Nirmal
-
‘కొడుకా శ్రీనివాసు.. కొరివి పెట్టేందుకైనా రాబిడ్డా..’
ఖానాపూర్(నిర్మల్): ‘కొడుకా శ్రీనివాసు.. 14 ఏండ్ల వయసులో బడికి పోతానని వెళ్లి 50 ఏండ్లు గడిసినయ్. నీకు తల్లి గుర్తుకు రావడం లేదా.. చావుకు దగ్గరైన. కొరివి పెట్టేందుకై నా రాబిడ్డా’ అని అజ్ఞాతంలో ఉన్న మవోయిస్తు తూము శ్రీనివాస్ తల్లి లచ్చవ్వ ప్రాధేయపడింది. మండలంలోని బావాపూర్(ఆర్) గ్రామంలోని లచ్చవ్వ కుమారుడు 50 ఏళ్ల క్రితం 14 ఏళ్ల వయస్సులో బోధన్లోని ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాకుండా మావోయిస్టుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు అతని తల్లిని ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం కలిసింది. వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ సాక్షిగా లచ్చవ్వ కుమరుడిని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా.. ఊరు మిన్నా.. మన ఊరికి తరలి రండి.. కార్యక్రమంలో భాగంగా జన జీవనంలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లచ్చవ్వకు దుస్తులతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐ సైదారావు, పెంబి ఎస్సై హనుమాండ్లు పాల్గొన్నారు. -
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పిచ్చుకలకు కుచ్చులు
గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది. బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది. నిర్మల్ జిల్లాలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.ఎన్నో ఎన్నెన్నో!పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు → నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు → మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్నూ ఇక్కడ పండిస్తున్నారు→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.వరికుచ్చుల సరిగమలుపాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.– విజయలక్ష్మి – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఇథనాల్పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
నిరూపించే దమ్ముందా.. కేటీఆర్, బీజేపీకి మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్: అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ప్రజలకు కేటీఆర్ ఓమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దిలావార్పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా?. ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషం వెదజల్లుతున్నారు. తలసాని సాయి కుమార్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారు.ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు, ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా?. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దొర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి?. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడితే తప్పా?.ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది. ఫౌంహౌస్ నుంచి పాలన చేసిన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. -
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్
నిర్మల్ : దిలావర్ పూర్లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్కు దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
నిర్మల్: నిరసనల ఎఫెక్ట్.. ఇథనాల్ పరిశ్రమ పనులకు బ్రేక్
నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాకర్టీ ఏర్పాటుపై స్థానికులు చేపట్టిన ఆందోళనలతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. ఐదుగురు రైతులను జిల్లా కలెక్టర్ చర్చలకు పిలిచారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.దాదాపు రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్థులు నిరసనల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ నిరసనలు ఉధృతం చేశారు. నిన్న రాత్రి రోడ్డుపైనే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారంతా రోడ్డుపైనే భోజనం చేశారు.ఇవాళ మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరనసల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసుల వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరుగులు తీశారు. అనంతరం, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సీరియస్మరోవైపు.. ఇథనాల్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
TG: దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్తత
సాక్షి,నిర్మల్జిల్లా: జిల్లాలోని దిలావర్పూర్లో బుధవారం(నవంబర్27) ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ మంగళవారం జరిగిన ధర్నా సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు బుధవారం ఉదయం స్థానిక పోలీస్స్టేషన్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకుగాను పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్- కళ్యాణ్ నేషనల్ హైవేపైకి రానివ్వలేదు. దీంతో పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్లదాడి చేస్తూ గ్రామస్తులు నేషనల్హైవేపైకి చేరుకున్నారు. పోలీసుల వాహనాలపైనా గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఘటనాస్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: నిర్మల్ పల్లెల్లో ఇథనాల్ మంట -
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
వీడెవండీ బాబు... తాగిన మత్తులో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
నిర్మల్లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్ను రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్లోని ధర్నాచౌక్లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్రావు పటేల్ పాల్గొన్నారు. -
మృత శిశువుకు జన్మనిచ్చి తల్లి మృతి
భైంసాటౌన్: కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చి తర్వాత కాసేపటికి తానూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాకు చెందిన రాథోడ్ మనోజ్ తన భార్య శీతల్ (25)కు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయతి్నంచారు. అయితే నొప్పులు ఎక్కువ కావడం, కాన్పు కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా.. ఆ కాసేపటికే శీతల్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
లారీడ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
-
చిన్నారి ప్రాణం తీసిన సెల్ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్ఫోన్ ఛార్జర్ కేబుల్తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్మనీలో మన రుచులు
నిర్మల్ఖిల్లా: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో నిర్వహిహించిన ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్లో నిర్మల్కు చెందిన అజయ్కుమార్–శ్రీలత దంపతులు పాల్గొని ఇక్కడి తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు. అక్కడివారికి చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెలు తదితర వంటకాల రుచి చూపించారు. జర్మనీ ప్రజలు డబల్ క మీఠా వంటకాన్ని ఇష్టంగా ఆరగించినట్లు వారు తెలిపారు. అక్కడి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వారూ హాజరయ్యారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన అజయ్కుమార్–శ్రీలత దంపతులు చేసిన వంటకాలకు అక్కడి నిర్వాహకులు, స్థానికుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారంతా ఒక్కచోట కలుసుకుని మన దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్కుమార్–శ్రీలత దంపతులు పేర్కొన్నారు. -
వరికుచ్చులను మెచ్చుకున్న సీఎం
నిర్మల్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జిల్లా నుంచి ప్రదర్శనలో ఉన్న ధాన్యపు కుచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా.. సీఎం రేవంత్రెడ్డి స హా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ, సెర్ప్ సిబ్బంది కలిసి వరికుచ్చులను ప్రత్యేకంగా తయారు చేశారు.చేనేత, ఇతర కళాకృతుల కంటే ఈసారి ధాన్యపుసిరిని కళ్లకు కట్టించే వరికుచ్చులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ, కమిషనర్ అనితా రామచంద్రన్, సంగీత దర్శకుడు కీరవాణి పరిశీలించారు. -
రాజాసింగ్పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. -
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్లను తొలగించడమని చెప్పారు. -
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ రోడ్డులో పాతక్రషర్ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్రాథోడ్, పాయల్ శంకర్, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్ సుల్తానులు, బీఆర్ఎస్ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు. తమకు తాము రాజకీయ తీస్మార్ఖాన్ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడో కారు స్టీరింగ్ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్హౌస్కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు. కొయ్యబొమ్మకు గ్యారంటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మేడిన్ ఇండియా అన్న, మేకిన్ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు. తెలుగులో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఎంపీ సోయం గైర్హాజరు.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్ ఎంపీ, బీజేపీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్ రాథోడ్, పాయ ల్ శంకర్, అజ్మీరా ఆత్మారాంనాయక్ హాజరయ్యారు. అలాగే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్సింగ్తిలావత్, మాజీ ఎమ్మెల్యే సుమన్రాథోడ్, తదితరులంతా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్లు! -
ఆదర్శప్రాయుడు పీవీ: ఇంద్రకరణ్
నిర్మల్టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు. పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు. -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
భయపడేది లేదు: ఎమ్మెల్యే రేఖా నాయక్
‘‘కాంగ్రెస్లో చేరతా.. బీఆర్ఎస్ను ఓడిస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా’’.. టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్(నిర్మల్) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సెన్సేషన్ రియాక్షన్ ఇది. అంత స్వరం పెంచినా.. బుజ్జగింపులకు బీఆర్ఎస్ అధిష్టానం దిగింది. అయినా ఆమె చల్లారలేదు. దీంతో ‘ప్రతీకార చర్యలకు’ దిగిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదట కూతురు భర్త.. ఇప్పుడు తన భర్తనే టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించారు కూడా. సొంత ఎమ్మెల్యే రేఖనాయక్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది!. అత్తమీద కోపం అల్లుడి మీద ప్రదర్శించింది. మహబూబ్ బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్ చంద్రపవార్ను.. ఉన్నపళంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రేఖా నాయక్ దూకుడు తగ్గించేందుకు మరో అడుగు ముందుకేసింది. రేఖా నాయక్ కుటుంబ అక్రమాలను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె భర్త. శ్యామ్ నాయక్పై ఉన్న కేసును ఏసీబీ ద్వారా తిరగదోడేందుకు సిద్దమవుతోందని సమాచారం. తద్వారా రేఖానాయక్కు చెక్ పెట్టడంతో పాటు ఆసిఫాబాద్లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం నడుస్తోంది. బహిరంగంగా దూకుడు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ టిక్కెట్ను ఆమె రాజకీయ ప్రత్యర్ధిగా భావించే జాన్సన్ నాయక్కు కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో.. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని బావించిన రేఖనాయక్ ఆశలు అవిరయ్యాయి. టిక్కెట్ దక్కలేదనే ప్రస్ట్రేషన్లో రేఖానాయక్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై అగ్రహం వెల్లగక్కింది. కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. పార్టీ బుజ్జగింపులు చేసిన దారిలేదు. పైగా పార్టీ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదట!. పైగా ఖానాపూర్తో పాటు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించి తీరతామని ప్రకటనలు చేయడం మరింత మండిపోయేలా చేసింది. అందుకే ఆమెను దారికి తేవడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. భార్యభర్తలపై.. రేఖా నాయక్ భర్త ఇప్పటికే శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో చేరారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన శ్యామ్.. ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకున్నారు. అయితే.. భోరజ్ చెక్పోస్ట్ వద్ద ఎంవీఐగా పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో ఉంది. అలాగే.. రేఖా నాయక్ సైతం ఎమ్మెల్యేగా పలు అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రధానంగా మిషన్ భగీరథ, దళిత బందు, వివిద పథకాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ ద్వారా ఆమె దూకుడుకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోందట. అయితే ఇదంతా బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా చేయిస్తున్న ప్రచారమని.. బెదిరింపుల ద్వారా రేఖా నాయక్, ఆమె భర్తను లొంగదీసుకునే ప్రయత్నమనే ఆమె అనుచరులు మండిపడుతున్నారు. కుట్ర అంతా.. అవినీతి, అక్రమ ఆరోపణలను రేఖ, శ్యామ్లు సైతం కోట్టిపారేస్తున్నారు. ‘‘సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎలాంటి అక్రమాలకు పాల్పపడలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని ఆమె చెబుతున్నారు. అదేవిధంగా శ్యామ్ నాయక్ సైతం తాను వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని, కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన.. కేసుతో అయ్యేది లేదంటున్నారు. ‘‘ప్రజల్లో మాకు పెరుగుతున్న అదరణ చూసి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడుతున్నారు ఈ భార్యభర్తలు. ఏది ఏమైనా.. సర్కార్ బెదిరింపులకు ఆ భార్యాభర్తలు తలొగ్గుతారా? లేదంటే ఈ వేధింపులు వాళ్లపై సింపథీ క్రియేట్ చేస్తాయా?.. చూడాలి. -
నిర్మల్ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు?
ఆ పట్టణం వేనిస్ను మరిపిస్తోంది. వర్షకాలం వస్తే చాలు కాలనిలు చెరువులు అవుతున్నాయి. రోడ్లు కాల్వలు అవుతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పడవల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. పోని ఇదంతా పర్యాటక ప్రాంతమా అంటే అదీ కాదు. పోనీ ప్రగతి అంటే కాదు. అభివృద్ధి అసలు కాదు. మరి దశాబ్ద కాలంగా మంత్రి సాధించిన వందల కోట్ల అభివృద్ధి పనులు వరద పాలు కావడానికి కారణాలేంటి? ఆ వరదలు మంత్రిని ఎన్నికలలో ముంచుతాయా? వరదనీటిలో కమలం వికసిస్తుందా? వరదనీరు తెలంగాణ యోధుడు శ్రీహరి రావు విజయతీరాలకు చేర్చుతుందా? నిర్మల్ ఎన్నికల వరదలో ఎదురీదేవరు? ఏటిలో కోట్టుపోయేదేవరు? నిర్మల్ ఎన్నికల వరద యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. వంద ఏళ్ల చరిత్ర, ఘనకీర్తి కలిగిన నిర్మల్ నిర్మల్ నియోజకవర్గానికి వందల చరిత్ర ఉంది. ఏంతో ఘనకీర్తి ఉంది. పాలన చిహ్నలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. కరువు పాతరేసిన చెరువులు ఉన్నాయి. కాలే కడుపులకు కడుపునిండా అన్నం పెట్టిన ధాన్యాగారం.. నియోజకవర్గంలో మామడ, లక్ష్మణ చాందా, సోన్ నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా ప్రకారం 2,33,248 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మున్నూర్ కాపు, ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి, గంగపుత్రుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రయ్యారు ఇంద్రకరణ్. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 79,985 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించి. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్రెడ్డిపై విజయం సాధించారు. 9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం సాధించారు. క్యాబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. రెండోసారి మంత్రిగా అభివృద్ధిలో నిర్మల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు. కాలనిలకు రోడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం, మెడికల్ కళాశాల వంటివి సాధించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా కల్పించారు. అదే విధంగా నిర్మల్ ఆసుపత్రిని వంద పడకల అసుపత్రిగా మార్చారు. ఈ ప్రగతితో నిర్మల్ రూపురేఖలు మార్చారని పేరుంది. వీటితో పాటు అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దశ తిగిన దిశ మారని నిర్మల్ అభివృద్ధితో నిర్మల్ దశ మారిన దిశ మారలేదు. వందల ఎళ్లుగా నీళ్లను అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఆ కబ్జాలతో చెరువులు కనిపించకుండా పోతున్నాయి. వర్షకాలంలో చెరువులలో వెళ్లాల్సిన వరదనీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వలను మరిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల పైకప్పులను ముంచుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవల్లో ప్రజలు భయటకు వస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ మున్సిపల్లో నాలగో తరగతి ఉద్యోగులనియమాకం వివాదస్పందంగా మారింది. ఉద్యోగాలన్ని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బంధువులకు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధుల బంధువులకు దక్కాయి. అక్రమంగా ఉద్యోగాల నియమాకాలపై తీవ్రమైన దుమారం రేగింది. సంతలో సరుకులా మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ప్రజలు పార్టీల అధ్వర్యంలో ఉద్యమించారు. ఈ అక్రమం ఉద్యోగాల నియమాకాలపై అర్డిఓ చేత విచారణ జరిపించారు. ఆవిచారణలో ఉద్యోగాలు అక్రమంగా నియమాకాలు చేశారని తెలింది. ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఓ సిఫార్స్ చేశారు. మంత్రి కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇది మంత్రికి మచ్చగా మారింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం వివాదంగా మారుతోంది. చెరువులో ఎస్ఎటీఎల్ లేవల్ నిర్మాణం ఒక వివాదమైతే. దీనికి తోడు మంత్రి, బంధువులకు భూములు ఉన్నచోట కలెక్టరెట్ నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి. ఉద్యోగాల మచ్చ తోలగక ముందే పట్టణంలో మాస్టర్ ప్లాన్ మంత్రికి దడపుట్టిస్తోంది. తమ భూములు కోల్లగోట్టేందుకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపోందించారని రైతులు అందోళన కోనసాగిస్తున్నారు. భూములకు నష్టం కలిగించమని మంత్రి భరోసా ఇచ్చిన ఇంకా ప్రజలు నమ్మడం లేదట. అవినీతికి అడ్డాగా మంత్రి..! వీటితో పాటు డీ1 పట్టాలు మంత్రి బంధువులు అక్రమంగా పోందారని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే దళితుల సంక్షేమం అమలు చేస్తున్నా ఈ దళితబంధు పథకం మంత్రికి అడ్డంగా తిరిగింది. నర్సాపూర్ జిలో దళిత బంధు గురించి మంత్రిని ప్రశ్నించిన మహిళపై కేసు నమోదైంది. అది దళిత వర్గాలపై వ్యతిరేకతను పెంచింది. నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రాణహిత, చేవేళ్ల 27 ప్యాకేజీ పనులు అంగులం కదలడం లేదు. అభివృద్ధి పనులు పురోగతి లేకున్నా పార్టీలో అసంతృప్తి మంత్రికి తలనోప్పిగా మారిందట. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ భర్త సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ కీలక నాయకుడు శ్రీహరి మంత్రి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మంత్రి తీరుతో విసిగిపోయిన శ్రీహరి మంత్రిపై తిరుగుబాటు చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా మంత్రి సన్నిహితుడు సారంగపూర్ జడ్పీటీసీ మంత్రితో విబేధాల కారణంగా పార్టీ వీడారు. కాంగ్రెస్లో చేరారు. మంత్రి గెలుపు కోసం పనిచేసిన శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండుసార్లు అత్యల్ప ఓట్లతో ఓటమి పాలైనా ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వ్యూహలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. మంత్రి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రిపై వ్యతిరేకత.. కాంగ్రెస్, బీజేపీలకు ప్లస్? అదేవిధంగా అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వరదలకు మంత్రి కబ్జాలే కారణమని ఆరోపిస్తున్నారట. ఈ సందర్భంగా ఎలేటి మహేశ్వర్రెడ్డి ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. ఎలేటికి ప్రజల్లో మద్దతు లభిస్తున్న ఎన్నికల వరకు మద్దతు ఉపయోగించుకోవడం లేదని పేరుంది. ఈసారి చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే మహేశ్వర్రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం ఉంది. చుట్టం చూపులా హైదారాబాద్ నుండి వచ్చి పోతున్నారని భావన. ఈ భావన తోలగించుకోకుంటే ప్రతికూలంగా మారుతుందని కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని సోంత పార్టీలో ఉంది. మంత్రిపై వ్యతిరేకత ఉన్నా అనుకూలంగా మలుచుకోకపోతే గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావుతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తీరాలనే కసితో ప్రజల్లోకి వెళ్లుతున్నారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు 2009, 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీహరి రావు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో శ్రీహరి రావుకు భారీగా ఓట్లు లభించాయి. విజయ అంచుల వరకు హరి కేవలం ఎనిమిది వేల ఓట్లతో శ్రీహరి రావు ఇంద్రకరణ్రెడ్డిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలలో శ్రీహరి రావు మంత్రి బీఅర్ఎస్లో చేరడంతో టికెట్ దక్కలేదట. కానీ బీజేపీలో మహేశ్వర్రెడ్డి చేరడంతో బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరి రావు కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి మంత్రికి వ్యతిరేకంగా తనకు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 2014 ఎన్నికలలో ఓటమికి ఈ ఎన్నికలలో కసి తీర్చుకోవాలని భావిస్తున్నారట. మంత్రిపై ఉన్న వ్యతిరేకత తనకు గెలుపు ఖాయమని భావిస్తున్నారట శ్రీహరి. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజలు పట్టం కడుతారో చూడాలి. -
నిర్మల్లో ‘మాస్టర్’ ఫైట్
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది. నిర్మల్ బైల్బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్ప్లాన్ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఆమరణ దీక్షలోనే ఏలేటి.. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్కు పంపించారు. అరుణ సోన్లో, అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అమిత్షా, కిషన్రెడ్డి ఆరా.. మహేశ్వర్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఫోన్చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మరోపక్క మాస్టర్ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్పిలానీ ప్రొఫెసర్ మోహన్తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్చాన్స్లర్ వెంకటరమణ ఏఐ యాప్పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
మళ్లీ కడెం టెన్షన్.. మంత్రి మొక్కు
సాక్షి, నిర్మల్: కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టించింది. నాలుగు గేట్లు తెరుచుకోకుండా మొరాయించడంతో.. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని పర్యక్షించారు. కాసేపటికి వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ఎగువ నుంచి ప్రాజెక్ట్లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. కడెం ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా, నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయించాయి. జర్మన్ క్రస్ట్ గేట్లపై నుంచి వరదనీరు పారింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు ఇక కడెం ప్రాజెక్ట్ కు చేరుకోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ క్రమంలో అంతా వరదకు భయపడి ఒకసారి వెనక్కి వెళ్లారు. అయితే.. వరద తగ్గితే కట్ట మైసమ్మ మొక్కు చెల్లించుకుంటానంటూ కడెం వద్ద మొక్కుకున్నారు మంత్రి. ఆపై కాసేపటికే కడెం వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కడెం సామర్థ్యం : 8.227/7.60 TMC. ఇన్ ఫ్లో 230138 c/s అవుట్ ఫ్లో 236032c/s 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #kadam #TelanganaRains #nirmal @balaji25_t pic.twitter.com/VyQNwVXQeb — Shaik Adnan Ahmed شیخ عدنان احمد (@skadnan05) July 27, 2023 #kadam #TelanganaRains #nirmal @balaji25_t pic.twitter.com/VyQNwVXQeb — Shaik Adnan Ahmed شیخ عدنان احمد (@skadnan05) July 27, 2023 -
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. గులాబీ పార్టీకి కేసీఆర్ సన్నిహితుడు గుడ్బై
సాక్షి, నిర్మల్: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్కు సన్నిహితుడైన కూచాడి శ్రీహరిరావు పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. దీంతో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఊహించని షాక్ తగలింది. వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీహరిరావు అన్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా కేంద్రంలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వచించారు. ఈ సందర్భంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తెలంగాణలో రెండోసార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిందన్నారు. అలాంటి మోసాలను చేయడం ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు కామెంట్స్ చేశారు. ఇక, ఈనెల 17లోగా శ్రీహరి రావు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, శ్రీహరిరావు.. 2007లో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా శ్రీహరిరావు ఉన్నారు. అంతకుముందు, బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరిరావుతో ఉన్న తన అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. శ్రీహరిరావుతో గతంలో బీజేపీ నేతలు సైతం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు -
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. తరువాత చాంబర్లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్రెడ్డి, రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో ప్రభుత్వం కలెక్టరేట్ను నిర్మించింది. నిర్మల్ కలెక్టరేట్ అన్ని హంగులతో నిర్మించగా.. ఇటీవల అందుబాటులోకి వచ్చింది. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా కలెక్టరేట్ను నిర్మించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నో అద్భుతాలు సాధించించామని పేర్కొన్నారు. అందరి సమిష్టి కృషితోనే తెలంగాణ సాధించుకున్నామని, అందులో అనుమానం అక్కర్లేదని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు చేరువైందని. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లా విభజనతో అభివృద్ధి మరింత మెరుగైందని, తాగు, సాగు నీటి సమస్యను అధిగమించామని చెప్పారు. అన్ని వర్గాల్లోపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని, అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని కేసీఆర్ పేర్కొన్నారు. -
మిషనరీస్ అఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సందర్శిస్తున్న సీఎం
-
విజయవాడ: నిర్మల్ హృదయ్ భవన్లో సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్కు కొత్త కళ
సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్మల్లో నిర్మించే టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే.. 1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం. 3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు. 4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం. 5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు. 6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సీడీ తెరల ఏర్పాటు 7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. 8. మరో 10 తరాలకు అడ్వాన్స్గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 9. టీఎస్ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు. -
Indrakaran Reddy: అమాత్యుడి మాటల్లో ఆంతర్యం ఏమిటో!
సాక్షి, నిర్మల్: ‘ఇంత వయ సొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టం లేదు. భవిష్యత్తులో ఎవరైన వచ్చి నిల్చున్నా అభ్యంతరం లేదు’అంటూ బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పనితీరు, పథకాల గురించి చెబుతూ నిర్మల్ రుణం తీర్చుకునేందుకు ఎన్నో పనులు చేశామన్నారు. ఈ క్రమంలో ఇంత వయసొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టంలేదని, రేపొద్దున ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా స్టేజీపై, సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ‘ఐకేరెడ్డి జిందాబాద్’అంటూ నినాదాలు చేశారు. అందరూ స్టేజీ వద్దకు వెళ్లి మంత్రికి అండగా ఉంటామని చెప్పారు ఈ క్రమంలో కాసేపు ఇంద్రకరణ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఇటీవలే సీనియర్లు శ్రీహరి రావు, సత్యనారాయణగౌడ్ అసమ్మతివర్గంగా తయారు కావడం, కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి బీజేపీలో చేరడం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడం, పలువురు కౌన్సిలర్లనూ బీజేపీ టార్గెట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఇలా మాట్లాడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. చదవండి: మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే -
బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు
సాక్షి, నిర్మల్: పెళ్లి రిసెప్షన్ బరాత్లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్లో పెళ్లి కుమారుని సమీప బంధువు, మిత్రుడు ముత్యం(19) డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటహూటిన వైద్య కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముత్యం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని సమాచారం. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికే తరలించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
మహారాష్ట్ర వైపు ‘కారు’రూటు.. తెలంగాణ బయట బీఆర్ఎస్ తొలి సభ
నిర్మల్: జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతున్న బీఆర్ఎస్ తొలిసారి రాష్ట్రం బయట భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గతనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ నిర్వహించగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేలా సభ జరిపి, దేశ రాజకీయాలను ఆకర్షించే పనిలో పడింది. పక్షం రోజులుగా నాందేడ్లో మ కాం వేసిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం కేసీఆర్ హాజ రయ్యే సభ కోసం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మరాఠా ప్రజలకు బీఆర్ఎస్ను పరిచయం చేయడంతోపాటు పార్టీలో పలువురి చేరిక లు ఉంటాయని గులాబీ నేతలు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హైదరాబాద్లో రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాందేడ్కు బయలుదేరుతారని, ఒంటిగంటకు అక్కడికి చేరుకు నే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నాందేడ్ గులాబీమయం నాందేడ్లో రైల్వేస్టేషన్ సమీపంలోని గురుద్వారా సచ్ఖండ్ బోర్డు మైదాన్లో బీఆర్ఎస్ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంతోపాటు సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ప్రచార ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చారు. భారీ హోర్డింగులు, స్వాగత తోరణాలు, బెలూన్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రవాసులను ఆకట్టుకునేలా చాలా వరకు మరాఠీలో రాయించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు స్థానికంగా బీఆర్ఎస్లో చేరిన, చేరుతున్న నాయకుల ఫొటోలను వాటిపై ముద్రించారు. అక్కడే మకాం వేసి.. తెలంగాణ వెలుపల తొలిసభ కావడంతో బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీబీపాటిల్, బోధన్, జుక్కల్, ముధోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు షకీల్, హన్మంత్షిండే, విఠల్రెడ్డి, జోగు రామన్న, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, మాజీ మంత్రి గెడం నగేశ్ తదితర నేతలు పక్షం రోజులుగా నాందేడ్లోనే మకాం వేశారు. సభ ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మరాఠీ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తనతో అనుబంధం ఉన్న నాందేడ్ మాజీ ఎంపీ డీబీ.పాటిల్ ఇతర నేతల సహకారం తీసుకున్నారు. ఇప్పటికే పలువురు సరిహద్దు గ్రామాల సర్పంచులు, నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సరిహద్దు దారులన్నీ అటే.. నాందేడ్ సభకు మహారాష్ట్రలోని స్థానికులతోపాటు తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా బోధన్, నిర్మల్ జిల్లా ముధోల్, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు జన సమీకరణకు గులాబీనేతలు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరవుతారని.. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, భోకర్, నాయిగాం, ముథ్కేడ్, దెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాల నుంచి ప్రజలు స్వయంగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ: ఇంద్రకరణ్రెడ్డి నాందేడ్ బీఆర్ఎస్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శనివారం ఇతర నేతలతో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక అలంకరణ, అతిథులు, ముఖ్య నేతల సీటింగ్ తదితర అంశాలపై సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదీ.. ►సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ►ప్రత్యేక కాన్వాయ్లో సభావేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ►అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►1.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత ప్రసంగిస్తారు. ►2.30 గంటలకు సభాస్థలి నుంచి స్థానిక సిటీప్రైడ్ హోటల్కు చేరుకుని భోజనం చేస్తారు. ►సాయంత్రం 4 గంటల సమయంలో జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ►సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. -
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాకిరేవు గ్రామ ప్రస్తావన..
ఆదిలాబాద్: చాకిరేవు.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ని మారుమూల గ్రామం. ఈ గ్రామం అటవీ ప్రాంతంలో ఉండగా రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం కూడా లేదు. కనీస సౌకర్యాలు కల్పించాలని గతంలో ఈ గ్రామ ఆదివాసీ గిరిజనులు గ్రామం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి 70కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్కు సమస్యలు తెలిపారు. కనీస వసతులు కల్పించేవరకూ కలెకర్ కార్యాలయం నుంచి కదలబోమని భీష్మించారు. అక్కడే కూర్చొని దీక్ష చేపట్టారు. దీంతో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు మారుమూల చాకిరేవుకు గ్రామానికి పరుగులు తీసి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే తాగేందుకు బోర్లు వేయడంతో గ్రామస్తులు దీక్ష విరమించి గ్రామానికి వెళ్లారు. పట్టు వీడకుండా కనీస వసతుల కోసం 70కిలో మీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుని రాష్ట్రంలో హాట్టాఫిక్గా పెంబి మండల, చాకిరేవు గ్రామం నిలిచింది. దీంతో పాటు హీరో బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు గ్రామస్తులను డిసెంబర్ 26న ఆహ్వానించారు. కార్యక్రమానికి సినీనటుడు పవన్కళ్యాణ్ మఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోడసం శంభు గ్రామానికి చెందిన గ్రామ పటేట్ లింభారావ్ పటేల్, జెత్రావు, జైతు ఈ ప్రోగ్రాంకు వెళ్లి గ్రామంలోని గిరిజనుల దీనస్థితిని వివరించారు. దీంతో గ్రామస్తులకు ఆహ ప్రోగ్రాం నుంచి రూ.లక్ష చెక్కును బాలకృష్ణ, పవన్కళ్యాణ్ అందజేశారు. త్వరలో గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయిస్తామని ప్రోగ్రాం తరఫున హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ.లక్ష చెక్కు, చీకటిలో మగ్గుతున్న చాకిరేవు గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న అన్స్టాపబుల్ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు, హీరో బాలకృష్ణకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. -
సత్తన్న ఇంటికి ‘కోమటిరెడ్డి’
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీచైర్మన్ శోభారాణి, బీఆర్ఎస్ రాష్ట్రనేత సత్యనారాయణగౌడ్ దంపతులను మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సత్తన్న ఇంటికి వెళ్లి ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సత్యనారాయణగౌడ్ను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ ముధోల్ నియోజకవర్గ నేత రామారావుపటేల్, తదితరులు ఉన్నారు. రాజకీయమేమీ లేదు.. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్తో కలిసి పనిచేసిన నేతగా గుర్తింపు ఉన్న సత్యనారాయణగౌడ్ ఇంటికి రాజ్గోపాల్రెడ్డి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, బీఆర్ఎస్తో అంటీముట్టనట్టుగా ఉంటున్న సత్తన్న బీజేపీలో చేరుతారా..? ఆదిలాబాద్ పార్లమెంట్ను దత్తత తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన కోమటిరెడ్డి అదే విషయంలో ఈయన ఇంటికి వచ్చారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ‘సాక్షి’వివరణ కోరగా సత్యనారాయణగౌడ్ కొట్టిపారేశారు. రాజ్గోపాల్రెడ్డి బంధువు తనకు క్లాస్మేట్ అని, ఆక్రమంలో ముందునుంచీ తమకు కొంత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్ మీటింగ్కు వెళ్లి వస్తూ ఆరోగ్య సమాచారం దృష్ట్యా తనను పరామర్శించడానికి మాత్రమే ఆయన వచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పార్టీల చర్చే తమ మధ్య రాలేదన్నారు. తొలిసారి తన ఇంటికి వచ్చినందున శాలువా, జ్ఞాపికతో సత్కరించానని అన్నారు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు.. నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. హన్మకొండ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్గా బదిలీ. అలాగే హైదరాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు ► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి.. మహబూబ్నగర్ కలెకర్ట్గా బదిలీ. ► ప్రస్తుత మహబూబ్నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ. ► జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి సంతోష్.. మంచిర్యాల కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజార్షి షా.. మెదక్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు జగిత్యాల ఇన్చార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు. ► ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్.. ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్.. వనపర్తి కలెక్టర్గా బదిలీ కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. పోలీసులకు ఫిర్యాదు.. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేశ్పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్లో టెన్షన్.. టెన్షన్.. -
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
దుమ్ముగూడెం/నిర్మల్: ఛత్తీస్గఢ్– మహారాష్ట్రల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు– మావోయిస్టులకు నడుమ జరిగిన ఎన్కౌంటర్లో మహిళా డివిజనల్ కమిటీ(డీవీసీ) కమాండర్సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కణితి లింగవ్వ (40) అలియాస్ అనిత మృతి చెందినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల పోలీసులతోపాటు మహారాష్ట్రకు చెందిన సీ–60 కమాండోలు, బీజాపూర్కు చెందిన బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నేషనల్ పార్క్ టకామెటా ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా, ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ రైఫిల్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇరువర్గాల నడుమ కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ అలియాస్ అనిత తలపై తెలంగాణలో రూ.5 లక్షలు, మహారాష్ట్రలో రూ.16 లక్షలు నజరానా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన రాజవ్వ, రాజన్న దంపతులకు ముగ్గురు సంతానం. అందులో లింగవ్వనే పెద్దది. ఆమెకు రమేశ్, రవి ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. గోదావరి పరీవాహక ప్రాంతమైన లక్ష్మీసాగర్కు అప్పట్లో నక్సల్స్ దళాలు తరచూ వస్తుండేవి. ఈ క్రమంలో వాళ్ల పాటలు, మాటలకు ఆకర్షితురాలైన లింగవ్వ 1997లో యుక్తవయసులోనే దళంలో చేరింది. లింగవ్వ తమ్ముడు కంతి రవి అలియాస్ సురేశ్ సైతం కొన్నాళ్లు దళంలో పనిచేసి 2016లో పోలీసులకు లొంగిపోయాడు. లింగవ్వ మాత్రం భర్త అడెల్లుతోనే దళంలోనే కొనసాగింది. బిడ్డ తిరిగొస్తదనుకున్నా: లింగవ్వ తల్లి రాజవ్వ ‘పుట్టిన ఒక్కగానొక్క ఆడిబిడ్డ మమ్మల్ని ఇడిసి అడివిలకు పోయింది. ఎప్పటికైనా నా బిడ్డ ఇంటికి తిరిగొస్తదనుకున్న. ముసలితనంలనైనా లింగవ్వను చూస్తానుకున్న. కానీ.. ఇట్లయితదను కోలేదు..’అంటూ కంతి లింగవ్వ తల్లి రాజవ్వ కన్నీరుమున్నీరవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన విషయం శుక్రవారం సాయంత్రం తర్వాత కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి లక్ష్మీసాగర్ గ్రామంలో విషాదం అలుముకుంది’ -
పరీక్షలకు సిద్ధమా..?
నిర్మల్: ‘కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతాడు. రక్తం, వెంట్రుకల నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధం. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినవ్ కదా కేటీఆర్.. నువ్వు, నేను పరీక్షలు చేయించుకుందాం. నా శరీరంలోని ఏభాగమైనా పరీక్షలకు ఇచ్చేస్తా. నీకు ఖాళీ.. రక్తం, రెండు వెంట్రుకలిచ్చే దమ్ముందా..?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశమంతా ఓవైపు ఉంటే.. కేసీఆర్ మరోవైపు ఉంటాడని, ప్రధాని మోదీ అంటే పడనివాళ్లు సైతం దేశం కోసం జీ–20 నిర్వహణ సమావేశానికి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ మాత్రం తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి ఎలా బయటపడేయాలా అని లాయర్లతో మీటింగ్ పెట్టాడని విమర్శించారు. నిర్మల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం మామడ మండల కేంద్రం నుంచి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. మార్గంమధ్యలో దిమ్మదుర్తిలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సంజయ్ నివాళులర్పించారు. అక్కడ నిర్వహించిన సభలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, ఎంపీ సోయం బాపురావుతో కలిసి మాట్లాడారు. అంబేడ్కర్ భిక్షతోనే ఎంపీనయ్యా.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భిక్షతోనే ఎంపీనయ్యానని, అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని బండి సంజయ్ అన్నారు. అలాంటి మహనీయుడిని గుర్తించిన ఘనత కూడా బీజేపీదే అన్నారు. భారతరత్నతో గౌరవించుకున్నామని, అంబేడ్కర్కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిని చేయడంతో పాటు 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా, పలువురిని గవర్నర్లు, ముఖ్యమంత్రులగా చేసిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. కనీసం అంబేడ్కర్ వర్ధంతి, జయంతిలకు రాని దౌర్భాగ్యపు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. దేశం కంటే బిడ్డే ముఖ్యమా? జీ–20 దేశాల సమావేశాన్ని నిర్వహించే అవకాశం మన దేశానికి రావడం గర్వకారణమని సంజయ్ పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తే కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దేశం కంటే బిడ్డ ముఖ్యమా అని నిలదీశారు. -
ముగ్గురితోనే సర్కార్ను కూలుస్తమా?
నిర్మల్: ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. కేసీఆర్.. ఎందుకు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతవ్. బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. నీ సర్కార్ను కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలె. అలాంటప్పుడు కూల్చడం ఎలా సాధ్యం? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి? రాష్ట్ర ప్రజల ఆశలను కూల్చింది నువ్వే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినవ్’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి ఘాటుగా స్పందించారు. ప్రజాసంగ్రామయాత్ర ఎనిమిదో రోజు సోమవారం నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్కాండ్లి నుంచి మామడ సాగింది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్, మామడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ల్లో బండి మాట్లాడారు. ఆ మంత్రి అవినీతి చిట్టా ఉంది.. నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సంగతి చూస్తామని బండి హెచ్చరించారు. మంత్రిపైనా విచారణ జరపాల్సిందేనన్నారు. కాగా, ప్రజాసంగ్రామయాత్రలో స్వల్ప మార్పు చేసినట్లు పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్రెడ్డి తెలిపారు. ఈ నెల 16న కరీంనగర్లో ఐదో విడత యాత్ర ముగుస్తుందన్నారు. అక్కడి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని చెప్పారు. డ్రగ్స్దందాలో ఇంకొకరు.. ఇప్పటికే కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో దొరికారని, డ్రగ్స్ దందాలో కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి బండి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బెంగళూర్ డ్రగ్స్ కేసులను తక్షణమే రీ–ఓపెన్ చేసి, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ తప్పు చేయకపోతే 10 ఫోన్లను కవిత ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్కు మద్యం అంటే ఇష్టమని, అందుకే కవిత మద్యం దందా చేసిందని ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీ లాంటి సంస్థలు ఎక్కడ దాడులు చేసినా ఆమె పేరే బయటికి వస్తోందన్నారు. లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డకు విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అరెస్టయితే సానుభూతి పొందేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. -
నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్
నిర్మల్: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన నంబర్ వన్ తెలంగాణ ద్రోహి, సారా స్కాంలో తన బిడ్డను అరెస్టు చేస్తే ఉద్యమం చేయాలంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్ర ఏడోరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? బీజేపీని, మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడని సంజయ్ విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని, అందుకే సీఎం పీఠంపై కూర్చున్నావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా..? లేక రజాకార్లపై పోరాడిన మరో ఝాన్సీ లక్ష్మీబాయా..? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిందని ఆరోపించారు. అలాంటి కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆయన కుమార్తె కవిత ప్రస్తుతం కేసుల భయంతో ఒకటే విలపిస్తున్నారని, వారి కన్నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుతోందని బండి సంజయ్ ఎదేవా చేశారు. అల్లోల అవినీతి తిమింగలం.. రెండు వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోరు ఇంద్రకరణ్రెడ్డి అని, అధికారంలోకి వచ్చాక అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తామని సంజయ్ హెచ్చరించారు. మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. జనవరి 10లోపు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు కాలేరని, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని సంజయ్ సూచించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలన్నారు. హిందు అమ్మాయిలను లవ్జిహాద్ పేరిట వేధించే వాళ్ల బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ను 35 ముక్కలుగా నరికితే ఒక్క సెక్యులర్ నాయకుడు, ఏ సంఘమూ మాట్లాడలేదని మండిపడ్డారు. కేరళలో లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటే, ట్రిపుల్ తలాక్ పేరిట మహిళలను ఇబ్బందులు పెడుతుంటే క్రైస్తవ, ముస్లిం సంఘాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతాం తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. బీజేపీ అధికారంలోకొస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని అన్నారు. నిర్మల్కు బుల్డోజర్లను పంపి అక్రమంగా నిర్మించిన బడా బాబుల ఇళ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపి తీరతామని పునరుద్ఘాటించారు. -
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
నిర్మల్: ‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు శ్రీకాంతాచారి లాంటి 1,400 మంది పేదలు, విద్యార్థులు, యువత బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో పాలకుల తీరుతో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆకలిచావులు, ఆత్మహత్యలు ఆగలేదు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ధనిక రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)మండలం రాంపూర్ నుంచి దిలావర్పూర్ మీదుగా నిర్మల్రూరల్ మండలం చిట్యాల వరకు శనివారం సాగింది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిలావర్పూర్ ప్రభుత్వ పాఠశాలలోని భవిత కేంద్రంలో దివ్యాంగులైన చిన్నారులతో ఆయన కాసేపు ఆడిపాడారు. వారికి బ్యాగులు, పెన్నులు, బిస్కెట్లు అందించారు. సభాస్థలి వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళుర్పించారు. ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా.. అరవై ఏళ్ల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా.. కేసీఆర్ పాలనతో ప్రజలకు ఎలాంటి లబ్ధి జరగలేదని సంజయ్ విమర్శించారు. డబుల్బెడ్రూం ఇళ్లు రాలేదని, ఆత్మహత్యలు ఆగలేదని, ఇప్పటికీ ఆకలిచావులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు బికారీలుగా అవుతుంటే, కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడు ఎలా అవుతున్నారని నిలదీశారు. ఫామ్హౌస్లో ఏమైనా గంజాయి పండిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మేకప్ వేసుకున్నావా అని భార్య ఆరా.. ‘‘న్యూస్ చానళ్లలో పాదయాత్రను చూసి నా భార్య ఫోన్ చేసింది. ఏంది.. మేకప్ బాగా వేసుకున్నావా అని అడిగింది. పిచ్చిదానా.. అది మేకప్ కాదు.. కేసీఆర్ పాలనలో రోడ్లమీద ఉచితంగా వచ్చే దుమ్ము ఇట్ల చేసింది’’అని చెప్పానంటూ స్థానికంగా రోడ్లు, దుమ్ముపై సంజయ్ చెప్పిన తీరు సభికులను నవ్వించింది. -
బెంగళూరు డ్రగ్స్ కేసు తిరగదోడతాం
నిర్మల్: ‘సంచలనం రేపిన బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబ పాత్ర ఉంది. కర్ణాటక పోలీసులను సైతం కేసీఆర్ మేనేజ్ చేశాడు. కేసును మూసేయించాడు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కేసు మూసేందుకు సహకరించిన పోలీసు అధికారుల సంగతి, దీని వెనుక ఉన్న కేసీఆర్ సంగతి తేల్చాల్సిందే. ఈ కేసును తిరగదోడే దాకా విడిచిపెట్టం. కేసీఆర్, కవితలు ఇప్పటికే దొరికిపోయారు. ఇక కేటీఆర్ సంగతి చూస్తాం. మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంటూ, వేల కోట్లు లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి దందాలు చేసేవాళ్లని విడిచిపెట్టం..’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర గురువారం నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా(బి), ఓలా, కుంటాల, అంబకంటి గ్రామాల్లో సాగింది. లింబా(బి)లో పాఠశాల, ఓలా వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కాలువను సంజయ్ పరిశీలించారు. పలుచోట్ల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు.. ‘ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి లేని డబ్బులు, ఢిల్లీ లిక్కర్ దందాకు, క్యాసినోలో పెట్టుబడులకు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెరుగుతుంటే, పేదోళ్లు బికారులు అవుతున్నారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల అప్పు ఉంది..’అని సంజయ్ విమర్శించారు. పైసలన్నీ కేంద్రానివే.. ‘మహిళల గౌరవాన్ని కాపాడేందుకు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు నిర్మించడం మొదలుకుని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనేదాకా గ్రామంలో ప్రతి అభివృద్ధి పనికి కేంద్రమే పైసలిస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.4 వేల కోట్లను మోదీ ఇస్తే కేసీఆర్ ఏం చేశాడు. రైతుబంధు ఇస్తున్నామని చెప్పి మిగిలిన పథకాలన్నీ ఎత్తేశాడు. పోడు భూములు, దళితబంధు, దళితబస్తీ హామీలు ఏమయ్యాయి? మిషన్ భగీరథపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఇక్కడ ఇళ్లు, నీళ్లు, రోడ్లు లేవు. ఈ విషయాన్ని ట్విట్టర్ టిల్లుకు తెలిసేలా యువత ట్వీట్ చేయాలి. రాష్ట్రంలో ఊరూరా కేసీఆర్ (బెల్ట్) షాపులు ఉన్నాయి. చిన్నపిల్లలకు సైతం డ్రగ్స్ను అలవాటు చేస్తున్నారు..’అని ఆరోపించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ ‘కేసీఆర్ చేసిన దొంగ పోరాటాలతో తెలంగాణ రాలేదు. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి 1,200 మంది యువకుల బలిదానాలతో వచ్చింది. కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలతోపాటు సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో రామరాజ్యం స్థాపించి తీరుతాం..’అని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీ సోయం బాపురావు, పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బీజేపీ యాత్రతో కేసీఆర్లో వణుకు
నిర్మల్: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో సీఎం కేసీఆర్కు వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రజల కష్టాలను గాలికి వదిలేసి ఫామ్హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. పేదలను కలిసి భరోసా కల్పించేందుకే తాము పాదయాత్ర చేపట్టామని చెప్పారు. బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి నుంచి ప్రారంభించారు. భైంసా నుంచి ప్రారంభించాల్సి ఉన్నా.. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సంజయ్ అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి, భైంసా బహిరంగసభలో పాల్గొని పాదయాత్ర ప్రారంభించాలి. కానీ ఆదివారం రాత్రి భైంసా వస్తున్న బండి సంజయ్ను అడ్డుకుని కరీంనగర్కు తరలించడంతో సభ వాయిదా పడింది. భైంసా సభ, పాదయాత్రలకు హైకోర్టు సోమవారం మధ్యాహ్నం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి బయల్దేరి సాయంత్రానికి అడెల్లికి చేరుకున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇతర నేతలతో కలిసి అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు. సారంగపూర్, నిర్మల్ మీదుగా భైంసా మండలం గుండెగాంకు చేరుకుని బస చేశారు. ఎవరివల్ల సున్నిత ప్రాంతమైంది? పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్కు బండి సంజయ్ కాషాయ కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నందునే కుంటిసాకులు చెప్పి పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. భైంసా ఎవరి వల్ల సున్నిత ప్రాంతంగా మారిందని ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే.. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడి పాదయాత్రను, బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని, కేసీఆర్ హామీలేవీ నెరవేర్చలేదని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తామన్నారు. మహిళపై పెట్రోల్తో దాడి చేయడమేంటి? వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల బస్సు (కారవాన్)ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని బండి సంజయ్ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదే కేసీఆర్ అండ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా షర్మిలను అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
-
నిర్మల్లో హ్యాండిస్తాడా?
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కొన్ని చోట్ల ఇబ్బందికరంగా మారింది. జిల్లాల్లో నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. నిర్మల్ జిల్లాలో గట్టి నాయకుడు ఒకాయన పక్క పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈయనకు ఉన్న పలుకుబడి చూసి ఆ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రామ రామ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పటేల్ ఎంత ప్రయత్నిస్తున్నా జిల్లాలో పార్టీ డెవలప్ కావడం లేదని నిరాశ చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామారావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. 36,860 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ వెనక్కి వెళ్తుంటే, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బలపడతున్నాయట. పార్టీ పరిస్థితి ఇలా అయితే తాను ఎమ్మెల్యేగా గెలవడం సాధ్యం కాదని ఆయన నిర్థారించుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. కమలం ఆకర్ష్ ముథోల్ నియోజకవర్గంలో బిజెపి బలంగా ఉందన్న అంచనాలున్నాయి. పార్టీకి హిందూత్వ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందన్న విశ్లేషణలున్నాయి. అందుకే రామారావు పటేల్ కమలంపై రామారావు కన్నేశారట. ఆరునూరైనా ఈసారి ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారట. అందువల్ల ఎమ్మెల్యే కావాలంటే పార్టీ మారాలని, అదీ కమలం పార్టీలో చేరాలని రామారావు పటేల్ నిర్ణయించుకున్నారని టాక్. బిజెపి పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. కొత్త ముఖం కావాలి.! ముథోల్లో హిందూ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. బిజెపి అభ్యర్థి రమాదేవి రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఆమెపై ఓటర్లలో ఉన్న వ్యతిరేకతే కారణమని చెబుతున్నారు. ఈ సారి అభ్యర్థి మారితే కమలం పార్టీ గెలుస్తుందని కాషాయపార్టీ సర్వేలో తెలిందట. ఇలాంటి పరిస్థితులలో నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న రామారావు పటేల్ చేరితే పార్టీకి గెలుపు ఖాయమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారట.. అందుకే రామారావు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినిపిస్తోంది. ముందు తమ్ముడు.. తర్వాత.! ఇప్పటికే రామారావుపటేల్ సోదరుడు మోహన్ రావు పటేల్ బిజెపిలో కొనసాగుతున్నారు. కాగా పార్టీ మార్పుపై రామరావు పటేల్ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే జిల్లాలో ముఖ్యమైన నేత కావడంతో రామారావు పటేల్ పార్టీ మారకుండా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి రామరావు పటేల్ అత్యంత సన్నిహితుడు. దాంతో రామరావు పటేల్ పార్టీ మారకుండా మహేశ్వర రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
బాసరకు మంత్రి కేటీఆర్
నిర్మల్: ఎట్టకేలకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. విద్యార్థులతో మాటాముచ్చట.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్ తమవద్దకు రావాలని జూన్లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
ఆ మట్టితోనే ప్రాణం పోశాడు..
నిర్మల్: దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ఎక్కడైతే చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడాడో.. అక్కడి మట్టితోనే మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. తనతోపాటు వెయ్యిమంది ప్రాణాలను అర్పించిన స్థలంలోని మట్టితో రాంజీగోండు విగ్రహానికి పోలీస్ భీమేశ్ అనే యువకుడు ప్రాణం పోశాడు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేటకు చెందిన భీమేశ్ సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1860లో వెయ్యి ఉరులమర్రి ఘటనలో ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు మట్టి ప్రతిమను తయారు చేశారు. ఇందుకు ఎక్కడైతే వారిని ఉరితీశారో.. ఆ మట్టినే ఉపయోగించారు. ఈ సందర్భంగా భీమేశ్ మాట్లాడుతూ నిర్మల్ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘సాక్షి’విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవల చేస్తున్న కార్యక్రమాల స్ఫూర్తితోనే తాను రాంజీ బొమ్మకు ప్రాణం పోసినట్లు భీమేశ్ వెల్లడించారు. -
మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు
‘సెప్టెంబర్ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా? కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. నిర్మల్: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు. అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. రోహిల్లాల తోడుతో.. ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్జల్ ఉద్దౌలా వరకు తెలిసింది. అణచివేత కోసం బళ్లారి దళం.. ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫ్రాంట్రీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్ సఫలమయ్యాడు. సోన్–కూచన్పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు. -
పచ్చని చెట్టు పొట్టన పెట్టుకుంది
ఖానాపూర్: జలపాతం చూసేందుకు మిత్రులంతా కలిసి బయల్దేరిన విహార యాత్ర విషాద యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై చెట్టు కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన 12 మంది మిత్రులు ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం కుంటాల జలపాతాన్ని చూసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో ఉదయం బయల్దేరారు. ఖానాపూర్ మండలం ఎక్బాల్పూర్ వద్దకు రాగానే వీరి వాహనంపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్తో కలిపి 13 మంది ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ వంతడుపుల బుచ్చిరాం (49), ఉట్నూర్ రవి (35) అక్కడికక్కడే మృతి చెందారు. పందిరి నిఖిల్కు తీవ్రంగా, మిగిలిన పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం మధ్యలో చెట్టు పడి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువ జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్లో ఇదే మేటి!
నిర్మల్ చైన్గేట్: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు. టీఎస్18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్కు నిర్మల్ ఆర్టీవో అజయ్రెడ్డి సమక్షంలో ఆన్లైన్లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్కుమార్ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అలాగే టీఎస్18–హెచ్ 0009 నంబర్ను వెంకట సత్యశ్రీధర్ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్18–హెచ్ 0001 నంబర్ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్ను విజయ్ భాస్కర్రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ) -
తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్ ఆఫీసు పైకప్పు
సాక్షి, నిర్మల్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. -
గవర్నర్.. గాడిన పెడతారా?
నిర్మల్: ఒకటి, రెండు కాదు.. ఒకదాని వెనుకొకటి.. వరుసగా సమస్యలు బాసర ట్రిపుల్ఐటీని పీడిస్తున్నాయి. విద్యాక్షేత్రం ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ జూన్ 14 నుంచి 21 వరకు ఎండనక, వాననక ఉద్యమించారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి నెలరోజుల్లో సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలు కావొస్తున్నా అవి పరిష్కారం కాకపోగా, అదనంగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ నెల 3న ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ‘ఒక్కసారి వర్సిటీకి వచ్చి చూడండి మేడమ్’అంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదివారం ట్రిపుల్ ఐటీకి వస్తున్నట్లు రాజ్భవన్ ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆర్జీయూకేటీకి అనుకున్నస్థాయిలో నిధులు రాకపోవడంతోపాటు న్యాక్ నుంచి ‘సీ’గ్రేడ్ రావడంతో విద్యార్థులు నిరాశపడ్డారు. వీటికి తోడు పురుగులన్నం, కప్పల కూరలు, టిఫిన్లలో బల్లులు, బొద్దింకలు రావడం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయి. జూలై 15న ఫుడ్ పాయిజన్ జరిగి 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ చాలామంది కోలుకోలేదు. ట్రిపుల్ ఐటీ నుంచే వర్సిటీల సందర్శన రాజ్భవన్లో ఈ నెల 3న పలు యూనివర్సిటీల విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సమావేశమ య్యారు. వర్సిటీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ట్రిపుల్ఐటీ నుంచే యూనివర్సిటీల సందర్శన ప్రారంభిస్తున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ►శనివారం రాత్రి 11.40కి హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, నిజామాబాద్ చేరుకుంటారు. ►నిజామాబాద్ నుంచి ఆదివారం వేకువ జామున 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. ►ట్రిపుల్ ఐటీ గెస్ట్హౌస్లో ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►ఉదయం 6.20 గంటలకు బాసర జ్ఞానసరస్వతీమాతను దర్శించుకుంటారు. ►ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్ ఐటీ చేరుకుని, విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, స్టాఫ్తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఉదయం 10 గంటలకు ట్రిపుల్ ఐటీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. రెక్టర్ హోదాలో.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్న ర్ చాన్స్లర్ హోదాలో ఉంటారు. కానీ, ప్రత్యేక చట్టం కలిగిన రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)కు మా త్రం ఈ హోదా వర్తించదు. గవర్నర్కు చీఫ్ రెక్టర్ (చాన్స్లర్ తరహాలో సంప్రదాయ పరిపాలనా ధికారి) హోదా మాత్రమే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలన్నింటికీ కలిపి ప్రత్యేకంగా చాన్స్లర్ ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుంచి చాన్స్లర్ను నియమించలేదు. ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలో గతనెలలో రాహుల్ బొజ్జాను మార్చి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటర మణకు బాధ్యతలు అప్పగించినా సమస్యలపర్వం కొనసాగుతూనే ఉంది. -
బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్లో తిన్న విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది. వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. ‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి. అసలు చర్యలేవి..: ఫుడ్పాయిజన్ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్ఎస్ మెస్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు. కేంద్రీయ భండార్ కాంట్రాక్టర్కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని, వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ట్రిపుల్ ఐటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ! -
‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట రూ.700.. ట్రిపుల్ ఐటీ.. ‘బీమా’ ఏదీ..?
నిర్మల్/బాసర: పేదింటి విద్యార్థులు చదివే బాసర ట్రిపుల్ఐటీ తీరెలా ఉందో మరోమారు బయటపడింది. ఇటీవల చనిపోయిన తమ విద్యార్థి సంజయ్కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని వర్సిటీ అధికారులు.. కనీసం అతడికి ‘ఆరోగ్యబీమా’కూడా ఇవ్వలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట ప్రతీ విద్యార్థి నుంచి రెండేళ్లకోసారి రూ.700 చొప్పున అధికారులు వసూలు చేస్తున్నారు. డబ్బులైతే సకాలంలో తీసుకున్నారు కానీ విద్యార్థులకు అందించాల్సి బీమాపై మాత్రం దృష్టిపెట్టలేదు. కొన్నేళ్లుగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలనే సంప్రదించలేదన్న విషయం విస్మయానికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే సంజయ్కిరణ్కు ఆరోగ్యబీమా దక్కలేదని స్పష్టమవుతోంది. రూ.700 చొప్పున.. బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ను 2017లో అప్పటి ఇన్చార్జి వీసీ అశోక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండేళ్లకు రూ.700 చొప్పున విద్యార్థుల నుంచి వసూలుచేశారు. ఏడాదికి రూ.350 చొప్పున వర్తిస్తుందని, ఆ మేరకు బీమా అందుతుందని చెప్పారు. రెండేళ్లపాటు వివిధ సంస్థలకు చెల్లింపులు చేశారు. ఆపై ఇన్చార్జి వీసీ మారడం, మరో ఐఏఎస్ రాహుల్ బొజ్జా రావడం, కోవిడ్ పరిణామాలతో విద్యార్థుల బీమా అటకెక్కింది. సంస్థలు ముందుకు రాలేదని.. కోవిడ్ సమయంలోనూ విద్యార్థుల నుంచి డబ్బులను తీసుకున్నారు. కానీ ఏ బీమా సంస్థకు బాధ్యతను అప్పగించలేదు. ఈక్రమంలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో వసూలుచేసిన డబ్బులు ఏమయ్యాయనే దానికి సమాధానం లేదు. రెండేళ్లకు రూ.700 చొప్పున తొమ్మిదివేల మంది విద్యార్థుల నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. సంజయ్కు దక్కని బీమా.. వరంగల్రూరల్ జిల్లా ఎల్గూరు రంగంపేటకు చెందిన శాబోతు సంజయ్కిరణ్ అనే పీయూసీ–2 విద్యార్థి ఈనెల 26న మృతిచెందాడు. సంజయ్ సైతం వర్సిటీకి రూ.700 హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించాడు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం మరణించిన సంజయ్కు ఆరోగ్యబీమా దక్కలేదు. బీమా రాలేదు.. వర్సిటీలో భోజనం బాగుండదని, తినాలనిపించట్లేదని సంజయ్ చెప్పేవాడు. దీంతోనే అతడి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స కోసం శక్తికి మించి రూ.16 లక్షలు ఖర్చుచేశాం. కానీ సంజయ్ ప్రాణాలు దక్కించుకోలేకపోయాం. వర్సిటీకి డబ్బు లు చెల్లించినా వైద్యానికి ఎలాంటి ఆరోగ్యబీమా అందలేదు. –శాబోతు శ్రీధర్, సంజయ్కిరణ్ తండ్రి విచారణ చేయించాం.. 15 రోజుల క్రితమే ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టాను. విద్యార్థులు చెల్లించిన బీమా డబ్బులు ఏమయ్యాయి, సంస్థలు ఎందుకు ముందుకు రాలేదనే దానిపై ఓయూ అధ్యాపకులతో విచారణ చేయించాం. కోవిడ్ కారణంగా బీమా సంస్థలు ముందుకు రాలేదని తేలింది. బీమా సంస్థల ను ఫైనల్చేసి, చెల్లించిన డబ్బుల మేరకు విద్యార్థులకు ఆరోగ్యబీమా చేస్తాం. – ప్రొ.వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
ట్రిపుల్ ఐటీలో డిన్నర్ బాయ్కాట్
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్ బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈ–1, ఈ–2కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15న ట్రిపుల్ఐటీలో ఫుడ్పాయిజన్ జరిగింది. మెస్లలో నాసిరకం, నాణ్యతలేనివి ఉపయోగించడం వల్లే ఇది జరిగిందని, తమ ప్రాణాల మీదకు వచ్చిందని అదేరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఈనెల 24నాటికి డిమాండ్లు నెరవేరుస్తామని హామీఇచ్చారు. అయితే సదరు హామీలేవీ నెరవేరకపోవడంతో శనివారం మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తరువాత మెస్ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్ సతీశ్ పేరిట ఆ టెండర్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు. -
Photo Feature: పాలనురగలా జలపాతం
సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్: ఎత్తైన కొండలు.. చుట్టూ అడవి పచ్చనికొండల మధ్యన ప్రకృతి అందాలు ఇదెక్కడో కాదు.. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరాన మహబూబ్ఘాట్ వద్ద కనిపిస్తోంది. ఇక్కడ జలపాతం వద్ద పర్యాటకుల సందడితో ఉంటుంది. కురుస్తున్న వర్షాలకు ఘాట్ పైనుంచి నల్లని రాతిపై పాలనురుగులా నీరు ప్రవహిస్తోంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిధారలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చదవండి: ‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు -
బొమ్మల కొలువుగా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మల్ కొయ్యబొమ్మలు వంటి హస్తకళాకృతులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక పిల్లల ఆటవస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు లేవు. పిల్లల బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను టాయ్స్హబ్గా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నట్లు టీఎస్ఐఐసీ అంచనా. ఈ నేపథ్యంలో బొమ్మల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్ పార్క్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దండుమల్కాపూర్లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాలను సేకరించి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇక్కడే టాయ్స్ పార్కు కోసం డిమాండ్ను బట్టి 70 నుంచి 100 ఎకరాల వరకు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో బొమ్మల మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్కు తదితరాలను ఏర్పాటు చేస్తారు. ఏటా 10–15 శాతం పెరుగుదల పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం పంచే ఆట వస్తువులు, బొమ్మల తయారీ పరిశ్రమ దేశంలో శైశవ దశలో ఉంది. అయితే ఆటబొమ్మలకు ఏటా భారత్లో 10 నుంచి 15శాతం డిమాండ్ పెరుగుతోంది. భారత్లో చిన్నారులు ఉపయోగించే ఆట వస్తువులు, బొమ్మల్లో 80శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, విషపూరిత రసాయనాలతో తయారైనవే ఉంటుండటంతో కొన్ని రకాల బొమ్మలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పెరుగుతున్న డిమాండ్ను దేశంలోని తయారీ యూనిట్లు తట్టుకోలేకపోతున్నాయి. గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. భారత్లో పిల్లల బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు ఉన్నట్లు అంచనా. అన్ని వసతులు హైదరాబాద్లోనే పిల్లల ఆట వస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు స్థానికంగా లేకపోవడంతో ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఉత్పత్తిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రానిక్ ఆట బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా మారేందుకు అవసరమైన అన్ని వసతులు దండుమల్కాపూర్లో అందుబాటులోకి వస్తాయి. – ఆకారం జనార్దన్ గుప్తా, అధ్యక్షుడు, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తయారీదారులను ఏకతాటిపైకి తెస్తున్నాం దండుమల్కాపూర్లో ఏర్పాటు చేసే టాయ్స్ పార్క్ ప్రత్యేకతలు, అందుబాటులో ఉండే మౌలిక వసతులు, బొమ్మల తయారీ, మార్కెటింగ్కు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రచార వీడియోను రూపొందిస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో బొమ్మల తయారీదారులు, పంపిణీదారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇక్కడి వసతులపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. బొమ్మల తయారీదారులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాఫ్ట్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కొయ్య బొమ్మల వంటి హస్తకళాకృతుల తయారీదారుల నుంచి యూనిట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతున్నాం. –శ్రీహా రెడ్డి, నోడల్ ఆఫీసర్, తెలంగాణ టాయ్స్ విభాగం -
కుళ్లిన గుడ్లు.. పాడైన కూరగాయలు.. మాకు పెడుతున్న భోజనం నాసిరకం
నిర్మల్/బాసర: కుళ్లిన గుడ్లు, పాడైన కూరగాయలు, కాలం చెల్లిన నూనెలు, వస్తుసామగ్రి వాడుతూ మెస్ల నిర్వాహకులు తమకు నాసిరకం భోజనం అందిస్తున్నారని బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి భోజనం అందిస్తున్నందుకే వందలాది మందికి ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. నాసిరకం వస్తుసామగ్రిని చూపుతూ శనివారం స్థానిక అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రే నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్న ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ శనివారం క్యాంపస్కు రావడంతో తమకు ఎలాంటి తిండి పెడుతున్నారో చూడండి అంటూ సగం పగిలిన పప్పు, శుభ్రంగా లేని సామగ్రి, నాసిరకం వంటనూనెలు, కాలంచెల్లిన ఇతర వస్తువులను వెంకటరమణతోపాటు ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్కుమార్కు చూపించారు. ఏప్రిల్లో ఎస్ఎస్ కేటరర్స్లో కాలంచెల్లిన శనగపిండి, ఉప్మారవ్వ, గోధుమ పిండి ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేల మంది విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు ఓ లేఖను అందించారు. మెస్లు, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొనే దాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో డైరెక్టర్ సతీశ్కుమార్ రెండు మెస్లపై కేసులు పెట్టినట్లు పత్రాలను చూపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ►మెస్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. ►రాజకీయ ప్రభావం లేకుండా మెస్ టెండర్లు ఉండాలి. ►ఐఐటీ, నిట్లలో కనీసం పదేళ్లు అనుభవం ఉన్నవారినే టెండర్లకు అనుమతించాలి. ►ఘటనకు కారకులైన సంబంధిత అధికారులను తొలగించాలి. ►మాపై ప్రభావం చూపే ప్రతి విషయంలోనూ మా అభిప్రాయం తీసుకోవాలి. ►గత నెల చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లన్నింటినీ తక్షణమే నెరవేర్చాలి. హెల్ప్లైన్ కేంద్రం, హెల్త్ క్యాంపులు పెడతాం ►ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెల్లడి నిర్మల్ చైన్గేట్: ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ తెలిపారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీతో కలసి ఆయన మాట్లాడారు. కొన్ని అజాగ్రత్తల వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలిసిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సమర్థులైన ఫ్యాకల్టీని నియమించి సోమవారం నుంచి పాలనాపరమైన మార్పులు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్కు ఒక వార్డెన్, ఫిర్యాదుల విభాగం, విద్యార్థులకు హెల్ప్లైన్ సెంటర్, అమ్మాయిల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వివరించారు. నెలకోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు. 60 మంది విద్యార్థినులకు పుడ్పాయిజన్ అయిందని, 21 మంది విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిచ్చార్జి అయ్యారని తెలిపారు. మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి ►బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను శనివారం వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఫుడ్పాయిజన్ ఘటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధ్యురాలిని చేస్తూ ఆమెను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మరణిస్తే కానీ సీఎం ట్రిపుల్ ఐటీని సందర్శించరా అని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులు కాదని, వాటిల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారికి నాణ్యమైన ఆహారం కూడా అందించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్కు సంబంధించిన కాంట్రాక్టర్ కావడంతోనే మెస్ నిర్వాహకుడు విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నాడని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. -
ఖాళీ అవుతున్న కడెం!
నిర్మల్: ఆరున్నర లక్షల క్యూసెక్కులతో ఏకంగా ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగింది. నిండా నీటితో రిజర్వాయర్ సముద్రాన్ని తలపించింది. ఇదంతా మొన్నటి పరిస్థితి. ఇప్పుడది ఓ చెరువులా మారుతోంది. వరదకు దెబ్బతిన్న గేట్లు కిందకు దిగకపోవడంతో.. వరద జలాలతో కళకళలాడా ల్సిన నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో వరద రాకముందు నుంచే 12వ గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో దానిని అలాగే వదిలేసి మిగతా 17 గేట్లు ఎత్తారు. 13న అర్ధరాత్రి వచ్చిన 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు పైనుంచి పారింది. దీంతో చెట్లు, కొమ్మలు, చెత్త మొత్తం ప్రాజెక్టు పైభాగంలో గేట్లను ఎత్తే యంత్రాలు ఉండే రూమ్లలో, గేట్లను ఎత్తే రోలర్లలో, పైభాగంలో పూర్తిగా నిండిపోయింది. గేట్లన్నీ వాటిల్లో కూరుకుపోయాయి. మరోవైపు ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతినడంతో శుక్రవారం ప్రాజెక్టు సిబ్బంది ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఒక్క గేటును కష్టంగా కొంత కిందకు దింపినా మిగతావి కదల్లేదు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. గేట్లన్నీ ఎత్తే ఉండటంతో ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయి. పైగా ఎగువ నుంచి ఇన్ఫ్లో కూడా చాలావరకు తగ్గిపో యింది. కేవలం 16,890 క్యూసెక్కులు వస్తుండగా, 17,307 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 3.5 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి వరద రాకుండా, అవుట్ఫ్లో ఇలాగే ఉంటే ప్రాజెక్టు కనీస మట్టానికి పడిపోనుంది. కాగా గేట్ల మరమ్మతుకు శనివారం సాంకేతిక సిబ్బంది రానున్నట్లు అధికారులు తెలిపారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులు
-
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో.. ఫుడ్ పాయిజన్
బాసర/నిజామాబాద్ నాగారం/సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీలోని పీయూసీ–1, పీయూసీ–2 మెస్లలో మధ్యాహ్నం ఎగ్ఫ్రైడ్ రైస్ వడ్డించారు. దీనిని తిన్న ఈ–1, ఈ–2, పీ–2 విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు బాధిత విద్యార్థులకు క్యాంపస్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చికిత్స అందించారు. కాగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కొంత మందిని అంబులెన్స్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ట్రిపుల్ ఐటీ చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. మరో పక్క ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. వీరిలో జిల్లాలో కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. కోమలి, హరిత అనే విద్యార్థినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి హరీశ్రావు ఆరా బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్, వైద్యాధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగించిందని ట్విట్టర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారానికి బాధ్యులనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. -
Basara IIIT: పట్టు వదలని విద్యార్థులు.. కొలిక్కిరాని చర్చలు
సాక్షి, నిర్మల్: బాసర ఐఐఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని స్టూడెంట్ ఆక్టివిటి సెంటర్లో వెయ్యి మంది విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించారు. విద్యార్ధులతో తమ డిమాండ్లపై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ఐఐఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యార్థుల 12 డిమాండ్లలో 60శాతం నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. అయితే సమస్యల పరిష్కారానికి పట్టుబడుతున్న విద్యార్థులు రెగ్యులర్ అధ్యాపకులు, వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. కానీ వీసీ నియామకం ఇప్పట్లో కుదరదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి, అధికారులు హామీపై స్పష్టత లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాగా 12 డిమాండ్ల పరిష్కారం కోసం ఐఐటీ విద్యార్థులు గత అయిదు రోజుల నుంచి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సానుకూలంగా ఉన్నారు: మంత్రి సబితా అదే విధంగా ఆందోళన విరమించాలని బాసర ఐఐఐటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించాలని, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ‘విద్యార్థులు ఎండలో ఎండుతున్నారు. వానలో తడుస్తున్నారు. వారిని చూస్తుంటే బాధేస్తోంది. కోవిడ్ కారణంగా సమస్యలు పరిష్కరించడం జాప్యమైంది. మీ సమస్యలను తక్కువగా చూపే ఉద్దేశం లేదు. ట్రిపుల్ ఐటికి డైరెక్టర్గా సతీష్ కుమార్ను నియమించింది. మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యశాఖ వైస్ చైర్మన్ వెంకటరమణను పంపింది. సమస్యలను పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. అందోళన విరమించండి’ అంటూ పిలుపునిచ్చారు. అయిదోరోజు ఆందోళనలు మరోవైపు రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ఐటీ అయిదు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్ఐటీ విద్యార్థులు అయిదో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. -
చదువు చెప్పే గురువులేరి?
నిర్మల్/బాసర: ‘మాకు పురుగులతో కూడిన అన్నం పెట్టినా తింటాం..కానీ..చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేకపోతే ఎలా? ఓ వైపు విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం.. అదే లెక్కన అధ్యాపకుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? మా వర్సిటీకి రెగ్యులర్ వీసీ.. అది కూడా క్యాంపస్లోనే ఉండాల్సిన అవసరం లేదా? ప్రఖ్యాత క్యాంపస్లతో వర్సిటీని ఎప్పుడు అనుసంధానిస్తారు? ఇలాంటివి.. ఎన్నో సమస్యలున్నాయ్. వీటిపై మంత్రులు, ఇన్చార్జి వీసీ, కలెక్టర్లతో సహా అధికార, ప్రతిపక్ష నేతలందరినీ కలిశాం. ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొమ్మిది వేల మంది వరకు ఉండే వర్సిటీ ఎవరికీ పట్టడం లేదు. అందుకే ఆందోళన చేపట్టాం..’అని నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెల్లడించారు. మూకుమ్మడి నిరసన మంగళవారం ఉదయం విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనకు దిగారు. క్యాంపస్లోని పరిపాలన భవనం ఎదుట ఎండలో బైఠాయించి, రోజంతా ఆందోళన కొనసాగించారు. తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో వేలమంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రాంగణమంతా వారి నినాదాలతో మార్మోగింది. అయితే విద్యార్థులను బయటకు రాకుండా.. వారి గోడును బయట ఉన్న తల్లి దండ్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియాకు వినిపించనివ్వకుండా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవోకు తమ గోడును, డిమాండ్లను తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్కుమార్ మద్దతు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలియగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్లో స్పందించారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలుస్తామన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకులు వర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. నేడూ కొనసాగనున్న ఆందోళన! గత కొన్నేళ్లుగా వర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, అవినీతి అక్రమాలూ.. ఏవీ బయటకు తెలియడం లేదు. వర్సిటీ ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జా ఉన్నా.. ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారి అది కూడా సగం పూట మాత్రమే వర్సిటీకి వచ్చి వెళ్లారని విద్యార్థులు తెలిపారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆందోళన విరమించిన విద్యార్థులు బుధవారం నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. గోడదూకి వెళ్లిన బల్మూరి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోలీసుల కళ్లుగప్పి క్యాంపస్లోకి వెళ్లారు. వర్సిటీ వరకు సాధారణ యువకుడిలా బైక్పై వచ్చి, రెండోగేట్ వద్ద గోడ ఎక్కి లోపలికి దూకారు. విద్యార్థుల వద్దకు వెంకట్ చేరుకున్న విషయం తెలియగానే పోలీసులు వెళ్లి అరెస్టు చేసి, ముధోల్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లివే.. ళీ సీఎం కేసీఆర్ వర్సిటీని సందర్శించాలి. ళీ రెగ్యులర్ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్లోనే ఉండాలి. ళీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. ళీ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి. ళీ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. ళీ తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి. ళీ ల్యాప్టాప్లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. ళీ మెస్ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి. ళీ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి. -
నిరంజన్రెడ్డి: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై పట్టున్న న్యాయ నిపుణుడు
సాక్షి, నిర్మల్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డిని వైఎస్సార్సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయన. పైగా కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉంది ఈయనకు. అందుకే రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. జులై 22, 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు నిరంజన్రెడ్డి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్లోనే ఉన్నత విద్యంతా పూర్తి చేశారు. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
సాక్షి, నిర్మల్: సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్ సీన్ రిపీట్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. -
నిర్మల్లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
సాక్షి, నిర్మల్: నడిరోడ్డుపై ఎంతటి ఘోరాలు జరుగుతున్నా.. అడ్డుకునే ప్రయత్నాలు మాట అటుంచి.. సెల్ఫోన్లలో రికార్డు చేసే కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నిర్మల్లో అంతా చూస్తుండగానే ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. ఓ వ్యక్తి మరో యువకుడి గొంతు కోశాడు. కత్తెరతో గొంతు కోసి మరీ యువకుడిని దారుణంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. హత్య అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. జిల్లా కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దాడి సమయంలో.. ఆ తర్వాత కూడా కొందరు అక్కడ సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ కనిపించారు. ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్లలో వైరల్ చేస్తున్నారు కొందరు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
కరెంటిస్తం.. నీళ్లిస్తం..
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్న విషయం తెలిసిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్ఓ వికాస్మీనా, విద్యుత్శాఖ ఎస్సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు. మీరందరూ వచ్చేయండి.. ‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్. స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు. ఆరునెలల్లో కరెంటు.. చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకా టెంట్లోనే.. తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు. బాధాకరం: మంత్రి సత్యవతి చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు. -
అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా?
అన్నం తిన్నంక బిడ్డ నీళ్లడిగితే ఏం చెప్పాల్నో తెలుస్తలేదు. ఫారెస్టు వాళ్లు జంతువులకు బోర్లేస్తరు. మేం అంతకన్నా హీనమా? ఆన్లైన్ క్లాసులని పిల్లలంటే కరెంటు లేక, సిగ్నల్ రాక పిల్లలకు ఏం చెప్పమంటారు? మా ఊరికి రోడ్డు, బోరు, కరెంటు, ఆశ వర్కరు వచ్చే దాకా ఇక్కడ్నుంచి పోం. ఈడనే అటుకులు తింటం. బియ్యం వండుకుంటం. మేమేం జాబులు అడుగుతలేం. పైసలియ్యమంటలేం. ఊరి సమస్యలు తీర్చమంటున్నం. అందుకే ఇంత దూరం నడుసుకుంట వచ్చినం’అంటూ తమ పల్లె గోసను నీళ్లు తిరుగుతున్న కళ్లతో జిల్లా అధికారుల ముందు వెళ్లబోసుకుంది ఆదివాసీ బిడ్డ నిర్మల. నిర్మల్: తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ ఊరు ఊరే కదిలొచ్చింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామవాసులంతా పిల్లాపాపలతో కలిసి 75 కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. కాళ్లకు చెప్పుల్లేకున్నా చిన్నారులు, మహిళలు వడివడిగా నడుస్తూ వచ్చేశారు. ఏడాది కిందే సమస్యలను విన్నవించినా పరిష్కరించలేదని ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల ముందు తమ గోడు చెప్పుకున్నారు. ఇలా ఒక్క చాకిరేవే కాదు.. నిర్మల్ జిల్లాలోని పలు అటవీ గ్రామాలు ఇంకా కరెంటును చూడకుండా.. బీటీ రోడ్డు ఎక్కకుండా.. చెలిమల నీళ్లే దిక్కుగా బతుకీడుస్తున్నాయి. రాకెట్లు నింగికి పంపుతున్న ఈ కాలంలో, మిగులు విద్యుత్ మూటగట్టుకుంటున్న మన రాష్ట్రంలో ఇంకా గుడ్డి వెలుగురులోనే ముందుకు సాగుతున్నాయి. చెలిమల నీళ్లు తోడుకుంటున్న చాకిరేవు గ్రామస్తులు రాత్రిపూట ఏం కష్టమొచ్చినా ఇబ్బందే.. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 75 కిలోమీటర్లు వెళ్తే పెంబి మండలంలోని అటవీ గ్రామం చాకిరేవు వస్తుంది. పెంబి నుంచి 4 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్డుంది. మధ్యలో దొత్తివాగు వస్తుంది. దీనిపైన వంతెన లేదు. వాగు దాటాక దాదాపు 10 కిలోమీటర్లు ఆ ఊరి వరకు రోడ్డు లేదు. కరెంటు పోతే క్షణం ఉండలేని ఈరోజుల్లో అక్కడ అనాదిగా విద్యుత్ను చూడని కుటుంబాలున్నాయి. చీకటి పడితే ఇప్పటికీ నూనెలో వత్తి వేసుకుంటున్నాయి. 25–30 కుటుంబాలు ఉండే ఈ పల్లెలో పొద్దంతా వ్యవసాయం చేస్తూ చీకటి వేళకు ఇళ్లకు చేరుకుంటున్నారు. కరెంటుతో పాటు తాగు నీళ్లూ ఆ ఊరికి అందట్లేదు. కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెలే దిక్కవుతున్నాయి. రాత్రిపూట ఏ కష్టం వచ్చినా ఇబ్బందే. ఊరంతా కలిసి టార్చిలైట్లు పట్టుకుని పరిష్కరించుకోవాల్సిందే. ప్రసవానికైనా, ప్రమాదం జరిగినా ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎడ్లబండ్లపైనే తీసుకురావాలి. ఈ కష్టాలను తీర్చాలంటూ ఊరు ఊరంతా నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచి వచ్చింది. ఇలా నడిచి వచ్చిన వారిలో పిల్లలు, వృద్ధులతో పాటు ఓ గర్భిణి ఉన్నారు. పెంబి నుంచి చాకిరేవుకు వెళ్లే మార్గం ఎన్నో గ్రామాల్లో నూనె దీపాలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసుల గూడేల్లో ఇంకా విద్యుత్, రోడ్డు, తాగునీటి సౌకర్యాల్లేవు. నిర్మల్ జిల్లా పెంబి మండలం సోముగూడ, చాకిరేవు, రాగిదుబ్బ.. కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్, వస్పల్లి పంచాయతీ పరిధిలోని పలు గూడేలకు కరెంటు లేదు. చాలా కుటుం బాలు కిరోసిన్, మంచి నూనెతో దీపాలు పెట్టుకుంటు న్నాయి. గతంలో ఐటీడీఏ కొన్ని గ్రామాలకు సోలార్ లైట్లను పంపినా చాలావరకు పనిచేయట్లేదు. రోడ్లు లేక కాలినడకనే జనం నడుస్తున్నారు. అటవీ చట్టాలు, అనుమతుల పేరిట పెడుతున్న నిబంధనలే వీరికి శాపంగా మారుతున్నాయి. దీపం వెలుతురులో బియ్యం ఏరుతున్న యువతి ఊర్ల ఉంటే ఎవుసం చేసుకొనైనా బతుకుతం కరెంటు, మంచి నీళ్లు లేకుండా ఆ ఊర్లో ఎట్లుంటున్నరు? ఇన్ని కష్టాల మధ్య అడవిలో ఉండే కంటే వేరే దగ్గరికి పోవచ్చు కదా’అని ఆదివాసీ మహిళ లక్ష్మీబాయిని అడిగితే.. ‘ఎటుపోతం సారూ.. తాతల కాలం నుంచి మేం నమ్ముకు న్న భూములను ఇడిసి యాడికి పోవాల? ఏం పని చేసుకుని బతకాల? ఊర్ల ఉంటే ఇంత ఎవుసం చేసుకునైనా బతుకుతం’అని చెప్పింది. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడేలకు ఊరివాళ్లంతా కలిసి వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వీరి పాదయాత్రకు తెలంగాణ ఆదివాసీ సంఘం, బీజేపీ, వైఎస్ఆర్టీపీ నాయకులు మద్దతు తెలిపారు. -
ఉపకులపతి.. ఇదేం గతి?
నిర్మల్/బాసర: బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ఏం జరుగుతోంది? పదిరోజులుగా ఎందుకు పతాక శీర్షికలకు ఎక్కుతోంది!? దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈనెల మొదటివారంలో విద్యార్థులు తినే టిఫిన్లో కప్ప రాగా.. ఆపై వరుసగా అన్నంలో తోకపురుగులు, కూరల్లో లైట్పురుగులు వస్తూనే ఉన్నాయి. 8వేల మంది విద్యార్థులు తినే భోజనాల్లో ఇలా కప్పలు, పురుగులు వస్తున్నా.. అటు మెస్ నిర్వహించే వారు.. ఇటు వర్సిటీ వర్గాలు స్పందించింది లేదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ‘మా పిల్లలు బాసర ట్రిపుల్ఐటీలో చదువుతున్నార’ని ఇప్పటివరకు గర్వంగా చెప్పుకున్న తల్లిదండ్రులు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి చదువులపై బెంగలేదు కానీ విద్యార్థులకు పెడుతున్న తిండి గురించే కలవరపడుతున్నామని వారంటున్నారు. గతంలో బాసర వర్సిటీలోకి మీడియాను అనుమతించేవారు. కొన్నేళ్లుగా మీడియాను అనుమతించట్లేదు. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియట్లేదు. వీసీ కోసం ఎదురుచూపు. బాసర ట్రిపుల్ఐటీలో పాలన గాడితప్పడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం. ఏళ్లుగా ఇన్చార్జి వీసీలతోనే సర్కారు వర్సిటీని నెట్టుకొస్తోంది. రెండేళ్లుగా ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్న రాహుల్బొజ్జ.. న్యాక్బృందం వర్సిటీ పరిశీలనకు వచ్చినప్పుడే ఇక్కడికొచ్చారు. తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇటీవల ఘటనలపై స్పందించలేదు. సీఎంఓ కార్యాలయ బాధ్యతల్లోనూ ఉన్న ఆయన హైదరాబాద్ నుంచే వర్సిటీని పర్యవేక్షిస్తున్నట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో వర్సిటీలో స్థానిక అధికారులదే ఇష్టారాజ్యమైంది. మంత్రిని కలిసిన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇక్కడి పరిస్థితుల్ని వివరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. -
‘ఆ బిడ్డల’కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండ
నిర్మల్: సేవకు కావలసింది మాటలు కాదని.. చేతలని నిరూపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈనెల 6న ‘గడ్డాల నాడూ మా బిడ్డలే..’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్పేజీలో ప్రచురించిన ఫొటో కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 5న తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ నిర్మల్లో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మి, గంగన్న దివ్యాంగులైన తమ కుమారులు శ్రీనివాస్ (22), గంగన్న (18)లను భుజాలపై ఒకరిని, చంకలో ఒకరిని ఎత్తుకుని శిబిరానికి వచ్చారు. యుక్తవ యసులో ఉన్న కొడుకులను మోసుకొస్తున్న తల్లిదం డ్రుల ఫొటోలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృ ష్ణారెడ్డి ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించాలని ‘సాక్షి’ సిబ్బందికి పంపించారు. త్వరలోనే ఈ డబ్బులు గంగన్న కుటుంబానికి అందనున్నాయి. -
కేసీఆర్ ఫ్రంట్ ఉత్తదే: కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
నిర్మల్: బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు బంగారు భారత్ అంటూ దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారని, కేసీఆర్ ఫ్రంట్ ఉత్తదే నని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డిజిటల్ సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన నిర్మల్లో సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏక్ పోలింగ్ బూత్–ఏక్ ఎన్రోలర్’లెక్కన డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మొత్తం 34,498 మంది ఎన్రోలర్స్ను నియమించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 78 సీట్లు గెలువడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలౖపై పార్టీలోనే చర్చించుకోవాలి తప్పా బహిర్గతం చేయొద్దన్నారు. అవినీతి మంత్రులు బీజేపీలో చేరుతారు.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఢిల్లీలో ఒకమాట, గల్లీలో ఒకమాటగా మాట్లాడతారని ఠాగూర్ ఆరోపించారు. టీఆర్ఎస్ అవినీతి మంత్రులంతా రక్షణ కోసం బీజేపీలో చేరుతారని చెప్పారు. మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జిల్లాలో చెరువులు, గుట్టలను కబ్జా చేశారని, డీ–వన్ పట్టాలతో ప్రభుత్వ భూములనూ బినామీల పేరిట చెరబట్టారని ఆరోపించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈ.అనిల్ పాల్గొన్నారు. -
అదొక రాకాసి రహదారి