Sambasiva rao
-
ఆదివాసీ చట్టం రద్దుకు కుట్రలు!
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కు లను హరించేందుకు సన్నద్ధ మైంది. ‘ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందద’ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే! అడవి, అటవీ భూములు, అందులోని వనరు లపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామ కంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన అధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే! 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్ళ గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోదీ ప్రభుత్వం ‘అటవీ హక్కుల సవరణ చట్టం’ ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది. షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం–1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూము లను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి, భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం ‘1/70’గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించ కుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు.1/70 సెక్షన్ –3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతా ల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీమ్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. ‘పీసా’ చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్ట సవరణ ప్రయత్నాలుగిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను, బహుళజాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్ట పెట్టేందుకు 1996–2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింత పల్లి బాక్సైట్ తవ్వకాల కోసం ‘రస్ ఆల్ ఖైమా’ బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధ మయింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అను గుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం ‘1/70 చట్టాన్ని రద్దు చేయబోమ’ని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలనీ, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయాలనీ అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి.బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
ఇవిరా మీ బ్రతుకులు ... ఏకిపారేసిన విజయ్ సాయి రెడ్డి
-
అడ్డంగా దొరికిన టీవీ5 సాంబశివరావు..
-
జస్టిస్ శరత్, రేవంత్ల ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధ వారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సుమోటోగా తీసుకున్న కోర్టు..గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని.. జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామం తర్వాత విచారణ చేపట్టింది.విచారణ 23వ తేదీకి వాయిదా..ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నిందితులెవరు? కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని.. కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా బాధితుడినేనని, పోలీసు అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని.. తనను ఈ పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్ వేసిన పిటిషన్పై నిర్ణయాన్ని కూడా ధర్మాసనం వాయిదా వేసింది.ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న వివరావీ..‘‘నాయిని భుజంగరావు (ఏ3) వాంగ్మూలం మేరకు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్ట్లు, జస్టిస్ కాజా శరత్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు, పార్టీ నేతల వ్యక్తిగత జీవితం, చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించేవాళ్లు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ‘నేను కీలక వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించి ప్రణీత్కుమార్కు అందజేసేవాడిని. వారి ఫొటోలు, అడ్రస్లు సేకరించి చర్యలు తీసుకోవడం కోసం ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు పంపేవాళ్లం’ అని భుజంగరావు చెప్పారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్టు, ఫోన్ నంబర్ చెబితే వారి కాల్లకు సంబంధించి వివరాలు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్టు తెలిసింది. జస్టిస్ కాజా శరత్, ఆయన సతీమణి మాధవి నంబర్లు, కాల్ల వివరాలు, అడ్రస్లు జియో ఆఫీస్ నుంచి తెలుసుకున్నారు. కీలక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్..సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, విజయ్రెడ్డి, కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, శివధర్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్రెడ్డి, రోనాల్డ్ రోస్, ధర్మపురి అర్వింద్, ఎం.రమేశ్రెడ్డి, మేఘా శ్రీనివాస్రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిశోర్, ఐఏఎస్ దివ్య, తాటినేటి శశాంక్, రాజ్న్యూస్ సునీల్రెడ్డి, చిలుకా రాజేందర్రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న (నవీన్), ఏఎంఆర్ ఇన్ఫ్రా మహేశ్రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్కుమార్, రామసాయం సురేందర్రెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లే సరిత, అంజన్న (ఈటల గన్మన్), అనుమాండ్ల నరేందర్రెడ్డి, బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, మనాల మోహన్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేశారు.మధ్యవర్తిగా టీవీ 5 సాంబశివరావు..సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. వీటితోపాటు మరిన్ని వివరాలనూ వెల్లడించింది. -
ఏపీ బీజేపీ బండారం బయటపెట్టి YSRCP లో జాయిన్ అయిన బీజేపీ లీడర్
-
ఫోర్జరీ సాంబకు భారీ షాక్..
-
టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు
-
టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: చెప్పేవి నీతులు.. చేసేవి తప్పుడు పనులు.. నిత్యం టీవీ5 వేదికగా రాజకీయ ప్రవచనాలు వల్లించే సాంబశివరావుపై గచ్చిబౌలి పీఎస్లో మరో కేసు నమోదైంది. తమ కంపెనీనిలో సాంబశివరావు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పని చేస్తూ మోసం చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కారు కొనుగోలు చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సంధ్యా హోటల్స్ అకౌంటెంట్ ఫిర్యాదుతో సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్రావు ఇటీవల ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. ఇదీ చదవండి: టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే! -
టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే!
సాక్షి, హైదరాబాద్: హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్ రావు ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. టీవీ–5తో తనకున్న పరిచయాలను వాడి తన కోడలు కొల్లి సౌమ్య పేరు మీద డీలర్షిప్ తీసుకొని అస లు వాస్తవాలను దాస్తూ మీడియా ముందు మాత్రం సాంబశివరావు నంగనాచి కబుర్లు చెబుతున్నాడని శ్రీధర్రావు ధ్వజమెత్తారు. మాదాపూర్లోని పెట్రోల్ బంక్కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే హెచ్పీసీఎల్ ఎందుకు బంక్ను మూసి వేసిందని ప్రశ్నించారు? ఆయనకున్న పోలీసు, రాజకీయ పలుకుబడితో తనకు టుంబ సభ్యులు, వ్యాపారాల గురించి ప్రతికూల వార్తల ను ప్రచారం చేస్తూ పరుపు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘సాక్షి’తో శ్రీధర్రావు చెప్పిన వివరాల ప్రకారం.. స్థలం అసలు కథ ఇదీ.. సరనాల శ్రీధర్ భార్య సంధ్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామంలో సర్వే నంబరు–64లోని హుడా టెక్నో ఎన్క్లేవ్లో సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో నార్త్ఈస్ట్ దిక్కున 1,200 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 600 చ.మీ. స్థలాన్ని సంధ్య తన వ్యాపార అవసరాల కోసం ఇతరులకు విక్రయించింది. ఇంకా తన వద్ద 600 చ.మీ. స్థలం ఉంది. 2018లో కొందరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మిత్రులతో కలిసి సాంబశివ రావు శ్రీధర్ రావును కలిశాడు. ‘మీది తెనాలే మాది తెనాలే’అంటూ మాట కలిపాడు. 600 చ.మీ. స్థలంలో పెట్రోల్ బంక్ పెడదామని సలహా ఇచ్చాడు. తనకు ఆయిల్ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయని, పోలీసు, మున్సిపల్ అనుమతులన్నీ తానే చూసుకుంటానని నమ్మించాడు. 25:75 శాతం వాటాతో సాంబశివరావు, సంధ్య కన్స్ట్రక్షన్తో ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.3.15 లక్షలు అద్దె చెల్లించేలా 600 చదరపు మీటర్ల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తూ హెచ్పీసీఎల్కు, సంధ్య కన్స్ట్రక్షన్కు రిజిస్టర్డ్ లీజు డీడ్ జరిగింది. పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. అంతా బాగానే నడుస్తున్న క్రమంలో.. పక్కనే ఉన్న మరో 600 చదరపు మీటర్ల స్థలంలో కూడా బంక్ను విస్తరిద్దామని సాంబశివరావు సూచించాడు. ఇక్కడే ఫోర్జరీ చేసింది.. దీంతో అప్పటికే ఆమ్మేసిన ఈ స్థలాన్ని 2020 జనవరిలో రూ.కోట్లు వెచ్చించి తిరిగి సంధ్య కన్స్ట్రక్షన్ కొనుగోలు చేసింది. అయితే విస్తరించే ఈ బంక్కు నెలకు చెల్లించే అద్దె కేవలం రూ.1.15 లక్షలు మాత్రమేనని తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్ బంక్కు వచ్చే అద్దె రూ.1.15 లక్షలు అనే సరికి వెనక్కి తగ్గారు. కానీ, టీవీ–5 సాంబశివరావు హెచ్పీసీఎల్లో డీజీఎం స్థాయిలో తనకున్న పరిచయాలతో స్థలం యజమానికి తెలియకుండా ఈ రెండో భాగం 600 చదరపు మీటర్ల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో హెచ్పీసీఎల్కు లీజుకు ఇచ్చేశాడు. కానీ, మీడియా ముందు మాత్రం తొలుత హెచ్పీసీఎల్కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య 600 చ.మీ. స్థలంలో జరిగిన పెట్రోల్ బంక్ డాక్యుమెంట్లను మాత్రమే చూపిస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అందర్నీ మేనేజ్ చేసి..: జర్నలిస్ట్ కావడంతో తనకున్న రాజకీయ, పోలీసు పరిచయాలను టీవీ–5 సాంబశివరావు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. వాస్తవానికి ఈ పెట్రోల్బంక్ వి స్తరణ చేసిన 600 చదరపు మీటర్ల స్థలానికి యజమానికి, హెచ్పీసీఎల్కు మధ్య ఎలాంటి రిజిస్టర్డ్ లీజు డీడ్ జరగలే దు. హెచ్పీసీఎల్లో తనకున్న పరిచయాలతో స్థల యజమాని సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్ను సృష్టించాడు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించే స్థానికంగా పోలీసు, మున్సిపల్ అనుమతులను తీసుకున్నాడు. దిక్కులేక ఠాణా మెట్లెక్కి.. స్థల యజమానికి విషయం తెలియడంతో.. తన వాటా 75 శాతంపై సాంబశివరావును నిలదీశారు. రూ.30 లక్షలు ఇస్తే 75 శాతం వాటా డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొదలుపెడతానని మెలిక పెట్టడంతో చేసేదేం లేక చెక్ రూపంలో రూ.30 లక్షలు సాంబశివరావుకు చెల్లించారు. ఏళ్లు గడిచినా బంక్ డీలర్షిప్ తమ పేరు మీద బదలాయించకపోయే సరికి దిక్కు తోచని స్థితిలో ఈ ఏడాది జనవరి 31న స్థల యజమాని శ్రీధర్రావు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్పీసీఎల్ ఏం అంటోంది? ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన హెచ్పీసీఎల్.. పెట్రోల్ బంక్ విస్తరణ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఇంధన సంస్థే వెల్లడించింది. అందుకే విస్తరించిన 600 చదరపు మీటర్ల స్థలాన్ని పాక్షికంగా సీజ్ చేశామని, న్యాయబద్ధంగా ఒప్పందం చేస్తే నెలకు రూ.1.57 లక్షలు అద్దె చొప్పున 2020 నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కారు కొట్టేసిన సాంబశివరావు సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లి. (గతంలో సంధ్య హోటల్స్ ప్రై.లి.) 2019 సెప్టెంబర్ 13న మాదాపూర్లోని యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతా నంబరు: 910020004191308 నుంచి 039927 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను తీసుకుంది. వరుణ్ మోటార్స్ ప్రై.లి. పేరు మీద మారుతీ స్విప్ట్ కారు కోనుగోలు చేసేందుకు ఈ డీడీను తీసుకుంది. అయితే యాజమాన్యం కోరిన మోడల్ కారు డెలివరీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో టీవీ–5 సాంబశివరావు ఎంటరయ్యాడు. తనకున్న పరిచయాలతో త్వరగా కారు డెలివరీ అయ్యేలా చేస్తానని నమ్మించి డీడీని తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఎలాంటి స్పందన లేదు. గట్టిగా ప్రశ్నిస్తే కొత్త అప్గ్రేడ్ మోడల్ వస్తోందని, పాత కారు ధరకే అప్గ్రేడ్ మోడల్ ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతని మాయమాటలు నమ్మి కొంతకాలం వేచిచూశారు. అ యినా నెలలు గడుస్తున్నా కారు డెలివరీ మాత్రం కాలే దు. డీడీ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో డీడీ ఇవ్వమని మరోసారి అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బాగా తెలుసని బెదిరించడం మొదలుపెట్టాడు. తీరా అసలు విషయం ఏంటంటే.. ఆ డీడీని ఉపయోగించుకొని సాంబశివరావు తన వ్యక్తిగత అవసరాల కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు శ్రీధర్ రావు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీడీ, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను పోలీసులకు అందజేశారు. -
యాంకర్ సాంబశివరావు అక్రమాలకు చెక్
హైదరాబాద్, సాక్షి: టీవీ5 యాంకర్ సాంబశివ రావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తమనే బురిడీ కొట్టించిన ప్రయత్నంపై హెచ్పీసీఎల్(Hindustan Petroleum Corporation Limited ) తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో.. మాదాపూర్లో నకిలీ ల్యాండ్ ధ్రువ పత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. ఇటు భూమి యజమానిని, అటు హెచ్పీసీఎల్ను సాంబశివరావు కుటుంబం బురిడీ కొట్టించాలని చూశాడు. ఈ క్రమంలో.. ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నడుపుతున్న విషయాన్నీ హెచ్పీసీఎల్ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు.. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంక్ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. -
జర్నలిజం ముసుగులో ఫోర్జరీ..టీవీ5 సాంబపై కేసు నమోదు
-
పచ్చపార్టీలో కేసుల టెన్షన్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీలతోపాటు మిగిలిన అధికారులను దుర్భాషలాడారు. అంతేకాకుండా తెగించిన పచ్చ ముఠా మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అనుచరులు కామినేని జనార్దన్, చల్లగుండ్ల కృష్ణ, నడింపల్లి హనుమాన్ప్రసాద్, ఎస్.ఏ.రజాక్, మిన్నేకంటి రవి, అడుసుమల్లి వెంకట శ్రీనివాసరావు, పత్తిపాటి సురేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చల్లగుండ్ల కృష్ణ, ఎమ్మెల్యే ఏలూరిని మినహా మిగిలిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్చేసి బుధవారం అద్దంకి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే ఏలూరితోపాటు చల్లగుండ్ల కృష్ణ పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. ఏలూరి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయతి్నస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఆందోళనలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఏలూరి అక్రమాలకు దన్నుగా నిలిచిన పుణ్యానికి పోలీసు కేసులు పెట్టించుకొని ఆయన కంపెనీ ఉద్యోగులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. నోవా అగ్రిటెక్ మాటున నల్లధనంతో ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఓట్ల కొనుగోలు ఇతర అక్రమాలకు పాల్పడ్డారు. గ్రానైట్ అక్రమ రవాణాపై ఫిర్యాదులతో తనిఖీకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఆదేశాలతో దాడులు చేసి కేసులు పెట్టించుకోవాల్సి రావడంతో గ్రానైట్ వ్యాపారులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. గొడవ పడింది సాక్షాత్తూ మైనింగ్, విజిలెన్స్ అధికారులతో కావడంతో ఇక నుంచి రాయల్టీ, జీఎస్టీలు లేకుండా గ్రానైట్ రవాణా వ్యాపారం ఎలా చేయాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు. చేసేది అక్రమ రవాణా కావడంతో మైనింగ్ అధికారుల కన్ను దాడిచేసిన తమపైనే ఉంటుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులతో పెట్టుకుని అందరినీ ఇబ్బందులకు గురిచేశారంటూ మిగిలిన గ్రానైట్ వ్యాపారులు ఏలూరికి మద్దతు పలికిన వ్యాపారులను చీవాట్లు పెడుతున్నారు. ఏ–1గా ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే ఏలూరి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లధనంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు బయటపడటంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కంపెనీ ఉద్యోగులు పలువురిపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కార్యాలయంలో గత నెల 24న జీఎస్టీకి సంబంధించి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్( ఏపీఎస్ డీఆర్ఐ) అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమాలకు సంబంధించి వివరాలున్న డైరీలు బయటపడ్డాయి. ఏలూరి పెద్దఎత్తున నల్లధనాన్ని వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని భావించిన అధికారులు ఎమ్మెల్యే, కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ–1 గా ఉన్నారు. ఆయనతోపాటు కంపెనీ ఉద్యోగులు పుల్లెల అజయ్బాబు, అప్పారావు, బాజిబాబు, సాయిగణేశ్లపైనా ఇంకొల్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం నోటీసులు ఇచ్చి వీరిని విచారించనున్నారు. తొలుత పట్టుబడ్డ డైరీని స్వా«దీనం చేసుకొని దాంట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు విచారణలో ముందుకెళ్లనున్నారు. బయటపడుతున్న అక్రమాల చిట్టా ఎన్నికల వేళ ఏలూరి అక్రమాలు వెలుగు చూడటంపై ముఖ్యంగా టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ఏలూరి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటç³డటం నష్టం చేకూరుస్తుందని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే దొంగ ఓట్ల పుణ్యమాని గత రెండు ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో బయట పడ్డామని, ఈసారి నియోజకవర్గంలో 12 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగింపుతో గెలిచే పరిస్థితి లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: నిత్యం టీవీ5 వేదికగా తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఫీలయ్యే సాంబశివరావు పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసారు. మీడియా వృత్తితో పాటు సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారన్నది ప్రధాన అభియోగం. పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితుల ఆరోపణ. దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. దీంతో కంగారు పడ్డ కంపెనీ అధికారులు.. మూడేళ్లుగా లీజు ఎరియర్స్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ, స్థలం విషయంలో సాంబశివరావు, కుటుంబ సభ్యులు చేసిన మోసానికి ఏం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కింద చూడవచ్చు. -
దొంగ ఓట్లూ పోయె.. పరువూ పాయె!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అడ్డూ అదుపూ లేకుండా అవకాశమున్న మేర అక్రమాలకు తెగబడితే ఏదో రోజు పట్టుబడి ఇట్టే ఇరుక్కు పోవడం ఖాయమన్న విషయం ఇప్పుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అవగతమైంది. తన నోవా అగ్రిటెక్ కంపెనీ మాటున ఎన్ఆర్ఐ, గ్రానైట్ నల్లధనంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిì ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి, ఆయన అనుచరులపైనా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీంతో ఏలూరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆయనకు నల్లధనం అందించిన ఆయన అనుచరులు బెంబేలెత్తి పోతున్నారు. కేసుల నమోదుతో ఎమ్మెల్యే వ్యవహారం పర్చూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. డైరీల్లో నిధుల వివరాలు! ఈ నెల 24న గుంటూరులో ఏలూరికి చెందిన నోవా అగ్రిటెక్ కార్యాలయంలో ఆర్డీఐ జరిపిన తనిఖీల్లో ఆయన ఖాతాలకు చేరిన నల్లధనం చిట్టాతోపాటు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఇంకొల్లు పోలీసులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన కంపెనీ ఉద్యోగులపైనా 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్విత్ 120(బి), సీఆర్పీసీ 155 (2) ల ప్రకారం కేసులు నమోదు చేసి లోతైన విచారణకు దిగారు. ఈ విచారణలో ఎమ్మెల్యే ఏలూరికి పెద్దఎత్తున నిధులు సమకూర్చే ఎన్ఆర్ఐలు, నియోజకవర్గంలోని గ్రానైట్ వ్యాపారుల అక్రమార్జన బయటపడే అవకాశం ఉంది. ఏలూరి కార్యాలయంలో దొరికిన డైరీల్లో ఆయనకు తరలివచ్చే నిధుల వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన అకౌంట్లకు వచ్చిన నిధులపైనా, గ్రానైట్ పరిశ్రమల ముడుపులపైనా పోలీసులు విచారణ జరపనున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే, ఆయన కంపెనీ ప్రధాన ఉద్యోగులపై కేసులు నమోదు కావడంతో ఏలూరికి నిధులు సమకూర్చే ఎన్ఆర్ఐలు, గ్రానైట్ వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. నిధుల వ్యవహారాలు బయటకు పొక్కితే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. నిధులు ఇచ్చే ఎన్ఆర్ఐల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అధికంగా ఉన్న గ్రామాలతోపాటు వారు ఉన్న దేశాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని మార్టూరు ప్రాంతంలో 250కి పైగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలపైనా పోలీసులు విచారణకు దిగనున్నారు. గ్రానైట్ అసోసియేషన్ల నుంచి ఏలూరికి ముట్టిన ముడుపుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న గ్రానైట్ వ్యాపారుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తారు. ఏలూరి ఖాతాలకు, ఆయన నోవా అగ్రిటెక్ బ్యాంకు ఖాతాలకు వచ్చిన నిధుల వివరాలపైనా విచారణ జరుపుతారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన నల్లధనం వివరాలను బట్టి ఆయా వ్యక్తులపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దొంగ ఓట్లతోనే రెండు సార్లు గెలుపు! ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఏలూరి నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేలకు మించి దొంగ ఓట్లను చేర్పించారు. ఇక్కడి వారికి చాలామందికి ఈ నియోజకవర్గంలోనే రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో వారంతా పోలింగ్ నాడు పథకం ప్రకారం ఓట్లు వేయడం పరిపాటి. దొంగ ఓట్లు వేసేందుకు ఏలూరి ప్రత్యేక బ్యాచ్లనూ ఎంపిక చేస్తారు. నల్లధనంతో కోట్లు ఖర్చు చేసి అక్రమాలకు తెరలేపుతారు. ఓటుకు రూ.2 వేల నుంచి 5 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేసిన ఉదాహరణలూ కోకొల్లలు. విపరీతంగా వచ్చిపడుతున్న అక్రమార్జన నిధులను వెచ్చించి ఎన్నికల అక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ఆయనకు పరిపాటిగా మారింది. దీంతో ఆయన గత రెండు ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సుమారు 10,775 ఓట్ల ఆధిక్యంతో, 2019 ఎన్నికల్లో కేవలం 1647 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏలూరి గెలిచే అవకాశమే లేదన్నది ఓట్ల గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు దిగిన అధికారులు నియోజకవర్గంలోని సుమారు 12 వేలదొంగ ఓట్లను తొలగించారు. దొంగ ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు ఏలూరి కోర్టును సైతం ఆశ్రయించినా అది వీలుకాలేదు. -
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు. మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్ ఏడీ ప్రతాప్రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు. బాలాజీనాయక్ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు. తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై జులుం ప్రదర్శించారు. ఏడీ ప్రతాప్రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్ ఏడీ ఆర్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
వెలుగులోకి ఎమ్మెల్యే సాంబశివరావు నిర్వాకాలు
-
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
-
కొలికపూడి, టీవీ5 సాంబ అరెస్ట్ ?..సీఐడీ విచారణలో కీలక విషయాలు
-
విమోచన కాదు విద్రోహం!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది. వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది. జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్ముఖ్ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది. రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి. రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది. నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనం చేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది. కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్లకు డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్ల లిస్ట్లో నాన్ పర్ఫామింగ్ అసెట్గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
కలసి నడుద్దాం
సాక్షి, హైదరాబాద్: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఎంబీ భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే.. రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్ఎస్ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
దేశంలో ఆకలి కేకలు ఆగాలంటే...
దేశానికి ‘స్వాతంత్య్రం’ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరించటంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి. కూడు, గూడు, గుడ్డ లేక పేదలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కోట్లాది మంది పేదలు ఆహారం కోసం హాహా కారాలు చేస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) భారత స్థానం దిగజారుతూ వస్తున్నది. 2021లో 101 స్థానంలో ఉండగా 2022లో 107వ స్థానానికి దిగజారింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 121 దేశాలు ఉన్నాయి. వీటిల్లో చైనా, టర్కీ, కువైట్ సహా 17 దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్కి చెందిన ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్త్ హంగర్ హైఫ్’ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఈ 121 దేశాల్లో ఆసియా ఖండంలో భారతదేశం కంటే అఫ్గానిస్తాన్ మాత్రమే వెనకబడి ఉంది. పాకిస్తాన్ 99, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, శ్రీలంక 64 స్థానాల్లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2020లో గ్లోబల్ ఇండెక్స్ స్కోర్ 38.8గా ఉండి నేడు 29.1గా నమోదు అయ్యింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ప్రపంచ స్థాయిలో, రీజనల్ స్థాయిలో ఆకలిస్థాయిని వెల్లడిస్తుంది. 29.17 స్కోర్తో భారతదేశం ‘అత్యంత సీరియస్’ అన్న లేబుల్ పొందింది. ఆసియా రీజియన్లోనూ, మొత్తం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆకలి స్థాయిలో భారత్ ఉందని నివేదిక వెల్లడించింది. జీహెచ్ఐ నివేదికను పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 100 పాయింట్ స్కేల్లో లెక్కిస్తారు. సున్నా వస్తే ఉత్తమ (ఆకలి లేదు) స్కోర్, 100 వస్తే చెత్త స్కోర్, అంటే ఆకలి బాగా ఎక్కువగా ఉండటంగా పరిగణిస్తారు. దేశంలో పోషకాహార లోపం 2018–20లో 140 శాతం ఉంటే 2019–21 నాటికి 163 శాతానికి పెరిగింది. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న జనాభా 828 మిలియన్లు ఉంటే, ఇండియాలోనే 224.3 మిలియన్ల మంది ఉన్నారు. 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన నివేదికలో భారతదేశంలో 22.4 కోట్ల మంది పోషకాహారం లభించక బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్ల లోపు వయస్సుగల మహిళలు 51 శాతం అని నివేదిక పేర్కొన్నది. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్ నివేదిక ప్రకారం 5 ఏళ్ల లోపు 69 శాతం పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 4.66 కోట్ల మంది వయస్సుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. 5 నుంచి 23 సంవత్సరాల లోపు పిల్లల్లో కేవలం 10 శాతం మందికే పోషక విలువలు గల ఆహారం లభిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా తెలుపుతున్నది. భారతదేశంలో 20 కోట్లకు పైగా వలస కార్మికులు ఉన్నారు. వీరు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మరో 20 కోట్ల మంది దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. కనీస ఆదాయం లేక 23 కోట్ల మంది రోజు వారీ కూలీలు, చిరు వ్యాపారులు... పస్తులు, అర్ధాకలితో జీవిస్తున్నారు. భారత ఆహార సంస్థ గోదాముల్లో ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నా పేదలకు, అన్నార్తులకు అందించకపోవటం ఏమిటని సుప్రీమ్ కోర్టు అనేక సార్లు ప్రశ్నించింది. గోదాముల్లో 7.10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో 40 వేల టన్నుల ఆహార ధాన్యాలు పాడై పోయాయి. దీన్ని గమనిస్తే ఆహార ధాన్యాలు పాడైనా ఫరవాలేదు, పేదలకు మాత్రం పంపిణీ చేయం అన్నదే పాలకుల విధానంగా ఉంది. దేశం అభివృద్ది బాటలో పయనిస్తున్నదనీ, ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా ఎగుమతి చేసే స్థాయిలో ఉందనీ మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేంద్రం చెబుతున్న దానికీ, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకూ పొంతన లేకుండా ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రైతాంగం అధిక సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు. కోటి 40 లక్షల మంది రైతులు వ్యవసాయం నుంచి ఎందుకు వైదొలిగారు? ఆహార ధాన్యాల ఎగు మతిదారుగా భారత్ ఉంటే రైతాంగం ఎందుకు వ్యవసాయం నుంచి వైదొలుగుతున్నారు? నేటికీ దేశంలో 27 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితుల ఎందుకు ఉన్నాయి? దేశంలో పండిన పంటలను దేశ అవసరాలకు ఉపయోగించినప్పుడే ఏ దేశమైనా స్వావలంబన సాధించినట్టు చెప్పవచ్చు. ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెడుతుంటే, వారి ఆకలి తీర్చకుండా ఎగుమతులు చేయటం స్వావలంబన సాధించటం కాదు. దేశ ప్రజల పేదరికానికీ, వారి ఆకలి ఆర్తనాదాలకూ దేశ పాలకులు అమలు జరిపిన విధానాలే కారణం. సామ్రాజ్యవాదం, బడా బూర్జువా, భూస్వామ్య వర్గంతో లాలూచి పడిన పాలక ప్రభుత్వాలన్నీ దేశ సహజ వనరులన్నిటినీ వారికి కట్టబెడుతూనే ఉన్నారు. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతూ వచ్చాయి. ఈ పరిస్థితి మారాలంటే... సహజ వనరులన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టాలి. పారిశ్రామిక అభివృద్ధిలో పాత్రధారులైన కార్మికులకూ పరిశ్రమల్లో హక్కు కల్పించాలి. అలాగే గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. అప్పుడే దేశంలో ఆకలి కేకలు ఆగిపోతాయి. (క్లిక్: సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (ఏపీ) -
ఫైబర్ నెట్ కుంభకోణంలో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో ఏ–2 నిందితుడు, అప్పటి ఇన్క్యాప్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ కె.సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. అక్టోబర్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మచిలీపట్నంలోని సబ్జైలుకు తరలించారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్ల మొదటి దశలో రూ.330 కోట్ల అవినీతిపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి 19మంది నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంబశివరావును కొన్ని రోజులుగా సీఐడీ అధికారులు విచారించారు. Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా చంద్రబాబు తన సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో సాంబశివరావు కీలకంగా వ్యవహరించారు. టెరాసాఫ్ట్ బిడ్ దాఖలు చేసేందుకే టెండర్ల గడువును పొడిగించారు. టెరాసాఫ్ట్ సమర్పించిన ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను ఆయన ఆమోదించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్ సరైందేనని ఒప్పుకోమని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్పై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. దీనిపై విచారణలో ప్రశ్నించగా ఫేక్ సర్టిఫికెట్ను ఆమోదించడం నేరమేనని సాంబశివరావు సమ్మతించినట్టు సమాచారం. వీడియోలను అడ్డం పెట్టుకుని.. 250 మందిని ట్రాప్ చేశారు ఇక కేంద్ర టెలికాం శాఖ మార్గదర్శకాలు, టెండరు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అర్హత లేదని పలువురు బిడ్డర్లు ఆధారాలతో ఆయనకు ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ ఫిర్యాదులను ఆయన బేఖాతరు చేశారు. టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో మరికొందరు కీలక నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
ఏపీ ఫైబర్నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
-
ఏపీ ఫైబర్నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. ఇప్పటికే సాంబశివరావు, హరిప్రసాద్లను సీఐడీ విచారించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం సాంబశివరావును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు విజయవాడ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాంబశివరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారులు తరలించనున్నారు. టెర్రా సాఫ్ట్ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. (చదవండి: భారీ మోసం: ఫైబర్నెట్లో ‘చంద్ర’జాలం) ఫైబర్ నెట్లోని తొలి ఫేజులో రూ.320 కోట్ల టెండర్లలో రూ.121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది. గత నాలుగైదు రోజులగా వేమూరితో పాటు సాంబశివరావును కూడా సీఐడీ పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్కి టెండర్లు దక్కేలా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు చక్రం తిప్పారు. చదవండి: ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
ఉసా, గస్తీ సంస్మరణ సభ రేపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా), రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ సంస్మరణ ఆదివారం జరగనుంది. కర్మాన్ఘాట్ దుర్గానగర్లోని జేవీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ వీ చంద్రవదన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్. వినయ్కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. దుగ్యాల అశోక్, సీఎల్ఎన్ గాంధీ, ఎస్. రామానందస్వామి, ఎం గంగాధర్, కె. వెంకటేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సారంగపాణి ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగనుంది. దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం జీవిత కాలం పోరాడిన ఉసా కరోనా బారిన పడి కన్నుమూశారు. జూలై 25న హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉసా దళిత, బహుజన, ఉద్యమ మేధావిగా ఎదిగారు. పీడిత ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసి ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్నారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అశోక్ గస్తీ(55) సెప్టెంబర్ 17న కరోనాతో చనిపోయారు. కర్ణాటకలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో అంచెలంచెలు ఎదిగి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ అగ్ర నాయకులు షాక్కు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండానే అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
మూగబోయిన బహుజన గళం
హైదరాబాద్: అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా కాటుకు బలయ్యారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయనకు వారం క్రితం విరేచనాలయ్యాయి. ఎంతకూ తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి బర్కత్పురలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. అదే రోజు అంబర్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య పద్మావతి ప్రసూనాంబ గతంలోనే మృతిచెందారు. కుమార్తె హిమబిందు ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలుపెరగని పోరాటయోధుడు ► గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన ఉ.సా. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (డీఎస్వో), యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ నాయకులు దేవులపల్లి, తరిమెల నాగిరెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ► తూ.గో. జిల్లా దేవీపట్నం ప్రాంతంలో గిరిజన హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో పార్టీలో మహిళా విభాగంలో పనిచేస్తున్న పద్మావతిని కులాంతర వివాహం చేసుకున్నారు. ► గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు తీసుకు రావాలని కోరుతూ జరిగిన పోరాటంలో, అమరావతి ప్రాంతంలోని పొన్నెకల్లులో రైతాంగ సమస్యలపైన జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. ►మోత్కూర్లో విద్యుత్ అంతరాయంతో కాలిపోయిన మోటార్లను వేలాది ఎడ్లబండ్లపై పెట్టుకొని ఉ.సా. ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ► కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాల్లో చురుకైనపాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. ► మహబూబ్నగర్లో ఆకలిచావులకు చలించి తన తోటి మేధావులతో కలిసి భోజన కేంద్రాలను నాలుగేళ్ల పాటు నాలుగు గ్రామాల్లో నిర్వహించారు. ► జోలాలి పాడాలి అనే పాటను, కరువుపై అనేక పాటలను, పుస్తకాలను, బుర్రకథను, పోచంపాడు కుంభకోణంపై ఓ పుస్తకాన్ని, నల్లగొండ వరదకాలువ అనే మరో పుస్తకాన్ని రచించారు. ► అనంతరం పార్టీ నుంచి దూరమై అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానాలతో బహుజనుల కోసం పనిచేశారు. కంచె ఐలయ్యతో కలిసి నలుపు పత్రికను, ఆ తరువాత ఎదురీత పత్రికను నడిపారు. -
వైఎస్ జగన్ను కలిసిన మాజీ డీజీపీ
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు కలిశారు. జననేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద పాదయాత్ర శిబిరానికి వచ్చిన మాజీ డీజీపీ, వైఎస్ జగన్ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇరువురు సుమారు 15 నిమిషాలు చర్చించుకున్నారు. ముగిసిన పాదయాత్ర.. వైఎస్ జగన్ 245వ రోజు పాదయాత్ర ధారభోగాపురంలో ముగిసింది. ఆయన పాదయాత్ర కొత్తపాలెం క్రాస్ రోడ్డు, నారాయణపురం, మమిడివాడ, గోకివాడ, పంచదార్ల, అప్పారాయుడిపాలెం మీదుగా ధారభోగాపురం వరకు సాగింది. ఇవాళ 9 కిలోమీటర్ల మేర నడిచిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు మొత్తం 2810.6 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు. -
కెమెరామెన్ కావాలనుకున్నా.. నిర్మాతనయ్యా
‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘చెంబు చినసత్యం’ నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్థికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు మంచి సినిమాలు నిర్మిస్తున్నాను. వాటిలో ఒకటి ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. రెండో చిత్రం ‘నేనే ముఖ్య మంత్రి’ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత ఆలూరి సాంబశివరావు అన్నారు. శరత్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ కావాలని కలలు కన్నా. కుదరకపోవడంతో నిర్మాతనయ్యా. మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఓ సెక్షన్ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశానికి వినోదం జోడించి నిర్మించాం. ఈనెల 29న మా సినిమాతో పాటు ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మా సినిమాపై మాకు నమ్మకముంది. ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రాన్ని రెండు మూడు నెలల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
అ వదంతులు నమ్మొద్దు : డీజీపీ
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై గురువారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అలాంటి గ్యాంగులు రాష్ట్రంలోకి రాలేదని, ఆ వదంతులు ప్రజలు నమ్మొద్దని తెలిపారు. అలాంటి వాటిని నమ్మి అమాయకులపై దాడి చేయడం మంచిది కాదన్నారు. మతి స్థిమితం లేని వారిపై దాడులకు పాల్పడటం విచారకమన్నారు. ఆ వందతులను నమ్మి ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే.. తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి దీనిపై స్పందించారు. అలాంటి గ్యాం గులు రాష్ట్రంలోకి రాలేదని, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్బుక్, ట్విటర్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. -
డీజీపీ నియామకంపై వీడని సందిగ్ధత
సాక్షి, అమరావతి: ఏపీ డీజీపీ నియామకంపై సందిగ్ధత వీడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తోసుపుచ్చింది. ఏడుగురు అధికారులతో రాష్ట్రం పంపిన జాబితాను వెనక్కి పంపింది. అంతేకాకుండా ఆరునెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని పేర్లను తొలగించి తదుపరి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బిన్నభిప్రాయాలు రావడంతో ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడింది. దాదాపు 16 నెలలుగా ఏపీ ఇన్చార్జి డీజీపీగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. ఆయన డిసెంబర్ నెలాఖరులో సాంబశివరావు పదవీ విరమణ చేయనున్నారు. అయితే సాంబశివరావు కొనసాగింపునకే సీఎం చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం డీజీపీ రేస్లో ఠాకూర్, కౌముదిలు ఉన్నారు. అయితే కౌముది ఏపీ డీజీపీగా వచ్చేందకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సాంబశివరావు కాలం పొడిగింపు లేకుంటే ఠాకూర్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. -
శిక్షణలో రాటుదేలాలి
అనంతపురం సెంట్రల్: శిక్షణలో రాటుదేలి తమ ప్రత్యేకతను చాటుకోవాలని డీజీపీ సాంబశివరావు ట్రైనీ పోలీసు అధికారులకు సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖలో సివిల్, కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన స్టైఫెండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన స్టైఫెండరీ కేడెట్ ట్రైనీ ఏఎస్ఐలకు శిక్షణ తరగతులను రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ప్రారంభించారు. అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో 2017 బ్యాచ్లో మొత్తం 339 మంది అభ్యర్థులకు సోమవారం నుంచి శిక్షణ మొదలయింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. విధుల్లోకి వచ్చిన తర్వాత మీ సామర్థాన్ని చూసి ప్రతి జిల్లా ఎస్పీ గర్వపడాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం ఎలా ఏర్పడుతుంది? ఆ సమయంలో మన పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై వివరించారు. నీళ్లు రాలేదని ప్రజలు, ఎరువులు అందలేని రైతులు, కడుపు మండిన ప్రతి ఒక్కరూ రోడ్ల పైకి వచ్చి నిరసన తెలియజేస్తారన్నారు. అలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్స్, కాల్డేటా ఆధారంగా కేసుల దర్యాప్తు తదితర విషయాల్లో పట్టు సాధించాలని తెలిపారు. అలాగే ఇటీవల సీఐల నుంచి పదోన్నతి పొందిన(సూపర్ నెమోరీ) డీఎస్పీలకు ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ వైపు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే పదోన్నతులిచ్చి ఇబ్బందులు పడుతున్నామని, మరో సమస్య కొనితెచ్చుకునే ఉద్దేశం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డీఎస్పీలు 168 మంది ఉన్నారన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐజీలు సంజయ్య, రవిచంద్ర, రాయలసీమ రేంజ్ ఐజీ ఎండి ఇక్బాల్, కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్, పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యజ్ఞంలా పోలీసు శిక్షణ
అభ్యర్థులకు డీజీపీ సాంబశివరావు సూచన మీ సామర్థ్యం చూసి జిల్లా ఎస్పీ గర్వపడాలి భవిష్యత్లో విదేశీ తరహా పోలీసింగ్ వ్యవస్థ పోలీస్ స్టేషన్కు వచ్చే వారిని గౌరవించండి అప్పా తరహాలో ‘అనంత’ పీటీసీ అభివృద్ధి అనంతపురం సెంట్రల్ : యజ్ఞం వలె శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ పోలీసులుగా తయారు కావాలని డీజీపీ నండూరి సాంబశివరావు సూచించారు. పోలీసుశాఖలో సివిల్, కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన ఏఎస్ఐలకు సోమవారం అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో శిక్షణ తరగతులను డీజీపీ ప్రారంభించారు. మొత్తం 339 మంది అభ్యర్థులున్నారని, అందరూ ఉన్నతవిద్యావంతులని (బీటెక్, ఎంటెక్) పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి వివరించారు. 144 మంది మహిళా అభ్యర్థులున్న ఏకైక బ్యాచ్ ఇది అని వివరించారు. డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఇక్కడి పీటీసీలో శిక్షణ తీసుకోవడం ఒక అదృష్టమన్నారు. 1986లో తాను కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ డీజీపీ స్థాయిలో ఇక్కడికొచ్చి శిక్షణ అభ్యర్థులతో మాట్లాడే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ నాటికి ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ (నిష్ణాతులైన) పోలీసులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. విధుల్లోకి వచ్చిన తర్వాత మీ సామర్థాన్ని చూసి ప్రతి జిల్లా ఎస్పీ గర్వపడాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ మన బాధ్యత నీళ్లు రాలేదని ప్రజలు, ఎరువులు అందలేని రైతులు, కడుపు మండిన ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారని, అలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుందని డీజీపీ సూచించారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్స్, కాల్డేటా ఆధారంగా కేసుల దర్యాప్తు తదితర విషయాల్లో పట్టు సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరా, బాడీవార్న్ కెమెరాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భవిష్యత్లో విదేశీ తరహాలో పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. టెక్నాలజీ ఉపయోగించకపోతే ఎందుకూ పనికిరారని హెచ్చరించారు. పోలీస్స్టేషన్కు నిరక్షరాస్యుల నుంచి ఎన్ఆర్ఐ వరకు వస్తారని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు. జీవితంలో క్రమశిక్షణా రాహిత్యం అనేది మంచిది కాదని సూచించారు. అనంతపురం పీటీసీని ఆంద్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) తరహాలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అందులో భాగంగా రూ. 2 కోట్ల నిధులు తక్షణం విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆధునీకరించిన పీటీసీ ఆస్పత్రిని డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐజీలు సంజయ్, రవిచంద్ర, రాయలసీమ రేంజ్ ఐజీ ఎండీ ఇక్బాల్, కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్
సాక్షి, తిరుమల: టీటీడీ నూతన ఈవో అనిల్కుమార్ సింఘాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.56కు తిరుమల ఆలయం లోని రంగనాయకుల మండ పంలో బదిలీ అయిన ఈవో డి.సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల విరాళం ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఏవోబీలో మావోయిస్టుల కదలికలు
విశాఖపట్టణం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏవోబీలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారని తెలపారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్, యాక్షన్ టీంల సంచారంపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలపై విశాఖలో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఉత్తర కోస్తా ఐజీ, రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, ఓఎస్డీలతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. -
ఆ చానల్ ప్రారంభించడం అభినందనీయం
గవర్నర్ నరసింహన్ సాక్షి, తిరుమల: తమిళ భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ చానల్–2 ప్రారంభించడం అభినందనీయమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. దీనివల్ల శ్రీవారి నిత్యకైంకర్యాలతోపాటు ప్రత్యేక ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించే అవకాశం ఉందని, అందుకు చొరవ చూపిన టీటీడీ ఈవో సాంబశివరావును గవర్నర్ అభినందించారు. శనివారం గవర్నర్ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఏప్రిల్ నుంచి దాతలకు ఆన్లైన్లో సేవలు
డోనార్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభంలో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: టీటీడీ పరిధిలోని కాటేజీలకు విరాళాలు అందించిన దాతలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. టీటీడీ ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి నేతృత్వంలో రూపొందించిన డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ సిస్టమ్ను తిరుపతిలోని పరిపాలన భవనంలో ఈవో బుధవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 4,486 మంది దాతలు కాటేజీలకు విరాళాలు అందించారన్నారు. వారిలో 2,300 మంది దాతలు ఏటా టీటీడీ నిర్దేశించిన మేరకు గదులను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దాతల ద్వారా 6,051 గదులు అందుబాటులోకి వచ్చాయన్నారు. దాతలకు మరింత మెరుగైన సేవలు పారదర్శకంగా అందించేందుకు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నూతన ఆన్లైన్ అప్లికేషన్ విధానం ద్వారా దాతలు డోనార్ స్లిప్పులను ఆన్లైన్లోనే పొందవచ్చన్నారు. తద్వారా టీటీడీ కల్పించే అన్ని సేవలనూ పొందేందుకు అవకాశం కలుగుతుంద న్నారు. టీటీడీకి గదుల నిర్మాణం కోసం మరింత మంది దాతలు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. -
టీటీడీకి రూ. కోటి విలువైన ఆస్తి విరాళం
భక్తిని చాటుకున్న తిరుపతికి చెందిన బసవపున్నయ్య తిరుపతి అర్బన్: తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్కు చెందిన అంచ బసవపున్నయ్య అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి రూ.కోటి విలువ చేసే ఆస్తిని విరాళంగా ఇచ్చారు. కొర్లగుంటలోని తన మూడు అంతస్తుల భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను టీటీడీ ఈవో సాంబశివరావుకు శనివారం అందజేశారు. అలాగే బసవపున్నయ్యకు తొట్టంబేడు మండలం తాటిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని 222 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కూడా టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. కాగా భవనం మార్కెట్ విలువ ప్రకారం రూ.కోటి అని, ఖాళీ స్థలం విలువ రూ.5 లక్షలు ఉంటుందని దాత బసవపున్నయ్య ఈవోకు తెలిపారు. -
ఉగాది నాటికి టీటీడీ యాప్
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) త్వరలో శ్రీవారి పేరుతో మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకుగాను టీసీఎస్ సంస్థతో దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యాప్ను ఉగాది నాటికి అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు బుధవారం తెలిపారు. తిరుమలలో బస, దర్శనం, సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం, ఈ– హుండీ, ఈ–డొనేషన్, డీమ్యాట్ ఖాతాలతో పాటు భక్తులకు అవసరమయ్యే సేవలు ఈ యాప్లో అందుబాటులోకి వస్తాయని వివరించారు. యాప్ అందుబాటులోకి వస్తే టీటీడీ సేవలు భక్తుల చేతుల్లోకి చేరుతాయని, నెట్ సెంటర్లకు వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఇక ఉండదని అన్నారు. ఇంటర్నెట్ ద్వారా భక్తులకు అందించే సౌకర్యాలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ కోటాలో తిరుమలలోని గదుల సంఖ్యను పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇక కొత్తగా రూ.300 టికెట్లతో పాటే ఒక్కొక్కరు రూ.50 చెల్లించి రెండు లడ్డూలు కూడా ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్లో రూ.300, రూ.50 సుదర్శనం టికెట్ల కోటాను కూడా త్వరలో పెంచుతామని వెల్లడించారు. 2016లో శ్రీవారికి హుండీ రూపంలో రూ.1,018 కోట్ల ఆదాయం లభించిందని, ఈ–హుండీ ద్వారా నెలకు రూ.కోటి పైబడి విరాళాలను భక్తులు సమర్పిస్తున్నట్లు చెప్పారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్)లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతా సంఖ్య 1601010000384828 ద్వారా షేర్లను సర్టిఫికెట్ల రూపంలో భక్తులు సమర్పిస్తున్నట్లు వివరించారు. -
డబ్బుల్లేవ్.. వెంకన్నా సర్దుకో!
-
డబ్బుల్లేవ్.. వెంకన్నా సర్దుకో!
సాక్షి, తిరుమల: వెయ్యి, ఐదొందల రూపాయల నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీవారిని తాకింది. సాధారణ రోజుల్లోనూ రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పైబడి వచ్చే హుండీ ఆదాయం గత పది రోజులుగా సగానికి పడిపోయింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు హుండీ ద్వారా మొత్తం రూ.1,018 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే రోజుకు సగటున 2.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు లెక్క. అయితే పెద్ద నోట్ల స్వీకరణ గడువు గతేడాది డిసెంబర్ 30తో ముగియడంతో అప్పట్నుంచి హుండీ కానుకలు భారీగా తగ్గాయి. జనవరి 1న రూ.2.38 కోట్లు, 2న రూ.2.74 కోట్లు , 3న రూ.1.10 కోట్లు, 4న రూ.1.24 కోట్లు, 5న రూ.1.90 కోట్లు, 6న రూ.1.72 కోట్లు, 7న రూ.2.22 కోట్లు, 8న రూ. 3.45 కోట్లు, 9న రూ.1.45 కోట్లు, 10న రూ.1.71 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వైకుంఠ ఏకాదశి(8 తేదీని) మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఎప్పుడూ రూ.3 కోట్ల మార్క్ను దాటలేదు. తగినంత నగదు లేకపోవడం వల్లే.. 2016లో మొత్తంగా 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే సగటున రోజుకు 72 వేల మంది వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చారు. కొత్త సంవత్సరంలోనూ భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కానీ హుండీ కానుకలే తగ్గాయి. పెద్ద నోట్లు రద్దు కావటం, వాటిని మార్చుకునే గడువు ముగియటం, నగదు విత్డ్రా చేసుకునే అవకాశాలు పరిమితం కావటంతో పాటు ప్రజల వద్ద తగినంత నగదు లేకపోవడమే ఇందుకు కారణమని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. పెరిగిన ఈ–హుండీ కానుకలు తిరుమలలోని శ్రీవారి హుండీ ఆదాయం తగ్గగా.. టీటీడీ నిర్వహిస్తున్న ఈ–హుండీకి మాత్రం కానుకలు పెరిగాయి. తిరుమలకు రాలేని భక్తులు ఆన్లైన్ ద్వారా ఈ–హుండీకి కానుకలు సమర్పిస్తుంటారు. 2015లో ఈ–హుండీ ద్వారా రూ.6 కోట్లు ఆదాయం సమకూరగా, 2016లో రూ.8.8 కోట్లు వచ్చాయి. గత నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ–హుండీకి రూ.కోటి ఆదాయం రాగా, డిసెంబర్లో ఈ మొత్తం రూ.2.11 కోట్లకు పెరిగింది. అంటే నవంబర్, డిసెంబర్ మధ్యలో వంద శాతం మేర ఈ–హుండీ కానుకలు పెరిగాయి. కాగా, మున్ముందు ఈ–హుండీకి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. ఇదిలాఉండగా, మరోవైపు పెద్ద నోట్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ భక్తులు పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు సమర్పిస్తూనే ఉన్నారు. ఇలా డిసెంబర్ 31 నుంచి జనవరి 10 వరకు వచ్చిన పాత నోట్లు టీటీడీ వద్ద రూ.1.6 కోట్ల మేర ఉన్నాయి. ఈ నోట్లు రద్దు కావటంతో వీటిని రోజువారీ హుండీ కానుకల్లో కలపటం లేదు. వీటిని ఆర్బీఐ వద్ద మార్చేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
గతేడాది 2.66 కోట్ల మందికి శ్రీవారి దర్శనం
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: గతేడాదిలో మొత్తం 2.66 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాదిలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.1,018 కోట్ల కానుకలు లభించాయని తెలిపారు. టీటీడీ 10.34 కోట్ల లడ్డూలు భక్తులకు పంపిణీ చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 50,974 టికెట్లను శుక్రవారం విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు : ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి, 9న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల ఆలయంతో పాటు టీటీడీ అన్ని స్థానిక ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ రెండు రోజుల్లో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరచి ఉంటుందన్నారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, వృద్ధులు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. కాలిబాట భక్తులకు టోకెన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకాదశి నాడు శ్రీవారికి స్వర్ణ రథోత్సవం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం తిరుమలలోని శ్రీవారికి స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమివ్వనున్నారు. సోమవారం ద్వాదశిని పురస్కరించుకుని వేకువజామున పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. -
ఇస్తికఫాల్ మర్యాదలతో గవర్నర్ శ్రీవారి దర్శనం
ప్రజలంతా సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలి: గవర్నర్ సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత భూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహద్వారం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు గవర్నర్కు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా బలిపీఠానికి సాష్టాంగ నమస్కారం చేసి, ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు నిబంధనల ప్రకారం శ్రీవారి పట్టుశేషవస్త్రాన్ని బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్కు వేద పండితులు ఆశీర్వదించగా, టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాత్రి వేళ తిరుమలలోని శ్రీవారి నిత్యాన్నప్రసాద భవనంలో గవర్నర్ నరసింహన్ అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషం, ఆరోగ్యం, సుఖం, భాగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. -
టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు
ఉద్యోగాల భర్తీకి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వానికి టీటీడీ బోర్డు వినతి సాక్షి, తిరుమల: టీటీడీ ప్రధాన ఆలయాలు, అను బంధ ఆలయాలు, కొత్తగా విలీనమైన ఆలయాల్లో మొత్తం 447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టులు భర్తీ చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించినట్టు చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అన్నారు. సమావేశంలోని మరికొన్ని తీర్మానాలు... ► తిరుపతి నగర సుందరీకరణలో భాగంగా రేణి గుంట జంక్షన్ నుంచి కాలూరు క్రాస్ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం, విద్యుదీకరణ కోసం తుడాకు రూ.10 కోట్లు మంజూరు. ► టీటీడీ రవాణా విభాగంలో కన్సాలిడేటెడ్ ప్రాతిప దికన పనిచేస్తున్న 150 మంది డ్రైవర్లకు 2015లో సవరించిన వేతనం ప్రకారం నెలకు రూ.15,189 నుంచి రూ.25.500 వేతనం పెంపు. ► తిరుమల అదనపు పోటులో పనిచేస్తున్న 176 మంది కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు. ► రూ.86.46 లక్షలతో 11 లక్షల కొబ్బరికాయలు, రూ.1.16 కోట్లతో 1.25 లక్షల కిలోల ఎస్ గ్రేడ్ జీడిపప్పు, రూ.6.12 కోట్లతో 15.30 లక్షల కిలోల సోనామసూరి బియ్యం ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోలుకు నిర్ణయం. సామాన్యులకే ముక్కోటి దర్శనం వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో పర్వదినాల్లో బస, దర్శనం విషయాల్లో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యతని, వేకువజాము 4 గంటలకే సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని చైర్మన్ తెలిపారు. -
ఆర్కే ఎక్కడున్నాడో చెప్పాలి: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ ప్రజాసంఘాలు మైండ్ గేమ్ ఆడిన విషయం మరోసారి బయటపడిందని ఏపీ డీజీపీ ఎన్.సాంబశివరావు గురువారం వ్యాఖ్యానించారు. ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ విరసం నేత వరవరరావు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ పైవిధంగా స్పందించారు. తాము ముందునుంచీ ఊహిస్తున్నదే నిజమయ్యిందని, గత ఇరవై ఏళ్లుగా మావోయిస్టులు ఇదే విధమైన మైండ్గేమ్ను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్కే మా(పోలీసుల) వద్దే ఉన్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారు ఇప్పుడేం చెపుతారని డీజీపీ ప్రశ్నించారు. రాజ్యాంగంపై నమ్మకం ఉండి కోర్టును ఆశ్రయించిన వారు ఇప్పటికైనా ఆర్కే ఎక్కడున్నాడో చెప్పాలన్నారు. -
188 కోట్లతో తిరుపతి అభివృద్ధి
-
188 కోట్లతో తిరుపతి అభివృద్ధి
- టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం - విద్య, వైద్య, వసతులకు పెద్దపీట సాక్షి, తిరుమల: తిరుపతి అభివృద్ధి కోసం రూ.188 కోట్లు కేటాయిస్తూ మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలోని అభివృద్ధి పనులన్నింటికీ ఆ మొత్తంలో నిధులు కేటాయించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. తిరుపతి లో టీటీడీ సత్రాల అభివృద్ధి, కాలేజీలు, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల భవంతులు, 14 మార్గాల్లో రోడ్ల అభివృద్ధి, అధునాతన ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, చెరువుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. సమావేశంలో తీర్మానాలివి.. ► రూ.78.28 కోట్లతో కిలో రూ.364 చొప్పున 21.50 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలు ► నవంబర్ 14న ఏపీ, తెలంగాణల్లో ఎనిమిదో విడత ‘మనగుడి’ కార్యక్రమం నిర్వహణకు రూ.63.93 లక్షల మంజూరు. నెలాఖరున శంషాబాద్లో శ్రీనివాసకల్యాణం నిర్వహణ ► రూ. 5.2 కోట్లతో తిరుచానూరులో నిత్యాన్నప్రసాద భవన నిర్మాణం ► రూ. 5.6 లక్షలతో చంద్రప్రభ వాహనం తయారీ, అమ్మవారి ఆలయంలో బంగారుపూత పనులకు రూ.2.67 లక్షల మంజూరు ► టీటీడీలోని కాంట్రాక్టు కార్మికుల వేతనం రూ.6,700 నుంచి రూ. 13 వేలకు పెంపు. ► టీటీడీ ఉద్యోగులకు రూ.12,500 బ్రహ్మోత్సవ బహుమానం, కాంట్రాక్టు కార్మికులకు రూ.6,250 మంజూరు హా రూ. 1.6 కోట్లతో అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండపంలోని గుప్తకామేశ్వరి, ఇతర ఆలయాల అభివృద్ధి ► వైఎస్సార్ కడపజిల్లా మైదుకూరులోని భీమేశ్వరి స్వామి ఆలయం అభివృద్ధికి రూ.22.50 లక్షలు, ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల మంజూరు హా విజయనగరంలో నేత్ర వైద్యశాల నిర్మాణానికి పుష్పగిరి నేత్ర సంస్థకు 25 సంవత్సరాలకు కౌలుకు టీటీడీ స్థలం కేటాయింపు. హా రూ. 14.50 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న ఎస్వీబీసీ స్టూడి యో నిర్మాణం టెండర్ పనులకు ఆమోదం. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడికి నోటీసు తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన డాక్టర్ ఏవీ రమణ దీక్షితులకు సోమవారం టీటీడీ నోటీసు జారీ చేసింది. అక్టోబర్లో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన తన మనవడితో కలసి గర్భాలయ ప్రవేశం చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు కూడా ఆలయ అధికారులు చూశారు. ఇందులో భాగంగా ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు సోమవారం ఆయనకు నోటీసు జారీ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. -
తిరుమలలో వైభవంగా గరుడోత్సవం
-
వైభవంగా గరుడోత్సవం
మలయప్ప దర్శనంతో తన్మయం చెందిన భక్తకోటి సాక్షి, తిరుమల: పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి గరుడ వాహన ఊరేగింపు వైభవంగా సాగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ పురవీధుల్లో మలయప్ప గరుడ వాహనంపై దర్శనమివ్వటం సంప్రదాయం. సాయం సంధ్యా సమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. సహస్ర దీపాలంకారసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడునిపై ఆశీనులైన మలయప్పను అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు సాగింది. అశేష సంఖ్యలో హాజరైన భక్తులు అడుగడుగునా ఉత్సవ మూర్తులకు హారతి పట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు , జేఈవో పాల్గొన్నారు. దర్శనానికి కిక్కిరిసిన భక్తులు తిరుమలలో పెరటాశి భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. కాలిబాట, సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనంలోనూ భక్తులు కిక్కిరిసి కనిపించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ కూడా అప్రమత్తమైంది. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అన్ని విభాగాల అధికారుల ద్వారా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంపై దృష్టి సారించారు. -
సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి!
ఎన్టీఆర్ ‘సర్దార్ పాపారాయుడు’, చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రాలతో పాటు సుమారు 600 చిత్రాలకు స్టంట్ మాస్టర్గా పనిచేసిన సాంబశివరావు (89) హైదరాబాద్లోని స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారాయన. ఎక్కువగా ఎన్టీఆర్ చిత్రాలకు పని చేసిన సాంబశివరావు.. ‘ప్రతిఘటన’, ‘నేటి భారతం’, ‘శ్రీరంగనీతులు’ తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్గా వ్యవహరించారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
ముగిసిన బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా 7లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల వివరాలు మీడియాతో పంచుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 30లక్షల లడ్డూలను భక్తులకు అందించామని చెప్పారు. 35లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేశాం. 3.50 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలను మరింత పటిష్టంగా చేస్తామని హామీ ఇచ్చారు. -
విష్వక్సేనుడి సాక్షిగా ‘ఫన్ డే’ ఆవిష్కరణ
- బ్రహ్మోత్సవాల ఆరో ప్రత్యేక సంచికకు టీటీడీ ప్రశంసలు - సాక్షి యాజమాన్యం, ఫన్ డే బృందానికి ప్రత్యేక అభినందనలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనాలతో ‘విశ్వపతికి బ్రహ్మాండసేవ’ శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’ సంచికను ఆదివారం రాత్రి విష్వక్సేనుడి ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో కోదండ రామారావు, పేష్కార్ సెల్వం, బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, రమణ, అర్చకులు ‘సాక్షి ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో వరుసగా ఆరో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు. శ్రీవారి వైభవ విశేషాలు, కైంకర్యాలు, చారిత్రక నేపథ్యం, వేయేళ్ల రామానుజుడు, మహంతుల కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులు, ఆభరణాల ఆనంద నిలయుడు, తరతరాల సంప్రదాయం, కనువిందు చేసే అరుదైన ఫొటోలు.. వంటి ఆసక్తికర అంశాలతో వెలువడిన ‘ఫన్ డే’లో విశ్లేషణాత్మక కథనాలు రాసిన సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ సహదేవ కేతారితోపాటు ఫన్డే బృందాన్ని ప్రశంసించారు. తిరుమల చారిత్రక అంశాలు, విశేషాలు, ఉత్సవాల వైభవాన్ని ‘సాక్షి ఫన్ డే’ ద్వారా తెలి యజేయటంలో సాక్షి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని కొనియాడారు. -
విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం
- దాతల ప్రోత్సాహానికి సన్నాహాలు - గరుడ సేవ వేళల్లో మార్పు - టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుపతి అర్బన్: టీటీడీ ద్వారా విద్య, వైద్య రంగాల సేవలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ను సోమవారం తిరుపతిలో ఈవో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ అప్లికేషన్ ద్వారా టీటీడీలోని 9 ట్రస్టులు, ఒక పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 48 గంటల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే దాతలుగా వున్న వారు డిజిటల్ పాసుపుస్తకాన్ని పొందవచ్చునన్నారు. దాతల విభాగం ద్వారా కల్పించే దర్శనం, బస తదితర ప్రయోజనాలను ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని వివరించారు. ఇందులో లోటుపాట్లు ఎదురైతే వాటిని తక్షణం సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ట్రస్టుల సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విజువల్స్ తీయించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తూ వెబ్సైట్లో పొందుపరచడం ద్వారా మరింత మంది భక్తులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ-హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు నేరుగా శ్రీవారి హుండీ అకౌంట్కు జమ అవుతాయని తెలియజేయాలని పేర్కొన్నారు. పాస్పుస్తకాలు అందని దాతలకు మూడు రోజుల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలను అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ, టీసీఎస్ అధికారులు పాల్గొన్నారు. గరుడసేవ రాత్రి 7:30కే ప్రారంభం.. భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ సారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించింది. రద్దీని బట్టి రాత్రి 12 నుంచి 12.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించారు. గరుడ వాహనంలో హారతులు తీసుకొచ్చే భక్తుల సంఖ్యను ఈసారి పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
హుండీకి సీలువేయడంలో నిర్లక్ష్యం
-శ్రీవారి ఆలయ అధికారులపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ - విజిలెన్స్ విచారణకు ఆదేశం సాక్షి, తిరుమల భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి. ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు. నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్ సంబంధిత ఆలయ అధికారులపై మండిపడ్డారు. వీఎస్వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
పోలీస్ బాస్గా సాంబశివరావు
-
పోలీస్ బాస్గా సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)గా నండూరి సాంబశివరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీగా పనిచేస్తోన్న సాంబశివరావును డీజీపీగా నియమించాలని సర్కారునిర్ణయించింది. 1984 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సాంబశివరావు ఇప్పటికే డీజీపీ హోదాలో ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు. రాష్ట్రం యూపీపీఎస్సీకి పంపిన ప్రతిపాదనల జాబితాలో కూడా సాంబశివరావు పేరుంది. కాగా మరో 5గురు ఐపీఎస్లకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
నడిరోడ్డుపై ఘోరం
- కొడుకును టీవీఎస్పై ఆస్పత్రికి తీసుకెళ్తున్న వ్యక్తిపై సైక్లిస్ట్ దాడి - చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కంకిపాడు : స్వల్ప వివాదంతో తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని పునాదిపాడులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీసీ కెమేరాలో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంకిపాడు మండలంలోని కోలవెన్నుకు చెందిన కొల్లూరి సాంబశివరావు(38)తన చిన్న కుమారుడు పావన్కు జ్వరంగా ఉండటంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లేందుకు టీవీఎస్పై శుక్రవారం రాత్రి బయలుదేరాడు. ఈ క్రమంలో సైకిల్పై రోడ్డు దాటుతున్న దేవరపల్లి కిరణ్ అడుపడడంతో వారి మధ్య వాగ్వాదం జరిగి కిరణ్ సాంబశివరావుపై తీవ్రంగా దాడి చేయడంతో కుప్పకూలాడు. కుటుంబీకులు బాధితుడ్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం సాంబశివరావు మృతి చెందాడు. -
అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
-
అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
కంకిపాడు : ఎదురెదురుగా వస్తున్న టీవీఎస్, సైకిల్ ఢీకొనడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సైకిలీస్ట్ టీవీఎస్ పై ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆస్పత్రి పాలైన వాహనదారుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పునాదిపాడు సెంటర్లో టీవీఎస్పై వెళ్తున్న పొల్లూరు సాంబశివారావు (40) అనే వ్యక్తికి సైకిల్ పై వెళ్తున్న కిరణ్ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కిరణ్.. సాంబశివరావుపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన సాంబశివరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెంటర్లో ఉన్న సీసీ టీవీ కెమరా ఫూటేజిల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుబోయిన బాబు
ఏపీఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన, ధర్నా విజయవాడ (గాంధీనగర్) :ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్ముడుపోయారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన సమాఖ్య (ఏపీఎస్వైఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ లెనిన్ సెంటర్లో ఏపీఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్నంగా భిక్షాటన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పళ్లాలు చేతబట్టుకుని బిక్షాటన చేశారు. ధర్నానుద్ధేశించి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నవ్యాంధ్రప్రదేశ్లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్నాయన్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఫీజులను నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు చూస్తోందన్నారు. ఏ మాత్రం రాజకీయ అనుభవంలేని, ప్రజా సమస్యలు తెలియని కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆయను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి గంటా శ్రీనివాస్ విద్య వ్యవస్థను పరిరక్షించడంలో విఫలమయ్యారన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు, కోశాధికారి తమ్మిన గణేష్, ఉపాధ్యక్షులు యంపల శంకర్, కాసాని గణేష్, కె.ఫణి, జి.రాజేష్, రాము, శివబాబు, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తం
- గ్రామాల వైద్య శిబిరాల ఏర్పాటు - వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన - డీఎంహెచ్ఓ సాంబశివరావు డెంగీపై ప్రత్యేక దృష్టి గత సంవత్సరం జిల్లాలో 244 డెంగీ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మకంగా గుర్తించిన హసన్పర్తి, గూడూరు, ఆజంనగర్, ములుగు, కంబాలపల్లి, వరంగల్ అర్బన్ పీహెచ్సీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాం. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాం. ఎంజీఎం : వర్షకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన, ఆదివాసీలు నివసించే తండాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గత సంవత్సరం ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు చెపుతున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, క్షేత్రస్థాయిలో సేవలందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశామని అంటున్నారు. వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆదివారం డీఎం హెచ్ఓ ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రతీ సంవత్సరం గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు విస్తారంగా విజృంభించి ప్రజలు మంచం పట్టే పరిస్థితులు నెలకొంటున్నారుు. ఈ ఏడాది అలా జరుగకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా నివారణ మాసోత్సవంలో భాగంగా జూన్లో కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీలు, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా వ్యాధి- తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లో 1.50 లక్షల కరపత్రాలు పంపిణీ చేశాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు వైద్య శిబిరాలు... జిల్లాలో గతంలో వ్యాధులు విజృంభించిన ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేవాళ్లం. అయితే కలెక్టర్ వాకాటి కరుణ అదేశాలతో ప్రతి గురువారం ఆయా క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, సలహాలు, సూచనలతో పాటు అవసరమైన చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో గత ఏడాది 336 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 241 కేసులు ఏజెన్సీ ప్రాంతాల్లోనే. ఈ సంవత్సరం ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాం. 165 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తుగా స్ప్రే చేశాం. గ్రామ పంచాయతీ, పారిశుధ్య నిధులతోయాంటీ లార్వాల్ చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న 590 మంది సూపర్వైజర్లు, 1100 మంది ఏఎన్ఎంలు, 3174 మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నివారణ చికిత్సకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాం. ప్రతి శుక్రవారం డ్రై డే.. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నాం. డ్రమ్ములు, నిరుపయోగంగా ఉన్న కూలర్లు, తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకం.. ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతంలో 26 మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తారు. కలెక్టర్ అదేశాలతో ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రీయ బాల స్వస్తా కార్యక్రమంలో చేపట్టిన సిబ్బందితో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వైద్యచికిత్సలు అందిస్తున్నాం. వివిధ శాఖల సహకారంతో... సమస్యాత్మక గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు పీహెచ్సీ, పారామెడికల్ సిబ్బందితో పాటు శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారం తీసుకుంటున్నాం. ఈ శిబిరాల ద్వారా గర్భిణులు, బాలలకు పౌష్టికాహారం, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, దోమల నివారణ వంటి అంశాలపై వివరిస్తాం. -
17 మందితో ఏపీఎస్ఆర్టీసీ బోర్డ్
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి పాలక మండలి - చైర్మన్గా ఎన్.సాంబశివరావు సాక్షి, హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీకి 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు, తెలంగాణ తరఫున ఐదుగురు, కేంద్రం తరఫున ఐదుగురితో కలిపి పాలక మండలిని నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. పాలనాపరంగా ఆర్టీసీ విభజన జరిగినా సాంకేతికంగా కేంద్రం దృష్టిలో ఇంకా ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీగానే ఉంది. గతంలో తమకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ తిరస్కరించింది.తెలంగాణకు ప్రాతినిధ్యం పెంచుతామంది. దీనికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ చైర్మన్గా సోమారపు సత్యనారాయణను నియమించింది. టీఎస్ చైర్మన్కు పాలకమండలిలో చోటు లేదు. ఏపీ నియమించే చైర్మన్కే చోటు కల్పించారు. ఏపీ ఇంతవరకు ఆర్టీసీకి చైర్మన్ను నియమించకపోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ అయిన ఎన్.సాంబశివరావు ఉమ్మడి బోర్డుకు చైర్మన్గా వ్యవహరిస్తారు. త్వరలో జరిగే పాలక మండలి సమావేశంలో ఆర్టీసీ విభజన అంశమే ప్రధాన ఎజెండా కానుంది. ఆస్తులు, విభజనపై తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. పాలక మండలిలో చోటు వీరికే... ఆంధ్రప్రదేశ్ నుంచి పాలక మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ (టీ ఆర్అండ్బీ ఇంచార్జి) కార్యదర్శి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (అడ్మిన్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఐటీ), ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ నుంచి టీఎస్ ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, రవాణా శాఖ అంశం పర్యవేక్షించే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, ఎల్.ఇ.టి అండ్ ఎఫ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శి. కేంద్రం తరఫున మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్ (రోడ్ సేఫ్టీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్/డిప్యూటీ సెక్రటరీ (ట్రాన్స్పోర్టు), మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ డెరైక్టర్, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. -
విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్
ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడి తగరపువలస/ద్వారకానగర్ (విశాఖపట్నం): విశాఖ, తిరుపతి పట్టణాలలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడించారు. విశాఖ జిల్లా తగరపువలసలో 4.09 ఎకరాల్లో రూ.7 కోట్లతో చేపట్టనున్న ఆర్టీసీ డిపో నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్ టెర్మినల్స్ నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచే స్తామన్నారు. ఇకపై ఏటీఎం కార్డులతో టికెట్లు: రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో నగదుతో పాటు డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డుల ద్వారా టికెట్లు తీసుకునేలా టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ టిక్కెట్టు తీసుకున్నాక ఆరు గంటల వరకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొబైల్ యాప్ను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
రూ.300 టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువు పెంపు
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ముందస్తు రిజర్వేషన్ను 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుతున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని భక్తులకు వారంలోపు కల్పిస్తామని, గదులు, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజర్వేషన్లు కూడా 90 రోజుల ముందే బుకింగ్ చేసుకునేందుకు పరిశీలిస్తామన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు 56,640 ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచామని, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి www. ttdsevaonline.com వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు టీటీడీ తరఫున త్వరలోనే నమూనా ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. -
కాలిబాట భక్తులకు ప్రత్యేక కాంప్లెక్స్
టీటీడీ నిర్ణయం సాక్షి, తిరుమల: తిరుమలలో పెరుగుతున్న కాలిబాట భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం అనువైన స్థలం పరిశీలించాలని టీటీడీ ఈవో సాంబశివరావు మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్థల సేకరణ పూర్తిచేసి సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వనున్నారు. తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 52,910 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇదే సమయానికి సర్వదర్శనం కోసం రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల కిలోమీటరు వరకు క్యూ కట్టారు. వీరికి 14 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలి బాట భక్తులకు క్యూ వెలుపలి వరకు ఉంది. వీరికి 9 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం లభించనుంది. హుండీ కానుకలు రూ. 2.31 కోట్లు లభించాయి. పెరిగిన రద్దీ కారణంగా మంగళవారం వీఐపీ టికెట్లను కూడా తక్కువగానే కేటాయించారు. -
ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం
సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 3.4 శాతం కరువు భత్యం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మే నెల జీతంతో కలిపి చెల్లిం చేందుకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావును ఎన్ఎంయూ నేతలు మంగళవారం కలసి కార్మికుల సమస్యలపై చర్చించారు. -
శ్రీవారి భక్తుల కోసం 55,669 ఆర్జితసేవా టికెట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెల మొత్తానికి 55,669 ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ సుప్రభాతం-6279, అర్చన- 130, తోమాల -130, విశేషపూజ-1875, అష్టదళ పాద పద్మారాధన -100, నిజపాద దర్శనం -1500, కల్యాణోత్సవం-11,625, వసంతోత్సవం -11,610, ఆర్జిత బ్రహ్మోత్సవం-6020, సహస్రదీపాలంకరణ సేవ-13,300, ఊంజల్సేవ-3100 ఉన్నాయని వివరించారు. ఈ టికెట్లను టీటీడీ ఈ-దర్శన్లోనూ భక్తులకు అందుబాటులోకి తీసురానున్నామన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా ఈ నెల 15 నుంచి జూన్ ఆఖరి వరకు శుక్రవారాల్లో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. అదే రోజుల్లో వికలాంగులు, వృద్ధులను మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నామన్నారు. శ్రీవారి సేవకు వచ్చేవారి కోసం త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. తిరుమలలోని కల్యాణవేదికలో ‘కల్యాణం’పేరుతో ఉచిత వివాహ తేదీ రిజర్వు చేసుకోవడం కోసం త్వరలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్నప్రసాదానికి దుబాయి భక్తుడి విరాళం టీటీడీ అన్నదాన ట్రస్ట్కు శుక్రవారం ఓ భక్తుడు రూ.1.32 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశాడు. దుబాయికి చెందిన శేలేష్కుమార్ దాస్ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవో సాంబశివరావును కలసి రూ.1.32కోట్ల రూపాయల చెక్ను అందజేశారు. స్వామి వారి అన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు. -
ప్రయాణికుల మన్ననలు అందుకోగలిగాం
- గణతంత్ర వేడుకల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మెరుగైన రవాణా సేవలు అందించడం ద్వారా ప్రయాణీకుల మన్ననలు అందుకోగలుగుతున్నామని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు అన్నారు. విజయవాడ బస్హౌస్ వద్ద మంగళవారం గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ఆర్టీసీ కూడా కొన్ని గవర్నింగ్ సూత్రాల(మార్గదర్శకాలు)ను రూపొందించుకోవాలని ఉందన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన మార్గంలో ప్రగతి సాధఙంచేందుకు ఈ సూత్రాలు ఉపకరిస్తాయని చెప్పారు. మెరుగైన రవాణా సేవలందించడం ద్వారా గత ఏడాది ప్రయాణీకుల మన్ననలు అందుకోగలిగామని అన్నారు. గోదావరి పుష్కరాలు ఆర్టీసీ ప్రతిష్టను పెంచాయని, అదే స్పూర్తితో ఈ ఏడాది కృష్ణా పుష్కరాల్లోను ప్రయాణీకులకు రవాణా సౌకర్యాలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. -
మద్యం దుకాణంలో రూ.85వేలు చోరీ
గుంటూరు జిల్లా రెంటచింతల పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు విజయా థియేటర్ సమీపంలోని కల్యాణి వైన్స్ పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల విలువైన నగదును ఎత్తుకుపోయారు. గురువారం ఉదయం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ను రప్పించారు. -
అత్తింటి ముందు కోడలి ఆందోళన
అదనపు కట్నం తీసుకుని కూడా .. ఇంట్లొకి రానివ్వడం లేదంటూ.. ఓ నవ వధువు .. అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఈఘటన హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ లో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యశ్వంత్ కు గతేడాది సింహాద్రి స్వాతి (22) తో పెళ్లైంది. అప్పటి నుంచి అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వాతి తెలిపింది. దీంతో గత్యంతరం లేక వారు చెప్పిన మొత్తాన్ని పుట్టింటి నుంచి తీసుకు వచ్చానని.. తన వద్ద నుంచి డబ్బు తీసుకున్న అత్తమామలు ఇంటి నుంచి గెంటే శారని.. ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘాల సాయంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఇలా ఉండగా.. యశ్వంత్ తండ్రి సాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ. అవినీతి ఆరోపణలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయి సస్పెండ్ అయ్యాడు. దీంతో కోడలు వచ్చిన వేళ మంచిది కాదని.. తన కొడుకు జీవితం ఒడిదుడుకులకు గురికావడానికి కూడా స్వాతి దురదృష్టమే కారణమని నిందిస్తున్నారని వివరించింది. తాను ఇచ్చిన కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని యశ్వంత్ ఇంటి ముందు నిరసనకు దిగింది. -
తిరుమలలో గదుల అడ్వాన్స్ కోటా పెంచారు..
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం గదుల అడ్వాన్స్ బుకింగ్ కోటాను టీటీడీ పెంచింది. ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు మొత్తం 1,500 గదులను మంగళవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచారు. పెంచిన కోటాలో రూ.50 అద్దె గదులు 450, రూ.100 అద్దె గదులు 600, రూ.150 అద్దె గదులు 40, రూ.500 అద్దె గదులు 250, రూ.600 అద్దె గదులు 75 ఉన్నాయి. రూ.750 అద్దె గదులు 10, రూ.1000 అద్దె గదులు రూ.40, రూ.1500 అద్దె గదులు 20, రూ.2000 అద్దె గదులు 15 అందుబాటులో ఉన్నాయి. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం భారీ వర్షాల కారణంగా తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 37,546 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి కేవలం రెండు గంటలు మాత్రమే పడుతోంది. హుండీ కానుకలు రూ.2 కోట్లు వచ్చాయి. -
శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ వీధుల్లో ఊరేగుతారు. కైశిక ద్వాదశిని ప్రభోదోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినంగా పరిగణిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. -
15కోట్లతో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
-
తిరుమలలో దీపావళి స్పెషల్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా దీపావళి పండగ రోజు ఆస్థానం నిర్వహించటం ఆనవాయితీ. స్వామి సన్నిధిలోని బంగారు వాకిలి ఎదుట సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి పూజలు నిర్వహించారు. ఆస్థానం నేపథ్యంలో సుప్రభాతం మినహా ఆర్జిత సేవలన్నింటిని తితిదే రద్దు చేసింది. తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు దంపతులు ఆస్థానం కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో తిరుమలకు జలకళ
వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిరుమలకు స్వాంతన నిచ్చాయి. తిరుమలలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. మంగళవారం ఆకాశగంగ, గోగర్భం డ్యాములు పొంగి పొర్లాయి. పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో 70శాతం నీరు చేరింది. ఈ వర్షాల పుణ్యమా అని ఏడాదికి సరిపడా తాగునీరు చేరింది. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ఐదు జలాశయాల్లో చేరిన నీరు ఏడాదికి సరిపోతుందని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక తిరుపతి కల్యాణీ డ్యాంలోనూ 35 శాతం నీరు చేరింది. దాంతో పాటు తెలుగుగంగ నీరు రోజూ 7 నుంచి 8 ఎంఎల్డీలు అందుతోంది. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే ఏడాదిన్నర కాలానికి ఎలాంటి ఢోకా లేదని ఇంజినీర్ల అభిప్రాయం. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం జలాశయాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. -
వ్యక్తి దారుణ హత్య
నగరం: పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం పూడివాడ పడమటి పాలెం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మోర్ల వెంకటసాంబశివరావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు గ్రామ శివారులో సాంబశివరావు మృత దేహమై కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి దాదాపు రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న వివాహేతర సంబంధం
వీడిన జూపాక హత్య కేసు మిస్టరీ భార్య, అత్తమామల పథకం ప్రకారమే హత్య హుజూరాబాద్టౌన్ : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హుజురాబాద్ మండలం జూపాక గ్రామ శివారులో గత నెల 20న గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి బండరాళ్లు కట్టి వ్యవసాయ బావిలో పడవేసిన హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించా రు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే భర్తను ఓ భార్య తనతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని హత్యచేశారు. బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ సిహెచ్.శ్రీనివాస్, ఎస్సైలు బొల్లం రమే ష్, రాజేందర్లతో కలిసి వివరాలను వెల్లడించారు. మృతుడు వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్కు చెందిన సాంబశివరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడికి వరంగల్ జిల్లా మొగుళ్ళపెల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన లకిడె రమ అలియాస్ కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగిం ది. వీరికి ఇద్దరు కూతుళ్ళు జన్మించారు. రమకు బంధువైన కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన భాసిడి ఓంకార్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు సాంబశివరావు గుర్తించాడు. తన భర్త అడ్డును తొలిగించాలనుకొని ఓంకార్కు రూ.50 వేలిచ్చి హతమార్చాలని చెప్పింది. దీనికి రమ తల్లిదండ్రులు లింగంపల్లి రాములు, కమలాభాయిల సహకారం ఉంది.ఈక్రమంలో ఓంకార్ సాంబశివరావును హత్య చేసేందుకు నేరేళ్ల గ్రామానికి చెందిన పైడి, దేవేందర్, కుమారస్వామి, స్వామిలతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేశారు. హత్యచే యాలని పథకం పన్నిన రమా, తల్లి దండ్రులు పరారీలో ఉన్నారు. ప్రాధాన నిందితుడైన ఓంకార్తో పాటు నలుగును నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారీలోఉన్న నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన రితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ఆయన స్థానంలో నియమించనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముంది. ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో విఫలమయ్యారని సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సాంబశివరావు స్థానంలో ప్రొఫెసర్ సింహాద్రిని వీసీగా నియమిస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం అందజేసింది.