత్యధిక హిందీ గీతాలు పాడిన ఘనత గానగంధర్వుడు కె.జె.ఏసుదాస్తో కలసి అత్యధిక సంఖ్యలో హిందీ గీతాలు పాడిన ఘనత హేమలతకే దక్కుతుంది. హిందీ, బెంగాలీ, భోజ్పురి, పంజాబీ, రాజస్థానీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళ, మలయాళ, డోగ్రీ, కొంకణి, ప్రాకృత, సంస్కృత వంటి స్వదేశీ భాషలు, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు కలిపి మొత్తం 38 భాషల్లో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఎస్.డి.బర్మన్, మదన్మోహన్, సలిల్ చౌదరి, ఖయ్యాం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్జీ-ఆనంద్జీ, రాజ్కమల్, ఉషా ఖన్నా, రవీంద్ర జైన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో చిరస్మరణీయమైన గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ముకేశ్, మన్నా డే, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, ఏసుదాస్, శైలేంద్ర సింగ్, సురేశ్ వాడ్కర్ వంటి గాయకులతో కలసి యుగళగీతాలతో ఉర్రూతలూగించింది. సినీగీతాలే కాదు, భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బంలు, వివిధ దేశాల్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీలూ ఆమెను లక్షలాది మంది అభిమానులకు చేరువ చేశాయి. ‘చిత్చోర్’లో పాడిన ‘తూ జో మేరే సుర్ మే...’ పాట 1977లో ఆమెకు ‘ఫిలింఫేర్’ ఉత్తమ గాయని అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఫకీరా’, ‘సునయనా’, ‘ఆప్ ఆయే బహార్ ఆయీ’, ‘ఆప్తో ఐసా న థే’ వంటి సినిమాల్లో హేమలత పాడిన పలు హిట్ పాటలు సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అమెరికాలో మ్యూజిక్ అకాడమీ అమెరికాలో మ్యూజిక్ అకాడమీ స్థాపించిన ఏకైక సినీ గాయని హేమలత మాత్రమే. ప్రపంచ సిక్కుల సంఘం, పంజాబ్ ప్రభుత్వాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆనంద్పూర్ సాహిబ్ అకల్ తక్త్లో 1999లో జరిగిన ఖల్సా పంత్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా ‘గుర్మత్ సంగీత్’ గీతాలను వాటి అసలు రాగాలలో ఆలపించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకుంది. - పన్యాల జగన్నాథదాసు -
పంచామృతం: ఆత్మ బంధువులు..!
అనుకోకుండా భారతదేశంతో అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నారు.. ఆసక్తికరమైన రీతిలో ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ దేశం గొప్పదనమో.. వాళ్ల గొప్పదనమో కానీ... సేవాదృక్పథంతో కొనసాగుతోంది ఆ అనుబంధం. అందుకే వీళ్లను మన వాళ్లే అనుకోవచ్చు! ఆత్మబంధువులని చెప్పవచ్చు! బ్రెట్ లీ... ఈ ఆస్ట్రేలియన్ సూపర్ఫాస్ట్ బౌలర్ మైదానంలో భారతీయ క్రికెట్టీమ్ అభిమానులను బాధపెట్టిన వాడే అయినా... భారత్ అంటే ప్రత్యేకాభిమానం చూపడం ద్వారా ఇష్టుడిగా మారాడు. సంగీతం అంటే ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్న లీ... లతా మంగేష్కర్తో కలిసి ఒక ఆల్బమ్తో స్వరకల్పన చేశాడు. ముంబైలోని అనాథ ఆశ్రమాలతో కలియదిరుగుతుంటాడు లీ. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ యువరాజు పెద్దగా మీడియా హడావుడి కూడా లేకుండా భారత్ వచ్చి వెళుతూ ఉంటాడు. తమ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు భారత్లో సాగించే సేవాకార్యకలాపాలకు అండగా ఉంటాడు ప్రిన్స్. భారతదేశ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రిన్స్ ప్రత్యేకంగా విద్య, ఆరోగ్యం విభాగాలపై దృష్టి నిలిపిపనిచేయాలని చారిటబుల్ ట్రస్ట్లకు సూచిస్తుంటాడు. మిషెల్ ఒబామా... భారతీయ సంస్కృతితో తాను ప్రేమలో పడ్డానని ప్రకటించుకొంది అమెరికన్ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా. అమెరికా అధ్యక్షుడైన భర్త బరాక్ ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు..మిస్టర్ ఒబామా భారతీయ ప్రముఖులతో వాణిజ్య వ్యవహారాల గురించి చర్చలు జరపగా.. మిసెస్ ఒబామా మాత్రం వివిధ స్వచ్చంధ సంస్థలతో మమేకం అయ్యారు. వాళ్లతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నారు. అప్పట్లో పరిచయం అయిన వివిధ స్వచ్ఛంద సంస్థలవారితో ఇప్పటికీ మిషెల్సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వాళ్లకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నారు మిషెల్. స్టీవ్ వా... ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ మాజీకెప్టెన్కు కోల్కతాలో అభిమాన సంఘాలే ఉన్నాయి! 1986లో తొలిసారి టీమ్తో పాటు భారత పర్యటనకు వచ్చిన వా.. కోల్కతాలోని ఒక ఆశ్రమంలో ఉన్న కుష్టువ్యాధి గ్రస్తులైన పిల్లలను చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి వాళ్ల సంరక్షణను చూస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా.. అనాథల్లా పెరుగుతున్న ఆ పిల్లలకు ఆలంబనగా మారాడు. ప్రత్యేకించి కోల్కతా నగరం మీదే దృష్టి నిలిపిన స్టీవ్ తరచూ అక్కడికి వస్తూ కొన్ని అనాథ ఆశ్రమాల బాలురతో సరదాగా క్రికెట్ ఆడుతూ అలరిస్తూ ఉంటాడు. రఫెల్నాదల్.. ఈ స్పెయిన్ టెన్నిస్ బుల్.. మన దేశంలో టెన్నిస్ అభివృద్ధికి సహకారం అందిస్తున్నాడు. అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఒక స్పెయిన్ సంస్థతో కలిసి టెన్నిస్ అకాడమీని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నాడు. వారికి నాదల్తో ఉన్న సంబంధాలు అతడికి భారత్తో అనుబంధం ఏర్పరిచాయి. -
క్యాంపాకోలా వాసులకు లతా మంగేష్కర్ మద్దతు
ముంబై: కాంప్యాకోలా వాసులకు ప్రముఖ గాయకురాలు లతామంగేష్కర్ మద్దతు పలికారు. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్యులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో తమ ఫ్లాట్లను ఖాళీ చేస్తున్నవారికి అండగా నిలవాలని, వారిని శిక్షించవ ద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం అడగాలనుకుంటున్నా.. సుప్రీంకోర్టు నిర్ణయంతో వందలాదిమంది పిల్లలు, పెద్దలు నిరాశ్రయులయ్యారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ముగ్గురు ఇప్పటికే మృతిచెందారు కూడా. ఇది అన్యాయం. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్య జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల’ని ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణ ముంబైలోని క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 1981 నుంచి 1989 మధ్య కాలంలో ఏడు భవనాలను నిర్మించారు. ఇక్కడ కేవలం ఆరు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా బిల్డర్లు నిబంధనలను అతిక్రమించారు. మిడ్టౌన్ బిల్డింగ్లో 20 అంతస్తులు, ఆర్చిడ్ బిల్డింగ్లో 17 అంతస్తులు నిర్మించారు. ఇలా మొత్తం ఏడు భవనాల్లో అక్రమంగా 102 ఫ్లాట్లు ఉన్నాయి. వీరంతా ఖాళీ చేయాలని, అదనంగా ఉన్న అంతస్తులను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. -
'మానాన్నను నవాజ్ షరీఫ్ ఆరాధించేవారట'
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైఫీ అజ్మిని నవాజ్ షరీఫ్ ఆరాధించేవారని తెలుసుకోవడం ఆనందం కలిగించిందని షబానా తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని నవాజ్ తనతో అన్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు సంయుక్తంగా చిత్రాలు నిర్మించే విషయంపై నవాజ్ షరీఫ్ తో చర్చించానని షబానా వెల్లడించారు. అయితే ఇరుదేశాలు సంయుక్తంగా చిత్రాలను నిర్మించాడానికి షరీఫ్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఓ సందేశంతో నవాజ్ షరీఫ్ వచ్చారని షబానా ఆజ్మీ తెలిపారు. -
‘దీనానాథ్’ అవార్డు ప్రదానం
ముంబై: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులను సామాజిక కార్యకర్త అన్నాహజారే, సంగీత విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, సీనియర్ నటుడు రిషి కపూర్ తదితరులకు గురువారం రాత్రి ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి యేటా ఏప్రిల్ 24వ తేదీన ‘స్మృతి దిన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, సంగీతం, నటన, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు దీనానాథ్ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు వివరించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష పారితోషికం, మెమెంటో అందజేశామన్నారు. సినిమా రంగానికి గాను సీనియర్ నటుడు రిషికపూర్కు, సంగీత రంగంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త అన్నాహజారే, శివాజీ సతమ్, పండిట్ పండరీనాథ్ కొల్హా పురీ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. కాగా రిషికపూర్ రెండేళ్ల వయసులో తన చేతుల్లో ఆడుకున్నాడని, ఇప్పుడు ఒక సీనియర్ నటుడిగా తన తండ్రి పేరిట అవార్డును అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉస్తాద్ జాకీర్ హస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అతడు తనను కన్నకూతురిగా చూసుకునేవారని, ఒకే రోజు ఆయన సంగీత సారథ్యంలో ఆరు పాటలు రికార్డు చేశామని లత వివరించారు. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన రాలేగాంసిద్ధి మీదుగా ప్రయాణించినప్పుడు హృదయ్నాథ్ మంగేష్కర్ తనను కలిసినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఇటీవల కాలంలో రూ.కోటికిపైగా పారితోషికం కలిగిన అవార్డులను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారని అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే లతా మంగేష్కర్ తనను ఈ అవార్డు కోసం సంప్రదించిన వెంటనే ఆనందంగా అంగీకరించానని వివరించారు. -
గానకోకిలకు గుండెపోటు?
సాక్షి, ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్కు గుండెపోటు వచ్చిందన్న వదంతులు చిత్ర పరిశ్రమను కుదిపివేసింది. అయితే ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ నటి నందా మరణంతో విషాదంలో ఉన్న చిత్రపరిశ్రమకి లతా మంగేష్కర్కు గుండె పోటు వచ్చి పరిస్థితి విషమంగా ఉందన్న వదంతులు మరింత దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ వదంతులు మంగళవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీనిపై లతా మంగేష్కర్ స్వయంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. ‘మీ అందరి అభిమానాలతో బాగానే ఉన్నా. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానాలు భవిష్యత్లోనూ ఇదేవిధంగా లభిస్తాయని కోరుకుంటున్నాను. నా కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతల’ని ఆమె పేర్కొన్నారు. అయినా బుధవారం ఉదయం కూడా ఈ వదంతుల పర్వం కొనసాగింది. దీనిపై మీడియా ప్రతినిధులతోపాటు ఆమె అభిమానులు లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలెట్టారు. దీంతో ఆమె స్వయంగా వాయిస్ మెసేజ్ను ట్వీట్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
తూ జహా జహా చలేగా...
సచిన్కు ‘గాన కోకిల’ జ్ఞాపిక ముంబై: ఆ ఇద్దరూ ‘భారత రత్న’లు... ఇరువురి మధ్య తరాల అంతరం ఉన్నా తమదైన రంగంలో దేశానికి ప్రతిష్ట తెచ్చిన దిగ్గజాలు... వారిద్దరి కలయిక ఎన్నో జ్ఞాపకాల సమాహారం. ‘గాన కోకిల’ లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్క చోట కలిశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఇంట్లో ఆదివారం ఈ భేటీ జరిగింది. తన క్లాసిక్ పాటలైన తూ జహా జహా చలేగా (మేరా సాయా), పియా తుఝ్సే నైనా లాగే రే (గైడ్) పాటల సాహిత్యం రాసి ఉన్న రెండు ఫ్రేమ్లను సచిన్కు లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరు తమకు మరొకరిపై ఉన్న గౌరవభావాన్ని, ప్రేమను చాటుకున్నారు. ‘నేను కొత్త ఇంట్లోకి మారుతున్నాను. మ్యూజిక్ రూమ్లో లతా దీదీకి సంబంధించిన ఏదైనా వస్తువు ఉంచాలనుకున్నా. ఆమె నాకు తల్లిలాంటిది. ఎక్కడ క్రికెట్ ఆడినా ఆమె పాటలు వింటుంటే నాతోనే ఉన్నట్లనిపించేది’ అని సచిన్ వ్యాఖ్యానించారు. ‘సచిన్ ఆటంటే నాకు చాలా ఇష్టం. అతని వ్యక్తిత్వం అంటే ఇంకా ఇష్టం. సచిన్ మరికొంత కాలం క్రికెట్ ఆడాల్సింది’ అని లతా పేర్కొన్నారు. తన 200వ టెస్టు మ్యాచ్ జెర్సీని ఈ సందర్భంగా లతా మంగేష్కర్కు సచిన్ బహుకరించారు. -
సిబల్ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో సల్మాన్, రెహ్మాన్
-
సచిన్ భారత రత్నకు అర్హుడు: లతా మంగేష్కర్
భారత అత్యున్నత పురస్కారం భారత రత్నకు మాస్టర్ బ్లాస్టర్ అర్హుడు అని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ అభిప్రాయపడ్డారు. మరేవరూ సాధించలేని విధంగా దేశం కోసం సచిన్ క్రీడా రంగానికి సేవలందించారు అని ఆమె అన్నారు. సచిన్ మరో సంవత్సరం పాటు ఆడితే బాగుండేదని ఆమె అన్నారు. తొలి ఇన్నింగ్స్ సచిన్ ఆడిన తీరు చూస్తే మరో రెండేళ్లపాటు ఆడే సత్తా ఉంది అని లతా మంగేష్కర్ వ్యాఖ్యానించారు. 'రిటైర్మెంట్ తర్వాత సచిన్ క్రికెట్ అకాడమి ఏర్పాటు చేయాలి. తనలో ఉన్న అద్భుత ప్రతిభను భావితరం క్రికెటర్లు అందించాలి' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్ వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో 74 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
నరేంద్ర మోడీకి లతా మంగేష్కర్ ప్రశంసలపై వివాదం
భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించడం వివాదాస్పదమైంది. దేశ అత్యున్నత పౌరపురస్కార గ్రహీత మతతత్వవాదిని ప్రశంసించడం విచారకరమని ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ చందూర్కర్ అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జనార్దన్ డిమాండ్ చేశారు. ఆయన లతా మంగేష్కర్ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనివుందని లతా ఇటీవల వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కార గ్రహీతలందరూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించరాదని ముంబై కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలపైనా అభిమానంతో మెలగాలని, కులమతాలకు అతీతంగా వారిని ఆరాధిస్తారని చెప్పారు. -
లతా మంగేష్కర్కు యశ్ చోప్రా అవార్డు
ముంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్కు మరో అరుదైన గౌరవం లభించింది. హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకుగాను యశ్ చోప్రా స్మారక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. శనివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ చేతుల మీదుగా ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రా స్మారకార్థం టీఎస్సార్ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ మాట్లాడుతూ.. తనకు యశ్చోప్రా ఎంతో సన్నిహితుడని తెలిపారు. ‘‘మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. డాక్టర్లు బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనుకున్నాను. అవార్డు కోసమో లేదా రూ.10 లక్షల నగదు కోసమో నేను ఇక్కడకు రాలేదు. యశ్జీ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ఎంతో సన్నిహితుడు’’ అని తెలిపారు. చోప్రా భార్య పమేలా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను లతా మంగేష్కర్ను తొలి యష్ చోప్రా స్మారక అవార్డుతో సత్కరించాలని నిర్ణయించినట్టు సుబ్బరామిరెడ్డి తెలిపారు. హేమమాలిని, సిమి గారేవల్, అనిల్ కపూర్లతో కూడిన కమిటీ.. ఈ అవార్డుకు లతను ఎంపిక చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రీదేవి, బోనీకపూర్, అనుష్కా శర్మ, జితేంద్ర, రాణీ ముఖర్జీ, అక్షయ్ కుమార్, సుభాష్ ఘాయ్, సోనాలి బింద్రె తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
అపురూపం: తియ్యని స్వరానుబంధం
లతామంగేష్కర్ - పి.సుశీల నైటింగేల్స్ ఆఫ్ ఇండియా. జాతి గర్వపడే కోయిలలు. ఒకరు ఉత్తరాన్ని ఏలితే ఇంకొకరు దక్షిణాది సంగతి చూసుకున్నారు. అనుకరణకు ఏమాత్రం వీలు కాని తియ్యటి గొంతులు వారివి. భాష ఉచ్ఛారణలో, భావ ప్రకటనలో ఇప్పటివారికి వారే డిక్షనరీ! లతాజీకి సుశీలగారంటే ఎంతో అభిమానం. అలాగే సుశీలగారికి లతాజీ అంటే గురుభావం! గాత్రం రీత్యా, రూపం రీత్యా ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండటంతో అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. లతాజీ కూడా సుశీలగారిని తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు లతాజీ. అలాగే బొంబాయి వెళితే లతాజీని కలవకుండా వచ్చేవారు కాదు సుశీల! ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ గాయిని... ఇలా వ్యక్తిగత అవార్డులను భారత ప్రభుత్వం 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పి.సుశీలగారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్గారు చెన్నైలో సుశీలగారికి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన సాటి గాయనికి దక్కిన ఈ గౌరవానికి లతాజీ పొంగిపోయి బొంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చి సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్ను కూడా బహుకరించారు. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సందర్భంగా వారిద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటున్న స్టిల్(పైన) అప్పటిదే. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం సుశీలగారికి పద్మభూషణ్ ప్రదానం చేసిన సందర్భంలో తన మానసిక గురువు అయిన లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి బొంబాయి వెళ్లినప్పుడు వారిరువురూ కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటున్న దృశ్యాన్నీ (కింది ఫొటో) చూడవచ్చు. సంవత్సరాలు మారాయి! కానీ వారి మధ్య సంబంధాలు మారలేదు! వారి అనుబంధం, స్వర బంధం అంత తియ్యనిదీ, చెరగనిదీ, తరగనిదీ కాబట్టే ఇన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా అలా కొనసాగుతూనే ఉంది... ఉంటుంది!! - ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్ -
లతా మంగేష్కర్కు ఆలయం
తమ ఆరాధ్య హీరోలు, హీరోయిన్లకు అభిమానులు ఆలయాలను నిర్మించిన సంఘటనల గురించి విన్నాం. భారతదేశంలో అందునా దక్షిణాదిన సినీతారలను వెర్రిగా అభిమానిస్తారు. విశేషమేంటంటే.. సుప్రసిద్ధ గాయని కోసం ఓ అభిమాని గుడి నిర్మించింది. మధ్యప్రదేశ్కు చెందిన వర్ధమాని గాయని వర్షా జాలని.. భారత గానకోకిల లతా మంగేష్కర్కు వీరాభిమాని. లతాను దేవతలా ఆరాధించే వర్ష తన ఇంట్లోనే ఆమె కోసం ఓ ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని లత ఫొటో ఉంచింది. వర్ష ఆ ఫొటో ముందు నిల్చునే పాటలు పాడటం సాధన చేసేదట. 'రెండు దశాబ్దాలుగా లతాజీ ప్రార్థన మందిరంలో సాధన చేస్తున్నాను. ఆమె ఫొటో చూడగానే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలుగుతాయి' అని వర్ష అంటోంది. ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆశిస్తున్న వర్ష ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. మూడ్రోజుల క్రితం తన ఆరాధ్య గాయని లతాను ఆమె ఇంట్లో కలసే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోతోంది. -
లతా మంగేష్కర్కు బాలీవుడ్ ప్రముఖుల అభినందన
గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. లతాజీ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరిన్ని పాటలు పాడాలని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డ్రీమగర్ల్ హేమమాలిని అభిలషించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో విద్యాబాలన్, మిఖా సింగ్ తదితరులున్నారు. 1942లో 13 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించిన లతా మంగేష్కర్ 'భారత గానకోకిల'గా అభిమానులకు సుపరిచితురాలు. సినీ పరిశ్రమలో ఏడు దశాబ్దాల నుంచి గాయనిగా కొనసాగుతున్నారు.