Seemandhra Leaders
-
ఐదు నెలల్లోనే అంచనా వేయొద్దు
మందమర్రి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు మాత్రమే అయిందని, అప్పుడే ప్రభుత్వ పనితీరుపై అంచనా వేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అన్నారు. ఆదివారం మందమర్రిలో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి మొదటి జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు అవలంభిస్తున్న నీతిమాలిన రాజకీయాలతో ఈ ప్రాంతానికి కరెంటు తిప్పలు తప్పడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పాలన సక్రమంగా లేదని ప్రచారం చేసేందుకు సీమాంధ్ర నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిత్యానందరెడ్డిపై జరిగిన కాల్పులను సాకుగా చూపుతూ హైదరాబాద్లో ఉండేవారికి రక్షణ లేదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత తెలంగాణ వికాస సమితిపై ఉందని అన్నారు. చెరువుల ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ ఓఎస్డీ దేశ్పతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నా సీమాంధ్ర భావజాలం ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి గని కార్మికుల పోరాట పటిమను ఎన్నటికీ మరిచిపోలేమని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. సభకు తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల రాజయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి హెచ్.రవీందర్ పలు తీర్మానాలు ప్రతిపాదించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ వినయ్బాబు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామారావు, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, భిక్ష పతి పాల్గొన్నారు. -
అప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరు మాట్లాడలేదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక సమైక్య పార్టీ పెట్టడంలో అర్థం లేదని జై ఆంధ్ర ఉద్యమ నేత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు సీమాంధ్ర నేతలెవ్వరూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు విద్యార్థులు, ఇటు ఎన్జీవోలు సమైక్య ఉద్యమం చేశారని, ఆ తర్వాతే నేతలు రంగంలోకి దిగి ఢిల్లీలో ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏర్పడకముందే జై ఆంధ్ర ఉద్యమం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర సమైక్యానికి ప్రతీకగా ఓ పార్టీ పెట్టేందుకు కిరణ్ సంకల్పించారు. ఆ క్రమంలో లోక్సభలో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలు ఆదివారం మాదాపూర్లో కిరణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే సోమవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సిఎం కిరణ్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం. అదికాక గతేడాది జులై 30న సీడబ్య్లుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సీమాంధ్ర నేతలు ఎవ్వరు సీడబ్య్లసి నిర్ణయంపై ప్రతిఘటించలేదు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. -
సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్: లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందింది. -
రాజీనామాపై సీఎం ఊగిసలాట
హైదరాబాద్: రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన దరిమిలా సీఎం కిరణ్ కుమార్ తన రాజకీయ మార్గాన్ని అన్వేషించుకునే పనిలో పడ్డారు. ఈ రోజు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన కిరణ్ పలు విషయాలను చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యవాదిగా నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నా, నేతల నుంచి పూర్తి స్థాయి హామీ లభించకపోవడంతో కొంత డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త పార్టీ అంశంపై ఎమ్మెల్యేల నుంచి మిశ్రమ స్పందనలే లభించడంతో రాజీనామా చేసేందుకు వెనుకడుగువేస్తున్నారు. తాను చేపట్టబోయే భవిష్య కార్యాచరణపై ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నా.. ఆ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రాజీనామాను ఎప్పుడో చేయాల్సిందని కొంతమంది నేతలు చెప్పగా, ఇప్పుడు చేసినా ఏమీ లాభం ఉండదని మరికొందరు సీఎంకు తెలిపారు. కాగా, రాజకీయ నాయకుడిగా మిగలాలంటే..రాజీనామానే సరైన మార్గమని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. -
సీఎంకు సీమాంధ్ర నేతల ఝలక్!
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన దరిమిలా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారు? బిల్లు భవితవ్యం సోమ, మంగళవారాల్లో తేలిపోయేలా కన్పిస్తుండటంతో వారంతా భావి కార్యాచరణపై దృష్టి సారించారు. రెండు రోజులుగా తనను కలుస్తున్న వారికి కిరణ్ ఇదే మాట చెబుతున్నారు. ‘ఇంకా పదవిలో ఉండాలని నాకు లేదు. రాజీనామా చేయాలనే ఉంది. కానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. సమష్టిగా ముందుకు వెళ్దాం’ అంటున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ దఫదఫాలుగా మంతనాలు జరిపారు. ఆదివారం కూడా సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సీమాంధ్ర నేతలు గైర్హజరయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి 25 మంది ఎమ్మెల్యేలు, 6గురు మంత్రులు మాత్రమే హాజరైయ్యారు. సీమాంధ్ర ప్రాంత్రంలో కాంగ్రెస్ పక్షాన ఉన్న 83 మందిలో 52 మంది సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ రోజు జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలంతా కిరణ్ కు దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
బిల్లు ఆమోదానికి సహకరిస్తాం: నామా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును దయచేసి అడ్డుకోవద్దని సీమాంధ్ర నేతలను టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేరబోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ కట్టుబడివుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం టీడీపీ మూడు లేఖలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ లేఖలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. తమ పార్టీ తరపున తెలంగాణకు మద్దతు ఎంత ఉందో దీని బట్టి తెలుస్తుందన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తామూ పూర్తిగా కూడా సహకరిస్తామని హామీయిచ్చారు. తెలంగాణకు అడ్డుతగలొద్దని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. -
టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు తేడా లేదు
సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు బుధవారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు కొంచం కూడా తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలపై డీజీపీ బి.ప్రసాదరావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలపై డీజీపీ సుమోటో కింద కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా డీజీపీని ప్రశ్నించారు. -
కిరణ్ తీరుకు నిరసనగా టినేతల దీక్ష
-
ఇద్దరినీ కూర్చోబెట్టాలి: బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చంద్రబాబు తన ‘మనసులో మాట’ను ఇప్పటికీ బయట పెట్టడం లేదు. బిల్లు అంకం తుది ఘట్టానికి చేరుకున్నా తన వైఖరి చెప్పకుండా ఎప్పటిలాగే నాన్చుతున్నారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి సహా పలు పార్టీల నేతలను కలసిన బాబు.. బిల్లును సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. సోమవారం రాత్రి 7.30కు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో బాబు ఒంటరిగా భేటీ అయ్యారు. బిల్లు లోపభూయిష్టమంటూ వినతిపత్రం సమర్పించారు. ‘‘బిల్లుపై పునఃపరిశీలన చేయండి. రాజ్యాంగానికి లోబడి సమన్యాయం జరిగేలా పరిష్కారం చూపండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. రాష్ట్రం సమైక్యంగా కొనసాగాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలి. విభజన తప్పనిసరైతే రెండు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలి’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలతో, నాయకులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆయనే వారితో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ‘‘కేంద్రం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిందని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటేసిందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాను. సమస్యలన్నిటినీ సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం ఉండాలని కోరాను’’ అన్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే చెడు సంప్రదాయానికి కాంగ్రెస్ నాంది పలుకుతోందని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిని ముందర పెట్టి కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. సమైక్యమంటే ఆయనకేదో ఓట్లు పడుతాయని ఆలోచిస్తున్నారు. 2008లో టీడీపీ తీర్మానానికే కట్టుబడి ఉన్నాం’’ అన్నారు. చర్చలకు సమయం లేదుగా అని ప్రశ్నించగా, సమయం విషయం కాదని, అంశాన్ని చూడాలని చెప్పుకొచ్చారు. ‘‘ఒకచోట రాజధాని, మరోచోట ప్రజలు విడిపోవడం చరిత్రలో లేదు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించకే సమస్యలొచ్చాయి. ఆర్టికల్ 371 డి, రాజ్యాంగ సవరణ అవసరమన్నా పట్టించుకోవడం లేదు. పద్ధతి ప్రకారం చేసి ఉంటే బిల్లు వచ్చేది కాదు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేదాకా విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం’’ అన్నారు. రాజ్నాథ్, శరద్యాదవ్లతో భేటీ సోమవారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, జేడీయూ నేత శరద్యాదవ్లతో కూడా బాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని, రాష్ట్ర భాగస్వాములను పిలిపించి మాట్లాడాలని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని వారికి చెప్పానన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగాలని రాజ్నాథ్ అన్నారన్నారు. ‘‘స్క్రిప్టు 10 జన్పథ్లో. అక్కడ రాష్ట్రంలో అదే నాటకం. నేను ఢిల్లీలో దీక్ష చేసినా వీరు మారలేదు’’ అన్నారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఆనందంగా జరిగిందంటూ ప్రశంసించారు! బిల్లుపై మంగళవారం నిర్ణయం: శరద్యాదవ్ విభజన బిల్లుపై జేడీయూ నిర్ణయాన్ని మంగళవారం సమావేశమై చర్చించాక వెల్లడిస్తామని శరద్ యాదవ్ చెప్పారు. బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా విభజన జరగాలనేది తమ అభిప్రాయమన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు నడవదు. ఆర్థిక బిల్లును పూర్తి చేయాల్సి ఉన్నా ఆర్థిక విభాగాల వద్ద పేపర్లు సిద్ధంగా లేవు. పార్లమెంటు సమావేశాలను 12వ తేదీ నుంచి పెట్టాలంటే విన్లేదు. ముందు ఆర్థిక బిల్లును ఆమోదిస్తే బాగుంటుందని నేటి అఖిలపక్షంలో అన్ని పార్టీలూ చెప్పాయి’’ అని బదులిచ్చారు. ‘సోనియా ఇంటివద్ద పోరాడమనండి’ ‘‘నిరవధిక ధర్నా చేస్తానంటూ రేపు ఒక కొత్త యాక్టర్ ఇక్కడికొస్తున్నాడ’’ంటూ సీఎం కిరణ్నుద్దేశించి బాబు ఎద్దేవా చేశారు. ‘‘కలిసి పోరాడదామంటున్నారు. మాకు చెప్పడం కాదు, సోనియాపై పోరాడమనండి. ఆమె నివాసం 10 జన్పథ్ ముందు కిరణ్ ధర్నా చేయాలి. కారకుల ఎదుట పోరాడాలి గానీ వీధుల్లో కాదు. కానీ అక్కడ చేయరు. రాజ్ఘాట్ పోతామని, అధ్యక్షుడి దగ్గరకు పోతామని అంటున్నారు. ఇదంతా 10 జన్పథ్ నుంచి ఆడిస్తున్న నాటకం. అందులో వీరంతా పాత్రధారులు. కేంద్ర కేబినెట్లో బిల్లు పాస్ చేసి ప్రధాని పంపితే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు. ఢిల్లీకి, రాష్ట్రపతి దగ్గరకు వచ్చి పాదయాత్ర చేస్తానంటాడు. సోనియా అధ్యక్షతన సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని పీసీసీ అధ్యక్షుడు తిరస్కరిస్తారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ డ్రామాలు కట్టిపెట్టి ఆమోదయోగ్య పరిష్కారం చూడాలి’’ అన్నారు. ‘ఒంటరి’ భేటీల బాబు ‘ఢిల్లీకి వచ్చిన పని ఒకటి.. చేస్తున్న పని మరొకటి’ - చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది! సోమవారం ఢిల్లీలో బాబు ఎవరిని కలసినా వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడటం, తమెవరినీ అనుమతించకపోవడం పట్ల వారిలో విస్మయం వ్యక్తమవుతోంది. పైగా అందరినీ కలుస్తున్నా విభజనకు టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా అన్నది మాత్రం సూటిగా చెప్పడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. నిజానికి రాబోయే ఎన్నికలు, పొత్తుల వ్యవహారాలకే బాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్థమవుతోందని ఆయనతో పాటు ఢిల్లీ వచ్చిన టీడీపీ నేత ఒకరన్నారు. రాష్ట్రపతితో ఎప్పుడూ పార్టీ నేతలతో పాటుగా భేటీ అయ్యే బాబు, సోమవారం మాత్రం ఒక్కర్నీ వెంట తీసుకెళ్లలేదు! సుమారు 40 నిమిషాల పాటు ప్రణబ్తో ఏకాంతంగా భేటీ అయ్యారు. అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్తో భేటీ సందర్భంగా తొలుత యనమల రామకృష్ణుడు, ఎంపీలు ఎన్.శివప్రసాద్, రమేశ్ రాథోడ్ బాబు వెంట ఉన్నారు. కానీ కొద్ది నిమిషాలకే వారిని పక్కకు పంపి, రాజ్నాథ్తో ముప్పావు గంట పాటు బాబు ఏకాంతంగా మంతనాలు జరిపారు. ఆ సమయంలో పార్టీ నేతలను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తరవాత శరద్యాదవ్, అజిత్సింగ్లతో భేటీ సందర్భంగా కూడా ఇదే పునరావృతమైంది. ‘‘అన్ని భేటీల్లోనూ లోపలికి బాబుతో కలసి వెళ్తాం. బయటికి కూడా ఆయనతో కలిసే వచ్చాం. అంతే తప్ప లోపల ఏ జాతీయ నేతతో బాబు ఏం మాట్లాడారో మాకైతే తెలియదు’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడొకరు వాపోయారు. మంగళవారం బీజేపీ అగ్ర నేత అద్వానీని కూడా ఏకాంతంగానే కలవాలని బాబు నిర్ణయించారు! అధినేత వైఖరి అర్థం కాక అయోమయపడుతున్న సీమాంధ్ర టీడీపీ నేతలు మంగళ లేదా బుధవారాల్లో రాష్ట్రపతిని విడిగా కలవాలన్న నిర్ణయానికి వచ్చారు. -
టీ కాంగ్రెస్ పోటీ దీక్ష
తెలంగాణ మంత్రులు, నేతల భేటీలో నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీఎం కిరణ్ సహా సీమాంధ్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని ఇందిర సమాధి శక్తిస్థల్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. అదే సమయంలో నెహ్రూ సమాధి శాంతివనం వద్ద దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యూరు. డిప్యూటీ సీఎం దామోదర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆర్టికల్ 3 ప్రకారం విభజన ప్రక్రియ పూర్తి చేయూలని డిమాండ్ చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న నేతలు సమావేశమై ముఖ్యమంత్రికి పోటీగా దీక్ష చేసే విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్బాబు, ప్రసాద్కుమార్, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు ఈ మేరకు ప్రతిపాదించగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందుకు ఆమోదం తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రులు జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లతో సైతం మంత్రులు విడివిడిగా చర్చించారు. ముఖ్యమంత్రికి దీటైన సమాధానం చెప్పాలంటే దీక్షే సరైన విధానమని అభిప్రాయపడిన జైపాల్రెడ్డి సహా ఇతర కేంద్ర మంత్రులు దీక్షకు తాము సైతం హాజరవుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
ఇక ‘ఢిల్లీ’మే సవాల్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరనున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు పయనమవుతున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ నేతలతో కలసి హస్తినకు చేరుకున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమ, మంగళవారాల్లో వేర్వేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎంపీలు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలంతా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేయాలని భావిస్తున్నారు. కేంద్రమంత్రి జైపాల్రెడ్డి సూచనల మేరకు తెలంగాణ ప్రాంత నేతలు వేర్వేరుగా భేటీలు కావడంతోపాటు అవసరమైతే యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలసి తెలంగాణకు మద్దతును కూడగట్టాలని యోచిస్తున్నారు. రాజ్యసభ, లోక్సభల్లో తెలంగాణ బిల్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేందుకు సహకరించాలని యూపీఏయేతర పార్టీల నేతలనూ కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో బీజేపీ నుంచి ఇబ్బందులు రావచ్చని భయపడుతున్న తెలంగాణ నేతలు, బీజేపీ వ్యతిరేకించినా పార్లమెంటులో గండాన్ని గట్టెక్కించుకొనేందుకు ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవాలన్న భావనతో ఉన్నారు. పార్లమెంటులో బిల్లుకు తగిన మద్దతు కూడగట్టే పనిని, ఫ్లోర్ కోఆర్డినేషన్ను కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్నా, తమవంతు బాధ్యతగా ఆయా పార్టీల నేతలను కలిస్తే ఎక్కువ ప్రయోజనముంటుందని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతితో భేటీకి సీమాంధ్ర నేతల సన్నాహాలు మరోవైపు, సీమాంధ్ర నేతలు కూడా హస్తిన బాటపడుతున్నారు. రాష్ట్రపతిని కలిసి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినందున దానిని పార్లమెంటుకు పంపేందుకు అనుమతించరాదని కోరాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంటు కోసం వారు లేఖ రాశారు. రాష్ట్రపతి ఇచ్చే సమయాన్ని బట్టి ఈనెల 4న లేదా 5న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందే ఇతర నేతలు హస్తినకు చేరుకోనున్నారు. ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నేతృత్వంలో మౌనదీక్ష, రాష్ట్రపతి కార్యాలయం వరకు పాదయాత్ర చేయడం వంటి కార్యక్రమాలపై ఆలోచనలు సాగిస్తున్నారు. కాగా, సీఎం 4న ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారని పార్టీనేతలు చెబుతున్నారు. నేడు రాష్ట్రపతితో బాబు భేటీ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం ఏడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. దీనికోసం బాబుతో సహా పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం 6.40 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న తరువాత పలువురు జాతీయ పార్టీ నేతలను కలిసి తెలంగాణ విషయంపై తమ పార్టీ అభిప్రాయాలను వారి దృష్టికి తీసుకొస్తారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీలో 2 గంటలు మౌన దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రాతిపదికగా పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టొద్దని కోరుతూ ఢిల్లీలో రెండు గంటలు మౌన దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. రాష్ట్రపతిని కలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరాలని నిర్ణయించారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, శైలజానాథ్, పి.బాలరాజు, వట్టి వసంతకుమార్, శత్రుచర్ల విజయరామరాజు, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, ఎంపీ జి.హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు. రెండు గంటలపాటు సమావేశం జరిగింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. 4 లేదా 5 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సీఎం నేతలకు చెప్పారు. 3వ తేదీ మధ్యాహ్నానికి అందరూ ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ శాసన సభలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరుతూ లేఖ ఇస్తామని చెప్పారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా రాష్ట్రపతి వద్దకు తీసుకెళితే బాగుంటుందని కొందరు మంత్రులు ప్రతిపాదించారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా వస్తే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు తొలుత మహాత్మాగాంధీ సమాధి వద్ద 2 గంటలు మౌన దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నాయకులు రాకపోతే ఇందిరాగాంధీ సమాధి వద్ద మౌనం పాటించాలని తీర్మానించారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే దానిపైనా మల్లగుల్లాలు పడ్డారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురినీ గెలిపించుకునే సంఖ్యా బలం ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డికి మద్దతుపై ఒకరిద్దరు సభ్యులు ప్రస్తావించినప్పటికీ, సీఎం సమాధానం దాటవేసినట్లు తెలిసింది. ఈ నెల 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున, ఒక రోజు ముందే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని కొందరు నేతలు సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత శాసన సభ సమావేశాల తేదీపై నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలు చేసే పిటిషన్లపై తమకు నోటీసులు జారీ చేయాలని, సదరు పిటిషనర్ల అభ్యంతరాలపై తమ వాదన విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత సుంకరి జనార్దన్ గౌడ్ శనివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేవియట్ను దాఖలు చేశారు. -
'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు'
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదని, పరిశీలనలో ఉందని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. భేటీ అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం నెగ్గిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 4,5వ తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన చెప్పారు. తమకు మద్దతుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తామని రామచంద్రయ్య తెలిపారు. -
సీన్ ఢిల్లీకి!
సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ జానారెడ్డి చాంబర్లో తెలంగాణ నేతల సమావేశం రాష్ర్టపతిని, పార్టీ పెద్దలను కలిసేందుకు 3, 4 తేదీల్లో హస్తినకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగియడంతో ఇక సీన్ మొత్తం హస్తినకు మారుతోంది. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో పాటు పార్టీ ముఖ్యనేతలను కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్, పార్థసారధి, తోట నర్సింహం తదితరులు... అయిదుగురు ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ సీఎం తీర్మానం పెట్టడం, సభ దాన్ని ఆమోదించడంతో కిరణ్కుమార్రెడ్డిని అభినందించారు. సభలో తిరస్కార తీర్మానానికి సహకరించిన నేతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా రాష్ట్రపతిని విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. బిల్లు రాష్ట్రపతినుంచి కేంద్రానికి వెళ్లకముందే ఆయన్ను కలవాల్సి ఉన్నందువల్ల, ఫిబ్రవరి 4న కేంద్ర మంత్రుల బృందం భేటీకి ముందుగానే ఢిల్లీ వెళ్లాలని కొందరు సూచించారు. దీంతో రెండురోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మేధోమధన సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని సీఎం చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో మౌన దీక్షలు చేయాలని, ఏపీ భవన్నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పరేడ్గా వెళ్లాలని కొందరు సూచించారు. రాష్ట్ర సమైక్యతకోసం ఏ కార్యక్రమం చేపట్టినా తామంతా వెన్నంటే ఉంటామని మంత్రి శైలజానాధ్ చెప్పారు. అవసరమైతే రాష్ట్ర బంద్కు సీఎం పిలుపునివ్వాలని, ధర్నాలు, దీక్ష లకు దిగితే తామంతా వాటిని విజయవంతం చేస్తామని తెలిపారు. బిల్లు తిరస్కరణ తీర్మానంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇతర పార్టీలవారందరినీ ముందుకు తీసుకువస్తామని శైలజానాధ్, గంటా శ్రీనివాసరావులతోసహా ఇతర మంత్రులు వివరించారు. మరోవైపు మంత్రి జానారెడ్డి చాంబర్లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతితో పాటు పార్టీ పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందన్న ప్రచారం మరింత ముమ్మరం చేయాలని తీర్మానించారు. ఆ మేరకు అందరూ నియోజవకర్గాలకు బయలుదేరారు. ఆదివారం తిరిగి హైదరాబాద్కు చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. -
టీడీపీ డబుల్ డ్రామా!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన డ్రామాను బుధవారం రక్తికట్టించింది. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర నేతలు... ఓటింగ్ అక్కరలేదని తెలంగాణ నేతలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. ఓటింగ్ జరపాలని, చర్చకు గడువు పొడిగించాలని స్పీకర్ను డిమాండ్ చేస్తూ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు శాసనసభా మందిరంలో బైఠాయిస్తే... ఓటింగ్ పెట్టకుండా వెంట నే తిప్పి పంపాలంటూ తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలు గన్పార్క్ వద్ద నిరసన తెలిపారు. బుధవారం సభ వాయిదా పడిన వెంటనే అధినేత చంద్రబాబు రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అది పూర్తికాగానే ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా ఆందోళనకు దిగడం గమనార్హం. టీడీపీ డ్రామా పర్వం కొనసాగిందిలా... - రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రం తీరుకు నిరసనగా గురువారం బంద్ పాటించాలని సీమాంధ్ర టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ కోరారు. - సభ వాయిదాపడక ముందు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా చీలిపోయి ఒకే సమయంలో ఎవరి వాదనకు అనుగుణంగా వారు స్పీకర్ ఛాంబర్లో వేరువేరుగా ధర్నా నిర్వహించారు. సభ వాయిదా పడిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి చంద్రబాబుతో సమావేశమయ్యారు. - బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సభలోనే బైఠాయించాల్సిందిగా చంద్రబాబు సూచిం చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నిరసన తెలుపుతున్నామని పోలీసులు అరెస్టు చేసేవరకూ గంటకో మారు వచ్చి మీడియాకు వెల్లడించాల్సిందిగా ఆదేశించారు. - అధినేత సూచనను ఎమ్మెల్యేలు తూ.చ. తప్పకుండా పాటించారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యే - సమయానికి వచ్చి మాట్లాడి మళ్లీ సభామందిరంలోకి వెళ్లారు. బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ఫిబ్రవరి 28 వరకూ గడువు పెంచాలని, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. - మరోవైపు బిల్లుపై ఓటింగ్ నిర్వహించవద్దని, యధావిధిగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని కోరుతూ తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సిం హులు నేతృత్వంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు. - బిల్లుపై సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరిం చాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి డిమాండ్ చేశారు. అలాగే గడువు పెంచొద్దని కోరుతూ తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు. -
సీఎం వ్యాఖ్యలు బాధాకరం
నర్సాపూర్, న్యూస్లైన్: రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీఎం కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ఆమె గురువారం సాయంత్రం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుందని తెలిసే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నాయకుడిగా, సీఎంగా ఉంటూ తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రకటించడం సబబుకాదన్నారు. మంత్రి బాలరాజు సభలో మాట్లాడుతూ తాను సమైఖ్యవాదిని అయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం అభినందించారు. రాష్ట్రపతి 30వరకు గడువు పెంచడం పట్ల ఆమె స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిదర్శనమని చెప్పారు. జగన్నాథరావు ఆశయాలు కొనసాగిస్తాం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు రెండవ వర్ధం తిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, శ్రీనివాస్గుప్తా, అనిల్గౌడ్, నయీం, విష్ణువర్ధన్రెడ్డి,వెంకటేశం పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎంకు ఘన నివాళి స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం చౌటి జగన్నాథరావు రెండో వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ఆయన విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళ్లర్పించారు. ఆయన భార్య వనమాల, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు రమాదేవితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని జగన్నాథరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
ఫిక్సర్లకు రాయితీలు..!
రాష్ట్ర విభజన అంశాన్ని నేతలు క్రికెట్తో పోలుస్తున్నారు. ఈ మ్యాచ్లో తానింకా బ్యాటింగే మొదలుపెట్టలేదని సీఎం చెబుతుండగా విభజన ప్రక్రియ అంతా అయిపోతున్న సమయంలో చివరి బంతికి సెంచరీ ఎలా చేస్తారని తెలంగాణ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొందరు సీమాంధ్ర నేతలతో ఫిక్సింగ్ చేసుకుని తన పని సాఫీగా చేసుకుపోతోందని అసెంబ్లీ లాబీల్లో చర్చ. సమైక్య బ్యాటింగ్ మొదలెట్టాలని కొందరు సీమాంధ్ర ఎంపీలను హైకమాండే ఫీల్డ్లోకి దింపిందట. బ్యాటు పట్టుకోవడమే తెలియని వారికి గేమ్ప్లాన్ వివరించిందట. ‘వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించండి. మీకు మీరే చాంపియన్లుగా కూడా ప్రచారం చేసుకోండి. అవసరమైతే చివరి బంతిలోనూ సెంచరీ చేస్తామని చెప్పండి. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే కొద్ది రోజుల్లో మరో కొత్త మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంటుంది’ అంటూ నూరిపోసిందట. ఇంకేం.. వారంతా రంగంలోకి దిగి స్లోగన్లు, పోస్టర్లు, హోర్డింగ్లు, చానెళ్లలో నినాదాలను ఊదరగొట్టడం మొదలెట్టారు. దాంతో.. సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధం కావాలని హైకమాండ్ ఆదేశించిందట. మళ్లీ ఇదేమిటని అనుకుంటున్నారా! కొత్త పార్టీ పెట్టి జనంలోకి వెళ్లడం.., ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చి పాత టీమ్ (కాంగ్రెస్)లో చేరిపోవడం. ఇటీవలే ఏఐసీసీ మీటింగ్కు హాజరైన ఓ నేత అసెంబ్లీ లాబీల్లో ఈ మ్యాచ్ (ఫిక్సింగ్) వివరాలను వెల్లడించారు. దీనివల్ల మనోళ్లకి లాభమేనండీ అని కూడా చెప్పారట. ‘సెకండ్ ఇన్సింగ్స్కయ్యే ఖర్చులకు భారీఎత్తున జేబులు నింపడంతో పాటు ఆ ప్లేయర్లకు చెందిన కంపెనీలకు హైకమాండ్ అనేక రాయితీలు ప్రకటించింది. లేదంటే ఈ ‘ఫిక్సర్లు’ ఊరికే ఫీల్డ్లోకి దిగుతారనుకుంటున్నారా?’ అని ఆయన చెప్పడంతో అక్కడున్న వారంతా ‘ఓహో! దీని వెనుక ఇంత కథ ఉందా!’ అనుకున్నారు. -
విభజన బిల్లు.. గడువు గడబిడ
సమీపిస్తున్న విభజన బిల్లు గడువు... రాష్ట్రపతికి పోటాపోటీ లేఖలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువు విషయంలో కాంగ్రెస్లోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు పరస్పరం భిన్న వాదనలు చేస్తున్నారు. అదే వైఖరిని ప్రతిబింబిస్తూ రాష్ట్రపతికి లేఖలు రాయడానికి కూడా సిద్ధవువుతున్నారు. గడువు పెంచాలంటూ సీమాంధ్ర నేతలు, పెంచరాదని కోరుతూ తెలంగాణ నేతలు ఆయనకు లేఖలు రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. విభజన బిల్లు డిసెంబర్ 13న శాసనమండలికి, రాష్ట్ర అసెంబ్లీకి చేరడం తెలిసిందే. 40 రోజుల్లోగా అసెంబ్లీ అభిప్రాయంతో దాన్ని తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. ఆ గడువు జవనరి 23వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడుపు పెంపు కోరుతూ సీవూంధ్ర వుంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే విడిగా రాష్ట్రపతికి లేఖలు రాయూలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు ఒకే రకమైన లేఖను సిద్ధం చేసి, దానిపై సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ‘‘అసెంబ్లీలో ప్రస్తుతం 270 మందికి పైగా సభ్యులున్నారు. బిల్లుపై ప్రతి సభ్యుడూ తన అభిప్రాయం చెప్పాలి. కనుక మరికొంత గడువు అవసరమే. అదే విషయూన్ని రాష్ట్రపతిని లేఖ ద్వారా కోరనున్నాం’’ అని వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. చర్చలో పార్టీలవారీగా సవుయుం కేటారుుంచడం సరికాదని, సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవసరమైన సవుయం ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. గడువు పెంచొద్దు ఇక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలేమో గడువు పెంచాల్సిన అవసరం లేనే లేదంటూ రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు. ఇలా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలూ సంతకాలతో కూడిన లేఖలు రాయాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ దాదాపు పూర్తయిందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. గడువు పెంచొద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా విడిగా రాష్ట్రపతికి ఒక లేఖ రాయనున్నట్టు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక బీజేపీలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డితో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మరో లేఖ రాస్తామని శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఇలా ఎమ్మెల్యేలు పార్టీలవారీగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నా వాటన్నింట్లోనూ ఒకే విషయాన్ని ప్రస్తావిస్తామని వారంటున్నారు. బిల్లుపై చర్చకు సంబంధించి మూడు ప్రధానాంశాలను రాష్ట్రపతికి రాసే లేఖలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర శాసనసభలోనే విభజన బిల్లు చర్చకు వస్తే కేవలం పది గంటల పాటు మాత్రమే చర్చించి కేంద్రానికి తిప్పి పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే 20 గంటలకు పైగా చర్చ సాగింది. శాసనసభ్యులందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను సవరణల రూపంలో ఇప్పటికే స్పీకర్కు అందజేశారు. తొమ్మిది వేలకు పైగా సవరణలు తనకందాయంటూ స్పీకర్నే సభలో ప్రకటించారు’’ అని ప్రస్తావిస్తున్నారు. కిరణ్ లేఖపై పెదవి విరుపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సభా నాయకుడిగా ఉంటూ, గడువు పెంచాలని కోరుతూ ఎవరికీ చెప్పకుండా రాష్ట్రపతికి అత్యంత రహస్యంగా లేఖ రాయడంపై ఆయన సన్నిహిత మంత్రుల్లో కూడా విస్మయం వ్యక్తమైంది. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో సభకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎం లేఖ రాయడమేమిటని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతికి లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందో అర్థం కావడం లేదని కిరణ్ సన్నిహిత మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. -
సీమాంధ్ర నేతల వైఖరితోనే సంజీవ్ ఆత్మహత్య
గాంధారి, న్యూస్లైన్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర నేతలు, ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వైఖరితోనే సర్వాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సంజీవ్ ఆత్మ బలిదానం చేశారని జేఏసీ జిల్లా కన్వీనర్ గోపాల్శర్మ, అధికార ప్రతినిధి ప్రభాకర్, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆరోపించారు. గురువారం వారు సర్వాపూర్ గ్రామాన్ని సందర్శించి సంజీవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటలలో దహనం చేయడంతో సంజీవ్ తీవ్ర మనస్తాపం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయి భార్య అరుణ, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకొని తల్లి దండ్రులు దిక్కులేని వారయ్యారన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, కుటుంబానికి రెండకరాల భూమి, మృతుడి సోదరునికి వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద అశోక్బాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడిపై ఫిర్యాదు ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు రెచ్చగొట్టే మాటలకు తోడు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసి 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చినందుకే సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని గాంధారి ఠాణాలో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. అశోక్బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నాయకులు సంతోష్, కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం
బెల్లంపల్లిరూరల్, న్యూస్లైన్: విభజన ముసాయిదా బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేయడాన్ని నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ బిల్లు ప్రతులను దహనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతిని అవమానించడమేనని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్రులు మానుకుని ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ జిల్లాల్లో నివసిస్తున్న సీమాంధ్రులను తెలంగాణ పొలిమేర వరకు తరిమికొడతామని హెచ్చరించారు. అంతకుముందు పాతబస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి నరసింగరావు, కొండబత్తిని రాంమోహన్, పోతరాజు నారాయణ, చంద్రశేఖర్, శ్రీనివాస్, మల్లేశ్, రాజన్న పాల్గొన్నారు. అశోక్బాబు దిష్టిబొమ్మ ద హనం ఏదులాపురం : తెలంగాణ బిల్లు ప్రతుల దహనాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు దిష్టిబొమ్మను టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సోమవారం జేఏసీ దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా నాయకుడు జంగిలి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రతులు చించివేయడం రాజ్యాంగ విరుద్ధమని, అశోక్బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర అవకాశవాదులు ఎన్నికుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని అన్నారు. అశోక్బాబు ఉద్యోగిగా వ్యవహరించాలని కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బండారి సతీశ్, గోలి శంకర్, ఎర్రం నర్సింగ్రావు, శ్రీపతి శ్రీనివాస్, తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బాల శంకర్కృష్ణ పాల్గొన్నారు. -
బిల్లు దహనం.. రాజ్యాంగ ఉల్లంఘనే
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం వారిని అరెస్టు చేయాలి: హరీష్రావు దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్గౌడ్ రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్కుమార్ విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్ న్యూస్లైన్ నెట్వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్కుమార్, టీఆర్ఎల్డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
బిల్లుపై సహకారానికి టీడీపీ డొంకతిరుగుడు సమర్థన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ గందరగోళ పరిస్తే..ఇప్పుడు అదే కోవలో ఆ పార్టీ సీమాంధ్ర నేతలూ చేరారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చను కొన్ని రోజులు జరపడానికి వీలులేదని పట్టుపట్టిన టీడీపీ సీమాంధ్ర నేతలు రాత్రికి రాత్రే నిర్ణయం మార్చుకుని చర్చకు సహకరించడానికి కారణాలేమిటన్న దానిపై ఆ పార్టీ నేతలు పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. టీ బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేస్తే ప్రయోజనం కానీ ఇప్పుడు చేసి లాభమేమిటని ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. తమ మెడ మీద డెడ్ లైన్ అనే కత్తి వేలాడుతోంది కాబట్టే బిల్లుపై చర్చకు సహకరిస్తున్నామని మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా వైఎస్సార్సీపీతో పాటు జగన్మోహన్రెడ్డిని గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రత్యేక వ్యూహం లేదన్న డొల్లతనం తేటతెల్లమవుతోందని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
సీమాంధ్రుల పాలనలో నష్టపోయింది మనమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీమాంధ్ర నాయకుల పాలనలో అత్యధికంగా నష్టపోయింది జిల్లా ప్రజలేనని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. గురువారం నగరంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, నాయకుడు పి.పురుషోత్తంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన రాగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు వైఖరి మార్చాయని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్నారు. గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు కనిపించలేదే : స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరిట ఇప్పుడు కొందరు యాత్రలు చేపట్టడంపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక్క రోజు కూడా కనిపించని నేతలు.. ఇప్పుడు తామే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటూ యాత్రలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ పదమూడేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి, ప్రాణాలను లెక్కచేయకుండా అమరణ దీక్ష చేసినందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 17 నుంచి పాదయాత్ర: నాగేందర్ గౌడ్ తెలంగాణ సాధనలో భాగంగా ఈ నెల 17నుంచి నాలుగు రోజులపాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్ వెల్లడించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల నుంచి రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అబ్దుల్ ముకిత్ చాంద్కు నియామక పత్రం అందజేశారు. -
ఓటింగ్ లేకుండా చర్చ ఎలా సాధ్యం?
టీ-నేతల అభ్యంతరంపై సీమాంధ్ర మంత్రుల ధ్వజం ఓటింగ్ హక్కు ఉంటుందని సీఎం, స్పీకర్ చెప్తేనే చర్చకు సిద్ధమయ్యాం అందుకు మీరూ అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటూ మోకాలడ్డితే ఎలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు ప్రతిపాదిత సవరణలపై ఓటింగ్ను అంగీకరించబోమంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడాన్ని సీమాంధ్ర నేతలు తప్పుపట్టారు. విభజనపై చర్చ జరగాలని, ఎవరెన్ని అభిప్రాయా లు చెప్పుకున్నా, సవరణలను ప్రతిపాదించినా అభ్యంతరం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని సీమాంధ్ర మంత్రులు ప్రశ్నించారు. విభజనకు తాము వ్యతిరేకమైనప్పటికీ సవరణల పేరుతో ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని సీఎం కిరణ్కుమార్రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినందనే తాము చర్చకు సిద్ధమయ్యామని మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. సవరణలపై ఓటింగ్ పేరుతో విభజన బిల్లును వ్యతిరేకించవచ్చన్నదే తమ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ మినహా సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల సభ్యులంతా ఇదే అభిప్రాయంతో చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ నేతలు సవరణలే వద్దంటూ మోకాలడ్డితే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ నేతల తీరు చూస్తుంటే సభలో చర్చ జరగకూడదనే భావనతో ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. చర్చ జరిగితే సభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని తేలిపోతుం దని, తద్వారా రాష్ట్రపతి విభజన బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో పునరాలోచించే అవకాశముందని తెలిసే చర్చకు అడ్డుపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. మరోవైపు సీఎం కిరణ్ సైతం మంగళవారం తన చాంబర్లో కొందరు సీమాంధ్ర మంత్రులతో మాట్లాడుతూ అందరూ చర్చకు సహకరించాలని కోరినట్లు తెలిసిం ది. చర్చ కొనసాగితే విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంతో పాటు బిల్లులోని అంశాలపై పలు సవరణలను ప్రతిపాదించి ఓటింగ్ కోరదామని ప్రతిపాదించారు. విభజనపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, సవరణలు, ఓటింగ్ వద్దని చెప్తున్న తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పంది స్తూ.. ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయమంటే అర్థమేమిటి? వాటిని ఏ రూపంలో తీసుకుంటారు? ఓటింగ్ ద్వారానే కదా! అదే వద్దంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడిన అనంతరం సీఎం వెళుతూ వెళుతూ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం చర్చకు నూటికి నూరుశాతం సిద్ధంగా ఉన్నాం. ఇకపై ప్రతి నిమిషాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్చకు అంగీకరించి శాసనసభ స్పీకర్కు పూర్తిగా సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. -
సమగ్రంగా లేని బిల్లుపై ఎలా చర్చిస్తాం?
స్పీకర్తో టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: సమగ్రసమాచారం లేని విభజన బిల్లుపై సభలో ఎలా చర్చిస్తామంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ మనోహర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పి.అశోక్ గజపతిరాజు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కేఈ ప్రభాకర్ తదితరులు ఆయన్ను కలిశారు. తాము రూపొందించిన బిల్లు అసమగ్రంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలతో మరో బిల్లు పంపుతామని కేంద్రం రాష్ట్ర సీఎస్కు సమాచారమిచ్చినట్లు వార్తలొచ్చాయని, అందు వల్ల బిల్లును వెనక్కు పంపాలని కోరారు. ఒకవేళ చర్చకు చేపడితే సమగ్రత లోపంపై రూలింగ్ కోరతామన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని స్పీకర్ చెప్పారు. కాగా కేంద్రం రూపొందించిన బిల్లుకు సవరణలు చేసే అధికారం సీఎంకు లేదని, తాను సమైక్యవాదినని చెప్పుకునేందుకు సవరణల పేరిట సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్.ప్రకాశ్రెడ్డి, రేవంత్రెడ్డి తదితరులు స్పీకర్కు లేఖ రాశారు. టీఆర్ ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలూ ఇదే విషయమై స్పీకర్కు లేఖలు రాశారు. -
'బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాలు చెప్పాలి'
హైదరాబాద్: అసెంబ్లీలో బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాల్ని చెప్పాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాల్ని తప్పక తెలియజేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి నివాసంలో సీమాంధ్రకు చెందిన కొంతమంది నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గాదె వెంకట రెడ్డి, వట్టి వసంత కుమార్, వీరశివారెడ్డిలు హాజరైయ్యారు.ఈ నెల 10వ తేదీలోగా బిల్లులోని తరగతుల వారీగా సవరణలు ఇవ్వాలని స్పీకర్ కోరిన విషయాన్ని సీమాంధ్ర నేతలు తెలిపారు. టీ.బిల్లుపై చర్చను బహిష్కరిస్తే నష్టపోయే అవకాశం ఉందన్నారు. బిల్లును తిప్పి పంపించడమంటే బిల్లును ఆమోదించినట్లేనని వారు తెలిపారు. క్లాజుల వారీగా చర్చిస్తే ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందన్నారు. బిల్లుపై సవరణలు ఆమోదించలా?లేదా?అనేది రాష్ట్రపతి, పార్లమెంట్ నిర్ణయమన్నారు. -
‘తెలంగాణ’ ఖాయం
జహీరాబాద్, న్యూస్లైన్: సీమాంధ్ర నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ సి.విఠల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పల్లెసీమల పునర్నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ఆదివారం జహీరాబాద్లో రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భారత్ సందేశ్ సమితి’ ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. విధ్వంసం లేని అభివృద్ధినే ప్రజలు కోరుకుంటారని, కాని ప్రస్తుతం విధ్వంసాలతో కూడుకున్న అభివృద్ధియే కనపడుతోంద న్నారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో సెజ్ల ప్రతిపాదన ముందుకు వస్తోందన్నారు. దీంతో వ్యవసాయ రంగం విధ్వంసానికి దారి తీస్తోందన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో హైటెక్సిటీ ఏర్పాటు వల్ల ఎందరో భూములను కోల్పోయారన్నారు. ఇది రైతులకు ఏ మాత్రం లాభం చేకూర్చక పోగా, బడా బాబులకే లబ్ధి చేకూరిందన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంతానికి కూడా పరిశ్రమలు రాబోతున్నాయని, దీంతో సెజ్లు వచ్చి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిని, వ్యవసాయరంగాన్ని దెబ్బతీయకుండా జరిగే అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్నారు. ఎక్కడి వారికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం మూలంగానే అన్నా హజారే, కేజ్రీవాల్లాంటి వారు పుట్టుకువస్తున్నారన్నారు. నేటి యువతే భవిష్యత్తు నిర్దేశకులన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం భారత్ సందేశ్ సమితి ఏర్పాటు చేసి జహీరాబాద్ నియోజకవర్గాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కొత్త ఏడాదిలో అనేక పెనుమార్పులు: బోయినిపల్లి హన్మంత్రావు ఈ ఏడాది దేశ రాజకీయాలలో అనేక పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయని భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వేదిక అధ్యక్షుడు బోయినిపల్లి హన్మంత్రావు అన్నారు. చరిత్ర మలుపు యువత చేతుల్లో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం చారిత్రక సంఘటనలు జరగే అవకాశం లేకపోలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంస్థ తరఫున అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ప్రొఫెసర్లు తిరుమలి, మల్లేష్, సంఘ సేవకుడు పండిత్ సుదర్శన్ స్వామి, టీ జేఏసీ నాయకులు శ్యాం, రఘురంజన్, రాంచందర్ భీంవంశీ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జనార్ధన్, రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్, భారత్ సందేశ్ సమితి నాయకులు సి.అంజి, కుత్బుద్దీన్, ప్రశాంత్, రవీందర్రెడ్డి, మహేష్వర్ధన్రెడ్డి, జి.అమిత్కుమార్, రాములునేత, శంకర్, శ్రీనివాస్, వేణు పవార్, పాండు రాథోడ్, ప్రేమ్సింగ్, తారానాయక్లు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే
టీ బిల్లుపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ముగిసిన సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని పలువురు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు స్పష్టంచేశారు. చర్చ జరగకుండా కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావులు ఇందిరాపార్కు ధర్నా చౌక్లో చేపట్టిన సంకల్ప దీక్ష శనివారం ముగిసింది. ఈ దీక్షలను విరమింపజేసేందుకు సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంకల్ప దీక్ష చేస్తున్న ఎంపీలకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తామంతా రాష్ట్రం కలిసి ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకు స్ఫూర్తినిచ్చినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు అశోక్బాబు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా అదే పని చేయాలని సూచించారు. అయితే సంకల్ప దీక్ష పేరుతో రెండు రోజుల పాటు దీక్ష చేపట్టిన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షగోపాల్, సబ్బం హరిలు అసలు ప్రసంగించకపోవడం విశేషం. కాగా, సంకల్పదీక్షకు రెండోరోజు శనివారంకూడా తెలంగాణవాదులనుంచి నిరసన ఎదురైంది. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి సంకల్ప దీక్ష జరిగే ధర్నా చౌక్ వైపుకు దూసుకెళ్లేందుకు కొందరు తెలంగాణవాదులు ప్రయత్నించారు. అలాగే దీక్ష విరమణకోసం ఎంపీ హర్షకుమార్కు శైలజానాధ్ నిమ్మరసం ఇచ్చిన సమయంలో నలుగురు తెలంగాణవాదులు వేదిక ముందునుంచి ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ హడావుడిలో హర్షకుమార్తోపాటు మిగతా ఎంపీలు కూడా నిమ్మరసం తాగకుండానే దీక్ష ముగించారు. -
మా అసెంబ్లీలో మీ పెత్తనం ఏంది?
తెలంగాణ గడ్డపై ఉన్న అసెంబ్లీలో సీమాంధ్ర నేతల పెత్తనం ఏందని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. అల్పసంఖ్యాకులైన తెలంగాణపై సీమాంధ్ర పెత్తందారుల పెత్తనం చెలాయిస్తున్నారని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసెంబ్లీలో టీ ముసాయిదాపై చర్చ జరగకుండా సీమాంధ్ర సీఎం, చంద్రబాబులు అడ్డుకుంటున్నార ని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ వరకు బిల్లుపై చర్చ జరగాలని, లేకుంటే 7వ తేదీ లక్షలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చలో అసెంబ్లీని విజ యవంతం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజక వర్గాలకు ఇన్చార్జీలను నియమించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏజెండాతో పార్టీలకతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. 7న నిర్వహించే చలో అసెంబ్లీకి జిల్లానుంచి వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని కోరా రు. అనంతరం టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోలేరన్నా రు. అనంతరం చలో అసెంబ్లీ పోస్టర్ను విడుదలచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్రెడ్డి, టీఎస్జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహీం, శ్యాంప్రసాద్, మై నర్బాబు, రామకృష్ణ ముదిరాజ్, సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర నేతలకు ప్రజలు పట్టరా?: ఎంపీ వివేక్
హైదరాబాద్: సీమాంధ్ర నేతలకు స్వప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీమాంధ్ర అభివృద్ధికోసం 1.50 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోకుండా, అభివృద్ధి గురించి చర్చించకుండా ఆ ప్రాంత నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని తెలిసినా ఇంకా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఓటింగుకోసం పట్టుబట్టే కుట్రలకు దిగుతున్నారని అన్నారు. ‘మాది మాగ్గావాలెనని తెలంగాణ కొట్లాడుతున్నది. మాది మాగ్గావావాలె, మీది కూడా మాకే కావాలెనని సీమాంధ్ర నేతలు కొట్లాడుతున్నరు, ఇదెక్కడి న్యాయం’ అని వివేక్ ప్రశ్నించారు. -
ప్రణబ్ ముందు ఉభయ వాదాలు
రాష్ట్రపతిని పోటాపోటీగా కలుస్తున్న నేతలు సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ను కలిసేందుకు కాంగ్రెస్కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో అనేక లోపాలున్నాయుని, సీవూంధ్రకు తీరని అన్యాయుం జరగనున్నదని, దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రణబ్ను కోరాలని సీవూంధ్ర నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అపారుుంట్మెంట్ కోరావుని, ఆయున్నుంచి స్పందన రాగానే కలుస్తావుని చెబుతున్నారు. వుంత్రి కాసు కృష్ణారెడ్డి ఇప్పటికే రాష్ట్రపతిని కలసి రాష్ట్ర సమైక్యతకోసం వినతిపత్రం అందించారు. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు విభజన బిల్లుపై రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా అసెంబ్లీలో చర్చ కొనసాగకుండా సీవూంధ్ర నేతలు కావాలనే జాప్యం చేస్తున్నారంటూ ఆయన దృష్టికి తేవాలని నిర్ణరుుంచారు. ‘‘చర్చను ఆలస్యం చేసి చివర్లో వురింత గడువు కోరాలని, తద్వారా పార్లమెంటులో టీ-బిల్లు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి చర్చకు అదనపు గడువు ఇవ్వరాదు’’ అని విన్నవించనున్నారు. శుక్రవారం రాష్ట్రపతిని కలసిన వుంత్రులు దానం నాగేందర్, వుుకేశ్గౌడ్ ఇదే అంశాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతిని ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా కలిశారు. మరోవైపు వుంత్రి కె.జానారెడ్డి గవర్నర్ నరసింహన్ను కలిశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన టీఆర్ఎస్: ముసాయిదా బిల్లుపై శాసనసభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతిని కలిసి వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. అసెంబ్లీలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అంశాలను రాష్ట్రపతికి తెలియజేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. నేడు ప్రణబ్ను కలవనున్న సీమాంధ్ర టీడీపీ నేతలు: సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం సాయంత్రం ప్రణబ్ను కలవనున్నారు. అసెంబ్లీకి వచ్చిన రాష్ట్ర విభజన బిల్లులో పలు లోపాలున్నందున వెంటనే వెనక్కు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
సీమాంధ్రుల కుట్రను రాష్ర్టపతికి నివేదిస్తాం: హరీష్
జహీరాబాద్,న్యూస్లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి రాత పూర్వకంగా నివేదిస్తామని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్రావు వెల్లడించారు. శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలమంతా శనివారం రాష్ట్రపతిని కలిసి సీమాంధ్ర నేతల వ్యవహార శైలిని వివరిస్తామని తెలిపారు. స్పీకర్ను బ్లాక్ మెయిల్ చేస్తూ తెలంగాణ విషయమై చర్చ ప్రారంభించలేద ని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అఖరి బంతి మిగిలే ఉందని సీఎం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప విభజనను ఏ మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ముఖ్యమంత్రితో కుమ్కక్కయ్యారని విమర్శించారు. -
సీఎంతో సీమాంధ్ర నేతల మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో జోక్యం కోరుతూ ప్రధాని మన్మోహన్ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సీఎం కిరణ్కుమార్రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని ఏపీభవన్కు చేరుకున్న ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్కుమార్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథిలు సమావేశమయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన నేతలు రాష్ట్ర విభజన అంశంపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ మొదలైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా బిల్లులోని లోటుపాట్లను కేంద్రం దృష్టికి తెస్తూనే, విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ్యులందరితో రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని నేతలంతా అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తే, రాష్ట్రపతి.. విభజనకు ఆమోదం తెలపడం అంత సులభతరం కాదని, పార్లమెంట్లోనూ తాము ఈ అంశాన్ని నొక్కిచెబుతూ సమైక్యాంధ్రకు వివిధ పార్టీల మద్దతు కూడగడతామని ఎంపీలు చెప్పినట్టు తెలిసింది. -
పక్కా ప్లానేశారు..
అసెంబ్లీకి వస్తున్నా.. జనవరిలో చర్చ జరిగేలా చూస్తానన్న ముఖ్యమంత్రి వచ్చిన తరువాత బిల్లుపై చర్చ కొనసాగింపునకు అంగీకారం అడ్డుకోవద్దని సీమాంధ్ర సభ్యులకు హితవు ఓటింగ్ అంటూ మరోసారీ అదే వాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక సమయంలో అనారోగ్యం కారణంతో సభకు రాని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంగళవారం శాసనసభకు హాజరై బిల్లుపై చర్చకు పచ్చజెండా ఊపారు. ఆయన సభకు రావడం ద్వారా విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఏదో అయిపోతుందనుకున్న సీమాంధ్ర నేతలు సీఎం చర్చను కొనసాగించడానికి అంగీకరించడంతో ఉస్సూరన్నారు. సోమవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సభకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసెంబ్లీని తమ అధీనంలోకి తెచ్చుకున్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఇతర తెలంగాణ నేతలు విభజన బిల్లుపై చర్చను ప్రారంభించినంత పని చేశారు. బీఏసీలో నిర్ణయించకుండా బిల్లుపై చర్చ ప్రారంభం కాదని, అది నిబంధనలకు విరుద్ధమని సీమాంధ్ర మంత్రులు చెప్పారు. ఆ మంత్రులతో భేటీ సందర్భంగా సీఎం కిరణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం బీఏసీ సమావేశానికి వచ్చి చర్చ తేదీని నిర్ణయిస్తామని, జనవరిలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమయ్యేలా చేస్తామని వారితో చెప్పారు. కానీ మంగళవారం అసెంబ్లీకి హాజరైన సీఎం విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరించారు. బీఏసీ సమావేశంలో బిల్లుపై చర్చకు కొత్త తేదీని నిర్ణయిస్తామని చెప్పిన ఆయన సోమవారమే చర్చ ప్రారంభ మైందన్న తెలంగాణ నేతల వాదనకు తలూపారు. పైగా ఆ చర్చను బుధవారం నుంచి కొనసాగించేలా మార్గం సుగమం చేశారు. సభలో మాదిరిగానే బీఏసీ సమావేశంలో కూడా సీఎం విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా ‘దీనిపై పూర్తి చర్చ జరగాలి. అన్ని పార్టీల సభ్యులు అంశాలవారీగా మాట్లాడాలి. సీమాంధ్ర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వారంతా తమ అభిప్రాయాలు చెబుతారు. తెలంగాణనేతలు కూడా వారి అభిప్రాయాలు చెబుతారు. చర్చ స్వేచ్ఛతో సాగుతుంది’ అన్నారు. బీఏసీ సమావేశంలో బిల్లులోని లోపాల గురించి సీఎం ఎత్తిచూపిస్తారని భావించిన నేతలు ఆయన మాట తీరుతో విస్తుపోయారు. సీఎం అలా మాట్లాడటంతో సీమాంధ్ర మంత్రులు సైతం మౌనం వహించారు. అంశాలపై చర్చ సందర్భంలో ఓటింగ్ అడిగేందుకు అవకాశముందని ముఖ్యమంత్రి పేర్కొన్నా.. ఇతర రాష్ట్రాల్లో విభజన ప్రక్రియ ఎలా సాగిందో ఆ నియమాలు, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో హోం శాఖ కార్యదర్శి ఇచ్చిన నోట్ గురించి సీఎం చెప్పిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుతోపాటు రాష్ట్రపతి చేసిన సూచనలను అనుసరించే సభలో చర్చ సాగుతుంది తప్పించి వేరేగా హోం శాఖ ఇచ్చే లేఖలు పరిగణనలోకి రావని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నేతలకు సీఎం హామీ ఇదిలా ఉండగా సీఎం కిరణ్కుమార్రెడ్డిని తెలంగాణ నేతలు మంగళవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలిశారు. విభజన బిల్లుపై చర్చ అంతా నిబంధనల ప్రకారమే సాగుతుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సీఎంను కలసి బిల్లుపై చర్చ కొనసాగించేలా చూడాలని, దాన్ని త్వరితంగా పూర్తిచేసి కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రిని కోరారు. తాను విభజన బిల్లును అడ్డుకోబోనని, ఆ విభజన వల్ల తలెత్తే సమస్యలపై సభలో అన్ని పార్టీల సభ్యులూ కూలంకషంగా చర్చించాల్సిన అవసరముందని సీఎం వారికి చెప్పారు. సీఎం చాలా సానుకూలంగా స్పందించారని ఆయన్ను కలసి వచ్చిన మంత్రులు పేర్కొన్నారు. -
కుట్రలపై అప్రమత్తం
సీమాంధ్రులు రాష్ట్రపతి సంతకం చేసే సమయంలో పెన్నులెత్తుకెళ్తారేమో: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఎద్దేవా వరంగల్, న్యూస్లైన్: తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు పన్నుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని టీ-జేఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. వరంగల్లో విశ్రాంత టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే సందర్బంగా ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మేధావుల పాత్ర’ అంశంపై మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో మేధావులు ప్రజలకు రక్షణగా నిలవాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రపతి సంతకం పెట్టే సమయంలో సీమాంధ్ర నేతలు పెన్ను ఎత్తుకెళ్లే నాటకం ఆడుతారేమోనని ఎద్దేవా చేశారు. బాబు తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు ఎవరినడిగి రాష్ట్రం ఇచ్చారని చెప్పడం విడ్డూరమన్నారు. -
సీమాంధ్ర నేతల కదలికలపై నిఘా
రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. బిల్లు అసెంబ్లీలోచర్చకు రానుండటంతో సమైక్యవాదులు, సీమాంధ్ర నాయకులు, ఏపీఎన్జీవోల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నిఘా అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అంతేగాక సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నివాసాల వద్ద నిఘాను పెంచారు. విభజన బిల్లు వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్బాబు హెచ్చరించిన నేపథ్యంలో.. ఆ సంఘం నాయకుల కదలికలపైనా కన్నేసి ఉంచాలని అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, సీమాంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన మార్గాలపై భారీ సంఖ్యలో సాయుధ పోలీసులను మోహరించారు. తెలంగాణ వాదులు ఒక పక్క, సమైక్య వాదులు మరోపక్క హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇరు ప్రాంతాల నేతల ఇళ్లు, ఆయా పార్టీల కార్యాలయాల వద్ద కూడా నిఘాను విస్తృతం చేయాలని ఆ విభాగం చీఫ్ అధికారులకు అంతర్గత ఆదేశాలను జారీ చేశారు. -
హైదరాబాద్లో జోరుగా విభజన రాజకీయాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ముందుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రాకతో రాజకీయ వేడి పెరిగింది. విభజన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చీ రాగానే సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిశారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇదే డిమాండ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా విభజన బిల్లును అడ్డుకునే విషయంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. -
మీ ప్రాంతం.. మీ ఇష్టం: చంద్రబాబు
ఎవరి వాదన వారు వినిపించుకోండి విభజనపై చేతులెత్తేసిన చంద్రబాబు అడ్డుకొంటామన్న సీమాంధ్ర నేతలు లేఖకు కట్టుబడి ఉండాలన్న టీ టీడీపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఇరు ప్రాంతాల నేతలకు సూచించారు. అంతేగానీ పార్టీని ఇరుకున పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. దీంతో ఇరుప్రాంతాల నేతలూ అధినేత తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు నివాసంలో బుధవారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశమైంది. తెలంగాణ, సీమాంధ్ర నేతలు తమ వాదనలతో పరోక్షంగా బాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనపై స్పష్టమైన విధానం, వైఖరి లేకపోవడంతో టీడీపీ ఇరు ప్రాంతాల్లో రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ఆ నేతలు అభిప్రాయపడ్డారు. ‘పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్న భావన కలగడంలేదు. అలాగని సమైక్యాంధ్ర కోసం మాట్లాడుతున్నామా అంటే అదీ లేదు. ఇలాగైతే ప్రజల్లోకి ఎలా వెళ్తాం?’ అని వారు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు ముందు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతోంది కనుక మేమూ సమైక్య వాదన వినిపిస్తాం. అసెంబ్లీలో మిగిలిన పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండా సభను అడ్డుకుని, వెల్లోకి వెళ్తాం’ అని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించగా, ఎర్రబెల్లి, మోత్కుపల్లి అభ్యంతరం తెలిపారు. అయినా సభను అడ్డుకుని తీరతామని సీమాంధ్ర నేతలు తెగేసి చెప్పారు. దీంతో తాము తమ వాదన వినిపిస్తామని తెలంగాణ నేతలు అన్నారు.బాబు జోక్యం చేసుకుని.. పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందిపెట్టవద్దని ఇరుప్రాంత నేతలకు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 2008లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా పార్టీకి అనుకున్నంత ప్రయోజనం చేకూర్చలేకపోయారన్నారు. దీనికి ఎర్రబెల్లి అడ్డుతగిలి.. ఆ నిర్ణయం తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుని ఇప్పుడిలా మాట్లాడం సరికాదని అన్నట్లు సమాచారం. కాగా, పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసుపై పార్టీ సీమాంధ్ర ఎంపీలు మాత్రమే సంతకాలు చేయడమేంటని, పార్లమెంటరీపక్ష నాయకుడు ఏమయ్యాడని మరికొందరు నేతలు ప్రశ్నించారు. -
ఎన్నికల వరకు ఆగితే.. తర్వాత తెలంగాణ రాదు: టీజీ, ఏరాసు
యూపీఏ ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానానికి చాలామంది ఎంపీల మద్దతు ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కానీ... యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను అనైతికం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు, రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్ర విభజన ఆగితే చాలని, ఆ తర్వాత తెలంగాణ రానే రాదని రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు తాము స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నామని వారు అన్నారు. -
ఇలాంటి నాయకులు ఉండటం మా దురదృష్టం
-
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర మంత్రులు
-
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామాలు అంటూ హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై కొత్త నాటకానికి తెర తీశారు. ప్రధానమంత్రిని కలిసి గతంలో ఇచ్చిన రాజీనామాలు ఆమోదించాలని మాత్రం కోరాలని నలుగురు కేంద్రమంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేంద్ర మంత్రులు మాత్రం రాజీనామాలపై నోరు మెదపటం లేదు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేవరకూ రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర ఎంపీలు కొత్త పల్లవి అందుకున్నారు. కాగా కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో నిన్న సమావేశమైన మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం నిరాకరించటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నలుగురు మంత్రులు గతంలో తమ రాజీనామా లేఖలను ప్రధాని మన్మోహన్ సింగ్కు అందజేయటం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ఈ మంత్రుల రాజీనామాలను ఇంతవరకు తిరస్కరించలేదు. అవి ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా తమ రాజీనామాలను మన్మోహన్కు అందజేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నేరుగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాజీనామా పత్రాలను ఆందజేసి ఆమోదింపజేసుకోవాలని సీమాంధ్ర మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సీమాంధ్ర నేతల ఇళ్లకు తాళాలు
-
సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారు
ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం హైదరాబాద్, న్యూస్లైన్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ఎంతకైనా తెగబడతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావ సభ ఆదివారం ఇక్కడ జరిగింది. దీనికి ఎంపీ కోమటిరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి హాజరయ్యారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించామని తెలిపారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల బడ్జెట్ని దోపిడీకి అవకాశం ఉండే రంగాలకు కేటాయిస్తోందని దుయ్యబట్టారు -
విభజనకు సైఅన్న సీమాంద్ర కేంద్ర మంత్రులు
-
బలవంతపు కాపురం కుదరదు: సురవరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును అడ్డుకోవాలనుకోవడం తగదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సీమాంధ్ర నేతలకు సూచించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విభజన ప్రక్రియ జరిగాక కలిసి ఉండడం అసాధ్యమని, బలవంతపు కాపురం కుదరదని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రావచ్చని అభిప్రాయపడ్డారు. పంట నష్టాలపై అఖిల పక్షం: సీఎంకు నారాయణ లేఖ తుపాన్లు, వర్షాలతో జరిగిన పంటనష్టాలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. -
భద్రాచలం ప్రజలు ఒంటరి కాదు: దేవీప్రసాద్
భద్రాచలం, న్యూస్లైన్ : తెలంగాణలోనే ఉంటామని పోరాడుతున్న భద్రాచలం ప్రాంత ప్రజలు ఒంటరి కాదని, వారి వెనుక నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాసులు ఉన్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. డివిజన్ టీఎన్జీవో ఆధ్వర్యంలో భద్రాచలంలోని తానీషా కల్యాణమండంపం ఆవరణలో సోమవారం రాత్రి జరిగిన ఉద్యోగ గ ర్జన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. మూడు తరాల పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతోందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాట తప్పే నాయకులను భూస్థాపితం చేయాలన్నారు. విభజనతో సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్నారు. సీమాంధ్రకు చెందిన సుమారు 1.40 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారని, వీరంతా వెళ్లిపోతే జిల్లాకు చెందిన పది వేల మంది తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ కొలువులు వస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు ప్యాకేజీల కోసం ఒత్తిడి చేస్తున్నారని, అసలు వారికెందుకు ప్యాకేజీలు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇంత కాలం నదీ జలాలు, సహజ వనరులుదోపిడీ చేసినందుకు తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలోని నదీ జలాలను, ఉద్యోగాలను దోచుకున్నది సరిపోక, ప్యాకేజీలంటూ గోలచేయటం సిగ్గుచేటన్నారు. కొత్త రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. 1/70, జీవో నంబర్ 3, అలాగే జీవో నంబర్ 68 ఇలా అన్ని రకాల గిరిజన చట్టాలు వారి అభివృద్ధి కోసం పకడ్బందీగా అమలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. రిజర్వేషన్ల అమలులో నూరు శాతం అమలయ్యేలా కొత్త ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. భద్రాచలం ప్రాంత ప్రజల నుంచి నేర్చు కోవాల్సింది ఎంతో ఉందన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత వాసులు ముక్కు సూటిగా నేతలను ప్రశ్నించటం, ఇక్కడ జర్నలిస్టులు 72 గంటల పాటు బంద్ చేయటం అభినందనీయమన్నారు. భద్రాచలం డివిజన్ జేఏసీ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీజేఏసీ రాష్ట్ర నాయకులు కె రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, రేచల్, గుంటుపల్లి వేణుగోపాలరెడ్డి డివిజన్ గెజిటడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె సీతారాములు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్కే గౌసుద్ధీన్, ఆవుల సుబ్బారావు, వెక్కిరాల, ఈశ్వర్,సోమశేఖర్, నలజాల శ్రీనివాస్, రేగలగడ్డ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిన్న గ్రామాన్ని కూడా వదులుకోం: కోదండరాం
బొంరాస్పేట, న్యూస్లైన్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలని, ఈ ప్రాంతంలో చిన్న గ్రామాన్ని కూడా వదులుకునే ప్రసక్తేలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఇన్నేళ్ల పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు తుది దశకు వచ్చిందని నమ్ముతుండగా సీమాంధ్ర నేతలు, కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే మలివిడత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా బొంరాస్పేటలోని ఉపాధ్యాయ శిక్షణ సమావేశం, కోస్గిలో జరిగిన విద్యార్థి గ ర్జనలో కోదండరాం మాట్లాడారు. సీమాంధ్ర నేతలు భద్రాచలం, కృష్ణా, తదితర అంశాలతో దింపుడుకళ్లం ఆలోచనలు మానుకోవాలన్నారు. ముక్కలైన తర్వాత బలవంతంగా కలుపుతామనుకోవడం సీమాంధ్ర నేతల మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చివరివరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సామాన్య ప్రజలను సైతం పాల్గొనేలా స్ఫూర్తినిచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్ర అమోఘమని టీజేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ నిర్మాణంలో విద్య, తదితర రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. -
యూటీ ప్రతిపాదన తగదు
కందుకూరు, న్యూస్లైన్: హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఆమోదించడం తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి నిదర్శనమని, సీమాంధ్ర నేతలు యూటీ చేయాలనడం అర్థరహితమని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే సమయంలో హైదరాబాద్ను యూటీ చేయాలని, భద్రాచలం మాదేనంటూ సీమాంధ్ర నేతలు కుటిల రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. జీఓఎంకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేవలం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉందని, సీమాంధ్రలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరీవాహక ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని ఈ ప్రాంత ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు సమస్యలు సృష్టించకుండా భౌతికంగా విడిపోయి మానసికంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు సురేందర్రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఈశ్వర్గౌడ్, ఇజ్రాయిల్, కృష్ణనాయక్, మహేష్గౌడ్, చిర్ర సాయిలు, రాణాప్రతాప్రెడ్డి, దశరథ, బాబురావు, శోభ, లత, కరుణాకర్రెడ్డి, సమీర్, ఎస్.పాండు, హామీద్, దేవేందర్, కె.పాండు, దర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
భద్రాచలం జోలికి వస్తే సహించం : ఏబీవీపీ
జవహర్నగర్ :భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణనుంచి విడదీయరాదని, ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా సహించేది లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జవహర్నగర్లో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి జోగారామ్ మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతవాసుల అభీష్టం మేరకు డివిజన్ను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల కుట్రల నుంచి భద్రాచలాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్ చేతకాకపోతే బీజేపీ అయినా తెలంగాణ ఇస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ సికింద్రాబాద్ జోనల్ ఇన్చార్జి రాంబాబు, జవహర్నగర్ అధ్యక్షుడు గోపాల్, వీహెచ్పీ నాయకులు సంతోష్, యోగి, రవీందర్ గౌడ్, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ, సీమాంధ్ర నేతల సమావేశాలు
-
విభజన పై చివరి దశకు చేరిన కసరత్తు
-
డబుల్ గేమ్ వికటిస్తుందని భయపడుతున్న కాంగ్రెస్
-
తిరుపతిని తెలంగాణలో కలుపుతారా?: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలోని తిరుపతి పట్టణాన్ని తెలంగాణలో కలపాలని కోరితే సీమాంధ్ర నేతలు అంగీకరిస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించడం అసంబద్ధమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీరాముడు లేని తెలంగాణను తాము ఊహించుకోలేమన్నారు. యూటీ అంటే అంతర్యుద్ధమే: నిరంజన్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదనను నగరంలో నివసించే ప్రజలెవరూ ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం ప్రతినిధి జి.నిరంజన్ చెప్పారు. కేంద్రం ఈ విషయంపై ముందుకు వెళితే అంతుర్యుద్ధం తప్పదన్నారు. -
జీవోఎంకు రాష్ట్ర కాంగ్రెస్ నివేదికపై సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్ : జీవోఎం సూచించిన 11 అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నివేదిక సమర్పణకు ఈ రోజే తుదిగడువు కావడంతో తెలంగాణ మంత్రులు ఈరోజు మధ్యాహ్నం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తమ నివేదికను అందచేయనున్నారు. జీవోఎం సూచించిన 11 అంశాలపై తెలంగాణ మంత్రుల నివేదికను వారు సిద్ధం చేశారు. తెలంగాణ మంత్రులు సోమవారం ఇదే అంశంపై బొత్స, డిప్యూటీ సీఎం దామోదర నివాసంలోనూ వారితో సమావేశమై నివేదిక రూపకల్పనపై కసరత్తు చేశారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్లో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో జీవోఎంకు నివేదికను ఇచ్చేది లేదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ ఎజెండా అని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంత కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పొందుపరుస్తూ జీవోఎంకు పిసిసి నివేదిక ఇవ్వచ్చనేది రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల అంచనా. కాగా ఇదే విషయమై రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంకు నివేదిక ఇస్తామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. సమైక్యం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏ విషయంలోనూ స్పష్టత లేదని శైలజానాథ్ అన్నారు. -
ఖమ్మం జిల్లా బంద్ సంపూర్ణం
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలాన్ని తెలంగాణలోనే కొనసాగించాలంటూ సోమవారం టీజేఏసీ నాయకులు చేపట్టిన డివిజన్ బంద్ విజయవంతం అయింది. ఈసందర్భంగా భద్రాచలంతో పాటు, డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో మోటార్సైకిళ్ల ర్యాలీలను నిర్వహించారు. భద్రాచలాన్ని కలుపుకొని తెలంగాణ వనరులను దోచుకోవాలని సీమాంధ్ర నాయకులు పన్నుతున్న కుట్రలను అడ్డుకుంటామనిటీజేఏసీ నాయకులు హెచ్చరించారు. భద్రాచలంలో తెల్లవారుజామునుంచే ఆర్టీసి బస్సులను డిపో నుంచి బయటికి రాకుండా నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలానికి వచ్చే అన్ని రహదారులను నాయకులు మూసివేసి ఆటోలను, బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలోని అన్ని దుకాణాలు, పెట్రోల్బంక్లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలను నాయకులు బంద్ చేయించారు. దీంతో పట్టణంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బస్సులను పూర్తిగా ఆపివేయటంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు సారపాక వరకు వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. బంద్ను విజయవంతం చేసేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. బంద్కు ఆదివాసీ గిరిజన సంఘా లు మద్దతు ప్రకటించాయి. చర్ల మండలంలో బంద్ సంపూర్ణంగా సాగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు తీశారు. వెంకటాపురం మండలంలో బంద్ విజయవంతమైంది. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించారు. మండల కేంద్రానికి వచ్చిన బస్సులను తెలంగాణ వాదులు నిలిపివేశారు. వాజేడు మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తెలంగాణ వాదులు మూయించారు. తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు తెలంగాణ వాదులు తాళాలు వేశారు. చింతూరు మండలంలోలో బంద్ను పురస్కరించుకొని విద్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మెయిన్రోడ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. దుమ్ముగూడెం మండలంలో బంద్ విజయవంతంగా ముగిసింది. దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను మూసివేశారు. వీఆర్పురం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. కూనవరం మండల కేంద్రంలో బంద్ విజయవంతం అయింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దఎత్తున బంద్లో పాల్గొన్నారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కూనవరం నుంచి కోతులగుట్ట వరకు మోటారుసైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. -
రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన, అఖిలపక్ష సమావేశానికి కేంద్రం తేదీలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రాష్ట్ర విభజన, వరద సాయంపై రాష్ట్రపతిని కలిసి విన్నవించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీమాంధ్ర నేతలు అభ్యంతరం చేస్తున్నాయి. రాష్ట్రపతి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరనున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్ విభజన సమస్యకు పరిష్కారం చూపగలరని రాష్ట్ర నాయకులు నమ్ముతున్నారు. రాష్ట్రపతిగా విభజనను అడ్డుకునే శక్తి ఆయనకే ఉందని భావిస్తున్నారు. అలాగే భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కూడా రాష్ట్రపతికి రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాత రాష్ట్రపతిని కలవనున్నారు. సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు; టీడీపీ సీమాంధ్ర ప్రతినిధులు వేర్వేరుగా రాష్ట్రపతిని కలవబోతున్నారు. అటు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం తేదీలు ఖరారు చేయడంతో పార్టీలు చర్చల్లో మునిగితేలుతున్నాయి. అఖిలపక్ష భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయి. -
సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు
అద్వానీ హామీ ఇచ్చారు: కె.హరిబాబు అగ్రనేతకు సీమాంధ్ర బీజేపీ నేతల వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని బీజేపీ అగ్ర నేత అద్వానీ ఆ పార్టీ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చారు. సీమాంధ్ర బీజేపీ నేతలు.. కె.హరిబాబు, కె.శాంతారెడ్డి, వై.రఘునాథబాబు, బి.రంగమోహనరావు, రఘు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్రెడ్డి శుక్రవారం ఇక్కడ అద్వాన్డ్డ్డ్డ్డ్డ్డ్డీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల భయాలు, సందేహాలు, సమస్యలపై అద్వానీకి వివరించారు. రాజ్నాథ్కు ఇచ్చిన వినతిపత్రం ప్రతిని ఆయనకూ అందజేశారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. భేటీ అనంతరం హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అద్వానీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. 11 అంశాలపై స్పందన కోరుతూ హోంశాఖ పంపిన లేఖ పార్టీకి అందిందని, దీనిపై కసరత్తును రెండ్రోజుల్లో పూర్తిచేసి అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి తుది స్పందన హోంశాఖకు వెళుతుందన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. సీమకు న్యాయం చేయాలని కోరాం.. విభజన జరిగితే వెనకబడ్డ రాయలసీమ ఎడారిగా మారిపోయే అవకాశముందని, పోలవరంతో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసినపుడు రాయలసీమను ఆదుకోవాలని అద్వానీకి విజ్ఞప్తి చేశామని బీజేపీ నేత శాంతారెడ్డి చెప్పారు. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను రాయలసీమకు తరలించాలని, ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు మళ్లించాలని, పోలవరాన్ని నాలుగేళ్లలో పూర్తిచేసి సీమాంధ్ర ప్రజలను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీపై అద్వానీ ఆరా! ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిస్థితులు, విభజన ప్రక్రియపై వివిధ పార్టీల వైఖరులు ఎలా ఉన్నాయంటూ అద్వానీ తనను కలిసిన సీమాంధ్ర నేతల నుంచి ఆరా తీసినట్టు తెలిసింది. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఏస్థాయిలో ఉందని ఆయన అడిగినట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో టీడీపీకి ఏపాటి ఆదరణ ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. విభజనపై ఇరు ప్రాంతాల నేతలు అందించిన వివరాలను పరిశీలించి రాజ్నాథ్సింగ్ వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటారని అద్వానీ వారికి చెప్పారు. -
ఆమోదం పొందే వరకూ అప్రమత్తం
తెలంగాణను అడ్డుకునేందుకు ఢిల్లీలో సీమాంధ్రుల లాబీయింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేం దుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ స్థాయిలో పెద్దఎత్తున లాబీ యింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ‘తెలంగాణ స్టేట్-ఇన్పుట్స్ టు జీఓఎం’ అనే అంశంపై‘యూనివర్సిటీ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ’ ఒక సమావేశం నిర్వహించింది. అందులో కేశవరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించిన సమావేశంలో విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్టికల్ 371(డి), పింఛన్లు, వర్సిటీలు, నిధులు, నీళ్ళు, విద్యుత్తు, వనరులు, భూములు, రుణాలు, చెల్లింపులు, శాంతిభద్రతలు, రెవిన్యూ తదితర అంశాలపై చర్చలు జరిపారు. జీఓఎంకు పూర్తి వివరాలతో త్వరలో నివేదికను అందచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు ఉండాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్థన్రెడ్డి, ఎమ్మెల్సీ దిలీప్కుమార్, మాజీ ఎంపీ వినోద్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, రవీందర్రెడ్డి, విమలక్క, ఔటా అధ్యక్షులు భట్టు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ప్రొ.రాములు, ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం శాంతిభద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో తమకూ వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేశారు. రాజధానిగా 5 లేదా 10 ఏళ్లున్నా అధికారాల విభజనకు అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ‘రెండు రాష్ట్రాలు-సామాజిక దృక్పథం’ పేరిట తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ), తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) సంయుక్తంగా ఆదివారం హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ కె.దిలీప్కుమార్, టఫ్ కన్వీనర్ విమలక్క సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో లోక్సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీమాంధ్ర బీసీ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు, బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, పూల రవీందర్, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, లక్ష్మణ్, టీఆర్ఎల్డీ అధ్యక్షులు కె.ఇందిర, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చింత స్వామిమాదిగ, టీఆర్ఎల్డీ నేతలు సి.హెచ్.శేషగిరిరావు, రియాజ్, ప్రముఖ కవి గూడ అంజన్న, శ్రీధర్ ధర్మాసనం తదితరులు ప్రసంగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో వాటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. బీసీలకూ సబ్ప్లాన్ను, చట్టసభల్లో రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక నుండి అమలుదాకా అగ్రవర్ణాలే అధిపత్యం వహిస్తున్నాయని, రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం వస్తుందన్నారు. తెలంగాణ ఆగదని, సమగ్ర అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. లోక్సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావకాశాలు పెరిగితేనే చైతన్యం, తద్వారా రాజకీయాధికారం, సామాజికన్యాయం సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ విద్యావకాశాలను పెంచి, మానవ వనరుల్లో నాణ్యతను పెంచాలని సూచించారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో సీమాంధ్రకూ హక్కుంటే తప్ప సీమాంధ్రలో ఉద్యమాలు ఆగవన్నారు. సీమాంధ్ర రాజధానిలో మౌలిక సదుపాయాలకోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వమే అదనపు నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అభద్రతా భావాన్ని పోగొట్టే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. సీమాంధ్ర బీసీ జేఏసీ అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దోపిడీకి అలవాటు పడిన సీమాంధ్ర సంపన్నులు, పెట్టుబడిదారులు తప్ప తెలంగాణ ఏర్పాటుకు సామాజిక వర్గాలు వ్యతిరేకంగా లేవన్నారు. ఎమ్మెల్సీ, టఫ్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ శాంతిభద్రతలు, భూములు, ఆదాయాల్లో హక్కులు పంచుతామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. విభజనకు ముందుగానే నదీజలాల పంపకంపై స్పష్టమైన, నిర్దిష్టమైన ఒప్పందాలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఆంధ్రాపై, ఇటు తెలంగాణపై ఉమ్మడిగా ఉందన్నారు. అదనపు ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే సూపర్ న్యూమరరీ పోస్టులుగా గుర్తించాలని దిలీప్కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా రాష్ట్ర విభజనకు ముందే సామాజిక వాటాను కూడా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని, అప్పటిదాకా ఉద్యమకారులు కొంత సంయమనంతో ఉండాలని కోరారు. కేంద్ర మంత్రివర్గ బృందాన్ని కలసి ఇరుప్రాంతాల మధ్య ఉన్న భయాందోళనలను తొలగించాలని కోరినట్టుగా దిలీప్కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, కవి గూడ అంజన్న, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ను దిలీప్కుమార్, విమలక్క సన్మానించారు. కేసీఆర్ ఫాంహౌస్లో భారీ బంకర్ : చింతా స్వామిమాదిగ మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్లో బంకర్ను నిర్మించుకుంటున్నారని టీఆర్ఎస్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు చింతా స్వామిమాదిగ వెల్లడించారు. ఫాంహౌస్లో ఎకరం విస్తీర్ణానికి పైగా భారీగా బావిని తవ్వినట్టుగా ఒక పత్రికలోనూ వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ బావి అయితే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్కు ఆనుకుని 40 ఎకరాలతో ప్రారంభమైన ఈ ఫాంహౌస్ చుట్టుపక్కల పేదలను బెదిరిస్తూ ఆక్రమించి, బలవంతంగా అమ్మించి ఇప్పుడు వందల ఎకరాలకు చేరుకున్నదని స్వామి ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో తెలంగాణకు కేంద్రంగా చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో పద్మనాభస్వామి ఆలయపు అనుభవాలను గుర్తుచేసుకోవాల్సి ఉంటుందని స్వామి అన్నారు. -
రాష్ట్ర విభజన వద్దంటున్న సీమాంధ్ర నేతలు
-
భగ్గుమన్న సీమాంధ్ర
-
రాజకీయ నేతలు ఇకనైనా ఉద్యమంలోకి రావాలి
-
విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరు?: సీమాంధ్ర నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ, ప్రధాని మంత్రి, కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్నే చించేశారని, తెలంగాణ విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రితో వారు గంటకుపైగా సమావేశమయ్యారు. అంతకు ముందు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై చర్చలు జరిపారు. సీఎంతో జరిగిన సమావేశంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ నోట్ వస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందని తాను అనుకోవడంలేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని చెప్పారు. అందరం ఒకే అభిప్రాయంతో ముందుకు వెళదామన్నారు. మీ అభిప్రాయాలను అధిష్టానినికి వివరిస్తానని చెప్పారు. మరోసారి మన అభిప్రాయాలను గట్టిగా వినిపిద్దామన్నారు. అధిష్టానం మన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఎంపి స్థానాలను ఇచ్చాం, మనమెందుకు ఢిల్లీ వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఢిల్లీలో సాయంత్రం ఏం జరుగుతుందో చూసిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామని సిఎం చెప్పారు. -
సేవ్ ఎపి సేవ్ కాంగ్రెస్ నినాదంతో భవిష్యత్ కార్యాచరణ
-
కిషన్రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీ రసాభాస
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రశాఖ సీమాంధ్ర నేతల సమావేశం పార్టీ నేతల మధ్య రుసరుసలు, నిరసనల మధ్య సాగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు విమర్శించటంతో కిషన్రెడ్డి సమావేశం మధ్యలోనే నిష్ర్కమించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం తలెత్తినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన, ప్రస్తుత పరిస్థితులు, పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసే పర్యటనకు సంబంధించి చర్చించేందుకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీమాంధ్ర నేతలు కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నో కష్టాలకు ఓర్చి సీమాంధ్రలో పార్టీ పక్షాన నిలుస్తున్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు తమకు భరోసా ఇవ్వటం లేదని సీమాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. దీంతో నొచ్చుకున్న కిషన్రెడ్డి ఒక దశలో రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించినట్లు చెప్తున్నారు. పార్టీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాలని తాము భావిస్తే తెలంగాణ నేతలను ఎందుకు తమతో పంపిస్తున్నారని సీమాంధ్ర నేతలు ప్రశ్నించటంతో.. వారితో పాటు తెలంగాణ నేతలను పంపించే ఆలోచనను కిషన్రెడ్డి విరమించుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వాగ్వాదం ముదురుతుండటంతో సమావేశం నుంచి కిషన్రెడ్డి బయటకువెళ్లిపోయినట్లు సమాచారం. పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు వల్లే ఇదంతా జరుగుతోందనే భావనలో కిషన్రెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇదిలావుంటే.. పార్టీ కార్యాలయంలో జరిగిన సలహామండలి భేటీలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, సకలజన భేరీలో బీజేపీ నిర్వహించిన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. పార్టీ అగ్రనేతలు కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శేషగిరిరావు, నాగం జనార్దన రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నోట్’పై నాటకం
-
విభజనను అడ్డుకుంటే హైదరాబాద్లో ఉండలేరు: శ్రీనివాస్ గౌడ్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగినా, హైదరాబాద్పై ఏ మాత్రం మెలిక పెట్టినా సీమాంధ్ర నేతలు హైదరాబాద్లో ఉండలేరని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్టానం దయాదాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పాలన పెట్టయినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్న సీఎంకు తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కరలేదా? వెయ్యి మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమానికి సహకరిస్తున్న ఐఏఎస్ అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. -
టీడీపీతో పొత్తుండదు : వెంకయ్యనాయుడు
తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోమని, ఆ ప్రతిపాదన కూడా లేదని అన్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నేతలు జీ కిషన్రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్లతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణను వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిన సీబీఐ, ఎప్పుడేం చోస్తోందో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. రెడ్కార్నర్ నోటీసు సాకుతో బాబా రాందేవ్ను లండన్ విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీ పాదాభివందనాన్ని అద్వానీ పట్టించుకోలేదనే వార్తలను నాయుడు తోసిపుచ్చారు. ‘ఆధార్’పై సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఇదిలావుంటే, బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు అక్టోబర్ 2న ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర నాయకుల్ని కలవనున్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామా యోచన?
-
పూటకో మాటొద్దు బాబూ..: కోదండరాం
ఖమ్మం/బోనకల్, న్యూస్లైన్ : ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడిన తీరు తెలంగాణ ప్రాంత ప్రజలను గందరగోళంలోకి నెట్టింది.. ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఖమ్మంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎవరిని ఇష్టపడుతావని అడిగినట్లు తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాన్ని పోల్చడం సరికాదన్నారు. తెలంగాణది హక్కులకోసం చేస్తున్న పోరాటమని, సీమాంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్న ఉద్యమం ఆధిపత్యం కోసమని ఆరోపించారు. రెండింటికి పొంతనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుకాదని చంద్రబాబుతోపాటు అన్నిపార్టీ లు ప్రకటించాయని, ఇప్పుడు మళ్లీ మాటమార్చే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన లేఖకు టీడీపీ కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు జాప్యం చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పారు. ఇరుప్రాంతాల వారితో చర్చలు జరపాలని అభిప్రాయపడుతున్న వారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలెత్తే సమస్యలపైనా.. లేదా రాష్ట్ర విభజనపైనా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు ప్రాంతాల సమస్యలను కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చర్చించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 29న హైదరాబాద్లో సకలజనుల భేరి సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, అలాగే యూటీ వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. చంఢీగఢ్మాదిరిగా హైదరాబాద్ను చేసి ఇబ్బంది పడొద్దన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి హైదరాబాద్తో ముడిపడి ఉందని, ప్రస్తుతమున్న పది జిల్లాల సరిహద్దులతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తుకాదని, తెలంగాణ సొత్తు అని కోదండరాం అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలంటే ఆ ప్రాంతానికి విభిన్నమైన సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, అభిమతాలు ఉండాలని అటువంటి పరిస్థితితులు హైదరాబాద్లో లేవని అన్నారు. సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకట్ట వేసే విధంగా పావులు కదుపుతున్నారన్నారు. ఆంగ్లేయులు వెళ్లారు.. కానీ ఆంధ్రోళ్లు వెళ్లేట్లులేదు ‘‘హైదరాబాద్ ఎవడబ్బ సొత్తుకాదు. ముమ్మాటికీ తెలంగాణ సొత్తు. 200 సంవత్సరాల పాలించిన ఆంగ్లేయులు వెళ్లమంటే వెళ్లారు కానీ, ఆంధ్రవాళ్లుమాత్రం వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణరాష్ర్టం ఏర్పడినపుడే తెలంగాణ సంక్షేమం సాధ్యమవుతుంది. వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు’’. - ఖమ్మం జిల్లా బోనకల్లో జయశంకర్ విగ్రహావిష్కరణలో కోదండరాం -
టీ-నోట్ తయారు కాలేదు..
షిండే మాతో చెప్పారు: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా తయారు కాలేదని సుశీల్కుమార్ షిండే తమకు చెప్పినట్లు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తెలుసుకుని, పరిష్కారాలు చూపేందుకు ఏర్పాటైన ఆంటోనీ నేతృత్వంలోని కమిటీతో అన్ని అంశాలను చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు హామీ ఇచ్చారని వారు శనివారం మీడియాకు చెప్పారు. సీమాంధ్రప్రాంత కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాయపాటి సాంబశివరావు, కె.వి.పి.రామచంద్రరావులు శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 40 నిమిషాలపాటు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలపై దృష్టిపెడతాం. అక్కడి ప్రజల మనోభావాలు, సమస్యలను తెలుసుకుంటున్న ఆంటోనీ కమిటీతో నేనూ చర్చిస్తా. కమిటీతో చర్చించాకే కేబినెట్ నోట్ తయారవుతుంది. ఇప్పటివరకు కేబినెట్ నోట్ తయారు కాలేదు. ఇరు ప్రాంతాల బాగోగులు కోరుకుంటున్నాం. ఆ దిశగానే ముందుకు వెళతాం అని షిండే మాతో చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట షిండే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధమైందని, దాన్ని తానింకా చూడలేదని పేర్కొ నడం తెలిసిందే. నోట్ సిద్ధమైందని షిండే స్పష్టంచేయగా.. శనివారం ఆయన్ను కలిసిన అనంతరం సీమాంధ్ర నేతలు నోట్ ఇంకా సిద్ధం కాలేదని షిండే తమకు చెప్పారంటూ మీడియాతో పేర్కొనటం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజనమీద కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడ గట్టిగా నిలదీస్తున్నారని షిండేకు సీమాంధ్ర నేతలు వివరించినట్లు తెలిసింది. ఫలితంగా తాము సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నట్టు సమాచారం. కాగా కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ టీ-నోట్ ఇంకా తయారు కాలేదని, ఆంటోనీ కమిటీతో అన్ని అంశాలపై చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు తెలిపారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని ప్రజల మనోభావాల్ని షిండేకి వివరించామని కిల్లి కృపారాణి చెప్పారు. -
హైదరాబాద్ లో భూములుంటే అమ్ముకోండి
న్యూఢిల్లీ: హైదరాబాద్ లో భూములుంటే అమ్ముకోండని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ తమకు వివరించినట్లు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సతీమణులు తెలిపారు. శనివారం దిగ్విజయ్ తో భేటీ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారన్నారు. తెలంగాణపై ముందుకేనని దిగ్విజయ్ తమకు సంకేతాలిచ్చారన్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్రకు ఏర్పాటు చేసే రాజధాని పేరును కూడా వెల్లడించారు. సీమాంధ్రలో సమస్యలు ఏమిటో ఇప్పటికీ ఆ ప్రాంత నేతలు చెప్పడం లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏకపక్ష వైఖరితో కాంగ్రెస్ పార్టీ ముందుకెళితే సీమాంధ్రలో పార్టీ నష్ట పోతుందని వారు సూచించినా ఆ మాటను దిగ్విజయ్ సింగ్ పెడచెవిన పెట్టారన్నారు. సీమాంధ్రలో పార్టీ నష్ట పోయిన ఫర్వాలేదని, అక్కడ పూర్తిగా నష్టపోయిన ఫర్వాలేదని దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ సీమాంధ్ర 13 జిల్లాల్లో పార్టీ లేకపోయినా ఏమి నష్టం వాటిల్లదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారన్నారు. -
ఒక్క రోజులో మారిన కథ
-
సిగపట్లు వీడి చర్చలకు సిద్ధం
రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని చర్చలకు సిద్ధపడ్డారు. ఇది శుభపరిణామం. ఒకరినొకరు తిట్టుకుంటే విద్వేషాలు పెరిగడమేగానీ ఫలితం ఏమీ ఉండదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి కుంటుపడింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ ప్రకటించడంతో తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని భావించారు. అప్పటి నుంచి వారు అనేక విధాల ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ కాంగ్రెస్ పార్టీ నాన్చుతూ వచ్చింది. రెండో ఎస్ఆర్సి - పార్టీల అభిప్రాయాలు - ఏకాభిప్రాయం - చర్చల ప్రక్రియ - తెలంగాణకు కాల నిర్ణయం లేదు - వారం అంటే ఏడు రోజులు కాదు - నెల అంటే 30 రోజులు కాదు - సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది - అది కీలక సమస్య - సంప్రదింపులు - ప్రాంతాల మనోభావాలు - చిన్న రాష్ట్రాల సమస్య తలెత్తే ప్రమాదం ..... అని అనేక సాకులు చెప్పు కుంటూ కాలం వెళ్లబుచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్లో కదలిక వచ్చింది. ఎన్ని ఆందోళనలు జరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరించిన కాంగ్రెస్ ఆదరాబాదరాగా యుపిఏ నేతలను సమావేశ పరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందింది. ఆ తరువాత సిడబ్ల్యూసిని సమావేశపరిచింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు - పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించేశారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ - పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. వారికి కావలసింది రాష్ట్ర ప్రయోజనం కాదని, సీట్లు, ఓట్లు అన్న విషయం స్పష్టమైపోయింది. నదీజలాలు, ఆస్తులు, అప్పులు, సీమాంధ్రకు రాజధాని .....వంటి కీలక అంశాలకు సంబంధించి స్పష్టతలేకుండా తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఓ ప్రకటన చేసేశారు. విభజన ప్రకటనతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా, నాయకులతో సంబంధంలేకుండా ప్రజలే ఉద్యమించారు. కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను నిలదీశారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేయడం ప్రారంభించారు. రోజురోజుకు ప్రజల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువైపోయింది. మరో పక్క ఇంతకాలం ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొందే సమయంలో సీమాంధ్రులు ఉద్యమించడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగులు, ప్రజలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వల్ల తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఈ నెల 19న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి పదిమంది చొప్పున నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో అన్ని విషయాలను చర్చించి మంచి ఆలోచనలు వస్తే వాటిని అమలు చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రాంతాల నేతలు కలిసి కూర్చొని చర్చించుకుందామన్న మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డిలు చేసిన ప్రతిపాదనకు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
మంత్రి టీజీ వెంకటేష్ వాహనంపై చెప్పులు, రాళ్లతో దాడి
-
మంత్రి టీజీ వాహనంపై చెప్పుల దాడి
-
ఉద్యమంలో సగం
-
హైదరాబాద్లో సీమాంద్ర ప్రాంత కేంద్ర మంత్రుల భేటీ
-
భవిష్యత్ కార్యాచరణ పై చర్చ