Shilpa Shetty
-
హెచ్టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల వేడుకలో తారల సందడి (ఫొటోలు)
-
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
ఈ కేసులో శిల్పాశెట్టి ఫోటోలు ఉపయోగిస్తే చర్యలే: లాయర్
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయని వచ్చిన వార్తల్లో నిజంలేదని శిల్పాశెట్టి లాయర్ ప్రకటించారు. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో లాయర్ వివరణ ఇచ్చారు. ఎలాంటి కేసులో ఆమెకు సంబంధంలేదని లాయర్ క్లారిటీ ఇచ్చారు. తప్పడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.రాజ్ కుంద్రా ఆఫీసులపై ఈడీ దాడులు అంటూ మీడియాలో వచ్చిన కథనాలకు ఆయన సతీమణి శిల్పాశెట్టి లాయర్ ఇలా స్పందించారు. ' నా క్లయింట్ ఇంట్లో ,ఆఫీసులలో ఎలాంటి ఈడీ సోదాలు జరగలేదు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజ్ కుంద్రా కూడా విచారణకు సహకరిస్తున్నారు. రాజ్ కుంద్రా ఇంట్లో ఈడీ సోదాలు అంటూ ప్రచారం చేస్తూ.. నా క్లయింట్ శిల్పాశెట్టి ఫోటోలు, వీడియోలను మీడియాలో ఉపయోగించకండి. ఈ కేసులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్లో ఎవరైనాసరే ఈ కేసులో శిల్పాశెట్టి పోటోలు ఉపయోగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.' అని లాయర్ హెచ్చరించారు.వ్యాపారవేత్త రాజ్ కుంద్రా 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. సినిమాలలో ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి కొందరి యువతులను టార్గెట్ చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అశ్లీల చిత్రాల కేసు.. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్ కుంద్రా అనుచరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇకపోతే.. అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని ప్రసారం చేశారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను 2021 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2021 సెప్టెంబర్లో కుంద్రాకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక, ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అంటూ ముంబై పోలీసు అధికారులు ఆరోపించారు.మరోవైపు.. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం.. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతలతో కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారుల.. ముంబై సహా యూపీలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. -
50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. స్విస్ బాల్లో ప్రోన్ రివర్స్ హైపర్ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్లో ఎక్స్ర్సైజ్లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్కు ఇచ్చేసింది. అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! ) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
స్టార్ హీరోయిన్ హోటల్లో చోరి.. ఫైర్ అయిన కస్టమర్
బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్లో భారీ చోరీ జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్ పేరుతో ఆమె రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు. దాదర్లోని కోహినూర్ స్క్వేర్ బేస్మెంట్ పార్కింగ్లో ఉన్న కారు చోరీకి గురైంది. ఒక నివేదిక ప్రకారం.. బాంద్రాకు చెందిన రుహాన్ ఖాన్ అనే వ్యాపారవేత్త తన స్నేహితులతో బాస్టియన్ రెస్టారెంట్కు వెళ్లాడు. ఈ క్రమంలో తన కారును అక్కడే వ్యాలెట్ పార్క్ చేశాడు. స్నేహితులతో కలిసి డిన్నర్ పూర్తి అయిన తర్వాత వాలెట్ నుంచి తన కారును తీసుకురావాలని ఖాన్ కోరాడు. అయితే, పార్కింగ్ చేసిన ప్రదేశంలో కారు లేదు. దీంతో దొంగతనం జరిగిందని వారు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది CCTV ఫుటేజీని పరిశీలించారు.ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జీప్ కంపాస్ వాహనంలో తెల్లవారుజామున 2 గంటలకు బేస్మెంట్లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. వారిలో ఒకరు ఖాన్కు సంబంధించిన BMW Z4 కన్వర్టిబుల్ కారును చోరి చేశారని తేలింది. కారును అన్లాక్ చేయడానికి అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర సుమారు రూ. 90 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.కారు ఓనర్ CCTV ఫుటేజీ ఆధారంగా శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ భద్రతా చర్యలపై ఖాన్ ఫైర్ అయ్యాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇంత సంఘటన జరిగినప్పటికీ, శిల్పా శెట్టి ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆయన తప్పుపట్టారు. -
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్లో జరిగింది. తొలి కర్వా చౌత్ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్హౌస్ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒకప్పటి యూత్ కలల దేవత. టాలీవుడ్లో సాగరకన్యలా మెరిసి తెలుగు అభిమానుల మన్నలను పొందిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుపదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్గా పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. ఏ ఉలి ఈమెను ఇంత అందంగా చెక్కాడో అన్నట్లు ఉంటుంది ఆమె శరీరాకృతి. ఫ్యాషన్పరంగా కూడా ఆమె తనదైన శైలిలో ఉంటుంది. ఆమె ధరించే ప్రతి డిజైనర్ వేర్ అద్భుతం అన్నంతగా క్రేజీగా ఉంటాయి. వాటి ధర కూడా కళ్లబైర్లు కమ్మే రేంజ్లో పలుకుతాయి. తాజాగా శిల్పా "సౌదీ సెలబ్రేటింగ్ ది హార్ట్ ఆఫ్ అరేబియా" ఈవెంట్లో పాలరాతి శిల్పంలా మెరిసింది. పాల నురుగు షిఫాన్ చీరలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా ఆమె ఆహార్యం ఉంది. ఆ తెల్లటి చీరకు తగ్గట్టు ముత్యాలతో డిజైన్ చేసిన చీర శిల్ప లుక్ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేసింది. ఈ డిజైనర్ వేర్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటన్నది చెబుతోంది. శిల్ప ధరించిన ముత్యాల బ్లౌజ్ ధర ఏకంగా రూ.139,000 పలుకుతోంది. ఈ ఖరీదు బ్లౌజ్ డిజైనింగ్లోని క్లిష్టమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. అందుకు తగ్గట్టు మంచలాంటి మేకప్, ముత్యాల బ్రాస్లెట్, పాపిడి బొట్టుతో ఫ్యాషనికి ఐకాన్గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: 'స్లీప్మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?) -
‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్ అదుర్స్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి చేసిన నృత్యం హృద్యంగా నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్ లెహంగా-చోలీలో ఉత్సాహంతా డ్యాన్స్ చేసి అలరించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు. భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య వీడ్కోలు పలికారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు, అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.2014లో సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది. -
ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్!
సెలబ్రిటీలు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వాళ్ల లైఫ్ అంతా లగ్జరీ స్టైలే. సినీతారలు ఎక్కడికెళ్లినా కెమెరాల కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. దీంతో వారు బయటికి వచ్చారంటే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్ ప్రముఖులు అంతా ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పలువురు అగ్రతారలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే బాలీవుడ్ భామ శిల్పాశెట్టి సైతం తన ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె ఇటీవలే ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. శిల్పా చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్లో కనిపించింది, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్కుంద్రా ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
నాజూగ్గా ఉండే శిల్పా శెట్టి ఇంతలా ఫుడ్ని లాగించేస్తుందా..!
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి పేరుకి తగ్గట్టుగానే శిల్పంలా ఉంటుంది. ఐదు పదుల వయసుకు చేరవవ్వుతున్నా నేటీ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్గా కనిపిస్తోంది. శిల్పి చెక్కినట్లుగా ఉన్న శరీర సౌష్టవం, చెక్కు చెదరని అందం ఆమె సొంతం. మంచి యోగాసనాలతో ఇప్పటికీ అభిమానులతో టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త యోగాసనాలతో శరీరాన్ని ఎలా ఫిట్నెస్గా ఉంచొచ్చో చెబుతుంది. అలాంటి శిల్పా డైట్ పరంగా పెద్దగా ఏం తీసుకోదేమో అనుకుంటారు. గానీ శిల్పా మంచి భోజనప్రియురాలు. తినాలనుకున్నవన్నీ శుభ్రంగా లాగించేస్తుందట. కాంప్రమైజ్ కాదట. ఆమె తింటున్న విధానం చూసి కచ్చితంగా శిల్పా శెట్టేనే ఇలా తినేదని షాకవ్వుతారు. అందుకు నిదర్శనమే ఆమె లంచ్ టైంలో తిన్న ఫుడ్ సీన్. చెప్పాలంటే ఓ సాధారణ మహిళ మల్లే భలే తింటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో శిల్పా..లంచ్ సిద్ధం అని చెప్పగానే శిల్పా.. నాకు బోండా, వడ ఉండాలి.. నా దగ్గర రవ్వ దోసె ఉండాలి. నాకు సాంబారు కావాలి. నా దగ్గర పెరుగు అన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ తనకు ఇష్టమైన ఫుడ్స్ జాబితా మొత్తం చెబుతుంటం వీడియోలో కనిపిస్తుంది. ఇక అక్కడితో ఆగని శిల్పా కుల్ఫీ కూడా కావాలని చెబుతూ.. పాన్ గురించి గుర్తుచేస్తూ..అది బోజనం చివరన తప్పనిసరని చెబుతుండటం విశేషం. అయితే తనను ఎవరో వీడియో తీస్తున్నారని తెలిసి బిగ్గరగా నవ్వుతుంది. ఇక శిల్పా పక్కనే నిలుచున్న యువతి ఓ లంచ్ అయిన తర్వాత ఇది..ఇప్పటికే ఒకసారి లంచ్, రెండుసార్లు బ్రేక్ఫాస్ట్ అయిందని చెప్పడం గమనార్హం. ఇక ఆ తర్వాత వీడియోలో శిల్ప ముందు ఆమె ఆర్డర్ చేసిన డిష్లు కొద్దిగా తినిఉండటం కనిపిస్తుంది. ఇక చివరిగా వీడియోలో కుల్ఫీని ఎంజాయ్ చేయడమే గాక పాన్ని కూడా ఆస్వాదించడం కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) (చదవండి: డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!) -
డబ్బు కోసమే అతడితో పెళ్లి? హీరోయిన్ ఏమందంటే..
'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసూ వంటి చిత్రాలతో అలరించింది. కానీ బాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడంతో అక్కడే సెటిలైంది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలు, సిరీస్లపై మరింత ఫోకస్ చేసింది. డబ్బు కోసమే పెళ్లి? తర్వాత 2009లో బిజినెస్మెన్ రాజ్కుంద్రాను పెళ్లాడింది. వీరికి ఒక బాబు పుట్టగా సరోగసి ద్వారా కూతురికి జన్మనిచ్చారు. డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందని శిల్పా శెట్టిపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆ ట్రోలింగ్పై హీరోయిన్ స్పందించింది. రాజ్కుంద్రా కంటే ధనవంతులు సైతం నన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు. కానీ నేనే పట్టించుకోలేదు. మంచితనం చూశా.. అప్పుడు, ఇప్పుడు నేను ధనవంతురాలినే! నేను పెట్టిన బాస్టియన్ రెస్టారెంట్ వల్ల నేను మరింత ధనికురాలినయ్యాను. జనాలు ఏది పడితే అది వాగేముందు గూగుల్లో నా గురించి సెర్చ్ చేస్తే బాగుండేది. సక్సెస్ఫుల్ ఉమెన్గా నాకంటూ తోడు నిలబడే వ్యక్తి కావాలనుకున్నాను. డబ్బులు చూడలేదు, మంచితనాన్ని చూశాను. తను మంచి మనిషి కాకపోయుంటే ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి. చదవండి: నా పరుపు దులిపితే లక్షలకు లక్షలు దొరికాయి.. ఆ రోజు చిరంజీవి నాపై సీరియస్..: బాబూ మోహన్ -
శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వయసు 50కి దగ్గర పడ్డ వన్నెతగ్గని సోయగంతో పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. అంతేగాక ఆమె మంచి ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఇక ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటారు. అలానే ఈసారి కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఓ సరికొత్త విషయాన్ని షేర్ చేశారు శిల్పా. ఆమె పలు యోగాసనాలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె సరికొత్త వ్యాయామ భంగిమ, దాని ప్రయోజనాల గురించి చాలా ఆసక్తికర విషయాలను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. రాజస్తాన్ పర్యటనలో ఉన్న ఆమె 'చక్కి చలసానా' భంగిమ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటీ 'చక్కీ చలసానా' అనుకుంటున్నారా..? అదేనండి తిరగలి తిప్పుతున్నట్లు చేసే ఆసనం. అంతేకాదండోయ్ మన పూర్వకాలం బామ్మలు తిరగలితో బియ్యం, గోధుమలు పిండిగా విసిరేవారు. అలా చేయడం వల్ల వాళ్ల నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా ఉండేవారిని నిపుణులు గుర్తించారు. ఆ విషయాన్ని శిల్పాశెట్టి కూడా చెబుతున్నారు. ఆ భంగిమ ప్రయోజనాలు వివరిస్తూ తిరగలి విసిరి మరీ చూపించారు. ఇలా చేస్తే నడుము, తొడలు, పిక్కల వద్ద ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్గా ఉంటారో వెల్లడించారు నటి శిల్పా. ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్ పోజ్ అని పిలుస్తారని అన్నారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి, మనస్సుకి మంచి ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆసనాన్ని రెగ్యూలర్గా వేస్తే చేకూరే ప్రయోజనాలేంటో సవివరంగా వెల్లడించారు కూడా. అవేంటంటే. బలాన్ని వృద్ధి చేస్తుంది: ఈ చక్కి చలసానా(తిరగిలి తిప్పే ఆసనం) ఉదరకండరాలను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అవుతాయి. దీంతో శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఆటోమెటిక్గా వస్తుంది. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ యోగా భంగిమలో ఎగువ శరీరం మాత్రమే వృత్తాకార కదలికలో పాల్గొంటుంది కాబట్టి వెన్నెముక, భుజాలు తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు మంచి ఉపయుక్తమైన ఆసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా ఉదర అవయవాల్లో ముఖ్యంగా జీర్ణ అవయవాలకు మంచి అవసరమైన వ్యాయామం అనే చెప్పాలి. దీంతో ఇది జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసు ఆహ్లదంగా ఉండేలా చేస్తుంది చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ ధ్యానానికి సంబంధించిన నియంత్రిత శ్వాసపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ ఆసనం వేయడం అనేది మనస్సుకు ప్రశాంతనిచ్చే ధ్యానం చేసినట్లుగా మంచి సత్ఫలితాలనిస్తుంది. ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడని చెబుతోంది నటి శిల్పాశెట్టి. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆసనాన్ని వెంటనే మొదలు పెట్టేయండి మరీ. (చదవండి: 'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట! ఎందుకో తెలుసా?) -
శ్రియ గ్లామర్ ట్రీట్.. అలా రెచ్చగొట్టేస్తున్న తెలుగు హీరోయిన్!
రెచ్చిపోయిన శ్రియ.. చూస్తే మెల్డ్ అయిపోవడం పక్కా వెరైటీ ముక్కుపుడకతో డిఫరెంట్గా కనిపిస్తున్న అనుపమ నాభి చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా చేస్తున్న మాళవిక మోహనన్ అక్కతో కలిసి క్యూట్ పోజులిచ్చిన బ్యూటీ ఆలియా భట్ అలాంటి డ్రస్లో కనిపించిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి నడుము మడతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డింపుల్ హయతి ఊటీలో చిల్ అవుతున్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో 'మీర్జాపుర్' బ్యూటీ శ్రియ పిల్గొంకర్ View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ కావాలంటూ డిమాండ్
బాలీవుడ్లో పోలీస్ కథలతో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వచ్చినవే సింగం సీరిస్, సింబా, సూర్యవంశీ ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్గా నిలిచాయి. పోలీస్ బ్యాక్డ్రాప్తో వచ్చే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవన్నీ మంచి వినోదాన్ని పంచాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్తో ఆయన తొలిసారిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని వారు ప్రకటించారు. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతుంది. 'ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరి కోసం.. ఈ వార్లో మన కుటుంబ సభ్యుల రక్తం చిందినా యుద్ధం ఆగదు' అంటూ కబీర్ పాత్రలో సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు హైలెట్గా నిలుస్తున్నాయి. దాదాపు ఏడు ఎపిపోడ్స్తో సిద్ధమైన ఈ సిరీస్కు రోహిత్శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ఈ సిరీస్ హీందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో రీజనల్ లాగ్వేజ్ల నుంచి కూడా మేకర్స్కు ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ భాషల్లో విడుదల చేయాలంటూ పలువురు నెటిజన్లు ఇప్పటికే పోస్ట్లు చేయడం గమనర్హం. హిందీలో అయితే జనవరి 19 నుంచి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ను అమెజాన్లో చూడొచ్చు. -
దుస్తులిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు: శిల్పాశెట్టి భర్త
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా జీవితంలో నీలి చిత్రాల కేసు చెరగని మచ్చగా నిలిచిపోయింది. వ్యాపారవేత్తగా ఎంతో పేరు సంపాదించినా.. 2021లో నమోదైన నీలిచిత్రాల కేసుతో అతని జీవితం వివాదాల్లో కూరుకుపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉన్నాడు. బిజినెస్ వ్యవహారాల్లోనూ అంతగా జోక్యం చేసుకోలేదట. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మళ్లీ బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న యూటీ 69 అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్లో రాజ్కుంద్రా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి, అక్కడ పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘జైలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి రోజే నా దుస్తులన్ని విడిపించి..అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకోచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం వైపు చెక్ చేశారు. అలాంటి ట్రీట్మెంట్ చూసిన తర్వాత బతికున్న చచ్చినట్టే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని బాధపడ్డాను. జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా గురించి ఏవోవో తప్పుడు కథనాలు రాసి..దుస్తులు విడిపించినంత పని చేసింది. అవమాన భారంతో కుంగిపోయాను. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’ అని రాజ్కుంద్రా చెప్పుకొచ్చారు. -
నీలిచిత్రాల కేసు.. దేశం వదిలి వెళ్లిపోదామనుకున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీడియాకు తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇటీవలే తన జీవిత కథ ఆధారంగా యూటీ 69 అనే బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో రాజ్ కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్పుకొచ్చాడు. వారానికి ఒకసారి ఫోన్ కాల్.. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారే ఫోన్ మాట్లాడనిచ్చేవాళ్లు. అది కూడా కొద్ది నిమిషాలే! అందుకే శిల్పా, నేను ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆమె రాసే ఉత్తరాలు చదువుకుని బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని. శిల్పాకు నా గురించి బాగా తెలుసు. నేను నా బిజినెస్లో, నా జీవితంలో ఎంత నిజాయితీగా ఉండేవాడిని, ఎలాంటి విధివిధానాలు పాటిస్తానో అన్నీ తెలుసు. అందుకే, నాకెంతో సపోర్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో తను మొదటి సారి ఫోన్ చేసి ఏమందంటే.. రాజ్.. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నా మీద నమ్మకముంచు అని చెప్పింది. ఆమె మాటలు విన్నాకే జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. అవమానభారంతో కుంగిపోయా.. నిజానికి నేను కుంగిపోయి ఉన్నాను. జైలు లోపలే నా జీవితం ముగించేయాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా పేరుప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఎంతో అవమానంగా ఉంది. నా వల్ల మీడియా నా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల వెంటపడుతూనే ఉంటుంది. అదంతా ఆలోచిస్తేనే చాలా భయమేసింది, బాధేసింది. బయట ఏం జరుగుతుందనేది నేను అంచనా వేయగలను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను. జీవితంలో ఇది నాకు సంక్లిష్ట సమయం. నిజమేంటనేది నాకు తెలుసు, అది ఏదో ఒక రోజు బయటకు రాక తప్పదు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. దేశం వదిలేసి వెళ్లిపోదామంది నా భార్య అయితే దేశం వదిలేసి వెళ్లిపోదామంది. నువ్వు లండన్లో పుట్టి పెరిగావు. అక్కడంతా వదిలేసి నాకోసం ఇండియా వచ్చావు, ఇక్కడే సెటిలయ్యావు. విదేశాల్లో ఉండాలనుందంటే చెప్పు.. అక్కడికే వెళ్లిపోదాం అని అడిగింది. కానీ నాకు భారత్ అంటే ఇష్టమని, ఈ దేశాన్ని వదిలేయలేనని చెప్పాను. వేలకోట్ల స్కామ్లు చేసి తప్పు చేసిన వారు దేశం విడిచి వెళ్తారు. నేనే తప్పూ చేయలేదు, నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను' అని తెలిపాడు రాజ్ కుంద్రా. చదవండి: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. తర్వాత భిక్షగత్తెగా మారి.. -
విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. భార్యతో విడాకులు?
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు. సడన్గా ఏమైంది? ఇది చూసిన జనాలు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటివరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్తోనే కనిపించేవాడు. ప్రమోషన్ స్టంట్? ఇటీవలే అతడు తన జీవితాన్ని బయోపిక్గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. కాగా రాజ్కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం. We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔 — Raj Kundra (@onlyrajkundra) October 19, 2023 చదవండి: అజిత్తో షూటింగ్ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్ -
అలా చెప్పగానే నా భార్య నాపైకి చెప్పు విసిరింది: శిల్పా శెట్టి భర్త
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలాకాలంగా తన ముఖాన్ని జనాలకు చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్తోనే కనిపిస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన ఓ వేడుకలో తన మాస్క్ తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుక ఏంటనుకుంటున్నారా? తనకు సంబంధించినదే! రాజ్ కుంద్రా.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీసుకువస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. దీనికి యూటీ 69 అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే తన ముఖాన్ని చూపించాడు. ఈ సందర్భంగా రాజ్కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నా జీవితకథను బయోపిక్గా తీయాలనుకున్నాను. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పినప్పుడు తను నాకు కొంత దూరంలో నిలబడి ఉంది. సినిమా చేస్తానని చెప్పానో లేదో.. తను నా మీదకు చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. మొదట్లో ఇష్టపడలేదు కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నీలిచిత్రాల కేసులో రాజ్కుంద్రాను ముంబై పోలీసులు 2021లో అరెస్ట్ చేశారు. కొంతకాలంపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తన సినిమాలో జైలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా చూపించనున్నాడు రాజ్ కుంద్రా. షహ్నావజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. చదవండి: నామినేషన్స్.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్ -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్కు హాజరైన రాజ్కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. -
నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్బాస్ బ్యూటీ ఫైర్!
తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ సెన్స్పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొంది. రాజ్కుంద్రాపై కేసు శిల్పాశెట్టి భర్త, రాజ్కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. View this post on Instagram A post shared by Raj Kundra (@onlyrajkundra) -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) -
చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. వీడియో వైరల్
పంద్రాగస్టు రోజున స్కూలు, కాలేజీలు, కార్యాలయాలే కాకుండా ప్రతి ఇంట జెండా ఎగరేశారు. హర్ ఘర్ తిరంగా పేరిట చాలామంది ఇళ్లల్లో జెండా రెపరెపలాడింది. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ఈ ట్రెండ్లో పాలు పంచుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని జుహులో తన ఇంటి ముందు జెండాను ఎగరేసింది. ఈ క్రమంలో ఆమె చెప్పులు ధరించే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండావందనం చేసింది. ఈ వీడియోను శిల్పా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. చెప్పులేసుకుని ఫ్లాగ్ ఎగరేయడమేంటి? కాస్తైనా బుద్ధుండక్కర్లా? అని మండిపడ్డారు. నీ చెప్పులు పక్కన విడిచి ఆ పని చేస్తే బాగుండేది అని సెటైర్లు వేశారు. అయితే కొందరు మాత్రం చెప్పులు వేసుకుని జెండా ఎగరేయడంలో తప్పే లేదని హీరోయిన్ను వెనకేసుకొచ్చారు. ఈ ట్రోలింగ్ చూసిన శిల్పా.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై తనకు పూర్తి అవగాహన ఉందని కౌంటరిచ్చింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్లో ఎక్కడా లేదంటూ గూగుల్లో ఓ ఆర్టికల్ను వెతికి మరీ షేర్ చేసింది. 'ఇలా పనిగట్టుకుని విమర్శలు చేసేవాళ్లను నేనసలు పట్టించుకోను. మీ అజ్ఞానాన్ని ప్రచారం చేయడం, నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకోవడం మెచ్చుకోదగిన విషయం కాదు. ముందు మీరు వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి' అని ఘాటుగా బదులిచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) చదవండి: రెండేళ్లకే విడాకులు.. హీరోయిన్ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా? -
'భార్య నిద్రపోగానే ఆమె చెల్లితో పార్టీకి వెళ్తా, తనకు పెళ్లి కాకూడదు'
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు. భార్య పడుకోగానే మరదలితో పార్టీ తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం బాజీఘర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్లోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Laughter Club 💠 (@laughterclubdelhi) చదవండి: పాలబుగ్గల పసివాడిని గుర్తుపట్టారా? మెగాస్టార్ వారసుడు.. దుబాయ్లో ఉద్యోగం వదిలి హీరోగా.. తెలుగులో సూపర్ క్రేజ్! -
చిన్నపిల్లలకు అసభ్యకర ప్రశ్నలు.. మండిపడుతున్న నెటిజన్స్!
సోని పిక్చర్స్ నెట్వర్క్లో ప్రసారమవుతున్న రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ -3. ఈ షో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను చిలిపి ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్ను నవిస్తుంటారు. ఈ షోకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, చిత్రనిర్మాత అనురాగ్ బసు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నారు. అయితే ఈ డ్యాన్స్ కాస్తా అసభ్యకరమైన చర్చలకు దారితీసింది. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను అతని తల్లిదండ్రులను ఉద్దేశించి అసభ్యకరమైన, లైంగిక ప్రశ్నలు వేస్తూ జడ్జిలు నవ్వుకుంటున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. యూట్యూబ్లో అన్ని వయసుల వారికి వీడియో అందుబాటులో ఉందని నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జడ్జిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చిన్న పిల్లలను ఇలాంటి ప్రశ్నలా అడిగేది.. మీకు అసలు కొంచెమైన సిగ్గుందా' అంటూ మండిపడుతున్నారు. మరో నెటిజన్ రాస్తూ..'ఇది చాలా అసహ్యంగా ఉంది. అస్సలు ఇది వినోదం కాదు. పిల్లలతో ఇలాంటివీ చెప్పిస్తారా?' ఫైరయ్యారు. కాగా.. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలను ఛానెల్ ఉల్లంఘించిందని ఎన్సీపీసీఆర్ పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్కు ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది. లేఖ అందిన 7 రోజులలోపు కమిషన్కు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని లేఖలో ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ఆదేశించారు. కాగా.. ఈ రియాలిటీ షో ఏప్రిల్ 2019 నుండి జూన్ 2019 వరకు ప్రసారం చేయబడింది. (ఇది చదవండి: ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!) Child is made to deliver vulgar remarks on parents on stage in a kid show Everyone laughs and the episode is available for all ages on YouTube!#BollywoodKiGandagi are not role models. They are biggest enemies of Vishwaguru vision. Destroyer of our kidspic.twitter.com/49K7RzSWzr — Gems of Bollywood बॉलीवुड के रत्न (@GemsOfBollywood) July 24, 2023 What a shameful thing to do! Papa is shocked & embarrassed at this, but even he did not dare open his mouth. Only glamour rules the idiot box. https://t.co/30nr83q6Ye — Achhabachha🇮🇳 (@Lovepettyquotes) July 24, 2023 -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్మార్కెట్కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
Yoga Day: యోగా.. కొత్త కొత్తగా
యోగా నిపుణులు, సాధకులు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు. శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్నెస్ ఐకాన్స్, యోగా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్నెస్ ఫిల్మ్లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్ చేసింది. కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కి 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. యోగా సౌందర్యం దీపికా మెహతా రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది. రాక్ క్లైంబింగ్ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్ అయిన దీపికా యూ ట్యూబ్ ఛానెల్ కి దాదాపు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది. లోపాలను సరిదిద్దుతూ... సునయన రేఖీ యోగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది. సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. నిరాశకు దూరం నటాషా నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాదు సోల్ఫుల్ హ్యాపీనెస్ బ్లాగ్ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది. తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్మీడియా ΄్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది. యోగా ద్వారా సెల్ఫ్ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది. యోగాసిని రాధికా బోస్ అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి. ‘మీడియా, ప్రకటనలలో గ్లాస్ సీలింగ్ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. -
మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్
శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంతటి పాపులారిటి దక్కించుకుందో విమ్శరలతో కూడా అంతే గుర్తింపు పొందింది. ఏదొక వివాదంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఓ నటుడితో ముద్దు కేసు, చీటింగ్, భర్త పోర్న్గ్రాఫీ, అక్రమ సంపాదన ఇలా పలు వివాదాలు ఆమెను చూట్టుముడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన డ్రెస్సింగ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో కూడా ఓ అవార్డు ఫంక్షన్లో యంగ్ హీరోయిన్లకు పోటీగా అందాల అరబోస్తూ బోల్డ్ లుక్లో దర్శనిమించింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా? దీంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి శిల్పాతో పాటు పలువురు స్టార్ నటీనటులు హజరయ్యారు. ఈ వేడుకకు శిల్పా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ట్రెండీవేర్ డ్రెస్లో సందడి చేసింది. వైట్కలర్ జంప్ సూట్లో వీ నెక్ ఫుల్ డీప్ జాకెట్, స్టైలిష్ చికంకారి కోట్ ధరిచించింది. ఇందులో శిల్పా డ్రెస్పింగ్ బోల్డ్గా ఉండటంతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. చదవండి: షాకింగ్: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్ అరెస్ట్ దీంతో నెటిజన్లు శిల్పా డ్రెస్సింగ్పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి డ్రెస్లు ఏంటీ? అంటూ శిల్పాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరికొందరైతే ఉర్ఫీ జావేద్ ఫివర్ అంటుకుందా? ఆమెను డామినేట్ చేయాలని చూస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ ‘ప్లీజ్ మేడమ్ ఇలాంటి డ్రెస్లు వేయకండి.. మీ మీద చాలా గౌరవం ఉంది, దాన్ని పొగొట్టుకోకండి’ అంటూ స్పందిస్తున్నారు. కాగా ఈ అవార్డు వేడుకకు హీనా ఖాన్ సహా మలైకా ఆరోరా వంటి ఇతర నటీమణులు కూడా హాజరయ్యారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బాలీవుడ్ నటుడితో శిల్పా శెట్టి సోదరి డేటింగ్. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటి షమితా శెట్టి అంటే చాలామందికి తెలియదు. శిల్పా శెట్టి సోదరి అంటే చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' చిత్ర౦తో తెలుగు సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదంటూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గానే చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. నా అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇటీవల అమీర్ అలీతో షమితా శెట్టి ఓ వీడియో ముద్దులు పెట్టుకోవడంతో అది కాస్తా వైరలైంది. షమితా శెట్టి తన ఇన్స్టాలో రాస్తూ.. 'సమాజంలో ఇలాంటి మనస్తత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్ల భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి.' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు
తనపై ఉన్న ముద్దు కేసును కొట్టివేయాలంటూ బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి కోర్టు మెట్లు ఎక్కింది. 2007లో తనపై నమోదైన ఈ ముద్దు కేసుపై రీసెంట్గా ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ కేసును కొట్టివేయాలని శిల్పా తరపు న్యాయవాది మధుకర్ దాల్వీ కోర్టును కోరారు. లాయర్ మధుకర్ వాదన విన్న హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేసు పటిషనర్ పూనంచంద్ భండారి నాలుగు వారాల్లో తమ సమాధానం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. వివరాలు.. 2007లో శిల్పా శెట్టిని ఓ హాలీవుడ్ నటుడు పబ్లిక్గా ముద్దు పెట్టుకున్న సంఘటన అప్పట్లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్! 2007 ఏప్రిల్ 15న ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహ కార్యక్రమంలో శిల్పాశెట్టి, నటుడు రిచర్డ్ గేరితో పాటు తదితర నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిచర్డ్ గేరిని శిల్పా చేతులు పట్టుకుని స్టేజ్పైకి తీసుకువెళుతుంది. అనంతరం రిచర్డ్.. శిల్పాను హగ్ చేసుకుని ఆమెపై ముద్దు వర్షం కురిపించాడు. అప్పట్లో ఈ సంఘటన సినీ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు శిల్పాను విమర్శస్తూ పలు సామాజిక సంఘాలు మండిపడ్డాయి. ఇక పూనంచంద్ భండారి అనే వ్యక్తి శిల్పా, రిచర్డ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టులో పటిషన్ వేశాడు. చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్ అయితే.. 2011లో తనపై ఉన్న కేసును ముంబైకి బదిలీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరింది. శిల్ప పిటిషన్ కి పర్మిషన్ ఇస్తూ.. కేసును ముంబైకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. అయితే.. శిల్పపై ఉన్న రెండు నేరాలలో ఒకదాంట్లో నిర్దోషిగా తేలింది. ఇక రెండో నేరంపై కేసు ఇంకా నడుస్తోంది. శిల్ప తరపున మధుకర్ దాల్వీ, లాయర్.. అవచాట్ సింగిల్ బెంచ్ ముందు వాదించారు. దాల్వీ వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు వేసిన ఫిర్యాదుదారుడు పూనంచంద్ భండారితో పాటు స్టేట్ గవర్నమెంట్ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. -
రెడ్ మిర్చిలాంటి శిల్పా.. హాట్లుక్స్లో పూజాహెగ్డే
► పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హాట్ లుక్స్ ► ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన బాలాదిత్య ► భర్తతో రీల్స్ చేసిన నటి అష్మిత ► అల్లువారి అబ్బాయి బాబీకి భార్య బర్త్డే విషెస్ ► రెడ్సారీలో మిర్చిలాంటి అందంతో శిల్పాశెట్టి హోయలు ► క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మిహీకా బజాజ్ ► భర్తతో హీరోయిన్ స్నేహ బ్యూటిఫుల్ ఫోటోషూట్ View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Allu Neela Shah (@alluneelushah) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Aditya Yanamandra (@actor_balaaditya_official) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
కొంటెగా చూస్తున్న రకుల్.. మెరిసిపోతున్న కీర్తి సురేష్
► షెహ్నాజ్ గిల్ స్టన్నింగ్ లుక్స్ ► వైట్ కాస్ట్యూమ్లో శిల్పాశెట్టి గ్లామరస్ లుక్ ► స్టైలిష్ లుక్లో మెరిసిపోతున్న పూజా హెగ్డే ► కొంటెగా చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ► కళావతి గ్యాంగ్ను మిస్సవుతున్న కీర్తి సురేష్ ► శారీలో హీరోయిన్ మీనాక్షి అందాల కనువిందు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
హాట్ లుక్లో జాన్వీ.. గ్లామర్తో కవ్విస్తున్న రష్మీ
► అందంతో మాయ చేస్తున్న శివాత్మిక ► బ్లాక్ శారీలో రష్మీ గౌతమ్ గ్లామరస్ లుక్స్ ► కూతురితో హీరోయిన్ ప్రణీత క్యూట్ లుక్స్ ► ఎర్రటి గులాబీతో ఫోజోలిచ్చిన భాను ► హాట్ లుక్స్తో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by M.Bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్కుమార్రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్కు డ్యాన్స్లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసులో నన్ను బలి పశువుని చేశారు: రాజ్కుంద్రా వాదన
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువునయ్యానని రాజ్ కుంద్రా వాపోయాడు. ఈ కేసులో ఏ ఒక్క మహిళా తనకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని చెప్పాడు. తనపై మోపిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్కుంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ అభియోగపత్రంలో కానీ, సప్లిమెంటరీ చార్జీషీట్లో ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించాడని, బలవంతం పెట్టడాని కానీ, వీడియో తీసినట్టు చెప్పలేదని పటిషన్లో పేర్కొన్నాడు. ఇక తాను రాహస్యంగా ఎటువంటి కంటెంట్ను సృష్టించలేదని, తాను అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం కానీ చేయలేదన్నాడు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ చార్జీషీట్లో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని రాజ్కుంద్రా కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే. చదవండి: అమెజాన్లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ -
కాలు విరగ్గొట్టుకున్నా డోంట్ కేర్ అంటున్న హీరోయిన్స్
‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం. టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం. ‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం. కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా. కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి.. -
డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి షూటింగ్లో గాయపడింది. ప్రస్తుతం తను నటిస్తున్న వెబ్ సిరీస్లోని యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘వాళ్లు రోల్ కెమెరా.. యాక్షన్.. బ్రేక్ లెగ్ అన్నారు. అక్షరాల నేను అదే చేశాను. ఫలితంగా 6 వారాలపాటు షూటింగ్కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. చదవండి: విజయ్ అన్న చీజ్ కావాలంట? అంటూ కామెంట్స్, ‘రౌడీ’ రియాక్షన్ చూశారా? కానీ, తొందర్లోనే మరింత శక్తితో తిరిగి షూటింగ్లో పాల్గొంటాను. అప్పటి వరకు నన్ను గుర్తుచేసుకోండి. ప్రార్థనలు ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృతజ్ఞతతో మీ శిల్పాశెట్టి కుంద్రా’ అంటూ రాసుకొచ్చింది. కాగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ పోలీసు ఆఫీసర్’ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్రోల్ పోషిస్తుండగా.. శిల్పా పోలీసు ఆఫీసర్గా కనిపించింది. ఇందుకోసం ఇసుకలో పలు భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో శిల్పా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయతే గతంలో ఇదే షూటింగ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సైతం గాయపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
గ్లామర్తో హీరోయిన్ల యాక్షన్.. సినిమాకే హైలెట్ !
Bollywood Actress Action With Glamour In Upcoming Movies: బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. ఆల్రెడీ కొన్ని యాక్షన్ సినిమాలు చేసిన దీపికా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. గన్ పట్టుకుని తీక్షణంగా దీపికా గురిపెట్టినట్లు ఈ పోస్టర్ను చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు పోలీస్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, అలనాటి పాపులర్ హీరోయిన్ శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శిల్పాది పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్. ఈ రోల్ కోసం గన్ను ఫుల్గా లోడ్ చేసి వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టారు శిల్పా. ఇక 2017లో మిస్ వరల్డ్గా నిలిచిన మానుషీ చిల్లర్ ‘పృథ్వీరాజ్’ అనే పీరియాడికల్ ఫిల్మ్తో హీరోయిన్గా కెరీర్ను ఆరంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా వెండితెరపై యాక్షన్ టర్న్ తీసుకున్నారు. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘టెహ్రాన్’లో మానుషీ ఓ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘గుడ్లక్ జెర్రీ’ అనే సినిమా కోసం గన్ పట్టు కున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో కామెడీ టచ్ ఉంది. ఈ చిత్రం ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ ఫిల్మ్లో ఇంటర్పోల్ ఆఫీసర్గా చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అక్టోబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీరే కాదు.. ‘టైగర్ ఫ్రాంచైజీ’లోని ‘టైగర్ 3’లో చిత్రకథానాయకుడు సల్మాన్ ఖాన్కి దీటుగా కత్రినా కైఫ్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. అలాగే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ లేడీ సూపర్ హీరో సినిమా అంగీకరించారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘హీరో పంతి 2’ కోసం తారా సుతారియా గన్ పట్టుకున్నారు. ఈ చిత్రానికి అహ్మద్ఖాన్ దర్శకుడు. అలాగే టైగర్ ష్రాఫ్ హీరోగా చేస్తున్న మరో ఫిల్మ్ ‘గణపత్’లో కృతీసనన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ యాక్షన్ జాబితాలో ప్రియాంకా చోప్రా (హాలీవుడ్ ఫిల్మ్ ‘మ్యాట్రిక్స్ 4’), దిశా పటానీ వంటి వారు కూడా ఉన్నారు. అంటే.. ఈ ముద్దుగుమ్మలందరూ తమ గ్లామర్తోపాటు యాక్షన్ను పండించనున్నారని తెలుస్తోంది. మరి వీరి యాక్షన్ ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కానుందో, లేదా హైలెట్ అవనుందో వేచి చూడాల్సిందే. -
Beauty Tips: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను: శిల్పాశెట్టి
బాలీవుడ్ తెరపై వెలిగిన మంగళూరు అందం శిల్పాశెట్టి. తన సౌందర్యంతో యువతను కట్టిపడేసి 90వ దశకంలో ఆరాధ్య హీరోయిన్గా మారింది. నటిగా, నిర్మాతగా, డాన్సర్గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ యజమానిగా మారి వ్యాపారవేత్తగానూ రాణించింది. ఇక ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే 47 ఏళ్ల శిల్పాశెట్టి తరచుగా వీడియోలు షేర్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇక తన సౌందర్య రహస్యమేమిటో కూడా అభిమానులతో పంచుకుంది ఈ కర్ణాటక బ్యూటి. ‘‘కంటి నిండా నిద్ర.. నా ఫరెవర్ బ్యూటీ సీక్రెట్. పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను. అది మొహం మీది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ లేదంటే జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి మొహానికి రాసి.. కాటన్ ఉండతో తుడిచేస్తాను. దీనివల్ల మొహానికి సున్నితంగా మసాజ్ చేసినట్టయ్యి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలసట తీరి హాయిగా నిద్రపడుతుంది. తెల్లవారి మొహం కాంతులీనుతూ ఉంటుంది. ఈ కిటుకులన్నీ మా అమ్మ చెప్పినవే. వయసులో ఉన్నప్పుడు మొహానికి ఎన్ని కాస్మెటిక్స్ రాస్తే అంత త్వరగా వృద్ధాప్యం వస్తుందని ఆమె మాట. అమ్మ మాటను తు.చ తప్పకుండా పాటిస్తా!’’ అని ఆమె శిల్పాశెట్టి పేర్కొంది. కాగా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన శిల్పాశెట్టి.. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇక రాజ్కుంద్రాను వివాహమాడిన శిల్పకు వియాన్ అనే కుమారుడు జన్మించగా.. సరోగసీ ద్వారా కూతురు సమిషాకు కుంద్రా దంపతులు జన్మనిచ్చారు. చదవండి: Aishwarya Rai Bachchan: నాలుగైదు పూటలు తింటా.. నీళ్లు బాగా తాగుతా.. నా బ్యూటీ సీక్రెట్ అదే! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
హృతిక్ చేతికి ఆరో వేలు..సర్జరీకీ ససేమిరా, కారణం ఇదేనట!
వినోద రంగంలో సెంటిమెంట్లు, జాతకాలు, గుడ్డి నమ్మకాలకు విలువెక్కువ. ప్రతిభ కన్నా అదృష్టానికి గౌరవం ఎక్కువ. అందుకే ఆ ప్రభావం ప్రొడ్యూసర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీస్.. వాళ్ల నమ్మకాలను పట్టుకొచ్చాం ఈ శీర్షిక కోసం.. అసౌకర్యం కాదు అదృష్టం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఆరువేళ్ల అందగాడు హృతిక్ రోషన్ ఒక చేతికున్న ఆ ఆరోవేలుతో చాలా అసౌకర్యంగా ఉన్నా.. భరిస్తూ ఉంటాడు. ‘అంత భరించాల్సిన అవసరం లేదు భై.. సర్జరీతో సిక్త్ ఫింగర్ను తీసేయొచ్చు..’ అని డాక్టర్లు సూచించినా.. ససేమిరా అన్నాడట ఆ హీరో. కారణం.. అతనింట్లో పెద్దవాళ్లు ‘ఆ ఆరోవేలే నీ అదృష్టం’ అని సెలవిచ్చారట. సో.. అదలా కంటిన్యూ అవుతోందన్నమాట. అతని చేతికి ఆ ఆరోవేలు కనిపించినంత కాలం ఆ అంధవిశ్వాసాన్ని ఆ హీరో ఫాలో అవుతున్నట్టే అని అభిమానులు ఫిక్స్ అయ్యారట కూడా. ‘కె’ క్వీన్ టెలివిజన్ డ్రామా క్వీన్.. ఏక్తా కపూర్ విజయ రహస్యమేంటనుకుంటున్నారూ.. సాస్, బహూ సీరియల్స్ అనా? కాదు.. కానే కాదు.. ‘కె’ వర్డ్ .. సీక్రెట్ ఆఫ్ హర్ సక్సెస్. ఒక్కసారి ఆ సీరియల్స్ను గుర్తు తెచ్చుకోండి.. క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, కుమ్కుమ్ భాగ్య, కుండలి భాగ్య, కసౌటీ జిందగీ కే, కసమ్, కసమ్ సే, కలశ్ ఏక్ విశ్వాస్, కవచ్, కస్తూరీ ఎట్సెట్రా.. అన్నీ ఇంగ్లిష్ ‘కె’ వర్డ్ లేదా హిందీ ‘క’ పదంతో మొదలైనవే. ఒకవేళ తొలి అక్షరం ‘కె’ తో స్టార్ట్ అవకపోయినా సీరియల్ టైటిల్లో ఎక్కడైనా ‘కె’ ఉండేట్టు చూసుకుంటుందట ఏక్తా. ‘నా పర్యవేక్షణలో ఉండే సీరియల్స్ టైటిల్స్ విషయంలో నాకు ఈ కె సెంట్మెంట్ ఉన్న మాట నిజమే. అయితే చాలా మంది దాన్ని మూఢ నమ్మకం అంటారు. కానీ నాకైతే అది ఒక నమ్మకం. ఎవరేమనుకున్నా నేనేం ఫీలవను’ అంటుంది ఏక్తా కపూర్. అవుటాఫ్ కంట్రీ..| హీరో అక్షయ్ కుమార్కు.. ప్రాక్టికల్ మ్యాన్ అని కితాబు బాలీవుడ్లో. కానీ తన సినిమా విడుదల సమయం ఆసన్నమయ్యే సరికి సెంటిమెంటల్ ఫూల్లా వ్యవహరిస్తాడనీ కామెంట్.. అదే ఇండస్ట్రీలో. తన సినిమా రిలీజ్ అప్పుడు తాను ఇండియాలో ఉంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టదని భయమట అతనికి. అందుకే రిలీజ్ డేట్ డిసైడ్ కాగానే విదేశానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా సినిమా రిలీజ్కు తను దేశంలో లేనప్పుడల్లా ఆ సినిమా కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అవడం.. ఇక్కడే ఉంటే ఫట్ అవడం.. అతనిలో ఆ సెంట్మెంట్ బలపడ్డానికి కారణమట. హే..వి..టో!! సిల్లీ... శిల్పా శెట్టి నటే కాదు ఐపీఎల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా క్షణం తీరికలేని షెడ్యూల్స్ను హ్యాండిల్ చేసినప్పుడు ఆమెకు ఎలాంటి నమ్మకాలుండేవో కానీ రాజస్థాన్ రాయల్స్కు యజమాని అయింతర్వాత మాత్రం సిల్లీ (అని ఆమే అంటుంది) సెంటిమెంట్లను ఫాలో అవుతోందట. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.. ‘ ఒకసారి ఐపీఎల్ మ్యాచ్కు వెళ్లేప్పుడు మరచిపోయి రెండు వాచ్లు పెట్టుకెళ్లాను. అప్పుడు మా జట్టే గెలిచింది. ఇంకోసారి మా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చోని.. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్కి రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను.. అప్పుడూ మా టీమే గెలిచింది. తర్వాత ఒకట్రెండు మ్యాచ్లకూ అలాగే రెండ్ వాచ్లు పెట్టుకెళ్లడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం.. ఆ మ్యాచ్లూ గెలవడంతో ఆ అలవాట్లను సెంటిమెంట్లుగా మార్చేసుకున్నాను. సిల్లీనే.. కానీ సెంట్మెంట్ ఈజ్ సెంట్మెంట్ కదా..’ అంటూ కనుబొమలు ఎగరేస్తూ .. పళ్లు కనపడకుండా నవ్వుతుంది శిల్పా శెట్టి. -
లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేసిన శిల్పాశెట్టి
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బర్త్డే నేడు (జూన్ 8). ఈ రోజు ఆమె 47వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తనకు తానే ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చుకుంది. లగ్జరీ వ్యానిటీ వ్యాన్ను తన సొంతం చేసుకుంది. బ్లాక్ కలర్లో ఉన్న ఈ వ్యాన్లో సకల సదుపాయాలు ఉండేలా చూసుకుంది. కిచెన్, హెయిర్ వాష్ రూమ్, యోగా డెక్ సహా అన్నింటినీ అమర్చుకుంది. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే శిల్పా ప్రయాణం చేసేటప్పుడు సమయం వృథా చేయకుండా యోగా చేసేందుకే యోగా డెక్ను అరేంజ్ చేసుకుందట. ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్ఎస్కే అనే అక్షరాలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన నికమ్మ చిత్రం జూన్ 17న రిలీజవుతోంది. అలాగే రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్తో త్వరలో ఓటీటీలోనూ అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు అజయ్ దేవ్గణ్ (సింగం), రణ్వీర్ సింగ్ (సింబా), అక్షయ్ కుమార్ (సూర్యవంశి)లను పోలీస్ ఆఫీసర్స్గా చూపించిన రోహిత్ శెట్టి ఈసారి శిల్పాశెట్టిని పోలీస్గా వెండితెరపై ప్రజెంట్ చేయనున్నాడు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) Ab main sukh se keh sakti hu, it’s a WRAP! 😉#Sukhee, coming to you soon!@TheAmitSadh @KushaKapila #SonalJoshi @TSeries @Abundantia_Ent @vikramix @ShikhaaSharma03 #BhushanKumar pic.twitter.com/h33GY4Nc6m — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) June 7, 2022 చదవండి: రూ.40 వేల ఖరీదైన టీ షర్ట్ ధరించిన కరీనా, వెరీ చీప్ టేస్ట్ అంటున్న నెటిజన్లు నాన్న టార్చర్ పెడుతున్నాడు.. అభిమాని కష్టాలకు చలించిపోయిన హీరో -
సోషల్ మీడియాకు శిల్పా శెట్టి బ్రేక్, ఎందుకంటే?
Shilpa Shetty Goes Off Social Media: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన ఫ్యాన్స్కు షాకిచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలం వరకు తను సామాజిక మాధ్యమాల్లో కనిపించనని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పూర్తి బ్లాక్ ఫొటోను షేర్ చేసింది. ‘ఎలాంటి కొత్తదనం లేదు. అంతా ఒకేలా కనిపిస్తోంది. చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిల్పాశెట్టి రాసుకొచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. కాగా శిల్పా తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు తన పిల్లల వీడియోలను ఫ్యాన్స్తో పంచుకుంటుంది. అంతేకాదు ఆమె ఫిట్నెస్కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ యోగా, వ్యాయమం చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్కు సూచనలు ఇచ్చేది. ఇంతలో ఆమె సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని చెప్పడంతో శిల్పా ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. కాగా శిల్పాశెట్టి సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. దీనితో పాటు ఆమె త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్తో కలిసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ను రూపొందిస్తోంది శిల్పా. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్సిరీస్ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి: ఆడియన్స్కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్తో వెబ్సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్లో దుల్కర్తోపాటు రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్లో సోనాక్షి పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్తోనే కెరీర్ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
ఓటీటీలో ఎంట్రి ఇస్తున్న శిల్పాశెట్టి.. పోస్టర్ విడుదల
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్సిరీస్ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ని శిల్పా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. పోలీస్ డ్రెస్లో గన్ పట్టుకొని ఉన్న శిల్పాశెట్టి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లో స్పెషల్ సెల్ ఆఫీసర్గా సిద్ధార్థ్ మల్హోత్ర కనిపించనుండగా, అదే టీమ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా శిల్పా శెట్టి నటిస్తోంది. కాగా ఈ వెబ్సిరీస్ 8భాగాలుగా తెరకెక్కనుంది. Ready to set the OTT platform on fire for the first time🔥Superrr Thrilled to join The Action King #RohitShetty in his Cop Universe! #IndianPoliceForceOnPrime, now filming!🇮🇳👮♀️🚔💪 @SidMalhotra @PrimeVideoIN @RSPicturez #ShilpaShettyJoinsIndianPoliceForce #IndianPoliceForce pic.twitter.com/1JwOODKFZb — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) April 23, 2022 -
ఛీ.. ఇదా మీరిచ్చే గౌరవం.. శిల్పా శెట్టి, బాద్షాపై నెటిజన్ల ఫైర్
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్లతో హర్నాజ్ షేక్హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) 'ఈ జడ్జ్లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
శిల్పాశెట్టి అందానికే వన్నె తెచ్చిన చీర ధర ఎంతంటే?
తెలుగు ప్రేక్షకుల సాగరకన్య.. శిల్పాశెట్టి.. నటన కంటే ఆమె ఫిట్నెస్కే అభిమానులు ఎక్కువ. ఆ ఫిట్నెస్కు ఫిట్ అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్ కొన్ని .. ప్రింట్స్ బై రాధిక... అందమైన చిత్రకళ కొంతమందికి ఆనందాన్నిస్తే.. జైపూర్కు చెందిన రాధిక రావత్కు మాత్రం స్ఫూర్తిని ఇచ్చింది. ఆ ఆర్ట్ను ఆధారంగా చేసుకొని అందమైన దుస్తులను డిజైన్ చేయాలనుకుంది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. లండన్ వెళ్లి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చిత్రకళపై శిక్షణ తీసుకుంది. స్వదేశానికి తిరిగొచ్చి 2017లో సొంతంగా ‘ప్రింట్స్ బై రాధిక’ అనే ఓ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించింది. ఈ హౌస్లో లభించే దుస్తులన్నిటిపై ఉండే డిజైన్ను.. సొంతంగా రాధికే ముద్రిస్తుంది. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ప్రత్యేకమైన వేడుకలకు సరిపోయే డిజైన్స్ను రూపొందించడంలోనూ రాధిక సిద్ధహస్తురాలు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లలో ప్రింట్స్ బై రాధిక డిజైన్స్ లభిస్తాయి. మొజాటీ జ్యూయెలరీ సలోమీ షా బజాజ్.. శాస్త్రీయ నృత్యకళాకారిణి. వృత్తి రీత్యా సంప్రదాయ ఆభరణాల అవసరం తనకు చాలా ఎక్కువ. అయితే, తన నాట్యానికి సంబంధించిన ఆహార్యాన్ని తానే తయారుచేసుకోవాలనుకుంది. ఆ ఆలోచనే ఆమెను జ్యూయెలరీ డిజైనర్గా మార్చింది. తండ్రిది వజ్రాల వ్యాపారం కావడంతో తన పని మరింత సులువు అయింది. జెమాలజీ కోర్సు చేసి, ‘మొజాటీ’ పేరుతో జ్యూయెలరీ షాప్ను తెరిచింది. 18 క్యారెట్ల నాణ్యతతో అందమైన బంగారు ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. అయితే, ధర మాత్రం డిజైన్ను బట్టే ఉంటుంది. ఆన్లైన్లో కూడా మొజాటీ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: ప్రింట్స్ బై రాధిక ధర:రూ. 30,000 జ్యూయెలరీ బ్రాండ్: మొజాటీ ధర: రూ. 4,350 అందంగా కనిపించాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే, ఫ్యాషన్ కంటే ముందు నేను ఫిట్నెస్పై దృష్టి సారిస్తా: శిల్పా శెట్టి -
శిల్పాశెట్టి, ఆమె సోదరి షమిత శెట్టిలకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్కుంద్రా అశ్లీల వీడియో కేసుతో ఆమె కఠిన పరిస్థితులను చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా శిల్పా శెట్టికి కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలంటూ శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టిని కోర్టు ఆదేశించింది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే, సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్ అమ్రా ఆరోపించారు. ఈ మేరకు గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. -
విడాకుల దిశగా శిల్పా శెట్టి-రాజ్కుంద్రా!, అందుకేనా ఆస్తుల పంపకాలు?
Shilpa Shetty And Raj Kundra: గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భర్తపై కోపంతో ఉన్న శిల్పా అతడితో విడాకులు తీసుకోనుందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే గతంలో విడాకుల రూమర్లను శిల్పా కొట్టిపారేయడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా వీరి విడాకుల వ్యవహరం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: Mahesh Babu: డైరెక్టర్ శంకర్కు మహేశ్ క్షమాపణలు, కారణమేంటో తెలుసా? రాజ్కుంద్రా తన పేరుపై ఉన్న ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు వార్తల్లో నిలిచింది. కాగా రీసెంట్గా తన పేరుపై ఉన్న విలువైన ఆస్తులను రాజ్కుంద్రా, శిల్పాశెట్టి పేరు మీదకు మార్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సడెన్గా ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చడం వెనుక అంతర్యం ఏముందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఈ జంట విడాకులకు సిద్ధమైందని, త్వరలోనే వారి వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్కుంద్రా! పోర్నోగ్రఫి కేసు తర్వాత రాజ్కుంద్రా, శిల్పాల మధ్య తరచూ విభేదాలు వస్తుండటంతో విరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట మధ్య ఆస్తుల పంపకం జరుగుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై శిల్పాశెట్టి దంపతులు స్పందించే వరకు వేచి చూడాలి. కాగా రాజ్కుంద్రా.. ముంబైలో జుహులోని ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడట. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లను కూడా శిల్పా పేరు మీదకు బదలాయించినట్లు తెలుస్తోంది. -
శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్కుంద్రా!
గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న శిల్పాశెట్టి స్టాంప్ డ్యూటీ కింద రూ.1.9 కోట్లు చెల్లించగా ఈ లావాదేవీల వివరాలను జప్కే డాట్ కామ్ వెల్లడించింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్కుంద్రా భార్య శిల్పాశెట్టి పేరిట ఎందుకు మార్చారనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎట్టకేలకు 'ముద్దు కేసు' నుంచి శిల్పా శెట్టికి ఊరట
బహిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి భారీ ఊరట లభించింది. పదిహేనేళ్ల క్రితం నమోదైన ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం శిల్పా శెట్టి బాధితురాలని పేర్కొంది. 2007లో రాజస్తాన్లోని ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రిచర్డ్ శిల్పా అందానికి ముగ్ధులై ఆమె చేతులు పట్టుకుంటూ ఎదురుగా వెళ్లి ముద్దుల వర్షం కురిపించాడు. దీన్ని శిల్పాశెట్టి అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో అందరూ చూస్తుండగా బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ అనుచితంగా ప్రవర్తించారంటూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. తొలుత రాజస్థాన్లో నమోదైన కేసులను శిల్పా శెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. తాజాగా మరోమారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అసలు శిల్పా నిందితురాలు కాదని ఆమె బాధితురాలని పేర్కొంటూ ఆరోపణలను కొట్టిపారేసింది. -
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
స్పైడర్ మ్యాన్తో స్టెప్పులేయించిన శిల్పా శెట్టి.. ఎందుకో తెలుసా ?
Shilpa Shetty Dances With Spider Man For A Ticket Of Spider Man Movie: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, తన భర్త రాజ్ కుంద్రాను అనేక వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుకుంటోంది శిల్పా శెట్టి. తాజాగా ఆమె ఒక ఉల్లాసభరితమైన వీడియోను షేర్ చేసింది. అందులో సూపర్ హీరో స్పైడర్ మ్యాన్తో స్టెప్పులేసింది శిల్పా. స్పైడర్ మ్యాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ (Spider Man: No Way Home)'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల కానుండగా భారత్లో మాత్రం డిసెంబర్ 16న రిలీజ్ అయింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది శిల్పా శెట్టి. భారత్లో స్పైడర్ మ్యాన్ కొత్తం చిత్రం టికెట్లు హాట్ కేక్ల్లా అమ్ముడైపోతున్నాయి. క్షణాల్లో హాళ్లు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో శిల్పా శెట్టి ఒక్క టికెట్ కోసం స్పైడీని బతిమాలింది. ఆన్లైన్లో టికెట్ల కోసం చూస్తున్న శిల్పా శెట్టి తన గదిలోకి ప్రవేశించడంతో వీడియో ప్రారంభమవుతుంది. టికెట్లన్నీ అమ్ముడైపోయాయని అంటూ ఆమె గదిలోకి చూస్తుంది. గదిలో స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఆశ్చర్యోపోతుంది శిల్పా. వెంటనే అతని దగ్గరికి వెళ్లి 'నా కొడుకు కోసం ఒక్క టికెట్ ఇవ్వు' అని శిల్పా శెట్టి స్పైడీని వేడుకుంటుంది. దానికో నో అన్న స్పైడర్ మ్యాన్తో ఒక ఒప్పందం చేసుకుంటుంది శిల్పా శెట్టి. స్పైడీకి డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తే తనకు టికెట్ ఇవ్వాలని ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. 'చురా కే దిల్ మేరా' సాంగ్లోని సిగ్నేచర్ స్టెప్తో పాటు కొన్ని డ్యాన్స్ స్టెప్పులను శిల్పా శెట్టి స్పైడీకి నేర్పుతుంది. అయితే నటి నుంచి డ్యాన్స్ స్టెప్పులను నేర్చుకున్నా కూడా శిల్పాకు టికెట్ ఇప్పించలేకపోతాడు స్పైడీ. 'టికెట్ దొరక్కపోతే నాకు ఇంటికి వెళ్లే మార్గం లేదు (టికెట్ నహీ దోగే తో దేర్ ఈజ్ నో వే హోమ్ ఫర్ మీ). వియాన్ (శిల్పా కుమారుడు) నన్ను చంపుతాడు. నాకు టికెట్ ఇవ్వండి స్పైడర్ మ్యాన్.' అంటూ స్పైడర్ మ్యాన్ను శిల్పా శెట్టి బతిమాలుతుంది. అలాగే తను షేర్ చేసిన వీడియోకు 'అద్భుతమైన శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది స్పైడీ. నాకు నో వే హోమ్ ఉండకుండా టికెట్ ఇప్పించడం నీ బాధ్యత. ఎందుకంటే వెబ్లో నేను టికెట్ను పొందలేను కాబట్టి.' అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల శిల్పా శెట్టి 'హంగామా 2' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో పరేశ్ రావల్, మీజాన్, ప్రణిత సుభాష్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు'.. రాజ్ కుంద్రాపై ట్రోలింగ్
Netizens Trolls Raj Kundra For Hiding His Face: ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా రాజ్ కుంద్రాను ట్రోలింగ్ రూపంలో దురదృష్టం వెంటాడింది. గురువారం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ముంబై విమానాశ్రయం నుంచి ఏదో ప్రదేశానికి బయలుదేరారు. ఆ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. కారు నుంచి దిగిన వెంటనే రాజ్ కుంద్రా కెమెరాలకు చిక్కకుండా హడావుడిగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లాడు. ఎయిర్పోర్ట్లో పాప్ స్టేషన్ వద్ద ఆగకుండా ఫోన్ చూస్తూ వెళ్లిపోయాడు. అలాగే తన ముఖం పూర్తిగా కనపడకుండా ఉండేలా బ్లాక్ హుడీ ధరించాడు రాజ్ కుంద్రా. ఆ వీడియోలో శిల్పా శెట్టి ప్రశాంతంగా కారు దిగి ఎయిర్పోర్ట్ గేట్ల వద్దకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నీలం డెనిమ్, వైట్ స్నీకర్తో తెల్లటి చారల బ్లేజర్ను ధరించారు శిల్పా. ఇది గమనించిన నెటిజన్లు ఆ పోస్ట్పై అనేక రకాలుగా కామెంట్స్ పెట్టారు. రాజ్ కుంద్రా తన ముఖం కవర్ చేసుకున్నందుకు తెగ ట్రోల్ చేశారు. 'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు' అని ఒక యూజర్ కామెంట్ పెడితే, 'మీరు కూడా చూడకూడని పనులు చేయకండి' అని రాసుకొచ్చాడు. 'అప్పుడే సిగ్గులేని వాళ్లు మొహం దాచుకోవడం చూసి నవ్వుతారు' అని ఒకరన్నారు. 'అతను కెమెరా చూసి ఎందుకు మొహం దాచుకుంటున్నాడు. కెమెరా వెనుక ఉండి డైరెక్ట్ చేసినప్పుడు రాని సిగ్గు ఇప్పుడెందుకు' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇది చదవండి: వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్ -
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాల వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్
Shilpa Shetty And Raj Kundra Marriage Anniversary: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఆరోపణలు, వివాదాల నడుమ వారికి నేడు సంతోషకరమైన రోజు కానుంది. నవంబర్ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్ను పోస్ట్ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ అందమైన ఫొటోలతో పాటు '12 ఏళ్ల క్రితం ఈ క్షణం, ఈ రోజు మేము ఒక వాగ్దానం చేశాం. దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాం. కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రేమను విశ్వసిస్తూ, దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడని భావిస్తూ, ఒకరికొకరం ప్రతిరోజు నిలబడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేశాం. అసలు సమయం తెలియనేలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కుకీ' అని శిల్పా శెట్టి పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంకా 'ఇక్కడ మరెన్నో అనుభూతులు, నవ్వులు, మైలురాళ్లు, విలువైన ఆస్తులు మా పిల్లలు ఉన్నారు. అన్ని విధాల మాకు సహకరించిన మా శ్రేయోభిలాషుందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఈ పోస్ట్కు అభిమానులు, స్నేహితులు, సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు లైక్లు, కామెంట్లతో ముంచెత్తారు. ' వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు' అని నటి బిపాసా బసు కామెంట్ చేశారు. అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసుకు సంబంధించిన ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందితోపాటు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై రాజ్కు సెప్టెంబర్ 20న బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు -
నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి
రాజ్ కుంద్రా దంపతులపై ఒక వ్యాపారవేత్త చేసిన చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై నటి శిల్పా శెట్టి నోరు విప్పారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 'రాజ్, నా పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త నుంచి ఇప్పుడే తేరుకున్నాను. షాకింగ్గా ఉంది. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ వెంచర్ నిర్వహిస్తుంది కాషిఫ్ ఖాన్. అతను దేశవ్యాప్తంగా ఎఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ జిమ్లను తెరవడానికి బ్రాండ్ ఎస్ఎఫ్ఎల్ పేరుతో హక్కులు తీసుకున్నాడు. అతను అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని, బ్యాంకింగ్, రోజువారీ వ్యవహారాలలో సంతకం చేశాడు. అతని లావాదేవీల గురించి మాకు తెలియదు. అతని నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అన్ని ఫ్రాంఛైజీలన్నీ నేరుగా కాషిఫ్తోనే నిర్వహిస్తారు. పూర్తిగా కాషిఫ్ ఖాన్ ద్వారా నిర్వహించబడే కంపెనీని 2014లో మూసివేశారు.' అని శిల్పా శెట్టి ట్వీట్ చేశారు. pic.twitter.com/lu5rToq0Sg — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) November 14, 2021 'గత 28 ఏళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. నా పేరు, ప్రతిష్ట దెబ్బతినడం, నన్ను ఇబ్బందుల్లోకి లాగడం చూసి నాకు చాల బాధ పడ్డాను. భారతదేశ చట్టాలను గౌరవించే పౌరురాలిగా నా హక్కులు రక్షించబడాలి. కృతజ్ఞతలతో శిల్పా శెట్టి కుంద్రా.' అని కూడా ట్విటర్లో రాసుకొచ్చారు శిల్పా శెట్టి. -
మరో వివాదంలో చిక్కుకున్న రాజ్కుంద్రా దంపతులు
FIR Registered Against Shilpa Shetty And Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరో కేసులో చిక్కుకున్నారు.అడల్ట్ వీడియోల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన రాజ్కుంద్రాకు ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా అతనిపై రూ. 1.51 కోట్లు మోసం చేశాడని మరో కేసు నమోదైంది. కుంద్రాతో పాటు శిల్పా శెట్టి, మరికొంత మందిపై ఓ వ్యాపార వేత్త చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు సమాచారం. వ్యాపార వేత్త నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు వారిపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, జులై 2014లో ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతరులతో కలిసి లాభం పొందడానికి ఈ ఎంటర్ప్రైజ్లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీ ఇస్తుందని, పూణెలోని హడప్సర్, కోరేగావ్లలో జిమ్, స్పాను తెరుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని నితిన్ బరాయి పేర్కొన్నారు. తర్వాత నితిన్ బరాయి తిరిగి తన డబ్బు అడిగితే బెదిరించినట్లు ఫిర్యాదులో ఉన్నట్లు ఓ పోలీసు అధికారి ఉటంకించారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో రాజ్ కుంద్రా దంపతులపై సెక్షన్లు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం)తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైందని సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారి తెలిపారు. -
రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు
బాలీవుడ్ నటీ శిల్పా శెట్టీ, ఆమె భర్త రాజ్ కుంద్రా కలిసి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్టయిన చాలా రోజుల తర్వాత వీరిద్దరు ఇలా చెట్టాపట్టాలు వేసుకుని తొలిసారి కనిపించారు. ఈ కపుల్ హిమాచల్ ప్రదేశ్లోని ఓ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మ్యాచింగ్ యెల్లో ఔట్ఫిట్లో ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని గుడి ప్రాంగణంలో కనువిందు చేశారు. రాజ్ కుంద్రా పసుపు కుర్తా, తెలుపు పైజామా కాంబినేషన్లో ఉంటే.. శిల్పాశెట్టి పసుపు రంగుగల సల్వార్ కమీజ్ వేసుకున్నారు. వారు ఆలయంలో దర్శనం చేసుకోవడం, వారితోపాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండటం వైరల్ అవుతోంది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా జులైలో అరెస్ట్ కాగా.. సెప్టెంబర్లో బెయిల్ మంజూరైంది. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. అడల్ట్ వీడియోల నిర్మాణం, స్ట్రీమింగ్లలో పాల్గొనడం వంటి ఆరోపణలు వచ్చాయి. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి వారి పిల్లలు వియాన్ రాజ్ కుంద్రా, సమీషా శెట్టి కుంద్రాలతో కలిసి ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి తమ యాత్రకు సంబంధించిన గ్లింప్స్ను శిల్పా శెట్టి పంచుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్లలో రాజ్ కనిపించలేదు. మరోవైపు గత వారం, రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే. -
రాజ్కుంద్రా సంచలన నిర్ణయం..ఆ అకౌంట్లు డిలీట్
Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts: అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన బయటకు రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడటం లేదట. రీసెంట్గా జరిగిన 'కర్వా చౌత్' వేడుకలోనూ రాజ్కుంద్రా కనపడలేదు.చదవండి: షారుక్ ఖాన్ బర్త్డే.. వెలిగిపోతున్న 'మన్నత్' ఇదివరకు ఆయన వరుస పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అయితే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్, అనంతరం జరుగుతున్న వివాదాలతో కుంద్రా బాగా కుంగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో రాజ్కుంద్రా..తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా నీలి చిత్రాల కేసులో దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. చదవండి: చైతూతో ఉన్న ఇంట్లోనే సమంత.. కొత్త ఫ్లాట్లోకి చై! నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత -
Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్ని గుర్తుపట్టారా?
Halloween 2021: హాలోవీన్ అనేది అమెరికా, యూకే వంటి వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియాలో కూడా వచ్చేసింది. ప్రతి ఏడాది అక్టోబర్31న హాలోవీన్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా దెయ్యాల్లా విచిత్ర వేషధారణతో రెడీ అయ్యి ఫ్రెండ్స్తో సందడి చేస్తారు. హాలోవీన్ ఫెస్టివల్ అంటూ పలువరు స్టార్స్ దెయ్యాల్లా రెడీ అయ్యారు. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి. .. View this post on Instagram A post shared by miheeka (@miheeka) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Soha (@sakpataudi) View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) -
నో ఫిల్టర్ అంటున్న హారిక.. మోటివేషన్ అంటున్న శిల్పా
►మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి ► వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్న నేహా కక్కర్ ► నాలుగోసారి జాతీయ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ ► వెకేషన్లో దేత్తడి హారిక View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
కూతురితో సురేఖ చిందులు..కష్టపడుతున్న రష్మిక
►కూతురితో కలిసి సురేఖవాణి చిందులు ►జిమ్లో తెగ కష్టపడుతున్న రష్మిక ► గుర్రపు స్వారీ ఎక్సీపిరియన్స్ అద్భతమన్న నవ్యస్వామి ► వీకెండ్కు రెడీ అవుతున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Sushanth (@isushanthreddy) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు
Shilpa Shetty & Raj Kundra Sent Defamation Notice to Sherlyn Chopra: అశ్లీల చిత్రాల చిత్రీకరణ విషయంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఈ కేసు ఆరోపణల విషయమై శిల్పా దంపతులు నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా ఫోర్నోగ్రఫీకి కేసులో రాజ్కుంద్రా జైలులో ఉన్న సమయంలో ఆరోపించింది. ఇటీవల సైతం అతను లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరింది. తాజాగా ఈ కేసు విషయమై షెర్లిన్ ఆరోపణలు నిరాధారమని, వట్టి కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫు న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అవాంఛిత వివాదాలను సృష్టించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆ నటి ప్రయత్నిస్తుంది తప్ప అందులో ఎటువంటి నిజం లేదని అందులో పేర్కొన్నారు. చదవండి: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి! -
శిల్పా శెట్టి, రాజ్కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శిల్పా శెట్టి ఆమె భర్త తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డబ్బు తీసుకుని తమని మోసం చేశారంటూ పలువురు శిల్పా, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్.. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తనని శిల్పా ఆమె భర్త రాజ్కుంద్రా తనని మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది. అంతేగాక ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె మీడియాకు చూపించింది. చదవండి: రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో నోరా ఫతేహికి సమన్లు రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ డాన్తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారంటూ ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అదే విధంగా రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవాలని, లేకపోతే జీవితం నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఏప్రిల్ 19న రాజ్ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడని ఆమె ఆరోపణలు చేయడం మరోసారి సంచలనంగా మారాయి. -
హగ్ అడిగిన అనుపమ..ఫోటో షేర్ చేసిన మెహ్రీన్
►ప్రతీ చీరకు ఓ కథ ఉందంటున్న శిల్పా శెట్టి ► హగ్ అడిగిన అనుపమ ► బిగ్బాస్ ఫేం భానుకు విషెస్ తెలిపిన రోహిణి ► సన్ కిస్సింగ్ ఫోటోను షేర్ చేసిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
షో స్టాపర్స్ బ్యూటీ హంట్
షో స్టాపర్స్ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యూటీ హంట్ నిర్వహిస్తోంది. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. అక్టోబర్ 8 నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 2021 శుక్రవారం 15 అక్టోబర్న మొదలై అక్టోబర్ 24 వరకు బ్యూటీ హంట్ కొనసాగుతుంది. దీనికి జడ్జిగా నటి శిల్పాశెట్టి వ్యవహరించనున్నారు. షో స్టాపర్స్లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ఈ బ్యూటీ హంట్ సందర్భంగా బ్యూటీ ట్రెండ్స్, టాలెంట్స్, క్రియేటివిటీ, అద్భుతమైన ఆఫర్లు, మాస్టర్ క్లాసులను షో స్టాపర్స్ అందివ్వనుంది. -
కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి.. వీకెండ్ తలుపు తీసిన లావణ్య
►► కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి ►► వీకెండ్లో అక్కడ ఎవరంటున్న లావణ్య త్రిపాఠి ►► పికాసో పెయింటింగ్లా పాయల్ రాజ్పుత్ ►► సముద్రంలో హన్సిక మోత్వానీ ►► రెడ్ డ్రెస్లో అదరగొడుతున్న ‘అల వైకుంఠపురంలో’ బ్యూటీ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
పప్పీతో 'లైగర్' భామ.. కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి
► ఎలిగెన్స్కి కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి ► చందమామ బేబీ డాల్ లుక్స్ ► పప్పీతో అనన్య పాండే ► పదాలు అవసరం లేదంటున్న నిషా అగర్వాల్ -
'రాజ్కుంద్రా ఫోన్లో 119 నీలి చిత్రాలు.. రూ.9 కోట్లకు బేరం'
Raj Kundra Was Planning To Sell Adult Videos For Rs 9 Crores: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా జైలు జీవితం గడిపిన ఆయన నేడు (మంగళవారం) విడుదలై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లేముందు రాజ్కుంద్రా కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పు చేశానన్న అపరాధ భావం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. చదవండి : రాజ్కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా? ఇదిలా ఉండగా.. రాజ్కుంద్రా గురించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా కుంద్రా మొభైల్, లాప్టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 నీలి చిత్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వీడియోలను కుంద్రా రూ.9 కోట్లకు బేరానికి కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా ఫిబ్రవరిలో ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అక్కడున్న 11మందిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల పాటు దర్యాప్తు అనంతరం పోర్న్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇందులో శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా హస్తం ఉందన్న ఆరోపణలతో జులై 19వ తేదీన ముంబై పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జైలు నుంచి విడుదలైన కుంద్రాతో శిల్పా వైవాహిక జీవితం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. చదవండి: వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి During the investigation (in a pornography case), police found 119 porn videos from businessman Raj Kundra's mobile, laptop, and a hardrive disk. He was planning to sell these videos for Rs 9 crores: Mumbai Police Crime Branch pic.twitter.com/ZZNL5aY3EG — ANI (@ANI) September 21, 2021 -
రాజ్కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా?
Shilpa Shettys Reaction After Husband Raj Kundra Gets Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. రూ.50వేల పూచికత్తుతో ఆయనకు ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. 'భీబత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు(రెయిన్బో) ఏర్పడుతుంది' అంటూ ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్ను ఆమె పోస్ట్ చేశారు. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా 2009లో రాజ్కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పింది. ప్రస్తుతం రియాలిటీ షోలతో అలరిస్తున్న ఆమె ఇటీవలె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రా అరెస్ట్ అనంతరం ఆర్థికంగా నష్టపోయిన శిల్పాశెట్టి అవమానంతో కొన్ని రోజుల పాటు షూటింగ్కు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్న శిల్పా కుంద్రాతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు బీటౌన్లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్తో ఆ రూమర్స్ పటాపంచలైనట్లేనా లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : నాని..ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించావా: సమంత -
పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు బెయిల్
Raj Kundra Got Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుపై కోర్టు సోమవారం రాజ్కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్ మంజూరు అయ్యింది. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా అశ్లీల చిత్రాల కేసులో జులై19న రాజ్కుంద్రాను ముంబై క్రైం బ్రాం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఇటీవలె శిల్పాశెట్టి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత రాజ్కుంద్రాకు బెయిల్ వచ్చింది. చదవండి : దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్ -
టవల్తో అదితి.. ఇండియా వదిలి వెళ్తున్న పునర్నవి
► ఏమీ చేయకపోయినా పర్వాలేదంటున్న కాజోల్ ► ఇండియా వదిలి వెళ్లిపోతున్న పునర్నవి ► నన్నే చూడండి అంటున్న హీనా ఖాన్ ► వింటేజ్తో పాటు ట్రెండీ లుక్లో శిల్పాశెట్టి ► కొంటెగా చూస్తున్న శ్రద్దా కపూర్ ► టవల్ చుట్టుకొని స్టైల్గా ఫోజిచ్చిన అదితి భాటియా ► కఠిన వ్యాయామాలు చేస్తున్న జాన్వీ కపూర్ ► వీకెండ్ వైబ్స్ అంటున్న సదా View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్
Shilpa Shettys Vaishno Devi Trip: పోర్నోగ్రఫీ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్కు వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ ఆలయానికి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైష్ణోదేవీ ఆలయంలో శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి పిలుపు మేరకే దర్శననానికి వచ్చాను' అని శిల్పా పేర్కొంది. స్నేహితురాలితో కలిసి జమ్ముకశ్మీర్ పర్యటనను వచ్చిన శిల్పా దీనికి సంబంధించి పలు ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని గురువారం ముంబై పోలీసులు సాక్షిగా చార్జ్షీట్లో పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బిజీ షెడ్యూల్స్ వల్ల భర్త రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని శిల్పా పేర్కొంది. అంతేకాకుండా సంబంధిత హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ల గురించి కూడా తెలియదని స్టేట్మెంట్లో వివరించింది. అనంతరం అట్నుంచి నేరుగా జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లింది. చదవండి : 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' సీత కోసం ఆ హీరోయిన్స్ని సంప్రదించలేదు -
'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
Shilpa Shetty Says I don't know Raj Kundra Work: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్షీట్లో చేర్చారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్లో పేర్కొంది. 'నేను షూటింగ్స్లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ల గురించి కూడా నాకు తెలియదు' అంటూ శిల్పా చెప్పిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 1400పేజీల చార్జ్షీట్ను పోలీసులు ఫైల్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్షాట్స్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది. అంతేకాకుండా పోర్న్రాకెట్ను గట్టుచప్పుడు కాకుండా నడిపించిన రాజ్కుంద్రా ఇందుకు గాను వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్షీట్లో నమోదు చేవారు. మరోవైపు గత జులై19నుంచి రాజ్కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. చదవండి : బిగ్బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్?! -
బిగ్బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’
దేశవ్యాప్తంగా బిగ్బాస్కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రియాలిటీ షో ప్రారంభించిన అన్ని భాషల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. కాగా హిందీలో ప్రస్తుతం బిగ్బాస్ 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్లోకి తీసుకురావడం పరిపాటిగా మారింది. కాగా, తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్, శిల్పా సోదరి షమితా శెట్టి తల్లి షోలోకి ప్రవేశించింది. ఎంతో ధైర్యంగా మాట్లాడి, కూతురిని ప్రోత్సహించింది. ఆ సమయంలో షమితా శిల్పా ఎలా ఉందని అడగగా.. ‘ఆమె బావుంది. నిన్ను ఎంతో మిస్ అవుతోంది. ఎంత బిజీగా ఉన్న నీ గురించి ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకుంటోంది. మన ఇంట్లోని మహిళమైన శిల్పా, నువ్వు, నేను ఎంతో ధైర్యవంతులం. కాబట్టి ఏమి ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నీ ఆట నువ్వు ఆడు’ అంటూ సునంద కూతురిని ఉత్సాహపరిచింది. అంతేకాకుండా, సునంద హౌస్మేట్స్ అందరూ బాగా గేమ్ ఆడుతున్నారని పొగిడింది. మొదట షమితా స్నేహితుడు రాకేష్తో మాట్లాడిన ఆమె వారిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారని తెలిపింది. ప్రతి విషయంలోనూ కూతురికి సపోర్టుగా ఉంటున్నందుకు నేహకి ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Shamita Shetty FC (@shamitafc) -
జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి
Shilpa Shetty Brought Home an Idol of Lord Ganesha: ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తోంది. శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పా ఇమేజ్ డ్యామేజవడంతో ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేగాక 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంది. షూటింగ్లకు కూడా హాజరు కాని శిల్పా ఇటీవల బయటకు వచ్చి తిరిగి సెట్స్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా వినాయకచవితి పండగ సందర్భంగా ఆమె వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చదవండి: Shilpa Shetty: 'శిల్పా శెట్టి దంపతులు నా డబ్బుతో పోర్న్ వీడియోలు తీశారు' ప్రతి ఏడాదిలాగే శిల్పా ఈసారి కూడా వినాయకుడి ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిసారి శిల్పా తన కుమారుడు వియాన్, భర్త రాజ్కుంద్రా కలిసి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆటా పాటలతో అడంబరంగా ఇంటికి తీసుకుని వెళ్లేది. కానీ ఈ సారి ఆమె తన పనివారితో వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసింది. అంతేగాక గణపతి బప్ప మోరియా అంటూ అందరితో కలిసి ఆడంబరంగా విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్లింది. చాలా రోజుల తర్వాత శిల్పా ఇలా బయటకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆమె చుట్టూ చేరి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు! అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘భర్త జైలు ఉన్నప్పటికీ కుటుంబ సంప్రదాయాన్ని మాత్రం శిల్పా మరవడం లేదు’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. ‘భర్త జైలు పాలైనా శిల్పా మాత్రం సంతోషంగా పండగ చేసుకుంటోంది’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల శిల్పా శెట్టి, ఆమె భర్త మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారని, ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హల్చల్ :మెహ్రీన్ కవిత్వం..ప్రేమలో ఉన్నానంటున్న రకుల్
► ఏక్ బార్ అంటున్న దీప్తి సునయన ► చీర్స్ అంటున్న బుల్లితెర నటి అష్మిత ► అవి మాత్రం ఎవరికి కనిపించవుంటున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ► పచ్చని పొదళ్ల మధ్యలో హీరోయిన్ సదా ► దీంతో ప్రేమలో ఉన్నానంటున్న రకుల్ ► క్యాజువల్ లుక్లో రాహుల్ సిప్లిగంజ్ ► కవిత్వం చెబుతున్న మెహ్రీన్ ► త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన రాహుల్ ► మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
FIR against Raj Kundra, Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై మరో కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో శిల్పాశెట్టి దంపతులతో పాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎమ్కే మధ్వా, సత్యేంద్ర సరుప్రియ, ఉమేశ్ గోయాంక పేర్లున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యాపారవేత్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మన్సి మాలిక్.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించాడు. అనంతరం తదుపరి విచారణనను నవంబర్ 9కి వాయిదా వేశారు. -
భర్త రాజ్కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?!
Shilpa Shetty Divorce: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల రాజ్కుంద్రా పోర్నోగ్రఫి కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్లో విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై గత నెల 19న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్కుంద్రాను అరెస్టు చేశారు. సాక్ష్యాలు కూడా అతడికి వ్యతిరేకంగా ఉండటంతో జైలుకు కూడా వెళ్లాడు. జూడిషియల్ కస్టడీలో ఉన్న అతడు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడు. చదవండి: ‘బాహుబలి’తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు అయితే రాజ్కుంద్రా అరెస్ట్తో ప్రస్తుతం శిల్పా శెట్టి ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తున్నారు. అవమానంతో ఆమె కొద్ది రోజులు పాటు ఇంటి నుంచి బయటకు రాకుండ షూటింగ్లకు గైర్హాజరు అయ్యింది. ఈ మధ్యే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్న శిల్పా ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాను తప్పు చేశానంటూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. శిల్పా షేర్ చేసిన పోస్ట్లో..‘తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు’ అని రాసి ఉంది. అంతేగాక తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను అంటూ ఆమె పోస్ట్లో పేర్కొనడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాతో విడిపోనుందా? అంటూ వార్తలు పుట్టుకురావడం ప్రారంభం అయ్యాయి. చదవండి: నేను తప్పు చేశాను, మరేం పర్లేదు: శిల్పాశెట్టి అంతేగాక రాజ్కుంద్రా అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా ఆమె ముట్టుకోవద్దని భావిస్తున్నట్లు సమాచారం. భర్త అశ్లీల చిత్రాల వ్యవహరం తెలియగానే శిల్పా షాక్కు గురయ్యిందని, ఈ విషయం అప్పటి వరకు తనకు తెలియదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీంతో శిల్పా భర్తతో విడిపోవాలనుకుంటుందని, తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా ఇకపై నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిల్పాకు ఆమె భర్తకు మధ్య ఉండే గొడవలు తక్కువేం కాదని, వారి మధ్య ఇంతకు ముందు కూడా తరచూ ఏవొక సమస్యలు వస్తూనే ఉండేవని రాజ్కుంద్రా అరెస్టు అనంతరం ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. దీంతో ‘శిల్పా తన భర్తతో విడిపోవడం ఖాయమే’ అంటూ నెటిజన్లు, పరిశ్రమలోని కొందరూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో శిల్పా శెట్టి స్పందించే వరకు వేచి చూడాలి. -
నేను తప్పు చేశాను, మరేం పర్లేదు: శిల్పాశెట్టి
Shilpa Shetty Admitted to Making a Mistake: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్కుంద్రా అరెస్టు అయిన తర్వాత ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవడంతో మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య ఇన్స్పిరేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ పుస్తకంలో మిస్టేక్స్ అని రాసున్న అధ్యాయంలోని పేజీని షేర్ చేసింది. "చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే- సోఫియా లారెన్. చిన్నపాటి తప్పులు కూడా చేయకుండా మన జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకోలేం. అయితే ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు. మిస్టేక్స్ ఎప్పుడూ ఉంటాయి. అవి మనకి సవాలు విసిరేలాగా, ఉత్తేజపరిచే అనుభవాలుగా, ఆసక్తికరంగా, లేదా వాటిని మర్చిపోయేదిగా ఉండాలి. చేసిన తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. 'కాబట్టి.. నేను తప్పులు చేయబోతున్నా.. అయితే ఆ తప్పుల నుంచి నన్ను నేను క్షమించుకుని, వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను" అని రాసున్న పేజీ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో యాడ్ చేసింది. నేను తప్పు చేశాను. అయినా ఏం పర్లేదు అని ఈ పోస్టుపై రాసుకొచ్చింది. మిస్టేక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన శిల్పాశెట్టి తను చేసిన తప్పేంటి? అన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. -
రియాలిటీ షోకు శిల్పా రీఎంట్రీ, సెట్లో కన్నీరు పెట్టుకున్న నటి!
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు జైలులో ఉన్న రాజ్కుంద్రా బుధవారం బైయిలుపై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో శిల్పాశెట్టి తన షూటింగ్లో తిరిగి పాల్గొన్నట్లు సమాచారం. శిల్పా సూపర్ డ్యాన్సర్ 4 అనే రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తదుపరి ఎపిసోడ్లో శిల్పాశెట్టి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆమె క్యారవాన్ నుంచి బయటకు వచ్చి సెట్లోకి నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కాగా భర్త అరెస్టుతో గత మూడు వారాలుగా ఈ షోకు శిల్పా హాజరు కానీ విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో సంగీత బిజ్లానీ, జాకీ ష్రాఫ్, టెరెన్స్ లూయిస్, సోనాలి బింద్రే, మౌషుమి ఛటర్జీ, కరిష్మా కపూర్, జెనీలియా దంపతులు అతిథులుగా వచ్చారు. నెక్ట్ జరిగే ఎపిసోడ్లో ఇండియన్ ఐడల్ 12 విజేత పవణ్దీప్ రాజన్, ఇతర ఫైనలిస్టులు.. షణ్ముక ప్రియ, అరుణిత కంజిలాల్, సాయిలీ కాంబ్లే, మొహమ్మద్ డానిష్, నిహాల్ టౌరో భాగం కానున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా తిరిగి ఈ సూపర్ డ్యాన్సర్ 4 సెట్కు రాగానే డ్యాన్సర్, జడ్జీలు ఆమెను ఆప్యాయంగా స్వాగతించారు. ఇక వారి అభిమానం, ఆపాయ్యత చూసి శిల్పా భావోద్వేగానికి లోనయ్యారట. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే సోనీ టీవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా శిల్పా సహా-నిర్ణేత అనురాగ్ బసు ఆమె గైర్హాజరుపై స్పందిస్తూ తమ టీం ఆమెను చాలా మిస్ అవుతున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా శిల్పా 2016 నుంచి సూపర్ డ్యాన్స్ 4 షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై చీటింగ్ కేసు
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్గంజ్, విభూతిఖండ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్ వెల్నెస్ అండ్ స్పా పేరుతో ఫిటినెస్ సెంటర్ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్నెస్ సెంటర్ మరో బ్రాంచ్ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్ ఇచ్చి, సెంటర్ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. డీసీసీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. -
రాజ్కుంద్రా కేసు: శిల్పాశెట్టి ఇమేజ్కు పెద్ద దెబ్బ.. రూ.2 కోట్ల నష్టం
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజ్కుంద్రా అరెస్ట్తో నెటిజన్లు శిల్పాశెట్టి ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె కోట్లలో నష్టపోతుంది. ముంబై పోలీసులు ఎప్పుడైతే రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారో.. అప్పటి నుంచి శిల్పా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఆమె పాల్గొనాల్సిన పలు షోల షూటింగ్స్ని కూడా రద్దు చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోకి శిల్పా జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్కి శిల్పా రూ.18 నుంచి 22 లక్షల వరకు పారితోషికంగా పుచ్చుకుంటుందట. అయితే భర్త అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె ఈ షో షూటింగ్కి వెళ్లడం లేదు. దీంతో ఇప్పటి వరకు శిల్పాశెట్టి దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు షో షూటింగ్కి శిల్పా డుమ్మా కొట్టడంతో ఆమె స్థానంలో ఒక ఎపిసోడ్కి కరిష్మా కపూర్ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు. ఇలా గెస్ట్లతో ఈ షోని ఎక్కువ రోజులు నడిపించలేరు. మరోవైపు ఇప్పట్లో రాజ్కుంద్రా కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో ఈ డ్యాన్స్ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. -
సెబీ కేసులో శిల్పాశెట్టికి ఊరట
న్యూఢిల్లీ: షేర్హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్హోల్డింగ్ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెడితే 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్)కి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద కేటాయించింది. ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో వియాన్ ఇండస్ట్రీస్ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల షేర్హోల్డింగ్ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది. -
మీడియా ‘దర్యాప్తు’ మాకొద్దు: శిల్పాశెట్టి
ముంబై: నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారి రాజ్కుంద్రాపై దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ కోర్టుతో పాటు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నాయని రాజ్కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబ గోపత్యకూ ప్రజలు గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల ప్రైవసీకి భంగం కల్గించొద్దని ఆమె హితవు పలికారు. మీడియా సొంత ‘దర్యాప్తు’కు స్వస్తి పలకాలని, చట్టం తన పని తాను చేయనివ్వండని ఆమె మీడియాను కోరారు. నీలి చిత్రాలను నిర్మించి, వాటిని ‘హాట్ షాట్స్’ తదితర యాప్ల ద్వారా ప్రచారంలోకి తెచ్చారనే ఆరోపణలపై జూలై 19వ తేదీన ముంబై నేరవిభాగ పోలీసులు రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బుధవారం ఆయన చేసిన బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడం విదితమే. కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు, అరెస్ట్కు కారణాలు, కుంద్రా చట్టవ్యతిరేక చర్యలు అంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని, దీంతో తన కుటుంబానికి ప్రైవసీ లేకుండా పోయిందంటూ శిల్పా శెట్టి సోమవారం ‘ఇన్స్టాగ్రామ్’లో వివరణ ఇచ్చారు. ముంబై పోలీసులపై, భారత శాసన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఆరోపణల నుంచి కుంద్రాను విముక్తుణ్ణి చేసేందుకు, శాసనవ్యవస్థ ద్వారా మాకున్న అన్ని సహాయ అవకాశాలను మేం అన్వేషిస్తున్నాం. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తల్లిగా నేను కోరేది ఒక్కటే. అసంపూర్ణ సమాచారంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఆపండి. మా కుటుంబం ప్రైవసీకి భంగం కల్గించొద్దు. సమాంతర దర్యాప్తు చేయకండి. సత్యమేవ జయతే’ అని శిల్ప పోస్ట్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసు: మౌనం వీడిన శిల్పాశెట్టి.. తప్పుడు వార్తలంటూ ఫైర్
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తన భర్త అరెస్ట్పై శిల్పాశెట్టి ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ట్విటర్ వేదికగా తన భర్త అరెస్ట్పై ఒక ప్రకటన విడుదల చేసింది శిల్పా. రాజ్కుంద్రా కేసును మీడియా ట్రయల్ చేయడం సరికాదని, తన కుటుంబ వ్యక్తిగత స్వెచ్ఛను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయవద్దని కోరింది. పోర్న్ రాకెట్ కేసు విచారణలో ఉందని, ముంబై పోలీసులతో పాటు న్యాయవ్యవస్ధ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఓ కుటుంబంగా తాము న్యాయపరమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నామని, ఓ తల్లిగా తమ కుటుంబం, పిల్లల గోప్యతను గౌరవించి అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చెయ్యొద్దని శిల్పాశెట్టి విజ్ఞప్తి చేసింది. My statement. pic.twitter.com/AAHb2STNNh — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021 -
'శిల్పాశెట్టి స్థానాన్ని భర్తీ చేయలేను..ఆమెలా మరొకరు చేయలేరు'
Shilpa Shetty: హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా తీరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. క్రికెట్ బెట్టింగ్ మొదలు ఇప్పటిదాకా రాజ్కుంద్రా చేసిన పనుల వల్ల పరోక్షంగా శిల్పాశెట్టినే ఎక్కువ నిందలు భరించింది. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్ కావడం శిల్పాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటిదాకా తలెత్తిన ఆటుపోట్లు ఒకటైతే, కుంద్రా అరెస్ట్ అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓవైపు కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుండగానే, పలువురు హీరోయిన్లు సహా సొంత ఉద్యోగులే రాజ్కుంద్రాపై లైంగిక ఆరోపణలు చేస్తుండటం శిల్పాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాజ్కుంద్రా వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా ప్రస్తుతం జడ్జిగా ఉన్న సూపర్ డ్యాన్సర్ రియాలిటీ షో నుంచి తాత్కాలికంగా వైదొలిగింది. గత మూడు సీజన్స్లోనూ జడ్జిగా ఉన్న శిల్పా ప్రెసెన్స్ షోకు మరింత కలిసొచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షో పాపులర్ అయ్యేందుకు శిల్పా కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె తిరిగి జడ్జిగా వ్యవహరిస్తారా లేదా అన్నది సందేహమే. దీంతో శిల్పా స్థానంలో జడ్జిగా ఉండాలంటూ హీరోయిన్ రవీనా టాండన్ని షో ప్రతినిధులు సంప్రదించారని సమాచారం. అయితే ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన రవీనా.. శిల్పాశెట్టిలా మరొకరు చేసుకోలేరని అభిప్రాయపడిందట. అందుకే శిల్పా స్థానాన్ని తాను రీప్లేస్ చేయలేనని చెప్పేసినట్లు బీటౌన్ టాక్. -
రూ .3 వేల కోట్ల కుంభకోణం: రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో పీకలదాకా మునిగిపోయి, పోలీసు కస్టడీలో ఉన్న రాజ్కుంద్రాపై బీజేపీ నేత రామ్ కదం ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. ఒక మోడల్ని శారీరకంగా వేధించడమేకాకుండా, ఆన్లైన్ గేమ్ పేరుతో దాదాపు 3 వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆన్లైన్ గేమ్తో లక్షలాది మంది ప్రజలను మోసగించారని, దీని ప్రమోషన్ కోసం నటి శిల్పా శెట్టిని వాడుకున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ, ఈఏడాది ఏప్రిల్ 14 న జుహు పోలీస్ స్టేషన్లో రాజ్కుంద్రాపై ప్రముఖ మోడల్, కమ్-నటి శారీరక వేధింపుల ఫిర్యాదు చేసిందనీ, పోలీసులు కేసు నమోదు చేయక పోగా, ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆమెపై ఒత్తిడి తెచ్చింది ఎవరు, కుంద్రాపై చర్యలు ఎందుకు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’అనే ఆన్లైన్ గేమ్ను ప్రారంభించి, సామాన్య జనంనుంచి వేల కోట్లు వసూలు చేసిందని రామ్ ఆరోపించారు. భార్య, నటి శిల్పా శెట్టి ఫోటో ద్వారా ఆన్లైన్ గేమ్ కోసం జనాన్ని ఆకర్షించాడని విమర్శించారు. ప్రభుత్వం గుర్తింపున్న ఆన్లైన్ గేమ్ అని చెప్పి వయాన్ ఇండస్ట్రీస్ రూ .2500 నుండి 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. ఇలా దేశవ్యాప్తంగా అనేకమంది మోసపోయారన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అనేకమంది రూ. 30 లక్షలు, మరికొందరు 10 లక్షలు వరకు నష్టపోయారని పేర్కొన్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దాడి చేశారని బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేశారని రామ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం తాము హోంమంత్రి, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగరాలేను కలుస్తామన్నారు. -
శిల్పాశెట్టికి హైకోర్టులో చుక్కెదురు; పబ్లిక్ లైఫ్ ఎంచుకున్నారు కదా!
Bombay High Court On Shilpa Shetty Defamation Plea: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి వార్తా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో రాజ్కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో శిల్ప- రాజ్కుంద్రా దంపతుల వ్యవహారం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో... తమ పరువుకు భంగం కలిగించే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పలు మీడియా సంస్థలు, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ... పరువు నష్టం దావా వేసింది. శిల్పా పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి తరఫున హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ మాట్లాడుతూ.. ‘‘భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మీడియాలో రాయడం సరికాదు(కుంద్రాతో కలిసి పోలీసులు ఇంటికి వచ్చినపుడు శిల్పా భావోద్వేగానికి గురికావడం, వారి మధ్య జరిగిన గొడవను ఉద్దేశించి)’’ అని వాదించారు. ఇందుకు స్పందించిన జస్టిస్ గౌతం పటేల్ ... ‘‘పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు ఇతరుల(పోలీసులు) ముందే జరిగాయి. క్రైం బ్రాంచ్ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... ‘‘మీరు(శిల్పాశెట్టిని ఉద్దేశించి) పబ్లిక్ లైఫ్ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ‘‘ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో.. మీరు ఏడ్చారు. మీ భర్తతో వాదులాడారు’’ అన్న అంశాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే స్ఫురిస్తాయి’’ అని జస్టిస్ గౌతం పటేల్ అన్నారు. మీడియా స్వేచ్చను అడ్డుకునేలా తాము వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అయితే పిల్లల పెంపకం విషయంలో శిల్పాశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారన్న అంశాన్ని ప్రచురించే సమయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ.. సంమయనం పాటించాల్సిందని మీడియాకు హితవు పలికారు. -
మీడియాపై శిల్పాశెట్టి పరువునష్టం దావా
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా కేసులో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలతో పాటు, పలువురు జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
పోర్నోగ్రఫీ కేసు: ముందే ‘అలాంటి’ సీన్స్ రిహార్సల్ చేయమన్నారు
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే చాలా మంది బాలీవుడు నటీ,నటీమణులు పలు విషయాలు వెల్లడించారు తాజాగా నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ ఈ కేసు నేపథ్యంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బిగ్బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడని,అంతేకాకుండా షూటింగ్కి ముందే అలాంటి సీన్స్ రిహార్సల్స్ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. నిజంగా ప్రొఫెషనల్గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా అలాంటి సీన్స్ చేసి చూపించమని అడగరని చెప్పింది. గతంలో సోఫియా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్లో నటించింది. అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి ‘రిహార్సల్స్’చేయమని అడగలేదని, అందుకే ఆ ఏజెంట్ మాటలను తాను నమ్మలేదని సోఫియా చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి, అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరుతో పోర్న్ వీడియోలు చేయిస్త్నున్నారని మండిపడింది. ఇలా అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని, అలాంటి వారి పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించాలని సోఫియా అభిప్రాయపడింది. -
అటు పోర్నోగ్రఫీ కేసు : ఇటు వార్తల్లోకి శిల్పాశెట్టి తల్లి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపార వేత్త రాజ్కుంద్రా దంపతుల పోర్నోగ్రఫీ కేసు వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి తల్లి సునంద శెట్టి వార్తల్లో నిలిచారు. ఒక భూమి కొనుగోలు విషయంలో రూ .1.6 కోట్ల మేర మోసపోయానంటూ చీటింగ్ కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సుధాకర్ ఘారే నకిలీ పేపర్లతో ఒక ల్యాండ్ను విక్రయించారని సునందా ఆరోపించారు. తప్పుడు పత్రాలతో మోసం చేశాడని, రూ .1.6 కోట్లకు భూమిని విక్రయించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. రాజ్ కుంద్రా బెయిల్ మరోసారి తిరస్కరణ బెయిల్ విషయంలో కుంద్రాకు మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తన అరెస్ట్ను, పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తూ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేసింది. కాగా అశ్లీల చిత్రాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై జూలై 19న పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రాను కీలక కుట్రదారుడిగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసి, కోట్ల రూపాయలు దండుకున్నా డనేది కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టికి క్లీన్చిట్ లభించే అవకాశాలు కూడా కనిపించడంలేదు. మరోవైపు ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు అప్రూవర్లుగా మారడంతో మరింత ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఖాతాల్లోని లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
శిల్పాశెట్టి గురించి చెప్తూ.. బలవంతంగా నన్ను ముద్దుపెట్టుకుని..
ముంబై: పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్ డీల్ కోసం ఇంటికొచ్చిన రాజ్కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్నఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్కుంద్రాపై షెర్లిన్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 2019లో ఓ ప్రపోజల్ గురించి రాజ్ కుంద్రా తన బిజినెస్ మెనేజర్కు కాల్ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్ మీటింగ్ తరువాత రాజ్ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. అయితే ఇంటికి వచ్చిన రాజ్ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్షిప్ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది. అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్కు పారిపోయానని తెలిపింది. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేసింది. -
రాజ్కుంద్రాకు షాకిచ్చిన సెబీ
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. శిల్పా శెట్టి, రాజ్కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది.సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు వయాన్ సంస్థ ఉద్యోగులకు రాజ్కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్కుంద్రా బెయిల్ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్ పిటీషన్ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. -
పోర్నోగ్రఫీ కేసు: నాకెలాంటి సంబంధం లేదన్న నటి
ముంబై: ‘‘నేనొక నటిని. ప్రపంచంలో ఎక్కడో ఏ మూలనో కూర్చున్న వ్యక్తులు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ప్రచారం చేసే వదంతుల వల్ల నాకు వచ్చే అవకాశాలు చేజారతాయి. దయచేసి నన్ను వివాదాల్లోకి లాగకండి’’ అని నటి ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) విజ్ఞప్తి చేసింది. రాజ్కుంద్రాతో గానీ, అతడి అనుచరులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు ఏ పాపమూ తెలియదని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం అర్థించగా.. తిరస్కరించి కోర్టు అతడికి 14 రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో రాజ్కుంద్రా సన్నిహితుడు ఉమేశ్ కామత్తో ఫ్లోరా షైనీకి స్నేహం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ శనివారం నాటి నుంచి ఓ వాట్సాప్ చాట్ స్థానిక మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఫ్లోరా షైనీ.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇన్స్టాలో వీడియో షేర్ చేసిన ఆమె... ‘‘ రాజ్కుంద్రా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన భార్య శిల్పాశెట్టి కూడా నటి. కాబట్టి ఆయనకు చాలా మంది నటీనటులతో స్నేహం ఉండే ఉంటుంది. కానీ, నాకైతే ఆయనతో గానీ, రూమర్లు ప్రచారం అవుతున్నట్లుగా ఉమేశ్ కామత్తో గానీ ఎలాంటి సంబంధం లేదు. వారి కాంటాక్ట్ నంబర్లు కూడా నా వద్ద లేవు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగడం సరికాదు. నన్ను సంప్రదించకుండా, ఆ చాట్స్ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేస్తే ఆ చానెల్కు వచ్చే లాభమేమిటో అర్థం కావడం లేదు. నాపై చెడు ప్రచారం జరుగుతుంది కాబట్టే.. నేరుగా స్పందించాల్సి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడుతున్నారు. కాగా నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఆశా షైనీ.. కొంతకాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా షైనీగా మార్చుకుని.. బాలీవుడ్కు వెళ్లింది. శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావుల స్త్రీ బేగంజాన్, లక్ష్మీ తదితర సినిమాలతో పాటు గందీ బాత్ వెబ్సిరీస్లో నటించింది. View this post on Instagram A post shared by Flora Saini (@florasaini) -
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ముంబై: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ విచారణను తిరస్కరించిన కోర్టు.. అతడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తూ.. వాటిని హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రెండు రోజుల క్రితం శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీస్కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. అంతేకాక రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
రాజ్కుంద్రా కేసు: నటికి సమన్లు
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని అంచనా. కాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
భర్తతో గొడవ, పోలీసుల ముందు ఏడ్చేసిన శిల్పా
పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుంద్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించి అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది. ఇక హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజ్ కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ముంబై: పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులే కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. నీలిచిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల దగ్గర వెల్లడించడంతో కుంద్రా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఆయన ఉంటారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులోఆదివారం నాడు టెలివిజన్ నటి, మోడల్ గెహానా వశిష్ట్తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపినప్పటికీ వారు విచారణకు హాజరు కాలేదు. -
పోర్న్ కాదు... శృంగారమే తీస్తారు: శిల్పా శెట్టి
ముంబై: ఓటీటీలో పోర్న్ సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంలో పొడుగు కాళ్ల సుందరి తన భర్తకి అండగా నిలిచింది. తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని ముంబై పోలీసుల ఎదుట వెల్లడించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించింది. శుక్రవారం రాత్రి దాటేదాకా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు బృందం శిల్పను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫారమ్లో వచ్చేవన్నీ ఎక్కువగా కుంద్రా బావగారు ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్న్ సినిమాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప చెప్పినట్టు తెలిపాయి. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. ఆది నుంచీ వివాదాలే కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. ఐపీఎల్ బెట్టింగ్, బిట్ కాయిన్ ట్రేడింగ్లో ఆయన ప్రమేయంపై ప్రకంపనలు రేగాయి. పంజాబ్ నుంచి బ్రిటన్కు వలస వచ్చిన కుటుంబంలో 1975 నవంబర్ 9న లండన్లో కుంద్రా జన్మించారు. నేపాల్లో తొలుత శాలువాల వ్యాపారాలు చేశారు. బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పాల్గొన్న అనంతరం శిల్ప ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లినప్పుడు 2007లో లండన్లో కుంద్రాను కలుసుకున్నారు. రెండేళ్లపాటు డేటింగ్ చేశాక 2009లో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరూ ఐపీఎల్ రంగంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్లో పెట్టుబడి పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న కుంద్రాపై సుప్రీంకోర్టు కమిటీ జీవితకాల నిషేధం విధించింది. 2018లో రాజ్ని బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. -
అలా శిల్పాశెట్టిని ఇంప్రెస్ చేసిన రాజ్కుంద్రా
Raj kundra-Shilpa shetty love story: రాజ్కుంద్రా.. గత కొన్నిరోజుల నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలోనూ కుంద్రా భాగోతంపై జోరుగా చర్చ నడుస్తుంది. లండన్కు చెందిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ ఇండస్ర్టీ ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ఇక భర్త అరెస్ట్ అనంతరం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్కుంద్రా అప్పటి స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని ఎలా వల్లో వేసుకున్నారన్నదానిపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. రాజ్ కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. దీంతో 18 ఏళ్ల వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా..మొదట శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్లో అడుగుపెట్టి లాభాలు ఆర్జించాడు. ఆ సమయంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ చేస్తూ సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ డీల్ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టాడట. ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్లోనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్ శిల్పాకు ఊహించని షాక్ ఇచ్చింది. -
నా భర్త అమాయకుడు: శిల్పాశెట్టి
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో విచారణను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వహణ లండన్లో ఉన్న రాజ్కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేర రిజిస్ట్రర్ అయిన యస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కంటెంట్ ద్వారా వచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్కు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసులో ఏ క్షణమైనా శిల్పాశెట్టి అరెస్ట్!
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది. ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్పాశెట్టి..వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలె అంధేరి వెస్ట్లోని వియాన్ కార్యాలయానిపై దాడిచేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోల డేటాను సేకరించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్ యాప్కు 20 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
శిల్పాశెట్టి ఇంటికి ముంబై పోలీసులు .. ప్రశ్నించే అవకాశం!
-
పోర్నోగ్రఫీ కేసు: రాజ్కుంద్రాకు షాక్.. వెలుగులోకి సంచలన విషయాలు
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన శిల్పా బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను కీలక నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. జూలై 23 వరకు కోర్టు అతన్ని రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం మరోసారి ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, బెయిల్ పిటిషన్ని తిరస్కరించడంతో పాటు, పోలీసుల విజ్ఞప్తి మేరకు 27వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా మధ్య లావాదేవీలను విచారించాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది. పోర్న్ వీడియోలను భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టినట్లు అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తుందని ముంబై పోలీసులు తెలిపారు. 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్నట్లు వాట్సాప్ చాట్లో కనుగొన్నామన్నారు. ఈ డీలింగ్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు. -
భర్త అరెస్ట్పై తొలిసారి స్పందించిన శిల్పాశెట్టి
ముంబై : అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే భర్త అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు మాట్లాడని శిల్పాశెట్టి ..తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 'కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తుతను చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు' అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను శిల్పా హైలేట్ చేస్తూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా రాజ్కుంద్రా 2009లో శిల్పాశెట్టిని రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు బిజినెస్మెన్ కూతురు కవితను వివాహం చేసుకున్న ఆయన 2006లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రాజ్కుంద్రా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. వివాదాలతో రాజ్కుంద్రా పేరు మసకబారింది. ఇప్పుడు నీలి చిత్రాల వ్యవహారంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. భర్త వైఖరిపై తన నిర్ణయం స్పష్టంగా చెప్పకపోయినా రాజ్కుంద్రాకు శిల్పా అండగా నిలబడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
చేసిన పాపం ఎక్కడికిపోతుంది: రాజ్కుంద్రాపై నిర్మాత ఫైర్
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన బంగారాన్ని ఆయనకు అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. శిల్పా, రాజ్, ‘సత్యయుగ్ గోల్డ్’ కంపెనీలో అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. ఇది తమకు చెల్లించలేదని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై స్పందించిన సచిన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్లో తనపైనే బురద చల్లారంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు పోర్న్ వీడియో స్కాంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన వెంటనే సచిన్ జోషి భార్య, నటి ఊర్వశి శర్మ తన ఇన్స్టా స్టోరీలో..‘చేసిన పాపంవెంటాడుతుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టడం విశేషం. మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినరాజ్కుంద్రా రిమాండ్ను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. రాజ్ అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరుచేయాలన్న పిటిషన్ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనంతరం జూలై 27వరకు పోలీసు కస్టడీ విధించింది. -
భర్త అరెస్ట్తో రియాలిటీ షో నుంచి తప్పుకున్న శిల్పాశెట్టి!
Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా అరెస్ట్తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు హెడ్లైన్స్గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్ కనిపించడం రూమర్స్కు మరింత బలం చేకూర్చాయి. అయితే కరీష్మా కేవలం ఒక్క ఎపిసోడ్కు మాత్రమే గెస్ట్గా వచ్చారని, ఆమె షో మొత్తానికి కొనసాగరని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో శిల్పా శెట్టి స్థానంలో మరొకరు వస్తారా? లేక ఆమె తిరిగి జడ్జిగా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం రాజ్కుంద్రా సహా మిగతా కుటుంబసభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిల్పా బ్రేక్ తీసుకోగా, ఆమె స్థానంలో మలైకా అరోరా జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మరో రియాలిటీ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు శిల్పా శెట్టి ప్రధానపాత్రలో నటించిన 'హంగామా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్కుంద్రా అరెస్ట్తో శిల్పాకు గడ్డుకాలమనే చెప్పొచ్చంటున్నారు సినీ పెద్దలు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
రాజ్ కుంద్రా ఒక్కరోజు ఆదాయం రూ. 9 లక్షలు!
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హాట్ హిట్ యాప్ ద్వారా రాజ్ కుంద్రా రోజుకు లక్షల్లో ఆర్జించేవాడని.. ఒక్కోసారి గరిష్టంగా రోజుకు 8-9 లక్షల రూపాయల వరకు సంపాదించేవాడని తెలిసింది. ఓ సారి ఏకంగా రాజ్ కుంద్రా అకౌంట్లోకి 9.65 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడయ్యింది. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్లే స్టోర్లో ఈ యాప్ గురించి సర్చ్ చేస్తే.. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ‘‘బెస్ట్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఈ యాప్లో ఉంటాయి. ఈ యాప్లో వీడియోలు చూడాలంటే నెలకు 198 రూపాయలు, 45 రోజులకు 249 రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ హెచ్డీ వీడియోలను చూడొచ్చు’’ అని వెల్లడించారు. ఎబౌట్ అస్లో ‘‘హాట్ హిట్ అనేది ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్. ఇక్కడ మీరు వందల కొద్ది అడల్ట్ సినిమాలు, హిందీ వెబ్సిరీస్ ఎంజాయ్ చేయవచ్చు. హాట్హిట్ ఒరిజనల్స్ అడల్ట్ కంటెంట్ని ప్రసారం చేస్తుంది’’ అని డైరెక్ట్గా ప్రకటించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్లీల చిత్రాల కోసం నగ్న సన్నివేశాలను చిత్రీకరించాలని ఔత్సాహిక నటీమణులను బలవంతం చేసినందుకు గాను ముంబై పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి విచారణ సందర్భంగా రాజ్కుంద్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా చిత్రీకరించిన అశ్లీల చిత్రాలను పెయిడ్ వెబ్సైట్లు, యాప్లలో ప్రసారం చేస్తారు. రాజ్ కుంద్రా మొబైల్ రికార్డుల పరిశీలనలో హాట్ హిట్ నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వస్తున్నట్లు చూపించింది. ఫిబ్రవరిలో ఈ పోర్న్ రాకెట్ వెలుగు చూడటానికి కొన్ని రోజుల ముందే రాజ్ కుంద్రాకు ఫిబ్రవరి 3 న హాట్ హిట్ నుంచి రూ. 2.7 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది. అదేవిధంగా జనవరి 23 న రూ. 95,000, జనవరి 20 న రూ. 1 లక్ష, జనవరి 13 న రూ. 2 లక్షలు, జనవరి 10 న రూ. 3 లక్షలు రాజ్ కుంద్రా అకౌంట్కు మనీ ట్రాన్ఫ్ఫర్ జరిగినట్లు వెల్లడయ్యింది. అంతకుముందు, ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే మాట్లాడుతూ, రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ బక్షికి చెందిన రెండు కంపెనీలకు కెన్రిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్షాట్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్' అనే మొబైల్ యాప్ ఉందని తెలిపారు. ఈ హాట్షాట్ యాప్ వివాదానికి కేంద్రంగాఉంది. ఈ యాప్ ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. -
రాజ్కుంద్రా అరెస్ట్; వైరల్ అవుతున్న రహానే పాత ట్వీట్
ముంబై: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానేను రాజ్ కుంద్రా వ్యవహారం చిక్కుల్లో పడేలా చేసింది. విషయంలోకి వెళితే.. 9 ఏళ్ల కిత్రం 2012లో రహానే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడిగా ఉన్నప్పుడు రాజ్ కుంద్రాను మెచ్చుకుంటూ చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ''రాజ్ కుంద్రా మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.'' అంటూ పేర్కొన్నాడు. అప్పటికి రాజస్తాన్ రాయల్స్ సహ యజమానిగా ఉన్న కుంద్రా రహానే ట్వీట్కు బదులిచ్చాడు. '' థ్యాంక్యూ సో మచ్ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్లో చూడాలి'' అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రహానే కూడా.. '' తప్పకుండా వస్తాను సార్'' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అభిమానులు రహానే, రాజ్ కుంద్రాల మధ్య జరిగిన ట్వీట్ సంభాషణలను మరోసారి పోస్ట్ చేశారు. అయితే ఒక క్రికెటర్గా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు ఎదుర్కోని రహానేకు రాజ్ కుంద్రాకు చేసిన ట్వీట్లు చిక్కుల్లో పడేశాయి. అయితే రహానే, రాజ్కుంద్రాల మధ్య జరిగిన సంభాషణ గురించి సరైన సమాచారం లేకపోయినా.. ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో బహుశా వీరి మధ్య ఇలాంటి చర్చ జరిగినట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. రహానే అలాంటివి చేయడని.. వేరే విషయంపై రాజ్ కుంద్రాను అభినందించినట్లు మరికొందరు కామెంట్ చేశారు. కాగా 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా 2015లో రాజస్తాన్ రాయల్స్తో పాటు క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. కాగా రహానే ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను టార్గెట్గా చేసుకుని వారిని పోర్న్ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్లలో అప్లోడ్ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు. @TheRajKundra Sir you are doing a Great job.. — Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012 @TheRajKundra yeah I wil for sure sir:) — Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012 -
అవి అసలు పోర్న్ వీడియోలే కాదు: కుంద్రాకు మద్దతుగా నటి
సాక్షి,ముంబై: అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై వివాదాస్పద నటి మోడల్ గెహనా వశిష్ట్ (వందన తివారీ) స్పందించింది. తాము ఎలాంటి పోర్న్ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ కావాలనే కొంతమంది తమను టార్గెట్ చేశారని ‘గంధీ బాత్’ ఫేమ్ గెహనా ఆరోపించింది. శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది గెహనా. తానసలు పోర్న్ సినిమాల్లో నటించనే లేదని చెప్పు కొచ్చింది. తమ వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్ కేటగిరీ కిందకి రాదనిపేర్కొంది. అంతేకాదు ఏక్తాకపూర్ లాంటి వారు చేసే వీడియోల్లాంటివే తప్ప, అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ కుంద్రాను వెనకేసు కొచ్చింది. ముందు తమ వీడియోలను చూసి, అపుడు అవి పోర్న్ అవునో కాదో తేల్చాలని మీ అందరినీ కోరుతున్నానని వ్యాఖ్యానించింది. ఎరోటికా కంటెంట్తో పోర్న్ను కలపడం సరైంది కాదంది. నిజానికి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అసలైన పోర్న్ వీడియోలపై దృష్గి పెట్టాలని ఆమె కోరింది. అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరున్న ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. నిజమైన నేరస్థు లెవరో, కోర్టులు తేలుస్తాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని తెలిపింది. కావాలనే తనను, శిల్పాశెట్టి, కుంద్రాను టార్గెట్ చేస్తున్నారని గెహనా వశిష్ట్ ఆరోపించింది. రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారని, ఈ సమయంలో ఈ సంస్థ ద్వారా పోర్న్ ఫిల్మ్ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కుంద్రాతోపాటు, ర్యాన్ థార్ప్ను కూడా మంగళవారం కోర్టుముందు హాజరు పర్చిన పోలీసులు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. -
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
-
‘మీకు డబ్బులు ఎలా వస్తాయి’.. నా భర్త చాలా కష్టపడతాడు: శిల్పా శెట్టి
Raj Kundra Arrest: లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా ఆదాయం గురించి భార్య శిల్పా శెట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కపిల్ శర్మ షోకు ఓ సారి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితా శెట్టి గెస్ట్లుగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ, రాజ్ కుంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ఎప్పుడు చూసినా టైం పాస్ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుందని’’ ప్రశ్నిస్తాడు. అంతేకాక ‘‘మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ, భార్యతో షాపింగ్ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ, బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది’’ అని కపిల్ శర్మ ప్రశ్నిస్తాడు. అందుకు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, షమితా ముగ్గురు పెద్ద పెట్టున నవ్వుతారు. ఆ తర్వాత శిల్పా శెట్టి బదులిస్తూ.. ‘‘నా భర్త చాలా కష్టపడతారు.. ఒక్కోసారి ఆయన గంటలకొద్ది పని చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది దొరకదు’’ అని సమాధానం చెప్పారు. ఏళ్ల నాటి ఈ వీడియో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజనులు ‘‘కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇన్నాళ్లకు సరైన సమాధానం లభించింది’’.. ‘‘సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’.. ‘‘అవును పాపం.. పోర్న్ సినిమాలు తీయడానికి.. అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. शिल्पा शेट्टी के पति राज कुंद्रा को क्राइम ब्रांच ने अश्लील फिल्में बनाने के आरोप मे किया गिरफ्तार. Finally everyone got the right answer of the question asked by kapil sharma on #TheKapilSharmaShow many years ago.#RajKundra #shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/TcMFujKiyu — Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) July 19, 2021 -
మోడల్స్కు గాలం.. ఆపై వేధింపులతో పోర్న్ కంటెంట్
-
పొర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్
Raj Kundra: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రాను సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలె తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్ మొబైల్ యాప్స్కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
హల్చల్ :దిశ-రాహుల్ల పెళ్లి సందడి.. స్లిమ్ లుక్లో షెహ్నాజ్
♦ స్లిమ్ లుక్తో షాకిచ్చిన షెహ్నాజ్ ♦ ఫుల్ జోష్లో మెహ్రీన్..రోజుకో పోస్టు ♦ వాటికి 100 మార్కులు ఇస్తానంటున్న శివాత్మిక ♦ కష్టమైన పనులు సింపుల్గా ♦ పింక్ అంటే లవ్ అంటున్న కృతి సనన్ ♦ వితికా స్టన్నింగ్ స్టిల్స్ ♦ సంతోషానికి అదే లాంగ్వెజ్ అంటున్న శిల్పా శెట్టి ♦ పెళ్లికి సిద్దమైన దిశ-రాహుల్ View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) -
హల్చల్ : మలైకా ర్యాంప్ వాక్.. నా లెవల్కి రావాలంటున్న మహి
♦ ర్యాంప్ వాక్ హోయలొలుకుతున్న మలైకా అరోరా ♦ మళ్లీ అలా కనిపించాలనుకుంటున్న నేహా కక్కర్ ♦ నా లెవల్కు రావాలంటున్న మహి ♦ ప్రతీ రోజును ఆస్వాదించాలంటున్న నవ్య స్వామి ♦ పడుచుపిల్లలా శిల్పా శెట్టి.. ♦ భర్త మూవీకి నాజ్రియో ప్రమోషన్ ♦ పాజిటివ్గా ఉంటే లైఫ్ మరింత అందంగా మారుతుందంటున్న హీనా ఖాన్ ♦ మెస్సీ మమ్మా-నాటీ నైరా సిరీస్తో సమీరా View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
హల్చల్ : రకుల్ కిటుకులు.. ఆలియా ఆసనాలు
♦ కూతురితో యోగాసనాలు వేస్తోన్న మంచు లక్ష్మి ♦ కుంజర క్రియతో డే స్టార్ట్ చేసిన రకుల్ ♦ అమ్మతో అనన్య పాండే ♦ తారాతో అందమైన ఫోటో షేర్ చేసిన మహి ♦ లాక్డౌన్ మూడ్ స్వింగ్స్ అంటోన్న పునర్ణవి ♦ ఫాధర్స్ డే డిన్నర్ స్పెషల్ అంటోన్న అర్జున్కపూర్ ♦ చీరలో అందంగా ముస్తాబైన శ్యామల View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) -
నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్లలా 'యోగా' భామలు
యోగా..శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా యోగా వైపే అడుగులేస్తున్నారు. యోగాతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే చాలామంది హీరోయిన్లు యోగాతో తమ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ పడుచుపిళ్లలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్గా తయారువుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం అంటున్నారో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోయిన్లలో యోగా క్వీన్ అనగానే గుర్తొచ్చేది శిల్పాశెట్టి. 46ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ చాలా యంగ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగాపై ఏకంగా ఒక పుస్తకమే రాసేసింది. యోగాతోనే తన డే రొటీన్ మొదలవుతుందని పలుమార్లు చెప్పిన శిల్పా..ప్రతిరోజూ ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. అందుకే ఇప్పటికీ వన్నెతరగని అందంతో సూపర్ ఫిట్గా అలరిస్తుంది. యోగా నేర్చుకోవాలనుకునే చాలామంది శిల్పాశెట్టి వీడియోలు ఫాలో అవుతారంటే యోగాపై ఆమెకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్తో యంగ్ హీరోయిన్లకు సైతం సవాలు విసురుతున్న మరో బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50కి దగ్గర్లో ఉన్నా నేటికీ ఎంతో ఫిట్గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నిత్యం గంటల తరబడి యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రియుడు అర్జున్కపూర్ చేత కూడా యోగాసానాలు వేయిస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు #StartTohKaro అనే ఒక కార్యక్రమం సైతం చేపట్టింది. ఫిట్నెస్ విషయంలో సమంత చాలా శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు సమానంగా బరువులు ఎత్తుతూ తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసిన సామ్..రోజులో కొంత సమయాన్ని యోగా కోసం తప్పకుండా కేటాయించాలని అభిమానులకు సూచిస్తున్నారు. భర్త నాగచైతన్యతో కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. హీరోయిన్ కరీనా కపూర్ ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. ప్రతిరోజూ యోగా తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. అందుకే డెలీవరీ తర్వాత కూడా నిపుణుల సూచనలతో యోగాసనాలు వేస్తూ నేటికీ జీరో సైజ్ కాపాడుకుంటుంది. యోగాతో అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అలవడుతుందని అంటోంది నటి మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. ప్రతిరోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని పేర్కొంటుంది. కూతురు నిర్వాణతో కలిసి ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. యోగాతో మరింత దృఢంగా మారొచ్చని అంటోంది మంచు లక్ష్మి. రకుల్ప్రీత్ సింగ్కు ఫిట్నెస్ మీద ఎంతో ఫోకస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా యోగా వల్లే తాను కరోనా నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది. యోగా దినోత్సవం సందర్భంగా కంజుర్ క్రియతో తన దినచర్యను ప్రారంభిస్తున్నానని పేర్కొంటూ ఆ ఫోటోలను ఇన్స్టాగగ్రామ్లో షేర్ చేసింది. ప్రతిరోజు తన దినచర్యలో యోగా భాగమైపోయిందంటోంది నటి మాధురీ దీక్షిత్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలను షస్త్రర్ చేసిన ఆమె.. నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి అంటూ అభిమానులను ప్రోత్సహించింది. -
ఐశ్.. 75 లక్షల చీర కట్టింది.. మరి శిల్పా, కరీనా ఏమైనా తక్కువా!?
వెబ్డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం అంటే వివాహమే. ఒంటరిగా సాగుతున్న జీవన ప్రయాణంలో భాగస్వామి అడుగుపెట్టడంతో జీవితం పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు చాలా మంది. అచ్చంగా మన సొంతమయ్యే తోడుతో బంధం ఏర్పడే ఆ అపురూప ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లిరోజున ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి.. ఆపాదమస్తకం ఎలా తయారు కావాలి అన్న విషయాల గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తమ స్తోమతకు తగ్గట్లుగా బడ్జెట్లో అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే, మనలాగా ఆర్థిక లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజు మరింత అందంగా కనబడేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఐశ్వర్యారాయ్ మొదలు ప్రియాంక చోప్రా వరకు పలువురు హీరోయిన్లు ధరించిన దుస్తులు, వాటి ఖరీదు తదితర వివరాలు తెలుసుకుందాం. డిజైన్లు నచ్చితే.. అచ్చంగా అవేకాకపోయినా అలాంటి వాటిని పోలిన దుస్తుల్లో మెరిసిపోయేందుకు రెడీ అవ్వొచ్చు కదా. ఏమంటారు?! రూ. 75 లక్షల ఖర్చు! మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ 2007, ఏప్రిల్ 20న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకువచ్చిన ఈ జంట.. పెళ్లిరోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్.. తమ సంస్కృతికి పెద్దపీట వేస్తూ.. నీతా లుల్లా డిజైన్ చేసిన కాంజీవరం చీర ధరించింది. బంగారు తీగలు, స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ. 75 లక్షలట. అప్పటి వరకు ఒక పెళ్లికూతురు ధరించిన అత్యంత ఖరీదైన అవుట్ఫిట్ ఇదేనని ఫ్యాషన్ నిపుణుల మాట. మరి ఐశ్వర్యారాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా! ‘సాగరకన్య’ చీర ధర అరకోటి! ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకోవడంతో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. 2009లో రాజ్కుంద్రాను వివాహమాడిన ఈ ‘సాగరకన్య’.. పెళ్లినాడు తరుణ్ తహిలియాని రూపొందించిన అవుట్ఫిట్ ధరించారు. ఇందులో దాదాపు 8000 స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ఇమిడిఉన్నాయట. దాని ధర రూ. 50 లక్షలు అని ఫ్యాషన్ వర్గాల భోగట్టా. ‘సవ్యసాచి’ డిజైన్తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లిరోజున తమ వస్త్రధారణ మరింత స్పెషల్గా ఉండేలా చూసుకున్నారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన అవుట్ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు. ఆనాడు అనుష్క ధరించిన పేస్టల్ కలర్ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట. అత్యంత ఖరీదైన, అందమైన దుస్తుల్లో సోనం! ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు పొందింది స్టార్ కిడ్ సోనం కపూర్. సినిమాలతో పాటు తన వస్త్రధారణ పట్ల తన అభిరుచితో ఎంతో మంది అభిమానం చూరగొన్న ఈ భామ.. 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. అనురాధా వకీల్ రూపొందించిన ఎరుపు రంగు అవుట్ఫిట్లో మెరిసిపోయిన సోనం.. దీనికోసం సుమారు 70- 90 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. పిగ్గీచాప్స్ సైతం తనదైన స్టైల్లో.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండేసి సార్లు పెళ్లిప్రమాణాలు చేసిన ఈ జంట.. తమదైన శైలి డిజైన్లతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలట. దీప్వీర్.. రెండు కళ్లుచాలవంటే నమ్మరు! బీ-టౌన్లో అత్యంత రొమాంటిక్ కపుల్గా పేరొందిన జంట దీపికా పదుకొనె- రణ్వీర్ సింగ్. సుమారు ఐదేళ్ల పాటు ప్రణయ బంధంలో మునిగితేలిన దీప్వీర్ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది, ఉత్తరాది పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లినాడు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. సవ్యసాచి డిజైన్ చేసిన అవుట్ఫిట్లు ధరించి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘‘సదా సౌభాగ్యవతి భవ’’ అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.. తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట. ఇక వీరే కాదు.. కరీనా కపూర్(50 లక్షలు), ఊర్మిళా మటోంద్కర్(నాలుగున్నర లక్షలు), బిపాసా బసు(4 లక్షలు), దియా మీర్జా(3 లక్షలు), ఇషా డియోల్(3 లక్షలు) వంటి నటీమణులు సైతం స్పెషల్ డేను అందమైన దుస్తులు ధరించి మరింత స్పెషల్గా మార్చుకున్నారు. చదవండి: తాను అక్రమ సంతానాన్ని అని తెలుసుకున్న ‘లోకి’ ఏం చేయబోతున్నాడు? -
హల్చల్ : సన్నీలియోన్ ఫోటో షూట్..కోపంగా చూస్తున్న మెహ్రీన్
♦ వైరలవుతున్న సన్నీలియోన్ లేటెస్ట్ ఫోటో షూట్ ♦ బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న దిశా పటానీ ♦ ఫ్లోరల్ డ్రెస్లో గులాబి వర్ణంలో కీర్తి సురేష్ ♦ భార్య ప్రియాంక చోప్రాను మిస్ అవుతున్నానంటున్న నిక్ ♦ కోపంగా చూస్తున్న మెహ్రీన్ ♦ న్యూ మామ్ రష్మికకు కంగ్రాట్స్ అంటోన్న ఛార్మీ ♦ యోగా శిల్పా శెట్టి ఆసనాలు ♦ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న నిఖితా శర్మ View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by NICK JONɅS (@nickjonas) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Puja Gupta Talukdar (@iampujagupta) -
‘శిల్పాశెట్టి చిచ్చుపెట్టలేదు’
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవితా గురించి తాజాగా నోరువిప్పాడు. ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు. గత పన్నెండేళ్లుగా మౌనంగా ఉన్న రాజ్ కుంద్రా మొదటి సారి ఈ విషయంపై స్పందించాడు. కవితాతో విడాకుల విషయంలో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాన్ని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. వ్యాపారవేత్త కుమార్తె అయిన కవితను 2003 లో రాజ్ కుంద్రా వివాహం చేసుకున్నాడు. కానీ ఈ జంట 2006 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. అనంతరం రాజ్ కుంద్రాశిల్పాశెట్టిని 2019లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే రాజ్తో విడిపోవడానికి హీరోయిన్ శిల్పానే కారణమని అప్పట్లో కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్,శిల్పా కలిసి దిగిన ఫోటోలు తను చూశానని, ఆమె వల్లే మేము విడిపోయామని కవితా ఆరోపించారు. శిల్పా కారణంగానే విడాకుల కోసం వేధించడం మొదలు పెట్టాడని విమర్శించారు. ఇటీవల కవితా కుంద్రా ఓ ఇంటర్వ్యూలో శిల్పా శెట్టిపై చేసిన ఆరోపణలు మళ్లీ ఇంటర్నెట్లో వైరలవ్వడంతో రాజ్ కుంద్రా స్పందించారు. సెన్సేషన్ కోసం కవితా కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించి సెలబ్రిటీ అయినా శిల్పా శెట్టిపై నిరాధార వార్తలు ప్రచారం చేయించిందని, ఆమె ఆరోపణలలో ఎటువంటి నిజం లేదు అన్నాడు. అయితే కవితా తన సోదరి భర్తతో సంబంధం ఏర్పర్చుకుందని మోసం చేసిందని ఆకారణంతోనే ఇద్దరూ విడిపోయినట్లు రాజ్ కుంద్రా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. కవిత తనతో, తన కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఎప్పుడూ వాదితూ గొడవ వాతావరణాన్ని సృష్టించేదాని తెలిపారు. ‘నా కుటుంబమే నా ప్రపంచం.. కానీ ఆమె ఎప్పుడూ నా ఫ్యామిలీతో గొడవ పడుతుంది. మేమంతా కలిసే ఉండేవాళ్లం. ఇండియా నుంచి యూకే వెళ్లినప్పుడు నాన్న, అమ్మ, నేను, నా సోదరి. తన భర్త అంతా కలిసే ఎరూ ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కవిత నా సోదరి భర్త చాలా సన్నిహితంగా మెలిగేది. ముఖ్యంగా నేను బిజినెస్ పరంగా బయటకు వెళ్లినప్పుడు అతనితో ఎక్కువ సమయం గడిపేది. నా కుటుంబంలో చాలా మంది చివరికి నా డ్రైవర్ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందని నాకు చెప్పారు. కానీ నేనెప్పుడు ఆ మాటలు నమ్మలేదు. నమ్మను. నా మాజీ భార్య అన్నీ సౌకర్యాలు ఇచ్చాను. తన కుటుంబం నా కుటుంబం అనే తారతమ్యం లేకుండా చూసుకున్నాను. నేను ఇప్పటికీ ఇదే ఫాలో అవుతాను. కానీ ఓ రోజు అమ్మ నా మాజీ భార్య, సోదరి భర్తను రెడ్ హ్యండెడ్గా పట్టుకుంది. దీంతో రెండు కుంటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. అప్పడే ఆమెకు విడాకులిచ్చాను. అని వెల్లడించారు. శిల్పాకు ఈ విషయాల గురించి బయటకు చెప్పడం ఇష్టం లేదు. ఇవన్నీ చెప్పిన తరువాత ఆమె అప్సెట్ అయ్యింది. కానీ మళ్లీ మళ్లీ ఇవి సోషల్ మీడియాలో వైరలవ్వడం నన్ను కలవరపాటుకు గురిచేస్తోంది. నిజయం అందరికి తెలియాలి అందుకే చెప్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: హల్చల్ : అనుపమ సొగసులు.. అనసూయ కవ్వింపులు.. 30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్ -
హల్చల్ : సెలబ్రేషన్స్లో శిల్పా.. సెట్స్లో సన్నీలియోన్
♦ ఆ మూడ్ శాశ్వతం అంటోన్న జాన్వీ ♦ బర్త్డే సెలబ్రేషన్స్లో శిల్పా శెట్టి ♦ దానిపైనే నమ్మకం ఉంచుతానంటున్న సోనమ్ ♦ ఫోటో షూట్లతో షెహ్నాజ్ ♦ సెట్లో ఎలా ఉంటుందో చూపించేసిన సన్నీ ♦ నో క్యాప్షన్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ♦ బాడీతో పాజిటివ్గా ఉండాలంటోన్న సమీరా రెడ్డి ♦ బేబీ పింక్లో అందంగా ముస్తాబైన మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by manasa varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ananya Nagalla Fans (@ananyanagalla.official) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) -
అమలాపాల్ సొగసులు, షనయా అందాలు..వణికిపోతున్న హీనా
♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న పూర్ణ ♦ సన్ఫ్లవర్ నేనే అంటున్న ఈషా రెబ్బ ♦ సన్ కిస్సింగ్ అంటున్న శివాత్మిక ♦ మంచులో వణికిపోతున్న హీనా ఖాన్ ♦ చూపులతో కవ్విస్తోన్న షనయా కపూర్ ♦ యోగా నేర్పుతానంటున్న శిల్పా శెట్టి ♦ గుడ్ల గూబల్ని చీరలో బంధించిన రష్మీ ♦ న్యూలుక్లో మతి పోగొడుతున్న అమలాపాల్ ♦ త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
మహేష్బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ28’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో శిల్పాశెట్టి మహేష్కు పిన్ని పాత్రలో నటించనున్నట్లు సమాచారం. గతంలోనూ త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్ఎస్ఎమ్బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ మూవీకి ‘పార్ధు’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంది. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తవగానే త్రివిక్రమ్తో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. చదవండి : బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి ‘ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో’ -
మహేశ్ సినిమాలో ఈ ఇద్దరూ?
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే, జాన్వీ కపూర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు హీరో సుమంత్ని తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని సంప్రదించారనే ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ గత చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’లో సుశాంత్ ఓ కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో సుమంత్ని త్రివిక్రమ్ తీసుకోవాలనుకుంటున్న విషయం నిజమేనా? అనేది చూడాలి. అలాగే శిల్పా శెట్టి నటించనున్నది నిజమే అయితే 20 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపిస్తున్నట్లు అవుతుంది. 2001లో బాలకృష్ణ నటించిన ‘భలేవాడివి బాసూ’ చిత్రం తర్వాత శిల్పా శెట్టి మరో తెలుగు సినిమా చేయలేదు. -
మహేశ్ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ28’. ఈ మూవీ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రం కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్ఎస్ఎమ్బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్లో ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. చదవండి : SSMB28: స్టోరీ అవుట్, ఆ సినిమాలో మహేశ్ పాత్రే టైటిల్! -
గత పది రోజులుగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం: శిల్పా శెట్టి
తన కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘గత పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితిల్లో ఉంది. మా అత్తమామ, మా అమ్మ, చివరిగా నా భర్త రాజ్ కరోనా బారిన పడ్డారు. వారంత ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. నాకు నెగిటివ్గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు వారంత క్వారంటైన్ గైడ్లైన్ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మా ఇంటి పనివాళ్లలోని ఇద్దరికి సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా ఐసోలేషన్కు వెళ్లారు. దేవుడు దయ వల్ల అందరూ కొలుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకు సహకరించిన ముంబై మున్సిపాలిటీ కమిషన్(బీఎంసీ), అధికారులకు శిల్పా ధన్యవాదాలు తెలిపింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘మీ అందరి ప్రేమ, మద్దతకు కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన వారందరికి రుణ పడి ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. ఇక ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుము మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం తప్పసరి చేసుకొండని సూచించింది. కోవిడ్ పాజిటివ్, నెగిటివ్ అయినా ప్రతి ఒక్కరూ మానసికంగా పాజిటివ్గా ఉండాలంటూ సందేశం ఇచ్చింది. కాగా శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, ఏడాది కూతురు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
‘ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో’
హిందీ చిత్రసీమలో అక్షయ్ కుమార్కు ‘ఖిలాడీ’ అనే పేరు ఉంది. కారణం అతని లవ్ గేమే. తనకు దగ్గరైన అమ్మాయిలందరికీ ఏకకాలంలో ప్రేమ కబుర్లు చెప్పి.. అందరికీ తనతో పెళ్లి కలలు తెప్పించాడు. వాళ్లలో రవీనా టండన్, శిల్పాశెట్టితో పాటు పూజా బాత్రా, అయేషా జుల్కా వంటి నటీమణులూ ఉన్నారు. ఇది అక్షయ్ కుమార్ ప్రేమ కథ 2.. ప్రేమిక శిల్పాశెట్టి. ఇదీ ఫెయిల్యూర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విఫలమవడానికి కారణం మాత్రం అక్షయ్ కుమారే. ఆ ప్రేమ మొదలైంది ‘మై ఖిలాడీ తూ అనాడీ’ సినిమా సెట్స్లో. అప్పటికే అక్షయ్ సీనియర్. అప్పుడప్పుడే గుర్తింపులోకి వస్తోంది శిల్పాశెట్టి. ఆమె అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. అతని హాస్యచతురత అమితంగా నచ్చింది ఆమెకు. ఆ మాటల గారడీకి మనసిచ్చేసింది శిల్పాశెట్టి. మూడు జోకులు, ఆరు నవ్వులతో కాలక్షేపం చేయొచ్చులే అని ఆమె మనసు పుచ్చుకున్నాడు అక్షయ్. అప్పటికే అతను రవీనా టాండన్ ప్రేమలో తలమునకలై ఉన్నాడు. రవీనా ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లాడు. ఇటు శిల్పా తన పట్ల అతను చూపిస్తున్న శ్రద్ధను సీరియస్గానే తీసుకుంది. తన కెరీర్ కన్నా అక్షయే ముఖ్యమనుకుంది. అతణ్ణి పెళ్లి చేసుకుని స్థిరపడాలనీ నిర్ణయించుకుంది. రవీనా, శిల్ప ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. అప్పటికే అక్షయ్ ప్రవర్తన పట్ల రవీనాకు ఓ పిక్చర్ వచ్చేసింది. కాని అతని లవ్వాటలో శిల్ప ఉందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంది. గ్రహించాక అక్షయ్తో బంధాన్ని తెంచేసుకుంది. ఇటు శిల్పకు మాత్రం అక్షయ్ అంతరార్థం అర్థం కాక అతణ్ణి రోజూ కొత్తగానే చూడసాగింది. తెరమీదా ఈ జంటకు క్రేజ్ పెరగడంతో తర్వాత రెండు సినిమాల్లోనూ (ఇన్సాఫ్, జాన్వర్) అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి జత కట్టారు. మూడో సినిమా ‘ధడ్కన్’ కూడా మొదలైంది. అప్పుడే అక్షయ్ ప్రవర్తనలోని తేడాను గమనించింది శిల్ప. హడావిడిగా ఉంటున్నాడు. అబద్ధాలు దొర్లుతున్నాయ్. స్నేహంలో అరమరికలు స్పష్టమయ్యే సరికి ఆరా తీసింది శిల్ప. ట్వింకిల్ ఖన్నాతో డ్యుయేట్లు పాడుకుంటున్నట్టు తేలింది. పైగా ఆ రిలేషన్ పట్ల అక్షయ్ సీరియస్గా ఉన్నట్లూ సమాచారం అందింది. హతాశురాలైంది శిల్ప. మోసపోయిన భావన .. అతని అవసరానికి తాను పావునయ్యాననే అవమానం.. ఆమె మనసును మెలిపెట్టాయి. పొగిలి పొగిలి ఏడ్చింది. అప్పటికప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంది. కాని తమ వ్యక్తిగత కారణాలతో ఆ సినిమా యూనిట్ నష్టపోకూడదని సహనం వహించింది. పంటి బిగువున షూటింగ్ పూర్తి చేసింది. సినిమా పూర్తయిన వెంటనే అక్షయ్కి గుడ్బై చెప్పింది. శిల్పా ఎడబాటు అక్షయ్లో ఆవగింజంతయినా అలజడిని రేపలేదని.. ఇసుమంతైనా దిగులు కలిగించలేదని అంటారు అక్షయ్తో సన్నిహితంగా మెదిలినవాళ్లు. శిల్పతో తెగతెంపులు అయిన కొద్ది రోజుల్లోనే ట్వింకిల్ పాపిట్లో సిందూర్ అద్ది ‘ఫ్యామిలీ మన్’ ఇమేజ్లోకి ఇమిడిపోయాడు. ‘నాతో ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో జీవితాన్ని పంచుకునే ప్లాన్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడిలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాను కానీ.. ఆ నిజం తెలిసినప్పుడు నా గుండె బద్ధ్దలైంది. కెరీర్ పరంగా అంతా బాగున్నా వ్యక్తిగతంగా మాత్రం చాలా కుంగిపోయా. ఎలా తట్టుకున్నానో తెలియదు. అక్షయ్ నన్ను యూజ్ చేసుకున్నాడు. తనకు కావల్సిన మనిషి దొరకగానే నన్ను డంప్ చేశాడు. ఈ విషయంలో ట్వింకిల్ పట్ల నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఉండవు కూడా. నా మనిషి అనుకున్న వ్యక్తే సరైనవాడు కాదు. నా కోపమంతా అతని మీదే. ఏమైనా ఆ కథ తొందరగా ముగిసిపోయినందుకు సంతోషం. నా జీవితంలో నేను మరిచిపోయిన అధ్యాయం అతను. లైఫ్లో అతనితో సినిమాలు చేయను’ అని చెప్పింది శిల్పాశెట్టి ఒక ఇంటర్వ్యూలో. శిల్ప అన్నట్టుగానే ‘ధడ్కన్’ ఆ ఇద్దరి ఆఖరి సినిమా అయింది. కిందటేడుకు అది విడుదలై ఇరవై ఏళ్లు. ఆ సందర్భంగా ఆ ఇద్దరూ తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో ఆ సినిమా గురించి ‘ధడ్కన్ మూవీ మ్యూజిక్ని ఇప్పటికీ ఆస్వాదిస్తాను.. ఇట్స్ టైమ్లెస్’ అని రాసుకున్నారు. చదవండి: అందుకే అక్షయ్తో బ్రేకప్ తప్పలేదు: రవీనా చదవండి: మాల్దీవుల్లో భర్తతో ‘సాగర కన్య’ -
హోలీ: సెంటరాఫ్ అట్రాక్షన్గా తారలు
-
సోషల్ హల్చల్: నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ..
♦ ఫొటో పిచ్చ పర్ఫెక్ట్గా వచ్చిందంటున్న పాయల్ రాజ్పుత్ ♦ ఫోనులో ఊసులాడుతున్న హెబ్బా పటేల్ ♦ ఓరకన్నుతో చంపేస్తోన్న 'డీ కంపెనీ' నటి నైనా గంగూలీ ♦ చమక్కుమని మెరుస్తోన్న కాజల్ ♦ ఫన్ టైమ్ అంటూ నాలుక బయటపెట్టిన శిల్పా శెట్టి ♦ నాజూకు సొగసుతో కైపెక్కిస్తోన్న కియారా అద్వానీ ♦ పచ్చని చెట్ల మధ్య పూల చీర కట్టుకున్న దియా మీర్జా ♦ మగత నిద్రలోకి జారుకున్నట్లు పోజిచ్చిన అదితి రావు హైదరీ ♦ పచ్చటి పైరు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న వితికా శెరు ♦ రెడ్ డ్రెస్సులో ప్రియమణిని చూసి అనాల్సిందే.. షీ సో క్యూట్.. షీ సో హాట్.. ♦ గాల్లోకి చూస్తూ కుర్రకారులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్న సంజీదా షైక్ View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) -
మాల్దీవుల్లో భర్తతో ‘సాగర కన్య’
తరుచూ షూటింగ్స్తో దేశవిదేశాలను చుట్టేసే సెలబ్రిటీలందరూ ఈ మధ్యకాలంలో మాల్దీవుల్లో సేదతీరితున్నారు. అక్కడి సముద్ర అందాలను ఆస్వాదిస్తూ తమ పార్ట్నర్స్తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్లోకి బాలీవుడ్ నటి, ఫిట్నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి కూడా చేరిపోయింది. వెకేషన్ ట్రిప్ కోసం భర్త రాజ్ కుంద్రాతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ యోగా బ్యూటీ. సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై బికినీతో అందాలను ఆరబోస్తూ.. సాగరకన్యల్లా కనిపిస్తున్న శిల్పా శెట్టి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజంగానే సాగరకన్యలా ఉన్నారంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా సైతం మాల్దీవుల ఫోటోలను ఫేర్ చేస్తూ..లవ్ ఆఫ్ మై లైఫ్తో స్వర్గంలో ఉన్నామంటూ శిల్పాశెట్టితో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. శిల్పాశెట్టి 2009లో రాజ్ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్, కుమార్తె సమీషా(సరోగసీ ద్వారా కలిగిన సంతానం) ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాలకు గుడ్ డై చెప్పిన శిల్పా శెట్టి.., నికమ్మ, హంగామా 2 చిత్రాలతో రీఎంట్రీ ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉన్నాయి. చదవండి : ‘శ్రీదేవి తరువాత ఆ ఘనత నాకే సాధ్యం’ (దివ్య భారతి చేజార్చుకున్న పెద్ద సినిమాలివే) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
కాబోయే కోడలికే ఆ డైమండ్: శిల్పా శెట్టి
ముంబై: సినీ నటి శిల్పా శెట్టికి ఆభరణాలంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న అద్భుతమైన జువెల్లరీ కలెక్షన్, వివిధ సందర్భాల్లో ఆమె ధరించే నగలు ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేశాయి. ఈ క్రమంలో పొడుగు కాళ్ల సుందరి తన వద్దనున్న 20 క్యారట్ల డైమండ్ గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకుంది. తాను ఎంతో విలువైనదిగా భావించే ఈ వజ్రాన్ని, తన కొడుకు వియాన్ రాజ్ కుంద్రాకు కాబోయే భార్యకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇందుకు తాను ఓ షరతు కూడా పెట్టినట్లు శిల్పా వెల్లడించింది. కాబోయే కోడలు తనతో సఖ్యతగా మెలిగితేనే, ఆ వజ్రం పొందేందుకు అర్హురాలని, లేదంటే చిన్న చిన్నఆభరణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, వియాన్తో చెబుతూ ఉంటానని సరదాగా వ్యాఖ్యానించింది. ‘‘మీరు నా ఇన్స్టాగ్రామ్ని చూస్తే నేను అమ్మతనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో తెలుస్తుంది. ఆభరణాలు వారసత్వాన్ని కొనసాగిస్తాయని భావిస్తాను. అందుకే నేను ఎక్కువగా వాటిని కొనుగోలు చేస్తా’’ అని చెప్పుకొచ్చింది. ఇక శిల్పాశెట్టి 2009లో రాజ్ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్, కుమార్తె సమీషా(సరోగసీ ద్వారా కలిగిన సంతానం) ఉన్నారు. కాగా రాజ్ కుంద్రా తనకు ప్రేమను వ్యక్తం చేసిన నాటి మధురానుభూతులను వీడియో రూపంలో పంచుకున్న శిల్ప.. ‘‘పదకొండేళ్ల క్రితం మీరు నాకు ఏ విధంగా ప్రపోజ్ చేశారనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. పారిస్లోని లే గ్రాండ్ హోటల్ ఒక హాల్ మొత్తాన్ని మీరు బుక్ చేశారు. స్నేహితులుగా మన మొదటి విందు అని మీరు నాతో చెప్పారు. ఆ తర్వాత నేను హాల్లోకి ప్రవేశించగానే, సంగీత కళాకారులతో మ్యూజిక్ ప్లే చేయిస్తూ, మోకాలిపై కూర్చొని డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటి కలే కంటుంది. ఆనాటి నుంచి నేటిదాకా మీరు నా కలలన్నింటినీ నిజం చేస్తూనే ఉన్నారు’’ అని భర్తపై ప్రేమను చాటుకుంది.(చదవండి: భర్త క్షేమం కోరి...) అయితే అది కేవలం ఐదు క్యారెట్ల డైమండ్ రింగ్ కాబట్టి.. ‘యెస్’ చెప్పడానికి తాను కాస్త సమయం తీసుకున్నానని భావించిన రాజ్ కుంద్రా, పెళ్లికి మరింత పెద్ద రింగ్ ఇస్తానని తనకు చెప్పాడంటూ చిరునవ్వులు చిందించింది. ప్రపోజ్ చేసిన విధానం కొంత మెటీరియలిస్టిక్గా అనిపించినా, ఆ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా అద్భుతంగా మలచాడని చెప్పుకొచ్చారు. ‘‘నాకు పారిస్ లోని ఈఫిల్ టవర్ అంటే చాలా ఇష్టం. అది ఆయనకు బాగా తెలుసు. నేనక్కడ షాట్ కూడా తీశాను. నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన మా ఆయనతోనే అక్కడికి వెళ్లాలని ఉంటుంది’ అంటూ వీడియోను ముగించింది. -
క్షేమం కోరి...
బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా -
కర్వా చౌత్; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ కామెంట్
సంసృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఆచారాలు, కట్టుబాట్లకు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి సంప్రదాయల్లో భర్త మంచి కోసం భార్య చేసే ఉపవాసం కూడా ఒకటి.. దీనినే కర్వా చౌత్ అంటారు. దక్షిణాదినా దీనికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తనతో ఏడడుగులు వేసి, జీవితాంతం కలిసుండే వ్యక్తి కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ భార్యలు ఈ రోజు ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేస్తారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూస్తారు. అయితే ఈ కర్వా చౌత్ సందర్భంగా మహిళలు తమ చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. తమ జీవితం కూడా భర్తతో అదే విధంగా రంగులమయం కావాలని ఆకాంక్షిస్తారు. చదవండి: 'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా' ఈ ఏడాది కర్వా చౌత్ నవంబర్ 4న వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. నటి శిల్పా శెట్టి తన భర్త కోసం ప్రతి ఏడాది ఉపవాసం ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు తన హాస్య చతురతో అందరిన నవ్వించే రాజ్ కుంద్రా ఓ మీమ్ షేర్ చేశారు. ఇందులో తన కోసం ఉపవాసం చేస్తున్న భార్య, నటి శిల్పా శెట్టి ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ రోజు తన భార్య జల్లెడ సాయంతో తన ముఖాన్నే చూస్తుందని ప్రతి భర్త ఊహించుకుంటాడు. కానీ వాస్తవానికి ఆమెకు అద్దంలో ఆ తరువాత ఏం తినాలో అవి కనిపిస్తాయి’. అంటూ సరదా కామెంట్ చేశారు. అదే విధంగా నటి కియారా అద్వానీ కూడా ఈ పండగ రోజు మెహెందీ ఆర్టిస్ట్గా మారిపోయారు. అయితే కియారాకు ఇంకా వివాహం కాలేనందున ఆమె తన తల్లికి మెహెందీ పెట్టడం ద్వారా కర్వా చౌత్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. Happy Karva Chauth ❤️ pic.twitter.com/2OncbZjVXc — Raj Kundra (@TheRajKundra) November 4, 2020 -
పిల్లలు బంక మట్టిలాంటివాళ్లు
‘‘పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంక మట్టిలాంటివి. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం’’ అంటున్నారు శిల్పా శెట్టి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు శిల్పా. గతంలో ఓ ట్రిప్లో భాగంగా ఈ విద్య నేర్చుకున్నారట. అప్పుడు తీసిన వీడియో ఇది అని, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రీడల ప్రాముఖ్యత గురించి శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయి. ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయి. ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. మనం ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. శుక్రవారంతో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే... మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా'
ముంబై : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఉండడంతో బాలీవుడ్ నటీమణులు టిక్టాక్ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్తో కలిసి టిక్టాక్ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆమె తన భర్తతో కలిసి చేసిన టిక్టాక్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో శిల్పా శెట్టి డ్యుయల్ రోల్ అంటే ఒక రోల్లో రాజ్కుంద్రా భార్య లాగా, మరొక రోల్ ఇంటి పనిమనిషిగా కనిపించి ఆకట్టుకుంటారు. శిల్పాశెట్టి పార్టీవేర్కు సంబంధించిన డ్రెస్ను సెలెక్ట్ చేస్తున్న సన్నివేశంతో వీడియో మొదలవుతుంది. ఇంతలో తన భర్త రాజ్ కుంద్రా శిల్పాను ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆమె వద్దని వారించడంతో మిన్నకుండిపోతాడు. ఇంతలో సీన్లోకి పని మనిషి రూపంలో ఉన్న శిల్పాశెట్టి ప్రవేశిస్తుంది. పనిలో ఉన్నపుడు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చిరాకు కలుగుతుంది.. అలా ప్రవర్తించిన వారిని కొట్టాలన్నంత కోపం వస్తుంది. వెంటనే ఇది విన్న శిల్పాశెట్టి తన భర్త రాజ్కుంద్రాను కొట్టడం ప్రారంభిస్తుంది. . ' నేను సీరియస్గా ఒక పని చేస్తుంటే నా భర్త ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అందుకే అతని కొట్టాల్సి వచ్చింది. అయినా నేను కొట్టింది నా భర్తనే కదా' అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరోనా: ఫ్రాన్స్ను దాటేసిన బ్రెజిల్ -
‘జీతేంగే హమ్’కు స్టార్ నటి సందేశం
సోషల్ మీడియాలో కరోనా వైరస్పై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు సూచించారు. అంతేగాక వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పంచుకున్నారు. ఇటీవల వైద్య సిబ్బందిపై జరిగిన దాడులపై అవగాహన కల్పించేందుకు ‘జీతేగా.. ఇండియా జీతేంగే హమ్’ అనే నినాదంతో నటి రవీనా టాండన్ సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి) వైద్యులపై జరుగుతున్న హింసలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ అవగాహన చర్యల్లో భాగస్వామ్యం కావాలంటూ ఆమె శిల్పాశెట్టిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో ‘‘మానవత్వాన్ని చూపటానికి మనం చేయగలిగేది ఒక్కటే.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండ పోరాడుతున్న వారి కోసం మన గొంతు కలపడం మాత్రమే’’ అంటూ వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బందిని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. కాగా వారంతా కరోనాపై యుద్ధంలో ప్రథమ పౌరులుగా పోరాడుతున్నారని, అలాంటి వారిపై దాడులు జరపడం సహించరానిదన్నారు. (కరోనా: రవీనా టాండన్ పనికి అభిమానుల ఫిదా!) ఇక ఈ అద్భుత ప్రయత్నానికి తనని నామినేట్ చేసిన రవీనాకు శిల్పా ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ గొప్ప ప్రయత్నంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రవీనాకు ధన్యావాదాలు. సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయండి. ఈ విపత్కర కాలంలో మన కోసం పనిచేస్తున్న యోధులకు మద్దతుగా నిలబడదాం. అలాగే మహమ్మారిపై తప్పుడు ప్రచారాలు చేయడం మనేయండి. కరోనాను ఎదుర్కొవడానికి మనమంతా ఐక్యంగా ఉండి పోరాడే సమయం వచ్చింది’’ అంటూ శిల్పా పిలుపునిచ్చారు. అంతేగాక ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన సోదరి షమితా శెట్టి, దర్శకనిర్మాత ఫరా ఖాన్తో పాటు నటుడు అభిమన్యూ దస్సానిలను కూడా నామినేట్ చేశారు. ఇక ‘‘జీతేగా.. ఇండియా జీతేంగే హమ్’’ నినాదంతో రవీనా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో శిల్పాశెట్టితో పాటు నటుడు సోను సుద్ను కూడా నామినేట్ చేశారు. అంతేగాక నటి సోనాలి కులకర్ణి, నిర్మాత ఓనిర్ కూడా కార్యక్రమంలో భాగస్వామం కావాలంటూ వారిని ట్యాగ్ చేశారు. -
పేరెంట్స్ మధ్య పుల్లలు పెట్టిన నారదుడు
మహాభారతంలో నారద మునీంద్రుల వారు అందరికన్నా ఫేమస్. కలహ భోజనం లేనిదే ఆయనకు కునుకైనా పట్టదు. బాలీవుడ్లోనూ ఓ పిల్ల నారదుడు ఉన్నాడు.. కాకపోతే ఈయన కాస్త ట్రెండీ, ఎవరో గొడవ పడేలా చేయటం ఎందుకని, ఏకంగా తన తల్లిదండ్రుల మీదే అస్త్రం విసిరాడు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేశాడు. ఇంకేముందీ.. భార్యాభర్తలిద్దరూ యుద్ధానికి దిగారు. ఇంతకీ వాళ్లెవరో కాదు.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. వీరి ముద్దుల తనయుడు, ఏడేళ్ల వియాన్ ఒకరి గురించి మరొకరికి చాడీలు చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్లి, అమ్మ తమరు లావుగా ఉన్నారంటోందని అతని బుర్రలో కోపాగ్ని రగిల్చాడు. అది అంటుకుందని తెలియగానే అక్కడ నుంచి జారుకుని తల్లి దగ్గర తేలాడు. "నాన్న, నిన్ను మహా బద్ధకస్తురాలు" అంటున్నాడని శిల్పా చెవినేశాడు. (శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్) ఇంకేముందీ... ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. నారదుడు, అదే.. ఆ పిల్లవాడు తనకు కావాల్సింది ఇదే అన్నట్లుగా హాయిగా సినిమా చూస్తున్నట్లు చూస్తుండిపోయాడు. ఇంతలో ఇద్దరూ బాణాలు విసురుకుని ఎందుకలా అన్నావు? అంటూ పోట్లాట పెట్టకున్న సమయంలో చాడీలన్నీ అబద్ధమని తేలిపోయింది. దీంతో ఇది ఎవరి పన్నాగమో అర్థమై ఒక్కసారిగా బాణాల దిశను కొడుకు వైపు గురి పెట్టారు. ఇంకేముందీ, చచ్చాన్రా దేవుడోయ్ అనుకుంటూ ఆ పిల్లవాడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.. ఇదీ శిల్పాశెట్టి ఇంట్లో జరిగిన మోడర్న్ మహాభారతం. ఇలా వారి ఇంట్లో ఆదివారం నాడు మహాభారతాన్ని అనుకరించి సరదాగా గడిపారు. ఈ వీడియోను 1 మిలియన్ మందికి పైగా వీక్షించారు. (రెండోసారి తల్లైన శిల్పాశెట్టి!) -
జూనియర్ శిల్పా శెట్టి
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ‘సమిషా’ రూపంలో ఆనందం వాళ్ల ఇంటికి వచ్చింది. విషయం ఏంటంటే... శిల్పా శెట్టి రెండోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. ‘‘మా ప్రార్థనలను ఆ దేవుడు విన్నట్లున్నాడు. వాటి ఫలితమే సమిషా అనుకుంటున్నాం. ఫిబ్రవరి 15న మా చిన్నారి దేవత ‘సమిషా’ మా ఇంటికి వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. జూనియర్ యస్యస్కే (శిల్పా శెట్టి కుంద్రా)’’ అని చిన్నారి వేలుని పట్టుకొని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు శిల్పాశెట్టి. అయితే ఈ మధ్యలో శిల్పా శెట్టి గర్భవతి అయినట్టు కనిపించలేదు. మరి సరోగసీ పద్ధతిలో రెండో సారి తల్లయ్యారా? లేక పాపను దత్తత తీసుకున్నారా? తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శిల్పాకుంద్రాకు వియాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. -
రెండోసారి తల్లైన శిల్పాశెట్టి!
ముంబై: బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలిపారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్ ఎస్ఎస్కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్’’అని శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. కాగా 90వ దశకం నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శిల్పాశెట్టి.. వ్యాపారవేత్త రాజ్కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. ఇక పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైన శిల్పాశెట్టి.. యోగాసనాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. నికమ్మ టైటిల్తో షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. View this post on Instagram || Om Shri Ganeshaya Namah || Our prayers have been answered with a miracle... With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, 🧿𝐒𝐚𝐦𝐢𝐬𝐡𝐚 𝐒𝐡𝐞𝐭𝐭𝐲 𝐊𝐮𝐧𝐝𝐫𝐚🧿 Born: February 15, 2020 Junior SSK in the house😇 ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name - our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings🙏🏻❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra🧿 #gratitude #blessed #MahaShivratri #daughter #family #love A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Feb 20, 2020 at 9:41pm PST -
రెండింతల హంగామా
అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి. పరేష్ రావల్, మీజాన్ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు డెహ్రాడూన్లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్బ్యాక్ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్కియూన్’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే. -
శిల్పాశెట్టికి కూడా ‘మిర్చి’ సెగ
సాక్షి,ముంబై: గాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈడీ ముందు హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నవంబరు 4న హాజరుకావాలని ఈడీ ఆదేశించగా, ముందస్తుగానే ఈడీకి ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం రాజ్కుంద్రాను ప్రశిస్తున్న ఈడీ, ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. అంతేకాదు త్వరలోనే ఈ కేసులో శిల్పా ను కూడా ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే గాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి (2013లో చనిపోయాడు), కుటుంబంపై ఆర్థిక ఆరోపణల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలో ఖరీదైన రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకంలో అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి మిర్చి కుడిభుజంగా భావించే రంజీత్ సింగ్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో కుంద్రా చేసిన లావాదేవీలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ, అక్టోబర్ 11న బింద్రాను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించింది. దర్యాప్తులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కెబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య లావాదేవీలను ఈడీ గుర్తించింది. ఇందులో ఒక డైరెక్టర్గా ఉన్న శిల్పాశెట్టి ఆర్కెబ్ల్యుద్వారా బాస్టియన్ హాస్పిటాలిటీలో పెట్టుబడులు, వడ్డీ లేని రుణాలు మంజూరు వ్యవహారంలో ఆమెను ఈడీ ప్రశ్నించనుంది. అయితే ఈ వ్యాపార వ్యవహారాలలో ఎటువంటి తప్పు చేయలేదని కుంద్రా గతంలో ఖండించారు. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
రూ.10 కోట్ల ఆఫర్ని తిరస్కరించిన నటి
ఒక్కసారి పాపులారిటీ వచ్చాక తారలు ఇక యాడ్స్ మీద దృష్టి పెడతారు. సెకన్ల వ్యవధి మాత్రమే ఉండే యాడ్స్కి కోట్లలో పారితోషికం లభిస్తుండటంతో స్టార్ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ సాయి పల్లవి ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్లు ఇస్తామన్నా సరే ఆ యాడ్ చేయడానికి సాయి పల్లవి అంగీకరించలేదు. తాను ఇలాంటి ఉత్పత్తులను వాడనని.. అలాంటిది సదరు ఉత్పత్తులు వాడమని జనాలకు ఎలా చెప్తానని సాయి పల్లవి ప్రశ్నించారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా చేరారు. ఈ నటి ఏకంగా రూ. పది కోట్ల ఆఫర్ను వదులుకున్నట్లు సమాచారం. వివరాలు.. ఓ స్లిమ్మింగ్ పిల్స్ కంపెనీ వారు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం శిల్పను సంప్రదించారట. అంతేకాక ఈ యాడ్లో నటించేందుకు గాను రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. కానీ శిల్ప దీనికి అంగీకరించలేదని సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘టాబ్లెట్లు, పౌడర్లు వాడటం, కడుపు కట్టుకోవడం వల్ల బరువు తగ్గుతారనే మాటలను నేను నమ్మను. పాటించను. అలాంటప్పుడు ఇలాంటి ఉత్పత్తులకు నేను ప్రచారకర్తగా ఎలా వ్యవహరిస్తాను. ఆహారంలో కొద్ది పాటి మార్పులు, క్రమం తప్పక వ్యాయామం చేస్తూంటే ఆలస్యమైనా సరే తప్పక బరువు తగ్గుతాం. ఇందుకు నేనే ఉదాహరణ. అంతే తప్ప ఇలాంటి ఉత్పత్తులను అంగీకరించను, ప్రోత్సాహించను’ అన్నారు. శిల్ప ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికి తెలిసిందే. ఫిట్నెస్, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలకు సంబంధించి శిల్ప ఒక యాప్ను కూడా తీసుకొచ్చారు. ఆహార నియమాలు, ఫిట్నెస్ సలహాలను ఈ యాప్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ఇక వ్యాపారవేత్త రాజ్కుంద్రాతో వివాహం అయ్యాక సినిమాలకు దూరమైన శిల్పాశెట్టి.. దశాబ్దకాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ’తో శిల్ప బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచనున్నారు.