Amitabh Bachchan
-
అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?
నిఖిల్ నందా (Nikhil Nanda).. ఈ పేరు బహుశా ఎవరికీ తెలుసుండకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు 'అమితాబ్ బచ్చన్' అల్లుడు అంటే కొంతమందికి, ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ చైర్మన్ అంటే మరికొందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన నందా గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..1974 మార్చి 18న జన్మించిన నిఖిల్ నందా.. డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక డూన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని.. వార్టన్ స్కూల్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆ తరువాత ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్న నైపుణ్యంతో.. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్లో పగ్గాలు చేపట్టాడు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో.. నందా నాయకత్వంలో కంపెనీ ఉన్నత శిఖరాలను చేరింది.నిఖిల్ నందా.. దిగ్గజ నటుడు & చిత్రనిర్మాత రాజ్ కపూర్ కుమార్తె అయిన రీతు నందా కుమారుడు. దీంతో అతను రిషి కపూర్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్ వంటి ప్రముఖులకు మేనల్లుడు అయ్యాడు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్ కూడా ఇతనికి బంధువులే. నటులకు దగ్గర బంధువు కావడం చేత నందాకు చలనచిత్ర పరిశ్రమలో కూడా సంబంధాలు ఉన్నాయి.అమితాబ్ బచ్చన్ & జయా బచ్చన్ కుమార్తె 'శ్వేతా బచ్చన్'ను నిఖిల్ నందా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవ్య నవేలి నందా, అగస్త్య నందా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్య తన పాడ్కాస్టింగ్ వెంచర్లతో తనదైన ముద్ర వేసినప్పటికీ, అగస్త్య ఇటీవల జోయా అక్తర్ నెట్ఫ్లిక్స్ చిత్రం "ది ఆర్చీస్"తో వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.ఇదీ చదవండి: ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళనిఖిల్ నందా.. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీ రూ. 42,141 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దూసుకెళ్తోంది. ఈ సంస్థ వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ యంత్రాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్, రైల్వే పరికరాలను తయారు చేస్తూ.. ఈ విభాగంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా ఉంది. -
వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్సైట్లతో పాటు పలు సోషల్మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
ఖరీదైన ఫ్లాట్ను అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లు లాభమంటే?
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన ఫ్లాట్ను అమ్మేశారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో ఖరీదైన డ్యూప్లెక్స్ ఫ్లాట్ను విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని ప్రముఖ రియాల్టీ సంస్థ స్క్వేర్యార్డ్స్ వెల్లడించింది. ఆ ఫ్టాట్ దాదారు 5 వేలకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపింది.అమితాబ్ బచ్చన్ ఈ ఫ్లాట్ను ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ప్రాంతంలోని తన డ్యూప్లెక్స్ ఫ్లాట్ను ఈనెల 17న వ తేదీన విక్రయించారు. ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు.కాగా.. అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎస్టేట్లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎస్టేట్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాటిలో ప్రధానందగా నివాస సముదాయాలతో పాటు వాణిజ్య స్థలాలు ఓషివారా, మగాథనే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో ఉన్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షోకు హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు. -
ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే!
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్లకు పది సినిమాలు చేసిన రాదు. అలాగే వాళ్ల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 ఏళ్లు దాటితే సినిమా చాన్స్లు కూడా రావు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తుంటారు. అయితే ఎంత సంపాదించిన హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు మాత్రం స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోలు కూడా ఆస్తుల విషయం ఈ హీరోయిన్ వెనుకే ఉన్నారు. ఆమే జూహి చావ్లా. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన సినీనటిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది.అమితాబ్కు కంటే ఎక్కువమన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో జుహి చావ్లానే ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్(2000 కోట్లు), నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్(1200 కోట్లు) ఉన్నారు.పలు వ్యాపారాల్లో పెట్టుబడులుజూహి చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నా.. ఆస్తుల విషయంలో మాత్రం జుహినే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్కటా నైట్రైడర్స్లో ఆమె కూడా పార్ట్నర్గా ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహి చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి. -
అల్లు అర్జున్ పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..
-
అల్లు అర్జున్తో నన్ను పోల్చకండి.. అభిమానితో అమితాబ్ బచ్చన్
అల్లు అర్జున్.. పుష్ప2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్ప రాజ్గా తను నటించిన తీరుపై చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానిని అంటూ బిగ్ బీ పేర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఓ కంటెస్టెంట్తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో కోల్కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహణి కంటెస్టెంట్గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీనికి అమితాబ్ నవ్వుతూ ఇలా స్పందించారు. 'అల్లు అర్జున్కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతనికి వచ్చిన గుర్తింపునకు పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగుంది. అతనితో నన్ను పోల్చొద్దు' అంటూ నవ్వుతూ చెప్పారు.అయినప్పటికీ ఆ మహిళ మాత్రం బన్నీ టాపిక్ వదల్లేదు.. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరూ కాలర్ను కొరుకుతూ, కళ్లు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బీ అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. 'ఇక ఇద్దరి వాయిస్లోనూ ఓ రిచ్నెస్ ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్ను చూస్తే నా కల నెరవేరుతుంది' అని ఆమె చెప్పారు. -
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
'పుష్ప 2': బన్నీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన అమితాబ్
'పుష్ప 2'కి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల గ్రాస్ దాటేసింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్లే హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తెలుగు హీరోల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ బిగ్ బీ అమితాబ్.. బన్నీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన అల్లు అర్జున్.. అమితాబ్ గురించి ప్రస్తావించాడు. ఆయన ఓ లెజెండ్ అని, ఈ వయసులోనూ అద్భుతంగా పనిచేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారని అన్నాడు. ఇవి ఇప్పుడు అమితాబ్ కంటపడ్డాయి. దీంతో అల్లు అర్జున్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.'అల్లు అర్జున్ గారు.. మీ మాటలు నా మనసుని తాకాయి. నా అర్హత, స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారేమో అనిపించింది. మీ పనితనం, మీ ప్రతిభకు మేమంతా అభిమానులం. మీరు మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని అమితాబ్.. బన్నీ గురించి రాసుకొచ్చారు. మరి దీనికి అల్లు అర్జున్ ఏమని రిప్లై ఇస్తాడో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -16 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న.. 6.4 లక్షలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దాదాపు ప్రతి ఎపిసోడ్లో ప్రతి కంటెస్టెంట్కు ఇలాంటి ఓ ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా జరిగిన కేబీసీ 16వ సీజన్ 57వ ఎపిసోడ్లో (అక్టోబర్ 29న టెలికాస్ట్ అయ్యింది) మరోసారి క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది.Today's Question in KBC for 6,40,000 😮 pic.twitter.com/QBopW2AoWQ— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 29, 2024రూ. 6. 4 లక్షలు విలువ చేసే ఈ ప్రశ్న టెస్ట్ క్రికెట్కు సంబంధించింది. 2022లో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు స్కోర్ చేసిన తొలి జట్టు ఏది..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇంగ్లండ్. 2022 డిసెంబర్ 1న పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి రోజే 506 పరుగులు (4 వికెట్ల నష్టానికి) చేసింది. టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టు ఇంగ్లండే.ఈ ప్రశ్నను ఎదుర్కొన్న కంటెస్టెంట్కు క్రికెట్ పరిజ్ఞానం బాగా ఉన్నట్లుంది. అందుకే అతను పూర్తి వివరాలతో సహా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్ 500కు పైగా స్కోర్ చేసిన మ్యాచ్లో తొలి రోజే నలుగురు బ్యాటర్లు (జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్) సెంచరీలు చేశారని వివరణ ఇచ్చాడు. -
లండన్లో రతన్టాటాతో బిగ్బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్పోర్ట్లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి
‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ‘ఏఎన్నార్ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాగ్తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. అమితాబ్గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయినాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్ బచ్చన్గారు ‘చిరంజీవి ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్’ సినిమా చూసి, అమితాబ్గారు ‘పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. డన్ ఏ గుడ్ జాబ్. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.నాన్న పొగడాలనుకున్నానుమా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను. మా అమ్మ ఏఎన్నార్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఏఎన్నార్గారి ఫ్యాన్స్లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్ఆర్గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో. చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్ఆర్గారు నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్ఆర్గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్ వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్’.నాగ్ నాకు డాక్టర్లాంటి వాడు ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్సైజుల విషయంలో, యంగ్గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్ నాకెంతో ఇన్స్పిరేషన్. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.ఏఎన్ఆర్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు: అమితాబ్ బచ్చన్ ‘‘ఇండియన్ సినిమాకు ఏఎన్నార్గారు చేసిన కాంట్రిబ్యూషన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్కు థ్యాంక్స్.ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా: నాగార్జున ‘‘ఏఎన్ఆర్... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్ లివ్స్ ఆన్. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్ సినిమాకు ఏబీ (అమితాబ్) సి (చిరంజీవి).. అమితాబచ్చన్గారు, మెగాస్టార్ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ చూడమని చెప్పారు. ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్ చేయగలనా అనిపించింది. చేయలేం... కెరీర్లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్. ‘ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ హిట్ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు. -
మెగాస్టార్కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ
గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. -
జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై రూమర్స్
సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాడురి(94) అనారోగ్యంతో కన్నుమూశారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె భోపాల్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం! ఈ వ్యవహారంపై బచ్చన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉందికాగా ఇందిరా భాడురి.. భోపాల్లోని శ్యామల హిల్స్ ఏరియా అన్సల్ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్ తరుణ్ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం.చదవండి: సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్ -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్ను జోడించడం నాకు సవాల్గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్ల గురించి చెబుతాను. -
ఎలక్ట్రిక్ కారు కొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100. కార్ల కలెక్షన్..తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.చదవండి: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
మామయ్య కోసం మెసేజ్.. రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టిన ఐశ్వర్య
లెజండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టారు. అయితే, అమితాబ్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య రాయ్ చెప్పే విషెష్ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి. అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్స్టాప్ పెట్టింది. ఈమేరకు సోషల్మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్తో రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
'హ్యాపీ బర్త్ డే అశ్వత్థామ'.. కల్కి టీమ్ స్పెషల్ వీడియో!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హిందీలో మాత్రమే ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అమితాబ్ బర్త్ డే కావడంతో కల్కి టీమ్ స్పెషల్గా విషెస్ తెలిపింది. ఆయన కల్కి మూవీలోని సీన్స్తో వీడియోను రూపొందించింది. కల్కి షూటింగ్కు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో మెప్పించారు. హ్యాపీ బర్త్డే అశ్వత్థామ.. త్వరలోనే సెట్స్లో కలుసుకుందాం అంటూ బిగ్ బీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అమితాబ్ కల్కి-2 మూవీలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. Team #Kalki2898AD shares a special BTS video of @SrBachchan wishing him a very happy birthday!!🔥#HBDAmitabhBachchan@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/FEj0xS2YAD— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
రెండు చేతులతో రాత.. రాజీవ్ గాంధీతో చదువు.. అమితాబ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఐశ్వర్యను దూరం పెట్టిన బిగ్బీ? నటి ఏమందంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్బీ తనయుడు అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్కు, తన అత్త జయా బచ్చన్కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్!ఐశ్వర్యను పట్టించుకోని బిగ్బీ?ఈ విషయంలో సోషల్ మీడియా అంతా ఐష్కు సపోర్ట్గా ఉండగా బిగ్బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ సైతం అమితాబ్ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటారే తప్ప ఐష్ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్ నటి సిమి గరెవాల్ కంట్లో పడింది.ఇక చాలు ఆపండని నటి వార్నింగ్బచ్చన్ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్.. మేరా నామ్ జోకర్ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్.. కింద పడిపోయినా వదల్లేదు! -
ఆ సాంగ్ షూటింగ్లో కరెంట్ షాక్ తగిలింది: అమితాబ్
కౌన్ బనేగా కరోడ్పతి(మీలో ఎవరు కోటీశ్వరులు) షోలో అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉంటాడు. సినిమా సంగతులను కంటెస్టెంట్లతో పంచుకుంటాడు. అలా తాజా ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.స్టేడియంలో షూటింగ్యారన్ సినిమాలో సారా జమానా అనే హిట్ సాంగ్ ఉంది. దాన్ని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను. సరిగ్గా అదే సమయంలో కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం కొత్తగా ఓపెన్ చేశారు. 12 వేల నుంచి 15 వేల కూర్చోగలిగే ఆ స్టేడియంలోకి ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది దాకా వచ్చారు.రాత్రిళ్లు షూట్ చేద్దామని..పరిస్థితి చేయిదాటడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్లిపోయాం. అయితే ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షూట్ చేద్దామన్నాను. అలా కొద్దిరోజులకే గుట్టుచప్పుడు కాకుండా కోల్కతాకి వచ్చే స్టేడియంలో నైట్ షూట్ చేశాం. సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదని డైరెక్టర్ క్యాండిల్స్ పెట్టాడు.కరెంట్ షాక్తో డ్యాన్స్నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తొడిగించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. నా జాకెట్కు లైట్స్ రావాలంటే ప్లగ్ బోర్డు దగ్గర స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ ఆన్ చేయగానే నాకు కరెంట్ షాక్ తగిలి ఆటోమేటిక్గా డ్యాన్స్ చేశాను అని బిగ్బీ నవ్వుతూ చెప్పాడు.చదవండి: బిగ్బాస్ హౌస్లో భూకంపం.. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు! -
రజనీకాంత్ ను వేధిస్తున్న ఆ టెన్షన్..
-
అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు: రజనీకాంత్
రజనీకాంత్ , అమితాబ్ బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులేనని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 'హమ్, అందాకా నూన్, గిరాఫ్తార్' వంటి సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, 32 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా 'వెట్టైయాన్'. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేదికపై తన మిత్రుడు అమితాబ్ బచ్చన్ గురించి రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.రజనీకాంత్ మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ సినీ నిర్మాతగా భారీ అర్ధిక నష్టాలను చవిచూశారు. ఒకానొక సమయంలో తన వాచ్మెన్కు కూడా జీతం ఇవ్వలేని స్థితికి చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. పతనమైనప్పటికీ సరిగ్గా మూడేళ్లలో తిరిగి మళ్లీ నిలబడ్డారు. కౌన్ బనేగా కరోడ్పతి నుంచి చేతికి వచ్చిన ప్రతి యాడ్ చేస్తూ కష్టపడ్డారు. అందుకోసం ఆయన చాలా శ్రమించారు. 82 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకు పైగానే కష్టపడ్డారు. తను ఎక్కడైతే కిందపడ్డారో మళ్లీ అక్కడే తనేంటో చూపించారు. జూహూలోని తన ఇంటితో పాటు మరో మూడు ఇళ్లను తిరిగి కొనుగోలు చేశారు.' అని రజనీ చెప్పారు.గాంధీ కుటుంబంతో అమితాబ్ బంధం: రజనీకాంత్అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఒక అరుదైన విషయాన్ని రజనీకాంత్ ఇలా పంచుకున్నారు. ఒకసారి అమితాబ్కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది. అలా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది. అమితాబ్ జీ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప రచయిత. తనకు కష్టం వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎవరినైనా సాయం అడగొచ్చు. కానీ, ఆయన అలాంటి పనిచేయలేదు. కష్టాల్లో కూడా తనంతట తానే తిరిగి మళ్లీ నిలబడ్డారు. అమితాబ్ ఎందరికో ఆదర్శం.దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్స్లోకి ‘వేట్టైయాన్’ రానున్నాడు. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. వేట్టయాన్లో సత్యదేవ్ పాత్రలో అమితాబ్ నటించారు. రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్ , రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ నటించారు. -
జనరల్ నాలెడ్జ్కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్కు చెందిన మయాంక్కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్లో దిట్ట’ అనిపించుకోండి. -
క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ హిందీ, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అలాంటిది ఈయన ఇప్పుడెందుకు సారీ చెప్పారు. అసలు ఏం జరిగింది?(ఇదీ చదవండి: Bigg Boss 8: కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్గా అట్టర్ ఫ్లాప్!)తప్పుగా పలకడంతోనటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తారు. అలా కొన్నిరోజుల క్రితం ప్రజలకు సందేశమిచ్చే ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'హలో నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను. ధన్యవాదాలు' అని అందులో చెప్పుకొచ్చారు. అయితే ఇదే వీడియోని మరాఠీలోనూ మాట్లాడి పోస్ట్ చేశారు. ఇందులో కచ్రా (చెత్త) అనే పదాన్ని తప్పుగా పలికానని, దాని గురించి తన స్నేహితుడు సుదేశ్ భోసలే చెప్పాడని, అందుకే ఈసారి సరైన ఉచ్ఛారణతో చెప్పినట్లు పేర్కొన్నారు.సారీ చెప్పారుఈ క్రమంలోనే తన తప్పుని మన్నించాలని మరాఠీ వాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పారు. దీంతో నెటిజన్లు అమితాబ్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. రీసెంట్గానే ప్రభాస్ 'కల్కి'లో అశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ 'వేట్టాయాన్' మూవీలో కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
కల్కి సినిమా అర్థం కాలేదన్నారు: అమితాబ్ బచ్చన్
కొందరు హాలీవుడ్ సినిమాలను ఆహా.. ఓహో.. అని పొగుడుతుంటారు. మరికొందరికేమో ఆ చిత్రాలేవీ బుర్రకెక్కవు. తనది రెండో కేటగిరీ అంటున్నాడు బిగ్బీ అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌన్ బనేగా కరోడ్పతి షోలోని తాజా ఎపిసోడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రిషూల్ చౌదరి కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. అతడు టెన్షన్ పడటం చూసిన బిగ్బీ.. ఆ కంగారును పోగొట్టేందుకు త్రిషూల్ను హత్తుకుని తనతో మాట కలిపాడు.అమితాబ్కు కౌంటర్నా మనవళ్లు, మనవరాళ్ల కోసం వారితో కలిసి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు వెళ్తుంటాను. కానీ ఆ సినిమాలు నాకసలు అర్థమే కావని చెప్తే వాళ్లేమన్నారో తెలుసా? అవునా, మాకు కూడా కల్కి 2898 ఏడీ మూవీ అస్సలు అర్థం కాలేదని రివర్స్ పంచ్ ఇచ్చారు అని తెలిపాడు. ఈ మాటలు విని నవ్వేసిన త్రిషూల్.. కల్కిలో అశ్వత్థామగా పాత్ర, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నాయని బిగ్బీపై ప్రశంసలు కురిపించాడు.సినిమా సంగతులు..ఇకపోతే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగ్ అశ్విన దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీతో పాటు ద ఇంటర్న్ సినిమా రీమేక్లోనూ బిగ్బీ నటించనున్నాడు.చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు -
కౌన్ బనేగా కరోడ్పతిలో టీ20 వరల్డ్కప్నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్లో ఎవరూ టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
క్యాన్సర్తో పోరాటం.. రూ.25 లక్షలు మిస్ చేసుకున్నాడు!
ఇటీవల కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించిన బిగ్బీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ -16కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్గా పాల్గొన్న అక్షయ్ నారంగ్ అనే యువకుడికి రూ.25 లక్షల ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి తప్పుకున్నాడు. దీంతో కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆన్సర్పై కాన్ఫిడెన్స్ లేకపోవడంతో షో నుంచి నిష్క్రమించాడు. అయితే ఢిల్లీకి చెందిన యువకుడు తన నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.(ఇది చదవండి: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య)అయితే అక్షయ్ నారంగ్ గతంలో క్యాన్సర్తో పోరాడినట్లు ఈ షోలో పంచుకున్నారు. 2018లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఓ కణితిని వైద్యులు తొలగించారని తెలిపాడు. దాదాపు రెండేళ్లపాటు క్యాన్సర్తో పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాలేజీలో తన స్నేహితులు సరదాగా గడుపుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని అక్షయ్ తన బాధను అమితాబ్తో పంచుకున్నారు. నేను ఆరోగ్యంగా బయటకు వచ్చి కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్తో అన్నారు. దీంతో అమితాబ్ అతనికి ధైర్యం చెప్పారు. -
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు.. 10 క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్
ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.1941లో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్లో 250 చిత్రాలకు పైగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యున్నతమైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. 1924 సెప్టెంబరు 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు. 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశంలో 25 ప్రధాన నగరాల్లో నాగేశ్వరరావు నటించిన 10 సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోలతో పాటు వడోదర, జలంధర్, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా ఈ సనిమాలు రిలీజ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రధాన సిటీలలో విడుదల అవుతాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)నిధులుఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, NFDC - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా , మల్టీప్లెక్స్ చైన్ PVR-Inox సంయుక్తంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి.తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది: నాగార్జున 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ గురించి నాగార్జున ఇలా రియాక్ట్ అయ్యారు. 'కొన్ని దశాబ్దాలుగా ప్రజల హృదయాలలో నిలిచిపోయే పాత్రలలో నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన సాధువుగా కనిపించినా, మద్యపానానికి బానిసగా ఆపై రొమాంటిక్ హీరోగా అనేక రకాల పాత్రలను పోషించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. అందుకే ఆయన్ను 'నటసామ్రాట్' అని పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించిన మార్గదర్శకుడు. అతని వారసత్వం గురించి మేము చాలా గర్విస్తున్నాము. ఈ పండుగ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్ను గుర్తుంచుకుంటారు.' అని నాగ్ అన్నారు.ఆ అదృష్టం నాకు కలిగింది: అమితాబ్ బచ్చన్'అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలా సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ, వినయం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని తెప్పిస్తాయి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగను జరుపుతుంది. బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి గురించి అందరూ తెలుసుకునే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుంది.' అని అన్నారు. -
అమితాబ్ కోటి రూపాయల ప్రశ్న.. కంటెస్టెంట్ ఏం చేశాడంటే?
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-16కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను మెప్పించిన ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. ఆదివాసి తెగకు చెందిన కంటెస్టెంట్ బంటి వడివా కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ను కొద్దిలో మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మనం ఓ లుక్కేద్దాం.తాజా ఎపిసోడ్లో మొదటి ఆదివాసీ కంటెస్టెంట్ బంటి వడివా రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.గతంలో తాను ముంబైకి వచ్చినప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.260 మాత్రమే ఉన్నాయని బంటి వడివా తెలిపారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్లో 2024 పారిస్ ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, అమన్ షెరావత్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.కోటీ రూపాయల ప్రశ్న..ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్ వర్క్కు బెంగాలీ శిల్పి చింతామోని కర్ను వరించిన పతకమేది?ఆప్షన్స్: ఎ. పైథాగరస్ బహుమతి బి. నోబెల్ బహుమతి సి. ఒలింపిక్ పతకం డి. ఆస్కార్ పతకంఅయితే 1948లో ఒలింపిక్ గేమ్స్లో కళల పోటీలు కూడా ఉన్నాయని అమితాబ్ వెల్లడించారు. అందువల్లే చింతామోని కర్ తన కళాకృతికి ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్నాడని తెలిపారు. కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షో సోనీలివ్లో ప్రసారమవుతోంది. -
అడ్వాన్స్ ట్యాక్స్లో ‘కింగ్’ ఖాన్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిల్చారు. ఆయన రూ. 92 కోట్లు చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూ. 80 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023–24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చూన్ ఇండియా రూపొందించిన ’ది స్టార్ కాస్ట్’ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా రూ. 66 కోట్లు చెల్లించగా, ఎంఎస్ ధోని రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్..సౌరవ్ గంగూలీ వరుసగా రూ.28 కోట్లు, రూ. 23 కోట్లు చెల్లించారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్, మోహన్లాల్ చెరో రూ. 14 కోట్లు కట్టగా ఆమిర్ ఖాన్ రూ. 10 కోట్లు చెల్లించారు. -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్కు డూప్గా నటించాడు. అమితాబ్ సునీల్ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
బాలీవుడ్లో టాప్-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్ ప్లేస్ ఎంతంటే?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కల్కి మూవీతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా రిచ్లిస్ట్ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్లో అమితాబ్ నాలుగో ప్లేస్లో నిలిచారు.ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది. అతనికంటే ముందు షారుఖ్ ఖాన్ (రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం (రూ.4600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2000కోట్లు) అతని ముందున్నారు.ఈ లిస్ట్లో కరణ్ జోహార్ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.అయితే అమితాబ్ తన చిన్న వయసులో కోల్కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్కతాలో జాబ్ చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు. కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి షోలో కంటెస్టెంట్గా పాల్గొన్న ఓ వ్యక్తి తాను పుణెలో ఓకే గదిలో ఎనిమిది మందితో కలిసి జీవిస్తున్నట్లు అమితాబ్తో అన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ఆ స్థాయి నుంచే వచ్చినట్లు అమితాబ్ వెల్లడించారు.ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 16 షూటింగ్లో బిజీగా ఉన్న అమితాబ్ ఆ తర్వాత సెక్షన్ 84 చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తోన్న వేట్టైయాన్లోనూ నటించనున్నారు. -
స్విగ్గీలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వాటాలు
న్యూఢిల్లీ: ఐపీవోకి సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్ఫాం స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులు, ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 10,414 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్హోల్డర్లు ఏప్రిల్లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనున్నారు. -
'కౌన్ బనేగా కరోడ్పతి'లో క్రికెటర్కు సంబంధించిన ప్రశ్న
ప్రముఖ బాలీవడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతి షోలో టీమిండియా క్రికెటర్కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. తాజాగా జరిగిన ఎడిసోడ్లో బెంగళూరుకు చెందిన ప్రియాంక పోర్వాల్ అనే కంటెస్టెంట్ 80,000 రూపాయలకు ఈ ప్రశ్నను ఎదుర్కొంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. చెన్నైలో పుట్టిన ఏ టీమిండియా క్రికెటర్ 'కుట్టి స్టోరీస్' అనే టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తాడు..?A cricket question in KBC. pic.twitter.com/X7hwjhNBVC— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024ఈ ప్రశ్నకు అమితాబ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది దినేశ్ కార్తీక్ కాగా.. రెండోది రవిచంద్రన్ అశ్విన్.. మూడవది వాషింగ్టన్ సుందర్, నాలుగవది సంజూ శాంసన్. పై నాలుగింటిలో కంటెస్టెంట్ ప్రియాంక ఓ సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉండింది. అయితే సమాధానంపై సరైన అవగాహణ లేని ప్రియాంక ఆడియన్స్ పోల్కు వెళ్లి, ఆప్షన్-బి రవిచంద్రన్ అశ్విన్ అని చూస్ చేసుకుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో ఆమె తదుపరి ప్రశ్నకు అర్హత సాధించింది. అయితే 1,60,000 ప్రశ్నకు ఆమె ఆన్సర్ చెప్పలేకపోవడంతో ఆమె 80,000తోనే గేమ్ను వదిలేసింది.కాగా, కేబీసీలో ఇలా క్రికెట్కు, క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు రావడం ఇటీవలికాలంలో తరుచూ జరుగుతుంది. కంటెస్టెంట్లకు అన్ని అంశాల్లో అవగాహణ ఉందో లేదో తెలుసుకునేందుకు నిర్వహకులు ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.ఇదిలా ఉంటే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోవడంతో లోకల్ క్రికెట్లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్ట్లు, మూడు వన్డేల సిరీస్ల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో అశ్విన్ టెస్ట్లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అశ్విన్ 100 టెస్ట్లు ఆడి 516 వికెట్లు పడగొట్టాడు. -
81 ఏళ్ల వయసులో సినిమాలు.. మీకేంటి ప్రాబ్లమ్?: బిగ్బీ
81 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు బిగ్బీ అమితాబ్ బచ్చన్. అభిమానులకు వినోదాన్ని పంచడమే తన ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాడు. అయితే కొందరు మాత్రం.. ఇంకా ఈ వయసులో కూడా పని చేయడం అవసరమా? విశ్రాంతి తీసుకోవచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు. వయసుపై బడ్డప్పుడు ఖాళీగా కూర్చోకుండా ఇంకా పని చేయాల్సిన అవసరమేంటని కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.నా కారణమైతే..తాజాగా ఈ ప్రశ్నలకు బిగ్బీ సమాధానమిచ్చాడు. 'ఇంకా ఎందుకు పని చేస్తున్నావని ఇప్పటికీ సెట్లో ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. దీనికి నా దగ్గర సమాధానమే లేదు. అయితే సినిమా అనేది నాకొక ఉద్యోగం వంటిది. చేసుకుంటూ పోతున్నాను. మీరేదైనా అనుకోండి. నా పని నేను చేసుకునే స్వేచ్ఛ ఉంది. నా కారణమైతే నేను చెప్పాను. దానికి మీరు ఏకీభవిస్తారో లేదో మీ ఇష్టం. నేనైతే చెప్పాను.మీకేమైనా సమస్యా?ఇసుక కోటలను నిర్మించేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. అవి కూలిపోయినా మళ్లీ కట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈసారి మరింత ధృడంగా ఉండాలని కష్టపడతారు. అది మీ కోసం, మీ వ్యాపార సామ్య్రాజ్యం కోసం ఇష్టంగా చేస్తారు. నేనూ అలాగే ఓ సామ్య్రాజ్యాన్ని సృష్టించాను, దాన్ని నిలబెట్టుకున్నాను. అందులో ఉన్నవారి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాను. అందుకు మీకేమైనా సమస్యా? అని ప్రశ్నించాడు. కాగా అమితాబ్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించాడు. -
కౌన్ బనేగా కరోడ్పతి.. ఒక్క ఎపిసోడ్కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-16కు హౌస్ట్గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్బీ కండీషన్?
పెళ్లయ్యాక భార్య ఇంటిపట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది! అందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడట! ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి జయా బచ్చన్ వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము అక్టోబర్లో పెళ్లి చేసుకోవాలన్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని! ప్రతిరోజూ షూటింగ్స్కి వద్దుఅమితాబ్ నాతో ఏమన్నాడంటే.. ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు పని చేసే భార్య నాకొద్దు. అలా అని నిన్ను సినిమాలు మానేయమని చెప్పడం లేదు. కానీ ప్రతిరోజు షూటింగ్స్కే సమయం కేటాయించొద్దని అంటున్నాను. నీకు కరెక్ట్ అనిపించిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకో, నచ్చినవాళ్లతోనే సినిమాలు చేయు అని సలహా ఇచ్చాడు.ఒప్పుకోలేదని జూన్లో పెళ్లిఅక్టోబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న మేము జూన్లోనే వివాహంతో ఒక్కటయ్యాం. అందుకు ఓ కారణముంది. మేమిద్దం జంటగా నటించిన జంజీర్ సినిమా సక్సెస్ను ఆనందిస్తూ ఓ ట్రిప్కు వెళ్లాలుకున్నాం. అయితే జంటగా వెళ్లేందుకు అమితాబ్ కుటుంబం ఒప్పుకోలేదు. మనం పెళ్లి చేసుకుంటేగానీ హాలీడేకు కలిసి వెళ్లనిచ్చేలా లేరన్నాడు. అలాగైతే అక్టోబర్దాకా ఆగడమెందుకు? ఈ జూన్లోనే పెళ్లి చేసుకుందామన్నాను. దానికంటే ముందు మా పేరెంట్స్తో మాట్లాడమని చెప్పాను. నాన్నకు ఇష్టం లేదుఅలా మా నాన్నను కలిసి విషయం చెప్పాడు. కానీ ఆయనకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయింది అని జయ తెలిపింది. తన మనవరాలు నవ్య నంద నిర్వహించే 'వాట్ ద హెల్ నవ్య' అనే పాడ్కాస్ట్లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమేనని తెలిపాడు. సినిమాకు బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.గొప్ప స్టార్గా..కాగా పెళ్లి తర్వాత బిగ్ బీ ఎవరూ ఊహించనంత గొప్ప స్టార్ అయ్యాడు. జయ తన కుటుంబానికే సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్, కూతురు శ్వేతకు కావాల్సినవి సమకూరుస్తూ అమ్మ బాధ్యతను నిర్వహించింది.చదవండి: కోట్ల అప్పు వల్లే ప్రాణాలు తీసుకున్న దర్శకుడు? -
'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!
ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
అశ్వద్దామ అమితాబ్ నటనపై బాలీవుడ్ సైలెంట్..?
-
'రెబల్స్ ఆఫ్ కల్కి' వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి. -
ప్రభాస్కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
బిగ్బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్తో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు హాజరైన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. జూలై 12న పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సహా తదితరులు హాజరయ్యారు.అయితే బిగ్బీ, తలైవా ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయంగా పలకరించుకున్నారు. బిగ్బీ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రజనీ.. ఆయన పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అమితాబ్ వద్దని వారించి ఆయన్ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఇది చూసిన అభిమానులు ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమ, గౌరవం అని కొనియాడుతున్నారు. శనివారం జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో అమితాబ్ కలర్ఫుల్ షేర్వాణీ ధరించగా రజనీకాంత్ వైట్ డ్రెస్లో కనిపించాడు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) చదవండి: సినీ దర్శకుడు ఆత్మహత్య -
వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయిపోతున్నా సరే ప్రభాస్ 'కల్కి'కి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ దాటేసినట్లు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో అశ్వద్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక సెట్లో ప్రభాస్ కాళ్లకు నమస్కారం చేస్తానని చెప్పడం లాంటి కామెంట్స్తో ఈయనపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.షూటింగ్ జరుగుతున్న టైంలో అమితాబ్, వాష్ రూమ్కి వెళ్లాలన్నా సరే తన అనుమతి తీసుకునేవారని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. తాజాగా దీనికి అమితాబ్ వివరణ ఇచ్చారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తన బ్లాగ్లో రాసుకొచ్చారు. సెట్లో ఉన్నంత సేపు తాను ఓ పనివాడిని అయితే.. దర్శకుడు కెప్టెన్ లాంటి వాడని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్గా కోట్ల విలువైన వాచీలు)'మంచితనంగా ఉండటానికి ఇదేం ఉదాహరణ కాదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం. వాష్ రూమ్కి వెళ్లేందుకు నేను పర్మిషన్ అడిగారని డైరెక్టర్ చెప్పారు. అవును అది నిజమే. అది అతడి సెట్, అతడి సమయం, అక్కడ అతడే కెప్టెన్. నేను కేవలం పనోడిని మాత్రమే. ఒకవేళ నేను బయటకెళ్లాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి కదా! సెట్కి నన్ను పిలిచింది అతడే. అందుకే అతడి చెప్పిన విషయాల్ని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నేను అదే చేశాను' అని అమితాబ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.'కల్కి' సినిమాలో అశ్వద్థామగా కనిపించి అమితాబ్.. 80 ఏళ్ల వయసులోనే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో రఫ్ఫాడించారు. ఒకానొక సమయంలో హీరో ప్రభాస్ అయినప్పటికీ.. పార్ట్-1లో తన యాక్టింగ్తో అశ్వద్థామనే అసలైన హీరో అనిపించేలా యాక్టింగ్ చేశారు. ఇలా ఇంత డెడికేషన్ చూపిస్తూ డైరెక్టర్ చెప్పింది వింటున్నారు కాబట్టి ఇప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారేమో!(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?) -
రూ. 1000 కోట్ల క్లబ్లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
నా సినిమా ఫ్లాఫ్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు. అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. -
కల్కి సినిమా నుంచి అశ్వత్థామ సాంగ్.. వీడియో వైరల్
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా కల్కి సినిమా నుంచి పాటలను విడుదలను కూడా విడుదల చశారు. 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో కేశవ, మాధవ పాటను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న విడుదలైన కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. సంతోష్ నారాయాణ్ పాడిన ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
1000 కోట్లు ఊరికే రాలేదు..! ఇవి కదా ప్లస్ పాయింట్స్
-
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
ఫైనల్ చూడలేదు.. తెలియకుండానే కన్నీళ్లు: బిగ్బీ
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశ్వవేదికపై భారత జెండా రెపరెపలాడింది. టీ 20 వరల్డ్కప్ (2024) ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ అపురూప క్షణాలను అభిమానులు, సినీ తారలు టీవీలో చూసి మురిసిపోయారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ విజయం వరించిందని తన్మయత్వానికి లోనవుతున్నారు.టీవీ చూడలేదుబాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్గా ఇండియా.. టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచాం.. ఈ ఆనందం, ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. నేను మ్యాచ్ చూస్తే ఎక్కడ ఓడిపోతామోనని టీవీ చూడలేదు. మనందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి అని తన బ్లాగ్లో రాసుకొచ్చాడు.ఎమోషనల్ ట్వీట్'తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా.. భారత్ మాతాకీ జై.. జై హింద్! జై హింద్!!' అని ఎక్స్లో ట్వీట్ చేశాడు. కాగా నిన్న (జూన్ 29న) జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫినాలేలో సౌతాఫ్రికాను వెనక్కునెట్టి భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే!సినిమాల సంగతి..అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన కీలక పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదలైంది. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్లు రాబట్టింది. T 5057 - Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..WORLD CHAMPIONS INDIA 🇮🇳भारत माता की जय 🇮🇳जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024 చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా? -
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్గారు లెజెండ్. మేము సెట్స్లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్గారి అబ్బాయి రోషన్తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
కల్కి లో ప్రభాస్ ని డామినేట్ చేసిన ఆ యాక్టర్...
-
ప్రభాస్ ‘కల్కి’ మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్లో, న్యూయార్క్లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లు, బెల్ట్లు... అన్నీ హ్యాండ్మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్లో ఒక ఫ్యాబ్రిక్కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
ప్రభాస్ను ఇలా ఎప్పుడు చూడలేదు: కల్కిపై ఆర్జీవీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది. దీంతో ప్రభాస్ సక్సెస్ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీపై సంచలన డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ను కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్ బచ్చన్ వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ప్రభాస్ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఇవాళ రిలీజైన కల్కి చిత్రంలో ఆర్జీవీ అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ స్టార్స్ సైతం ఈ సినిమాలో మెరిశారు.Hey @nagashwin7 KUDOS to ur AMBITION and IMAGINATION .. @srbachchan is a 100 times more dynamic than ever and #prabhas is in a never before seen avatar and AHEM 😌also THANKS for giving me my acting DEBUT 😌#Kalki2898— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2024 -
Kalki 2898 AD: అశ్వత్థామగా బిగ్బీ, అర్జునుడిగా దేవరకొండ.. ఇంకా.. (ఫోటోలు)
-
ప్రభాస్ ‘కల్కి’ మూవీ..ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్హాసన్, అమితాబ్బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, రెండు ట్రైలర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల గురువారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కల్కి’ కథేంటి? నాగ్ అశ్విన్ కలల ప్రాజెక్టు ఎలా ఉంది? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.. అవేంటో చదివేయండి. అయితే ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. భైరవగా ప్రభాస్ను అద్భుతంగా చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడంటూ నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని తెలుపుతున్నారు. అయితే, 20 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ ప్రారంభం అవుతుందని వారు చెబుతున్నారు. ఇందులో యానిమేషన్ విజువల్స్ కూడా భారీగానే మెప్పించాయి. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చెప్పినట్లుగా బుజ్జి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. Last 30mins🥵🔥 Mahabharatam🙌 #KALKI #Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan #kalki2898ad #BlockBusterKALKI pic.twitter.com/blithytX2g— Crick...Shyam!! (@ShyamCrick) June 27, 2024 అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలెట్గా నిలుస్తాయంటున్నారు. కమల్ హాసన్ గెటప్ మాత్రం పీక్స్లో ఉంటుందని ఆయన పాత్రకు మంచి మార్కులే పడుతాయని అంటున్నారను. ఫైనల్గా కల్కితో ప్రభాస్ హాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించబోతున్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.మరికొందరు మాత్రం కల్కి 2898 ఏడీ సినిమా యావరేజ్గా ఉందంటూ తెలుపుతున్నారు. కథ చెప్పడంలో కాస్త నెమ్మది ఉందని తెలుపుతున్నారు. కానీ, ఎక్కువ ప్రాంతాల్లో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అక్కడక్కడా కాస్త బోరింగ్ ఫీల్ అవుతారని అంటున్నారు. సినిమా యావరేజ్ అని కూడా కొందరు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని కూడా వారు చెబుతున్నారు. ఇందులో ఊహించని కెమియో రోల్స్ ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ సినిమా ఉందంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.It's Time For #Kalki2898AD, claimed to be Biggest Indian Film, with 600+ Cr Budget and PAN India Mass Appeal 💡All said an done, I wanted to see what #NagAshwin invisioned & created.I belive, this could be the game changer and taking that feeling in to the theater.Without… pic.twitter.com/a8KvWrJQXU— Ashwani kumar (@BorntobeAshwani) June 27, 2024 #KALKI2898AD gets unanimous positive talk in tamil#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/3U4un4OPrF— Tolly hub (@tolly_hub) June 27, 2024#Kalki2898AD - 3.75 ⭐ /5 ⭐ • #Prabhas 's Performance & Comedy Timings 🔥• Storyline & #NagAshwin 's Direction 🏆• SANA 's Background Scores 💣💥 Literally ge is The Second Hero.• Pre - Interval 🧨• VFX Standard & Visuals .. Literally a Never Seen Stuffs - in… pic.twitter.com/ghh0WFA8Ph— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 26, 2024Epude #Kalki movie premier chusa... Just Superb.... anthe Never before visuals...Prabhas, Amitabh and Kamal Haasan rocked the show.Nag ashwin Rating: 4.5/5 #Kalki28989AD#kalki #Kalki2898ADonJune27 #kalki2898 #Prabhas #DeepikaPadukone #Amitabh #KalkiUK pic.twitter.com/ZI8LgSbrBS— OTTRelease (@ott_release) June 27, 2024 #Kalki2898AD 2nd Half Arachakam 🔥🌋Block Buster Bomma 🔥🔥🤩@nagashwin7 - The Pride Of Indian Cinema #Prabhas Fans Collars Yegareyochu 🤘Waiting For Kalki Cinematic Universe pic.twitter.com/yAyou7Jl2K— 𝘿𝙖𝙧𝙡𝙞𝙣𝙜𝙨...🖤 (@ajayrock1211) June 26, 2024#KALKI2898AD #kalki2898ADreviewGood: Grand scale, good story, Ashwathama, Climax.Bad: BGM, loose screenplay, many unwanted scenes, Prabhas characterization in first half was silly, wasted opportunities to connect emotionally. Overall ok ok.— goutham (@Goutham_se) June 26, 2024Finished watching #Kalki2898AD Kalki Cinematic Universe 🔥🔥🔥Review :- No words 🤐, Especially Last 30mins🔥🔥🔥, Goosebumps guarantee, KCPD Worth Watching. Nagi Mawa - unexpected from you.Prabhas character - Surya puthraa *****#Kalki2898AD #PRABHAS @VyjayanthiFilms pic.twitter.com/i2NoumQPxP— Jagadish (@kvj2208) June 26, 2024Deepika Padukone as Danerys Targeryan for Interval, is the best non heroic goosebumps moment for me@Music_Santhosh BGM is fucking lit 🔥🔥#kalki2898ad #Prabhas pic.twitter.com/yTPffkrLO6— sampathkumar (@Imsampathkumar) June 26, 2024Indian film directors need super mega stars like #prabhas to pull off visual grandeurs like #kalki2898ad Film may have few flaws but what @nagashwin7 envisioned is second to none and is filled with huge brilliance.DO NOT MISS this movie! Visual extravaganza!@HailPrabhas007— Nikhil (Srikrishna) Challa (@Srikrishna6488) June 26, 2024Finished watching #kalki2898ad @nagashwin7 took his time and research to get this epic on screen Visuals are Out the world ,Screen play was on point ,Comedy personally did not work for me at some point Mahabharatham shots are crisp 🤌🏻Last 20 mins 🔥🔥🔥🔥 Casting is 👍 pic.twitter.com/h7QnfR7cYJ— TIG🐯R (@GopiSai251) June 26, 2024#Kalki2898AD A breath of fresh air to Indian cinema. Theme : Dystopian future entangled in mythology. Rating : ⭐️⭐️⭐️Long read🧵— 🪬Absurdism 🪢 (@absurdtips) June 26, 2024World’s first premier show completed in Finland @PrabhasRaju Mind blowing visualsVery good first half 👌👌Awestruck second half 🔥🔥🔥 Fight between @SrBachchan and @PrabhasRaju is next level. Repeat watches for sure Thanks @nagashwin7 #Kalki2898AD #kalki2898 #Prabhas pic.twitter.com/VrL9PNqb49— Jyothi Swaroop (@subbuswaroop) June 26, 2024Em Tesav Bhayya Next Part Kosam Em Hype Ekkinchinav Pakka Indian Star Wars Type Film This Is Repeating Like Baahubali 1 and The Next One Will Be Like Baahubali 2 Kalki Cinematic Universe #kalki2898 #Kalki2898AD #KALKI2898ADBookings #ProjectK#Prabhas#RebelStarOochaKotha— RTC X ROADS DEVARA 🌊⚓ (@MGRajKumar9999) June 26, 2024#Kalki2898ADFirst 30 Min#Kalki Review #KALKI2898ADO >>> #Salaar 💥🔥Nagashwin 💥Super hero entry #Prabhas performance 💥💥💥 comedy timing 🔥Songs 👍💥Bgm 🔥🔥🥁overall ga movie lover ki biggest festival 🤙My rating : 4.5 / 5 #Kalki#KALKI2898ADO #Kalki28989AD pic.twitter.com/lXu69nullD— Daemon (@sammyTFI) June 27, 2024 -
మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవలే కొత్త ఫ్లాట్లు కొన్నాడు. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. వీటి కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. తాజాగా ఈయన తండ్రి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆఫీసు పెట్టుకునేందుకు పనికివచ్చే మూడు కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ముంబైలోని వీరసావర్కర్ సిగ్నేచర్ భవంతిలోనే ఈ ఆఫీస్ స్పేస్ ఉందట! దీని మొత్తం విలువ రూ.60 కోట్లు కాగా.. వీటికోసం బిగ్ బీ ఇప్పటికే సుమారు రూ.4 కోట్లు అడ్వాన్స్గా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కమర్షియల్ ప్రాపర్టీ కొనడం అమితాబ్కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే సిగ్నేచర్ బిల్డింగ్లో నాలుగు ఆఫీస్ స్పేస్లను కొని గతేడాది అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దె ద్వారానే ఏడాదికి రూ.2.07 కోట్లు సంపాదిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. బిగ్బీ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 26న) విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా? -
'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?
ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే కోట్లాది టికెట్స్ అమ్ముడుపోయాయి. మరిన్ని చోట్ల బుకింగ్స్ ఇంకా నడుస్తున్నాయి. మొన్నటివరకు సరిగా ప్రమోషన్ జరగలేదని బాధపడిన ఫ్యాన్స్.. ఇప్పుడొస్తున్న బజ్ చూసి తెగ సంతోషపడిపోతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'కల్కి' ఓ పెద్ద సవాలు ఉంది. దీన్ని దాడటం పెద్ద కష్టమేమి కాదు గానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చేస్తాడోనని అందరూ వెయిటింగ్.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్ఫుల్!)ఇలా థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే అర్థమైపోవడానికి, ఎంజాయ్ చేయడానికి 'కల్కి'.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో లేదంటే లవ్ స్టోరీనో కాదు. సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ కాంబోలో తీసిన క్రేజీ సినిమా. భూత, భవిష్యత్, వర్తమాన అంశాల్ని స్టోరీలో మిలితం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వర్తమాన, భవిష్యత్ ఉండే సీన్లనీ అర్థం చేసుకోవడం ఎవరికీ పెద్దం కష్టమేం కాకపోవచ్చు.'కల్కి'లో మహాభారతం ఆధారంగా తీసిన సీన్లు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా కల్కి, కలి, అశ్వథ్ధామ పాత్రల రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఒకప్పటి జనరేషన్కి పర్వాలేదు గానీ ప్రస్తుత టీనేజీలో ఉన్న యూత్ వీటన్నింటిని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా కాకపోయినా కాస్తయిన అవగాహన ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఇన్ డీటైల్డ్గా అయితే చెప్పలేరు కదా! మరి ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేశాడనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.(ఇదీ చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?) -
Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా, అమితాబ్,కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది.మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్నే నాగ్ అశ్విన్ తీసుకొని దానికి సాంకేతిక జోడించి, సినిమాటిక్గా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా.కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. అయితే ఇందులో ‘కల్కి’ ఎవరు? ‘కలి’ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు. హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు ‘భైరవ’. అశ్శత్థామగా అమితాబ్ నటించాడు. కమల్ పోషించిన పాత్ర పేరు ‘సుప్రీం యాస్కిన్’ అని వెల్లడించారు. ఇక గర్భిణీ ‘సమ్-80’ గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్. సుప్రీం యాస్కిన్ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కమల్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్ చెప్పిన డైలాగ్ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది. భైరవగా నటించిన ప్రభాస్నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. డైరెక్టర్ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్ 27 రిలీజ్)ఆగాల్సిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?
ప్రభాస్ 'కల్కి' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ అంచనాల్ని భారీగా పెంచేశాయి. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటమే దీనికి నిదర్శనం. మరోవైపు రిలీజ్ దగ్గర పడే కొద్ది మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతోంది. తాజాగా టీమ్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది.'కల్కి'లో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ సీన్స్ గురించే అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'నాగి.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించేందుకు కొన్ని ఫొటోలు చూపించాడు. 'కల్కి'లో నాది ప్రభాస్ని కొట్ట క్యారెక్టర్ అని చెప్పాడు. ముందే చెబుతున్నా ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి' అని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. 'అయ్యో సర్, వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా!' అని చెప్పాడు.ఇకపోతే తెలంగాణలో బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. 8 రోజుల పాటు ఐదు షోలకు అనుమతిచ్చారు. అలానే సింగిల్ స్క్రీన్లో రూ.75, మల్టీప్లెక్స్లో రూ.100 వరకు ధర పెంచుకునేందుకు అనుమతిచ్చారు. ఉదయం 5 గంటలకే బెన్ఫిట్ షోలు వేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇంకా టికెట్ ధరల గురించి తేలాల్సి ఉంది. నేడో రేపో టికెట్ ధరల పెంపుపై జీవో వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?) -
ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?
'కల్కి' రిలీజ్కి మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్లో కాకపోయిన ఓ మాదిరి హైప్ ఉంది. ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్స్ సూపర్గా ఉన్నాయి. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తోందనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎవరెమనుకున్నా సరే ఒక్కసారి సినిమా క్లిక్ అయితే జనాలు ఇవేవి పట్టించుకోరు. సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు 'కల్కి' రెమ్యునరేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా 'కల్కి'ని ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్తో తీశారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)అయితే మొత్తం బడ్జెట్ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా! ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. అలా హీరోగా చేసిన ప్రభాస్కి రూ.150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్కి తలో రూ.20 కోట్లు ఇచ్చారని సమాచారం. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.దీనిబట్టి చూస్తే మొత్తం బడ్జెట్లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్తో మూవీ తీశారనమాట. ఏదేమైనా సంక్రాంతి తర్వాత భాక్సాఫీస్ డల్లుగా ఉంది. 'కల్కి' గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారంటీ. మరి మీలో ఎంతమంది 'కల్కి' కోసం వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)