winner
-
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుతిన్తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గానీ, ఇటు యూరప్ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్లో పోటీగా శాంతిచర్చలకు యూరప్లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్ ప్రాంతం, లోగడ తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్ ప్రయత్నం చేయవచ్చు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్ విధానాలు యూరప్పై దాడిగా ప్రముఖ యూరప్ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.ఉక్రెయిన్ ఆన్లైన్ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్ల శాంతి ఒప్పందాలను లీక్ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్ స్క్ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్లు మాస్కోలో, వాషింగ్టన్లో కల్సుకొంటారని, జెలెన్స్కీ, పుతిన్లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిచైనాను ఎదుర్కొనే వ్యూహంతాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్ తీవ్ర నష్టాల పాలయ్యింది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!నేటితో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్ నాటికి ఉక్రెయిన్కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్ డాలర్లు అని ‘కేఎస్ఈ ఇనిస్టిట్యూట్’ అంచనా. ఉక్రెయిన్ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్స్ట్రీట్ జర్నల్’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. -బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
సెల్ఫీ కొట్టు.. స్కూటర్ పట్టు: ఎలా అంటే?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్బోర్డ్ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.ఈ స్కూటర్ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్ట్యాగ్తో ఓలా ఎలక్ట్రిక్ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు. -
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి. ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా. ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
హిందీ బిగ్ బాస్ విన్నర్గా టాలీవుడ్ నటి (ఫోటోలు వైరల్)
-
International Cricket Council: టి20 ప్రపంచకప్ విజేతకు రూ.20.35 కోట్లు
న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. సెమీఫైనల్స్తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి. -
జైలు నుంచి వచ్చాడు.. రూ.3 కోట్ల కారు కొన్నాడు!
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు. -
2024 Japanese Grand Prix: వెర్స్టాపెన్కు మూడో విజయం
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్లో 57వ టైటిల్ను సాధించాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్కిది మూడో విజయంకాగా... జపాన్ గ్రాండ్ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నాలుగు రేసుల తర్వాత వెర్స్టాపెన్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్లెర్క్(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని ఐదో రేసు చైనా గ్రాండ్ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
క్లాసిక్ మిసెస్ ఇండియా విజేతగా హైదరాబాదీ (ఫొటోలు)
-
మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఎవరు?
మిస్ వరల్డ్ 2024 అందాల పోటీల ఫైనల్స్ శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే.. క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్ రిపబ్లిక్ నుంచి 2006 మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్కోవా ఫౌంలడేషన్ను స్థాపించింది. ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్ వంటివి వాయించడం నేర్చుకుంది. View this post on Instagram A post shared by Miss World (@missworld) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
ప్రపంచ సుందరి 2024
-
మిస్ వరల్డ్గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
మిస్ జపాన్గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
Pallavi Prashanth Arrest: బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్!
బిగ్బాస్ విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్కు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అభిమానులపై కూడా పోలీసులు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా.. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్న ప్రశాంత్ లాయర్ బిగ్బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో మాట్లాడారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా.. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ప్రశాంత్ లాయర్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు. అయితే తాజాగా బిగ్బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు. సాక్షితో బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'ఇంట్లోనే ఉన్నా.. నేను ఎక్కడికి పారిపోలేదు. కావాలనే కొందరు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చర్యలను ఖండిస్తున్నా. నా గెలుపు రైతుల విజయం. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పై వస్తున్నా తప్పుడు వార్తలతో కలత చెందా. జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా. రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా. హౌస్లో శివాజీ అన్న నాకు అండగా ఉన్నారు. నాగార్జున ,శివాజీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.' అని అన్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Davis Cup final 2023: డేవిస్ కప్ విజేత ఇటలీ
మలాగా (స్పెయిన్): డేవిస్ కప్లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్లో వరల్డ్ కప్లాంటి డేవిస్ కప్లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్పై విజయం సాధించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్లు కొట్టాడు. సెమీస్లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. -
సింగపూర్ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’
హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్లో జరిగిన ఫేవరెట్ హాకర్ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్ హౌజ్ బహుమతిని అందుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 13వ వార్షిక సిటీ హాకర్ (వీధి దుకాణాలు) ఫుడ్ హంట్లో భాగంగా సింగపూర్ ప్రత్యేకమైన హాకర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు 500 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్, సర్టిఫికెట్ను అందజేస్తారు. -
బిగ్ బాస్ విన్నర్కు బిగ్ షాక్!
బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విన్నర్ ఎల్విష్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎల్విష్ యాదవ్పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్ పార్టీలను నిర్వహించారని అతనిపై ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. నోయిడాలోని ఫామ్హౌస్ల్లో ఎల్విష్, ఇతర యూట్యూబర్లతో కలిసి పాములు, వాటి విషంతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పీపుల్ ఫర్ యానిమల్ (పీఎఫ్ఏ) సంస్థ అధికారి గౌరవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని.. అంతే కాకుండా విదేశీ మహిళలతో పాటు పాము విషం, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని గౌరవ్ ఆరోపించారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అటవీ శాఖ అధికారులతో కలిసి సెక్టార్ -51 సెవ్రాన్ బాంక్వెట్ హాల్పై దాడి చేశారు. అక్కడే ఉన్న ఢిల్లీకి చెందిన రాహుల్, టిటునాథ్, జయకరన్, నారాయణ్, రవినాథ్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 మిల్లీలీటర్ల పాము విషం, ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు రెండు తలల పాములు, ఒక ఎలుక పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఎల్విష్పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ OTT సీజన్ 2లో విన్నర్గా నిలిచాడు. అంతేకాకుండా ఊర్వశి రౌతేలాతో కలిసి 'హమ్ తో దీవానే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. అయితే పోలీసుల ఆరోపణలను ఎల్విష్ యాదవ్ ఖండించారు. ఇదంతా అసత్యమని.. అలాంటిదేం జరగలేదని కొట్టిపారేశాడు. pic.twitter.com/5NdfYygsXn — Elvish Yadav (@ElvishYadav) November 3, 2023 All are allegations are proven wrong, Shame on these fake news agencies.. STOP DEFAMING ELVISH#ElvishYadav𓃵 #ElvishYadav pic.twitter.com/xoowRyDitY — Rao Sahab ( Parody) (@TeamRaoSahab) November 3, 2023 -
వెర్స్టాపెన్ రికార్డు
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ 71 ల్యాప్లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్.. జాబితాలో నాలుగు - అవార్డు దేనికో?
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది. ఫేస్లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి. ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది. -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్లో 35 కిలోమీటర్ల రేస్వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్లో డాక్టర్. యూఎస్లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి. పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి! ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్ను దేవుడిలా చూస్తారని చెప్పింది. అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు. ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్ని. సర్వైకల్ క్యాన్సర్ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం. సావిత్రినయ్యాను! ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్తోపాటు కాలేజ్లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్లో నా ఎంట్రీ పంపించాను. కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది. మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
కాటలిన్ కారికో, డ్రూ వీస్మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్ను కూడా అందజేస్తారు. 2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి? -
సింగపూర్ గ్రాండ్ప్రి విజేత కార్లోస్ సెయింజ్
సింగపూర్: ఫార్ములావన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్ అయ్యాడు. నిర్ణీత 62 ల్యాప్ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అందరికంటే వేగంగా గంటా 46 నిమిషాల 37.418 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 22 రేసుల ఈ సీజన్లో తొలి 14 రేసుల్లో రెడ్బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు. అయితే సింగపూర్ గ్రాండ్ప్రిలో వీరిద్దరికి నిరాశ ఎదురైంది. వెర్స్టాపెన్ ఐదో స్థానంతో, పెరెజ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
‘కౌన్ బనేగా కరోడ్పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్ని తెరిచారు. ఆమె జార్ఖండ్లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్లు తమ తల్లికి క్యాన్సర్కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్లోని హాజీపూర్కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్లో ఘజియాబాద్కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్ను రూపొందించింది. హైదరాబాద్కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
పవర్గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
విజేత భారత్
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని నిర్వహించిన మూడు దేశాల మహిళల టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీ లో భారత జట్టు రెండు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అజేయంగా నిలిచి టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 3–0తో స్పెయిన్పై గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (22వ ని.లో), మోనిక (48వ ని.లో), ఉదిత (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పురుషుల జట్టుకు కాంస్యం ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (15వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు థియరీ బ్రింక్మన్ (25వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. -
బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత మాక్స్ వెర్స్టాపెన్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): గత వారం హంగేరియన్ గ్రాండ్ప్రిలో పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమైన మ్యాక్స్ వెర్స్టాపెన్ శనివారం బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఈ సారి మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శనివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ రేసులో అగ్ర స్థానంలో నిలిచిన అతను 0.011 సెకన్ల తేడాతో పోల్ పొజిషన్ను సాధించాడు. ల్యాప్ను అందరికంటే వేగంగా 1 నిమిషం 49.056 సెకన్లలో వెర్స్టాపెన్ పూర్తి చేశాడు. మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రీ (1 నిమిషం 49.067 సె.) రెండో స్థానంలో నిలవగా, కార్లోస్ సెయిన్జ్ (ఫెరారీ – 1 నిమిష 49.081 సె.)కు మూడో స్థానం దక్కింది. -
28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్పాట్.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..
అతను నేషనల్ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్ లైఫ్లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్ గార్డ్నర్, అతని బిజినెస్ పార్ట్నర్ పాల్ మెడిసన్ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్ .. బ్రిటన్కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. ‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’ అయితే మార్క్ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్ గ్లాస్లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు. ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు మార్క్కు ఇప్పటికీ ఫుట్బాల్తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్లో లోకల్ క్లబ్ ఉంది. అలాగే మార్క్ గతంలో బార్బాడోస్లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్నర్ పాల్ ప్రస్తుతం స్కాట్ల్యాండ్లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్ తెలిపాడు. ఇది కూడా చదవండి: కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! -
ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా
డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది తొలి సెషన్లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్కప్స్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం. అందులో వన్డే వరల్డ్కప్ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ✅ICC ODI World Cup ✅ICC Champions Trophy ✅ICC T20 World Cup ✅ICC World Test Championship Australia becomes the first team to win all ICC trophies 👏 Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu — CricTracker (@Cricketracker) June 11, 2023 చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో తొలి సెట్ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోసెట్లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్ను బ్రేక్ చేసి 7-5తో సెట్ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ఓపెన్ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది. THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD — Roland-Garros (@rolandgarros) June 10, 2023 Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K — Roland-Garros (@rolandgarros) June 10, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!' -
తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ సౌజన్య మరియు టీం తో ఫన్నీ గేమ్
-
పాపాతో ఆలా చేయడం నాకు బాధ కలిగింది
-
నా మ్యూజిక్ జర్నీలో ఎన్ని మలుపులు ఉన్నాయి అంటే..!
-
ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క అయితే వీళ్ళు ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్..!
-
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
చెన్నై పాంచ్ పటాకా
-
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్యూవీని శుభ్మాన్ గిల్కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్ఎస్ ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్ని 1-1 తేడాతో సమం చేశాడు.. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్తో పాటు మ్యాచ్ని కూడా కైవసం చేసుకున్నాడు.. మలేషియా మాస్టర్స్ ఉమెన్స్ సింగిల్స్లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా.. పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలిచిన మొదటి భారత షట్లర్గా హెచ్ఎస్ ప్రణయ్ చరిత్రకెక్కాడు. WATCH: Moments when HS Prannoy won his first ever BWF World Tour Title! via Sports 18#Badminton #MalaysiaMasters2023 pic.twitter.com/qVuqwmYvWL — Sayak Dipta Dey (@sayakdd28) May 28, 2023 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡 🏆🏆🏆 HS Prannoy has done it!! 🫡😍 The WR 9 Indian beats Weng Hong Yang of China 21-19, 13-21, 21-18 in #MalaysiaMasters2023 men's singles final to win his maiden BWF World Tour title. 🇮🇳#MalaysiaMasters #HSPrannoy pic.twitter.com/Kc3YfHnFdu — Khel Now (@KhelNow) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి టైటిల్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించింది. మంగళవారం పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది. -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
ధోని వారసుడే
-
బిగ్బాస్ 15 విన్నర్ తేజస్వి ప్రకాశ్ ఫొటోలు
-
బిగ్బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ ఫోటోలు
-
ఒలింపిక్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: జొకోవిచ్
లండన్: ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఆడాలా... వద్దా అనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ పేర్కొన్నాడు. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచాక ఒలింపిక్స్పై జొకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒలింపిక్స్ గురించి ఇంకా ఆలోచించాల్సి ఉంది. నేనెప్పుడూ అందులో పాల్గొనాలనే కోరుకుంటా. కానీ, కోవిడ్–19, క్వారంటైన్ నిబంధనలు, అభిమానులు లేకుం డా గేమ్స్ జరగనుండటం వంటి అంశాల వల్ల అందులో నేను పాల్గొనేది 50–50గా ఉంది’ అని జొకోవిచ్ అన్నాడు. 2008 బీజింగ్ ఒలిం పిక్స్లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్ కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
కరోనా విన్నర్
-
మాల్లో మజా..
-
తమిళ పొన్నుకే మిస్ ఇండియా కిరీటం
చెన్నై, తమిళనాడు : ‘మిస్ ఇండియా పోటీ’...దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ పోటీల్లో ఈ ఏడాది కిరీటం ‘తమిళ పొన్ను’ అనుకృతి వాస్ను వరించింది. నిన్న రాత్రి ముంబై డోమ్లోని ‘ఎన్ఎస్సీఐ ఎస్వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా’గా ఎన్నికైంది. గతేడాది ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన మానుషి చిల్లర్, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీకి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘మాజీ మిస్ వరల్డ్’ స్టెఫానియే డెల్ వాలి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కాగా ‘మిస్ ఇండియా - 2018’ పోటీలో మొదటి రన్నరప్గా ‘మిస్ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్గా ‘మిస్ ఇండియా’ ఆంధ్రపదేశ్కు చెందిన శ్రేయా రావ్ కామవరపు నిలిచింది. ప్రస్తుతం అనుకృతి వాస్ ‘మిస్ వరల్డ్ - 2018’ కోసం సిద్ధమవుతుంది. -
మూడోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన చెన్నై
-
దీనిని గొప్ప ఘనతగా భావిస్తున్నా
చెన్నై: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు. ‘ఇంతటి పెద్ద ఈవెంట్లో నేను ఒక గేమ్ మాత్రమే ఓడాను. వరుసగా మూడు రోజులు ర్యాపిడ్ ఆడి ఆ వెంటనే రెండు రోజులు 21 బ్లిట్జ్ గేమ్లు ఆడాల్సిన స్థితిలో దానిని పెద్ద ఘనతగా చెప్పవచ్చు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలు రెండింటిలోనూ పోడియంపై నిలబడగలిగాను. నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమైంది. గతంలో ఇలాంటి సమయంలో నేను కీలక దశలో పాయింట్లు కోల్పోయి వెనుకబడేవాడిని. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఇటీవల ఈ రెండు ఫార్మాట్లలో నాకు మంచి ఫలితాలు రాలేదు. దానిని సవరించే ప్రయత్నం చేశాను. నిజాయితీగా చెప్పాలంటే ఒకదాంట్లో బాగా ఆడగలననుకున్నాను. కానీ రెండింటిలో మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
ఆఫీస్ బాయ్ టు సివిల్ ఇంజనీర్
-
యూత్ బాస్కెట్బాల్ విజేత ‘తూర్పు’
పిఠాపురం టౌ¯ŒS : విశాఖపట్నంలో సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన అంతర్ జిల్లాల యూత్ బాస్కెట్బాల్ పోటీల బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచిందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆదివారం విశాఖపట్నం జట్టుతో హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో తూర్పు జట్టు 82–61 స్కోర్ తేడాతో విజయం సాధించిందన్నారు. కాగా బాలికల విభాగంలో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు పశ్చిమ గోదావరి జట్టుతో తలపడి 38–26 స్కోర్తో గెలుపొందిందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, శిక్షణ ఇచ్చిన కోచ్లు పి.శ్రీనివాసరావు, ఐ.భీమేష్, మేనేజర్లు బొజ్జా సతీష్, పి.రమాదేవిలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్, ఆర్.ఐ.పి. టి.వి.ఎస్ రంగారావు, అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గన్నమనేని చక్రవర్తి, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి ఎ¯ŒSవీవీ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కె.పురుషోత్తమరావు, యర్రా జగన్నాథరావు అభినందించారు. -
వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?
ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వి వి వినాయక్, నెక్ట్స్ సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఖైదీ లాంటి భారీ హిట్ తరువాత వినాయక్, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలని భావించాడు. అయితే బాలయ్య ఇప్పటికే వరుసగా సినిమాలకు కమిట్ అయి ఉండటంతో ఇప్పట్లో బాలయ్య, వినాయక్ ల కాంబినేషనేషన్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మీడియం రేంజ్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు వినాయక్. ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తిక్క, విన్నర్ లు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డ సాయి, ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే సాయి కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. -
సాక్షి మ్యాథ్బీ కేటగిరి 1 విజేత తరుణి
-
మేకింగ్ ఆఫ్ మూవీ - విన్నర్
-
పవన్ బ్యానర్లో మరో మెగా హీరో
ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే పవర్ స్టార్, గతంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇటీవల తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు. అదే బాటలో ఇప్పుడు మరిన్ని చిన్న చిత్రాలను లైన్లో పెట్టే ప్లాన్లో ఉన్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాలను నిర్మించనున్నాయి. ముందుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. విన్నర్ సినిమాతో నిరాశపరిచిన సాయి ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వేరే ఏ ప్రాజెక్ట్కు కమిట్ కాలేదు. దీంతో సరైన కథ, దర్శకుడు దొరికితే పవన్ బ్యానర్ లోనే సాయి ధరమ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హీరోగా, జనసేన అధినేతగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్, ఇప్పుడు నిర్మాతగానూ హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. -
మెగా మేనల్లుడు మాట తప్పుతున్నాడు..?
వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లను ఇమిటేట్ చేసే సాయి.. మెగాస్టార్ పాత పాటలను రీమిక్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే గోలిమార్, గువ్వా గోరింకతో, అందం హిందోళం పాటలను రీమిక్స్ చేసిన సాయి ధరమ్.. ఆ తరువాత ఇక రీమిక్స్లు చేయనంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ సాయి వాలకం చూస్తుంటే అలా కనిపించటం లేదు. గురువారం ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు గెస్ట్గా వచ్చిన సాయిధరమ్, తన మనసులోని మాటను బయటపెట్టాడు. చిరు కెరీర్ లోనే బెస్ట్ మెలోడీ అన్న పేరున్న 'మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు' పాటను రీమిక్స్ చేయాలనుందంటూ మెగాస్టార్ ముందే ఓపెన్ అయ్యాడు. మరి రీమిక్స్లకు గుడ్ బై చెప్పానంటూ ప్రకటించిన సాయి మాట తప్పుతాడా..? మళ్లీ రీమిక్స్ చేస్తాడా..? చూడాలి. -
జాతీయ వాలీబాల్ విజేత పోస్టల్ కర్ణాటక- జేపీఆర్ చెన్నై
బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రులు ముగిసిన క్రీడా సంబరం అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగం పోస్టల్ (కర్ణాటక), మహిళ విభాగంలో జేపీఆర్ (చెన్నై) జట్లు విజేతగా నిలిచాయి. లీగ్ పద్ధతిలో జరిగిన పోటీల్లో పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో ద్వితీయస్థానంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), తృతీయ స్థానంలో వెస్ట్రన్ రైల్వే (ముంబై) నిలవగా, నాలుగో స్థానంలో ఆంధ్రా స్పైకర్ నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఇన్కంటాక్స్ చెన్నై, సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో జెపీఆర్ చెన్నై జట్టు విన్నర్స్గాను, రన్నర్స్గా మైసూర్ హాస్టల్ కర్ణాటక జట్టు, మూడో స్థానంలో ఎస్సీ రైల్వే సికింద్రాబాద్, నాలుగో స్థానంలో సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు రూ.60 వేలతోపాటు ట్రోఫీనందుకున్నాయి. ముగిసిన పోటీలు జాతీయ వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాలయ అయ్యన్న పాత్రుడు, వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఎమ్మెల్సీలు బోడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు, నిమ్మల రామానాయుడు, పులపర్తి నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఏరియా ఆసుపత్రి చైర్మన్ మెట్ల రమణబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
స్టార్డమ్ ప్రేక్షకులే ఇవ్వాలి!
డైట్ పేరుతో వారంలో ఆరు రోజులు గ్రిల్డ్ చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్ అవీ తింటుంటాను. సండే మాత్రం అమ్మ చేసిన టమాటా పప్పు, అప్పడాలు, ఆవకాయ తింటున్నప్పుడు అమృతంలా ఉంటుంది. ‘ఏరా... ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఎప్పుడూ నేనే వండి పెట్టాలా?’ అని అమ్మ అడుగుతుంటుంది. ‘అమ్మా.. నేను సంపాదించడం మొదలుపెట్టి రెండేళ్లే అయ్యింది. కొద్ది రోజులు అమ్మను చూసుకున్నాననే సంతృప్తి నాకు ఇవ్వు. తమ్ముడు తనకు కావల్సినవి కొనుక్కునే డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఇవ్వు. చిన్నప్పట్నుంచీ నీ మాట, కాలేజీలో లెక్చరర్స్ మాట విన్నా. రేపు పెళ్లైన తర్వాత పెళ్లాం మాట వినాలి కదా. ఇప్పుడైనా కాస్త హ్యాపీగా, ఫ్రీగా ఉండనివ్వు’ అంటుంటా. నాలుగేళ్ల వరకూ పెళ్లి ఆలోచన లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది ఆలోచించడానికి ఇంకా చాలా టైముంది. ‘‘ప్రతి కమర్షియల్ సినిమాలోనూ హీరో ఇంట్రడక్షన్ ఫైట్, సాంగ్, తర్వాత సీన్స్.. అన్నీ కామన్. కొత్తగా ఏం ఉండదు. కానీ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఎలా చూపించగలమనేది మా చేతుల్లో ఉంది. నేను కథ విన్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్లు పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలవుతారా? లేదా అని ఆలోచిస్తా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘విన్నర్’ గత నెల 24న విడుదలైంది. సాయిధరమ్ చెప్పిన సంగతులు... ♦ కథ చెప్పినప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్, హార్స్ జాకీ బ్యాక్డ్రాప్ కొత్తగా అనిపించాయి. కానీ, నేను చేయగలనా? లేదా? అని భయపడ్డా. మా దర్శకుడు, ఫైట్ మాస్టర్ కలయాన్ ఇచ్చిన ధైర్యంతో చేశా. చిత్రీకరణలో గుర్రం మీద నుంచి నాలుగుసార్లు కింద పడ్డాను. ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ చేసేవాణ్ణి. కింద పడిన ప్రతిసారీ అమ్మ గుర్తొచ్చేది. నేను ఊహించినట్టు జేబీ (జగపతిబాబు) గారితో నటించిన సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ♦ ‘విన్నర్’ ఇంట్రడక్షన్లో పవన్కల్యాణ్గారిని గుర్తుచేసేలా ఎర్ర కండువా, చిరంజీవిగారి డైలాగులు.. అన్నీ దర్శకుడి ఆలోచనలే. ‘రేసుగుర్రం’ ఫస్ట్ డే చూశా. ‘నాన్నకు ప్రేమతో’ సెకండ్ డే చూశా. తారక్ నా ఫ్రెండే. నా నిర్మాత బుజ్జిగారు, మా హీరో బన్నీ ‘రేసుగుర్రం’ చేశారు. కథను బట్టే ఆ రెండు సినిమాలు చూడలేదనే డైలాగ్ చెప్పా. ఫలనా సీన్, డైలాగ్ కావాలని ఎప్పుడూ అడగను. నిర్మాతలకు ఇంత బడ్జెట్లో తీయాలని చెప్పను. నిర్మాతలు కథపై ఖర్చు పెడతారు తప్ప నాపై కాదు. ఎప్పుడైనా హీరో కంటే కథే ముఖ్యం. నేను స్టార్ హీరో కాదు, బడ్డింగ్ యాక్టర్ని. ♦ వసూళ్లు, రికార్డుల గురించి పెద్దగా ఆలోచించను. నా పనేంటి? ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశామా, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా? అనేంత వరకే. హీరోగా నా రేంజ్ గురించి పట్టించుకోను. రేంజ్, స్టార్డమ్ అనేవి ప్రేక్షకులు ఇవ్వాలి. ‘విన్నర్’ విడుదల తర్వాత మా నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంత మాట్లాడగలుగుతున్నా. లేనిదాన్ని సృష్టించి చెప్పను కదా. ♦ అమ్మ, తమ్ముడు, నవీన్ విజయకృష్ణ (హీరో)... ఈ ముగ్గురూ నా బిగ్గెస్ట్ క్రిటిక్స్. ‘విన్నర్’ ముగ్గురికీ నచ్చింది. డ్యాన్సులు ఇంకొంచెం చేస్తే బాగుండేదని అన్నారు. ప్రేక్షకుల నుంచీ ఈ మాటే వినిపించింది. అమ్మయితే... ‘బాగా చేశావ్. ఇంకా బాగా చెయ్యొచ్చు’ అన్నారు. చిరంజీవిగారు రెండు రోజుల్లో సినిమా చూస్తానన్నారు. పవన్కల్యాణ్గారు ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీ. త్వరలో ఆయనకు షో వేస్తా. ♦ ‘నక్షత్రం’లో పావుగంట క్యారెక్టర్ చేశా. నాపై ఓ పాట ఉంటుంది. కథ నచ్చితే ఎటువంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. నందమూరి కల్యాణ్రామ్గారితో సినిమా డిస్కషన్స్కి వచ్చింది. కథ సరిగా కుదరలేదు. వీవీ వినాయక్గారిని రెండు మూడుసార్లు కలిశా. కానీ, కథ, సినిమాల గురించి డిస్కస్ చేయలేదు. బీవీయస్ రవి దర్శకత్వంలో చేయనున్న ‘జవాన్’ చిత్రీకరణ మరో నెలలో ప్రారంభమవుతుంది. ♦ ముగ్గురు మావయ్యలూ నాకు దేవుళ్లతో సమానం. చిన్నప్పట్నుంచీ నన్నో సొంత బిడ్డలా పెంచారు. మావయ్యల దగ్గర చాలా ఫ్రీడమ్ ఉంది. నేను బయట ఎలా ఉంటానో.. వాళ్లతో ఉన్నప్పుడూ అంతే. ♦ ‘ఖైదీ నంబర్ 150’లో ‘రత్తాలు రత్తాలు..’, ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..’ పాటలకు థియేటర్లో డ్యాన్స్ చేశా. స్క్రీన్పై చిరంజీవిగారిని చూడడం ఓ పండగ. డ్యాన్సులు అదరగొట్టేశారు. అసలు షష్టిపూర్తి చేసుకున్న మనిషిలా ఉన్నారా! నా దృష్టిలో ఆయన వయసు 50 లోపే. ఇంత వయసు వచ్చినా.. ఆయనలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే కసి కనిపిస్తుంది. చిత్రీకరణలో నిత్య విద్యార్థిలా ఉంటారు. నాలాంటోళ్లకు ఆ కసి, ఆయన ప్రవర్తన ఇన్స్పిరేషన్. -
'విన్నర్' మూవీ రివ్యూ
టైటిల్ : విన్నర్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్, జగపతి బాబు, ముఖేష్ రుషి సంగీతం : ఎస్. తమన్ దర్శకత్వం : గోపిచంద్ మలినేని నిర్మాత : నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు వరుస హిట్స్తో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జోరుకు తిక్క సినిమాతో బ్రేక్ పడింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావలన్న కసితో సాయి చేసిన సినిమా విన్నర్. కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విన్నర్.. సాయి కెరీర్కు బూస్ట్ ఇచ్చిందా..? గోపిచంద్ మలినేని మరోసారి కమర్షియల్ డైరెక్టర్గా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడా..? కథ : మహేందర్ రెడ్డి (జగపతి బాబు) ఇండియాలోనే బెస్ట్ జాకీ. వందల కోట్ల ఆస్తులకు వారసుడు. అవన్ని కాదనుకొని తను ప్రేమించిన అమ్మాయి కోసం తండ్రి (ముఖేష్ రుషి)ని ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తరువాత భార్య చనిపోవటంతో కొడుకే ప్రపంచంగా బతుకుతుంటాడు. మహేందర్ రెడ్డి తండ్రికి బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. వరుసగా తాము బెట్టింగ్ వేసిన గుర్రాలు ఓడిపోతుండటంతో మహేందర్ రెడ్డి వస్తేనే తిరిగి బిజినెస్ లాభల్లోకి వస్తుందని పార్టనర్స్ ఒత్తిడి చేస్తారు. కానీ మనవడిని మాత్రం తన కొడుకు నుంచి ఎలాగైన దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. అ నుకున్నట్టుగా తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచి సిద్ధార్థే, తండ్రి మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు. తండ్రి రేసుల కారణంగా తనకు దూరమయ్యాడన్న కోపంతో నాన్న అన్నా, గుర్రాలన్నా, రేసులన్నా ద్వేషం పెంచుకుంటాడు సిద్ధార్థ్. 20 ఏళ్ల తరువాత సిద్ధార్థ్ న్యూ లుక్ పత్రికలో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో కలిసిన రేసర్ సితారతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ సితార మాత్రం తన గోల్ గురించి చెప్పి సిద్ధార్థ్ ప్రేమను కాదంటుంది. ఆ కోపంతో సితార రన్నింగ్ కాంపిటీషన్కు రెడీ అవుతున్న విషయం వాళ్ల ఇంట్లో చెప్పేస్తాడు. దీంతో సితార తండ్రి రాజీవ్ రెడ్డి ఆమెకు వెంటనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్న సితార.. తాను సిద్ధార్థ్ను ప్రేమించానని.. వీరు తీసుకువచ్చిన పెళ్లి కొడుకు తన ప్రియుడితో రేసులో గెలవాలని పందెం కాస్తుంది. మరి గుర్రాలంటే పడని సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? సితారను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? సిద్ధార్ధ్, తిరిగి తండ్రి మహేందర్ రెడ్డి దగ్గరకు చేరుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్ కోసం సాయి పడిన కష్టం తెర మీద కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్లో సాయి ప్రొఫెషనల్ జాకీలా కనిపించాడు. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. జగపతి బాబు మరోసారి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. స్టైలిష్గా కనిపిస్తూనే ఎమోషన్స్ పండించాడు. విలన్ థాకూర్ అనూప్ సింగ్ స్టైలిష్గా అదే సమయంలో క్రూయల్ గానూ కనిపించాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్లో సాయికి గట్టి పోటి ఇచ్చాడు. వెన్నెల కిశోర్, అలీ, 30 ఇయర్స్ పృథ్వీలు కామెడీ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, సురేష్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్లతో పాటు.. బాడీగార్డ్, పండగ చేస్కో లాంటి యావరేజ్ సినిమాలను అందించిన గోపిచంద్ మలినేని మినిమమ్ గ్యారేంటి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేసే గోపిచంద్ విన్నర్లోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. ఫస్ట్ అంతా కామెడీ, లవ్ ట్రాక్లతో లాగించేసిన దర్శకుడు ఇంటర్వ్లో అసలు కథలోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకు వచ్చిన సీన్స్ అన్ని రొటీన్గా అనిపించటం కాస్త బోర్ కొట్టిస్తుంది. సెకండ్ హాఫ్లో కథలో వేగం కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. హార్స్ రేస్ సీన్స్, సాంగ్స్లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్, జగపతి బాబు నటన రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ హార్స్ రేస్ సీన్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ మ్యూజిక్ విన్నర్.. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రతి సినిమా భయంతో చేస్తా!
‘‘ప్రతి సినిమాను తొలి చిత్రంలానే భావించి, వంద శాతం కష్టపడి పని చేస్తా. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నమ్ముకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే భయంతో సినిమా తీస్తా. మినిమమ్ గ్యారంటీ సినిమా అనిపిస్తేనే చేస్తా’’ అని గోపీచంద్ మలినేని అన్నారు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘విన్నర్’ నేడు రిలీజవుతోంది. దర్శకుడు చెప్పిన విశేషాలు. ⇔ నల్లమలుపు బుజ్జి బ్యానర్లో ‘లక్ష్యం’, ‘ఠాగూర్’ మధు బ్యానర్లో ‘స్టాలిన్’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా చేశా. వారిద్దరూ కలిసి నిర్మించిన ‘విన్నర్’ చిత్రానికి నేను డైరెక్టర్ అవడం హ్యాపీగా ఉంది. సాయిధరమ్ తేజ్తో సినిమా చేద్దామని నిర్మాతలు చెప్పారు. వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నిర్మాతలకు, నాకు, తేజుకు కొత్తగా అనిపించడంతో ముందుకెళ్లాం. ⇔ ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. సాయిధరమ్ తేజ్, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఇందులో తేజు లుక్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ⇔ గుర్రాలు, రేసులు, తన తండ్రి అంటే ఇష్టపడని హీరో.. హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ప్రేయసి ఛాలెంజ్ కోసం తండ్రిని ఇష్టపడి, గుర్రాల రేసులో ఎలా గెలిచాడు? అన్నదే ‘విన్నర్’ కథ. ఈ పాత్ర కోసం వారం పాటు తేజు హార్స్ రైడింగ్లో శిక్షణ తీసుకున్నారు. ⇔ క్లయిమాక్స్లో భాగంగా టర్కీలో హార్స్ రైడింగ్ చిత్రీకరించాం. ఇందుకోసం హాలీవుడ్ ఫైట్మాస్టర్ కలయన్ను బల్గేరియన్ నుంచి పిలిపించాం. తేజు స్వారీ చేసిన గుర్రానికి నటించే విషయంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. యాక్షన్ అనగానే పరిగెడుతుంది. కట్ చెప్పగానే ఆగిపోతుంది. అది భలే ఎక్స్పీరియన్స్. ⇔ అనసూయ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనిపించింది. ముందు తను ఒప్పుకోలేదు. సుమతో పాడించాలనే ఆలోచన తమన్దే. అనసూయ ఆట, సుమ పాట అలరిస్తాయి. -
విన్నర్ సందడి..
-
అలాంటి ఛాన్స్ రాలేదు!
‘‘నటిగా నా వృత్తి ఏంటి? ఓ పాత్రలో నటించడమే. పెద్ద హీరో అయినా.. చిన్న హీరో అయినా.. నా పాత్ర, కథ బాగుంటే చేస్తాను. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది. హాలీవుడ్లో ఓ పాత్రను పాత్రగానే చూస్తారు. ఏంజెలీనా జోలీ ‘టూంబ్ రైడర్’ చేసింది. ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘సాల్ట్’ వంటి డిఫరెంట్’ సినిమాలూ చేసింది. తెలుగులోనూ అలా చేసే అవకాశాలు రావాలి. యాక్షన్, రొమాన్స్, లవ్.. అంటూ నటీనటులకు పరిమితులు ఉండకూడదు’’ అన్నారు రకుల్ప్రీత్ సింగ్. సాయిధరమ్ తేజ్, రకుల్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా గురించి రకుల్ చెప్పిన సంగతులు... ► ఈ సినిమాలో నా పేరు సితార. ఓ అథ్లెటిక్. రన్నింగ్, జంపింగ్ కాంపిటీషన్లలో ఓ మెడల్ నెగ్గాలనేది సితార లక్ష్యం. ‘నాకో లక్ష్యం ఉంది. నీకు ఏ లక్ష్యం లేదా?’ అని హీరోను తిడుతుంటుంది. ప్రేమకు టైమ్ లేదనే క్యారెక్టర్ అన్నమాట. నా రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే పాత్ర. సితార వల్లే సిద్ధు (హీరో) హార్స్ జాకీ అవుతాడు. అంతకు మించి చెబితే కథ అందరికీ తెలుస్తుంది. ► హీరోలు హార్స్ రైడింగ్, గట్రా చేయడం చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పటివరకూ తెలుగులోనే కాదు.. హిందీలో కూడా హీరోలెవరూ హార్స్ జాకీగా నటించలేదు. ఇందులో హార్స్ జాకీ కావాలనే లక్ష్యంతో హీరో పాత్ర ఉంటుంది. టర్కీలో చిత్రీకరించిన హార్స్ రైడింగ్ సీన్లు చాలా కొత్తగా, లావిష్గా ఉంటాయి. ► ఓ దర్శకుడితో రెండో సినిమా చేస్తున్నప్పుడు... వాళ్ల మీటర్ తెలుసు కనుక మన వర్క్ ఈజీ అవుతుంది. ‘పండగ చేస్కో’ తర్వాత గోపీచంద్ మలినేనితో పనిచేసే ఛాన్స్ వచ్చింది. తేజూ కూడా ఫ్రెండ్ కావడంతో చిత్రీకరణ అంతా సరదాగా సాగింది. పక్కా కమర్షియల్, ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా చూసినప్పుడు తేజూ ఏడ్చేశానని చెప్పాడు. ప్రేక్షకులకూ అవి నచ్చుతాయి. ► హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే హారర్, థ్రిల్లర్స్ కాదు. మహిళలకు మంచి ప్రాముఖ్యత ఉన్న సినిమాలూ ఉంటాయి. నాకు ఇప్పటివరకూ అలాంటి ఛాన్సులు రాలేదు. వస్తే చేయడానికి రెడీ. హిందీ ‘మేరీ కోమ్’ వంటి సినిమా చేయాలనుంది. ► ఇంటెలిజెంట్ థ్రిల్లర్గా రూపొందుతోన్న మహేశ్బాబు–మురుగదాస్ సిన్మాలో నాది ఫన్నీ క్యారెక్టర్. నాగచైతన్య–కల్యాణ్కృష్ణ సినిమాలో సంప్రదాయబద్దమైన అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. ‘జబ్ వుయ్ మెట్’లో కరీనా కపూర్ పాత్ర కన్నా ఇందులో నా పాత్ర బాగుంటుంది. తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తున్నా. -
‘విన్నర్’ ప్రీ రిలీజ్
-
నాపై ఇంత బడ్జెట్ అవసరమా అనిపించింది
‘విన్నర్’ కథ విన్న వెంటనే ఖర్చుతో కూడుకున్న సినిమా. నా మీద అంత బడ్జెట్ అవసరమా? అనుకున్నా. కానీ, నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టాలని ఆలోచించారు తప్ప హీరోకి మార్కెట్ గురించి ఆలోచించలేదు. వాళ్లు పెట్టిన ఖర్చుకి, గట్స్కి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘విన్నర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ను ఆదివారం నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అవార్డులు, రివార్డులు వస్తుంటాయ్, పోతుంటాయ్. కానీ, ఓటమి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారన్నదే ఇంపార్టెంట్ అని కల్యాణ్గారు (పవన్ కల్యాణ్) చెప్పారు. ఈ రెండేళ్లు ఏం గెలుచుకున్నావంటే మెగా ఫ్యాన్స్ అభిమానం గెలుచుకున్నాను. నాకు గెలుపు, ఓటమిని పరిచయం చేసిన అమ్మా.. ‘లవ్ యూ’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంటే మాకు ఇష్టం. వాళ్ల అమ్మ అంటే తేజూకి చాలా ఇష్టం. తనలో నాకు నచ్చేది అదే. వాడికి అబద్ధం కూడా చెప్పడం రాదు . చిన్నప్పుడు నిజాలు చెప్పి తిట్లు తినేవాడు’’ అన్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘తేజూను మానిటర్లో చూస్తున్నప్పుడు చిరు, పవన్లను డైరెక్ట్ చేస్తున్నట్టనిపించింది. ఈ చిత్రంలో గుర్రంతో రిస్కీ షాట్స్ చేశాడు. రెండు మూడుసార్లు పడ్డాడు. నటుడిగా ఈ చిత్రంతో తను నెక్ట్స్ లెవల్కి వెళతాడు. టాలీవుడ్లో అనుష్క తర్వాత అంత డెడికేషన్ రకుల్లో చూశా’’ అన్నారు. ‘‘నేను, తేజు క్రికెట్ ఆడుతుంటాం. ధోనీ ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మా ఫస్ట్ మూవీ డకౌట్ అయ్యింది. ఈ ‘విన్నర్’ మాత్రం పెద్ద హిట్ అవుతుంది. తేజుకి మ్యూజిక్ చేసేటప్పుడు మెగాస్టార్, పవర్స్టార్, సై్టలిష్ స్టార్ గుర్తుకొస్తారు నాకు’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, పీవీపీ, ‘జెమినీ’ కిరణ్, రాజీవ్ రెడ్డి, దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, మెహర్ రమేశ్, బాబీ, అనిల్ రావిపూడి, బీవీఎస్ రవి, సంకల్ప్, కెమేరామ్యాన్ ఛోటా కె.నాయుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్ అనసూయ, ఎడిటర్ గౌతంరాజు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
రకుల్..ధరమ్
లాత్రి లైన్ అయ్యిందనుకుంటా... ఇంటర్వ్యూ లంప్లీట్ అవ్వడానికి... కలుపు నొప్పేసింది... లవ్వీ... లవ్వీ... ‘సాక్షి’ చేసిన ఇంటర్వ్యూల్లో ఇది తప్పకుండా లక్కిలిగింతల ఇంటర్వ్యూయే.. సాయిధరమ్ తేజ్ – రకుల్ ప్రీత్సింగ్ ఇద్దరూ ఒకరితో ఒకరు‘ల’ భాషలో మాట్లాడుకుంటారట. మేం ముందు బుర్ర గీక్కున్నాం.. అదేమైనా ‘లవ్వు’ భాషేమో అని. ఆ తర్వాత అర్థమైంది...‘లాఫింగ్ భాష’ అని. ఎంజాయ్ ఇంటర్వ్యూ...‘సాక్షి’ ఎక్స్క్లూజివ్. సాక్షి: రకుల్తో సినిమా అనగానే మీకు ఏమనిపించింది? సాయిధరమ్ తేజ్: తనతో నాకు ముందునుంచీ పరిచయముంది. అందుకే షూటింగ్ సరదాగా ఉంటుందనుకున్నా. అంతకంటే ఎక్కువ సరదాగా, ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. డైట్ కంట్రోల్లో ఉంటాం కాబట్టి, మేం ఎక్కువగా తినం. ఇద్దరం ఫుడ్ లవర్స్. అందుకే ఫుడ్ గురించి విపరీతంగా డిస్కస్ చేసుకుంటాం. మేం ఏ ఫుడ్కైతే దూరంగా ఉంటామో అవి తింటున్నట్లు ఊహించుకుంటాం. అప్పుడు నోట్లో నుంచి.. ఎందుకులెండి? చెబితే బాగుండదు. ఇక, షూటింగ్ విషయానికి వస్తే రకుల్తో నాకెలాంటి మొహమాటాలూ లేవు. ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడతా. అంత ఫ్రీడమ్ ఉంది. అదే సమంతతో సినిమా అంటే.. ‘ఆహా... ఆ’ అని ఎగై్జట్ అయ్యేవాణ్ణి. రకుల్తో అనగానే మామూలుగా ‘యస్’ అనుకున్నా (నవ్వులు). రకుల్: (తేజ్ వైపు చూస్తూ..) కొడతా! సాక్షి: ఇంతకీ మీరిద్దరూ. నువ్వు–నువ్వు అనుకుంటారా? మీరు–మీరు అని పిలుచుకుంటారా? రకుల్: ‘మీరు.. సార్’.. అలాంటివేం లేదు. నువ్వు.. నువ్వు అనే మాట్లాడుకుంటాం. తేజ్: ఒకవేళ ఎవరైనా నాకు పరిచయం లేని కొత్త హీరోయిన్ అయితే మీరు అని పిలుస్తా. రకుల్ ఎప్పట్నుంచో ఫ్రెండ్ కాబట్టి నువ్వు అనే అంటా. సాక్షి: తేజూతో సినిమా అనగానే మీకెలా అనిపించింది? రకుల్: మంచి ఫ్రెండ్ కాబట్టి బాగానే అనిపించింది. షూటింగ్ స్పాట్లో అయితే ‘హీరోగారు వచ్చారు, హీరోగారు వెయిట్ చేస్తున్నారు’ టైపులో ఏం లేదు (నవ్వుతూ). షాట్ గ్యాప్లో ఏదో సోది మాట్లాడుకునేవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నేను అక్టోబర్ 10న, తను అక్టోబర్ 15న పుట్టాం. నేను అమ్మాయి, తను అబ్బాయి. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సాక్షి: ఇద్దరూ ఒకే ఏడాది పుట్టారా? రకుల్:హలో.. ఏజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తు న్నారా? ఇక్కడ వయసులు చెప్పబడవు. తేజ్: నాకంటే చిన్నది. అంతవరకూ చెబుతా. సాక్షి: అవునూ.. మీ గురించి గాసిప్స్ వస్తుంటాయ్ కదా.. వాటి గురించి డిస్కస్ చేసుకుంటారా? తేజ్: బాగా డిస్కస్ చేసుకుంటాం. ‘మనిద్దరం ఒకరినొకం ఇష్టపడుతున్నామని రాశారు. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది?’ అని తనని అడిగితే.. స్టుపిడ్గా ఉందంటుంది. నాకేమో నవ్వొస్తుంది. ఇప్పటివరకూ నేను పని చేసిన ప్రతి హీరోయిన్తోనూ లింకప్ పెట్టి గాసిప్స్ రాశారు. రకుల్: తేజు చాలా మంచోడు. తనపై ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదు. సాక్షి: రెజీనా, రాశీఖన్నా, రకుల్.. ఇలా ‘ర’ లెటర్ ఉన్న హీరోయిన్లతోనే ఎఫైర్ అని వార్తలు రావడం విచిత్రం.. రకుల్:(నవ్వుతూ..) అవునవును. ఇంతకు ముందే నేనా విషయం తేజూకి చెప్పా. ఇక, మా స్టోరీ అయితే సూపర్బ్. ఎంత మంచి స్క్రీన్ప్లే రాశారంటే.. సడన్గా ఓసారి గోపీగారు (‘విన్నర్’ దర్శకుడు గోపీచంద్ మలినేని) నా పర్సు ఓపెన్ చేస్తే.. అందులో తేజు ఫోటో ఉందట! అలా కల్పించుకుని ఎవరో రాశారు. తేజ్: ఆ స్క్రీన్ప్లే నాకూ అర్థం కాలేదు. అయినా ఈ కాలంలో పర్సుల్లో ఎవరు ఫొటోలు పెట్టుకుంటారండీ? ఎంచక్కా ఫోన్లో పెట్టుకుంటున్నారు. అందుకే ఆ కహానీ చదివి, ‘ఏ కాలంలో ఉన్నార్రా బాబూ. ఆ జమానా ఎప్పుడో అయిపోయింది’ అనుకుని ఇద్దరం నవ్వుకున్నాం. సాక్షి: మీ హార్ట్ని విన్ అయినవాళ్లు ఎవరైనా ఉన్నారా? తేజ్: చాలామంది గెలుచుకున్నారండి. రకుల్: పెద్ద లిస్టు ఉంది. చెప్పడానికి సిగ్గుపడతాడు. తేజ్: పేర్లు చెబితే వాళ్లు కూడా సిగ్గుపడతారు. అలాగే వీడు మనల్ని ఎప్పుడు చూశాడా అని ఆశ్చర్యపోతారు. రకుల్: సిగ్గుతో చచ్చిపోతారు కూడా. సాక్షి : అసలు ఎప్పుడైనా పర్సులో ఫొటోలు పెట్టుకున్నారా? తేజ్: ఒకప్పుడు పెట్టుకున్నాను. కానీ, పర్సు సరిపోలేదు. రకుల్: అందుకే, తన ఫొటో తీసి నా పర్సులో పెట్టాడు. నా పర్సు ఖాళీగా ఉంటుంది కదా. పర్సులో ఉన్న తన ఫొటోను నా పర్సులో పెడితే.. ఆ ఖాళీలో ఇంకో అమ్మాయి ఫొటో పెట్టొచ్చు కదా (అల్లరిగా చూస్తూ). ఏయ్.. నువ్వే నీ ఫొటోని నా పర్సులో పెట్టావ్ కదూ. తేజ్: నాకేం తెలుసు. వాళ్లు నీ పర్సే ఓపెన్ చేస్తారని! రకుల్: మమ్మీ–డాడీ చూసేస్తారు. అందుకే, పర్సులో ఎప్పుడూ ఫొటోలు పెట్టుకోలేదు. హార్ట్లోనే పెట్టుకున్నా. తేజ్: నా కెమిస్ట్రీ బుక్లో ఓ ఫొటో, ఫిజిక్స్ బుక్లో ఒకటి, బోటనీ, జువాలజీల్లో ఒక్కో ఫొటో ఉండేది. నలుగురి ఫొటోలు. క్లాస్ మారినప్పుడల్లా ఫొటోలు మారేవి! సాక్షి : జనరల్గా మీరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? రకుల్: లలలలల! ‘ల’ భాష మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు తేజూ అంటున్నారని నేనలా పిలుస్తున్నాను కానీ, మామూలుగా అయితే నేను తేజూని ‘ధలమ్’ అంటాను. తనేమో నన్ను ‘లకుల్’ అని పిలుస్తాడు. తేజ్:మాది ‘ల’ భాష. ఉక్రెయిన్లోని ‘లివివ్’ అనే సిటీలో ‘విన్నర్’ షూటింగ్ చేసినప్పుడు ఆ భాష మొదలుపెట్టాం. అక్కడ చలి ఎక్కువ. సాయంత్రం నాలుగున్నరకి షూటింగ్కి ప్యాకప్ చేప్పేసేవారు. 6 గంటలకు హోటల్కి చేరుకునేవాళ్లం. ఓ గంట వర్కౌట్స్ చేసి, ఏడు నుంచి పది గంటల వరకూ సిటీ చూడ్డానికి వెళ్లేవాళ్లం. డిఫరెంట్ రెస్టారెంట్స్లో ఫుడ్ తినేవాళ్లం. ఒకచోట భోజనం ఎంత టేస్టీగా ఉందంటే.. మా మైండ్ బ్లాంక్ అయింది. ఆ ఫుడ్ గురించి మాట్లాడుతూ.. మాట్లాడుతూ మళ్లీ అదే ప్లేస్కి వచ్చాం. అప్పుడు.. ‘మనం లివీవియన్స్. మనం లివీవ్లో బతుకుతున్నాం. మనది ‘ల’ భాష’ అని డిసైడ్ అయ్యాం. ‘బీసీ సెంటల్, లకుల్, విన్నల్’.. ఇలా అన్నీ ‘లా’లే. సాక్షి: లైఫ్లో మీ మొదటి గెలుపు మీకు గుర్తుందా? తేజ్:చిన్నప్పుడు వంద మీటర్ల పరుగు పందెం గెలిచినప్పుడు బుజ్జి కప్ ఇచ్చారు. దాన్ని అమ్మకు ఇచ్చాను. నా మొదటి గెలుపు అది. ఎప్పటికీ గుర్తుంటుంది. రకుల్: మేము జలంధర్లో ఉన్నప్పుడు ఓ సింగింగ్ కాంపిటీషన్లో ప్రైజ్ తీసుకున్నా. అప్పుడు నాకో బ్యూటిఫుల్ టెడ్డీబేర్ గిఫ్ట్ ఇచ్చారు. నేనప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నా. కాంపిటీషన్లో కూడా నేను సెకండే. ‘యాద్ పియా కి ఆనే లగి..’ పాట పాడాను. నేనంత దరిద్రంగా పాడినా ప్రైజ్ ఎలా వచ్చిందో తెలీదు (నవ్వుతూ). అప్పట్లో నాకొచ్చిన ఒకే ఒక్క పాట అది. ప్రతి కాంపిటీషన్లోనూ ఆ పాటే పాడేదాన్ని. తేజ్:నేను మ్యూజికల్ చైర్స్ చాలా కసిగా ఆడేవాణ్ణి. ఎప్పుడూ నెగ్గలేదు. ఆటలో ఇద్దరు మిగిలిపోయినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది. కుర్చీ యాంగిల్లో ఉండేవాళ్లు్ల నెగ్గేవారు. నేను ఆ యాంగిల్లోనే ఎక్కువగా వెళ్లేవాణ్ణి. కానీ, కుర్చీ లాక్కుని పక్కనోడు కూర్చునేవాడు. అలా ఛాన్స్ ఉండి కూడా నేను ఓడిపోయేవాణ్ణి. సాక్షి: ఇంకొకరి గెలుపు కోసం మీరు ఓడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? రకుల్: (నవ్వుతూ...) అంత సినిమాటిక్ లైఫ్ లేదు. అలాగని నేనే గెలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎవ్వరైనా వంద శాతం కష్టపడితే వాళ్లు నెగ్గుతారు. (తేజ్వైపు చూస్తూ..) తేజ్:చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్నిసార్లు ఓడిన సందర్భాలున్నాయి. కానీ, గేమ్స్ ఆడేటప్పుడు ఎదుటివాళ్లను గెలిపించాలనే ఆలోచన రాలేదు. సాక్షి: చిన్నప్పుడు మార్కులు, స్పోర్ట్స్, పెద్దయిన తర్వాత కెరీర్... అన్నింట్లోనూ గెలవాలి. గెలుపు అంటే ఎప్పుడూ ఓ ప్రెజర్ ఉంటుందేమో కదా? తేజ్:నేను గెలుపు గురించి ఆలోచించను. చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తున్నానా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తా. ఇప్పుడు సినిమాలు చేస్తున్నా. ప్రతి సినిమా ఆడాలంటే కష్టం. గెలుపోటములను మనం ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం. నేను రెంటినీ ఒకేలా చూస్తా. ఒక్క తేడా ఏంటంటే... గెలిస్తే హ్యాపీ. ఓడితే.. దాన్నుంచి ఏం నేర్చుకున్నాం? అని ఆలోచిస్తా. మళ్లీ అది రిపీట్ చేయకుండా చూసుకుంటా. రకుల్: ఎప్పుడూ నేను ఒత్తిడికి లోనుకాను. ఒత్తిడికి గురయితే.. పర్ఫార్మెన్స్ పోతుంది. నేను ఏం చేసినా ఎంజాయ్ చేసి, చేస్తాను. వందశాతం కష్టపడి చేస్తా. రిజల్ట్ గురించి ఎప్పుడూ పట్టించుకోను. వృత్తిపట్ల నిజాయితీగా ఉంటే గెలుపు అదే వస్తుంది. సాక్షి: ‘గెలుపు’కి మీరిచ్చే నిర్వచనం ఏంటి? రకుల్: నేను ఎవరితో అయితే కలసి పని చేస్తున్నానో ఆ వ్యక్తులు నా పట్ల మంచి అభిప్రాయంతో ఉండడమే నిజమైన గెలుపు. ఉదాహరణకు.. నేను బోలెడన్ని డబ్బులు సంపాదించి, ఎంతో సాధించినప్పటికీ... ఎవరూ నన్ను ఇష్టపడకపోతే, నాతో మాట్లాడేవారు ఒక్కరూ లేకపోతే, అసలు స్నేహితులే లేరంటే... ఐయామ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ పర్సన్. నా దృష్టిలో గెలుపంటే... గొప్ప స్నేహితులు, గొప్ప జీవితం ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తేజ్: ఈ సినిమాకు ముందు చిన్న చేదు అనుభవం (‘తిక్క’ ఫెయిల్యూర్) ఉంది. అదో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ టైమ్లో నావాళ్లు, మా ఫ్యాన్స్ నాకు బాగా సపోర్ట్గా నిలిచారు. అది హ్యాపీ. నా పట్ల వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు నా సక్సెస్, గెలుపు కింద భావిస్తా. మనం నలుగుర్ని సంపాదించుకున్నామంటే అది గెలుపే. సాక్షి: తేజూలో ప్లస్, మైనస్? రకుల్: చాలా మంచోడు. అమ్మను బాగా చూసుకుంటాడు. రాముడు మంచి బాలుడు టైపు. ‘గెట్ స్పాయిల్డ్’ అని చెబుతుంటా. ‘చుట్టుపక్కల ఉన్నోళ్లను చూసి కొంచెం నేర్చుకో... ఎప్పుడైనా అబద్ధాలు చెప్పు. అల్లరి చేయ్’ అంటుంటా. అంత మంచోడు కాబట్టే కొంతమంది అలుసుగా తీసుకుంటారు. తన ప్లస్, మైనస్.. మంచోడు కావడమే. తేజ్: అది నిజమేనండి. నేను చాలా ఈజీగా కరిగిపోతా. ఎవరేం చెప్పినా నమ్మేసి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తా. సాక్షి: రకుల్లో ఉన్న ప్లస్సులూ మైనస్సులూ ఏంటి? తేజ్: ఓవర్ హార్డ్ వర్కింగ్. రెస్ట్ తీసుకోదు. ఏం చేసినా అందులో మ్యాగ్జిమమ్ చేస్తుంది. వర్క్, ఫన్, ఇంకోటి ఏదైనా.. చాలా సీరియస్గా తీసుకుని చేసేస్తుంది. తనకంటూ టైమ్ కేటాయించదు. అదే ప్లస్.. అదే మైనస్. రకుల్:అవునండి. వర్క్, వర్కౌట్స్, పార్టీయింగ్.. ఏదైనా ఫుల్లుగా చేయాలన్నది నా పాలసీ. సాక్షి: తేజ్ బాగా డ్యాన్స్ చేస్తారు. ఇబ్బంది అనిపించిందా? రకుల్: మెగా ఫ్యామిలీలో ఉన్నవాళ్లకి చిన్నప్పట్నుంచీ స్పూన్తో డ్యాన్సింగ్ సిరప్ తాగించారేమో. అసలు ఎముకలు లేనట్టు బాగా డ్యాన్స్ చేస్తారు. నాకు ఇబ్బంది కాదు. ఎందుకంటే నాకూ ఎక్కువ డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. తేజ్: షి ఈజ్ గుడ్ డ్యాన్సర్. మేనేజ్ చేయడం నుంచి మంచి డ్యాన్సర్గా ఎదిగింది. తారక్ (ఎన్టీఆర్), రామ్చరణ్, బన్నీలతో ప్రాక్టీస్ చేసిన తర్వాత నేనేంత? జుజుబీ(నవ్వుతూ). సాక్షి: ‘ధృవ’లో ‘పరేషానురా....’ పాట లో మీరు చాలా హాట్గా ఉంటారు. రకుల్: సినిమాటోగ్రాఫర్ నన్ను చాలా అందంగా చూపించారు. తేజ్: రకుల్ని చూస్తే ఓ కమెడియన్ గుర్తొస్తుంది. ఆ పాటలో మరీనూ. రకుల్ సరిగా చేయలేదు. ‘చూశా.. చూశా..’ పాటలో జీవించింది. ‘పరేషానురా..’లో జస్ట్ నటించింది. రకుల్: ‘చూశా.. చూశా’ ఈజ్ మై ఒరిజినల్ క్యారెక్టర్. అంతకన్నా ఎక్కువ నాకు రాదు, తెలీదు. మీరే (తేజ్) నేర్పించాలి మరి (కాస్తంత వ్యంగ్యంగా). సాక్షి : రకుల్ అందాన్ని వర్ణించమంటే.. ఏం చెప్తారు తేజూ? తేజ్:నేనెప్పుడూ రకుల్ని అలా చూడలేదు. ఎమీ జాక్సన్ గురించి అడగండి, చెప్తాను. రకుల్, రెజీనా నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరి అందాన్ని వర్ణించే దృష్టితో చూడలేదు. రకుల్: ఇన్ఫాక్ట్ మేమిద్దరం కూర్చుని ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడని డిస్కస్ చేసుకుంటాం. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నవ్వుకునేవాళ్లం. ఓ సాంగ్ షూటింగ్లో తేజూని చూసి సిగ్గుపడాల్సిన టైమ్లో నాకు నవ్వొచ్చింది. కష్టపడి కంప్లీట్ చేశాం తేజ్: రొమాంటిక్ సీన్స్లో ‘హే.. డోంట్ డూ ఇట్’ అనేవాణ్ణి. అంతలోనే, ‘మనం తప్పకుండా యాక్ట్ చేయాలి. వాళ్లు మనకి డబ్బులు ఇస్తున్నారు’ అనుకునేవాళ్లం. సాక్షి: వేలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రకుల్: ‘హ్యాపీ సింగిల్ వేలంటైన్స్డే’ అని చెప్పుకున్నాం. తేజ్: నేను వేలంటైన్స్డే సెలబ్రేట్ చేసుకోను. 15 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న నా ఫ్రెండ్ మరణించాడు. అప్పట్నుంచీ వేలంటైన్స్డే సెలబ్రేట్ చేసుకోను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలసి ఓ కాఫీ తాగి, కాసేపు మౌనం పాటించి ఇంటికి వెళ్లిపోతాం. సాక్షి: మీరు భయపడే విషయాలేవైనా ఉన్నాయా? తేజ్: నాకు హారర్ సినిమాలంటే భయం. కాన్జ్యూరింగ్, ద ఎగ్జాసిస్ట్.. అవన్నీ నా వల్ల కాదు. దరిద్రం కాకపోతే... డబ్బులిచ్చి మరీ భయపడటం ఏంటండీ. జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తానన్నా నేను హారర్ సినిమాలు చేయను. రకుల్: తేజ్కి ఎంత భయమంటే.. మీరు హారర్ సినిమాల గురించి మాట్లాడితే రూమ్ నుంచి బయటకి వెళ్లిపోతాడు. సాక్షి: ఫైనల్లీ... రకుల్కి ప్రపోజ్ చేయమంటే ఎలా చేస్తారు? రకుల్: ప్లీజ్.. అలా చెయ్యొద్దు. నువ్వు ప్రపోజ్ చేస్తే నేను చచ్చిపోతా. (గట్టిగా నవ్వులు) తేజ్: ప్లీజ్ గివ్ మి ఒన్ ఛాన్స్ రకుల్. సాక్షి: రకుల్... ఒకవేళ మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే? రకుల్: దలమ్కా.. అస్సలు చేయను. తేజ్:చేయవా.. చ్చచ్చచా! ప్రపోజ్ చేయడానికి కూడా పనికి రానా? అయితే నో ప్రాబ్లమ్.. రకుల్: ఓకే.. నో ప్రాబ్లమ్.. తేజ్: సరే.. ఇంకో ఇంటర్వ్యూ ఉంది.. నడువు.. రకుల్: వస్తున్నానోయ్.. తేజ్:–రకుల్: బై బై అండి. – డి.జి. భవాని -
సూయ.. పాట అనసూయ కోసమే అనుకున్నా
‘విన్నర్’ సినిమా కోసం పాట పాడమని సంగీత దర్శకుడు తమన్ అడిగిప్పుడు తమాషా చేస్తున్నాడనుకున్నా. అయితే తను సీరియస్గానే అని చెప్పడంతో చెన్నై వెళ్లి పాట పాడా’’ అని యాంకర్ సుమ చెప్పారు. సాయిధరమ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ‘సూయ సూయ’ పాట పాడిన సుమ, ఆ పాటలో నర్తించిన యాంకర్ అనసూయ తమ అనుభూతులు పంచుకున్నారు. సుమ మాట్లాడుతూ– ‘‘తమన్ ఇచ్చిన లిరిక్స్లో ‘సూయ సూయ’ పల్లవి చదవగానే ఇది అనసూయ కోసం రాసిన పాట కదా? అని అడగడంతో అవునన్నాడు. తర్వాత అనసూయకు ఫోన్ చేసి నేను పాట పాడా, అది నువ్వు డ్యాన్స్ చేసే పాట అనగానే థ్రిల్ అయ్యింది. బాగా పాడానని ఎస్పీబీగారు ప్రశంసించడం మరచిపోలేను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నన్ను ‘క్షణం’ చిత్రం అనసూయగానే గుర్తు పెట్టుకో వాలని, ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ‘విన్నర్’లో పాట చేయమనడంతో భయపడి వద్దన్నా. కానీ, ఆ పాటలో కొన్ని లిరిక్స్ వినగానే చేయాలనిపించి చేశా’’ అన్నారు అనసూయ. -
గెలుపు అతని లక్షణం
చూపులకు చిన్నోడే.. పాతికేళ్ల కుర్రాడే. కానీ, పులికి ఎదురెళ్ళే ధైర్యం.. పాతికమందిని మట్టుబెట్టే బలం.. గడ్డిపోచగా తీసినోళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ అతనిలో ఉన్నాయి. పరిస్థితులకు తలవంచకుండా గెలుపే లక్ష్యంగా పోరాడడం.. గెలిచి తీరడం అతని లక్షణం. మరి, ఆ కుర్రాడి కథేంటో మహాశివరాత్రికి థియేటర్లలో చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. ఈ నెల 19న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి, శివరాత్రి సందర్భంగా ఈ 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో పాటలను సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ‘నా బీసీ సెంటర్లు..’ అనే పాటను రవితేజ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది. ట్రైలర్ను యూట్యూబ్లో 20 లక్షల మంది చూశారు. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. టర్కీలో చిత్రీకరించిన హార్స్ రేసింగ్ సీన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. జగపతిబాబు, ముఖేశ్రుషి, ఆలీ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: ఎస్.ఎస్. తమన్, సమర్పణ: ‘బేబీ’ భవ్య. -
అంతర్జాతీయ కుంగ్ఫూ పోటీల్లో మెరిసిన ‘కిరణం’
ఆలమూరు : అంతర్జాతీయ స్థాయి కుంగ్పూ పోటీల్లో మండలంలోని మడికి శివారు చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి కిరణ్కుమార్ రజతపతకాన్ని సాధించాడు. ఈనెల 12న నేపాల్లో నిర్వహించిన పోటీల్లో కిరణ్ ఈ ఘనత సాధించడంతో పాటు వచ్చే ఏప్రిల్లో తైవాన్లో జరిగే ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించాడు. కిరణ్ గత అక్టోబర్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచాడు. కిరణ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో రజత పతకాన్ని సాధించడంతో పాటు ఏసియన్ గేమ్స్కు అర్హత సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం స్తున్నారు. -
‘విన్నర్’ మూవీ స్టిల్స్
-
సాయిధరమ్ తేజ్కి పెద్ద స్టార్డమ్ వస్తుంది!
‘‘నా నిర్మాతలు, నా కెమేరామన్, నా ఎడిటర్, నా రైటర్... వీళ్లందరితో గోపీ (గోపీచంద్ మలినేని) తీసిన చిత్రమిది. ట్రైలర్ చూస్తుంటే... నా సినిమాలానే అనిపించింది. సాయిధరమ్ తేజ్ గుర్రంతో పరిగెత్తే షాట్ అద్భుతంగా ఉంది. అతనికి ఈ సినిమా పెద్ద స్టార్డమ్ తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్. సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నారు. ఆదివారం వీవీ వినాయక్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘బడ్జెట్ గురించి నిర్మాతలు ఎక్కడా ఆలోచించలేదు. టర్కీ వెళ్లి హార్స్ రేస్ సీన్లు తీశారు. ఆ కష్టమంతా స్క్రీన్పై కనిపించింది. సంతోశ్ శివన్, పీసీ శ్రీరామ్ స్థాయి కెమేరామాన్ ఛోటా కె.నాయుడు. గోపీ గత సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా వాటికి మించి హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పగానే గుర్రాలు, హార్స్ రేసింగ్ అంటే నాకు అర్థం కాలేదు. కానీ, షూటింగ్ చేసినప్పుడు దర్శక, నిర్మాతలు, ఛోటాగారు తీసుకున్న జాగ్రత్తల వల్లే నేను సేఫ్గా ఉన్నా. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతా. నా స్పీడ్ని కంట్రోల్ చేసిన గోపీ అన్న మంచి నటన రాబట్టుకున్నారు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. ‘‘నన్నూ, తేజూనీ నెక్ట్స్ లీగ్కి తీసుకువెళ్లే సినిమా అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు గోపీచంద్ మలినేని. ఎడిటర్ గౌతంరాజు, కెమేరామన్ ఛోటా కె. నాయుడు, రచయిత వెలిగొండ శ్రీనివాస్, ‘ఏషియన్’ సునీల్ నారంగ్ పాల్గొన్నారు. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా విన్నర్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్తో పాటు కామెడీ పంచ్లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్కు రెడీ అవుతోంది. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
-
ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?
టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వినాయక్, త్వరలో ఓ మీడియం రేంజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తొలి సినిమాతోనే మెగా ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరమ్ తేజ్, ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. పిల్లానువ్వలేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత కూడా రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా.. వినాయక్ సినిమా ఓకె అయితే మాత్రం అన్ని పక్కన పెట్టేసి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. -
రెడీ టు విన్
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు కొత్త సెంటిమెంట్ మొదలైంది. ‘సరైనోడు’, ‘ధృవ’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాలకు ఆడియో వేడుకలు నిర్వహించలేదు. రోజుల వ్యవధిలో ఒక్కో పాటను విడుదల చేసి, ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజా సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టున్నారు. సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘విన్నర్’. ఈ నెల 9న థియేట్రికల్ ట్రైలర్, మహా శివరాత్రి సందర్భంగా 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. 19న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మహేశ్బాబు విడుదల చేసిన ‘సితార సితార...’ పాటకు మంచి స్పందన లభించింది. ఈరోజు ‘పిచ్చోడినయిపోయా..’ పాటను సమంత విడుదల చేయనున్నారు. మిగతా ఐదు పాటలను ఒక్కో సినీ ప్రముఖుడు విడుదల చేస్తారు. ప్రస్తుతం రీ–రికార్డింగ్ జరుగుతోంది. మిగిలిన ఒక్క పాటను 12 నుంచి చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతమందించిన ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటర్: గౌతంరాజు, కెమేరా: ఛోటా కె.నాయుడు. -
మెగా హీరో కోసం మహేష్
టాలీవుడ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టేసి కలిసి పోతున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలు ఒకరి సినిమా ఓపెనింగ్లకు ఒకరు హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించటంతో పాటు పాటలను కూడా తన సోషల్ మీడియా పేజ్లలో ప్రమోట్ చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అదే బాటలో ఒక మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా విన్నర్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఒక పాటను మహేష్ తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న మహేష్ బాబు. షూటింగ్ లోకేషన్ నుంచే ఈ రోజు (బుధవారం) సితార అనే విన్నర్ తొలి పాటను రిలీజ్ చేయనున్నాడు. సితార.. మహేష్ కూతురి పేరు కావటంతో మహేష్ చేతులు మీదుగా ఆ పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. #Winner #Thankyousuperstar pic.twitter.com/BK0mCE5RTy — Sai Dharam Tej (@IamSaiDharamTej) 1 February 2017 Super thanks to Our #superstar @urstrulyMahesh for his Super heart ❤️ to launch our #sitarasong today at #7pm from @IamSaiDharamTej #winner pic.twitter.com/hOPuNKSkCn — thaman ss (@MusicThaman) 1 February 2017 -
ఖేలో ఇండియా ఫుట్బాల్ విజేత ‘అనంత’
శ్రీకాకుళం : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్బాల్ బాలబాలికల విజేతలుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం, నైరా వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో మూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్–14 ఫుట్బాల్ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో జరిగిన ఉత్కంఠ పోరులో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన వైఎస్సార్ కడపపై చిత్తూరు జట్టు 2–1 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. మరో మ్యాచ్లో అనంతపురంపై కర్నూలు జట్టు గెలిచింది. అనంత అదరహో.. కేంద్రీయ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో మధ్యాహ్నం జరిగిన బాలికల విభాగం తుది పోరులో అనంతపురం విజేతగా నిలిచింది. కర్నూలుతో జరిగిన ఫైనల్ పోరులో 2–1 గోల్స్ తేడాతో విజయభేరి మోగించింది. మరో మ్యాచ్లో శ్రీకాకుళంపై 3–0 గోల్స్ తేడాతో వైఎస్సార్ కడప విజయం సాధించింది. -
డబ్బింగ్ మొదలు పెట్టిన మెగాహీరో
వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. తిక్క సినిమాతో నిరాశపరిచిన సాయి... సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకునేందుకు విన్నర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాదిలో డబ్బింగ్ పనులను ప్రారంభించిన దర్శకుడు గోపిచంద్ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సాయిధరమ్ తేజ్ డబ్బింగ్ చెపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేశాడు. ఈ కామెంట్పై స్పందించిన హీరో సాయిధరమ్ తేజ్ 'కొత్త ఏడాదికి గొప్ప ప్రారంభం.. మా సినిమా ఈ ఏడాదికే విన్నర్ గానిలుస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు. Great start to the new year! It's gonna be a #winner of a year! ☺ https://t.co/qNEgqNJ8TS — Sai Dharam Tej (@IamSaiDharamTej) 5 January 2017 -
నార్త్జోన్ కబడ్డీ పోటీల విజేత పూడిమడక జట్టు
కాకినాడ క్రై ం : కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్ర స్థాయి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మీట్–2లో భాగంగా జిల్లా క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలను కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ డీఎస్పీ ఎం.రాజారావు బుధవారం ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటూ శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటి వరకూ షెటిల్, సైక్లింగ్, వాలీబాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విన్నర్ కాగా, శ్రీకాకుళం జిల్లా బారువా జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు డీఎస్పీ రాజారావు మెమెంటోలు బహూకరించారు. ఈ రెండు జట్లు ఈ నెలలో విశాఖలో జరిగే సెమీఫైనల్లో సౌత్ జోన్ విన్నర్, రన్నర్ జట్లతో తలపడతాయన్నారు. ఈ పోటీల్లో నార్త్జోన్ డివిజన్కు చెందిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 11 మెరైన్ పోలీస్స్టేషన్లకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. పోటీలకు రిఫరీలుగా కాకినాడ సిటీకి చెందిన ఆరుగురు పీఈటీలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, ఓడలరేవు మెరైన్ సీఐలు బి.రాజారావు, శ్రీనివాస్లతో పాటు నాలుగు జిల్లాల నుంచి సుమారు 150 మంది మెరైన్ పోలీస్లు పాల్గొన్నారు. -
న్యూ ఇయర్కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్
ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు కూడా చేరిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్ల దుమ్ముదులుపుతున్నాయి. రేసులోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్లతో హవా చూపిస్తున్నాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ రేసులోకి అడుగుపెట్టాడు. కొత్త ఏడాదికి రెండు రోజుల ముందే తన కొత్త సినిమా మిస్టర్ టైటిల్ లోగోను రిలీజ్ చేసిన వరుణ్, న్యూ ఇయర్ రోజు టీజర్ను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్కు చాలా సమయం ఉండటంతో సంక్రాంతికి ట్రైలర్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆదోని పిలిప్స్ జట్టు విజయకేతనం
- ఎల్లార్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు - విజేత జట్లకు నగదు బహుమతులు ప్రదానం హొళగుంద: ఎల్లార్తి షేక్షావలి, షాషావలి ఉరుసును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఎస్ఎస్వి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటిల్లో ఆదోని పిలిప్స్ జట్టు విజేతగా నిలిచింది. దర్గా పీఠాధిపతి, ముతవల్లి డాక్టర్ సయ్యద్ షేక్ తాజుద్దిన్ అహమ్మద్ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి పోటీలు నిర్వహిస్త్నునారు. ఆదివారం ఆదోని-గంగావతి జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆదోని పిలిప్స్ జట్టుకు రూ. 20 వేల నగదును బళ్లారి జిల్లాకు చెందిన సూగప్ప అందించారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా మంత్రాలయం మఠానికి చెందిన వీరేంద్రాచారి, మారుతిబాలు రూ. 15వేలు, రూ.10 వేలు ప్రకారం అందించారు. ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐ మారుతి, ఎల్లార్తి దర్గా పీఠాధిపతి డాక్టర్ సయ్యద్ షేక్ తాజుద్దిన్ అహమ్మద్ ఖాద్రి చేతుల మీదుగా బహుమతులు అందించారు. -
ఆల్రౌండ్ విజేత అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 జూడో అమ్మాయిల విభాగంలో ఆల్రౌండ్ విజేతగా అనంత జట్టు నిలిచింది. ఆదివారం నగరంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో జరిగిన పోటీల్లో అన్ని విభాగాలలోను అనంత క్రీడాకారిణులు విజేతలుగా నిలిచి తమ సత్తా చాటారు. వ్యక్తిగత విభాగాలలో తృతీయ బహుమతిని ఇద్దరు క్రీడాకారులకు కేటాయించారు. అండర్–19 రాష్ట్రస్థాయి జూడో క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారంతో ముగుస్తాయని అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్్ట్స డైరెక్టర్ నిర్మల్కుమార్, శాంతరాజ్, నాగేంద్రమ్మ, వెంకటనామిశెట్టి, రాఘవేంద్రరావు, వెంకటప్ప పాల్గొన్నారు. విజేతల వివరాలు.. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు వరుసగా 36 కేజీల విభాగం వనజ(అనంతపురం), మాధురి(తూర్పుగోదావరి). 40 కేజీల విభాగం జ్యోతి(విశాఖపట్టణం), అపర్ణ(తూర్పుగోదావరి), అనూష(చిత్తూరు). 44 కేజీల విభాగం కౌసల్య (అనంతపురం), విజయభారతి (తూర్పుగోదావరి), జానకి(చిత్తూరు). 48 కేజీల విభాగం ప్రియాంక (అనంతపురం), తేజశ్రీ (చిత్తూరు), సుగుణ (తూర్పుగోదావరి). 52 కేజీల విభాగం కావ్య (అనంతపురం), జోహారికరెడ్డి (చిత్తూరు), అరుణ (తూర్పుగోదావరి). 56 కేజీల విభాగం విజయదుర్గ (తూర్పుగోదావరి), సంధ్యాబాయి(అనంతపురం), నేతాశ్రీ (కృష్ణా). 61 కేజీల విభాగం గౌతమి (అనంతపురం), జ్యోతిమౌనిక (తూర్పుగోదావరి), భార్గవి (చిత్తూరు), నిహారిక (విశాఖపట్టణం). 61 కేజీల పైబడిన విభాగం సుచిత్ర (అనంతపురం), తేజశ్విణి (చిత్తూరు), సంతోషికుమారి (తూర్పుగోదావరి). -
ఒక రకుల్... ఇద్దరు హీరోలు!
ఒక రాధ... ఇద్దరు కృష్ణులు అంటారు. ఇప్పుడు దీన్ని ఒక రకుల్.. ఇద్దరు హీరోలు అని మార్చాలి. ఎందుకంటే ఆమె కథానాయికగా నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. ఒకటి.. నాగచైతన్య సినిమా. మరోటి... సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’. ఈ రెండు చిత్రాల్లోనూ రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక కావడం విశేషం. వైజాగ్లో రకుల్ షిఫ్టులవారీగా ఈ రెండు చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారేమో. బిజీ బిజీగా షూటింగ్ చేస్తూనే ఆమె సరదాగా ఓ ఫొటో బయటపెట్టారు. అది నాగచైతన్యతో కలసి దిగిన ఫొటో. ఆ ఫొటోలో రకుల్ జస్ట్ కళ్లు మాత్రం చూపిస్తూ.. మిగతా ముఖాన్ని ముసుగులో దాచేశారు. పక్కనే నాగచైతన్య కూడా ఉన్నారు. ఇంతకీ రకుల్ ఇలా ముఖం దాచుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఈయన దర్శకత్వంలోనే నాగచైతన్య-రకుల్ల సినిమా తెరకెక్కుతోంది. ‘లుక్ బయటికి రాకూడదు’ అని దర్శకుడు కోరారట. అందుకే రకుల్ ముసుగు వేసుకున్నారు. ఇక.. వైజాగ్లో షూటింగ్ జరుపు కొంటున్న సాయిధరమ్ ‘విన్నర్’ విషయానికొస్తే.. ఈ చిత్రానికి గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తు న్నారు. అరకు అందాలను ఆస్వా దిస్తూ.. సాయిధరమ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘తెల్లవారుజాము షూటింగ్లో పాల్గొనడం భలేగా ఉంది’’ అంటూ ఓ ఫొటో ట్వీట్ చేశారీ యువ హీరో. అన్నట్లు... ఈరోజు అఖిల్ ఎంగేజ్మెంట్ కదా.. వైజాగ్లో షూటింగ్కి చిన్న బ్రేక్ చెప్పి, నాగచైతన్య హైదరాబాద్లో వాలిపోతారేమో! -
గెలుపే అతని లక్ష్యం!
ఆ యువకుడి ఇంటి పేరు గెలుపు. ఏం చేసినా అతడు ఓటమి అనేది ఎరగడు. దాంతో అందరూ అతణ్ణి ‘విన్నర్’ అంటుంటారు. ఈ విజేతకు ఓ సవాల్ ఎదురవుతుంది. ఇటు తండ్రి లక్ష్యాన్నీ, అటు ప్రేయసి మనసునూ గెలవాలి? దాని కోసం ఈ యువకుడు ఏం చేశాడు? గెలుపే లక్ష్యంగా ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘విన్నర్’. సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విదేశాల్లో షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘టర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో క్లైమాక్స్లోని యాక్షన్ సీన్లు తీశాం. ‘బాహుబలి’లోని మంచు కొండల్లో యాక్షన్ సీన్లు తీసిన స్టంట్ డెరైక్టర్ కలయాన్ ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం. అలాగే, ఉక్రెయిన్లో సాయిధరమ్తేజ్, రకుల్లపై రెండు పాటల్ని.. తేజ్, అనసూయలపై ఓ పాటను చిత్రీకరించాం. షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘జనవరితో చిత్రీకరణ పూర్తవుతుంది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. జగపతిబాబు, ముఖేశ్ రుషి, అలీ, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కళ: ప్రకాశ్, కూర్పు: ప్రవీణ్ పూడి, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, కెమేరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సమర్పణ: ‘బేబీ’ భవ్య. -
‘బాక్సింగ్’ విజేత జానీబాషా
గుంటూరు ఎడ్యుకేషన్ : శ్రీకాకుళంలో స్టూడెంట్స్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 జాతీయస్థాయి ఉషూ బాక్సింగ్ పోటీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి పి. జానీబాషా విజేతగా నిలిచాడని విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్బాబు తెలిపారు. అమరావతిరోడ్డులోని నారాయణ జోనల్ కార్యాలయంలో శనివారం జరిగిన విద్యార్ధి అభినందన సభలో తిలక్బాబు మాట్లాడుతూ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. తద్వారా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి, ఏకాగ్రత చేకూరుతాయన్నారు. పూణేలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జానీబాషా సంసిద్ధమయ్యాడని పేర్కొన్నారు. జానీ బాషా మాట్లాడుతూ గతంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు బంగారు పతకం సాధించానని, అంతర్జాతీయస్థాయి బాక్సింగ్లో సైతం విజేతగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అండర్– 17, 42, 52 కేజీల విభాగంలో విజేతకు శిక్షణ ఇచ్చిన శిక్షకుడు నరసింహారావు, తండ్రి మస్తాన్ ఖాన్ను జీఎం తిలక్బాబు అభినందించారు. కార్యక్రమంలో డీన్ వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్ కోటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బెంగళూరు ఎఫ్సీకి నిరాశ
ఏఎఫ్సీ కప్ విజేత ఇరాక్ ఎయిర్ఫోర్స్ క్లబ్ దోహా: ఆసియా ఫుట్బాల్ క్లబ్ల కప్ (ఏఎఫ్సీ కప్) ఫైనల్కు చేరిన తొలి భారతీయ జట్టుగా రికార్డు సృష్టించిన బెంగళూరు ఎఫ్సీ జట్టుకు తుది పోరులో నిరాశ తప్పలేదు. శనివారం జరిగిన ఫైనల్లో ఇరాక్కు చెందిన ఎరుుర్ఫోర్స్ క్లబ్ 1-0తో బెంగళూరు జట్టును ఓడించింది. 70వ నిమిషంలో హమ్మది అహ్మద్ ఆ జట్టుకు గోల్ అందించాడు. విజేత ఎరుుర్ఫోర్స్ క్లబ్కు 10 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు) రన్నరప్ బెంగళూరుకు 5లక్షల డాలర్లు (రూ.3.25కోట్లు) నగదు బహుమతి లభించింది. -
విన్నర్కు భారీ బడ్జెట్
మెగా వారసుల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్గా పేరు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్తో సత్తా చాటిన సాయి, ఇప్పుడు తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకునే పనిలో పడ్డాడు. గత సినిమాలతో 20 కోట్ల వరకు షేర్ సాధించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాతో మరో అడుగు ముందుకేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమాలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టర్కీ, ఉక్రేయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు సాయి ధరమ్తేజ్. -
‘ఫార్మసీ క్రికెట్’ విజేత జొన్నలగడ్డ సిద్ధార్థ
నరసరావుపేట రూరల్: ఏఎంరెడ్డి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన మూడు జిల్లాల ఫార్మసీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్లో జొన్నలగడ్డ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్గా చేబ్రోలు హానుమయ్య ఫార్మసీ కళాశాల జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న జొన్నలగడ్డ సిద్ధార్థ కళాశాల జట్టు 12 ఓవర్లలో 77 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన చేబ్రోలు హానుమయ్య కళాశాల జట్టు 12 ఓవర్లలో 59 పరుగులకే అలౌట్ అయింది. బహుమతి ప్రదానోత్సవ సభలో కళాశాల కార్యదర్శి అట్లూరి శాంతి, డైరెక్టర్ గున్నం చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, ట్రోఫీని విజేతలకు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సుదాకరభాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పవన్ను కాదని.. సాయి ధరమ్తో..!
బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ఇప్పుడు వెండితెర మీద సత్తాచాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటి లీడ్ రోల్స్ కోసం ఎదురుచూస్తోంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా, క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన ఈ బ్యూటి ఇప్పుడు మరో కొత్త అవతారం కనిపించేందుకు రెడీ అవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించని ఈ భామ.., ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ఆడి పాడేందుకు రెడీ అవుతుంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్కు అనసూయ ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అనసూయ స్పెషల్ సాంగ్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
‘బాస్కెట్ బాల్’ విజేత జేకేసీ జట్టు
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ బాస్కెట్బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ సోమవారం ముగిసింది. స్కూల్ స్థాయి బాలికల విభాగంలో జేకేసీ జట్టు విజేతగా నిలువగా, కేకేఆర్ గౌతమ్ స్కూల్ జట్టు రన్నరప్ టైటిల్ సాధించింది. బాలుర విభాగంలో లయోలా స్కూల్ జట్టు విజేతగా నిలువగా, లయోలా–బి జట్టు రన్నరప్గా నిలిచింది. కళాళాల స్థాయి పురుషుల విభాగంలో నలందా ఇంజినీరింగ్ కాలేజీ టైటిల్ సాధించగా, ఏసీ కళాశాల జట్టు రన్నరప్గా నిలిచింది. అనంతరం స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. -
జాతీయ చెస్ పోటీల్లో సంతోష్ ప్రతిభ
పెద్దాపురం : ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పెద్దాపురానికి చెందిన విద్యార్థి ముప్పన జ్ఞానసాయి సంతోష్ ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–8 చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చి ప్రథమ స్థానం సాధించాడు. సంతోష్ను మన పెద్దాపురం ఫేస్బుక్ టీమ్ సోమవారం ప్రత్యేకంగా అభినందించింది. -
మహిళల క్రికెట్ విజేత రైల్వేస్ జట్టు
రన్నరప్ మహారాష్ట్ర జట్టు గుంటూరు స్పోర్ట్స్: సీనియర్ ఉమెన్ వన్డే క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతగా రైల్వేస్ జట్టు నిలిచింది. మహారాష్ట్ర జట్టు రన్నరప్గా నిలిచింది. జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమి, పేరేచర్లలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్లలో రైల్వేస్ జట్టు 12 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ జట్లు చెరో నాలుగు పాయింట్లు సాధించాయి. అయితే రన్రేట్ ఆధారంగా మహారాష్ట్ర జట్టును రన్నరప్గా ప్రకటించారు. మంగళవారం జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమిలో జరిగిన వన్డే మ్యాచ్లో రైల్వేస్ జట్టు 139 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు 43.2 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది. పేరేచర్లలో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ జట్టు 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేత రైల్వేస్, రన్నరప్ మహారాష్ట్ర జట్లకు ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మావయ్య విజేత.. మేనల్లుడు విన్నర్!
‘విజేత’.. 30 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా. ఇప్పుడిదే పేరుతో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. అప్పటి ‘విజేత’ను ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు ‘విన్నర్’ని చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. శనివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘కన్నతండ్రితో పాటు ప్రేమించిన అమ్మాయి మనసు గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రకథ’’ అన్నారు గోపీచంద్ మలినేని. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘హీరో పాజిటివ్ క్యారెక్టర్కి తగ్గట్టే మంచి టైటిల్ కుదిరింది. ఉక్రెయిన్లో పాటల్ని, ఇస్తాంబుల్లో క్లైమాక్స్ను చిత్రీకరిస్తాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్గా, జగపతిబాబు, ముఖేశ్ రుషి, అలీ, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, ఫైట్స్: రవివర్మ, కెమేరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, సమర్పణ: బేబీ భవ్య. -
విన్నర్గా మెగా హీరో
వరుస హిట్స్తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. శనివారం సాయిధరమ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. స్టైలిష్గా డిజైన్ చేసిన ఈ పోస్టర్లో సినిమా టైటిల్ను కూడా రివీల్ చేశారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే విన్నర్ అనే టైటిల్నే ఫిక్స్ చేశారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి గత చిత్రం తిక్క ఆకట్టుకోలేకపోవటంతో ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. టైటిల్ డిజైన్ చూస్తే సినిమా హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి ధమర్ తేజ్ ఫ్యాషన్ డిజైనర్గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండింటిలో ఏది నిజం అన్న విషయం తెలియాలంటే టీజర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారికతోపాటు మరో ముగ్గురు నినో బత్సియాష్విలి (జార్జియా), అనా ఉషెనినా (ఉక్రెయిన్), తానియా సచ్దేవ్ (భారత్) 5.5 పాయి0ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... హారికకు టాప్ ర్యాంక్ లభించింది. నినో బత్సియాష్విలి రెండో స్థానంలో, అనా ఉషెనినా మూడో స్థానంలో, తానియా నాలుగో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్ను హారిక కేవలం 15 ఎత్తుల్లో అర్మేనియా గ్రాండ్మాస్టర్ సెర్గీ మూవ్సెసియాన్తో ‘డ్రా’గా ముగించింది. ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి0ది. ఏడో రౌండ్లో హారిక మహిళల ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ హు ఇఫాన్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది. మొత్తం 133 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ నుంచి 26 మంది బరిలోకి దిగారు. తెలుగు క్రీడాకారులు ఎం.ఆర్. లలిత్ బాబు 5.5 పాయి0ట్లతో 28వ స్థానంలో, హర్ష భరతకోటి 4 పాయి0ట్లతో 79వ స్థానంలో, కోటిపల్లి సాయి నిరుపమ 3.5 పాయి0ట్లతో 110వ స్థానంలో నిలిచారు. -
సాగరతీరాన సౌందర్య కెరటాలు
కాకినాడ కల్చరల్: సాగరతీర నగరం కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్ హాలు.. నవ్వుల పువ్వులు విరబూసే సొగసుకత్తెలకు, హŸయలు, వయ్యారాల నడుమ జరిగిన చూడముచ్చటైన పోటీలకు వేదికైంది. డ్రీమ్ మేకర్స్జ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి (లేట్ నైట్) జరిగిన మిస్ కాకినాడ –2016 ఫైనల్ పోటీలో స్థానిక దేవాలయం వీధికి చెందిన పూజా జైన్ మిస్ కాకినాడ కిరీటం(విన్నర్) దక్కించుకొంది. దేవాలయం వీధికే చెందిన అనీషా అగర్వావాల్ రన్నరప్–1గా, జగన్నాథపురానికి చెందిన కె.ధరణి రన్నరప్–2గా నిలిచారు.విజేత పూజా జైన్కు బహుమతిగా రూ.లక్ష, రన్నర్లు అనీషా, ధరణిలకు రూ.50 వేల చొప్పున నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి డ్రీమ్ మేకర్స్జ్ ఈవెంట్స్ అధినేత్రి శాంతి అధ్యక్షత వహించారు. సామా స్కూల్ ఎండీ రాజీ, బ్యూటీషియన్ ట్రైనర్ రమ, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సూర్య, మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పి.వంశీ మిస్–కాకినాడ ఆడిషన్స్కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చక్కటి ఆశయంతో ఏర్పాటు చేసిన మిస్ కాకినాడ ఈవెంట్కు ఇంత ఆదరణ చేకూర్చినందుకు డ్రీమ్ మేకర్స్జ్ బృందం కాకినాడ ప్రజలకు, ప్రత్యేకంగా యువతకు అభినందనలు తెలిపారు. -
సైకిల్పోలో విజేత కృష్ణా
– రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్న కర్నూలు బనగానపల్లె రూరల్: రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ స్థానంతో కర్నూలు జిల్లా జట్టు సరిపెట్టుకుంది. స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం పాఠశాల క్రీడామైదానంలో ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి వచ్చిన సబ్ జూనియర్స్, జూనియర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో జూనియర్ విభాగంలో కృష్ణా జిల్లా జట్టు 2–1 గోల్స్తో కర్నూలు జట్టుపై విజయం సాధించి బంగారు పతకం సాధించింది. అలాగే రన్నర్స్ స్థానంతో కర్నూలు జట్టు రజత పతకం సాధించినట్లు క్రీడాల నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్రెడ్డి తెలిపారు. బహుమతుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ..గెలుపొందిన విజేతలకు ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. వీరు త్వరలో కేరళలో జరిగే జాతీయ స్థాయి సైకిల్ పోలో చాంపియన్షిప్లో పాల్గొంటారన్నారు. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడ ప్రతిభకనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, క్రీడారంగం ఎడిటర్ శివ పరమేశ్‡, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, స్కూల్ డైరెక్టర్ రవితేజా రెడ్డి,హెచ్ఎం కమల్తేజా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ సురేందర్, ఒలింపిక్ సంఘం అబ్జర్వర్ విజయకుమార్ తదితర క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దక్షిణాసియా చెస్ చాంప్ రాఘవ్
హైదరాబాద్: దక్షిణాసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు రాఘవ్ శ్రీవాత్సవ్ టైటిల్ సాధించాడు. జమ్ములో జరిగిన ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లకు గాను అతను 8 పారుుంట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో పరాజయం ఎరుగని రాఘవ్ ఏడు గేముల్లో గెలిచి... మరో రెండు గేముల్ని డ్రా చేసుకున్నాడు. పి.కె.సురేశ్ (కేరళ)కూడా 8 పారుుంట్లతో ఉన్నప్పటికీ టైబ్రేక్లో రాఘవ్ను విజేతగా ప్రకటించారు. ఇతనికి ట్రోఫీతో పాటు రూ. 2 లక్షల ప్రైజ్మనీ దక్కగా, రన్నరప్గా నిలిచిన కేరళ కుర్రాడికి రూ. లక్షా 25 వేల నగదు బహుమతి లభించింది. భారత్తో పాటు బంగ్లాదేశ్, నేపాల్లకు చెందిన సుమారు 400 మంది ఆటగాళ్లు ఇందులో పోటీపడ్డారు. రాష్ట్రానికి చెందిన మరో ఆటగాడు శ్రీతన్ సాయ్పురికి ప్రత్యేక బహుమతి లభించింది. వీరిద్దరిని తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు అభినందించారు. -
అమ్మవారి సేవలో సింధు
తిరుచానూరు: ఒలింపిక్ బ్యాడ్మింటన్ రజత విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్లు శనివారం రాత్రి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు జీ.భానుప్రకాష్రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రవి స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఈ క్రీడాదిగ్గజాలకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి దర్శనార్థం వీరు తిరుమలకు వెళ్లారు. -
బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విజేత ‘పశ్చిమ’
ప్రొద్దుటూరు కల్చరల్ : రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధా కళ్యాణి, హారిక విజేతలుగా నిలిచారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని జార్జ్ కారొనేషన్lక్లబ్లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మెడల్స్, షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్యాడ్మిం టన్ అభివృద్ధికి అకాడమీలను నెలకొల్పుతామని చెప్పారు. -
క్రికెట్ విజేత కర్నూలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో గత నాలుగురోజులుగా నిర్వహిస్తున్న ముండ్ల చంద్రశేఖరరెడ్డి స్మారక సౌత్జోన్ అంతర్ జిల్లాల మహిళా క్రికెట్ పోటీల విజేతగా కర్నూలు జట్టు నిలిచింది. విజేతలకు ముండ్ల చంద్రశేఖరరెడ్డి సతీమణి అరుంధతమ్మ, ఆయన మనుమడు ముండ్ల అక్షయ్రెడ్డి ట్రోఫీలను అందజేశారు. టాస్గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జట్టులోని హరిప్రసన్న 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 14 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసి విజయం సాధించింది. -
మిస్ ఆసియాగా ఫిలిఫ్పీన్స్ యువతి
-
'నా పిల్లలు బిగ్ స్క్రీన్పై చూస్తారట'
ముంబయి: తాను నటించిన మొహంజదారో చిత్రం ఇప్పటికే ఓ విజేత అని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అన్నారు. ఈ నెల(ఆగస్టు)12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో హృతిక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మొహంజదారో చిత్ర విశేషాలు చెబుతూ విజయం అనేది మనం దేనిని ప్రేమిస్తామో దానిని చేయడంలో ఉంటుందని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో విజయాలు, అపజయాలు ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు. ఇష్టపడి పనిచేయడంలోనే విజయం ఉంటుందని అన్నారు. ఈ సినిమా కోసం తానెంతో శ్రద్ధపెట్టి పనిచేశానని, గాయాలు కూడా అయ్యాయని అన్నారు. గౌరీకర్ తో తనకు ఇది రెండో చిత్రం అని, తొలిచిత్రం జోదా అక్బర్ సినిమాతోనే ఆయనపై తనకు విశ్వాసం పెరిగిందని, ఇది ఇప్పుడు మరింత రెట్టింపయిందని, ఆయన మంచి విలువలు ఉన్న దర్శకుడు అని హృతిక్ చెప్పారు. ఈ సినిమాను మీ కుమారులు చూశారా అని ప్రశ్నించగా.. వారు ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పైనే చూడాలని అనుకున్నారని, అందుకే ప్రివ్యూలో చూడలేదని, వారి రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు ఇంకా తెలియదని చెప్పారు. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పారు. -
టీటీలో ‘అనంత’ సత్తా
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో అనంతపురానికి చెందిన శ్రేష్ట, నాగశ్రావణి సత్తా చాటారు. ఈ నెల 15 నుంచి 17 వరకు గుంటూరులో ఫస్ట్ ఏపీ స్టేట్ టీటీ ర్యాంకింగ్ పోటీలు జరిగాయి. అందులో అండర్ –12 విభాగంలో శ్రేష్ట విజేతగా నిలిచింది. తొలి రాష్ట్రస్థాయి టైటిల్ను సాధించడం విశేషం. నాగశ్రావణి జూనియర్ విన్నర్గా, యూత్, ఉమెన్ విభాగంలో రన్నర్గా నిలిచింది. వీరి ప్రతిభ పట్ల టీటీ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అక్బర్ సాహెబ్, కోచ్ రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
లెవన్ వండర్స్ జట్టు విజేత
గుంటూరు రూరల్ : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని చలపతి విద్యా సంస్థల అధినేత వైవీ ఆంజనేయులు తెలిపారు. మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో జరుగుతున్న కార్పోరేట్ స్థాయి పట్వా ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్ల నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికితీయడం అభినందనీయమని చెప్పారు. ఫైనల్ మ్యాచ్లో లెవన్ వండర్స్ జట్టు క్యాపిటల్రాక్స్ జట్ల మధ్య జరిగిన పోరులో టాస్ గెలిచిన క్యాపిటల్రాక్స్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లెవన్ వండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాపిటల్రాక్స్ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లెవన్ వండర్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ పోటీలో మ్యాన్ ఆఫ్దిమ్యాచ్గా బుల్లిబాబు(లెవన్వండర్స్), మాన్ ఆప్ది టోర్నీగా రాము(లెవన్వండర్స్) నిలిచారు. అత్యధిక పరుగులు చేసి సిక్సర్లతో బాషా(గుంటూరు మారిమన్స్), అత్యధికS వికెట్లతో నాగమల్లేశ్వరరావు(లెవన్వండర్స్)లకు వైవీ ఆంజనేయులు ప్రత్యేక బహుమతులు అందజేశారు. -
అండర్–23 క్రికెట్ విజేత కడప జట్టు
కడప స్పోర్ట్స్: అండర్–23 అంతర్ జిల్లాల ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీల్లో కడప జట్టు విజేతగా నిలిచింది. కృష్ణాజిల్లా మూలపాడులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో ఆదివారం కడప జట్టు విజేతగా నిలిచింది. తూర్పుగోదావరి జట్టుతో నిర్వహించిన మ్యాచ్లో కడప జట్టు విజేతగా నిలిచింది. తొలతు బ్యాటింగ్కు దిగిన తూర్పుగోదావరి జట్టు 128 పరుగులు చేసింది. కడప బౌలర్ భరద్వాజ్ 4 వికెట్లు, రఫీ 2, సుదర్శన్∙3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 255 పరుగులు చేసింది. జట్టులోని హరి 53, నరేన్రెడ్డి 45, జయవర్ధన్ 34 పరుగులు చేశారు. దీంతో కడప జట్టు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు రెండవ ఇన్నింగ్స్లో 182 పరుగులు చేసింది. కడప బౌలర్లు నరేన్రెడ్డి 5, రఫీ 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. దీంతో 55 పరుగుల విజయలక్ష్యంతోబరిలోకి దిగిన కడప జట్టు 1 వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది జట్టులోని జయవర్ధన్ 35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో కడప జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విజేతలకు ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. కాగా జిల్లా జట్టు తొలిసారి ఎలైట్ గ్రూపులో విజేతగా నిలవడం పట్ల కడప క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్వి సంజయ్రెడ్డి, సౌత్జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, ఉమామహేశ్వర్, ఏసీఏ ట్రైనర్ ఆనంద్లు అభినందించారు. -
పోర్చుగల్ ఫెజ్ ఈసో
-
పోర్చుగల్ ఫెజ్ ఈసో
95 సంవత్సరాలు... పోర్చుగల్ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టి. ఈ ఆటంటే ఆ దేశానికి ‘పిచ్చి’. ఫుట్బాల్ ముందు ప్రాణాలు కూడా లెక్కలేవనేంత ‘ప్రేమ’. అంతర్జాతీయ యవనికపై అలుపెరగని పోరాటం చేసినా.. ఎంత కష్టపడినా... ఎంతమంది దిగ్గజాలు వచ్చినా ఏ ‘కప్’ కూడా అందలేదనే ఆవేదన. ఏ పెద్ద టోర్నీ జరిగినా దేశం ప్రతిసారీ ఊపిరిబిగబట్టి చూసింది. ఆ నిరీక్షణకు ఇంతకాలానికి తెరపడింది. ఆ ఆవేదన ఇన్ని సంవత్సరాలకు ఆనందభాష్పంగా మారింది. ఇంతకాలానికి ‘యూరో’కా అంటూ ఆ దేశం పొలికేక పెట్టింది. అవును... పోర్చుగల్ ఫెజ్ ఈసో... పోర్చుగల్ సాధించింది. తమ చరిత్రలో తొలిసారి యూరో ఫుట్బాల్ కోటలో జెండా పాతింది. అంచనాలు తలకిందులయ్యాయి. అందలం ఎక్కుతుందని భావించిన ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ తుది మెట్టుపై చతికిలపడింది. ఎవరూ ఊహించనిరీతిలో పోర్చుగల్ జట్టు తొలిసారి యూరో చాంపియన్గా అవతరించింది. సొంతగడ్డపై ఫేవరెట్ ఫ్రాన్స్ను బోల్తా కొట్టించిన పోర్చుగల్ ఎట్టకేలకు అంతర్జాతీయ టైటిల్ లోటును తీర్చుకుంది. 12 ఏళ్ల క్రితం అందినట్టే అంది చేజారిన యూరో ట్రోఫీని ఈసారి ఒడిసి పట్టుకుంది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడినా... మిగతా ఆటగాళ్లు పట్టుదలతో పోరాడి పోర్చుగల్ను విజేతగా నిలిపారు. తమ సారథి రొనాల్డోకు చిరస్మరణీయ కానుకను ఇచ్చారు. తొలిసారి యూరో టైటిల్ నెగ్గిన పోర్చుగల్ ≈ ఫైనల్లో ఫ్రాన్స్పై 1-0తో విజయం ≈ అదనపు సమయంలో గోల్ చేసిన ఎడెర్ ≈ గాయంతో మధ్యలో వైదొలిగిన రొనాల్డో ≈ ఆధిపత్యం చలాయించినా ఆతిథ్య జట్టుకు నిరాశే పారిస్: అతి కష్టమ్మీద లీగ్ దశను దాటిన పోర్చుగల్ ఆఖరికి యూరో చాంపియన్గా అవతరించి సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్లో పోర్చుగల్ 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మ్యాచ్ 109వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఎడెర్ 25 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరేరీతిలో కుడి కాలితో సంధించిన శక్తివంతమైన కిక్ ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ లక్ష్యానికి చేరింది. ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత పోర్చుగల్ ఆటగాళ్లు మిగిలిన 11 నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యాయి. యూరో టోర్నమెంట్ చరిత్రలో ఓ ఫైనల్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో గోల్ కాకపోవడం ఇదే తొలిసారి. గోడలా పాట్రిసియో, పెపె రికార్డుస్థాయిలో మూడోసారి యూరో టైటిల్ సాధించాలని ఆశిస్తూ బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే ఫైనల్ చేరే క్రమంలో ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోని ఫ్రాన్స్కు అంతిమ సమరంలో మాత్రం చుక్కెదురైంది. పలుమార్లు ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా... పోర్చుగల్ గోల్కీపర్ రుయ్ పాట్రిసియో, డిఫెండర్ పెపె అడ్డుగోడలా నిలబడి ఫ్రాన్స్ ఆశలను నిర్వీర్యం చేశారు. మరోవైపు పోర్చుగల్ స్టార్ ఆటగాడు రొనాల్డోను కట్టడి చేయాలనే లక్ష్యంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు కనిపించారు. ఈ క్రమంలో రొనాల్డోను పలుమార్లు మొరటుగా నిలువరించారు. తొమ్మిదో నిమిషంలో పాయెట్ ధాటికి రొనాల్డో మోకాలికి గాయమైంది. 25వ నిమిషంలో నొప్పికి తాళలేక మైదానంలో కూలబడి మిగిలిన మ్యాచ్కు దూరమయ్యాడు. అంతకుముందు తొమ్మిదో నిమిషంలో గ్రిజ్మన్ కొట్టిన హెడర్ షాట్ను పోర్చుగల్ గోల్కీపర్ పాట్రిసియో అద్భుతంగా అడ్డుకున్నాడు. సారథి కోసం సైనికుల్లా... రొనాల్డో మైదానం వీడటంతో ఇక ఫ్రాన్స్ జట్టుకు ఎదురు ఉండదని భావించినా అలా జరగలేదు. తమ సారథి కోసం పోర్చుగల్ సహచరులు సైనికుల్లా పోరాడారు. 34వ నిమిషంలో సిసోకో కొట్టిన షాట్ను పోర్చుగల్ కీపర్ పాట్రిసియో సమర్థంగా నిలువరించాడు. ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ తమ ప్రయత్నాలను కొనసాగించింది. కానీ వారికి ఆశించిన ఫలితం దక్కలేదు. 79వ నిమిషంలో రెనాటో శాంచెస్ స్థానంలో ఎడెర్ను సబ్స్టిట్యూట్గా పోర్చుగల్ బరిలోకి దించింది. 80వ నిమిషంలో క్వారెస్మా కొట్టిన షాట్ను ఫ్రాన్స్ గోల్కీపర్ నిలువరించాడు. 84వ నిమిషంలో సిసోకో షాట్ను పాట్రిసియో మళ్లీ అడ్డుకున్నాడు. ఇంజ్యూరీ సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు గిగ్నాక్ కొట్టిన షాట్ గోల్పోస్ట్ బార్కు తగిలి బయటకు వెళ్లింది. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు గోల్ చేయకపోవడంతో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చారు. 15 నిమిషాల తొలి అర్ధభాగంలోనూ గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో నాలుగు నిమిషాలు ముగిశాక ఎడెర్ సుదూరం నుంచి కొట్టిన షాట్ ఫ్రాన్స్ గోల్పోస్ట్లోనికి వెళ్లడంతో పోర్చుగల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయడంలో విఫలమై ఓటమి భారాన్ని మూటగట్టుకుంది. 41 ఫ్రాన్స్ జట్టుపై పోర్చుగల్ 41 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. 56 సొంతగడ్డపై జరిగిన ప్రధాన టోర్నమెంట్లో ఫ్రాన్స్ ఓడిపోవడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1 ఓ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఒక జట్టు లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచి... టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. 2 మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1984లో) తర్వాత ఒకే యూరో టోర్నీలో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన రెండో ప్లేయర్గా గ్రిజ్మన్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. 2 ఈ టోర్నీలో ఫ్రాన్స్ ప్లేయర్ గ్రిజ్మన్కు లభించిన అవార్డులు. అతనికి గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్-6 గోల్స్), గోల్డెన్ బాల్ (ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ) పురస్కారాలు దక్కాయి. 10 యూరో టైటిల్ను సాధించిన పదో జట్టు పోర్చుగల్. జర్మనీ, స్పెయిన్ మూడేసిసార్లు, ఫ్రాన్స్ రెండుసార్లు విజేతగా నిలిచాయి. సమష్టిగా సాధించారు... యూరో కప్ సాధించిన అనంతరం స్వదేశం చేరిన పోర్చుగల్ జట్టుకు అభిమానులనుంచి భారీ ఎత్తున ఘన స్వాగతం ల భించింది. ఆటగాళ్లతో రాజధాని లిస్బన్కు వచ్చిన ప్రత్యేక విమానాన్ని రంగు రంగుల వాటర్ కెనాన్లతో ముంచెత్తారు. అనంతరం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత జట్టు సభ్యులు దేశాధ్యక్షుడు మార్సెల్ రెబెలో డిసౌజాను కలిశారు. ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ కమాండర్స్’ అవార్డుతో జట్టును సత్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. లీగ్ దశలో మూడు మ్యాచ్లూ డ్రా... అదృష్టం కొద్దీ అత్యుత్తమ మూడో స్థానపు జట్లలో నిలవడంతో నాకౌట్ అవకాశం ... టోర్నీ ఆరంభం సమయంలో ఎవరికీ అంచనాల్లేవు... అయినా పోర్చుగల్ సాధించి చూపించింది. ఫైనల్ సహా ఏడు మ్యాచ్లలో ఒక్క సారి మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవగలిగినా, ఒకే యూరోలో మూడు సార్లు అదనపు సమయం ఆడిన తొలి జట్టుగా నిలిచినా... పోర్చుగల్ సాధించిన విజయం విలువ తక్కువేమీ కాదు. ‘మాకు గెలిచే అర్హత లేదని చాలా మంది చెప్పుకుంటే చెప్పుకోనీ. మేం మాత్రం సగర్వంగా తిరిగి వెళుతున్నాం. మేం పావురాల్లా సాధారణంగా కనిపించినా, పాముల్లా తెలివితేటలు ప్రదర్శించాం’ అని ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ చెప్పడం ఎలాంటి స్థితినుంచి పోర్చుగల్ చాంపియన్గా నిలిచిందో సూచిస్తుంది. పోర్చుగల్ టీమ్ వన్ మ్యాన్ ఆర్మీ ఎంత మాత్రం కాదు... ఇన్నాళ్లూ రొనాల్డో ఒక్కడే అంతా అయి కనిపించిన ఆ జట్టు ఇప్పుడు సమష్టి తత్వంతో యూరో చాంపియన్గా నిలిచింది. అతను లేకుండా కూడా ఫైనల్లో సత్తా చాటి టైటిల్ సాధించగలగడమే మరో విశేషం. ఫ్రాన్స్ను వారి సొంతగడ్డపై 41 ఏళ్ల తర్వాత చిత్తు చేసి చాంపియన్గా నిలవడం అనేది అసాధారణం. ఈ విజయంలో జట్టులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. కెప్టెన్ రొనాల్డో నుంచి ఫైనల్ హీరో ఎడెర్ వరకు అంతా తమ పరిధిలో చెలరేగారు. వీరందరినీ నడిపించిన సాంటోస్ వ్యూహ చతురతా ఉంది. కోచ్ మార్గదర్శనంలో... చాలా మంది భావిస్తున్నట్లు ఇదేమీ అనుకోకుండా దక్కిన గెలుపు కాదు. ఐస్లాండ్, ఆస్ట్రియాలతో డ్రా తర్వాత హంగేరీ చేతిలో చిత్తుగా ఓడబోయి లక్కీగా డ్రా చేసుకోగలిగిన జట్టు ఇప్పుడు చాంపియన్గా నిలిచింది. క్లిష్ట సమయంలో కోచ్ సాంటోస్ సమర్థంగా తన బాధ్యత నిర్వర్తించారు. ఆయన కోచ్గా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్లోనే ఆల్బేనియా చేతిలో పోర్చుగల్ ఓడింది. అయితే ఆ తర్వాత 14 మ్యాచ్లలో జట్టుకు పరాజయం లేదు. ఫైనల్లో ఎడెర్ను అనూహ్యంగా మైదానంలోకి దించిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. అన్నింటికి మించి ఇతర పెద్ద జట్లతో పోలిస్తే ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా మంచి వాతావరణం ఉండేలా ఆయన చూశారు. ఒకరిని మించి మరొకరు టోర్నీలో సహజంగానే స్టార్ ప్లేయర్ రొనాల్డో ముద్ర కనిపించింది. అంతా అతని చుట్టే తిరిగినట్లు అనిపించినా ఇతర ఆటగాళ్ల ప్ర దర్శన కూడా జట్టును గెలిపించింది. పెపె అద్భుత డిఫెన్స్ జట్టు కు బలంగా మారింది. పోలండ్పై గోల్ చేసిన 18 ఏళ్ల కొత్త కుర్రా డు సాంచెజ్ మ్యాచ్ను పెనాల్టీల వైపు మళ్లించాడు. ఫైనల్లో గోల్ కీపర్ పాట్రిసియో రక్షణ గోడను ఛేదించడం ఫ్రాన్స్ వల్ల కాలేదు. ఇక ఒక్క గోల్తో ఎడెర్ హీరోగా మారిపోయాడు. ఇంతకు ముందు 28 మ్యాచ్లు ఆడినా కేవలం ఫ్రెండ్లీలలో 3 గోల్స్ చేసిన అతను జట్టులో అందరికంటే తక్కువ గుర్తింపు ఉన్న ఆటగాడు. కానీ ఫైనల్ ద్వారా ఇప్పుడు అతని స్థాయి పెరిగిపోవ డం ఖాయం. ఇక పోర్చుగల్ తదుపరి లక్ష్యం 2018 ప్రపంచకప్. రూ. 189 కోట్లు యూరో టైటిల్ సాధించిన పోర్చుగల్కు ప్రైజ్మనీ రూపంలో మొత్తం 2 కోట్ల 55 లక్షల యూరోలు (రూ. 189 కోట్లు) లభించాయి. రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 2 కోట్ల 45 లక్షల యూరోలు (రూ. 181 కోట్లు) దక్కాయి. - సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
-
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
పారిస్: యూరో కప్లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు. స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో గాయంతో ఫస్ట్ ఆఫ్లోనే మైదానాన్ని వీడినా పోర్చుగల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడింది. యూరోకప్ విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 2004 యూరోకప్లో ఆతిథ్య జట్టుగా ఫైనల్కు చేరిన పోర్చుగల్.. 1-0 గోల్స్ తేడాతో గ్రీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ను అదే స్కోరుతో ఓడించి పోర్చుగల్ యూరోకప్ కలను నెరవేర్చుకోవటం విశేషం. -
సాయికి షాకిచ్చిన విజయ్
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్కు ఓ తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి డైరెక్షన్లో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు విన్నర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే సాయి అనుకున్న టైటిల్ను ముందుగానే తన సినిమా డబ్బింగ్ వర్షన్కు ఎనౌన్స్ చేశాడు తమిళ స్టార్ హీరో విజయ్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తేరి సినిమా చేసిన విజయ్, ఆ సినిమాను తమిళ్తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా అనువాద హక్కులు సొంతం చేసుకోవటంతో తెలుగులో కూడా తేరి సినిమా భారీ రిలీజ్కు రెడీ అవుతోంది. తేరి సినిమా తెలుగు వర్షన్కు విన్నర్ అనే టైటిల్ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికే ఈ టైటిల్ మీద ఆశపడుతున్న సాయి, దిల్ రాజు కోసం తన టైటిల్ను త్యాగం చేస్తాడా..? లేక మరోసారి టాలీవుడ్లో టైటిల్ వార్కు తెర లేస్తుందా..? చూడాలి. -
పాట రాయండి.. భారీ బహుమతి గెల్చుకోండి
న్యూఢిల్లీ: యోగాపై అవగాహన ఉందా.. సాహిత్య రచనలో ప్రవేశం ఉందా.. పాటలు బాగా పాడతారా? అయితే ఆ అయిదు లక్షలు మీరు గెల్చుకోవచ్చు... ఏంటీ.. అంతా కన్ఫ్యూజింగా ఉందా.. 'యోగగీతం పంపండి.. 5 లక్షలు గెలుచుకోండి' అని కేంద్రం ఆహ్వానిస్తోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీ నిర్వహిస్తోంది. దీనికోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. తమకు అందిన వాటిల్లో ఉత్తమపాటను ఎంపికచేసి విజేతను ప్రకటిస్తారు. అత్యత్తుమ పాటగా నిలిచి దానికి రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. వ్యక్తిగతంగా గానీ, లేదా గ్రూప్గా గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చు. 3 - 5 నిమిషాల నిడివిలో, ఎంపీ3 ఆడియో ఫార్మాట్లో ఉన్న యోగ గీతాన్ని పోటీకి పంపవచ్చు. అయితే దీని సైజ్ 5ఎంబీ దాటకూడదనే నిబంధన విధించింది. పోటీలో పాల్గొనేవాళ్లు మార్చి 31వ తేదీలోగా తమ ఎంట్రీలను inf-moayush@gov.in అనే ఈమెయిల్ ఐడీకి పంపాలి. మరిన్ని వివరాలకు www.indiamedicine.nic.in అనే వెబ్సైట్ ను పరిశీలించుకోవచ్చని తెలిపింది. అయితే మరో ముఖ్య విషయం ఏమిటంటే పాట హిందీ భాషలో మాత్రమే ఉండాలి. -
హాప్మన్ కప్ విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో ఉక్రెయిన్పై విజయం పెర్త్: ప్రతిష్టాత్మక హాప్మన్ కప్ మిక్స్డ్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా 17 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 2-0తో ఉక్రెయిన్ను ఓడించింది. పురుషులు, మహిళలు కలిపి ఆడే ఈ టీమ్ ఈవెంట్లో చివరిసారి 1999లో కంగారూలు నెగ్గారు. ఉక్రెయిన్తో ఫైనల్లో తొలుత మహిళల సింగిల్స్లో గావ్రిలోవా 6-4, 7-6 (8/6)తో స్విటోలినాపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో కిరియోస్ 6-3, 6-4తో డొల్గోపొలోవ్పై గెలిచి 2-0తో జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఫలితం రావడంతో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ నిర్వహించలేదు. 2003 తర్వాత ఆస్ట్రేలియా ఈ టోర్నీ ఫైనల్కు చేరడం కూడా ఇదే తొలిసారి. -
బీపీఎల్ విజేత విక్టోరియన్స్
మిర్పూర్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టైటిల్ను కొమిల్లా విక్టోరియన్స్ జట్టు సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో విక్టోరియన్స్ 3 వికెట్ల తేడాతో బారిసల్ బుల్స్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బారిసల్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్ముదుల్లా (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), షహ్రియార్ నఫీస్ (31 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రసన్న (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం విక్టోరియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా, అహ్మద్ షహజాద్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అయితే 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సిన దశలో బరిలోకి దిగిన అలోక్ కపాలి (28 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా బౌండరీలు బాదిన అతను ఆఖరి బంతికి తమ జట్టును గెలిపించాడు. సమీ వేసిన ఆఖరి ఓవర్లో కొమిల్లా జట్టు 13 పరుగులు రాబట్టి టోర్నీ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో 2012, 2013లలో ఢాకా గ్లాడియేటర్స్ టైటిల్ సాధించగా, గత ఏడాది ఈ టోర్నీ జరగలేదు. మూడు సార్లూ టైటిల్ గెలిచిన జట్టుకు సీనియర్ బౌలర్ మొర్తజానే కెప్టెన్ కావడం విశేషం. -
హామిల్టన్దే బోణీ
ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో విజేత మెల్బోర్న్: గత సీజన్ను విజయంతో ముగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్నూ విజయంతోనే ప్రారంభించాడు. ఆదివారం జరిగిన 2015 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 34వ విజయాన్ని నమోదు చేశాడు. 58 ల్యాప్ల ఈ రేసును ఈ బ్రిటిష్ డ్రైవర్ గంటా 31 నిమిషాల 54.067 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరి నిమిషంలో ఉపసంహరణలు... సాంకేతిక సమస్యలు... చిన్నపాటి ప్రమాదాలు... తదితర కారణాలు సీజన్ తొలి రేసును పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ గాయం కారణంగా... మనోర్ మారుసియా జట్టు తమ కార్లను సకాలంలో సిద్ధం చేయకపోవడంతో తొలి రేసులో పాల్గొనలేదు. ఫలితంగా 1963 తర్వాత ఒక సీజన్లోని తొలి రేసులో కనిష్టంగా 15 మంది బరిలోకి దిగారు. రేసు మొదలయ్యాక ఆరుగురు డ్రైవర్లు రైకోనెన్, వెర్స్టాపెన్, గ్రోస్యెన్, మల్డొనాడో, క్వియాట్, మాగ్నుసెన్ మధ్యలోనే వైదొలిగారు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ చివరి వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలిచాడు. సెకను తేడాతో మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలువగా... ఫెలిప్ మసా (విలియమ్స్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు టాప్-10లో నిలువడం విశేషం. హుల్కెన్బర్గ్ ఏడో స్థానాన్ని ... సెర్గియో పెరెజ్ పదో స్థానాన్ని సాధించాడు. ఓవరాల్గా 11 మది డ్రైవర్లే రేసును పూర్తి చేయగలిగారు. ఎస్టీఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన నెదర్లాండ్స్కు చెందిన మాక్స్ వెర్స్టాపెన్ 17 ఏళ్ల 166 రోజుల ప్రాయంలో అరంగేట్రం చేసి ఫార్ములావన్లో కొత్త రికార్డు సృష్టించాడు. అయితే అతనికి తొలి రేసు కలిసిరాలేదు. కారు ఇంజిన్లో సమస్య తలెత్తడంతో వెర్స్టాపెన్ 32వ ల్యాప్లో వైదొలిగాడు. తదుపరి రేసు మలేసియా గ్రాండ్ప్రి ఈనెల 29న జరుగుతుంది. -
రంజీ ట్రోఫీ విజేత కర్ణాటక!
-
అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం
రన్నర్స్ నెల్లూరు అనంతపురం స్పోర్ట్స్: సౌత్జోన్ పీఆర్ ఆనంద్మూర్తి స్మారక అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేతగా అనంతపురం నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్లలో ఆతిథ్య జట్టు విజయాలు సాధించగా, నెల్లూరు జట్టు మూడు విజయాలతో రన్నర్స్గా నిలిచింది. చివరి రౌండ్ పోటీల్లో కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. మూడో స్థానం కర్నూలు, నాల్గవ స్థానం చిత్తూరు, ఐదో స్థానం వైఎస్సార్ జిల్లా నిలిచాయి. ఇండియా ఎంపికవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి : జిల్లా క్రికెట్ సంఘం అండర్ -12 క్రికెట్ కె రియర్కి కీలకం. ఇక్కడి నుంచే ఓ ప్రణాళికతో ముందుకెళితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పగడాల మల్లికార్జున, మచ్చారామలింగారెడ్డి అన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలనందజేశారు. సౌత్జోన్ అకాడమీ హెడ్ కోచ్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ టోర్నీలో రాణించిన 30 మంది క్రీడాకారులను ఆంధ్ర ప్రాబబుల్స్ జట్టుకి ఎంపిక చేస్తామన్నారు. అందులో రాణించిన వారికి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి ఎంపిక చేస్తామన్నారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే... నెల్లూరు వర్సెస్ చిత్తూరు : ప్రధాన మైదానంలో నెల్లూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. జట్టులో రేవంత్ రెడ్డి 61, ప్రజ్వల్రాయ్ 22 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్ విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసుకున్నాడు. చిత్తూరు జట్టు 29 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నెల్లూరు బౌలర్ ప్రజ్వల్రాయ్ 3 వికెట్లు తీశాడు. నెల్లూరు 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కర్నూలు వర్సెస్ వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లా జట్టు 48.1 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సాయిభరణి 20 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్లు లక్ష్మణ్ 3, సూర్యతేజ రెడ్డి, సాయిసూర్య తేజారెడ్డి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కర్నూలు జట్టు 24.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో సాయికృష్ణ సింగ్ 35 పరుగులు చేశాడు. వైఎస్సార్ జిల్లా జట్టులో అన్వర్ 3 వికెట్లు పడగొట్టాడు. -
వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు!
వేగవంతంగా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో... ఏ రంగంలోనైనా వేగాన్ని అందిపుచ్చుకొంటేనే పోటీలో ఉన్నట్టు. మొన్నటి వరకూ... ఒక యువకుడు సొంతంగా షార్ట్ఫిలిమ్ తీయడమే గొప్ప. అయితే ఇప్పుడు చాలా మంది ఆ పనిచేసేస్తున్నారు. మరి అదే షార్ట్ఫిలిమ్ను వేగవంతంగా తీస్తే... కౌంట్డౌన్ పెట్టుకొని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తే... దాంతో అవార్డును అందుకొంటే... కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఛాన్స్కు దగ్గరైతే... అతడు వేగాన్ని అందిపుచ్చుకొన్న వ్యక్తి అవుతాడు. విజేత అవుతాడు. శ్రీరామ్ ఆదిత్య అలాంటి ఛాంపియనే! తన షార్ట్ఫిలిమ్ ‘ది కాన్స్పిరసీ’ ద్వారా ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లో ‘బెస్ట్ డెరైక్టర్’ అవార్డును అందుకొన్న యువకుడితను. శ్రీరామ్, అతడి స్నేహితులు కలిసి రూపొందించిన ఆ సినిమా ఈ పోటీల్లో ‘బెస్ట్ ఫిలిమ్’గా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ గురించి, అతడి సినిమా గురించి... ‘ది కాన్స్పిరసీ’ శ్రీరామ్ ఆదిత్య స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఎనిమిదో షార్ట్ఫిలిమ్. హైదరాబాద్లోని గోకరాజు రంగరాజు కాలేజ్లో బీటెక్ చదివే రోజుల నుంచి సినిమాలంటే అతనికి తగని ప్రీతి. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనేది అతని కల. మరి డెరైక్టర్ కావాలంటే ఫిలింనగర్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి కన్నా మునుపు.. తనకు ఆ కల కనడానికి అర్హత ఉందని నిరూపించుకోవాలనుకొన్నాడతను. అందుకోసమే తన ఆలోచనలను తెరకెక్కించడం మొదలు పెట్టాడు. అలా తెరకెక్కినదే ‘చైల్డ్ లేబర్’ అనే షార్ట్ఫిలిమ్. చదువుకొనే సమయంలోనే శ్రీరామ్ రూపొందించిన ఆ సినిమా సౌతిండి యన్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్గా నిలిచింది. దానికీ అవార్డు లభించింది. మరి శ్రీరామ్కు అంతకు మించిన ప్రోత్సాహం అవసరం లేకపోయింది. ఇంట్లో కూడా పూర్తి మద్దతు లభించడంతో, షార్ట్ఫిలిమ్లతో గుర్తింపు సంపాదించుకొనే ప్రక్రియను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తి అయ్యింది.. గూగుల్లో ఉద్యోగం వచ్చింది, అటు నుంచి ఫేస్బుక్లోకి మారాడు. ఆ సంస్థల్లో పనిచేయడం ఎంతోమంది యువతకు కలల పంట. అయితే శ్రీరామ్ కల మాత్రం ‘సినిమా’. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి.. సినిమా లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో షార్ట్ఫిలిమ్ పోటీలపై దృష్టి సారించాడు. దేశంలో నగరాల వారీగా జరిగే బుల్లి సినిమాల పోటీల్లో తన ప్రయత్నాలు చేయసాగాడు. ఎక్కడికి వెళ్లినా శ్రీరామ్ తన ప్రత్యేకతను అయితే నిరూపించుకొంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీరామ్ ఎనిమిది షార్ట్ఫిలిమ్లు రూపొందించగా, నాలుగింటికి అవార్డులు వచ్చాయి! అవన్నీ కూడా 48 గంటల వ్యవధిలో రూపొందించిన సినిమాలే కావడం విశేషం! ప్రస్తుతం శ్రీరామ్ రూపొందించిన ‘ది కాన్స్పిరసీ’కి ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ అవార్డు రావడం, అది అమెరికాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకోవడంతో పాటు.. ఇండియన్ జ్యూరీలో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శన కోసం కూడా పోటీలో ఉంది. మరి కాన్స్కు వీసా గనుక పొందితే శ్రీరామ్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది. షార్ట్ఫిలిమ్స్తో మంచి గుర్తింపు లభించిన నేపథ్యంలో ఫీచర్ ఫిలిం రంగంలోకి ప్రవేశించి... పూర్తిస్థాయిలో సినీ దర్శకుడు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు శ్రీరామ్. తను సినిమా రంగానికి సరిపోయే వ్యక్తినేనని నిర్ధారణ చేసుకొని ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. కథలను సిద్ధం చేసుకొని సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. సరైన సహకారం లభిస్తే మంచి సినిమాలను తీర్చదిద్దగలననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో శ్రీరామ్ విజయవంతం అవుతాడని ఆశిద్దాం. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ అనే ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ నగరాల వారీగా షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత నుంచి ఎంట్రీలను కోరింది. ఈ అవకాశాన్ని శ్రీరామ్ సద్వినియోగం చేసుకొన్నాడు. కాంపిటీషన్ అంటే.. ముందస్తు ఏర్పాట్లతో వెళ్లడం కాదు. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ వాళ్లు చెప్పిన కాన్సెప్ట్తో, వాళ్లు చెప్పిన ఒక పాత్రతో, కొన్ని పరిధుల మేరకు మెప్పించాలి! ఈ విషయంలోనే శ్రీరామ్ బృందం విజయవంతమైంది. ఒకే పాత్రతో..అది కూడా నిద్రపోతున్నట్టుగా చూపుతూ ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు. బుక్, స్కేటింగ్ బోర్డ్, క్లాక్, గిటార్, స్మార్ట్ఫోన్ వంటి వస్తువులతో ఈ సినిమాను రూపొందించి మార్కులు కొట్టేసింది శ్రీరామ్, బృందం. దాదాపు 40 నుంచి 50 షార్ట్ ఫిలిమ్లు పోటీ పడగా వాటిల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ లఘు ప్రయత్నానికి సౌమిత్ లంక (సంగీతం, వాయిస్ ఓవర్), అవినాష్ మట్టా (ఎడిటింగ్), ప్రసాద్ కళ్ళేపల్లి (సినిమాటోగ్రఫీ), ఇంకా దుర్గ, గౌతమ్లు శ్రీరామ్కు అండగా నిలిచారు. ఇక, తెరపై కనిపించే ఒకే ఒక్క పాత్రలో అంకుర్ నటించాడు. అవార్డుల పంట మహీంద్రా కంపెనీ వాళ్లు తమ కారు ఒకదాన్ని మార్కెట్లో ప్రవేశపెడుతూ, ఆ కారును ఉపయోగించుకొంటూ లఘు చిత్రాలను రూపొందించాలనే పోటీని నిర్వహించింది. అందులో శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘ద డ్రైవ్’ దేశంలోనే ఉత్తమ 20 షార్ట్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచింది. అంతకన్నా మునుపే ‘రన్ వీ రీల్’ కాంపిటీషన్ కోసం 48 గంటల్లో రూపొందించిన లఘుచిత్రానికి ప్రైజ్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు రూపొందించిన షార్ట్ ఫిలిమ్కు కూడా అవార్డు దక్కింది. ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంలో ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లభించింది. -
ఉరకలెత్తిన ఉత్సాహం
దామునాపల్లిలో జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు ఎడ్ల విజేత వల్లంపూడి...గుర్రపు విజేత చోడవరం చోడవరం రూరల్ : చోడవరం మండలం దామునాపల్లి గ్రామంలో గురువారం జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు ఉత్సాహంగా సాగాయి. ఇటీవల కాలంలో పోటీలు ఎక్కడా లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పలువురు ఔత్సాహికులు ఈ పోటీలకు తరలివచ్చారు. ప్రధానంగా ఎడ్ల పందాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీవ్రమైన ఎండ కారణంగా పోటీలను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. వడ్లపూడికి చెందిన ఎడ్లు ప్రథమ బహుమతి సాధించగా చుక్కపల్లి, లెక్కలవానిపాలెం, నర్సయ్యపేట, కొత్తపెంట ఎడ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అలాగే, జిల్లా స్థాయి గుర్రపు పందాల్లో చోడవరం పట్టణానికి చెందిన ఆర్.శ్రీను ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో వాడచీపురుపల్లికి చెందిన గొర్లి విజయ్కుమార్, మూడో స్థానంలో నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ, నాల్గో స్థానంలో చినయాతపాలెంకు చెందిన వి.యశ్వంత్ నిలిచారు. కాగా, ఐదో స్థానాన్ని కూడా చోడవరానికే చెందిన ఆర్.శ్రీను గుర్రం దక్కించుకుంది. రెండు పోటీల్లోనూ విజేతలకు వరుసగా రూ.5వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి బహుమతిగా అందించారు. గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పోటీలు చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. -
విశ్రమించవద్దు ఏ క్షణం...
గీతోపదేశం: చిత్రం: పట్టుదల జీవితంలో గెలుపు, ఓటములు సహజం. కొందరికి... ఓటమి ఎదురైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. విజేతగా నిలుస్తారు. కొందరు మాత్రం ఓటమి భారానికి కృంగిపోతారు. గెలుపు దారి వైపు తొంగి చూడడానికి కూడా భయపడతారు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు. అలాంటి వారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...’ పాట నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. గెలుపు సంతోషాన్ని మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఓటమి అనేక సత్యాలను మనకు బోధ పరుస్తుంది. పట్టుదల పదును దేరుతుంది. క్షణక్షణం లక్ష్యాన్ని గుర్తు తెస్తుంది. కొత్త శక్తియుక్తులకు మనసు స్వాగతం పలుకుతుంది. విజేతగా నిలవడానికి అవసరమైన సమరోత్సాహాన్ని ఇస్తుంది. ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి... విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం’ అంటాడు కవి. ఓటమి జీవిత కాలం ఎంత? మనలో నిస్తేజం, బద్ధకం, నిరాశ ఎంత కాలం ఉండి పోతాయో, అంతకాలం ఓటమి హాయిగా జీవిస్తుంది. అవి మనలో కనిపించనప్పుడు ఓటమి చనిపోతుంది. గెలుపు జెండా ఎగురుతుంది. ‘నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా’ కొందరు సాకులు వెదుక్కోవడంలోనే సంతృప్తి పడుతుంటారు. కానీ తమలోని శక్తియుక్తులను గ్రహించరు. మన కోసం ఎవరో వచ్చి పోరాటం చేయరు. మన పోరాటం మనమే చేయాలి. ‘అది లేదు’, ‘ఇది లేదు’ అనే భావన నుంచి ‘నాకు అన్నీ ఉన్నాయి’ అనే ఆత్మసంతృప్తి వైపు మారాలి. ఈ తృప్తి నుంచే గెలుపు పదును దేరుతుంది. అందుకే, కవి మాటల్లో చెప్పాలంటే... ‘దేహముంది ప్రాణముంది సత్తువుంది అంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను’ -
ఏర్కాడు విజేత ఎవరో?
= నేడే ఓట్ల లెక్కింపు = ఉదయం 11 గంటలకు ఫలితాలు చెన్నై, సాక్షి ప్రతినిధి : అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు హోరాహోరీగా తలపడిన ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై 11 గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్నాడీఎంకే తరపున సరోజ, డీఎంకే తరపున నాగమారన్ అభ్యర్థులుగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులుగా మరో 9 మంది పోటీపడ్డారు. సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం జయ, డీఎంకే తరపున పార్టీ కోశాధికారి స్టాలిన్, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ప్రచారం చేశారు. ఈనెల 4వ తేదీన పోలింగ్ పూర్తయింది. నియోజకవర్గంలో మొత్తం 2,40, 290 ఓటర్లు ఉండగా, 2,14, 434 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తికాగానే సేలం అస్తంపట్టిలోని సీఎస్ఐ పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంలను భద్ర పరిచారు. 186 మంది కేంద్ర భద్రతా దళాలతోపాటూ తమిళనాడు పోలీసులు రేయింబవళ్లు ఈవీఎంల రూములను కాపలా కాశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 179 ఓట్లు పోలైనట్లు గుర్తించారు. ఎన్నికల పర్యవేక్షకులు రవిప్రకాష్ అరోరా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మకరభూషణం, నియోజకవర్గ ఎన్నికల అధికారి సభాపతి నేతృత్వంలో ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభించనున్నారు. 11 టేబుళ్లపై 21 రౌండ్లలో లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్కు 15 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ లెక్కన 11 గంటలకు లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 12 గంటలకు అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల కమిషన్ జారీచేసిన గుర్తింపుకార్డును వారివెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మకరభూషణ్ తెలిపారు. సిబ్బంది తమ వెంట సెల్ఫోన్, పెన్ తెచ్చుకోరాదని ఆయన చెప్పారు.