Leo Movie
-
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
ఎల్సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
'లియో' పార్ట్ 2 కథ రెడీ అంటూ షాకింగ్ కామెంట్ చేసిన డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా 'లియో' గతేడాదిలో విడుదలైంది. సినిమాపై విమర్శలు వచ్చినా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. ఇప్పుడు లియో సీక్వెల్ కథ రెడీ అంటూ లోకేష్ కనగరాజ్ తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్లో ఈ బిగ్ ప్రాజెక్ట్పై అధికారికంగా ప్రకటన ఏమైనా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో రానున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల కారణంగా ఇదే విజయ్కి చివరి సినిమా అవుతుందని కూడా నెట్టింట వైరల్ అయింది. దీనికి తెలుగు నిర్మాతలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ బిగ్ ప్రాజెక్ట్ డీల్కు ఫుల్స్టాప్ పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది స్క్రీన్ ప్లే ఆలస్యం కావడంతో జూలై నెలలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
రొమాన్స్తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
విజయ్పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళసినిమా: నాలుగు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తుస్తూ కథానాయిక రాణిస్తున్నారు నటి త్రిష. అంతే కాకుండా ఇప్పుటికీ పలు భాషల్లో అగ్ర కథా నాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈమె. అన్నీ కుదిరితే 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో మునిగిపోయేవారు. ఇక నిర్మాత, వ్యాపారవేత్త అయిన అరుణ్ మణియన్తో నిశ్చితార్థం, పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తని త్రిష నటనపైనే దృష్టి సారించారు. అలా మధ్యలో నటిగా వెనుకబడినా, చిన్న గ్యాప్ తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుల్ఫామ్లోకి వచ్చారు. అందుకు కారణం దర్శకుడు మణిరత్నం అని చెప్పకతప్పదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఆయన ఓ అవకాశం ఇచ్చి నటిగా త్రిషకు పునర్జన్మనే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ చైన్నె చిన్నది కూడా సద్వినియోగం చేసుకున్నారు. యువరాణి కుందవైగా రాజఠీవీని ప్రదర్శించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈమె ఇంతకు ముందు విజయ్ సరనన గిల్లీ, ఆదీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తరువాత లియో చిత్రం ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరి గురించి వదంతులు దొర్లుతున్నాయి. అయితే వాటిలో నిజమెంత అన్నది తెలియదు కానీ, ఇటీవల ఒక భేటీలో విజయ్ గురించి నటి త్రిష మాట్లాడుతూ విజయ్ తానూ పలు చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. అయితే గిల్లీ చిత్రానికి ముందు వరకూ అందరూ చెప్పుకుంటున్నట్లు కాదన్నారు. విజయ్ చాలా నెమ్మదస్తుడని పేర్కొన్నారు. గిల్లీ చిత్రం తరువాత తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు. కాగా ఈ చైన్నె బ్యూటీ ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్ లైఫ్ చిత్రాలతో 40 ఏళ్ల వయసులోనూ బిజీబీజీగా ఉన్నారు. -
రాజకీయాల్లో విజయ్.. లియో సీక్వెల్పై లోకేశ్ వ్యాఖ్యలు వైరల్
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది దసరాకు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్తో లోకేశ్ ఒక సినిమా తీస్తున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ లియో పార్ట్ -2 గురించి పలు ఆసక్తి విషయాలు పంచుకున్నాడు. లియో సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం హీరో విజయ్ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి కూడా.. విజయ్ ఒప్పుకుంటే లియో 2 తప్పకుండా వస్తుంది. అందుకు సమయం కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను. విజయ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. లియో సినిమా విడుదల సమయం నుంచి సెకండాఫ్ పట్ల పలు వమర్శలు వచ్చాయి. అవన్నీ నేను కూడా విన్నాను. రాబోయే సినిమాల్లో ఆ తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాను.' లోకేష్ కనగరాజ్ అన్నారు. విజయ్ ఇప్పటికే ఒప్పుకున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ప్రాజెక్ట్లో ఉన్నాడు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఇదే చివరి చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో లియో సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో తలైవర్ 171 సిద్ధం అవుతుంది. -
స్టార్ డైరెక్టర్తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లియో ఎఫెక్ట్.. లోకేష్ కనగరాజ్పై విజయ్ తండ్రి విమర్శలు
కోలీవుడ్లో సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి అయిన ఎస్ఏ చంద్రశేఖర్ ఒక డైరెక్టర్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యాలు చేశారు. విమర్శలను అంగీకరించే ధైర్యం ఈ కాలంలో దర్శకులకు లేదని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. తన కుమారుడు హీరో విజయ్కు సంబంధించిన కథ వస్తే ఒక తండ్రిలా కాకుండా అభిమానిగా, ఒక దర్శకుడిగా వింటానని ఆయన చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో స్క్రీన్ప్లేకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన చెప్పాడు. స్టార్ హీరో దొరికితే చాలు. కథ లేకపోయినా ఫర్వాలేదనుకునే దర్శకులు ఇప్పటిరోజుల్లో ఉన్నారని చెప్పారు. దర్శకుడి ప్రతిభలో లోపాలు ఉన్నా.. హీరో ఇమేజ్తో సినిమా హిట్ అయితే అది తన గొప్పతనమే అనుకుంటున్నారు. కథతో పాటు స్క్రీన్ప్లే ఉంటే ఆ సినిమా మరింత హిట్ సాధిస్తుందని తన అభిప్రాయం అంటూ ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ఒక సినిమా విషయంలో ఇటీవల ఓ దర్శకుడికి ఫోన్ చేసి అభినందించానని ఆయన ఇలా చెప్పారు.' సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఆ సినిమా చూశాను. వెంటనే ఆ డైరెక్టర్కు కాల్ చేశాను. ఫస్ట్ హాఫ్ బాగుందని చెబుతున్నంత సేపు బాగానే నా మాటలు విన్నాడు. కానీ సెకండాఫ్లో కొంత భాగం బాగాలేదని చెప్పాను. కథలో భాగంగా కన్న కుమారుడినే తండ్రి చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్ కావడం లేదని సలహా ఇచ్చాను. దీంతో వెంటనే అతను సార్.. భోజనం చేస్తున్నాను.. కొంత సమయం తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. కనీసం తర్వాత కూడా కాల్ చేయలేదు. సినిమా విడుదలయ్యాక నేను ఏదైతే అభిప్రాయపడ్డానో ప్రేక్షకల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను చెప్పినప్పుడే కొంత సమయం పాటు ఆలోచించి మార్పులు చేసి ఉంటే ఆ సినిమా ఇంకా మరోస్థాయికి చేరుకునేది. విమర్శలను కూడా తీసుకునేంత పరిణీతి అతనిలో లేవు.' అని ఆయన చెప్పారు. విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే అని కోలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చెప్పిన అంశాలన్నీ ఆ చిత్రానికి కనెక్ట్ అవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. లియోలో విజయ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని ఇమేజ్తోనే సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది, కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని మొదటిరోజు నుంచే ప్రచారం జరిగింది. దీంతో కొంతమేరకు కలెక్షన్స్ తగ్గాయని చెప్పవచ్చు. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేకులు.. అడ్డుపడుతుంది ఆమేనా..?
హీరో విజయ్ సౌత్ ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. రీజనల్ సినిమాతోనే కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాడు. పాన్ ఇండియా రేంజ్ హీరోలకు ధీటుగా తన సినిమా కలెక్షన్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన లియో సినిమా కూడా సుమారుగా రూ. 630 కోట్లు రాబట్టింది. ఒక రీజనల్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే సులభం కాదు. కోలీవుడ్లో ఆయనకు భారీగా ఫ్యాన్స్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న తన అభిమానులకు ఎలాంటి సాయం చేసేందుకు అయినా విజయ్ ముందుంటాడు. రీసెంట్గా తమిళనాడులో తుపాన్ వల్ల రోడ్డున పడిన పలు కుటుంబాలను ఆయన ఆదుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా కోలీవుడ్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్ల్లో తమళనాట తనొక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలబరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తు ఉన్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని టాక్ ఉంది. కానీ విజయ్ రాజకీయ ఎంట్రీని ఆయన సతీమణి సంగీత అడ్డుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే రాజకీయ పార్టీని ప్రకటించడంలో విజయ్ ఆలస్యం చేస్తున్నాడని టాక్ ఉంది. (ఇదీ చదవండి: మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్) రాజకీయాల్లోకి విజయ్ రావాలని కోరుకుంటున్నా.. దానిని ఆయన సతీమణి సంగీతతో పాటు వారి కుమారుడు జాసన్ సంఝా కూడా వ్యతిరేకిస్తున్నారట. విజయ్ రాజకీయ నిర్ణయాన్ని ఆయన భార్య, కుమారుడు వ్యతిరేకించడం వల్లే వారి మధ్య మనస్పర్థలకు ప్రధాన కారణమని తమిళ మీడియా పేర్కొంటుంది. రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడుతుందట. కానీ విజయ్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టి ఉన్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. సంగీత ఒక డాక్టర్.. విజయ్తో వివాహం అయిన తర్వాత గృహిణిగా కొనసాగుతుంది. తన కుమార్తెతో కలిసి ఆమె లండన్లో ఉంటున్నారు. సుమారు గత రెండేళ్లుగా విజయ్, సంగీత కలిసి ఏ ఈవెంట్లో కనిపించలేదు. గతంలో విజయ్ కూడా తన సినిమా పూర్తి అయిన తర్వాత లండన్ వెళ్లేవారు.. ఈ మధ్య కాలంలో ఆయన కూడా అక్కడకు వెళ్లలేదు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కారణం వల్లే వారిద్దరి మధ్య పలు సమస్యలు వచ్చాయని.. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయని తెలుస్తోంది. విజయ్- సంగీత మధ్య ఎలాంటి గొడవలు లేవని విజయ్ సన్నిహితులు పలుమార్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం లియో నటి జనని కూడా విజయ్ విడాకుల గురించి రియాక్ట్ అయింది. విడాకుల వార్త ఉట్టి పుకారే అని ఆమె తెలిపింది. -
లియో డైరెక్టర్కు షాక్.. సినిమాను నిషేధించాలంటూ!
లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత లోకేశ్ తదుపరి చిత్రాన్ని సూపర్స్టార్ తలైవాతో చేయనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) ఇదిలా ఉండగా.. తాజాగా లోకేశ్ కనగరాజ్పై ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. ఆయనకు మానసిక పరీక్షలు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు బెంచ్లో మదురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో హింసాత్మక కంటెంట్ ఉన్నందున లియోని నిషేధించాలని.. అంతే కాకుండా కనగరాజ్కు మానసికంగా పరీక్షలు నిర్వహించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. లియో చిత్రంలో హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై హింస లాంటి సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ ప్రస్తావించారు. లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును కనగరాజ్ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో వాయిదా వేశారు. (ఇది చదవండి: ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!) -
జైలర్, బాహుబలి రికార్డ్స్ను కొట్టేసిన సలార్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా సలార్ అన్నీ థియేటర్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్ పరంగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'లియో' సినిమా మొత్తం కలెక్షన్లను సలార్ అధిగమించింది. ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డును బద్దలు కొట్టేందుకు కూడా సలార్ సిద్ధమైంది. అలాగే తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, సలార్ 11వ రోజు (సోమవారం) రూ.15.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్ రూ.400 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 650 కోట్ల రూపాయలను రాబట్టింది. బాహుబలి పార్ట్ వన్ సినిమా టోటల్ కలెక్షన్ 650 కోట్లు. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ 'లియో' చిత్రాన్ని 'సాలార్' అధిగమించింది. లియో ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు సంపాదించింది. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 655 కోట్ల రూపాయలు. మరో రెండు రోజుల్లో జైలర్, బాహుబలి రికార్డ్స్ను సలార్ బీట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో జరిగే స్నేహితుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి డంకీ పోటీ లేకపోతే బాలీవుడ్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు. అంతేకాకుండా కార్పోరేట్ బుకింగ్స్ పేరుతో కూడా సలార్ కలెక్షన్స్ కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఏదేమైనా సలార్ పార్ట్-2 మీద భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. -
లియో డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్తో జత కట్టనున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవల తన జీ స్క్వాడ్ బ్యానర్లో తెరకెక్కించిన మొదటి చిత్రం ఫైట్ క్లబ్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం లోకేశ్ కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తదుపరి సినిమా కోసం సోషల్ మీడియాతో పాటు మొబైల్కు కూడా విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రాజెక్ట్పై పూర్తిస్థాయిలో పని చేసేందుకు ఈ నిర్ణయమని పేర్కొన్నారు. దయచేసి ఈ సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చారు. నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 🤗❤️ pic.twitter.com/0EL6PAlbdQ — Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 16, 2023 -
Trisha: 20 ఏళ్ల కెరీర్.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గానే..
వెండితెర మీద తిరుగులేని నటీనటులు కూడా వెబ్తెర మీద ఫోకస్ పెడుతున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు త్రిష కూడా చేరింది. యాక్టింగ్ కెరీర్ ముఖ్యంగా నటీమణుల విషయంలో.. వయసు మీద కాదు ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుందని గ్లామర్ క్వీన్గానూ పేరుతెచ్చుకున్న ఆమెను చూస్తే తెలుస్తుంది. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా ఆమె గ్రాఫ్ అయితే పడిపోలేదు. తన అందం, అభినయంతో ఇటు సిల్వర్ స్క్రీన్నూ అటు వెబ్ స్క్రీన్నూ మెరిపిస్తోంది! ► త్రిష సొంతూరు చెన్నై. బీబీఏ పూర్తి చేసింది. క్రిమినల్ సైకాలజీ చదవాలనుకుంది. పదహారేళ్ల వయసులో ‘మిస్ చెన్నై’ టైటిల్ గెలిచింది. ‘మిస్ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది. మరెన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. ► ఇరవై ఏళ్ల క్రితం ‘జోడీ’లో నటి సిమ్రన్కు స్నేహితురాలిగా నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఆమే ఊహించి ఉండదు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్నవుతానని! ► ‘మౌనం పేసియదే’ తమిళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ‘సామి’, ‘గిల్లి’ చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్గా నిలబెడితే, తెలుగులో చేసిన ‘వర్షం’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు ఆమె క్రేజ్ను పెంచాయి. ► అందరిలాగే త్రిషకూ కొంతకాలం కష్టంగానే సాగింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఆమెకు అచ్చి రాలేదు. కానీ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో త్రిషకు దొరికిన గోల్డెన్ చాన్స్గా చెప్పొచ్చు. అందులో యువరాణి కుందవైగా మెప్పించి తన ఫామ్ను నిలబెట్టుకుంది. ►ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. ఆమె తాజా చిత్రం ‘లియో’ నెట్ఫ్లిక్స్లో, ‘ద రోడ్’ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. విహార యాత్రలు చేయడంలో ముందుంటా. న్యూయార్క్ బాగా నచ్చుతుంది. ఇప్పటికే పలు దేశాలు తిరిగొచ్చాను. ప్రపంచం మొత్తం చుట్టిరావాలన్నదే నా కోరిక. – త్రిష -
రెండు దశాబ్దాలు దాటినా తగ్గేదెలా అంటున్న త్రిష
కథానాయికగా రెండు దశాబ్దాలకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఈ విషయంలో నటి త్రిష అచీవ్ చేశారనే చెప్పాలి. ప్రశంసలు, విమర్శలు, వ్యతిరేకత, ప్రేమ విఫలం ఇలా అన్నిటిని ఎదురొడ్డిన ఈ చైన్నె చిన్నది 21 ఏళ్లుగా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. మొదట్లో జోడి వంటి చిత్రాల్లో సహాయక నటిగా చేశారు. 2002లో అమీర్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా విక్రమ్ సరసన సామి, విజయ్కు జంటగా గిల్లి సూర్యతో ఆరు వంటి చిత్రాల విజయాలు త్రిషను స్టార్ హీరోయిన్ను చేశాయి. ఆ తర్వాత తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా తమిళం తర్వాత తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు ఈమె ఖాతాలో చేరాయి. మధ్యలో కొన్ని లేడి ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించిన అవి త్రిషను నిరాశపరిచాయనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో త్రిష కెరియర్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఒక్కసారిగా ఆమెకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అలా విజయ్కు జంటగా నటించిన లియో చిత్రం కమర్షియల్గా హిట్ అయింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న థగ్స్ లైఫ్ చిత్రంలోని త్రషనే కథానాయికిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా అభినయంలో తన అభిమానులను అలరించడంలో త్రిష తగ్గేదెలా అంటున్నారు. అందుకే ఈమె నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోలు విడుదల చేశారు. అందుకు నటి త్రిష వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
విజయ్తో ఛాన్స్ కొట్టేసిన తెలుగు సినిమా హీరోయిన్
కోలీవుడ్లో దళపతి విజయ్ సరసన నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్ కైనా లక్కీ చాన్సే అవుతుంది. ఆయనతో ఒక చిత్రంలో నటిస్తే చాలు పాపులర్ అయిపోతారు. అలాంటి లక్కీ అవకాశం ఓ యువ నటికి వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతుంది. విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా కుమ్మేసింది అనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈయన తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ, నటి స్నేహ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ముందుగా చెన్నైలో కొంత భాగాన్ని చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర ఆ తర్వాత థాయ్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇందులో మరో ముఖ్య పాత్రలో నటి మాళవిక శర్మ నటించబోతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందు తెలుగులో రామ్ సరసన రెడ్, రవితేజతో నేల టిక్కెట్టు చిత్రాలలో నటించారు. అదేవిధంగా సుందర్.సి దర్శకత్వంలో కాఫీ విత్ ఖాదల్ చిత్రంలో నటించారు. కాగా ఈమె పేరుతో సామాజిక మాధ్యమాల్లో విజయ్ 68వ చిత్రంలో నటిస్తున్నట్లు పోస్ట్ చేశారు. దీంతో మాళవిక శర్మ విజయ్ సరసన నటించబోతున్నట్లు ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఇదే దీనికి సంబంధించి చిత్ర వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా విజయ్ 68వ చిత్రం సన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తరెకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది వాస్తవం కాదని ఈ చిత్రం పక్కా కమర్షియల్ అంశాలతో మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిసింది. -
విజయ్ 68వ చిత్రం అప్డేట్
కోలీవుడ్లో అభిమానులు అందరూ విజయ్ను దళపతిగా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగినట్లు ఆయన నుంచి బ్లాక్బస్టర్ చిత్రం వచ్చి చాలా కాలమైంది. మాస్టర్ చిత్రం తరువాత ఈయన నటించిన 'బీస్ట్' చిత్రం అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత నటించిన 'వారసుడు' మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. ఇక తాజాగా విజయ్ నటించిన 'లియో' చిత్రం ఆయనకున్న స్టామినాతో వసూళ్ల వర్షం కురిపించినా, మంచి రిజల్ట్ను మాత్రం పొందలేకపోయింది. ఈయన తాజాగా నటిస్తున్న తన 68వ చిత్రం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు బిగిల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ సంస్థ రూపొందిస్తోంది. మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఇందులో నటి స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుని, ఆ తరువాత థాయ్లాండ్లో ఫైట్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను జరుపుకుని ప్రస్తుతం మళ్లీ చైన్నెలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా బ్రేక్ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.త్వరలోనే చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా తెరపైకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా కొన్ని ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు, అవి ఊరా మాస్గా వచ్చాయని సమాచారం. మరో విషయం ఏమిటంటే సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత గంగై అమరన్ ఈ చిత్రం కోసం ఒక పాట రాసినట్లు తెలిసింది. -
ఆ రంగంలోకి లియో డైరెక్టర్.. అభిమానుల్లో ఆసక్తి!
ఇటీవలే లియో మూవీ సూపర్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. కోలీవుడ్లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్కు కేరాఫ్గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్తో మాస్టర్, కమలహాసన్తో విక్రమ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తాను జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Need all your love and support 🤗❤️@GSquadOffl pic.twitter.com/9NWou59tuE — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 27, 2023 -
ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద సినిమాలు, స్ట్రీమింగ్ అక్కడే!
థియేటర్లో సినిమాల సందడి ఎలా ఉన్నా ఓటీటీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్లతో కళకళలాడుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ సరికొత్త కంటెంట్ను అందించడంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఆడియన్స్కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. సినీప్రేమికుల కోసం ప్రతివారం కొత్త సినిమాలను మోసుకొస్తుంది ఓటీటీ. మరీ ముఖ్యంగా సినిమాలకు సెంటిమెండ్ డేగా చెప్పుకునే ఫ్రైడే రోజు భారీ చిత్రాలను రిలీజ్ చేస్తుంది. అలా ఈరోజు (నవంబర్ 24) నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం.. లియో దళపతి విజయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లియో. బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూశారు. అదిగో.. ఇదిగో.. అంటూ ఊరించిన లియో ఎట్టకేలకు నేడు ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. యాక్టింగ్తో పాటు యాక్షన్ సీన్స్లోనూ అదరగొట్టింది. దసరాకు రిలీజైన ఈ మూవీ ఓటీటీ డేట్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ది విలేజ్ తమిళ స్టార్ ఆర్య తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ది విలేజ్ అనే హారర్ వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ -
మన్సూర్ అలీఖాన్కు సమన్లు.. నేడు విచారణ
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్కు థౌజండ్ లైట్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో డీజీపీ శంకర్జివ్వాల్ ఆదేశాల మేరకు మన్సూర్పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయన్ని విచారించేందుకు థౌజండ్ లైట్స్ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్ అలీఖాన్పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు. దర్శకుడు పా రంజిత్ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు
మరో వీకెండ్కి అంతా సిద్దమైపోయింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చేవాటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కాబట్టి ఆటోమేటిక్గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 మూవీస్-వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. లిస్టులో చాలా ఉన్నప్పటికీ రెండు మూడు మాత్రమ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) దసరా కానుకగా బిగ్ స్క్రీన్పై రిలీజైన దళపతి విజయ్ 'లియో' సినిమా.. ఈ శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. దీంతో పాటే డీమన్(తమిళ), చావెర్(మలయాళ), పులిమడ, ఒడియన్ లాంటి తెలుగు డబ్బింగ్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇవన్నీ పక్కనబెడితే శ్రీలీల కొత్త మూవీ 'భగవంత్ కేసరి' కూడా ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రానుందని అంటున్నారు. దిగువన లిస్ట్లో స్ట్రీమింగ్ కానుంది అని ఉన్న చిత్రాలు గురువారం రిలీజైనవి, మిగతావన్నీ మాత్రం శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేవని అర్థం. ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (నవంబరు 24th) అమెజాన్ ప్రైమ్ ద విలేజ్ - తమిళ వెబ్ సిరీస్ ఎల్ఫ్ మీ - ఇటాలియన్ మూవీ భగవంత్ కేసరి - తెలుగు సినిమా ఆహా డీమన్ - తమిళ సినిమా అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ - ఎనిమల్ టీమ్ ఎపిసోడ్ సోనీ లివ్ సతియా సోతనాయ్ - తమిళ చిత్రం చావెర్ - మలయాళ మూవీ జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ - తెలుగు వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్ఫ్లిక్స్ లియో - తెలుగు డబ్బింగ్ సినిమా ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ - స్వీడిష్ వెబ్ సిరీస్ ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ - స్పానిష్ సినిమా లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ - టర్కిష్ మూవీ గ్రాన్ టరిష్మో - ఇంగ్లీష్ చిత్రం ద మెషీన్ - ఇంగ్లీష్ సినిమా (నవంబరు 26) పులిమడ - తెలగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) మై డామెన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6 (స్ట్రీమింగ్) ఈ విన్ ఒడియన్ - తెలుగు డబ్బింగ్ మూవీ బుక్ మై షో యూఎఫ్ఓ స్వీడన్ - స్వీడిష్ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద నాటీ నైన్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 - హిందీ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ జోహ్రి - హిందీ సిరీస్ సైనా ప్లే కుడుక్కు 2025 - మలయాళ సినిమా (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) -
విజయ్ 'లియో' ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన నెట్ఫ్లిక్స్
విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్లో మాత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. విజయ్ కెరియర్లో మరో హిట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్ గ్రాండ్గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో లియో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ -
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్గా వివరణ ఇచ్చిన మన్సూర్!
దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా 'లియో' చిత్రంలో కనిపించాడు. అందులో ఆయనతో పాటు నటించిన హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే త్రిషతో పాటు తమిళనాడులోని చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్: నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి తన సోషల్ మీడియాలో ఇలా తెలిపాడు. తన మాటలను తప్పుగా చూపించినందుకు నటుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నటి త్రిష కృష్ణన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో అన్నారు.. లియోలో నటి త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్మెంట్ తీసివేయబడింది. కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే ఆక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు. తాను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో ఇలా రాశారు. 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా చూపించి నాపై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు.' అని తెలిపాడు. ఏం జరిగిందంటే..? కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ‘లియో’ సినిమాలో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’లో కూడా త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది.' అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో సినీ పరిశ్రమ నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చింది. నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. View this post on Instagram A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl) -
ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అలా మాట్లాడటంపై కోలీవుడ్ సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండి చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. త్రిష ట్వీట్లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. లోకేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి. ' అని పోస్ట్ చేశారు. కాగా.. లియో చిత్రంలో ఖాన్ మరణశిక్ష విధించబడిన దోషి పాత్రలో కనిపించారు. తమన్నా సాంగ్పై మన్సూర్ కామెంట్స్ అయితే గతంలో జైలర్ సినిమాలోని కావాలయ్యా.. అనే పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ విమర్శలు చేశారు. A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen… — Trish (@trishtrashers) November 18, 2023 Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023 The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
లియో రీ రిలీజ్.. కారణం ఇదేనా..?
ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం లియో... అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో మాత్రం పర్వాలేదు అనిపించినా మిగిలిన అన్ని భాషల్లో అంతగా మెప్పించలేదు. కమల్ హాసన్తో 'విక్రమ్' సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు పెరిగాయి. కానీ లియో సినిమా చూసిన తర్వాత చాలామంది నుంచి డివైడ్ టాక్ వచ్చింది. లియో విడుదలైన రోజు నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. సినిమా విడుదలైన రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న పని అంటూ విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. సినిమా విడదలైన రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 600 కోట్లుకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ప్రకటిచారు. కానీ అందులో నిజం లేదని నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. లియో విడుదలై ఇప్పటికే 5 వారాలు దాటింది. త్వరలో ఓటీటీలోకి రాబోతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను తమిళనాడులో రీ రిలీజ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సుమారు 100 థియేటర్స్లలో లియోను మళ్లీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గత రెండు వారులుగా తమిళనాట విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాల కోసం లియోను చాలా చోట్ల తొలగించేశారు. ఇప్పుడా సినిమాలు కూడా డిజాస్టర్ బాట పట్టడంతో థియేటర్లకు ప్రేక్షకులు కరవయ్యారు. దీంతో లియో సినిమాను రీరిలీజ్ చేస్తే మళ్లీ థియేటర్లు కలెక్షన్స్ బాట పట్టే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు. -
ఓటీటీకి లియో.. రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఓ ట్విస్ట్!
హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెలలోనే ఓటీటీకి రానుంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో సినిమాలో హాలీవుడ్ నటుడు సెప్టాజినేరియన్ బల్లి పాత్రకు వాయిస్ అందించారు. ఆడమ్ శాండ్లర్ కథను అందించారు. మిగిలిన పాత్రలకు పలువురు హాలీవుడ్ నటులు వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: నాగచైతన్య తొలి సిరీస్ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్) అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఇండియాలో ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకుంటున్నారు. వాస్తవానికి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్ ఇంకా వెల్లడించలేదు. మొదట ఈనెల 16న ఓటీటీకి రావొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ప్రకటించిన లిస్ట్లో 21న లియో మూవీ ఉండడంతో అందరూ విజయ్ సినిమానేని భావిస్తున్నారు. కానీ అదే పేరుతో తెరకెక్కించిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ లియో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. November is for the crowning of heroes 👑🚂🔴🔵#WhatToWatch #NewOnNetflix #NetflixForAll pic.twitter.com/gDzrboSd0P — Netflix India (@NetflixIndia) November 16, 2023 -
వారం రోజులు ముందుగానే లియో.. ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం లియో. అక్టోబర్ 19న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. (ఇది చదవండి: బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..? ) లియో మూవీ ఈనెల 16 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తాజా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావొచ్చని వార్తలు వినిపించాయి. ఇటీవలే ఈ చిత్రం ఆన్లైన్లో లీక్ అయిందని.. అందువల్లే వారం రోజులు ముందుకానే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశముంది. విజయ్కు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. లియో ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నెత్తిన పగిలిన బాటిల్స్, రైతుబిడ్డ సేఫ్.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
దీపావళి పండగ అయిపోయింది. కార్తీకమాసం కూడా వచ్చేసింది. రోజురోజుకీ చలి పెరుగుతోంది. దీంతో మూవీ లవర్స్ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే థియేటర్లలో 'మంగళవారం', 'సప్తసాగరాలు దాటి సైడ్-బి' లాంటి సినిమా కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 31 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. ఎప్పటిలానే ఈ వారం 31 సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ లిస్టులో 'లియో', 'కన్నూరు స్క్వాడ్', 'చిన్నా', 'ద ఫ్లాష్' చిత్రాలు.. చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటు 'సుఖి', 'అపూర్వ' మూవీస్తో పాటు 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 13-19th వరకు) అమెజాన్ ప్రైమ్ ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - నవంబరు 14 కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్ఫ్లిక్స్ క్రిమినల్ కోడ్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబరు 14 హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 14 సబర్అటేర్నా (ఇటాలియన్ సిరీస్) - నవంబరు 14 క్రాషింగ్ ఈద్ (అరబిక్ సిరీస్) - నవంబరు 15 బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 18 డిస్నీ ప్లస్ హాట్స్టార్ అపూర్వ (హిందీ సినిమా) - నవంబరు 15 చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 జియో సినిమా ద ఫ్లాష్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
తమిళనాట సూపర్ స్టార్ ఎవరు.. క్లారిటీ ఇచ్చిన విజయ్
రాజకీయాల్లోకి సినిమా నటులు రావడం అనేది సహజం. కానీ తమిళనాట మాత్రం అది సంచలనం. తొలుత ఎంజీఆర్ (ఎంజీ రామచంద్రన్) ప్రభంజనం సృష్టించగా.. పురట్చి తలైవి జయలలిత దాన్ని కొనసాగించారు. తాజాగా కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రజనీకాంత్ ఊరించి ఊరించి ఉసూరు మనిపించారు. ప్రస్తుతం అశేష అభిమానగణం సంపాదించుకున్న దళపతి విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రవేశమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జల్లికట్టు నుంచి జీఎస్టీ వరకు.. తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టు నుంచి జీఎస్టీ (వస్తుసేవల పన్ను) వరకు ప్రతి అంశంపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తన సినిమాల్లోనూ రాజకీయాలకు సంబంధించిన పంచ్ డైలాగ్లు విసరడం వివాదాస్పదమైంది. అలాగే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) విషయంలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు సైతం ఓదార్పుగా నిలిచి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అలాగే సినిమా ఫంక్షన్లలో ‘కుట్టి స్టోరీ’ పేరుతో తన అభిప్రాయాలను అభిమానులకు తెలియజేయడమే కాకుండా ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఫలితంగా ఆయన సినిమాలు విడుదలకు ముందే వివాదాస్పదమయ్యాయి. అదే అదునుగా ప్రభుత్వాలు కూడా పోలీసుల ద్వారా పలు ఆంక్షలు విధించాయనే వాదన కూడా ఉంది. ఇక అదే కారణంతో ఇటీవల లియో సినిమా ఆడియో ఫంక్షన్ను కూడా నిర్మాతలు రద్దు చేసుకున్నారు. లియో విజయోత్సవ వేదికపై.. ఇక లియో సినిమా విజయోత్సవ వేదికపై సూపర్ స్టార్ ఎవరనే అంశంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాట సూపర్ స్టార్ ఎవరనే అంశంపై రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య చాలా కాలంగా పెద్ద వివాదమే జరుగుతోంది. తాజాగా ఈ వివాదానికి విజయ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు. తాజాగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో లియో విజయోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్ పాట పాడి, డాన్స్ చేసి అభిమానులను సంతోషపరిచారు. అనంతరం ఎప్పటిలానే ఒక చిన్న స్టోరీని చెప్పారు. ఆ తర్వాత ఆయన ‘‘సూపర్ స్టార్ ఎవరనే విషయంపై వివరణ ఇస్తూ పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు ఎంజీఆర్) ఒక్కరే. నడిగర్ తిలగం (శివాజీ గణేషన్)ఒక్కరే. పురట్చి కలైంజ్ఞర్ (కరుణానిధి) ఒక్కరే. అదే విధంగా విశ్వనటుడు (కమలహాసన్) ఒక్కరే. సూపర్ స్టార్ (రజనీకాంత్) ఒక్కరే. తల అంటే (అజిత్) ఒక్కరే. ఇక దళపతి అంటారా (విజయ్) నాకు సంబంధించినంత వరకు దళపతి అంటే రాజుల ఆజ్ఞను పూర్తి చేసేవాడు. నాకు రాజులు అంటే ప్రజలైన మీరే. మీరు చెప్పండి నేను చేసి చూపిస్తాను. మనం ఎవరి మనసుల్ని బాధించరాదు. మనకు చాలా పని ఉంది. పెద్ద లక్ష్యం పెట్టుకుని చేధించాలి. ఏది అసాధ్యమో దాన్ని సాధించడమే విజయం. అహింస నిజమైన ఆయుధం.’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత రానున్న 2026 సంవత్సరం గురించి అడిగిన ప్రశ్నకు ఆ ఏడాది ఫుట్బాల్ టోర్నీ జరగనుందని, ఇందులో కప్పు సాధించడమే ముఖ్యం అని చెప్పడంతో తమ అభిమాన నటుడి రాజకీయ రంగప్రవేశం ఖాయం అంటూ నినాదాలు హోరెత్తాయి. రాజకీయ వర్గాల్లో జోరందుకున్న చర్చలు ఇక అదే వేదికపై నటుడు అర్జున్ మాట్లాడుతూ హీరో విజయ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. నామ్ తమిళర్ నేత సీమాన్ కూడా విజయ్ రాజకీయాల్లోకి వస్తే వెల్కమ్ చెబుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఉత్కంఠగా మారింది. -
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
నా కెరియర్లో ఎక్కువగా విజయ్తోనే పయనించా: త్రిష
కోలీవుడ్లో ఇప్పుడు మంచి రైజింగ్లో ఉన్న నటి త్రిష. ఈ బ్యూటీ వయసు 40 ఏళ్లు. నటిగా 25 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. అయినప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. ఇప్పటికీ అవివాహితగా ఉన్న ఈమె ప్రముఖ నటులకు జంటగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల విజయ్కు జంటగా నటించిన లియో చిత్రం విడుదలై అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. కాగా బుధవారం రాత్రి చైన్నెలో జరిగిన లియో చిత్ర విజయోత్సవ వేడుకలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు రెండున్నర గంటల పాటు ఆయన చెప్పిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు. లోకేశ్ కనకరాజ్ అప్పుడు ఏం చెప్పారో దాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్ సరసన నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. స్కూల్లో చదువుకున్న వారు కొన్నేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని తాను అనుభవిస్తున్నట్లు చెప్పారు. తన కెరీర్లో తాను ఎక్కువగా పయనించింది విజయ్తో అని తెలిపారు. విజయ్ నెమ్మదితనమే ఆయన విజయానికి కారణంగా పేర్కొన్నారు. తనను కలిసే వారు.. స్నేహితులు మళ్లీ విజయ్కు జంటగా ఎప్పుడు నటిస్తారు అని పదేపదే అడుగుతుండే వారన్నారు. అది ఇన్నాళ్లకు జరిగిందని, లియో చిత్రంలో విజయ్ తాను మళ్లీ జతకట్టామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కూడా తమ జంట వర్కౌట్ అయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నటీమనులకు ఉత్తాన్న పతనాలు ఉంటాయని, అయినప్పటికీ అన్నివేళలా సంతోషంగా ఉండాలన్నారు. తాను అలా ఉండటం వల్లే తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చానని త్రిష పేర్కొన్నారు. -
నేడు లియో వేడుకలు.. పట్టుబట్టి సాధించుకున్న విజయ్ ఫ్యాన్స్
దళపతి విజయ్ నటించిన 'లియో' చిత్రం థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 12 రోజుల్లో రూ.540 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాత ప్రకటించారు. ఇది అబద్ధం అని చాలా మంది అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా చిత్ర బృందం లియో విజయంపై సంబరాలు జరుపుకుంటోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా లియో నిలిచింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు విజయ్ అభిమానులతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడకకు కూడా తమిళనాడు ప్రభుత్వం మొదటగా అనుమతి ఇవ్వలేదు. కానీ అభిమానుల ఒత్తడి వల్ల లియో విజయోత్సవ వేడుకలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై లియో టీమ్ ఓ వీడియోతో అధికారిక ప్రకటన చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన లియో చిత్రం మంచి విజయం సాధించింది. అక్టోబర్ 19న ఈ సినిమా వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు గానూ లియో టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహిస్తోంది. నవంబర్ 1వ తేదీ బుధవారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయింత్రం చెన్నైలో జరగనున్న ఈ షోకు సంబంధించిన చిన్న ప్రోమో వీడియోను కూడా చిత్ర నిర్మాతలు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో సక్సెస్ మీట్ ఘనంగా జరగనుంది. #Thalapathy oda kutty story illama epdi nanbaa 🎙️🎤#Leo🙊sry parthiban's moththa family & crew is coming for you all ❤️#TheRoarOfLeo - Bloody sweet Victory 🦁 Tomorrow 🔥 P.S. Intha vaati miss aagaathu👍#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers… pic.twitter.com/KESdWKvHOv — Seven Screen Studio (@7screenstudio) October 31, 2023 -
లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?
కోలీవుడ్ హీరో ‘లియో’ సినిమా అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా రూ. 500 కోట్ల మార్క్ను దాటినట్లు తెలుస్తోంది. LCU లో భాగంగా ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్బస్టర్ కొట్టాయి. లియో కూడా తమిళ్ వర్సెన్ బాగానే సక్సెస్ అయింది. కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదని చెప్పవచ్చు. లియో సినిమాకు సెన్సార్ వారు సుమరు 15కు పైగా కట్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ వారు కట్ చేసిన సీన్లు ఉండుంటే ఇంకా బాగుండేది అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు లియో మేకర్స్ను కోరారు. దీంతో లోకేష్ టీమ్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరుకున్నట్లుగా నవంబర్ 3 నుంచి జీరో కట్స్తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. కానీ ఈ సినిమా కేవలం 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారి కోసం మాత్రమేని షరతు పెట్టారు. కాబట్టి నవంబర్ 3 నుంచి చిన్నపిల్లలతో ఈ సినిమాకు వెళ్తే అనుమతి ఉండదని వారు తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు నరబలులు లాంటి సీన్లు ఉన్నాయట... వాటిని మొదట సెన్సార్ వారు అంగీకరించలేదు. ప్రస్తుతం వాటిని ప్రసారం చేయాలంటే A సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఎలాంటి కట్స్ లేకుండా నవంబర్ 3 నుంచి ఆడియన్స్ ముందుకు రానుంది లియో. కాబట్టి మళ్లీ చూడాలంటే పిల్లలతో కాకుండా 18 ఏళ్లు నిండిన వారు థియేటర్కు వెళ్లవచ్చు. By popular demand, #LEO uncut (strictly for ages 18+) is coming to @cineworld cinemas from Friday. The first Tamil film in UK to release with an 18 classification.. 💣🔪🔥🧨🩸 Round two, are you ready? Ticket sales open TOMORROW! 🤜 pic.twitter.com/DfF0FpgkbO — Ahimsa Entertainment (@ahimsafilms) October 31, 2023 -
లియో ఎఫెక్ట్.. రజనీకాంత్ సినిమాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న లోకేష్ కనగరాజ్
నటుడు విజయ్తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రం అక్టోబర్ 19న విడుదలై మిక్సిడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీని తర్వాత రజనీకాంత్తో లోకేష్ ఒక సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. తలైవా 171 చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ నిమగ్నమయ్యారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని కొన్ని వారాల క్రితం ప్రకటించారు. లియో విడుదల తర్వాత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ పలు విషయాలను పంచుకున్నాడు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నాడు. రజనీకాంత్తో తీయనున్న సినిమాకు పూర్తి సమయం కేటాయించాలని ఆయన ప్రకటించాడు. లియో గురించి సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు తెలిపిన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఏప్రిల్లో తలైవా 171 ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే మళ్లీ సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: వరణ్ తేజ్ పెళ్లికి సమంత, నాగచైత్యన్యతో పాటు మరో క్రేజీ హీరోయిన్) అలాగే ‘లియో’ సినిమాకు కొందరు కావాలనే నెగెటివ్గా రివ్యూలు ఇచ్చారని ఆయన తెలిపాడు. లియో విడుదలైన రోజే కావాలని కొందరు యూట్యూబ్ ఛానల్స్ వారు నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా.. కొందరు వాటిని కొట్టిపడేశారని చెప్పాడు. జర్నలిస్ట్లకు ఎప్పటికీ కృతజ్ఞలు చెప్పాలని ఆయన తెలిపాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులతో పాటు జర్నలిస్ట్లు కూడా ప్రధాన కారణమన్నారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటా.. ఇకపై నా దృష్టి అంతా 'తలైవా171' మీదే ఉంటుందన్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ నెగెటివ్ షేడ్ హైలైట్ కానుంది.' అని లోకేష్ చెప్పాడు. రజనీ విలనిజం రజనీకాంత్ విలనిజం అంటే తనకు ఇష్టమని, తలైవా 171లో ఆయన విలనిజంతో భయపెడుతానని లోకేష్ కనగరాజ్ అన్నారు. ప్రస్తుతం సూపర్స్టార్గా కొనసాగుతున్న రజనీకాంత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విలన్. తనకు విలన్గా నటించాలని ఉందని ఓ అవార్డు వేడుకలో ఆయనే పేర్కొన్నాడు. ఆ ఛాన్స్ ఈ సినిమాకు దక్కిందని లోకేష్ అన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీని తర్వాత తలైవా 171 ప్రారంభం అవుతుంది. కథ ఇప్పటికే రెడీ చేసిన లోకేష్.. ఆరు నెలలు టైమ్ తీసుకుని మరింత స్ట్రాంగ్గా కథను తెరకెక్కించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్పై లియో ఎఫెక్ట్ లోకేష్ కెరీర్లో ఎక్కువ నెగటివ్ తెచ్చుకున్న సినిమా లియో. ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు ముందుగానే విడుదల తేదీ ప్రకటించడం. అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి జరిగింది. దీంతో 'విక్రమ్' రిలీజైన కొన్ని రోజులకే లియోను ప్రారంభించాడు. షూటింగ్ కూడా హడావుడిగా చేశారని టాక్ ఉంది. రిలీజ్ డేట్ డెడ్ లైన్ ఉండటంతో ఆ ప్రెజర్ లియో రిజల్ట్ మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ హడావుడి లేకుండా తలైవా విడుదల తేదీని ప్రకటించకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సరైన ప్లాన్తో తలైవా 171 చిత్రాన్ని తెరకెక్కించాలని ఉన్నట్లు తెలుస్తోంది. -
లియోకు నో సెలబ్రేషన్స్.. ఆ వేడుక జరుగుతుందా?
విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న చిత్రం లియో. కారణం విజయ్ హీరోగా నటించడమే? అనే చర్చ జరిగింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అయితే కారణాలేమైనా చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ చిత్రం లియో. త్రిష, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్ తదతర భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా ఈ చిత్రం వారంలోనే రూ.461 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో లియో చిత్ర విజయోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీస్ బందోబస్తు కోరుతూ నిర్మాత ఆ శాఖాధికారులకు లేఖ రాశారు.ఆ లేఖపై పోలీస్ అధికారులు పలు ప్రశ్నలు స్పందిస్తూ నిర్మాతకు తిరిగి లేఖ పంపారు. ముఖ్యంగా లియో చిత్రం విజయోత్సవానికి వచ్చే సినీ ప్రముఖులు ఎందరు?, అభిమానులు ఎందరు? కార్యక్రమాన్ని ఎన్ని గంటల ప్రారంభించి, ఎన్ని గంటలకు ముగిస్తారు? నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎన్ని కుర్చీలు ఉంటాయి? స్టేడియం నిర్వాహకులు అనుమతి పొందారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను చర్చించిన తరువాతే పోలీస్ బందోబస్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లియో చిత్రం విజయోత్సవ వేడుక జరుగుతుందా? అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్.. ఈ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడున్నది డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాబట్టి. తమిళ స్టార్ హీరోలందరినీ ఒక్కచోటకు చేర్చే పనిలో ఉన్నాడు. ఇందుకోసం ఏకంగా యూనివర్స్నే సృష్టించాడు. ఈ సినిమాల్లో హీరోలతో పాటే నెపోలియన్ అనే ఓ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. ఆ పాత్ర చేసిన నటుడు.. ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? నెపోలియన్ ఎవరు? లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో నెపోలియన్గా ఓ రేంజులో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడి అసలు పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టి పెరిగిన ఇతడు.. 1989లో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. అలా 13 ఏళ్ల పాటు ఇందులోనే కొనసాగాడు. 2002లో 'అళగి' మూవీతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 70 వరకు చిత్రాల్లో రకరకాల పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) 60 ఏళ్లలో స్టార్డమ్ 'ఖైదీ' సినిమాలో నెపోలియన్ అనే కానిస్టేబుల్గా నటించిన జార్జ్ మరియన్.. ఈ మధ్యే రిలీజైన 'లియో' సినిమాలోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో విజయ్ ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ ఎలా గోలచేశారో.. నెపోలియన్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు సేమ్ అదే రేంజులో సౌండ్ చేశారు. ఇక మూవీ చివర్లో హీరో ఫ్యామిలీని కాపాడే టైంలో ఇతడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలా 60 ఏళ్ల వయసులో స్టార్డమ్ సంపాదించాడు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నెపోలియన్గా వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్న జార్జ్ మరియన్.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తర్వాత తీయబోయే ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల్లోనూ కనిపించడం గ్యారంటీ. ఇలా అస్సలు ఊహించని విధంగా లేటు వయసులో యంగ్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) -
లియో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 500 కోట్లు..
-
40 ఏళ్ల బ్యూటీ.. లిప్లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!
హీరోయిన్గా రెండు దశాబ్దాల పాటు కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా అగ్రస్థానంలో అది దక్షిణాది సినిమాలో ఒక్క త్రిషకే దక్కిందని చెప్పేయొచ్చు. జోడి అనే తమిళ చిత్రంలో కథానాయకి సిమ్రాన్కు స్నేహితురాలిగా రెండు మూడు సన్నివేశాల్లో తళుక్కుమన్న త్రిష దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. (ఇది చదవండి: ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!) అలాంటి త్రిష ఒక్కో చిత్రంతో కన్నడ, హిందూ సినీ అభిమానులను పలకరిస్తుందని కూడా అనుకొని ఉండరు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలా 40 ఏళ్ల బ్యూటీ నేటికీ నాటౌట్గా నిలిచి హీరోయిన్గా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, జయంరవి, కార్తీ, ప్రభు, ప్రకాష్రాజ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్వారాయ్ వంటి దిగ్గజాలతో కలిసి నటించి యువరాణి కుందవైగా అందం, అభినయంతో తనదే పైచేయిగా అనిపించుకున్నారు. అంతే ఆ తర్వాత త్రిషకు క్రేజీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన నటించిన లియో చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా లియో చిత్రంలో నటుడు విజయ్తో లిప్లాక్ సన్నివేశంలో నటించి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. కాగా ఈ చిత్ర ఒక వారం వసూళ్లను నిర్మాత అధికారికంగా విడుదల చేశారు. అది చూసిన త్రిష పోలా అదిరిపోలా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్కు అన్ని రోజులు పట్టిందా? ) ఈ సందర్భంగా ఆమె లియో చిత్రంలో నటించిన కొన్ని ఫొటోలను వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్రిష ప్రస్తుతం మరో స్టార్ నటుడు అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. Appadi Podu🔥 pic.twitter.com/5eMWC4LRqU — Trish (@trishtrashers) October 26, 2023 -
విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'లియో'. లోకేశ్ కనగరాజ్ దీనికి డైరెక్టర్ కావడం వల్ల విడుదలకు ముందే ఎక్కడలేని హైప్ వచ్చింది. తీరా గతవారం థియేటర్లలో రిలీజైతే.. ప్రేక్షకులు అనుకున్నంతగా నచ్చలేదు. అయితేనేం వసూళ్లు రూ.300 కోట్ల ఎప్పుడో దాటిపోయాయి. ఇలా థియేటర్లలో ఉండగానే తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 'లియో' సంగతేంటి? తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. 'LCU' పేరుతో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. వీటికి లింక్ చేస్తూ 'లియో' మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై ఓ రేంజులో అంచనాలు ఏర్పడ్డాయి. మ్యూజిక్, టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ చిత్రం.. కథ, కథనాల విషయంలో మాత్రం ఫెయిలైందనేది కొందరు ప్రేక్షకుల వాదన. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ. ఓటీటీలోకి అప్పుడేనా? ఇకపోతే థియేటర్ రిలీజ్కి ముందే 'లియో' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో భాగంగానే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్ను సైతం లియో బద్దలు కొట్టింది. గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్ తర్వాత ఆ లిస్ట్లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) -
గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!
లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా ఫ్యాన్స్ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) 'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్. పాలక్కాడ్లోని అరోమా థియేటర్కి వెళ్లి ఫ్యాన్స్తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్) Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️ Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 Director lokesh at palakkad,aroma theatre 🤩 " Thalapathy enna sonnaru nu kettaralama when lokesh said he is going to kerala "🤩😍 @actorvijay na come here one time na 🙂 #Leo #LeoIndustryHit pic.twitter.com/87TQJd9kDf — Hari Vj Fanatic (@Vijayfanzh) October 24, 2023 -
లియో స్పెషల్ స్క్రీనింగ్.. వారికోసం 4,500 టికెట్లు!
హీరో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి నిర్వాహకులు క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో మానసిక వికాసాన్ని కలగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా విజయ్ నటించిన లియో చిత్రాన్ని వారికి చూపించే ప్రయత్నం చేశారు. పీవీఆర్ సంస్థ సహకారంతో లియో చిత్రం ప్రదర్శింపబడుతున్న చైన్నెలోని థియేటర్లలో 4,500 టిక్కెట్లను కొనుగోలు చేసి ఆదివారం క్యాన్సర్ రోగులను చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్ జగనాధన్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు. తొలి దశలో వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఈ వ్యాధిపై అవగాహన కలిగించడంలో భాగంలో క్యాన్సర్ రోగులను, వారి కుటుంబ సభ్యులకు లియో చిత్రాన్ని చూపించామని పేర్కొన్నారు. -
'లియో' మూవీ హైనా వల్ల స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవ?
'లియో' సినిమా కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. కానీ ఇందులో హైనా క్యారెక్టర్ మాత్రం చూసిన ప్రతిఒక్కరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మూవీ సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేసిన ఈ జంతువు పాత్ర వల్ల ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో విజయ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండోయ్. ఇంతకీ హైనా వల్ల హర్ట్ అయిన స్టార్ హీరో అభిమానులు ఎవరు? అసలెందుకీ గొడవ? (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) అసలేం జరిగింది? LCU అదేనండి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తీసిన సినిమా 'లియో'. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ హైనా క్యారెక్టర్ కూడా ఉంది. సినిమా ఎంట్రీ సీన్లో హీరో దీనితో పోరాడుతాడు. తర్వాత దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తాడు. కొన్నాళ్లకు దాన్ని మచ్చిక చేసుకుని సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెడతాడు. క్లైమాక్స్లో ఇదే హైనా హీరో ఫ్యామిలీని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. థియేటర్లలో అరుపులే అసలు. సమస్య ఏంటి? అయితే లియో సినిమాలో హైనాకి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టడం అజిత్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. దీంతో కావాలనే హైనాకి ఈ పేరు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఉద్దేశం మాత్రం అది అయ్యిండదు. ఎందుకంటే గతంలో ఓసారి మాట్లాడుతూ.. హీరో అజిత్ తోనూ సినిమా చేస్తానని అన్నాడు. ఇలా సినిమా చేస్తానని అన్నవాడు.. సదరు హీరో పేరు వచ్చేలా చేయడు కదా! సో అదన్నమాట విషయం. కానీ ఇదంతా వినే మూడ్లో ఫ్యాన్స్ లేరు. విజయ్ vs అజిత్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
బాక్సాఫీస్ వద్ద లియో జోరు.. నెగెటివ్ టాక్ వచ్చినా తగ్గేదేలే!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈనెల 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టిన లియో.. దాదాపు మూడో రోజు అదే జోరును కొనసాగించింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.40 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా రిలీజ్ రోజు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన లియో.. మూడో రోజే రెండొందల కోట్ల మార్కును దాటేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. మొత్తంగా తమిళనాడులో మూడు రోజుల్లో కలిపి రూ.56.9 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.63 కోట్లు, రెండో రోజు రూ.15.95 కోట్లు, మూడో రోజు రూ.13.32 కోట్లు వసూలు మాత్రమే రాబట్టింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రిలీజ్పై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగులోనూ రిలీజ్పై స్టేలు ఇవ్వడం కలెక్షన్లపై కాస్తా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. -
'లియో' రిలీజ్.. దక్షిణాఫ్రికా వెళ్లిపోయిన దళపతి విజయ్!
దళపతి విజయ్ 'లియో' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం 3 రోజుల్లోనే రూ.32 కోట్ల వరకు వచ్చాయని అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) మరోవైపు 'లియో' టీమ్ ఎవరికి వాళ్లు తమ తమ కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోతున్నారు. లోకేష్ కనకరాజ్.. రజనీతో చేయబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్స్ పనిలో ఉన్నాడు. విజయ్ కొత్త మూవీ షూటింగ్ మూడ్లోకి వెళ్లిపోయాడు. ఈయన హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. కీలక సన్నివేశాల్ని అక్కడ తీస్తున్నారు. ఇకపోతే దళపతి 68వ మూవీలో స్నేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయరామ్, ప్రభుదేవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. ఇటీవలే చైన్నెలో షూటింగ్ ప్రారంభించారు. ఓ పాట పూర్తిచేశారు. ఆ తర్వాతే సౌతాఫ్రికా వెళ్లిపోయి షూటింగ్లో బిజీ అయిపోయారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) -
కూతుర్ని బలిచ్చిన తండ్రి.. తల నరికిన కొడుకు. ‘దసరా’ సినిమా కథలివే!
దసరా పండుగ వచ్చిందంటే చాలు టాలీవుడ్లో ఆ సందడి, జోష్ వేరేలా ఉంటుంది. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి దసరాకి కనీసం ఒకటి, రెండు బడా సినిమాలు అయినా బాక్సాఫీస్ బరిలోకి దిగుతాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు దసరా బరిలోకి దిగారు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ .. ఎవరికి వాళ్లు తమ సినిమాలతో బాక్సాఫీస్పై దండయాత్ర ప్రారంభించారు. ఒక సినిమాలో తండ్రి కన్న కూతుర్ని నరబలి ఇస్తే.. మరో సినిమాలో తండ్రి తలను కన్న కొడుకు నరికేస్తాడు. ఇంకో సినిమాలో కూతుర్ని బలోపేతం చేస్తూనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠాలు చెబుతాడు. ఆ సినిమాలేంటి? ఎలా ఉన్నాయో? చదివేయండి కూతర్ని నరబలి ఇచ్చిన తండ్రి దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సొంత కూతుర్నే నరబలి ఇస్తాడు విలన్ ఆంటోని దాస్(సంజయ్ దత్). దీంతో అతని కొడుకు లియో(విజయ్) తండ్రిని ఎదురించి.. అతను నెలకొల్పిన పొగాకు ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తాడు. లియో కూడా మరణిస్తాడు. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత లియో పోలికలతో పార్తిబన్(విజయ్) కనిపిస్తాడు. అతని కోసం ఆంటోని హిమాచల్ ప్రదేశ్కు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తండ్రి తల నరికిన ‘టైగర్’ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్ట్పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఎదిమిదేళ్ల వయసులోనే తండ్రి తలను నరికేస్తాడు టైగర్. అతను ఎందుకలా చేశాడు? నాగేశ్వరరావు దొంగలా ఎలా మారాడు? ఈ సినిమా కొత్తగా చూపించిందేంటి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘బ్యాడ్ టచ్’ పాఠం చెప్పిన కేసరి నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడ పిల్లలను సింహంలా పెంచాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఓ సన్నివేశంలో బాలయ్యతో స్కూల్ పిల్లలకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ పాఠం చెప్పించాడు. ఆ సీన్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'లియో'లో విలన్.. రియల్ లైఫ్లో స్టార్ కొరియోగ్రాఫర్.. ఇతడిని గుర్తుపట్టారా?
మీలో చాలామంది 'లియో' సినిమా చూశారు కదా! ఎలా అనిపించింది? అని అడగ్గానే కొందరు నచ్చిందని చెప్తారు. మరికొందరికి నచ్చలేదని అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ ఇక్కడ డిస్కషన్ ఏం పెట్టడం లేదు గానీ మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. 'లియో' ప్రారంభం సన్నివేశాల్లో సైకో కిల్లర్గా ఓ కుర్రాడు చేశాడు. ఉన్నంతలో తన యాక్టింగ్తో భయపెట్టేశాడు. చెప్పాలంటే వణికించేశాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? 'లియో' సినిమాలో యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫెయిలయ్యాడని చెప్పొచ్చు. అయితే సినిమా ఫస్టాప్ ఓ రేంజులో ఉంటుంది. యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజులో వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ మొదట్లో కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. అది చేసింది స్టార్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) తమిళంలో కొరియోగ్రాఫర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్.. కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ చేశాడు. కానీ 'లియో'లో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు. హీరోతో తలపడే సీన్లో 'చాక్లెట్ కాఫీ' అని రచ్చ లేపాడు. 2005లో 'మానాడా మయిలాడా' అనే డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. అదే షో హోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. 2014లో 'ఆహ్' సినిమాతో కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదే 'ఇవనుక్కు తన్నిళ్ల గండం' అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఎంటర్టైన్ చేసే ఇతడు.. ఇలా క్రూరమైన విలన్గా కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్హిట్ దెయ్యం సినిమా) -
బ్లాక్బస్టర్ దిశగా లియో. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే? ఏ ఓటీటీలో..
స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు లుక్ బాలేదని, సినిమా ఫలితం బెడిసికొట్టేలా ఉందని విమర్శలు వినిపించాయి. కానీ ఈ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలిరోజే బ్లాక్బస్టర్ టాక్తో దూసుకుపోతోంది లియో. త్రిష కథానాయికగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు లియో బ్లాక్బస్టర్, లియో డిజాస్టర్ అన్న రెండు హ్యాష్ట్యాగ్స్ ట్విటర్లో ట్రెండ్ అయ్యాయి. దీంతో సినిమా ఫలితేమంటి చెప్మా? అని నెటిజన్లు డౌట్ పడ్డారు. కట్ చేస్తే బ్లాక్బస్టర్ దిశగా లియో పరుగులు పెడుతోంది. సెంచరీ దాటిన వసూళ్లు తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే రికార్డులు బద్ధలవడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెవెన్ స్క్రీన్స్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్ పళనిసామి నిర్మించారు. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లియో స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. లియో రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇందుకోసం భారీగానే డబ్బు ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ మూవీ థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నవంబర్ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లియో థియేటర్లో ఎక్కువకాలం కలెక్షన్ల వరద పారించినట్లయితే ఓటీటీలోకి మరింత ఆలస్యంగా వచ్చే అవకాశమూ లేకపోలేదు. #LEO🧊🔥 Day 1 Worldwide Collection 132.5 Cr!!! @Actorvijay #LeoBlockbuster Kollywood Biggest Opening 🏆🦁 @Dir_Lokesh @7screenstudio @MrRathna #LeoReview @anirudhofficial pic.twitter.com/saItNWw4Fp — #LEO OFFICIAL (@TeamLeoOffcl) October 20, 2023 చదవండి: టాటూ ట్విస్ట్.. ఐ లవ్యూ చెప్పిన తేజ.. థూ అని ఊసిన శోభ.. చులకనవుతున్న అమర్! -
Leo రిలీజ్.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్!
హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష కథానాయికగా నటించిన ఇందులో ప్రియా ఆనంద్, మడోనా సెబాస్టియన్, బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్, గౌతమ్మీనన్, మిష్కిన్ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లియో సినిమా ఆడుతున్న థియేటర్ల ముంగిట్లో విజయ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అభిమానులు పండగ చేసుకున్నారు. కేక్లు కట్ చేయడం, స్వీట్స్ పంచడం, బాణసంచా కాల్చడం వంటి కార్యక్రమాలతో హంగామా చేశారు. ఒక్క కోవైలోనే లియో చిత్రం 100 థియేటర్లలో విడుదలైంది. ప్రభుత్వం వేకువజామున 4 గంటల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోయినా అనేక ప్రాంతాల్లో 9 గంటల షోకు ఉదయం ఆరు, ఏడు గంటల సమయంలోనే అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన విజయ్ అభిమానులే కాకుండా, కేరళ రాష్ట్రానికి చెందిన అభిమానులు కూడా వచ్చి మొదటి షోను చూడడానికి ఆసక్తి చూపడం విశేషం. తమిళనాడు కేరళ సరిహద్దులో గల కుమరి జిల్లాలో అనేకమంది మలయాళ ప్రేక్షకులు లియో చూసేందుకు తరలివచ్చారు. విజయ్ ఫొటోతో 20 అడుగుల కేక్ను కట్ చేసి అభిమానులు అందరికీ పంచిపెట్టారు. (చదవండి: లియో సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అభిమాని నిశ్చితార్థం లియో సినిమా రిలీజ్ రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పుదుకోటైకి చెందిన వెంకటేష్ అనే విజయ్ అభిమాని తను ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్లో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అతను మాట్లాడుతూ తనకు తల్లి, తండ్రి ఎవరూ లేరని విజయ్నే తనకు అంతా అని పేర్కొన్నాడు. అందుకే ఈ రోజు తాను వివాహ నిశ్చితార్థం జరుపుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా క్రిష్ణగిరికి చెందిన మరో వీరాభిమాని లియో చిత్రం చూడడానికి థియేటర్కు వచ్చి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని గోడపై నుంచి క్యూలోకి దూకడంతో కాలుకు తీవ్ర గాయమైంది. గాయంతోనే అతను థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. కోయంబేడు రోహిణి థియేటర్లో పోలీసుల బందోబస్తు.. చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ చైన్నె క్రోంపేటలోని థియేటర్లో చిత్ర మొదటి షోను ప్రేక్షకుల మధ్య చూడడానికి వెళ్లారు. వారిని చూసిన విజయ్ అభిమానులు, ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత లొకేష్ కనకరాజ్, అనిరుధ్ స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్కు వచ్చారు. థియేటర్లో ఉదయం 11.30 గంటలకే లియో చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ విజయ్ అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉదయాన్నే అక్కడికి చేరుకుని హంగామా చేశారు. దీంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇకపోతే ఆ థియేటర్కు దర్శకుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ వెళ్లేసరికే త్రిష అక్కడికి చేరుకున్నారు. విడాముయర్చి చిత్ర షూటింగ్ డుమ్మా కొట్టి త్రిష లియో చిత్రాన్ని చూడడానికి వెళ్లడం విశేషం. కాగా పుదుకోట్టైలో లియో చిత్రం చూసే ముందు ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తూ విజయ్ అభిమానులు కొంచెం సేపు మౌనం పాటించడం విశేషం. The makers of #BlockbusterLeo at #FansFortRohini celebrating #Leo in a #Badass way 🔥🔥@Dir_Lokesh @anirudhofficial @trishtrashers PC - @jefferyjoshua pic.twitter.com/BkTc7WpsHG— Rohini SilverScreens (@RohiniSilverScr) October 19, 2023 చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్గా, రేసీ స్క్రీన్ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్లో హెరాల్డ్ దాస్తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్డమ్ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
లియో సినిమా.. కథ కొత్తదేమీ కాదు, పాతదే: డైరెక్టర్
విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, యాక్షన్కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్మీనన్, మిష్కిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్కుమార్ నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని పలు వివాదాలను దాటుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో పత్రికల వారితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఇది తన ఐదవ చిత్రం అని తెలిపారు. అందరూ చిత్ర కథ గురించి అడుగుతున్నారని, అయితే ఇది కొత్త కథేమీ కాదని, మొదటి నుంచి వస్తున్న పాత కథలానే ఉంటుందని, అయితే దాన్ని తనస్టైల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తెరకెక్కించినట్లు చెప్పారు. లియో ఎమోషనల్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. చిత్ర కథ మున్నార్లో జరిగేదిగా ఉంటుందని, అయితే అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కశ్మీర్లో 60 రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు. లియో చిత్రానికి ఎదురైన సమస్యల గురించి అడుగుతున్నారని, అవన్నీ నిర్మాత చూసుకుంటారని, చిత్రం ప్రారంభం నుంచి, ఫస్ట్కాపీ వరకూ తన బాధ్యత అని చెప్పారు. అయితే ఇలాంటి చిత్రాలకు సమస్యలన్నవి సాధారణమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా తర్వాత రెండు చిత్రాలకు కమిట్ అయినట్లు చెప్పారు. అందులో రజనీకాంత్ హీరోగా చేసే చిత్రం, కార్తీ కథానాయకుడిగా ఖైదీ 2 చిత్రం ఉంటుందని చెప్పారు. తన చిత్రాలన్నీ ఎమోషన్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలుగానే ఉంటాయన్నారు. రజనీకాంత్తో చేసే చిత్రం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్లో సెట్పైకి వెళుతుందని లోకేశ్ కనకరాజ్ తెలిపారు. చదవండి: Leo Movie: లియోకు బిగ్ షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!! -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్లో కనిపించడంతో చిత్రబృందం షాక్కు గురైంది. అయితే ప్రింట్ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
‘లియో’ మూవీ ట్విటర్ రివ్యూ
Leo Movie Twitter Review: ‘దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం విజయ్. ఈ కోలీవుడ్ హీరోకి టాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతాయి. ఇక ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్స్తో లోకేష్కు కూడా తెలుగులో మంచి గుర్తింపు లభించింది. అందుకే ‘లియో’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. లియోకి ట్విటర్లో మంచి స్పందన లభిస్తోంది. లోకేష్ మేకింగ్ అదిరిపోయిందంటున్నారు. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల సాగదీతగా అనిపించిన ఓవరాల్గా లోకేష్ కనగరాజ్ గత సినిమాల మాదిరిగానే లియో కూడా స్టైలీష్గా ఉందని చెబుతున్నారు. అయితే సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులను సరిగా వాడుకోలేకపోయారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. #Leo : 2.75/5 Decent 1st half 👍🏻 Chocolate coffee scene 🔥🔥🔥 Avg 2nd half Sanjay Dutt & Arjun weren’t utilized to their extent LCU connect is forced👎🏼 Bgm is good Weakest work of @Dir_Lokesh Vikram,Kaithi >>>>>Master>Leo Overall Avg flick#LeoDisaster — தளபதி ரசிகை பூஜா (@Dhanushsoja) October 19, 2023 ఫస్టాఫ్ డీసెంట్గా ఉంది. చాక్లెట్ కాఫీ సీన్ అదిరిపోయింది. సెకండాఫ్ యావరేజ్. సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులను లోకేష్ సరిగా వాడుకోలేకపోయాడు. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. విక్రమ్, ఖైదీ, మాస్టర్ చిత్రాలతో పోలిస్తే లియో కాస్త తక్కువే. ఓవరాల్గా లియో ఓ యావరేజ్ ఫిల్మ్ అంటూ 2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #LeoReview -Magnificent ⭐⭐⭐⭐🌟 One of the best movie of #ThalapathyVijay𓃵 His Swag and style Just Uff. Mass level Action sequences. Storyline and Emotions are tell very Beautifully#Anirudh Bgm is🔥 and A pure masterclass by #LokeshKanakaraj #Leo #LeoFDFS #Vijay #LeoMovie pic.twitter.com/cVCuGyzh4U — 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) October 19, 2023 విజయ్ చిత్రాల్లో లియో ఒక బెస్ట్ ఫిల్మ్. ఇందులో అతను మరింత స్టైలీష్గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. స్టోరీ లైన్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా పండాయి. అనిరుధ్ బీజీఎం బాగుంది’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #LeoReview : Directed by Lokesh, Leo is a gripping action thriller! Vijay, Sanjay Dutt & Arjun deliver electrifying performances in this high-octane film. With Anbariv's impressive stunts & Anirudh's music,it's an absolute MUST-SEE for all! And yes, #Leo belongs to LCU🔥 pic.twitter.com/tt0tE53umY — 𝐉𝐨𝐫𝐝𝐚𝐧 (@jordan10RK) October 19, 2023 Above Average Second Half Not Satisfied Vikram and Jailer was better for me personally Overhyped! #LeoFDFS #LeoReview #Leo — Navaneeth Krishna ➐ (@FilmFreak_0) October 19, 2023 #LeoReview - #LeoFDFS First Half Review NEVER SEEN THEATRE EXPERIENCE !! What an Engaging Roller coaster Ride 🥵 As Never Seen Thalapathy Vijay !!! What a Screen presence 💥🔥🔥A Never Seen an ENGAGING first Half like this ... As LOKI Promised .. A 💯 #LokeshKanakaraj FILM… pic.twitter.com/9MfHQlRj85 — Roвιɴ Roвerт (@PeaceBrwVJ) October 18, 2023 #Leo : 2.25/5 Below average 1st half Chocolate coffee scene🤦🏻♂️ Avg 2nd half Sanjay Dutt & Arjun weren’t utilized to their extent LCU connect is forced👎🏼 Bgm is ok Weakest work of @Dir_Lokesh Vikram,Kaithi >>>>>Master>Leo Overall below Avg flick#LeoFDFS #LeoReview — LoGaN (@itzhari24) October 19, 2023 #Leo A Good Action Entertainer! The first half moves at a slower pace and is somewhat flat. However, from the pre-interval till the end the screenplay is racy with the typical Lokesh twists and turns that work well. Anirudh again succeeds and the LCU bits are nice moments. A… — Venky Reviews (@venkyreviews) October 19, 2023 #Leo - Block-O-Blockbuster🔥🔥🔥 Hit-O-Industry Hit🔥🔥🔥 Pattaasu kadai Kozhuthapattadhu💥💥💥💥💥💥💥💥 Andha Lifetime records uh eduthu vainga da.. Annan vandhuttu irukaaru🍻🍻🍻 pic.twitter.com/u7eSsIGj3L — Karthik (Canada Movie Club) (@CanadaMovieClub) October 19, 2023 #Leo 2nd half good....Leo Das character 🔥🔥🔥🔥 But flashback was underwhelming...climax fight🔥🔥🔥🔥🔥 And climax🔥🔥🔥🔥🔥 I wish they could have taken the story in different direction. Overall good🔥🔥🔥 — Kishore🔥🧊 (@kishorekumar_6) October 19, 2023 #Leo Review: Splendid Action Drama👍#ThalapathyVijay shines & is effective👏 Rest of the cast (#Trisha, #Arjun, #SanjayDutt etc) were apt & good👌#Anirudh Sambhavam💥 Action Scenes🔥 LCU😭🎉#LokeshKanagaraj, take a bow👏 Rating: ⭐⭐⭐⭐/5#LeoReview #LeoFDFS #LeoFilm pic.twitter.com/KkeCooWICL — Swayam Kumar Das (@KumarSwayam3) October 19, 2023 #Leo first half - The way @Dir_Lokesh sketched how @actorvijay doesn’t want his past to comeback and haunt back his family is the biggest strength of the film. Kudos #ThalapathyVijay for surrendering himself to the character, he roars wherever needed, he plays subtle where it… — Rajasekar (@sekartweets) October 18, 2023 #Leo (Only for Telugu Aud) 2nd half: Flashback scenes totally let down, Some action scenes👍, Climax is Okay After watching #Vikram Telugu audience expected something big with interlinks and Cameo's, Emotions, Screenplay. Nothing new and Routine Action movie👍 More hype kills. — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 19, 2023 #Leo 1st Half: படுத்து கிடந்த படத்த கடைசி 5 நிமிசத்துல அர்ஜூன்,சஞ்சய் தத் என்ட்ரி காப்பாத்திட்டு.. Predictable Story ... சஞ்சய் தத் என்ட்ரிக்கு BGM போடாம Badass பாட்ட 5 நிமிசமும் விட்டாப்ல அனிருத். LCU Connect . கைதி போலிஸ விஜய் வீட்டுக்கு பாதுகாப்பு போட்டு.#LeoDisaster — AK வினிதா (@ThalaVinitha_10) October 19, 2023 #LeoReview(Telugu):⭐⭐2/5.#Leo Movie According to me, there is nothing special in it as per the way they are promoting it, This movie is just promoted even though there is nothing in it. #LeoFDFS #LeoFilm — Deepak Jangid (@itsDeepakJangid) October 19, 2023 Let's See #LeoReview #LokeshKanakaraj failed Because of #Vijay Underrated Acting and hype created with Previous Movies of Director nothing is cinematic in film just like Beast 2.0 just watch it for Director Overall Review - 2/5 ⭐⭐#LeoDisaster #DisasterLeo #LeoFDFS #Leo — Sri Ajith™ (@SriAjithOff) October 19, 2023 #Leo #LeoFDFS Never before seen blockbuster on the cards. No if's and but's. Just enjoy this pure action entertainer in theatres. You will never see thalapathy like this again. LOKI the confidence speaks🔥🔥🔥🔥#LeoReview — Yavan🌞 (@nalan4life) October 19, 2023 Done with #Leo my honest opinion Positives : vijay, Trisha, Arjun, camera work, Stunts Music 50-50 Not upto the mark Rating: 2.5/5 Final verdict- Big disappointment from Lokesh Average stuff 👍 Forcibly including LCU into this #LeoReview #LeoFDFS pic.twitter.com/LoXGHpedAn — Ak🔥 (@itisAk11) October 19, 2023 #LeoReview:⭐⭐⭐⭐10/10#Leo is such a intruiguing briliant film, which @actorvijay him-self feel proud doing it in his career.. Dont dare to miss a single scene in this, all scenes are important part of this movie.A trendsetter in edge of the seat league movies #LeoFDFS pic.twitter.com/Xb0nrM0NJq — Mega Kajal (@UniqueF_KajalA) October 19, 2023 #leo #LeoReview Avg direction Avg Fight Avg Music Totally Disappoints 3/5* — RkR (@rajeeshkr1986) October 19, 2023 -
లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్ ఎస్.లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మారినా..? ఇదిలా ఉంటే విజయ్ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది. లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది. -
విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!
ఈసారి దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు. వీటిలో ఏది హిట్ అయినాసరే బాక్సాఫీస్ కళకళాలాడిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఏ మూవీకి ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తమిళ హీరో విజయ్ కంటే తెలుగు హీరో బాలయ్య వెనకబడిపోయారు. ఇంతకీ ఏంటా విషయం? (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు 'లియో', 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూడింటిలో మీరు ఏ సినిమాక వెళ్తారని అడిగితే దాదాపుగా 'లియో' అనే చెప్తారు. ఇదేదో మేం కల్పించి చెబుతున్న మాట అయితే కాదు. ఎందుకంటే విజయ్, బాలయ్య సినిమా టికెట్ల బుకింగ్స్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు. అయితే అనుహ్యాంగా 'భగవంత్ కేసరి' కంటే 'లియో' బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లోని మల్టీప్లెక్స్ల్లో 'లియో', 'భగవంత్ కేసరి' సినిమాలకు సమంగా స్క్రీన్స్ లభించాయి. కానీ లోకేశ్ కనగరాజ్ క్రేజ్ దృష్ట్యా 'లియో' వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో బాలయ్య సినిమా బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' బుకింగ్స్ అయితే ఓకే అనిపిస్తుంది. మరి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో? ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?
ఈ శుక్రవారం తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కంటే విజయ్ 'లియో'కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే హైప్, టికెట్ బుకింగ్స్ అవుతున్నాయి. మరోవైపు టైటిల్ మూలాన 'లియో' మూవీ తెలుగులో చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని మరో టెన్షన్. ఇలా 'లియో' విషయంలో విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు కాస్త హడావుడి ఎక్కువైంది. అయితే చాలామంది తెలుగు ఆడియెన్స్.. ఈ చిత్రాన్ని విజయ్ కోసం కాదు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 'విక్రమ్'తో మెస్మరైజ్ చేసిన ఇతడు.. 'లియో'తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఇక్కడ ప్రశ్న. (ఇదీ చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) ఇకపోతే బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు 'లియో' కోసం పెట్టారు. అయితే ఇందులో సగం బడ్జెట్ చిత్రబృందం రెమ్యునరేషన్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీరో విజయ్ రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇతడి తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్-రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రూ.10 కోట్లు, సంజయ్ దత్ రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు, అర్జున్ రూ.కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు తీసుకున్నారట. సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. కొన్నాళ్ల ముందు వరకు వేరే లెవల్ హైప్తో వార్తల్లో 'లియో' సినిమాకు ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే థియేటర్లలో సినిమా హిట్ అయితే మాత్రం ఈ సంగతులన్నీ ఫ్యాన్స్ మర్చిపోతారు. తెలుగు రిలీజ్ అక్టోబరు 19. అంటే మరో రోజు మాత్రమే గ్యాప్ ఉంది. మరి 'లియో' ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’ తెలుగు వెర్షన్ విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సిటి సివిల్ కోర్టు.. ఈ నెల 20 వరకు లియో తెలుగు వెర్షన్ను విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే లియో విడుదల అవుతుందని స్పష్టం చేశాడు. ‘తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది. (చదవండి: అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!) ఈ సినిమా తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటా’ అని నాగవంశీ అన్నారు. -
అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!
దళపతి విజయ్ లియో మూవీ విడుదలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిర్మాతలకు చుక్కెదురైంది. తాజాగా తెలుగు వర్షన్ అయినా బెనిఫిట్ షోలు చూడొచ్చని భావించిన అభిమానులకు మరో షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇది చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) లియో తెలుగు వర్షన్ ఈనెల 19న విడుదల చేయవద్దంటూ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. లియో టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. డి స్టూడియోస్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు విడుదల చేయవద్దని ఆదేశాలిచ్చింది. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్! ఈ నిర్ణయంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమిళంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలుగులోనైనా మార్నింగ్ షోలు చూడొచ్చని అభిమానులు భావించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లో లియోకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!) -
లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!) దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా.. లియో సినిమాలో సంజయ్దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!) -
రెండేళ్ల తర్వాతే సినిమా ప్రారంభం
-
వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!
తమిళ సినిమా: లియో చిత్రం ఘన విజయం సాధించాలని సూపర్స్టార్ రజనీకాంత్ కాంక్షించారు. వివరాలు.. హీరో విజయ్ నటించిన లియో చిత్రం చుట్టూ పలు వివాదాలు నెలకొంటున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్లో అనుచిత పదాలు చోటుచేసుకున్నాయనే విమర్శలను, అదేవిధంగా చిత్రానికి సెన్సార్ బోర్డు అధిక కట్స్ ఇచ్చినట్లు వివాదం చెలరేగింది. విజయ్ చిత్రానికే ఇలాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి అంటూ నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించడంతో లియో చిత్రం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అంతకు ముందు చిత్రంలో విజయ్ సిగరెట్ తాగే సన్నివేశాలను పీఎంకే నేత అన్బుమణి రామదాస్ విమర్శించారు. తాజాగా లియో చిత్రం థియేటర్లో ప్రత్యేక ప్రదర్శనలు విషయం వివాదంగా మారింది. ప్రభుత్వం ఈ చిత్రం విడుదలయ్యే 19వ తేదీన వేకువ జామున 4 గంటల ఆటతో కలిపి ఆరు షోలకు, 20వ తేదీ నుంచి 24 వరకు రోజుకు ఐదు ఆటల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి.. ఈ చిత్రానికి 5 ఆటలకే అనుమతి అంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిత్ర నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను న్యాయమూర్తి అనితా సుమంత్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా మరోపక్క లియో చిత్ర నిర్మాతకు, థియేటర్ యాజమాన్యానికి మధ్య కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత లియో తొలివారం కలెక్షన్లలో 75 శాతం తమకు ఇవ్వాలంటూ కండిషన్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తన 171 చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ కన్యాకుమారి, నెల్లై జిల్లాలో షూటింగ్ పూర్తిచేసుకుని సోమవారం తూత్తుకుడి నుంచి చైన్నెకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన తూత్తుకుడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను 47 ఏళ్ల క్రితం భువనా ఒరు కేళ్వికురి చిత్రం షూటింగ్ కోసం తూత్తుకుడి జిల్లాకు వచ్చానన్నారు. కాగా విజయ్ నటించిన లియో చిత్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించగా లియో చిత్రం ఘనవిజయం సాధించిందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
రిలీజ్కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి) తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. అదనపు షోలకు అనుమతి అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. 2021లో విడుదలైన మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్ల కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) -
లియో బుకింగ్ స్టార్ట్..వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం
-
‘లియో’పై తగ్గిన ఆసక్తి.. ఎందుకిలా?
లియో.. ఈ సినిమాను ప్రకటిస్తూ మొదట్లో ఓ వీడియోని వదిలారు మేకర్స్. అప్పటి నుంచి ఈ చిత్రంపై తమిళ్లోనే కాదు తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి కారణం హీరో విజయ్తో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ ముగ్గురు తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే. అందుకే దసరా బరిలో ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉన్నప్పటికీ..‘లియో’పై మాత్రం క్రేజ్ తగ్గలేదు. కానీ ఎప్పుడైతే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ‘లియో’పై అంచనాలు తగ్గతూ వచ్చాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన సినీ ప్రేక్షకులను ట్రైలర్ ఆశించిన స్థాయితో మెప్పించలేకపోయింది. తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ ఆడియన్స్ని కూడా ఈ ట్రైలర్ మెప్పించలేకపోయింది. ఆకట్టుకోలేకపోయిన ట్రైలర్ ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి సాలిడ్ హిట్లను అందించిన లోకేశ్.. లియోని కూడా అదేస్థాయిలో తీర్చిదిద్దారని అంతా భావించారు. తీరా ట్రైలర్ చూస్తే..ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. అయితే ట్రైలర్ చూసి ‘లియో’పై ఒక అంచనాకు రావొద్దని, సినిమాలో అనేక సర్ప్రైజ్లు ఉంటాయని టీమ్ చెబుతుంది. కానీ ఎవరైనా ట్రైలర్ చూసే సినిమాపై ఓ అంచనాకు వస్తారు. అందుకే ట్రైలర్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ లియో విషయంలో మాత్రం ట్రైలర్ బజ్ని క్రియేట్ చేయలేకపోయింది. తగ్గిన ఆసక్తి 'లియో'.. తెలుగు థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. విడుదలకు ఇంకా వారం రోజులు కూడా లేదు..అయినా కూడా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. డబ్బింగ్ విషయంలో కూడా క్వాలిటీ లేదనే విషయం ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా ‘లియో’ నుంచి రిలీజ్ చేసిన ‘నే రెడీ’ పాట కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో లియోపై మొదట్లో ఉన్నంత ఆసక్తి అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో లేదు. అయితే లోకేశ్ కనగరాజ్ మేకింగ్పై మాత్రం నమ్మకం ఉంది. కచ్చితంగా తనదైన స్క్రీన్ప్లేతో సర్ప్రైజ్ చేస్తాడని సినీ పండితులు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు అప్పటితో పోలిస్తే డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ స్టార్ హీరోల మూవీస్కి మాత్రం వేరే లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. అలా వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిలో తెలుగు-తమిళ ప్రేక్షకుల చాలా అంటే చాలా ఎదురుచూస్తున్న మూవీ 'లియో'. ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతోంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) 'లియో' సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడటానికి కారణం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 'విక్రమ్' సినిమాతో ఒక్కొక్కరిని అవాక్కయ్యేలా చేసిన ఇతడు.. ఈ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. అలానే 'LCU'తో దీనికి లింక్ ఉందని, ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని రూమర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఇలా పలు కారణాల వల్ల 'లియో'పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు ఎంచుకున్నారు. అభిమానులు ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారని తెలిసి, ఏకంగా ఒక్కో టికెట్ని రూ.5 వేలకు అమ్ముతున్నారనట. తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన దగ్గర అంతంత టికెట్ ధరలు ఉండకపోవచ్చులే! (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
మొదటి 10 నిమిషాల్లోనే ఈ సీన్.. ఎవరూ మిస్ కాకండి: లోకేశ్ కనగరాజ్
దసరా బరిలో ఈసారి మూడు సినిమాలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. తెలుగుతో పాటు, తమిళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లియో' అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తి రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు కాగా మొత్తం 13 సన్నివేశాల్లో సెన్సార్ కోత పెట్టింది. ముఖ్యంగా వాటిలో రక్తం, హింస కనిపించే వంటి సీన్స్ తొలగించారు. కానీ ఇవన్నీ కూడా ఒక నిమిషం లోపే ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: దిల్రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) ఇదంతా ఒకపక్క అయితే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు సినిమా ఎవరూ మిస్ అవ్వకండి అంటూ అలర్ట్ ఇచ్చారు. లియో విజయం కోసం తిరుమలకు విచ్చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లియో సినిమా ఆడియో ఆవిష్కరణ ఈసారి జరగకపోగా, నటుడు విజయ్ ఇంటర్వ్యూ కూడా చివరి వరకు విడుదల కాకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నటుడు అజిత్ లాగా ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సినిమా ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి అనే నిర్ణయానికి విజయ్ వచ్చినట్లు సమాచారం. మొదటి 10 నిమిషాల్లో హైనా సీన్? లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు ఎవరూ మిస్ కాకూడదని లోకేష్ కనగరాజ్ చెబుతుండగా, గత అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు ఆ 10 నిమిషాల సీన్ కోసం సుమారు వెయ్యి మందికి పైగా పనిచేశారని లోకేశ్ తెలిపాడు. హైనాతో విజయ్ ఫైట్ చేసిన సీన్ అందరినీ మెప్పిస్తుందని ఆయన చెప్పాడు. సినిమాలో తన కుటుంబాన్ని రక్షించడానికి విజయ్ ఆ ఫైట్ చేసినట్లు సమాచారం. ఈ ఒక్క సీన్ కోసం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ 10 నిమిషాల సీన్ అభిమానులను మరొసారి థియేటర్కి రప్పించేలా మ్యాజిక్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. (తమిళ్లో నా రెడీ అంటూ.. వచ్చి మంచి హిట్ అయ్యిన సాంగ్ తాజాగా తెలుగులో విడుదల అయింది. ఇక్కడ చూడండి) -
'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో (సింహం). నటి త్రిష, ప్రియాఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్మీనన్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మించారు. (ఇదీ చదవండి: దిల్రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. లియో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా విజయ్ చిత్రం విడుదలవుతుందంటే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఆలయాల్లో పూజలు, థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు బాణసంచా మోత మోగుతుంటుంది. అయితే విజయ్ ఆదేశాల మేరకు ఉత్తర చైన్నె అభిమానులు ఇప్పుడు ఎలాంటి హంగామాలు చేయడం లేదంటున్నారు. లేకపోతే చిత్ర విడుదలకు మరో ఆరు రోజులు ఉండగా శుక్రవారం నుంచే చైన్నె, మదురై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో చిత్రం అడ్వాన్న్స్ బుకింగ్ ప్రారంభమైనట్టు తెలిసింది. సాధారణంగా రెండు మూడు రోజులముందు అడ్వాన్న్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది అలాంటిది ఆరు రోజుల ముందే బుకింగ్ మొదలు అన్నది అరుదైన విషయమే అవుతుంది. లియోకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్ తమిళనాడు ప్రభుత్వం లియో సినిమా స్పెషల్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడులో లియో చిత్రం ప్రదర్శనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత IAS అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.లియో స్పెషల్ షోలకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు దిగి ప్రత్యేక షోలు వేయాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అముత ఆదేశించారు. థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. -
LEOలో రామ్ చరణ్..గెస్ట్ రోల్ పై క్లారిటీ
-
రవితేజ సినిమాకు ఇంత అన్యాయమా అంటూ ఫ్యాన్స్ ఫైర్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు రెడీగా ఉంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రన్టైమ్ 3.02 గంటలు ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం 30 లోపు థియేటర్లే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అక్టోబర్ 19న విజయ్ 'లియో' థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమిళనాడులోని అన్ని థియేటర్లు విజయ్ సినిమాకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో తమిళనాడులో రవితేజ చిత్రానికి కేవలం 30లోపు థియేటర్లు మాత్రమే మిగిలాయట. అవి కూడా అంత చెప్పుకోతగిన థియేటర్లు కాదని సమాచారం. ఇకపోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగులోనూ రవితేజకు ఎదురుదెబ్బే... 'లియో' సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమా సుమారు రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారని టాక్ ఉంది. ఒక రకంగా విజయ్ కెరీర్లో ఇదే అత్యధిక తెలుగు బిజినెస్ అని సమాచారం. దీంతో తెలుగులో కూడా ‘లియో’కి అత్యధిక థియేటర్లు కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'లియో' సినిమా వల్ల బాలకృష్ణ 'భగవంత్ కేసరి' థియేటర్లు తగ్గించమని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం భారీ దెబ్బే తగలబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమా కన్నా 'లియో'కే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాకు థియేటర్లే ఇవ్వనప్పుడు అక్కడి సినిమాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు కేటాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రశ్నించాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు. -
విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!
తమిళ స్టార్, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ సర్జా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఓ సామాన్యుడిలా తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్లమార్గంలో కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లియో మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాలినడక మార్గంలో ఇటీవల చిరుతల దాడి నేపథ్యంలో ఆయన చుట్టూ కర్రలు పట్టుకుని ఉన్న యువకులు రక్షణగా వెళ్లారు. కాగా.. ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Director Lokesh Kanagaraj visited Sami in Tirupati to pray for the success of the film #Leo 🧊🔥 @actorvijay @Dir_Lokesh#LokeshKanakaraj #LeoFDFS#LeoFilm #LeoThirdSingle pic.twitter.com/uViS5SIrd3 — Tamil Cine Hub (@tamilcinehub) October 12, 2023 Lokeshkanagaraj Recent Video 👀🔥🔥#LeoThirdSingle #Anbenum #LeoFDFS #Trisha #ThalapathyVijay𓃵 #AnbenumAayudham #LeoFromOctober19 @actorvijay @7screenstudio @Dir_Lokesh #LokeshKanakaraj#LeoFilm #LeofromOct19 pic.twitter.com/7BIs6oKh4B — Popcorn 🍿 (@popcorn1903) October 12, 2023 Our @Dir_Lokesh and @MrRathna walking to Tirupathi Tirumala for the mega success of #Leo Leo sure shot 1000cr movie 🔥🔥 Surprise cameo enjoy in theatres 🔥💯🥵🥵🥵🥵#LeofromOct19#LeoFDFS#LeoFilmpic.twitter.com/sPYr5oUsrq — Sudeep cherry (@Sudeepcherry) October 12, 2023 -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్ను పబ్లిక్లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విజయ్కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్
విజయ్ చిత్రాలు విడుదలకు ముందు ఆ తర్వాత కూడా వివాదాస్పదం కావడం కొత్తకాదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన లియో కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మేనన్, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సమస్య లేదు అనుకుంటున్న సమయంలో లియో చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అందులో విజయ్ చెప్పే పవర్ ఫుల్ డై లాగ్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. అయితే ఇందులో విజయ్ చెప్పిన కొన్ని అనుచిత డైలాగులే ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయి. వీటిపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ సంభాషణలతో నటుడు విజయ్కి ఎలాంటి సంబంధం లేదని, ఈ డైలాగులు చెప్పాలా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారని, తానే కథకు అవసరమని ఒప్పించానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని, లియో చిత్రంలోని పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నారు. దానికి తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. అయితే చిత్ర టైలర్లో చోటు చేసుకున్న ఆ వివాదాస్పద సంభాషణలు చిత్రంలో మ్యూట్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నటుడు విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ల మధ్య విభేదాలు అంటూ ఒక పోస్టు ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్ను రజనీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. తాను ఆ ట్వీట్ను సరిగా చూడకుండా లైక్ కొట్టారని, అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆయన మరో ట్వీట్ చేయడం గమనార్హం. -
Thalapathy Vijay's Leo: దళపతి విజయ్ ‘లియో’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!
తమిళ స్టార్, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ప్రారంభంలోనే.. 'ఒక సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డుమీద చాలామంది చనిపోయారు' అనే డైలాగ్తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తి పెంచుతోంది. ఫైట్ సీన్స్ తోడేళ్లతో కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. కథ మొత్తం గ్యాంగ్స్టార్ల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ చెప్పిన ఓ బూతు డైలాగ్ ఆడియన్స్లో షాక్కు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: లియో ఆడియో వేడుక రద్దు) ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నా రెండు వరువా అనే పాట ఇప్పటికీ విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
గాంధీ జయంతి సందర్భంగా ఫ్యాన్స్కు పిలుపునిచ్చిన విజయ్
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి నగరం, ఊరు వాడల్లోని గాంధీ మహాత్ముని శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించాలని నటుడు విజయ్ తన సంఘం కార్య నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయ్ ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో మన ప్రజాసంఘం అధ్యక్షుడు విజయ్ ఆదేశాల మేరకు తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంఘం నిర్వాహకులు కార్యకర్తలు వారివారి ఊళ్లలోని గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా తమ జిల్లాల్లోని స్వతంత్య్రం కోసం పాటుపడ్డ జాగుల జిల్లాకు వెళ్లి వారిని సత్కరించాలని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రతిక ఎలిమినేట్.. 'బిగ్బాస్'లో రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!) ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు, యువభాగం అధ్యక్షులు, నిర్వాహకులు, అందరూ పాల్గొని సమైక్యంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పెండేసి ఫొటోలను తమ సంఘం కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొన్నారు. -
లియో ఆడియో వేడుక రద్దు
తమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. నటి త్రిష, ప్రియాఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్ కనకరాజ్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నా రెండు వరువా అనే పాట ఇప్పటికీ విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. లియో చిత్రం క్రేజ్ను మరింత పెంచేసింది. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టారు. అందుకు స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను కూడా మొదలెట్టారు. అలాంటిది సడెన్గా లియో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. అందుకు వారు చెబుతున్న కారణం వేలాదిగా తరలి వచ్చే విజయ్ అభిమానులను కట్టడి చేయడం అసాధ్యమవుతుందన్నది. అయితే అది నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే ఆవరణలో ఇంతకుముందు రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించారు. లియో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం కోసం చైన్నె పోలీస్ కమిషనర్ నేతృత్వంలో చిత్ర దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు నిర్వహించారని సమాచారం. అలాంటిది సడెన్గా కార్యక్రమాన్ని రద్దు చేయడంతో రకరకాల ప్రచారం జరుగుతోంది. విజయ్ నటించిన గత చిత్రాల ఆడియో విడుదల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా విజయ్ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మోకాలొడ్డిందా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా లియో చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రద్దు కావడం విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా చెంగల్పట్టు విజయ్ అభిమాన నిర్వాహకులు మాత్రం తమ ఆవేదనను, ఆగ్రహాన్ని రాజకీయకోణంలో వ్యక్తం చేస్తున్నారు. వారు లియో చిత్ర ఆడియో కార్యక్రమం రద్దు వెనుక రాజకీయం ఉందని బలంగా నమ్ముతున్నారు. అందుకే చెంగల్పట్టు విజయ్ అభిమానుల సంఘం నిర్వాహకులు లియో చిత్ర ఆడియో లాంచ్ కాకపోతే ఏంటి, ప్రభుత్వాధికారాన్నే చేపడతాం అవునా మిత్రమా అనే వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. -
విజయ్ 'లియో' సినిమాపై పొలిటికల్ దెబ్బ
తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో నటుడు విజయ్ ఒకరు. మల్టీ టాలెంటెడ్ నటుడు అయిన విజయ్కి తమిళ చిత్రసీమలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో విజయ్ నటించాడు. ఈ చిత్రంలో త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రెండోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో లియో ఆడియో విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో లియో ఆడియో వేడక జరగనున్న నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ అందింది. లియో సినిమా మ్యూజికల్ లాంచ్ కార్యక్రమం లేదని వార్త వచ్చింది. ఇదే విషయాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప్రకటించింది. తన ఎక్స్ (ట్విటర్) ద్వారా ఒక పోస్ట్లో, వారు ఇలా అన్నారు. 'పాస్ల కోసం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. అంతే కాకుండా భద్రతా కారణాల వల్ల, మేము లియో మ్యూజిక్ లాంచ్ను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాము. అభిమానుల కోరిక మేరకు మేము తరచుగా అప్డేట్లతో మీతో టచ్లో ఉంటాము. చాలామంది అనుకుంటున్నట్లుగా మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదు. అంతేకాకుండా మరేదైనా కారణం కూడా కాదు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) ఈ పరిస్థితిలో విజయ్ అభిమానులు లియో విడుదల కార్యక్రమం రద్దు కావడం వెనుక స్టాలిన్ డీఎంకే ప్రభుత్వం ఉందని విజయ్ ఫ్యాన్స్ చెబుతూ #DMKFearsThalapathyVIJAY అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ అభిమానులు #LeoAudioLaunch #westandWithLeoతో సహా హ్యాష్ట్యాగ్లను వారు ట్రెండింగ్ చేస్తున్నారు. #DMKFearsTHALAPATHYVijay pic.twitter.com/VODZwCGNI9 — 𝙍ᴀᴊᴀ𝘿ᴜʀᴀɪ 💥🌐 (@rajubhaii09) September 26, 2023 .@actorvijay Na ❤️ Political Announcements Pannu Na **Thaa Ivanugala Senjividalam.#DMKFearsThalapathyVIJAY#WeStandWithLEO pic.twitter.com/8gZ4hJ53ol — AJITH Kumar (@ActorAJlTH) September 26, 2023 -
విజయ్ ‘లియో’కి బాయ్కాట్ సెగ.. కారణం ఆ గొడవేనా?
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్తో కమల్హాసన్కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్కాట్ సెగ తగిలింది ట్రెండింగ్లో #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ విజయ్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కారణమేంటి? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. -
అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్కు తెలియకుండా చంద్రశేఖర్.. ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పేరుతో ఆఫీస్ పెట్టడం నచ్చని విజయ్.. సొంత తండ్రి మీదనే పోలీస్ కేసు పెట్టాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ విబేధాల గురించి ఇప్పటివరకు తండ్రి కొడుకుల ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. (ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్బాస్ బ్యూటీ) తాజాగా తన తండ్రి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో తన పంతాలను విజయ్ పక్కనబెట్టేశాడు. చంద్రశేఖర్ను కలిసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుమారుడు ఇంటికి రావడంతో విజయ్కు నచ్చిన వంటలను శోభా రెడీ చేయించారట. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన విజయ్ రెండురోజుల క్రితమే చెన్నైకి తిరిగొచ్చాడు. ఆపై వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించాడు. ఆ సమయంలో తన తల్లి శోభాతో కలిసి ఫోటోలు దిగాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత, నటుడు విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఫోటో దిగాడు. దీంతో ఆయన అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. అలాగే విజయ్ నటించిన వారసుడు చిత్రంలో తండ్రి సెంటిమెంట్ గురించి నటుడు విజయ్ మాట్లాడినప్పుడు.. నిజజీవితంలో తండ్రిని, తల్లిని పక్కన పెట్టాడని సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు ముగింపు పలికేలా నటుడు విజయ్ తన తండ్రి, తల్లిని కలుసుకుని వారితో ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియోలో విజయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు షూటింగ్ పూర్తికావడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబర్ 19న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్లు కట్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో హీరోయిన్స్గా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్లో ఎవరున్నారంటే?) అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నాన్ రెడీ వరవా అనే పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఈ పాట మొదటి నుంచి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ పాటలో విజయ్ పొగ తాగే సన్నివేశాలతో పాటు వివాదాస్పద పదాలు చోటు చేసుకోవడంతో పలు తమిళ సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అనొచ్చు మక్కళ్ కట్చి నిర్వాహకురాలు రాజేశ్వరి ప్రియ చిత్రంలోని నాన్ రెడీ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సభ్యులు ఆ పాటలోని కొన్ని అభ్యంతర సన్నివేశాలను.. పాటలోని వివాదాస్పద పదాలను కట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ సిగరెట్ పట్టుకుని క్లోజప్ సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. అయితే ఈ పని పాట విడుదలకు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ , దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: స్టైలిష్ లుక్లో ఉపాసన.. డ్రెస్ ధరెంతో తెలుసా?)