Stuart Broad
-
T20 WC 2024: టీ20 వరల్డ్కప్లో అత్యంత చెత్త రికార్డు..
టీ20 వరల్డ్కప్-2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు.అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అమెరికా మిడిలార్డర్ బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్(65), ఆరోన్ జోన్స్(94 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.చెత్త రికార్డు..ఈ మ్యాచ్లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. జెరెమీ గోర్డాన్ను ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఊచకోత కోశారు. తొలి స్పెల్లో రెండు ఓవర్లు వేసిన జోర్డాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్లో మాత్రం జోర్డాన్ పూర్తిగా తేలిపోయాడు.యూఎస్ఎ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోర్డాన్.. ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో జోర్డాన్ రెండు నో బాల్స్, రెండు వైడ్స్తో సహా 3 సిక్స్లు, రెండు బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్గా గోర్డాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ బౌలర్ ఇజ్రాతుల్లా దౌలత్జాయ్ పేరిట ఉండేది.2012 పొట్టి ప్రపంచకప్లో ఇంగ్లండ్పై దౌలత్జాయ్ ఒకే ఓవర్లో 32 పరుగులిచ్చాడు. ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో బ్రాడ్ బౌలింగ్లో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో గోర్డాన్ మరో 4 పరుగులిచ్చి ఉంటే బ్రాడ్ను అధిగిమించేవాడు. -
RCB vs LSG: 'గ్రీన్ను పక్కన పెట్టండి.. వారిద్దరిని జట్టులోకి తీసుకోండి'
ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. మిగితా మూడు మ్యాచ్ల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆర్సీబీ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బౌలింగ్లో కూడా ఆర్సీబీ పూర్తిగా తేలిపోతోంది. మరి లక్నోతో మ్యాచ్లో ఆర్సీబీకి ఏ మెరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఆర్సీబీని ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ వంటి స్టార్డమ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని బ్రాడ్ తెలిపాడు. ఆర్సీబీపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం వారు ఒక్కసారి కూగా టైటిల్ను గెలవకపోవడం. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ట్రోఫీని ఎందుకు గెలవలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు. డివిలియర్స్, గేల్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఆర్సీబీకి ఆడారు. విరాట్ కోహ్లి ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడు.. ప్రతీ సీజన్లోనూ విరాట్ తన వంతు న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత సీజన్లో విరాట్ మినహా మిగితా ఏ బ్యాటర్ కూడా తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు. మాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్ తిరిగి ఫామ్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నావరకు అయితే ఆర్సీబీ బౌలింగ్ పరంగా చాలా వీక్గా ఉంది. వారు ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లతో బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్లకు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రీస్ టోప్లీ ,లాకీ ఫెర్గూసన్లను తీసుకువస్తే బాగుంటుంది. కెమరూన్ గ్రీన్, జోషఫ్ను కొన్ని మ్యాచ్లకు పక్కనపెట్టాల్సిన అవసరముందని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్బౌలర్గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో తొలి మ్యాచ్లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ -
#MIvsGT: సూపర్ టాలెంట్.. బుమ్రాకు మాత్రమే సాధ్యం! వీడియో
#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. 0,0,0,4,0,వికెట్,1,0,1,0,0,0,వికెట్,1,వికెట్,0,0,1,1లెగ్బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో బుమ్రా అద్భుత స్పెల్ను చాటిచెప్పే గణాంకాలు. Just Bumrah Things 🤷♂️@Jaspritbumrah93 on target in his first over 👏#GT reach 47/1 after 6 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్మార్క్ స్కిల్ ఇది. పేస్తో బ్యాటర్ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం. అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్.. బుమ్రాను కొనియాడాడు. 1️⃣ brings 2️⃣ Three wickets in the match for @Jaspritbumrah93 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT#TATIPL | #GTvMI | @mipaltan pic.twitter.com/XXH33C7Yq6 — IndianPremierLeague (@IPL) March 24, 2024 కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్ సారథిగా శుబ్మన్ గిల్ మాత్రం తొలి మ్యాచ్లోనే విజయం అందుకున్నాడు. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
అవమానం లాంటిదే: కోహ్లి ఆడకపోవడంపై స్టువర్ట్ బ్రాడ్ వ్యాఖ్యలు
Ind vs Eng Test Series 2024- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లేకుండానే భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టులు జరగడం ఒకరకంగా సిరీస్కే అవమానం లాంటిదని వ్యాఖ్యానించాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలుత రెండు మ్యాచ్ల నుంచి వైదొలిగిన అతడు.. సెలవు పొడిగించాలని బీసీసీఐని కోరడంతో.. బోర్డు అందుకు అంగీకరించింది. మిగిలిన మూడు టెస్టులకూ దూరం ఈ క్రమంలో మిగిలిన మూడు టెస్టులకు కోహ్లి సెలక్షన్కు అందుబాటులో లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని తెలిపింది. నిజానికి కోహ్లి మూడో టెస్టు నుంచైనా తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఇంగ్లండ్తో సొంతగడ్డపై మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే అని.. అలాంటిది ఈసారి మాత్రం తన ఆటను మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతకంటే ఎక్కువగా వారిని బాధిస్తున్న అంశం మరొకటి ఉంది. కోహ్లి ఆడకపోవడం సిరీస్కే అవమానం లాంటిది కోహ్లి ఈ సిరీస్కు దూరం కావడానికి గల అసలు కారణం ఇంతవరకు తెలియకపోవడంతో.. ఈ రన్మెషీన్కు ఏమై ఉంటుందా అని సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ తాజాగా IANS(వార్తా సంస్థ)తో మాట్లాడుతూ కోహ్లి గైర్హాజరీపై స్పందించాడు. ‘‘కోహ్లి లేకుండానే ఈ సిరీస్ జరగడం సిరీస్కే ఓ అవమానం లాంటిది. కోహ్లి నాణ్యమైన నైపుణ్యాలు గల బ్యాటర్. ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘం. అతడిలోని ఫైర్ ప్రత్యర్థులకూ మజాను అందిస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఏదేమైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోహ్లి జట్టులో లేకపోవడం యువ ఆటగాళ్లకు గొప్ప వరం లాంటిది. అతడి గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మున్ముందు మరిన్ని ఛాన్స్లు పొందే అవకాశం ఉంటుంది’’ అని ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులాడిన బ్రాడ్ 604 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు.. -
Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్ రిప్లై ఇదే! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యజిలాండ్ మధ్య మ్యాచ్తో గురువారం ప్రపంచకప్ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్కు ఇంగ్లండ్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. వాళ్లిద్దరు లేరు కదా! ఓ జర్నలిస్టు.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఫాస్ట్బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా. 2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్బౌలర్లు ఉన్నారు. నవ్వు ఆపుకొన్న బట్లర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్బాల్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్ బ్రాడ్ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్ ఈ విధంగా స్పందించాడు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్కు వరల్డ్కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్ విజేత బట్లర్ భారత్లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి! చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. A journalist asked Jos Buttler in the PC if the absence of Anderson and Broad will affect their pace bowling in the tournament?Just look at him,he was trying so hard not to laugh 😂😭.#CWC23 Video Credit: @ICC Facebook pic.twitter.com/1rdOjglfEd — Delhi Capitals Fan (@pantiyerfc) October 4, 2023 -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్పై పడింది. ఫ్లింటాఫ్పై కోపాన్ని యువీ బ్రాడ్పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్సెక్స్కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్లే ఆడాడు. ససెక్స్కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ఆస్తమాను అధిగమించి.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! 600 వికెట్లతో..
దాదాపు పదహారేళ్ల క్రితం... 21 ఏళ్ల కుర్రాడికి అది కేవలం ఎనిమిదో అంతర్జాతీయ మ్యాచ్. ఉరకలెత్తే ఉత్సాహం మినహా తగినంత అనుభవం లేదు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి ఆ మ్యాచ్ను ఒక సాధారణ మ్యాచ్లాగే చూశాడు. కానీ మైదానంలో ఆ రోజు అతనికి జీవితకాలం మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు! వేసిన ప్రతి బంతినీ భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సిక్సర్గా మలుస్తుంటే ఆ మొహం రంగులు మారుతూ వాడిపోయింది. ఆ దెబ్బ నుంచి మానసికంగా కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. బ్రాడ్ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా సగటు క్రికెట్ అభిమానులందరికీ ఆ మ్యాచ్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఎప్పటికీ ఆ కాళరాత్రి వెంటాడుతూ ఉంటే మరో ఆటగాడి కెరీర్ ఎన్ని ఆటుపోట్లకు గురయ్యేదో! కానీ స్టూ్టవర్ట్ బ్రాడ్ మాత్రం నిరాశ చెందలేదు. ఉవ్వెత్తున మళ్లీ పైకి లేచి, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ఆరు సిక్సర్ల దెబ్బ నుంచి కోలుకొని టెస్టుల్లో ఆరు వందల వికెట్లు సాధించే వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. సహజంగానే నేనూ చాలా బాధపడ్డాను. అయితే వాస్తవానికి అది నాకు మరో రూపంలో మేలు చేసింది. పట్టుదలగా నిలబడి పోరాడేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి నన్ను మానసికంగా దృఢంగా మార్చింది. ఈ రోజు ఆ స్థాయికి చేరానంటే నాటి మ్యాచ్ కూడా కారణం. చాలా మంది క్రీడాకారుల జీవితాల్లో ఇలాంటి రోజులు ఉంటాయి. అయితే మీరు ఎంత తొందరగా దానిని వెనక్కి తోసి పైకి దూసుకుపోగలరనేది ముఖ్యం. తండ్రి క్రిస్ బ్రాడ్తో స్టువర్ట్ ఆటలో ఆనందించే రోజుల కంటే బాధపడే రోజులే ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించగలిగితే మీరు గొప్ప రోజులు చూస్తారనేది నా నమ్మకం. ఇది నా విషయంలో నిజమైంది’... రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ‘ఆరు సిక్సర్ల’ మ్యాచ్ను గుర్తు చేసుకుంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. టెస్టు క్రికెట్లో అతను సాధించిన ఘనత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాడ్ గణాంకాలు చూస్తే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. 17 ఏళ్ల కెరీర్లో 167 టెస్టు మ్యాచ్లు... 604 వికెట్లు...అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంతో అతను ఇప్పుడు ఆటను సగర్వంగా ముగించాడు. బ్యాటర్ నుంచి బౌలర్గా... స్టూవర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. జాతీయ జట్టుకు 25 టెస్టులు, 34 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే తండ్రి కారణంగా అతనికేమీ క్రికెట్పై అమాంతం ఆసక్తి పెరగలేదు. చిన్నప్పటి నుంచి బ్రాడ్ హాకీని ఇష్టపడ్డాడు. వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ లీసెస్టర్షైర్ టీమ్కు గోల్ కీపర్గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ యువ జట్టు సెలక్షన్ ట్రయల్స్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహం, ఇతర మిత్రుల కారణంగా క్రికెట్ వైపు మళ్లాడు. తండ్రిలాగే ఓపెనింగ్ బ్యాట్స్మన్గా స్కూల్, కాలేజీ దశలో రాణిస్తూ వచ్చిన అతను లీసెస్టర్షైర్ బెస్ట్ యంగ్ బ్యాట్స్మన్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఇక్కడా అతని కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. అయితే కాలేజీలు మారుతూ వచ్చిన దశలో బ్యాటర్గా కంటే పేస్ బౌలర్గా మంచి ప్రతిభ ఉన్నట్లు కోచ్లు గుర్తించారు. ఒకే విభాగంలో దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో పూర్తిగా బౌలింగ్ వైపు మళ్లిన అతను చివరకు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలవడం విశేషం. ఫ్యామిలీతో స్టువర్ట్ సీనియర్ స్థాయికి... ఇంగ్లండ్ యువ క్రికెట్ జట్టును లయన్స్ పేరుతో పిలుస్తారు. ఆ టీమ్లో స్థానం దక్కడం అంటే మున్ముందు సీనియర్ టీమ్కు సిద్ధమైనట్లే లెక్క. ఏజ్ గ్రూప్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో బ్రాడ్ ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్ యువ జట్లతో జరిగిన సిరీస్లలో రాణించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై మరింత నమ్మకం ఉంచింది. భవిష్యత్తు కోసం ఎంపిక చేసే 25 మంది సభ్యుల డెవలప్మెంట్ గ్రూప్లో కూడా బ్రాడ్కు చోటు దక్కింది. జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ బృందానికి శిక్షణ ఇస్తున్నప్పుడు బ్రాడ్ ప్రతిభతో పాటు అతను కష్టపడే తత్త్వం, బౌలింగ్లో ప్రత్యేకత సెలక్టర్లను ఆకర్షించాయి. ఫలితంగా 20 ఏళ్ల వయసులో తొలి ఇంగ్లండ్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో అరంగేట్రం (టి–20ల్లో) చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత వన్డేల్లోనూ అడుగు పెట్టగా, మరి కొద్ది రోజులకే టెస్టు అవకాశం కూడా వెతుక్కుంటూ రావడం మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ రెగ్యులర్ ఆటగాడిగా బ్రాడ్ స్థాయి పెరిగింది. తండ్రితో బ్రాడ్ చిన్నప్పటి ఫోటో పదునైన పేసర్గా.... కెరీర్ ఆరంభంలో మొహంలో ఇంకా వీడని పసితనపు ఛాయలు, రంగుల జుట్టుతో అమాయకత్వం దాటని ఆటగాడిగా అతను కనిపించేవాడు. కానీ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో చరిత్రలో అత్యంత భీకరమైన ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు బ్రాడ్కు ఎక్కువ సమయం పట్టలేదు. బౌలింగ్ సత్తాతో పాటు మొండి పట్టుదల, ఒక్కసారిగా ప్రత్యర్థిపై ఆధిపత్యం మొదలైతే ఆగని అతని తత్త్వం బ్రాడ్ను ప్రత్యేకంగా మార్చాయి. కెరీర్లో 100వ టెస్టు ఆడే సమయానికే బ్రాడ్ ఒకే స్పెల్లో ఐదేసి వికెట్లు సాధించిన ఘనతను ఏడుసార్లు నమోదు చేశాడు. పాకిస్తాన్తో 3–0తో ఘన విజయంలో కీలక పాత్ర, విండీస్, న్యూజిలాండ్లపై లార్డ్స్లో ఏడేసి వికెట్ల ప్రదర్శన, దక్షిణాఫ్రికా గడ్డపై ఆరు వికెట్ల ఇన్నింగ్స్, మాంచెస్టర్లో భారత్ను 6 వికెట్లతో కుప్పకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సమరం... ఇలా బ్రాడ్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలు ఉన్నాయి. అతని సహజ నాయకత్వ లక్షణాలు బ్రాడ్ను టి20ల్లో కెప్టెన్గా పనిచేసే అవకాశం కల్పించాయి. యాషెస్లో అద్భుతం... టెస్టు క్రికెట్లో యాషెస్ సిరీస్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ చిరకాల సమరం ఇరు జట్లు ఆటగాళ్ల కెరీర్ను నిర్దేశిస్తుందనేది వాస్తవం. హీరోలుగా మారినా, జీరోలుగా మారినా ఈ సిరీస్తోనే సాధ్యం. ఇలాంటి సిరీస్లో బ్రాడ్ తన ప్రత్యేకత ప్రదర్శించాడు. ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించి యాషెస్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. 2009–2023 మధ్య కాలంలో 40 యాషెస్ టెస్టులు ఆడిన బ్రాడ్ 153 వికెట్లతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. 2009 ఓవల్లో 5 వికెట్లు, ఆ తర్వాత బ్రిస్బేన్, లీడ్స్, చెస్టర్ లీ స్ట్రీట్లలో ఆరేసి వికెట్లు...ఇలా యాషెస్లో మధుర జ్ఞాపకాలెన్నో. అయితే బ్రాడ్ కెరీర్లో అత్యుత్తమ క్షణం 2015 యాషెస్లో వచ్చింది. సొంత మైదానం ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన మ్యాచ్లో కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 8 ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టిన తీరుకు హ్యట్సాఫ్. ఆ స్పెల్లో ఒక్కో బంతి ఒక్కో అద్భుతం. ఆ సమయంలో బ్రాడ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అతని కెరీర్లో బెస్ట్ పోస్టర్గా నిలిచిపోయాయి. ఆస్తమాను అధిగమించి... బ్రాడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో కోణం కూడా దాగి ఉంది. 2015లో అతను బయటకు చెప్పే వరకు దీని గురించి ఎవరికీ తెలీదు. బ్రాంకో పల్మనరీ డిస్ప్లాజియా (అస్తమా) అనే శ్వాసకోస వ్యాధితో అతను చిన్నతనంలో బాధపడ్డాడు. మూడు నెలల ముందుగా ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టడంతో అతని ఊపిరితిత్తులో ఒకటి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. అయితే మందులతో పాటు క్రమశిక్షణ, ఆహార నియమాలతో అతను దీనిని అధిగమించగలిగాడు. ఒక పేస్ బౌలర్ ఇలాంటి సమస్యను దాటి రావడం అరుదైన విషయం. పుట్టిన సమయంలో తన ప్రాణాలు కాపాడిన జాన్ పేరును తన పేరు మధ్యలో చేరుస్తూ స్టూవర్ట్ జాన్ బ్రాడ్గా మార్చుకొని అతను కృతజ్ఞత ప్రకటించడం విశేషం. -
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్కు నైట్హుడ్.. ఇకపై "సర్" స్టువర్ట్ బ్రాడ్గా..!
కొద్ది రోజుల కిందట క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్కు, ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్కు చేసిన సేవలకు గాను బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యూకే ఎంపీలంతా బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్ నైట్హుడ్కు అర్హుడని యూకే ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఒకవేళ బ్రాడ్కు నైట్హుడ్ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్" వచ్చి చేరుతుంది. క్రికెట్లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్ బిరుదు తొలుత ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాన్సిస్ ఎడెన్ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్ దిగ్గజం, ఆసీస్ ఆటగాడు డాన్ బ్రాడ్మన్, జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), లెన్ హటన్ (ఇంగ్లండ్), రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), గ్యారీ సోబర్స్ (విండీస్), కర్ట్లీ ఆంబ్రోస్ (విండీస్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) వంటి పలువురు క్రికెట్ దిగ్గజాలు నైట్హుడ్ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్కుమార్కు నైట్హుడ్ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి 2 టెస్ట్లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ విజయాల్లో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్గా బ్రాడ్ టెస్ట్ల్లో ఐదో అత్యధిక వికెట్ టేకర్గా (604), ఓవరాల్గా ఏడో అత్యధిక వికెట్ టేకర్గానూ (847) రికార్డుల్లో నిలిచాడు. -
చివరి బంతికి సిక్స్.. వికెట్ కూడా! వారెవ్వా బ్రాడీ! వీడియో వైరల్
40 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన యాషెస్ సిరీస్కు ఎండ్ కార్డ్ పడింది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(72), డేవిడ్ వార్నర్(60), స్టీవ్ స్మిత్(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు సాధించారు. కెరీర్లో చివరి వికెట్ ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం. కాగా బ్రాడ్ ఫేర్వెల్ మ్యాచ్ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్ తన కెరీర్ చివరి వికెట్ సాధించిగానే.. స్టాండ్స్లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 80 ఓవర్లోఆఖరి బంతిని బ్రాడ్ అద్భుతమైన సిక్సర్ మలిచాడు. అదే అతడి కెరీర్లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్లో కూడా ఆఖరి బంతిని వికెట్తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రికార్డుల రారాజు.. కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు A fairytale ending for a legend of the game. Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p — England Cricket (@englandcricket) July 31, 2023 -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు! రియల్ లెజెండ్ అంటూ బ్రాడ్పై యువీ ట్వీట్.. వైరల్
Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్. నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. 17 ఏళ్ల కెరీర్కు గుడ్బై ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీడకలను మిగిల్చిన యువీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు. అందుకే వైరల్గా యువీ ట్వీట్ ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత Take a bow @StuartBroad8 🙇🏻♂️ Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend! Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3 — Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023 -
పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్ బ్రాడ్.. సిక్సర్తో..!
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో చివరాఖరి మ్యాచ్లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్లో 167 టెస్ట్లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. Most sixes for England in Tests: 124* - Ben Stokes 81 - K Pietersen 78 - A Flintoff 67 - I Botham 55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. కాగా, కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్టువర్ట్ బ్రాడ్కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..
యాషెస్ సిరీస్ 2023 చివరి టెస్ట్ సందర్భంగా క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు తన కెరీర్లో చివరిసారి బ్యాటింగ్కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రాడ్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆసీస్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్, బ్రాడ్ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు. Who's cutting onions? 🥺🥺pic.twitter.com/6wEoLEpp9Q — CricTracker (@Cricketracker) July 30, 2023 బ్రాడ్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్ బౌలర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్ తరఫున సుదీర్ఘ టెస్ట్ కెరీర్ కలిగిన బ్రాడ్కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చిన బ్రాడ్.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. -
ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడమే కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు
ప్రపంచక్రికెట్లో మరో శకం ముగిసింది. ఇంగ్లండ్ దిగ్గజం, స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు అతడు వెల్లడించాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాయిలను అందుకున్నాడు. అయితే ఒక సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్ లెజెండ్గా ఎదిగిన బ్రాడ్ నవ్వుల వెనుక గుండెలను పిండేసే వ్యథ దాగి ఉంది. ప్రీ మెచ్యూర్ బేబీ.. ఇంగ్లండ్ క్రికెట్ రారాజుగా ఎదిగిన బ్రాడ్ తన పుట్టకతోనే చావు అంచుల దాకా వెళ్లాడు. బ్రాడ్ ఒక ప్రీ మెచ్యూర్ బేబీ. తన తల్లికి నెలల నిండకముందే బ్రాడ్ జన్మించాడు. 12 వారాల ముందుగానే భూమిపైకి వచ్చాడు. అంటే వాళ్ల అమ్మ 6వ నెలలోనే అతడికి జన్మను ఇచ్చింది. బ్రాడ్ నాటింగ్హామ్లోని సిటీ హాస్పిటల్లో 24 జూన్ 1986న పుట్టాడు. బ్రాడ్ పుట్టినప్పుడు కేవలం 907 గ్రాములు. ఆ సమయంలో అతడు బ్రతుకుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడేవాడు. దాదాపు నెల రోజుల పాటు ఇంక్యుబేటర్లోనే ఉంచారు. అయితే ఆఖరికి బ్రాడ్ మృత్యువును జయించాడు. కానీ అతడి ఊపిరితిత్తుల సమస్య మాత్రం పూర్తిగా నయం కాలేదు. అతడు ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో బ్రాడ్ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికీ అతడు ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో ఇన్హిల్లర్ వాడుతూ కన్పించేవాడు. బ్రాడ్కు చిన్నతనం నుంచే క్రీడలు అంటే చాలా ఇష్టం. అతడు శీతాకాలంలో ఫుట్బాల్, వేసవిలో క్రికెట్ ఆడేవాడు. కాగా అతడి తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ ఎంట్రీ బ్రాడ్ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్ను 2005లో లీసెస్టర్షైర్ తరపున ప్రారంభించాడు. అనంతరం 2008లో నాటింగ్హామ్షైర్కు తన మకంను మార్చాడు. తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 264 మ్యాచ్లు ఆడిన బ్రాడీ 948 వికెట్లు పడగొట్టాడు. అందులో 20 సార్లు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించాడు. 2006లో అరంగేట్రం.. స్టువర్ట్ బ్రాడ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. సోఫియా గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్పై తన తొలి మ్యాచ్ బ్రాడ్ ఆడాడు. తన తొలి మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన బ్రాడ్..14 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అదే ఏడాది పాకిస్తాన్పై టీ20 డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత 2007లో టెస్టు క్రికెట్లో కూడా బ్రాడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన అరంగేట్రం నుంచి ఇంగ్లీష్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన బ్రాడ్.. 2016లో వైట్బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన చివరి వన్డే మ్యాచ్ 2016లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి 37 ఏళ్ల బ్రాడ్ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. తన కెరీర్లో కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్గా కూడా బ్రాడ్ వ్యవహరించాడు. రికార్డుల రారాజు.. 17 ఏళ్లు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన బ్రాడ్ ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. బ్రాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. అదే విధంగా 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 65 వికెట్లు సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్గా ఉన్నాడు. జెమ్స్ అండర్సన్ 182 మ్యాచ్లతో అగ్ర స్ధానంలో ఉండగా.. బ్రాడ్ 166 టెస్టులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బ్రాడ్ 600 వికెట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. 60 పరుగులకే ఆలౌట్.. 2015 యాషెస్ సిరీస్లో స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్లో కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ సంచలన స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా ఆ ఇన్నింగ్స్లో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో బ్రాడ్ బ్యాటింగ్లో కూడా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 97 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ కేవలం 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో సెంచరీ.. సాధరణంగా బాల్తో ప్రభావితం చూపే బ్రాడ్.. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 8 స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన బ్రాడ్ 169 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్గా తన టెస్టు కెరీర్లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్కు చుక్కలే.. ఇక బ్రాడ్ తన టెస్టు కెరీర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు చుక్కలు చూపిండాడు. గత కొన్ని ఏళ్ల నుంచి బ్రాడ్ బౌలింగ్ను ఎదుర్కొవడానికి వార్నర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బ్రాడ్ ఇప్పటి వరకు టెస్టుల్లో డేవిడ్ వార్నర్ని 17 సార్లు ఔట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా బ్రాడ్ చరిత్ర సృష్టించాడు. అదొక కాలరాత్రి.. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ బ్రాడ్కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువరాజ్ సింగ్, ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది బ్రాడ్కు కలరాత్రిని మిగిల్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన సెడ్జింగ్ కారణంగా యువీ సిక్సర్ల వర్షం కురిపించాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్ -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన బ్రాడ్కు శాపంగా మారింది. ఓవరాల్గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్కప్లో బ్రాడ్ ఇంగ్లండ్కు కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్.. తొలి ఇంగ్లండ్ బౌలర్గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్ చరిత్రలో ఆసీస్పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్గానూ బ్రాడ్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తడబడుతోంది. ఇంగ్లండ్ను తక్కువకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ కమిన్స్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్వుడ్లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, వోక్స్, జోరూట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Japan Open 2023: సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్గా
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
The Ashes, 2023: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వయసు పెరగగానే సరిపోదు.. కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా వ్యవహరిస్తూ ఓ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 సీజన్లో ఇంగ్లండ్పై ఇప్పటికే రెండు విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. తమకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పదిహేడో సారి ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ(118) కారణంగా మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. 263 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(4) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో పదహారోసారి అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో(1)నూ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. కాగా టెస్టుల్లో బ్రాడ్ బౌలింగ్లో వార్నర్ అవుట్ కావడం ఇది పదిహేడోసారి. దీంతో వార్నర్ను ట్రోల్ చేస్తూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్తో రెచ్చిపోయారు. మీమ్ను రీషేర్ చేసిన క్రిస్ బ్రాడ్ ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అమెరికన్ యానిమేటెడ్ సిట్కామ్ సిరీస్ ది సింప్సన్స్లోని బార్ట్ అనే క్యారెక్టర్ను వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసి పెట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ మళ్లీ నన్ను అవుట్ చేశాడు అని వార్నర్ బోర్డు మీద రాస్తున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లను గుర్తుచేస్తూ ఈ మీమ్ను స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రీషేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కొడుకు ప్రతిభ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ అయి ఉండి ఇలా దిగజారిపోవడం ఏమీ బాగాలేదు. వార్నర్ను మరీ అంతగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అని క్రిస్కు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2007లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘‘యువీ బ్రాడ్ బౌలింగ్లో చితక్కొట్టినపుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు ఎందుకు?’’ అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి Ind vs WI: కోహ్లి, రోహిత్ వాళ్లిద్దరి బౌలింగ్లో! వీడియో వైరల్ What a start! 🤩 Broad gets Warner for the... *Checks notes* ...Sixteenth time! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/WfSoa5XY1G — England Cricket (@englandcricket) July 6, 2023 Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 pic.twitter.com/76dG8lgOkv — Chris Broad (@ChrisBroad3) July 7, 2023 -
'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి'
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్తో మ్యాచ్ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం -
నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు ఏడో ఓవర్లో వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్ (9), మార్నస్ లబూషేన్ (0) వికెట్లు పడగొట్టిన బ్రాడ్.. ఆసీస్ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత వార్నర్ను అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. ఆతర్వాతి బంతికే లబూషేన్ను పెవిలియన్కు పంపాడు. Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 వికెట్ల వెనుక బెయిర్స్టో సూపర్ క్యాచ్తో లబూషేన్ ఖేల్ ఖతం చేశాడు. ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యాషెస్లో బ్రాడ్.. వార్నర్ను ఔట్ చేయడం ఇది 15వసారి కాగా.. టెస్ట్ల్లో లబూషేన్ గోల్డన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. First-ever golden duck for @marnus3cricket in Tests.pic.twitter.com/ROSAxQf7Da — CricTracker (@Cricketracker) June 17, 2023 కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి (393/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (24), స్టీవ్ స్మిత్ (9) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన 2 వికెట్లు స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలోకి వెళ్లాయి. చదవండి: తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్ -
తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్
టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్ భాయ్ ఇదే తీరును కనబరిచాడు. తీరు మారని వార్నర్.. డేవిడ్ వార్నర్పై మరోసారి ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పైచేయి సాధించాడు. అద్భుతమైన బంతితో వార్నర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో వార్నర్ను బ్రాడ్ ఔట్ చేయడం 15వసారి కావడం గమనార్హం. టెస్టుల్లో ఓవరాల్గా బ్రాడ్ బౌలింగ్లో 734 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. కేవలం 26.46 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లడ్ గడ్డపై వార్నర్ను బ్రాడ్ ఎక్కువసార్లు ఔట్ చేశాడు. తన సొంత గడ్డపై 9 సార్లు వార్నర్ను పెవిలియన్కు పంపాడు. 2013 నుంచి టెస్టుల్లో వార్నర్కు బ్రాడ్ చుక్కలు చూపిస్తునే వస్తున్నాడు. క్రికెట్లో వార్నర్ను ఏ బౌలర్ కూడా ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. వార్నర్ను బ్రాడ్ ఏకంగా నాలుగు సార్లు డకౌట్ చేశాడు. కాగా వార్నర్కు ఇదే ఆఖరి యాషెస్ సిరీస్. కనీసం ఈ సిరీస్లోనైనా బ్రాడ్ను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(22),స్టీవ్ స్మిత్(7) పరుగులతో ఉన్నారు. చదవండి: PAK vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన!స్టార్ బౌలర్ వచ్చేశాడు Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 -
ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు సన్నాహంగా ఐర్లాండ్తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు. దీంతో టాపార్డర్లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచారు. స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. చదవండి: Josh Tongue: ఇంగ్లండ్కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive... One of the most pleasing shots in cricket 😍 Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw — England Cricket (@englandcricket) June 1, 2023 -
ENG Vs NZ: గర్జించిన వెటరన్ సింహాలు.. న్యూజిలాండ్ను మట్టికరిపించిన ఇంగ్లండ్
బజ్బాల్ విధానాన్ని అవలంభించి ఇంగ్లండ్ జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై ఆడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్ట్లో ఆతిధ్య జట్టును 267 పరుగుల తేడాతో మట్టికరిపించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్కు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్లో ఆండర్సన్ 7 వికెట్లతో విజృంభించగా.. బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ వెటరన్ పేస్ ద్వయం రెండో ఇన్నింగ్స్లో నిప్పులు చెరిగారు. బ్రాడ్ 4, ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాశించారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్బౌల్డ్లు కావడం మరో ఆసక్తికర విషయం. ఇంగ్లండ్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆండర్సన్, బ్రాడ్ ధాటికి 126 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అటాకింగ్ ఫార్ములాను అమలు చేసిన ఇంగ్లండ్ మరోసారి సక్సెస్ సాధించింది. ఆండర్సన్, బ్రాడ్తో పాటు ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా.. టామ్ లాథమ్ (15), బ్రేస్వెల్ (25) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 306 పరుగులకు ఆలౌటైంది. 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 374 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటై 267 పరుగుల తేడతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో టామ్ బ్లండెల్ (138) సెంచరీతో, కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశారు. అనంతరం ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్సెంచరీలతో రాణించగా.. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బౌలర్లు వాగ్నర్ 6, టిక్నర్ 4, కుగ్గెలిన్ 4, బ్రేస్వెల్ 3, సౌథీ 2 పడగొట్టగా.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 7, బ్రాడ్ 5, రాబిన్సన్ 5, జాక్ లీచ్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది. -
ENG VS NZ 1s Test: నిప్పులు చెరిగిన బ్రాడ్.. ఓటమి దిశగా కివీస్
2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో (డే అండ్ నైట్) విజయం దిశగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు రెండో ఇన్నింగ్స్లో 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (10-5-21-4) నిప్పులు చెరగడంతో మూడో రోజు ఆఖరి సెషన్లో కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. క్రీజ్లో డారిల్ మిచెల్ (13),ర మైఖేల్బ్రేస్వెల్ (25) ఉన్నారు. బ్రాడ్ 4 వికెట్లతో విజృంభించగా.. రాబిన్సన్ ఓ వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో లాథమ్ (15), డెవాన్ కాన్వే (2), విలియమ్సన్ (0), హెన్రీ నికోల్స్ (7), టామ్ బ్లండెల్ (1) దారుణంగా విఫలమయ్యారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌటైంది. రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్సెంచరీలతో రాణించగా.. ఓలీ పోప్ (49), స్టోక్స్ (31), రాబిన్సన్ (39), జాక్ క్రాలే (28), బెన్ డక్కెట్ (25) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్, బ్రేస్వెల్ చరో 3 వికెట్లు తీయగా.. వాగ్నర్, కెగ్గెలిన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో చేసిన 325 పరగుల స్కోర్కు న్యూజిలాండ్ ధీటుగానే బదులిచ్చింది. టామ్ బ్లండెల్ (138) సెంచరీతో కదం తొక్కగా.. కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 4, ఆండర్సన్ 3, బ్రాడ్, జాక్ లీచ్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలిన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. మరో వికెట్ ఉండగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. -
NZ Vs Eng: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు బిగ్ షాక్
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రావల్పిండి వేదికగా డిసెంబర్ 1న ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే బ్రాడ్ భార్య మోలీ కింగ్ నవంబర్ మధ్యలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. అతడు ఈ సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రాడ్ ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో కీలక సభ్యుడుగా ఉన్నాడు. న్యూజిలాండ్, దక్షాణాఫ్రికా, భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ విజయంలో బ్రాడ్ ముఖ్య భూమిక పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ చివరసారిగా 2005లో పాకిస్తాన్తో టెస్టు సిరీస్లో తలపడింది. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 2-0తో కోల్పోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో పాకిస్తాన్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ తలపడింది. ఈ సిరీస్ను 4-3 ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్? -
'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!'
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ శుక్రవారం అర్థరాత్రి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్.. ఓటమితో కెరీర్ను ముగించాడు. కాగా మ్యాచ్ అనంతరం కెరీర్కు గుడ్బై చెబుతూ రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం కాగా.. పక్కనే ఉన్న నాదల్ కూడా తట్టుకోలేక ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫెదరర్, నాదల్ను అభిమానులు ఇలా చూడలేకపోయారు. ''మ్యాచ్లో మాత్రమే ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు.. వీరి బంధం విడదీయలేనిది'' అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్.. ఫెడరర్, నాదల్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. వారి ఫోటో పక్కన బ్రాడ్ తనతో పాటు అండర్సన్ ఫోటోను పెట్టాడు. ''2053లో అండర్సన్ రిటైర్ అయితే నేను కూడా ఇలానే ఏడుస్తానేమో'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్న బ్రాడ్, అండర్సన్ మంచి మిత్రలు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో కెరీర్ను ఆరంభించారు.టెస్టు క్రికెట్లో పేసర్ల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన లీడింగ్ బౌలర్గా అండర్సన్ కొనసాగుతుండగా.. అతని వెనకాలే స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు. కాగా బ్రాడ్ షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు.''ఫెడ్డీ, నాదల్లు టెన్నిస్లో మంచి మిత్రులైతే... మీరు క్రికెట్లో చిరకాల మిత్రులు.. మీ బంధం కూడా శాశ్వతంగా సాగిపోవాలి అని కోరుకుంటున్నా'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఓటమితో కెరీర్కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్
Yuvraj Singh Celebrates Six 6s- Video Viral: టీ20 ప్రపంచకప్-2007లో నాటి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఘటన ప్రతి అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందడనంలో సందేహం లేదు. ఇంగ్లండ్తో సెప్టెంబరు 19 నాటి మ్యాచ్లో యువీ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయాడు. మ్యాచ్ 19వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు సిక్స్లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న యువీ.. 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 218 పరుగుల భారీ స్కోరు చేయడం సహా 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు. ముద్దుల కొడుకుతో కలిసి.. ఈ సందర్భంగా క్రికెట్ ప్రేమికులు, యువీ అభిమానులు ఈ అద్భుత ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, యువరాజ్ మాత్రం ఓ స్పెషల్ పార్ట్నర్తో కలిసి తన చిరస్మరణీయ ఇన్నింగ్స్ తాలుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. బుడ్డోడు సైతం కన్నార్పకుండా.. ఆ పార్ట్నర్ మరెవరో కాదు యువీ ముద్దుల తనయుడు ఓరియన్ కీచ్ సింగ్. కుమారుడితో కలిసి ప్రపంచకప్లో తన సిక్సర్ల విధ్వంసం వీక్షిస్తున్న వీడియోను యువరాజ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో కొడుకును ఒళ్లో కూర్చోబెట్టుకుని యువీ ఎంజాయ్ చేస్తుండగా.. బుడ్డోడు సైతం కన్నార్పకుండా తండ్రి ఆటను చూస్తూ ఉండిపోవడం విశేషం. ఫ్యాన్స్ను ఫిదా చేస్తున్న ఈ వీడియో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. 2007లో స్కాట్లాండ్తో మ్యాచ్లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్లో మొత్తంగా 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 28 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆల్రౌండర్. ఇక అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్ను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సముచిత రీతిలో గౌరవించింది. మొహాలీలో స్టేడియంలోని ఓ స్టాండ్కు యువీ పేరును పెట్టగా.. ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆరంభం కానున్న సందర్భంగా మంగళవారం దీనిని ఆవిష్కరించనున్నారు. కాగా యువరాజ్ సింగ్.. నటి హజెల్ కీచ్ను 2016లో వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఈ ఏడాది జనవరిలో కుమారుడు జన్మించాడు. అతడికి ఓరియన్ కీచ్ సింగ్గా నామకరణం చేశారు. చదవండి: T20 WC: యువ పేసర్పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 -
Eng Vs SA: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం.. ఏకంగా..
South Africa tour of England, 2022 - England vs South Africa, 3rd Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా లండన్లోని కెనింగ్టన్ వేదికగా సెప్టెంబరు 8న ఆరంభమైన ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 118 పరుగులకే ఆలౌట్! ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పర్యాటక ప్రొటిస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించారు. రాబిన్సన్ ఐదు వికెట్లు, బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్తో పాటు సిరీస్ కూడా సొంతం! ఇక ఇంగ్లండ్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. బ్రాడ్ మరోసారి మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇందుకు కెప్టెన్ బెన్స్టోక్స్ కూడా జత కావడంతో దక్షిణాఫ్రికా 169 పరుగులకే రెండో ఇన్నింగ్స్ను ముగించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి.. ఆఖరి రోజు జయభేరి మోగించింది. సిరీస్ను సైతం సొంతం చేసుకుంది. రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్తో పాటు ప్రొటిస్ బౌలర్ కగిసొ రబడ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రబడ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్ ప్రొటిస్ది.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్ది! మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి వన్డేలో పర్యాటక ప్రొటిస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లంఢ్ గెలుపొందింది. ఆఖరి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకోగా.. ఆఖరి రెండు టెస్టుల్లో ఓటమి పాలై.. టెస్టు సిరీస్ను 2-1తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన SL Vs Pak: పాక్తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక -
118 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన మూడో టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 118 పరుగులకే కుప్పకూలింది. ఓలి రాబిన్సన్ ఐదు, స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లతో ప్రొటిస్ను శాసించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్కో జాన్సెన్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జోండో 23 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా బ్యాటర్స్లో ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓలి పోప్ 38, జో రూట్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు అలెక్స్ లీస్ 13, జాక్ క్రాలీ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్లో 1-1తో సమంగా ఉన్నాయి. -
ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు..
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 151 పరుగులకే ఆలౌట్ అయింది. రబడా 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, బ్రాడ్ 3, బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఎల్గర్ ఔట్ అనుకుంటే పొరపాటే.. ఎల్గర్ను పెవిలియన్కు చేర్చే క్రమంలో స్టువర్ట్ బ్రాడ్ సెట్ చేసుకున్న బౌలింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. అప్పటికే అండర్సన్ సరేల్ ఎర్వీ(3)ని ఇన్నింగ్స్ల ఐదో ఓవర్లో వెనక్కి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ డీన్ ఎల్గర్కు స్టువర్ట్ బ్రాడ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి చివరకు తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లో ఎల్గర్ ఔటైన ఐదో బంతి వరకు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉండడం విశేషం. ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎల్గర్.. చివరకు ఐదో బంతికి దొరికిపోయాడు. గుడ్లెంగ్త్తో రౌండ్ ది వికెట్ వేసిన బంతిని ఎల్గర్ టచ్ చేయగా నేరుగా బెయిర్స్టో చేతుల్లో పడింది. Some over. 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/4LZg4bwXBP — England Cricket (@englandcricket) August 25, 2022 చదవండి: ENG Vs SA 2nd Test: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్ James Anderson: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్లో నాలుగో బౌలర్గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ లార్డ్స్ వేదికగా అరుదైన ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కైల్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్లో 100వ వికెట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికలో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో ఇంగ్లండ్ బౌలర్గా బ్రాడ్ నిలచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్(117 వికెట్లు) ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే వేదిక(క్రికెట్ గ్రౌండ్లో)పై 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా స్టువర్ట్ బ్రాడ్ నిలిచాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ ఏకంగా మూడు వేదికల్లో మూడుసార్లు వంద వికెట్ల మార్క్ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత జేమ్స్ అండర్సర్, రంగనా హెరాత్లు ఉన్నారు. తాజాగా వీరి సరసన స్టువర్ట్ బ్రాడ్ చేరాడు. టెస్టుల్లో ఒకే వేదికలో 100 వికెట్లు తీసిన బౌలర్లు: ►ముత్తయ్య మురళీధరన్-( సింహాళి స్పోర్ట్స్క్లబ్, కొలంబో.. 166 వికెట్లు, అసిగిరియా స్టేడియం, కాండీ.. 117 వికెట్లు, గాలే స్టేడియం..111 వికెట్లు) ►జేమ్స్ అండర్సన్(లార్డ్స్ స్టేడియం.. 117 వికెట్లు) ►రంగనా హెరాత్(గాలె స్టేడియం.. 102 వికెట్లు) ►స్టువర్ట్ బ్రాడ్ (లార్డ్స్ స్టేడియం.. 102 వికెట్లు) ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41), మార్కో జాన్సెన్ (41 బ్యాటింగ్) రాణించారు. బెన్ స్టోక్స్కు 3 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. పేస్ బౌలర్ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు. #ENGvSA#StuartBroad became only the fourth bowler to take 100 Test wickets at a single venue after Muttiah Muralitharan, Rangana Herath, and James Anderson. READ: https://t.co/SKde9eqsWT 🎥: (@englandcricket)pic.twitter.com/dJP0YwWXbJ — Express Sports (@IExpressSports) August 19, 2022 🚨 Milestone Alert 🚨 Stuart Broad completed 1️⃣0️⃣0️⃣ Test wickets at Lord's 🤯🏴 A special achievement by a special bowler 🙌#stuartbroad #England #ENGvSA #CricketTwitter pic.twitter.com/J4ZyuP2igG — Sportskeeda (@Sportskeeda) August 19, 2022 చదవండి: అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ SA Vs ENG: రబడా పాంచ్ పటాకా.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా -
Ind Vs Eng: నన్ను నా పని చేసుకోనివ్వు.. నువ్వు నోర్ముయ్: అంపైర్ వార్నింగ్!
India Vs England 5th Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చిన బ్రాడ్.. చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బ్రాడ్ చెత్త రికార్డు సాధించిన బౌలర్గా రికార్డుకెక్కాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్రాడ్ ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇదే మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా బ్రాడ్కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన స్టువర్ట్ బ్రాడ్ను టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమ షార్ట్ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్ అంపైర్కు పదేపదే ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన అంపైర్.. ‘‘నన్ను అంపైరింగ్ చేసుకోనివ్వు. నువ్వు బ్యాటింగ్ చేయ్! ఓకే! లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు. ఒక్క ఓవర్కే ఇలానా! బ్రాడీ..! బ్రాడీ! నువ్వు బ్యాటింగ్ చెయ్! అలాగే కాస్త ఆ నోరు మూసెయ్’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్లో 5 బంతులు ఎదుర్కొన్న బ్రాడ్.. ఒకే ఒక పరుగు తీసి సిరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగో రోజు పట్టు సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ ఐదో రోజు విజయం దిశగా దూసుకుపోతోంది. చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో! Richard Kettleborough#FromYorkshire pic.twitter.com/SIIczXE4UQ — Sɪʀ Fʀᴇᴅ Bᴏʏᴄᴏᴛᴛ (@SirFredBoycott) July 4, 2022 An incredible day that leaves us with a chance of making history 🙏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/QvDmaK20tp — England Cricket (@englandcricket) July 5, 2022 -
ఒకే ఓవర్లో 29 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు..!
టెస్టు క్రికెట్లో టీమిండియా ఆటగాడు, స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఏకంగా బుమ్రా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను బుమ్రా తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ ఓవర్లో బ్రాడ్ ఆరు ఎక్స్ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుమందు 2003లో జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్.. నాలుగో భారత ఆటగాడిగా..! BOOM BOOM BUMRAH IS ON FIRE WITH THE BAT 🔥🔥 3️⃣5️⃣ runs came from that Broad over 👉🏼 The most expensive over in the history of Test cricket 🤯 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - https://t.co/tsfQJW6cGi#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Hm1M2O8wM1 — Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2022 -
టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్గా..!
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నమోదు చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా బ్రాడ్ నిలిచాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన బ్రాడ్.. ఏకంగా 35 పరుగులు సమర్పించుకుని ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 29 పరుగుల రాబట్టగా, 6 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. అంతకు ముందు 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్ పీటర్సన్ ఒకే ఓవర్లో 28 పరుగులు ఇచ్చాడు. ఇప్పడు బ్రాడ్ 35 పరుగులు ఇచ్చిఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించికున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్.. నాలుగో భారత ఆటగాడిగా..! #Bumrah The most expensive over in Test cricket history - Jasprit Bumrah remember the name…#JaspritBumrah #Bumrah#StuartBroad #ENGvsIND#INDvsENG #ENGvIND#ViratKohli #RishabhPant pic.twitter.com/LvbPTqf0ZV — ARPITA ARYA (@ARPITAARYA) July 2, 2022 -
'ఓ మై బ్రాడ్'.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు..!
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. 236/4 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(108), బ్లండల్(96) పరుగులతో రాణించారు.అయితే మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ను స్టువర్ట్ బ్రాడ్ ఆదిలోనే దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 84 ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్లో న్యూజిలాండ్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి డార్లీ మిచెల్ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, తరువాత బంతికి డి గ్రాండ్హోమ్ రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే జేమీసన్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో వరుస క్రమంలో న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే 276 పరుగులు చేయాలి. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..! OH MY BROAD! 😱 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/tTSvvVAvyp — England Cricket (@englandcricket) June 4, 2022 -
'వాళ్లిద్దరికే వికెట్లు పడుతున్నాయి.. నీ బాధ నాకు అర్థమైంది'
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్ దశ మారినట్లుంది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు కకావికలమైంది. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులకే ఆలౌటైంది. రీఎంట్రీ ఇచ్చిన అండర్సన్.. డెబ్యూ టెస్టు ఆడుతున్న మాథ్యూ పాట్స్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగిపోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. తన ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''డెవన్ కాన్వే.. నీ బాధ నాకు అర్థమయింది..'' అంటూ కాన్వే ఫోటో కాకుండా బ్రాడ్ ఫోటోను పెట్టాడు. కాన్వేకు బదులుగా బ్రాడ్ ఫోటో పెట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. మ్యాచ్లో అండర్సన్, బ్రాడ్లు రీఎంట్రీ ఇచ్చారు. రొటేషన్లో భాగంగా విండీస్తో సిరీస్కు వీరిద్దరిని దూరంగా పెట్టారు. ఇక కివీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరికి అవకాశం వచ్చింది. అండర్సన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు తీసి కివీస్ ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా డెబ్యూ బౌలర్ మాథ్యూ పాట్స్ కూడా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. ఇద్దరే చెరో నాలుగు వికెట్లు తీయడంతో బ్రాడ్కు ఒక్క వికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. కానీ డెవన్ కాన్వే రూపంలో బ్రాడ్కు అదృష్టం తగిలింది. ఆఫ్స్టంప్కు వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్న కాన్వే వికెట్ సమర్పించుకున్నాడు. అలా ఎట్టకేలకు అండర్సన్, మాథ్యూ పాట్స్ల మధ్య బ్రాడ్ వికెట్ దక్కించకున్నాడు. ఇది పసిగట్టిన వార్నర్ కాస్త తెలివిని ప్రదర్శిస్తూ కాన్వేపై జాలి చూపిస్తూనే.. ఇన్డైరెక్ట్గా బ్రాడ్కు మెసేజ్ పంపాడు. ''ఇన్నింగ్స్లో వాళ్లిద్దరే వికెట్లన్నీ పడగొట్టారు.. నీకు దక్కుతుందో లేదో అని భయపడ్డా.. మొత్తానికి దక్కించుకున్నావు.. నీ బాధ నాకు అర్థమయింది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! -
అండర్సన్, బ్రాడ్లపై వేటు
లండన్: అండర్సన్ 640 వికెట్లు... స్టువర్ట్ బ్రాడ్ 537 వికెట్లు... టెస్టుల్లో వీరిద్దరు కలిసి ఏకంగా 1,177 వికెట్లు పడగొట్టి సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే యాషెస్ సిరీస్లో 0–4తో చిత్తయిన ప్రభావం ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లపై కూడా పడింది. వెస్టిండీస్తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అండర్సన్, బ్రాడ్లకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లను తప్పించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠిన నిర్ణయం తీసుకుంది. యాషెస్ పరాజయం తర్వాత హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, మేనేజింగ్ డైరెక్టర్లను తప్పించిన బోర్డు ఇప్పుడు ఆటగాళ్లపై వేటు వేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్ నుంచి మొత్తం ఎనిమిది మందిని తప్పించడం గమనార్హం. బట్లర్, రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మలాన్, స్యామ్ బిల్లింగ్స్, డామ్ బెస్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు. -
Aus Vs Eng: 134.1 స్పీడ్.. బొక్కబోర్లా పడ్డాడు.. ఇంత వరకు ఇలా అవుటవడం చూడలే!
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు విఫలమైన వేళ మార్నస్ లబుషేన్ కంగారూల పాలిట ఆశాదీపంగా నిలిచాడు. వార్నర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... ‘సెంచరీల’ వీరుడు ఉస్మాన్ ఖవాజా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ట్రవిస్ హెడ్తో కలిసి జట్టును ఆదుకున్నాడు లబుషేన్. 53 బంతులు ఎదుర్కొన్న అతడు 44 పరుగులు చేశాడు. అయితే, 9 ఫోర్లు బాది జోరు మీదున్న లబుషేన్ విచిత్రకర రీతిలో అవుట్ కావడం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 23వ ఓవర్లో 134.1 స్పీడ్తో బంతిని సంధించాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన లబుషేన్... ఒక్కసారిగా బొక్కబోర్లాపడిపోయాడు. ఇంకేముంది.. బంతి వికెట్లను గిరాటేయడం.. బెయిల్స్ కిందపడటం చకచకా జరిగిపోయాయి. పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న లబుషేన్ను బౌల్డ్ చేసిన ఆనందంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆసీస్ బ్యాటర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఆసీస్ ఇప్పటికే 3-0 తేడాతో ఆసీస్ సిరీస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాకాగా... ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. One of the weirdest dismissals we've ever seen! 😱#Ashes pic.twitter.com/8Qp5rKprn8 — cricket.com.au (@cricketcomau) January 14, 2022 -
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో టెస్ట్లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
AUS Vs ENG 4th Test: స్టువర్ట్ బ్రాడ్ రికార్డు.. ఆసీస్ 126/3
యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకంగా నిలిచాడు. దీంతో తొలి రోజు కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వరుస అంతరాయాల నడుమ సాగిన ఈ ఇన్నింగ్స్లో లంచ్ విరామం తర్వాత 51 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(30) బ్రాడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత జట్టు స్కోర్ 111 పరుగుల వద్ద ఉండగా మార్కస్ హ్యారిస్(38)ను ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే 117 పరుగుల వద్ద లబూషేన్(28)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. ఈ సమయంలో వరుణుడు మళ్లీ అడ్డుపడడంతో అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపి వేశారు. క్రీజ్లో స్మిత్(6), ఖ్వాజా(4) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ వార్నర్ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో వార్నర్ను అత్యధిక సార్లు(13) ఔట్ చేసిన బౌలర్గా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. బ్రాడ్ తర్వాత వార్నర్ను అత్యధికంగా అశ్విన్, అండర్సన్లు పదేసి సార్లు ఔట్ చేశారు. చదవండి: శార్ధూల్ ఠాకూర్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..! -
అరంగేట్ర మ్యాచ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్!
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతగా 5వికెట్ల ఘనతను సాధించిన మూడో బౌలర్గా రికార్డుల కెక్కాడు. యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన మూడో టెస్ట్లో 5వికెట్లు పడగొట్టి బోలాండ్ ఈ ఘనతను సాధించాడు. కాగా అరంగేట్ర మ్యాచ్లోనే బోలాండ్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్ రికార్డులను అతడు సమం చేశాడు. 1947లో భారత జట్టుపై తోషాక్ ఈ ఘనత సాధించగా,2015లో ఆసీస్పై బ్రాడ్ ఫాస్టెస్ట్ 5వికెట్ల రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్లో బోలాండ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15పరుగల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 68 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్లో స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. చదవండి: Sourav Ganguly Covid Positive: ఆస్పత్రిలో చేరిన గంగూలీ... INSANE! Scott Boland takes two in the over! #OhWhatAFeeling #Ashes | @Toyota_Aus pic.twitter.com/Uhk046VGG6 — cricket.com.au (@cricketcomau) December 27, 2021 -
Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత..
Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 150 మ్యాచ్లు ఆడిన మూడో ఇంగ్లండ్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. బ్రాడ్కు ముందు జేమ్స్ ఆండర్సన్(167 టెస్ట్లు), అలిస్టర్ కుక్(161) ఇంగ్లండ్ తరఫున ఈ ఘనతను సాధించారు. Congratulations on an incredible achievement, @StuartBroad8! 👏#Ashes | 🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/ySqWgT2Dcb — England Cricket (@englandcricket) December 16, 2021 ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(200) పేరిట ఉండగా.. బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం 525 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), జేమ్స్ ఆండర్సన్(632)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రసుత్తం ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(95) వరుసగా రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్, బ్రాడ్కు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: విరాట్లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
ఆ విషయమై మెక్గ్రాత్ నన్ను విష్ కూడా చేశాడు.. ఇంగ్లండ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Stuart Broad Reveals Awkward Moment With Glenn McGrath Ahead Of Ashes 1st Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆతిధ్య ఆసీస్ జట్టు ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తుది జట్టు కూర్పుపై సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గబ్బా టెస్టులో చోటు దక్కకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని, తుది జట్టులో ఆడిన ప్లేయర్లలో ఒక్క సీమర్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, తుది జట్టు కూర్పు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్కు ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి బ్రాడ్ ప్రస్తావించాడు. టాస్కి ముందు ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆసీస్ లెజెండరీ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ తన వద్దకు వచ్చి 150వ టెస్ట్ ఆడబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడని, నేను అతనికి థ్యాంక్స్ కూడా చెప్పానని, తీరా చూస్తే తుది జట్టులో తన స్థానం గల్లంతు కావడంతో తలకొట్టేసినట్లయ్యిందని వాపోయాడు. తాను తుది జట్టులో ఉంటాననుకుని మెక్గ్రాత్తో పాటు చాలా మంది విష్ చేశారని, కానీ ఆఖరి నిమిషంలో తాను టీమ్లో లేనని తెలియడంతో సిగ్గుతో మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డాడు. తాను తుది జట్టులో ఆడి ఉంటే జట్టుకు ఉపయోగకరంగా ఉండేవాడినని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కాగా, బ్రాడ్ 149 టెస్టుల్లో 524 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా జేమ్స్ అండర్సన్(166 టెస్ట్ల్లో 633 వికెట్లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్లో ఎదురైన పరాభవం దృష్ట్యా ఇంగ్లండ్ తుది జట్టు(రెండో టెస్ట్)లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో పలు మార్పులతో పాటు స్టువర్ట్ బ్రాడ్, మరో సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని సమాచారం. చదవండి: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్షాక్.. డేవిడ్ వార్నర్కు గాయం -
'ప్రపంచకప్ మాదే' అన్న పాక్ అభిమాని.. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ రిప్లై
Stuart Broad Super Reply To ICC Post.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటూ నాలుగు వరుస విజయాలతో ఐదోసారి సెమీస్లో అడుగుపెట్టింది. సూపర్ 12 గ్రూఫ్-2లో టీమిండియా, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లతో పాటు అఫ్గానిస్తాన్ను ఓడించింది. తాజాగా నమీబియాపై విజయం అందుకున్న పాకిస్తాన్ టైటిల్ ఫెవరెట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్, నమీబియా మ్యాచ్కు హాజరైన ఒక పాక్ అభిమాని '' ఈసారి వరల్డ్ కప్ మాదే.. పాకిస్తాన్ జిందాబాద్'' అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. చదవండి: PAK Vs NAM: 'ఓడిపోయామని బాధపడకండి.. బాగా ఆడారు'.. ఈ ఫోటోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ''పాకిస్తాన్ ఈసారి కప్ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ''మరి ఇంగ్లండ్ '' అంటూ ఒక్క డైలాగ్తో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఐసీసీ పోస్టును 2లక్షల మంది లైక్ చేయగా.. అందులో బ్రాడ్ పెట్టిన రిప్లైకి 3వేలకి పైగా లైక్స్ వచ్చాయి. వాస్తవానికి ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్తో పాటు ఇంగ్లండ్ కూడా టైటిల్ ఫెవరెట్గా ఉంది. సూపర్ 12 దశలో గ్రూఫ్-1లో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్గా నిలిచి మెరుగైన రన్రేట్తో పాక్ కంటే ముందే సెమీస్కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ .. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బట్లర్ మెరుపు సెంచరీతో 26 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్కు అడుగుపెట్టింది. చదవండి: IND VS AFG: ముగ్గురు స్పిన్నర్లను ఆడించినా తప్పులేదు.. అశ్విన్ మాత్రం View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆరు సిక్సర్లు గుర్తున్నాయా?.. రీక్రియేట్ చేసేశాడు
Yuvraj Singh Six Balls 6 Sixes Recreation.. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అంటే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2007 టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ ఈ ఫీట్ను సాధించాడు. అంతకముందు ఆండ్రూ ఫ్లింటాఫ్తో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్కు చుక్కలు చూపించాడు. బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. కాగా ఈ సెప్టెంబర్ 19తో యువీ ఇన్నింగ్స్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చదవండి: యువీ సిక్సర్ల సునామీ.. ఆ విధ్వంసం జరిగి నేటికి 14 ఏళ్లు టి20 ప్రపంచకప్ 2007లో యువీ ఆరు బంతులు ఆరు సిక్సర్లు తాజాగా యువరాజ్ దానిని మరోసారి గుర్తుచేస్తూ తన యూట్యూబ్ చానెల్లో రిక్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. వీడియో ఓపెన్ చేయగానే.. బ్యాటింగ్కు సిద్ధమవుతున్న యువీని చూస్తాం. ఇంట్లో కాబట్టి తలకు బండి హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తాడు. బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి ఎంటరవబోతుంటే ఒక వ్యక్తి అడ్డుపడుతాడు. ఏంటి అని అడిగితే.. మీరు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ బ్యాట్తోనే అంటూ యువీ ఆ ఇన్నింగ్స్ గుర్తుగా దాచుకున్న హీరోహోండా బ్యాట్ను చూపించాడు. ఇప్పడు అంత టైం లేదని చెప్పాడు. చదవండి: INDW VS AUSW: తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం కట్చేస్తే తన ఇంటి ఆవరణలోని మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్తో గొడవ పడుతున్నట్లు చూపించాడు. ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వస్తున్నట్లు తనే కామెంటరీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్తో జరిగిన గొడవను గుర్తు చేస్తూ తాను కొట్టిన ఒక్కో సిక్సర్ను చూపించాడు. అలా వీడియో మొత్తంలో ఆరు సిక్సర్లు కొట్టిన విధానాన్ని యాక్టింగ్ చేసి చూపించాడు. ఇక చివర్లో ''నా యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు.. బాలీవుడ్ లెవల్లో ఉందా.. ప్లీజ్ కామెంట్ చేయండి..'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Viral Video: ఔటయ్యాననే కోపంతో బ్యాట్ విసిరాడు.. అది కాస్తా.. -
యువీ సిక్సర్ల సునామీ.. నేటికి ఆ పెను విధ్వంసానికి 14 ఏళ్లు
Yuvraj Singh 6 Sixes In T20 World Cup 2007: సరిగ్గా 14 ఏళ్ల క్రితం పొట్టి ఫార్మాట్లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. 2007 సెప్టెంబర్ 19న టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. ఆ ఇన్నింగ్స్లో 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్.. 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. యువీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
అవును.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. నాలుగోరోజు ఆటలో భాగంగా ఆండర్సన్ పలు మార్లు పిచ్పై పరిగెత్తడమే కాకుండా కోహ్లిని కవ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "పిచ్ నీ సొంతం అనుకున్నావా.. పరిగెత్తడానికి'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The Lord’s honours board suggests it’s as close to Jimmy’s backyard as Jimmy’s actual backyard. Love the fire but that language will have him in trouble — Stuart Broad (@StuartBroad8) August 15, 2021 అయితే, కోహ్లి-ఆండర్సన్ల మధ్య జరిగిన వాగ్వాదంపై ఇంగ్లండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఈ విషయమై కోహ్లికి కౌంటరిస్తూ.. అవును, లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే. కావాలంటే అక్కడి హానర్ బోర్డు చూడు.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డా అని గణంకాలే చెబుతాయి. కోహ్లి.. నీలోని ఫైర్ బాగుంటుంది కానీ, నువ్వు వాడే భాషే నిన్ను కష్టాల్లో పడేస్తుంది అంటూ బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, ఆండర్సన్ లార్డ్స్ మైదానంలో 5 వికెట్ల ఘనతను ఏడు సార్లు సాధించాడు. ఈక్రమంలో అతను ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోథమ్ రికార్డును(7 సార్లు 5 వికెట్ల ఘనత) సమం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్తో గట్టెక్కిన విండీస్ -
రెండో టెస్ట్కు ఆ ఇద్దరు స్టార్ పేసర్లు డౌటే..
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న రెండో టెస్ట్కు ముందు ఇరు జట్లకు షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ సందర్భంగా బ్రాడ్ గాయపడగా.. ప్రాక్టీస్ సెషన్లో శార్దూల్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ఇద్దరు పేసర్లు రెండో టెస్ట్ అడేది అనుమానమే. లార్డ్స్లో 150వ టెస్ట్ ఆడాల్సి ఉన్న బ్రాడ్.. జట్టుకు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్ జట్టుపై కూడా ప్రభావం చూపనుంది. సిరీస్ కీలక దశలో సీనియర్ బౌలర్ సేవలు కోల్పోవడం ఇంగ్లీష్ జట్టుకు మింగుడు పడని విషయమే. ఇప్పటికే ఆ జట్టు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. మరోవైపు టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సేవలు కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. తొలి టెస్ట్లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ పిచ్ కూడా పేసర్లకు అనుకూలించనుండటంతో రెండో టెస్ట్లో అతని స్థానం దాదాపు ఖరారైంది. ఇలాంటి తరుణంలో గాయం కారణంగా అతను దూరం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో శార్దూల్ దూరమైతే అతని స్థానంలో అశ్విన్ లేదా పేస్ బౌలర్లు ఇషాంత్, ఉమేష్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. కాగా, తొలి టెస్ట్లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు ఆట మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తన పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చాడని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టడం వల్లే స్టువర్డ్ బ్రాడ్పై ఎదురుదాడికి దిగానని, ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పానని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్లో తాను వరుసగా రెండు ఫోర్లు కొట్టానని, దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తనపై నోరుపారేసుకున్నాడని పేర్కొన్నాడు. రెండు చెత్త షాట్లు ఆడి సంబర పడొద్దని, తనను గేలి చేశాడని తెలిపాడు. దీనికి తాను కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా' అని నన్ను హెచ్చరించగా, నేను కూడా బ్యాట్తో తలపై బాదుతానని బదులిచ్చానన్నాడు. అయితే ఫ్లింటాఫ్పై కోపానికి ఆ మరుసటి ఓవర్ బౌల్ చేసిన స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడని యువీ తెలిపాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్ బంతులను సైతం స్టాండ్స్లోకి పంపానని అలనాటి మధుర క్షణాలను స్మరించుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రముఖ స్కోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ నాటి అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చదవండి: కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు -
500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..
లండన్: 146 టెస్టుల్లో 517 వికెట్లు పడగొట్టినా ఇంగ్లండ్ అండ్ వేల్స్(ఈసీబీ) మాజీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వాపోయాడు. ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్ సిరీస్ల నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సెలెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అతరువాత దానికి కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించాడు. టెస్టు ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడల్లా(రొటేషన్ పద్ధతి కారణంగా) రాణిస్తున్న నేను సహజంగానే ఉత్తమ జట్టులో ఉంటానని ఆశించానని, కానీ సెలెక్టర్ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో తన పేరు లేకపోవడం బాధించిదని ఎడ్ స్మిత్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ సెలెక్టర్గా ఉన్న సమయంలో రొటేషన్ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో ఇంగ్లండ్.. న్యూజిలాండ్, భారత్ జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుంది. జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో తొలి టెస్టు జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్హామ్లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. కాగా, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్కే పరిమితమైన 34 ఏళ్ల బ్రాడ్.. 146 టెస్టులు, 121 వన్డేలు, 56 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను సాధించిన మొత్తం వికెట్లలో 10 వికెట్ల మార్క్ను 3 సార్లు, ఐదు వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. అతను టెస్టుల్లో బ్యాట్తో కూడా రాణించాడు. అతని కెరీర్లో సెంచరీతో పాటు13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్కు చివాట్లు -
వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా
లండన్: 2018లో ఆసీస్ క్రికెటర్ల బాల్ టాంపరింగ్ వివాదం అందరూ మరిచిపోతున్నారన్న దశలో దానిలో భాగస్వామిగా ఉన్న క్రికెటర్ కామెరున్ బ్యాన్క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలతో బాల్ టాంపరింగ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నేను ఆస్ట్రేలియాకు బౌలింగ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ తరపున బౌలింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయె చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ బౌలింగ్ సమయంలో నీ సీమ్లో తేడా ఉంటే అండర్సన్ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బాల్ టాంపరింగ్ జరిగిన రోజు ఆసీస్ జట్టులో ఇది కనిపించలేదు. బంతిని రివర్స్సింగ్ రాబట్టడం కోసం బ్యాన్క్రాఫ్ట్ ఆ పని చేసి ఉండొచ్చు. కానీ టెస్టుల్లో ఉపయోగించే ఎర్రబంతి పాతబడ్డాక స్వింగ్ రాబట్టడం కొంచెం కష్టమే. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని ఆసీస్ ఉపయోగించుకోలేదు. ఇక బాల్ టాంపరింగ్ ఉదంతంపై డేవిడ్ వార్నర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా. ఈ విషయం నాకు వార్నర్కి దగ్గరగా ఉండే వ్యక్తి ద్వారా తెలిసింది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ నవంబర్,డిసెంబర్లో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ జట్టు కివీస్, భారత్తో టెస్టు సిరీస్లు ఆడనుంది. మరోవైపు ఆస్రేలియా విండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్లో పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. చదవండి: Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బ్యాన్క్రాఫ్ట్ -
ఇంత దారుణమా.. సోషల్ మీడియాను బహిష్కరించాల్సిందే!
లండన్: ఇటీవల కాలంలో ఇంగ్లండ్ క్రికెటర్లపై సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువగా కావడంతో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసహనం వ్యక్తం చేశాడు. తన సహచర క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్,. మొయిన్ అలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అందుకు సోషల్ మీడియా బాయ్కాట్ ఒక్కటే మార్గమని ఒక సందేశాన్ని ఇచ్చాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అంతా కలిసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.ఇంగ్లండ్కు చెందిన స్వానిసా, బర్మింగ్హమ్, స్కాట్ చాంపియన్స్, రేంజర్స్ ఫుట్క్లబ్లలోని పలువురు ఆటగాళ్లు తరుచు జాతి వివక్షకు గురౌతున్నారు. వారిపై జాతి వివక్ష వేధింపులు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ కావడంతో ఆ ప్లాట్ఫామ్ను బహిష్కరించేందుకు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ను కూడా బ్రాడ్ కోరుతున్నాడు. ఆన్లైన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియా బహిష్కరణ ఒక్కటే మార్గమన్నాడు. అలా చేస్తేనే స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుందని బ్రాడ్ తెలిపాడు. ఇది చాలా దారుణమైన అంశమని, దీనిపై ఆ యాప్ క్రియేటర్స్ అయినా చర్యలు తీసుకోవాలన్నాడు. సోషల్ మీడియా పోస్టులు పబ్లిక్లోకి వచ్చేముందు వారు జవాబుదారీగా ఉండాలన్నాడు. కాగా, జోఫ్రా ఆర్చర్పై కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో జాతి వివక్ష పోస్టులు పెట్టగా, ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా భారత్లో ఉన్న మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేశారు. ఈ తరహా పోస్టులను అరికట్టాలంటే సోషల్ మీడియాను బహిష్కరించడమే మార్గమని బ్రాడ్ అంటున్నాడు. ఈ క్రమంలోనే జట్టు మొత్తం కలిసి వస్తే ఒక గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నాడు. -
'రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉంటుందంటావు!'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా నాలుగో టెస్టుకు ఒక్కరోజు సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో పిచ్పై మరోసారి చర్చ నడుస్తుంది. ఈసారి పిచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే వేదికలో మూడో టెస్టు జరిగినా అది డే నైట్ కావడం.. ఇప్పుడు జరగబోయేది డే టెస్టు కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ ఒక ఫన్నీ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో రూట్ సహా స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జానీ బెయిర్ స్టోలతో పాటు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్వుడ్ మొటేరా పిచ్ను చూస్తూ ఏదో చర్చించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వారు మాట్లాడుకున్నట్లుగా ఊహించుకున్న జాఫర్ తనదైన శైలిలో వారి సంభాషణను రాసుకొచ్చాడు. ''బ్రాడ్: రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉందంటావు.. అలాగే ఉంటే మాత్రం టూర్ ముగిసినట్టే. మార్క్ వుడ్: బ్రాడ్.. నవ్వు కనీసం మ్యాచ్లు ఆడావు.. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు.. బెయిర్ స్టో: నాకు ఇక్కడ ఫ్లాట్ పిచ్ మాత్రం కనబడట్లేదు.. ఈసారి కూడా డకౌట్గా వెనుదిరుగుతానా! కోలింగ్వుడ్: ఈసారి కూడా పిచ్ స్పిన్కే అనుకూలించనుందా? జో రూట్: చా! ఇంకోసారి ఇదే వేదికలో ఆడాల్సి వస్తుంది.. '' జాఫర్ షేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మూడోటెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించగానే పలువురు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు యువరాజ్, హర్బజన్ లాంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికి టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మంగళవారం తగిన సమాధానం ఇచ్చాడు.''గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్ పిచ్లపై నేరుగా లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్మన్ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ లేదా బ్యాక్ ఫుట్ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్ పిచ్పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు. ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్ పిచ్ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు'' అంటూ విరుచుకుపడ్డాడు. చదవండి: బుమ్రా అందుకే సెలవు తీసుకున్నాడా?! 'మొటేరా పిచ్పై నా ప్రిపరేషన్ సూపర్' Broad: Guess my tour is over then. Wood: At least you played bro. Bairstow: Where me flat pitch?! Colly: Oh this one's gonna turn innit? Root: Ah shit here we go again..#INDvsENG pic.twitter.com/mJfcrjRFw8 — Wasim Jaffer (@WasimJaffer14) March 3, 2021 -
'టీమిండియా హోం అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంది'
అహ్మదాబాద్: మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా హోం అడ్వాంటేజ్ను చక్కగా ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. మూడోటెస్టు కోసం సన్నద్దమవుతున్న బ్రాడ్ డెయిలీ మొయిల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'రెండో టెస్టులో మా జట్టు ఓటమికి నేను పిచ్ను తప్పుబట్టలేను. నా దృష్టిలో టీమిండియా హోం అడ్వాంటేజ్ను చక్కగా ఉపయోగించుకుంది. రెండో టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి మా మీద ఒత్తిడి పెంచేసింది. నైపుణ్య విషయంలో వారు మమల్ని అధిగమించారు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని టీమిండియా ఆడితే.. మేం మాత్రం అంచనా వేయలేక చతికిలపడ్డాం. అంతేకానీ పిచ్పై ఎలాంటి విమర్శలు లేవు. స్పిన్కు అనుకూలించిన పిచ్పై అశ్విన్తో పాటు మా బౌలర్లు చెలరేగారు. 2018లో లార్డ్స్లో జరిగిన టెస్టులోనూ తాము ఇలాగే హోమ్ అడ్వాంటేజ్ను ఉపయోగించుకునఆనం. స్వింగ్కు అనుకూలంగా ఉండే పిచ్పై టీమిండియా రెండు ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాం. మేమే కాదు.. ఆసీస్, దక్షిణాఫ్రికా ఇలా ఏ జట్టు తీసుకున్నా వారి సొంతగడ్డపై ఇలాగే చేస్తారు. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టుకు తుది జట్టులో ఉంటే మాత్రం పింక్బాల్ టెస్టులో స్వింగ్ రాబట్టే అవకాశం ఉంది. అయితే రెండో టెస్టులో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే బౌలింగ్ శైలి వేయడం వెనుక ఒక కారణం ఉంది. మేం మ్యాచ్లో నిలవడానికి లెగ్ కట్టర్స్ అవసరమవ్వొచ్చన్న ఆలోచనతోనే కుంబ్లే బౌలింగ్ను అనుకరించాను తప్ప వేరే ఉద్దేశం లేదు.'అని చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్ తరహాలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ను గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కాగా రొటేషన్ పాలసీ ప్రకారం మూడో టెస్టుకు తుది జట్టులో బ్రాడ్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇంగ్లండ్ తరపున బ్రాడ్ 165 టెస్టుల్లో 517 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్ సూర్య -
రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం
చెన్నై: టీమిండియాతో ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దూరం కానున్నాడు. రొటేషన్ పాలసీలో భాగంగా స్టువర్ట్ బ్రాడ్కు అవకాశమిచ్చేందుకు అండర్సన్ను పక్కన పెడుతున్నట్లు ఈసీబీ తెలిపింది. ఈసీబీ రొటేషన్ పాలసీని కచ్చితంగా అమలు చేస్తుంది. ఆటగాడు ఎంత మంచి ఫామ్లో ఉన్నా సరే అతన్ని పక్కనబెట్టి మరొక ఆటగాడికి చాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అండర్సన్ను తప్పించి బ్రాడ్కు అవకాశం కల్పించనున్నారు. ఇదే విషయమై ఇంగ్లండ్ హెడ్కోచ్ క్రిస్ సిల్వర్ఉడ్ స్పందిస్తూ.. అండర్సన్ను పక్కనబెట్టడం మాకు ఇష్టం లేదు. . మొదటి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే కొనసాగించాలని మాకు ఉంటుంది. అయితే రొటేషన్ పద్దతిలో ఆటగాళ్ల ఎంపిక ఉండడంతో ఈ విషయంలో ఏం చేయలేము. అండర్సన్ స్థానంలో రానున్న బ్రాడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్రాడ్తో పాటు మంచి నాణ్యమైన బౌలర్లు ఉండడం మాకు కలిసొచ్చే అంశమే. రొటేషన్ పద్దతిలో ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం వల్ల తర్వాతి మ్యాచ్కు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్లో జాస్ బట్లర్ కూడా రెండో టెస్టుకు దూరమవ్వనున్నాడు. బట్లర్ స్థానంలో జానీ బెయిర్ స్టో లేదా ఫోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. లంకతో జరిగిన రెండు టెస్టులతో పాటు టీమిండియాతో జరిగిన తొలి టెస్టు తర్వాత తిరిగి వెళ్లాలని ముందే నిర్ణయమైపోయింది. ఇక అండర్సన్ తొలి టెస్టులో ఆట చివరిరోజు అద్భుతంగా బౌలింగ్ చేసి గిల్, రహానే, పంత్ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అండర్సన్ రెండో ఇన్నింగ్స్లో 11-4-17-3తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం -
యూవీ మెరుపులకు 13 ఏళ్లు
ఢిల్లీ : భారత మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వింటే మొదట గుర్తు వచ్చేది 2007 టీ20 ప్రపంచకప్. సెప్టెంబర్ 19, 2007.. యూవీ కెరీర్లో మరుపురానిదిగా నిలిచిన రోజు.. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది వీరవిహారం చేసిన రోజు... టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు చూపించిన రోజు.. తనకు కోపం వస్తే అవతలి బౌలర్ ఎవరని చూడకుండా సుడిగాలి తుఫాను అంటే ఏంటో చూపించిన రోజు.. సరిగ్గా ఈరోజుతో ఆ విధ్వంసానికి 13 ఏళ్లు నిండాయి. మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్ విశేషాలను గుర్తు చేసుకుందాం. (చదవండి : 'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా') డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో.. మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లతో పాటు ఇరు జట్ల కెప్లెన్లు కల్పించుకొని సర్దిచెప్పారు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యూవీ తన కోపాన్ని మొత్తం తరువాతి ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మీద చూపించాడు.ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్కప్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. (చదవండి : ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) ఫ్లింటాఫ్ చేసిన పనికి తాను బలయ్యానని.. చాలా రోజుల వరకు ఈ పీడకల వెంటాడుతుండేదని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమై ఓటమిపాలయ్యింది. ఆ తర్వాత భారత్ ఫైనల్లో పాక్ను ఓడించి మొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్.. యూవీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. యూవీ ఆడిన ఇన్నింగ్స్ అభిమానుల్లో ఎంతలా జీర్ణించుకుపోయిందంటే.. ఎవరు మాట్లాడినా.. ఆరు సిక్సులకు ముందు.. ఆ తర్వాత అంటూ పేర్కొనేవారు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని యూవీ 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో వరల్డ్ కప్ హీరోగా నిలిచి.. 28 ఏళ్ల తర్వాత టీమిండియా కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. క్రికెట్ మిగిలిఉన్నంత వరకు యూవీ ఆడిన ఈ ఇన్నింగ్స్ రికార్డుల పుట్టలో పదిలంగా ఉంటుందనండంలో సందేహం లేదు. టీ20 కెరీర్లో 58 మ్యాచ్లాడిన యూవీ 1,177 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా యూవీ తన ఇన్స్టాగ్రామ్లో మ్యాచ్కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. -
బ్రాడ్కు జరిమానా విధించిన తండ్రి
లండన్ : ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవలె పాకిస్తాన్తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో బ్రాడ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో... మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కుమారుడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. జరిమానాతోనే సరిపెట్టకుండా ఒక డీ మెరిట్ పాయింట్ను అతని ఖాతాలో వేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో తన బౌలింగ్లో అవుటై పెవిలియన్కు వెళుతున్న యాసిర్ షాను ఉద్దేశించి బ్రాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం... బ్యాట్స్మన్ అవుటైనప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై దూషణకు దిగడం, ఎగతాళి చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు. -
‘హ్యాట్సాఫ్ బ్రాడ్’
ముంబై: టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటిన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభినందనలు తెలిపాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో (2007 టి20 వరల్డ్కప్లో) తన చేతిలో చావు దెబ్బ తిన్న బ్రాడ్లా గుర్తుంచుకోకుండా... కనీసం ఇప్పుడైనా ఒక బౌలర్గా అతని ఘనతను గుర్తించాలని ఈ సందర్భంగా యువీ తన అభిమానులను కోరాడు. ‘నేను స్టువర్ట్ బ్రాడ్ గురించి ఎప్పుడు ఏది రాసినా జనం ఆ ఆరు సిక్సర్లనే గుర్తు చేసుకుంటారని నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు దాని ప్రస్తావన లేకుండా అతను సాధించిన ఘనతను అభినందించాలని నా అభిమానులను కోరుతున్నా. 500 టెస్టు వికెట్లు అంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల దీని వెనక దాగి ఉంటాయి. వెనకబడిన ప్రతీసారి పోరాటపటిమ కనపర్చి నువ్వు మళ్లీ దూసుకొచ్చావు మిత్రమా...నువ్వో దిగ్గజానికి బ్రాడ్... నీకు నా అభినందనలు’ అని యువరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మూడో ర్యాంక్కు బ్రాడ్... విండీస్తో చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (10/67) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్కు చేరాడు. 2016 తర్వాత తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరిన బ్రాడ్... ఆల్రౌండర్ల కేటగిరీలో 11వ ర్యాంకును అందుకున్నాడు. మరోవైపు కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమైన భారత అగ్రశ్రేణి క్రికెటర్లు (టాప్–10) టెస్టు ర్యాంకింగ్స్లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్మెన్ కేటగిరీలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని... పుజరా, రహానే వరుసగా ఏడు, తొమ్మిదో ర్యాంకుల్ని కాపాడుకున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (మూడు), రవిచంద్రన్ అశ్విన్ (ఐదు) స్థానాలు పదిలంగా ఉన్నాయి. బౌలర్ల కేటగిరీలో స్టార్ బౌలర్ బుమ్రా ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్లో నిలిచాడు. -
ఆ మ్యాచ్కు ముందు 10.. ఇప్పుడు 3
మాంచెస్టర్ : వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో పది వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకిగ్స్లో మూడో స్థానంలో నిలిచాడు.బ్రాడ్ మొదటి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 16 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని తిరిగి కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు బ్రాడ్ టెస్ట్ ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏడుస్థానాలు ఎగబాకి మూడోస్థానంలో నిలిచాడు. అలాగే, బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్గా అవతరించాడు. మొదటి ఇన్నింగ్స్లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి, ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్లో 11 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ టెస్టు బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్ లిస్ట్ను ట్విటర్లో విడుదల చేసింది.ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.తర్వాత వరుసగా నీల్ వాగ్నర్ (843), స్టువర్ట్ బ్రాడ్ (823), టిమ్ సౌథీ (812), జాసన్ హోల్డర్ (810) వరుసగా టాప్-5లో ఉన్నారు. (అప్పుడు ఆరు సిక్సర్లు.. ఇప్పుడు ప్రశంసలు) It just keeps getting better for @StuartBroad8! After becoming the latest entrant in the highly exclusive 500 Test wicket club, he has jumped seven spots to go to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowlers 👏👏👏 pic.twitter.com/XgX4YRdZLh — ICC (@ICC) July 29, 2020 -
అప్పుడు ఆరు సిక్సర్లు.. ఇప్పుడు ప్రశంసలు
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500 వికెట్ల మైలురాయిని సాధించడం పట్ల క్రికెట్ అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్రాడ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. వీరిద్దరి ప్రస్తావన వచ్చిందంటే 2007 టీ20 ప్రపంచకప్ గుర్తుకురాక మానదు. ఆండ్రూ ఫ్లింటాఫ్ మీద కోపంతో బ్రాడ్ వేసిన ఆరు బంతులను యూవీ ఆరు సిక్సులుగా మలిచి అతడి కెరీర్లో ఆ ఓవర్ను ఒక పీడ కలగా మిగిల్చాడు. తాజాగా 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న బ్రాడ్ను యూవీ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో ప్రశంసించాడు.(అదరగొట్టిన బ్రాడ్.. సిరీస్ ఇంగ్లండ్దే) 'బ్రాడ్ గురించి చెప్పాలనుకున్న ప్రతీసారి అభిమానులు 2007 టీ20 ప్రపంచపకప్ మ్యాచ్లో నా బ్యాటింగ్కు బలైన బ్రాడ్లానే చూస్తారు. కానీ ఈసారి అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. ఆ విషయం వదిలేయండి.. బ్రాడ్ను మనస్పూర్తిగా అభినందించండి. ఎందుకంటే టెస్టుల్లో 500 వికెట్లను సాధించడమనేది చాలా గొప్ప విషయం. ఆ మ్యాజిక్ను బ్రాడ్ చేసి చూపించాడు. 500 వికెట్ల ఫీట్ను సాధించడం కోసం బ్రాడ్ అంకితభావంతో చాలా కష్టపడ్డాడు. నిజంగా బ్రాడ్ ఒక లెజెండ్.. హాట్సాఫ్' అంటూ యూవీ ట్వీట్ చేశాడు. I’m sure everytime I write something about @StuartBroad8, people relate to him getting hit for 6 sixes! Today I request all my fans to applaud what he has achieved! 500 test wickets is no joke-it takes hard work, dedication & determination. Broady you’re a legend! Hats off 👊🏽🙌🏻 pic.twitter.com/t9LvwEakdT — Yuvraj Singh (@YUVSTRONG12) July 29, 2020 క్రికెట్ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా బ్రాడ్ నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో వరుసగా ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619), జేమ్స్ అండర్సన్(589), గ్లెన్ మెక్గ్రాత్ (563), కౌట్నీ వాల్ష్( 519) ఉన్నారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్ నిలిచాడు. (ధోని తర్వాత అంతటి గొప్ప కెప్టెన్ తనే: రైనా) -
భలే బ్రాడ్ ...
సరిగ్గా ఐదేళ్ల క్రితం... యాషెస్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు. కొత్త బంతితో స్టువర్ట్ బ్రాడ్ చేసిన అద్భుతానికి ఆసీస్ విలవిల్లాడింది. కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి బ్రాడ్ 8 వికెట్లు తీయగా, ఆస్ట్రేలియా 60 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ స్పెల్ బ్రాడ్కు చిరకాల గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ మ్యాచ్లో తన 300 వికెట్లు మైలురాయిని దాటిన అతను మరింత పదునెక్కిన బౌలింగ్తో వేగంగా మరో 200 వికెట్లు తన ఖాతాలో వేసుకొని ‘500’ క్లబ్లో చేరిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం: స్టువర్ట్ బ్రాడ్ అంటే ఎక్కువ మంది భారత అభిమానులకు మన యువరాజ్ చేతిలో చావుదెబ్బ తిన్న బౌలర్గానే గుర్తుండిపోతాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతని టెస్టు క్రికెట్ ఘనతలు తక్కువ చేయలేం. 2007 టి20 ప్రపంచకప్లో ఒకే ఓవర్లో యువీ వరుసగా 6 సిక్సర్లు బాదేనాటికి బ్రాడ్ ఇంకా టెస్టు క్రికెటర్ కాదు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలకు అతని అరంగేట్రం జరిగింది. తక్కువ వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టులో అతను మూడు ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా మారాడు. టి20ల్లో అతను జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అయితే టెస్టు క్రికెట్కే బ్రాడ్ అవసరం ఎక్కువగా ఉందని భావించిన ఇంగ్లండ్ బోర్డు మిగతా ఫార్మాట్ల నుంచి అతనికి విరామం ఇస్తూ వచ్చింది. చివరకు అతను వాటికి దూరమై పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. బ్రాడ్ తన చివరి టి20 మ్యాచ్ 2014లో, చివరి వన్డే 2016లో ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనలెన్నో... వేగం, కచ్చితత్వంతో పాటు బౌలింగ్లో దూకుడు ప్రదర్శించడం అతని శైలి. ఒకసారి జోరు మొదలైందంటే అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ప్రమాదకరంగా మారిపోతుంది. వంద టెస్టులు ముగిసేసరికి ఒకే స్పెల్లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన ప్రదర్శనలు అతని నుంచి ఏడు సార్లు వచ్చాయంటేనే ఇది అర్థమవుతుంది. 2007లో శ్రీలంకతో ఆడిన తొలి సిరీస్లో విఫలమైనా... కొద్ది రోజులకే న్యూజిలాండ్లో ఐదు వికెట్ల ప్రదర్శన అతని ప్రతిభను ప్రపంచానికి చూపించింది. యాషెస్ సిరీస్ ఇంగ్లండ్ ఆటగాళ్లను హీరోలుగా లేదా జీరోలుగా మారుస్తుంది. బ్రాడ్ విషయంలో కూడా అదే జరిగింది. 2009 యాషెస్ టెస్టులో అతను 37 పరుగులకే 5 వికెట్లు తీయడంతో మ్యాచ్ ఇంగ్లండ్వైపు మలుపు తిరిగింది. ఆ తర్వాత బ్రాడ్ కెరీర్లో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. న్యూజిలాండ్పై 7/44, వెస్టిండీస్పై 7/72, జొహన్నెస్బర్గ్లో 6/17, భారత్పై 2014లో 6/25... ఇలా అతని అద్భుత ప్రదర్శనల్లో కొన్ని. అండర్సన్కు జోడీగా... సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్తో కలిసి అతని భాగస్వామ్యం ఇంగ్లండ్కు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. టీమ్ సుదీర్ఘ కాలంగా నంబర్వన్ ర్యాంక్లో నిలవడంలో వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. అండర్సన్ పలు రికార్డులు నెలకొల్పగా, జూనియర్ సహచరుడిగా బ్రాడ్ అదే బాటలో అతడిని అనుసరించాడు. బ్రాడ్ ఆడిన 140 టెస్టుల్లో అండర్సన్ 117 టెస్టుల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ మ్యాచ్లలో వీరిద్దరు కలిసి 895 వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే అండర్సన్ నీడలో ఉండిపోకుండా బ్రాడ్ తన సొంతశైలితో విజయవంతమైన బౌలర్గా ఎదిగాడు. అతను లేని సందర్భాల్లో ప్రధాన పేసర్గా జట్టు భారం మోశాడు. బ్రాడ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన (8/15) టెస్టులో అండర్సన్ ఆడకపోవడం గమనార్హం. కొన్నిసార్లు గాయాలు కెరీర్ను ప్రమాదంలో పడేసినా... బ్రాడ్ పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకుపోయాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగి పెద్ద సంఖ్యలో టెస్టులు ఆడటం అసాధారణం. ప్రతిభతో పాటు ఎంతో శ్రమ, పట్టుదల, అంకితభావంతోనే అది సాధ్యమవుతుంది. 34 ఏళ్ల బ్రాడ్ దీనిని చేసి చూపించాడు. 500 వికెట్ల మైలురాయిని దాటి టెస్టు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు. ► 2 తన టెస్టు కెరీర్లో బ్రాడ్ రెండు ‘హ్యాట్రిక్’లు తీసుకున్నాడు. 2011లో నాటింగ్హామ్లో భారత్పై... 2014లో లీడ్స్లో శ్రీలంకపై అతను ఈ ఘనత సాధించాడు. ► 7 టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్ ఏడో బౌలర్గా నిలిచాడు. మురళీధరన్ (800), వార్న్ (708), కుంబ్లే (619), అండర్సన్ (589), మెక్గ్రాత్ (563), వాల్‡్ష (519) మాత్రమే అతనికంటే ముందున్నారు. -
అదరగొట్టిన బ్రాడ్.. సిరీస్ ఇంగ్లండ్దే
మాంచెస్టర్ : నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్లో శుభారంభం అదిరింది. ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో విజ్డెన్ ట్రోపీని సొంతం చేసుకుంది. కాగా ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్లో విజేతగా నిలిచిన జట్టుకు విజ్డెన్ ట్రోపీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. మూడో టెస్టులో భాగంగా 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన విండీస్ జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టు బారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించగా, బ్రాడ్ మరోసారి 4 వికెట్లతో రాణించాడు.(అయ్యో బ్రాత్వైట్.. రెండుసార్లు నువ్వేనా) అంతకముందు తొలి ఇన్నింగ్స్లోనూ స్టువర్ట్ బ్రాడ్ 6 కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు తీయడం బ్రాడ్కు ఇది మూడోసారి. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. కాగా విండీస్ మొదటి ఇన్నింగ్స్లో 197 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 129 పరుగులకే కుప్పకూలింది. కరోనా నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్ విజయవంతం కావడంతో క్రికెట్కు సరికొత్త ఊపునిచ్చింది. అసలే టెస్టు సిరీస్.. దీనిని ఎవరు పట్టించుకుంటారులే అన్న సందేహాలకు తావివ్వకుండా ఇరు జట్లు విజయం కోసం(మూడో టెస్టు మినహాయించి) పోరాడాయి.మొదటి టెస్టులో పర్యాటక జట్టు విండీస్ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లండ్కు గట్టి షాక్ ఇచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు విండీస్పై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలినా ఇంగ్లండ్ బౌలర్ల అద్భుత బౌలింగ్తో ఆతిథ్య జట్టు ట్రోపీని ఎగరేసుకుపోయింది.('భవిష్యత్తులో ధావన్కు అవకాశం కష్టమే') ఈ సిరీస్ క్రికెట్కు ఊతమివ్వడమేగాక పలు రికార్డులుకు వేదికయింది. జో రూట్ గైర్హాజరీలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు ఈ సిరీస్ మధురానుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిటెస్టులో తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్ తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బ్రాడ్ను పక్కన పెట్టి తప్పుచేశామా అని భావించిందేమో రెండో టెస్టులోకి అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది. జట్టుకు దూరమయ్యానన్న కసితో బ్రాడ్ చెలరేగిపోయాడు. రెండో టెస్టులో 6 వికెట్లు, మూడో టెస్టులో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీతో పాటు 10 వికెట్లు పడగొట్టి సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాకకెరీర్లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా, ప్రపంచంలో 7వ బౌలర్గా నిలిచాడు. -
అయ్యో బ్రాత్వైట్.. రెండుసార్లు నువ్వేనా
మాంచెస్టర్ : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 500వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా క్రెయిగ్ బ్రాత్వైట్ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. కాగా క్రికెట్ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జేమ్స్ అండర్సన్(589), గ్లెన్ మెక్గ్రాత్ (563), కౌట్నీ వాల్ష్( 519) వరుసగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్ నిలిచాడు. కాగా ఈ ఘనత సాధించిన ఇంగ్లీష్ మొదటి బౌలర్గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు. (ఆల్టైమ్ గ్రేట్లలో వారు కూడా..) అంతేగాక టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఒకే మ్యాచ్లో ఉండడం విశేషం. అంతేగాక యాదృశ్చికంగా జేమ్స్ అండర్సన్ 500వ వికెట్, బ్రాడ్ 500వ వికెట్గా విండీస్ బ్యాట్స్మెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ లభించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక బౌలర్ తన మైల్స్టోన్ వికెట్ను సాధించడంలో బ్రాత్వైట్ మూడు సార్లు బలయ్యాడు. లార్డ్స్ వేదికగా 2017లో జరిగిన టెస్టు మ్యాచ్లో అండర్సన్(500 వ) వికెట్, అదే ఏడాది సెడాన్పార్క్లో కివీస్తో జరిగిన టెస్టులో ట్రెంట్ బౌల్ట్( 200వ) వికెట్తో పాటు తాజాగా బ్రాడ్ తన 500వ వికెట్ మైలురాయిని బ్రాత్వైట్ను ఔట్ చేసి సాధించడం విశేషం. కాగా టెస్టుల్లో బౌలర్లు మైల్స్టోన్ అందుకోవడంలో అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్రౌండర్ జాక్ కలిస్ ఐదుసార్లు ఔటయ్యాడు. వారిలో వరుసగా అండర్సన్( 100వ), ఆండీ కాడిక్(100వ), షేన్ వార్న్ (300వ), జహీర్ ఖాన్(300వ), వాల్ష్( 500వ) కలిస్ను ఔట్ చేసి మైలురాళ్లను సాధించారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ట్విటర్ వేదికగా బ్రాడ్ను ప్రశంసిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ ఘనత సాధించిన వారిలో బ్రాడ్ ఉండడం మాకు గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ జత చేసింది. ('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') An England great 🦁 A legend of the game 👑 So proud that @StuartBroad8 is one of ours! 🏴🏏 pic.twitter.com/W69G9CI9SR — England Cricket (@englandcricket) July 28, 2020 కాగా విండీస్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో జట్టు మేనేజ్మెంట్ తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్లో ఉన్న తనను కాదని వేరొకరికి అవకాశం ఇవ్వడం తనను బాధకు గురి చేసిందని బ్రాడ్ పేర్కొన్నాడు. అయితే రెండో టెస్టుకు జట్టులోకి వచ్చిన బ్రాడ్ తన సత్తాను చాటాడు. రెండో మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఆరు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టులో బ్రాడ్ మరింత రెచ్చిపోయాడు. మొదట బ్యాటింగ్ 45 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ నమోదు చేయగా.. బౌలింగ్లో 6 వికెట్లు తీసి 18వ సారి 5కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. కాగా కీలకమైన రెండో ఇన్నింగ్స్లోనూ బ్రాడ్ రెండు వికెట్లు తీసి ఇప్పటికే 14 వికెట్లతో సిరీస్లో లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు.('భవిష్యత్తులో ధావన్కు అవకాశం కష్టమే') మరోవైపు కీలకమైన మూడో టెస్టులో 390 పరుగులు విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన విండీస్ ఓటమి అంచున నిలిచింది. ఇప్పటికే 82 పరుగులకే 6 వికెట్లు కోల్పయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వరుణుడు అడ్డు తగలడంతో ఆటకు విరామం లభించింది. ఇంకా ఒక సెషన్ మిగిలే ఉండడంతో విండీస్ ఓటమి అంచుల్లో ఉంది. అయితే వర్షంతో చివరి సెషన్ తుడిచిపెట్టుకుపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా విరామం తర్వాత జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ను గెలుచుకున్నాయి. -
ఆల్టైమ్ గ్రేట్లలో వారు కూడా..
మాంచెస్టర్: టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్పై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో చెలరేగిపోయిన బ్రాడ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుదీర్ఘకాలంగా మరో పేసర్ అండర్సన్తో కలిసి పేస్ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్ను ఇంతకంటే గొప్ప ఫామ్లో చూసిన దాఖలాలు లేవన్నాడు. విండీస్తో తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటికే ఐదు వందల వికెట్ల క్లబ్లో ఉన్న అండర్సన్ సరసన చేరడానికి బ్రాడ్ వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అండర్సన్-బ్రాడ్లపై స్ట్రాస్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. సోమవారం వెస్టిండీస్- ఇంగ్లండ్ సిరీస్ ముగింపులో నాల్గవ రోజు రోజు ఆట వర్షార్పణం అయిన తర్వాత స్ట్రాస్ మాట్లాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ స్ట్రాస్.. తిరిగి గాడిలో పడటానికి చాలా శ్రమించాడన్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్ అధిగమించాడన్నాడు. సౌతాంప్టన్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్ తొలగించబడ్డాడని, కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన సిరీస్-లెవలింగ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడన్నాడు.ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో బ్రాడ్ చెలరేగిపోవడం హర్షించదగ్గ పరిణామమన్నాడు.చదవండి: (నాలుగో రోజు వర్షార్పణం ) -
'నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు'
సౌతాంప్టన్ : దాదాపు 116 రోజుల కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- విండీస్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్తో క్రికెట్ సందడి మొదలైంది. ఈ సిరీస్లో మొదటి టెస్టుకు ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జోరూట్ గైర్హాజరీలో బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విండీస్తో జరుగుతున్న మొదటిటెస్టుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు చాలనే ఉద్ధేశంతో స్టోక్స్ ఫామ్లో ఉన్న స్టువర్ట్ బ్రాడ్ను కాదని జోఫ్రా ఆర్చర్, మార్క్ఉడ్లను జట్టులోకి తీసుకున్నాడు. తనతో పాటు అండర్సన్ కలిపితే జట్టుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు సరిపోయారని అందుకే బ్రాడ్ను తీసుకోలేదని స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ నిర్ణయం బ్రాడ్నే కాదు ఇంగ్లండ్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.(భారత అభిమానుల గుండె పగిలిన రోజు) తాజాగా తనను ఎంపిక చేయకపోవడంపై బ్రాడ్ స్పందించాడు.' దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగబోతున్నా అనే ఉత్సాహం ఉండేది. కానీ విండీస్తో జరుగుతున్న మొదటిటెస్టుకు నన్ను ఎంపికచేయకపోవడంతో చాలా బాధేసింది. అసలు నన్ను ఎందుకు పక్కన పెట్టారన్నది ఇప్పటికి అర్థం కావడం లేదు .నేను చాలా నిరాశలో కూరుకుపోయా. మంచి ఫామ్లో ఉన్నప్పుడు నన్ను ఇలా చేయడం నచ్చలేదు. మ్యాచ్కు ఒకరోజు ముందు బెన్ స్టోక్స్ నా దగ్గరికి వచ్చాడు. సౌంతాప్టన్ పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుంది.. అందుకే అదనపు పేస్ బౌలర్ అవసరం పడుతుంది అని చెప్పాడు. కానీ అనూహ్యంగా నన్ను పక్కనబెట్టి జోఫ్రా ఆర్చర్కు అవకావమిచ్చారు. జోఫ్రా ఎంపికపై నేను తప్పు బట్టను.. ఎందుకో కానీ ఈ విషయాన్ని నేను జీర్ణంచుకోలేకపోతున్నా. దశాబ్ద కాలంగా జట్టుతో పాటు కొనసాగుతున్నా.. ఈ దశాబ్ద కాలంలో ఇంగ్లండ్ను ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించా. కరోనాకు ముందు జరిగిన యాషెస్ సిరీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో అద్భతంగా బౌలింగ్ చేశా. కానీ ఫామ్లో ఉన్న బౌలర్ని పక్కన బెట్టడం నచ్చలేదు. అందుకే ఈ విషయంలో నాకు కోపంతో పాటు విసుగు వచ్చింది.' అంటూ ఇంగ్లండ్ వెటెరస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారెన్ గాఫ్ స్పందించాడు. విండీస్తో టెస్టుకు బ్రాడ్ను ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని గాఫ్ పేర్కొన్నాడు. నిజానికి స్టువర్ట్ బ్రాడ్ కరోనాకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. ప్రొటీస్తో జరిగిన సిరీస్లో 14 వికెట్లతో రాణించాడు. అంతకముందు 2019 యాషెస్ సిరీస్లో పాట్ కమిన్స్(28 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రాడ్(23 వికెట్లు) నిలిచాడు. కాగా స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో 138 టెస్టులాడి 485 వికెట్లు పడగొట్టాడు.('కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') -
‘కెప్టెన్గా స్టోక్స్ బ్రిలియంట్’
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్థానంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరైనోడు అని అంటున్నాడు పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఇంగ్లండ్ సారథిగా రూట్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యాలు స్టోక్స్కు ఉన్నాయన్నాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో రూట్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయం కావడంతో మొదటి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో అతని స్థానంలో స్టోక్స్ను నియమిస్తేనే బాగుంటుందని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. గతంలో తనతో స్టోక్స్ ఘర్షణ పడ్డ విషయాన్ని కూడా పక్కన పెట్టి అతనికే ఓటేశాడు బ్రాడ్. ‘ బెన్స్టోక్స్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతను పెద్ద ఒత్తిడి కూడా తీసుకోడు.(‘బుమ్రా నో బాల్ కొంపముంచింది’) ఒక కెప్టెన్గా ఇది చాలా అవసరం. విండీస్తో తొలి టెస్టుకు రూట్ అందుబాటులో లేకపోతే స్టోక్స్నే కెప్టెన్గా నియమిస్తే మంచిది. అన్ని విధాలా అర్హతలు ఉన్న వ్యక్తి చేతికే కెప్టెన్సీ ఇస్తే జట్టును సక్రమంగా నడిపిస్తాడు. కెప్టెన్సీ జాబ్ అనేది చాలా కఠినమైనది. అదనపు సమావేశాలు, ప్లానింగ్లు చాలానే ఉంటాయి. స్టోక్స్ది ఒక మంచి క్రికెట్ బ్రెయిన్. గత కొన్నేళ్లుగా ఒక పరిపక్వత చెందిన క్రికెటర్లా స్టోక్స్ మారాడు. కెప్టెన్సీ జాబ్ అతనికే ఈజీనే. ప్రస్తుతం ఒక గేమ్కే కాబట్టే స్టోక్స్కు ఇబ్బందే ఉండదు’ అని బ్రాడ్ తెలిపాడు. గతేడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్-బెన్ స్టోక్స్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లలో ప్రేరణ నింపే క్రమంలో బ్రాడ్తో స్టోక్స్ వాగ్వాదానికి దిగాడు. ఆటగాళ్లలో ప్రేరణ కల్గించడం గొప్ప విషయం కాదంటూ బ్రాడ్ను చిన్నబుచ్చేలా మాట్లాడటంతో అది తారాస్థాయికి చేరింది. వారి మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్నా తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోలేదు. (సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటానని చెప్పి..) -
మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లు వీరే!
లండన్: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. దీంతో అనేక టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని టోర్నీలు రద్దవ్వడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే మెల్లిమెల్లిగా అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా క్రికెట్ పునరుద్దరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని ఈసీబీ భావించింది. దీనిలో భాగంగా ఇంగ్లండ్లోని ఏడు మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒక సమయంలో కేవలం ఒక క్రికెటర్కు మాత్రమే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా స్టువార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్లు మైదానంలోకి దిగి కాసేపు ప్రాక్టీస్ చేశారు. బ్రాడ్ ట్రెంట్బ్రిడ్జ్లో, వోక్స్ ఎడ్జ్బాస్టన్లో ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్లు నిలిచారు. ఇక చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్టువార్ట్ బ్రాడ్ ఇన్స్టాలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తను బౌలింగ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. చదవండి: ఐసీసీ చైర్మన్ రేసులోకి గంగూలీ వచ్చేశాడు.. ‘మంకీ’ పెట్టిన చిచ్చు..! View this post on Instagram So much work has gone on behind the scenes to make this possible. Thanks to all the people @englandcricket & @trentbridge who have been involved, I really appreciate it. Felt great to be back out there having a bowl. Loved it. 🏏 A post shared by Stuart Broad (@stuartbroad8) on May 21, 2020 at 4:39am PDT -
నా కొడుకు కెరీర్ను నాశనం చేశావ్ అన్నాడు..!
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్గా ఎంఎస్ ధోని పగ్గాలు అందుకున్న ఏడాదే అద్భుతం చేశాడు. 2007లో పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపికైన ధోని.. అదే సంవత్సరం భారత్కు టీ20 వరల్డ్కప్ను సాధించిపెట్టాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా సమష్టిగా రాణించడంతో టీ20 వరల్డ్కప్ ప్రారంభమైన ఏడాదే కప్ను చేజిక్కించుకుంది. కాగా, ఇందులో యువరాజ్ సింగ్ పాత్ర కీలకం. ప్రత్యేకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్తో మ్యాచ్లో భాగంగా యువరాజ్సింగ్ ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్స్లు ఇప్పటికే అభిమానులు మదిలో మెదులుతూనే ఉంటాయి. (అక్కడ బాక్సింగ్ మొదలైంది... ) ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్లో యువరాజ్ బ్యాట్కు పనిచెప్పాడు. లాంగాన్, లాంగాఫ్, మిడాన్ మీదులుగా వరుస సిక్స్లు బాది ఇది తన బ్యాటింగ్ పవర్ అని ప్రపంచానికి చాటిచెప్పాడు. దాంతో ప్రపంచ క్రికెట్లో ఒక ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన అరుదైన జాబితాలో యువరాజ్ స్థానం సంపాదించాడు. కాగా, ఆనాటి మ్యాచ్ను యువరాజ్ మళ్లీ గుర్తుచేసుకున్నాడు. నిజంగా అప్పుడు ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్స్లు ఇప్పటికీ తన కెరీర్లో చిరస్మరణీయమేమనని యువరాజ్ పేర్కొన్నాడు. ‘ నేను ఈ ఆరు సిక్స్లు కొట్టడానికి ముందు ఒక వన్డేలో ఇంగ్లండ్ క్రికెటర్ దిమిత్రి మాస్కరెన్హాస్కు ఐదు సిక్స్లు సమర్పించుకున్నా. అది జరిగిన కొద్ది సమయం వ్యవధిలోనే నేను ఆరు సిక్స్లతో ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకున్నాననే చెప్పాలి. ఇంగ్లండ్తో టీ20లో ఆరు సిక్స్లు కొట్టిన వెంటనే తొలుత ఫ్లింటాఫ్ వైపు చూశా. ఆ తర్వాత దిమిత్రి వైపు చూడగా అతను చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత రోజు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ తారసపడ్డాడు. మ్యాచ్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్ నా కొడుకు కెరీర్ను నాశనం చేశావ్ అన్నాడు. ఇక అతని షర్ట్పై ఒక సంతకం చేసి నా కొడుకు స్టువర్ట్ బ్రాడ్కు ఇవ్వు అన్నాడు. దాంతో స్టువర్ట్ బ్రాడ్కు మెస్సెజ్ ఇవ్వడానికి నా టీమిండియా జెర్సీ తీసుకున్నా. దానిపై బ్రాడ్ కెరీర్ బాగుండాలని రాసి ఇచ్చా. నేను ఐదు సిక్స్లు ఇచ్చాను కాబట్టి ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. అందుచేత బ్రాడ్ కెరీర్ బాగుండాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ చెప్పా. ఇప్పుడు బ్రాడ్ ఒక అత్యుత్తమ బౌలర్. ప్రపంచంలో బెస్ట్ బౌలర్లలో బ్రాడ్ ఒకడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా బౌలర్లలో ఏ ఒక్కరూ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు ఇస్తారని అనుకోవడం లేదు’ అని యువరాజ్ పేర్కొన్నాడు.(నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు) -
అలా వార్నర్ను హడలెత్తించా..!
లండన్: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంతటి ప్రమాదకర క్రికెటరో మనకు తెలుసు. ఒకసారి క్రీజ్లో కుదురుకుంటే పించ్ హిట్టింగ్ బౌలర్లను బెంబేలెత్తిస్తాడు. మరి వార్నర్ తొందరగా పెవిలియన్ పంపడంలో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరితేరిపోయినట్లే ఉన్నాడు. గతేడాది యాషెస్ సిరీస్లో వార్నర్కు ఏ వ్యూహంతో సిద్ధమై సక్సెస్ అయ్యాడో బ్రాడ్ వివరించాడు. 2019 యాషెస్ సిరీస్లో వార్నర్ 10 ఇన్నింగ్స్లకు గాను 7 సార్లు బ్రాడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ యాషెస్ సిరీస్లో వార్నర్ చేసిన పరుగులు 95. అసలు వార్నర్ను ఔట్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి చుక్కలు చూపించాడో ఆ విషయాన్ని బ్రాడ్ షేర్ చేసుకున్నాడు. (తరానికి ఒకసారే ఇలాంటి దిగ్గజాలు వస్తారు..) ‘వార్నర్ చాలా ప్రమాదకర ఆటగాడు.. నేను దాదాపు 8-9 ఏళ్ల నుంచి వార్నర్ ఎదురైనప్పుడల్లా బౌలింగ్ చేస్తూనే ఉన్నా. వార్నర్తో సుదీర్ఘమైన పోటీ ఉండటంతో అతని బలహీనత ఏమిటో కనిపెట్టేశా. నేను చాలా టాలర్ బౌలర్. అందుచేత అతను క్రీజ్లో చాలా వెనక్కే ఉంటాడు. అలా ఉండటం వల్ల స్వ్కేర్ డ్రైవ్లో కొట్టడం ఈజీ అవుతుంది. నేను బంతిని స్వింగ్ చేసిన ఎక్కువ సందర్భాల్లో వార్నర్ చాలాసార్లు బౌండరీలు కొట్టాడు. దాంతో వ్యూహం మార్చా. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వింగ్ బౌలింగ్ వేయకూడదని అనుకున్నాడు.వికెట్ టు వికెట్ బంతులే వేయాలనే వ్యూహం వర్కౌట్ అయ్యింది. వికెట్లే లక్ష్యంగా వార్నర్ బంతులు వేశా. దాంతో బంతిని కట్ చేయబోయే వార్నర్ వికెట్ను సమర్పించుకునే వాడు. లార్డ్స్ టెస్టులో వార్నర్ ఔట్ కావడం ద్వారా వరుసగా మూడోసారి నాకు చిక్కాడు. దాంతో వార్నర్పై ఇదే వ్యూహం అవలంభించవచ్చనే నమ్మకం వచ్చింది. అలా వార్నర్ను హడలెత్తించా’ అని బ్రాడ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్లో 138 మ్యాచ్లు ఆడిన బ్రాడ్ 485 వికెట్లు సాధించాడు. -
స్టోక్స్కు సారీ చెప్పే ప్రసక్తే లేదు: బ్రాడ్
సెంచూరియన్: గతేడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్-బెన్ స్టోక్స్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి పెదవి విప్పాడు స్టువర్ట్ బ్రాడ్. బ్రేక్ సమయంలో తమ ఆటగాళ్లను ఉత్సాహ పరిచే పనిలో ఉంటే దానిని స్టోక్స్ అడ్డుకోవడమే కాకుండా కాస్త దురుసగా ప్రవర్తించాడన్నాడు. ఈ విషయంలో తనదేమీ తప్పులేదని, స్టోక్స్కు క్షమాపణలు చెప్పాల్సిన పని కూడా లేదంటూ తేల్చిచెప్పాడు. ‘ ఆ మ్యాచ్లో మేము చాలా విరామం తర్వాత వికెట్ సాధించాం. దాంతో బ్రేక్ వచ్చింది. ఈ సమయంలో మా బాయ్స్లో ప్రేరణ నింపే పనిలో ఉన్నా. మన పూర్తిస్థాయి ఆటకు సిద్ధం కావాలి. బౌలర్లు కచ్చితమైన లెంగ్త్ బౌలింగ్ వేయాలి. ఫీల్డర్లు సింగిల్ తీసే అవకాశం కూడా ఇవ్వకూడదు’ అని తమ ఆటగాళ్లలో స్పూర్తిని నింపడానికి యత్నించిన విషయాన్ని చెప్పాడు. (ఇక్కడ చదవండి: స్టోక్స్-బ్రాడ్ల వాడివేడి వాగ్వాదం.. వీడియో వైరల్) అప్పుడు స్టోక్స్ తన దగ్గరకు వచ్చి తాను చెప్పిన దానితో అంగీకరించలేదన్నాడు. అలా చెప్పడాన్ని గొప్ప విషయం కాదంటూ కించపరిచేలా మాట్లాడాడని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. ముందు ఆ పని నువ్వు చేసి చూపించి అంటూ తనతో వాగ్వాదానికి దిగాడన్నాడు. తాము అన్ని విషయాల్లో బాగానే ఉన్నామని, నువ్వు శ్రమించూ అంటూ కౌంటర్ వాదనకు దిగాడన్నాడు. ఆ సమయంలో తాము పూర్తి స్వింగ్లో లేమని, తాను ఆటగాళ్లను ఉత్సాహ పరిచేందుకు యత్నించానన్నాడు. కాసేపటికి స్టోక్స్ తన దగ్గరకు వచ్చి కరాచలనం చేశాడన్నాడు. ఆ రోజు సాయంత్రం తనకు సారీ మేట్ అంటూ మెసేజ్ చేశాడన్నాడు. అది తనకు సంతృప్తినివ్వలేదన్నాడు. ఈ విషయంలో స్టోక్స్కు తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నాడు. అదొక గేమ్ అనే సంగతి తెలుసుకోవాలని, జట్టును కమ్యూనికేట్ చేయడం గేమ్లో భాగమన్నాడు. ఇక్కడ తన తప్పు ఏమీ లేదన్నాడు. అటువంటప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటూ ఎదురు ప్రశ్నించాడు. -
స్టోక్స్-బ్రాడ్ల వాడివేడి వాగ్వాదం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు దూకుడు ఎక్కువే. గతంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో స్టోక్స్ చాలాకాలం ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. అటు మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జ్ చేయడంలో సైతం ముందు వరుసలో ఉంటాడు స్టోక్స్. మరి ఈసారి సహచర ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్తోనే ‘వార్’కు దిగాడు. అసలు ఏ కారణం చేత గొడవ ఆరంభమైందో కచ్చితంగా తెలీదు కానీ వీరిద్దరూ ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో తమ నోటికి పనిచెప్పారు. ఒక జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిన సంఘటనలు చాలా అరుదనే చెప్పాలి. ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చిన క్రమంలో ఎవరూ తగ్గకపోతేనే ఒకే జట్టులో ఉన్న ఆటగాళ్లు మాటల యుద్ధానికి తెరలేపుతారు. ఇప్పుడు స్టోక్స్-బ్రాడ్ల మధ్య అదే జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్టులో భాగంగా శనివారం మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా బ్రేక్ సమయంలో ఉండగా స్టోక్స్ను బ్రాడ్ ఏదో అన్నట్లు వీడియోలో కనిపించింది. అంతకుముందు స్టోక్స్ ఏదో అనడంతోనే బ్రాడ్ కలగజేసుకున్నాడా.. లేక వీరి మధ్య కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా తెలీదు కానీ చివరకు జో రూట్, జోస్ బట్లర్లు కలగజేసుకుని ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు. అయితే అది కామెంటరీ బాక్స్లో ఉన్న మాజీల నోటికి పని చెప్పింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వేడిగా ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. నిజాయితీగా చెప్పాలంటే వీరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. ఇద్దరికీ ఏమైనా సమస్యలు ఉండవచ్చు. మనకు బ్రాడ్ ఏదో అనడం.. అదే స్థాయిలో స్టోక్స్ రిప్లై ఇవ్వడం కనిపిస్తోంది. దీని గురించి చర్చ అనవసరం’ అని నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ‘ వీరిద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో వ్యాఖ్యలు చేసుకున్నట్లు కనిపించలేదు’ అని వెస్టిండీస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అన్నాడు. కాకపోతే అసలు అది ఎందుకు మొదలైందో తెలియక పోయినా, దానికి ముగింపు ఉంటుందని పేర్కొన్నాడు. స్టోక్స్-బ్రాడ్ల వాగ్వాదం వీడియో వైరల్ అయ్యింది. What did I miss? pic.twitter.com/0xWqxQv5Gw — Kourageous ✨✨✨ (@AN_EVILSOUL) December 28, 2019 -
క్రికెట్లో అత్యంత అరుదైన సందర్భం..
సెంచూరియన్: క్రికెట్లో రికార్డులను తరచూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. అయితే అరుదుగా జరిగే కొన్ని విశేషాలు మాత్రం అత్యంత ఆసక్తిని పెంచుతాయి. ఒక మ్యాచ్లో ఒకే తరహా గణాంకాలను నమోదు చేయడం అత్యంత అరుదుగా జరిగే విషయమే. ఒకే మ్యాచ్లో ఇద్దరు బ్యాట్స్మన్ సమానమైన పరుగులు సాధించే క్రమంలో అన్నే బంతుల్ని ఎదుర్కొంటే అది అరుదైన సందర్భంగానే నిలుస్తుంది. మరి ఒకే మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఇద్దరు పేసర్లు ఒకే విధంగా పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్లను కూడా సమానంగా సాధిస్తే అది అరుదైన విషయమే. ఇలా ఇద్దరు పేసర్లు ఒకే ఇన్నింగ్స్లో చెరి సమంగా వికెట్లు సాధించగా పరుగులు విషయంలో కూడా అన్నే పరుగులు ఇవ్వడం తాజాగా చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భాగంగా ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కరాన్-స్టువర్ట్ బ్రాడ్లు ఈ అరుదైన జాబితాలో చేరిపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 84.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటయ్యారు. డీకాక్(95) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా జట్టును తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ చేసే క్రమంలో సామ్ కరాన్-స్టువర్ట్ బ్రాడ్లు పోటీ పడ్డారు. ఇద్దరూ పోటీ పడి వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా నడ్డివిరిచారు. ఈ క్రమంలోనే సామ్ కరాన్ నాలుగు వికెట్లు సాధించి 58 పరుగులు ఇవ్వగా, బ్రాడ్ సైతం నాలుగు వికెట్లే సాధించి 58 పరుగులే ఇచ్చాడు. ఇలా ఒక టెస్టు మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరూ బౌలర్లు ఒకే తరహా గణాంకాలు నమోదు చేయడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2003లో ఇంగ్లండ్ బౌలర్లైన జేమ్స్ అండర్సన్-హర్మిసన్లు.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తలో నాలుగు వికెట్లు సాధించి 55 పరుగుల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఇంగ్లండ్ బౌలర్లే ఆ అరుదైన మార్కును చేరుకున్నారు. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్లో ఇలా ఒకే తరహాలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడం ఐదోసారి మాత్రమే. 1909లో తొలిసారి ఇంగ్లండ్ బౌలర్లు జార్జ్ హిస్ట్-కొలిన్ బ్లైత్లు ఇలా ఒకే తరహాలో బెస్ట్ గణాంకాలను నమోదు చేశారు. ఆసీస్తో జరిగిన ఆనాటి మ్యాచ్లో ఇరువురూ తలో ఐదు వికెట్లు సాధించి చెరో 58 పరుగులిచ్చారు. ఈ ఒకే తరహా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల జాబితాలో భారత బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. -
స్టువర్ట్ బ్రాడ్ సెన్సేషనల్ రికార్డు
సెంచూరియన్: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక సెన్సేషనల్ రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్గా నిలిచాడు. సహచర బౌలర్ జేమ్స్ అండర్సన్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ దశాబ్దంలో బ్రాడ్ 400 టెస్టు వికెట్లును సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లో భాగంగా ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ను తీసిన తర్వాత బ్రాడ్ ఈ ఫీట్ను సాధించాడు.(ఇక్కడ చదవండి: క్రికెట్ చరిత్రలో తొలి బౌలర్గా..) ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్ 428 వికెట్లతో టాప్లో నిలవగా, ఆ తర్వాత బ్రాడ్ నిలిచాడు. ఓవరాల్గా తమ టెస్టు కెరీర్లో అండర్సన్ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, బ్రాడ్ 473 వికెట్లు తీశాడు. కాగా, ఈ దశాబ్దంలో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో అండర్సన్, బ్రాడ్ల తర్వాత స్థానంలో ముగ్గురూ స్పిన్నర్లే ఉన్నారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్(376) మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్(363) నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(362) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో బ్రాడ్ తన తొలి వికెట్గా హమ్జాను పెవిలియన్కు పంపాడు.(ఇక్కడ చదవండి: ఈ దశాబ్దపు ఐదో బౌలర్గా ఘనత) -
యువీ.. నీ మెరుపులు పదిలం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ది ప్రత్యేక స్థానం. డాషింగ్ ఆటగాడిగా ముద్ర వేసుకున్న యువీ.. ఎన్నో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన యువీ.. 2007లో భారత్ జట్టు టీ20 వరల్డ్కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టీ20 వరల్డ్కప్ను ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత జట్టు గెలుచుకుంది. ప్రధానంగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులందరికీ ఎంతో వినోదాన్ని పంచింది. ప్రధానంగా యువరాజ్ సింగ్ మెరుపులే ఆనాటి మ్యాచ్లో గుర్తుకు వస్తాయి. వరుసగా ఆరు సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. ఇంగ్లిష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువరాజ్ వరుస ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. అది జరిగి సరిగ్గా నేటికి 12 ఏళ్లు అయ్యింది. సెప్టెంబర్19వ తేదీన యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువరాజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో బ్యాట్ ఝుళిపించడంతో భారత్ రెండొందల మార్కును సునాయాసంగా చేరింది. 18 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 171 పరుగులు చేసింది. కాగా, యువీ జోరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీగా యువీ పేరిట పదిలంగా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసి ఓటమి పాలైంది. -
యాషెస్ ఐదో టెస్టు ఇంగ్లండ్దే
లండన్: ఆ్రస్టేలియాపై గెలవాలంటే స్టీవ్ స్మిత్ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలి. యాషెస్ సిరీస్లో ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించిన ఇంగ్లండ్... చివరకు అదే పని చేసి ఐదో టెస్టులో జయకేతనం ఎగురవేసింది. ఆదివారం ఇక్కడి ఓవల్ మైదానంలో ముగిసిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 135 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. నాలుగో రోజు 399 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించిన ఆ జట్టు... ప్రత్యరి్థని రెండో ఇన్నింగ్స్లో 263 పరుగులకే ఆలౌట్ చేసింది. దాదాపు రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో, అసాధారణంగా ఆడితేనే గెలవగల పరిస్థితుల్లో ఛేదనకు దిగిన కంగారూలు... పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (4/62) జోరుకు ఓపెనర్లు వార్నర్ (11), హారిస్ (9) వికెట్లను త్వరగానే కోల్పోయారు. వార్నర్ను పది ఇన్నింగ్స్లలో బ్రాడ్ ఏడుసార్లు ఔట్ చేయడం విశేషం. సిరీస్లో విశేషంగా రాణించిన వన్డౌన్ బ్యాట్స్మన్ లబõÙన్ (14), మాజీ కెపె్టన్ స్మిత్ (53 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించారు. లబõÙన్ను లీచ్ (4/49), స్మిత్ను బ్రాడ్ ఔట్ చేశాక 85/4తో ఆసీస్ ఓటమి ఖాయమైపోయింది. అయితే, మాధ్యూ వేడ్ (166 బంతుల్లో 117; 17 ఫోర్లు, సిక్స్) సెంచరీతో ఎదురునిలిచాడు. దూకుడుగా ఆడుతూ పోయిన అతడు... మిచెల్ మార్ష్ (24)తో ఐదో వికెట్కు 63 పరుగులు, కెపె్టన్ టిమ్ పైన్ (21)తో ఆరో వికెట్కు 52 పరుగులు జోడించాడు. వీరిద్దరూ వెనుదిరిగాక మరింత ధాటిగా ఆడాడు. కానీ ఇంగ్లండ్ కెపె్టన్ రూట్ (2/26) పార్ట్టైమ్ స్పిన్తో అతడి ఆట కట్టించాడు. కాసేపటికే లీచ్ వరుస బంతుల్లో లయన్ (1), హాజల్వుడ్ (0)ను పెవిలియన్ చేర్చి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 313/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 16 పరుగులు జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో ఆసీస్ను దెబ్బకొట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/62)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సిరీస్లో కేవలం ఏడు ఇన్నింగ్స్లోనే 774 పరుగులు చేసిన స్మిత్ ఆసీస్ తరఫున, 441 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1, 4 టెస్టులను ఆ్రస్టేలియా నెగ్గింది. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 3, 5 టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. సిరీస్ 2–2తో సమమైనా... స్వదేశంలో జరిగిన గత యాషెస్ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది. -
స్మిత్ శతకనాదం
బర్మింగ్హామ్: అటు ఇంగ్లండ్ బౌలర్ల ప్రతాపం... ఇటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పోరాటం మధ్య చరిత్రాత్మక యాషెస్ సిరీస్ ఆసక్తిగా ప్రారంభమైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో 24వ శతకం సాధించడంతో గురువారం ఇక్కడి ఎడ్జ్బాస్టన్ మైదానంలో మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. స్మిత్కు లోయరార్డర్ బ్యాట్స్మెన్ పీటర్ సిడిల్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58) ధాటికి 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్ తక్కువ స్కోరే చేసేలా కనిపించింది. అయితే, స్మిత్ సెంచరీతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఎక్కడినుంచి ఎక్కడకు... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు అంతా ఎదురుగాలే వీచింది. ట్యాంపరింగ్ నిషేధం అనంతరం తొలిసారి టెస్టు ఆడుతున్న ఓపెనర్లు వార్నర్ (2), బాన్క్రాఫ్ట్ (8) నిరాశపర్చారు. వీరు బ్రాడ్ బౌలింగ్లో వెనుదిరిగారు. ఖాజా (13)ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. 35 పరుగులకే టాపార్డర్ను కోల్పోయిన దశలో నాలుగో వికెట్కు 64 పరుగులు జోడించి స్మిత్, హెడ్ (61 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఆదుకున్నారు. అయితే, హెడ్, వేడ్ (1)లను వెంటవెంటనే ఔట్ చేసి వోక్స్ గట్టి దెబ్బకొట్టాడు. బ్రాడ్... కెప్టెన్ టిమ్ పైన్ (5), ప్యాటిన్సన్ (0)లను సాగనంపాడు. కమిన్స్ (5)ను స్టోక్స్ వెనక్కుపంపాడు. అప్పటికి స్కోరు 122/8. స్మిత్కు సిడిల్ తోడయ్యాక అసలు ఆట ప్రారంభమైంది. 9వ వికెట్కు 140 బంతుల్లో 88 పరుగులు జోడించిన వీరు 200 పరుగుల మార్క్ దాటించారు. ప్రధాన పేసర్ అండర్సన్ గాయంతో నాలుగు ఓవర్లే బౌలింగ్ చేసి వెనుదిరగడం, స్టోక్స్ ప్రభావం చూపలేకపోవడం ఆసీస్కు కలిసొచ్చింది. సిడిల్ను ఔట్ చేసి మొయిన్ అలీ ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా లయన్.. స్మిత్కు సహకరించాడు. స్మిత్ సెంచరీ (184 బంతుల్లో) పూర్తయ్యాక బ్యాట్ ఝళిపించాడు. పదో వికెట్కు 74 పరుగులు జోడించాక స్మిత్ను బ్రాడ్ బౌల్డ్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్కు తెరపడింది. స్టీవ్ స్మిత్... 16 నెలల క్రితం టెస్టుల్లో నంబర్వన్ బ్యాట్స్మన్. ఆస్ట్రేలియాకు కెప్టెన్ కూడా. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సాగిపోతున్న అతడి బ్యాటింగ్ జోరు చూస్తే రికార్డులకే కళ్లుచెదిరేవి. కానీ ఒక్క బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అంతా తలకిందులు చేసింది. ఆ ఘటనకు బాధ్యుడిగా కెప్టెన్సీ కోల్పోయి, ఏడాది పాటు క్రికెట్కూ దూరమై, విమర్శలతో మానసికంగానూ క్షోభను ఎదుర్కొన్నాడు స్మిత్. అయితే, అద్వితీయమైన సెంచరీతో ఇప్పుడా చేదు జ్ఞాపకాలను ఒక్కసారిగా తుడిపేశాడు. అది కూడా నిషేధం అనంతరం ఆడుతున్న తొలి టెస్టులోనే సాధించి తన స్థాయి ఏమిటో చాటాడు. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ తాను ఒకప్పటి స్మిత్నేనని ప్రత్యర్థులకు సందేశం పంపాడు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డుతూ, లోయరార్డర్ను సమన్వయం చేసుకుంటూ అతడు సాగించిన పోరాటం అసలు సిసలు టెస్టు ఇన్నింగ్స్కు అద్దంపట్టింది. ఓపిక, సంయమనంతో సాగిన అతడి ఆట అందరి ప్రశంసలు పొందింది. బ్యాటింగ్కు దిగే సందర్భంలో మైదానంలో ప్రేక్షకుల నుంచి హేళన ఎదుర్కొన్న స్మిత్... ఔటై వెళ్తున్నప్పుడు అంతకుమించిన స్థాయిలో అభినందనలు పొందాడు. కెరీర్లో అతడు సాధించిన 23 శతకాలు ఒక ఎత్తు, గురువారం చేసిన సెంచరీ మరో ఎత్తు అనడంలో సందేహం లేదు. ఇదే సందర్భంలో స్మిత్ పరోక్షంగా ఇంగ్లండ్కు గట్టి హెచ్చరిక కూడా పంపాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగిన గత యాషెస్లో స్మిత్ అత్యద్భుత ఆటతో ఏకంగా ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు బాదాడు మరి...!