Aishwarya
-
కింగ్ ఆఫ్ కొత్త హీరోయిన్ 'ఐశ్వర్య లక్ష్మి' బ్లాక్ శారీ ఫోటోలు
-
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐశ్వర్య రజినీకాంత్ (ఫోటోలు)
-
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
లవ్ అని చెప్పు...
అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
స్టూడెంట్గా నటించడం ఓ సవాల్: ఐశ్వర్యా శర్మ
‘‘డ్రింకర్ సాయి’లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో బాగీ పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ధర్మ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యా శర్మ మాట్లాడుతూ– ‘‘మా నాన్న స్టేజ్ యాక్టర్ కావడంతో నేనూ ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. ఇంటర్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కొన్ని యాడ్స్లో నటించాను. ‘డ్రింకర్ సాయి’తో హీరోయిన్గా పరిచయమవుతున్నాను. ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ బాగీ పాత్ర చేశాను. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అందుకే ఈ స్టూడెంట్ క్యారెక్టర్ సవాల్గా అనిపించింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికీ, ‘డ్రింకర్ సాయి’ సినిమాకు పోలిక లేదు’’ అని చెప్పారు. -
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫొటోలు)
-
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
కూతురి డ్రీమ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్..
-
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్గా పనిచేసింది.స్కూల్ డేస్లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్కి మోడల్గా పని చేసింది. టీవీ కమర్షియల్స్లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
'అలీ క్లబ్ మిస్ ఫినాలే'లో ఐశ్వర్య!
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా యువ ప్రతిభను కనిపెట్టి, వారిని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక పోటీ ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా’. ఈ పోటీలో పాల్గొనడానికి, విజేతగా నిలవడానికి దేశవ్యాప్తంగా యువత ఆసక్తి చూపిస్తుంది. అయితే ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా–2024’ పోటీల్లో హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల కాటేపల్లి ఐశ్వర్య ఫైనలిస్ట్గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.ఫ్యాషన్, జీవనశైలి, వినోద రంగాల్లో యువ ప్రతిభతో వారి కలలను నెరవేర్చుకోవడానికి అద్భుత వేదికగా ఫ్యాషన్ పోటీలు నిలుస్తా్తయి. ముఖ్యంగా నగరంలో ‘అలీ క్లబ్ మిస్, మిస్టర్ టీన్ ఇండియా’.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ద్వారా గుర్తింపు పొందింది. ఇలాంటి వేదికపై తన అభిరుచులు, ఫ్యాషన్పై ఆమె అంకితభావంతో విజేతగా నిలవడానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. సెమీ ఫైనల్స్ ఆత్మస్థైర్యాన్ని పెంచింది... ప్రస్తుతం షాఫ్ట్ మల్టీమీడియాలో కంప్యూటర్ సైన్స్పై దృష్టి సారిస్తూ 12వ తరగతి చదువుతోంది ఐశ్వర్య. ఆమె చదువులతో పాటు మల్టీమీడియా, ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా కోసం కృషి చేస్తుంది. నగరంలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందుతోంది. ఈ ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన వృద్ధికి ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నెల 31న ఢిల్లీ వేదికగా జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలవడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నానని ఐశ్వర్య తెలిపింది.గత నెలలో జరిగిన సెమీ–ఫైనల్ రౌండ్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న ఫ్యాషన్ ఔత్సాహికులను దాటుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టడం మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చే ఈ వారసత్వంలో ప్రాతినిథ్యం వహిస్తూ హైదరాబాద్ నగరాన్ని మరోసారి జాతీయ వేదికపై నిలపడం సంతోషంగా ఉందన్నారు. తన తోటి పారి్టసిపెంట్స్తో కలిసి జడ్జిల ప్యానెల్ ముందు తమ సామర్థ్యాలను ప్రదర్శించే ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య తెలిపింది. -
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. అది మన చేతుల్లోనే ఉంది: నటి
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్లో కనిపించింది.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్, క్యాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్గా తన కెరీర్ని ప్రారంభించింది. 2016లో కింగ్ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. -
దుబాయ్లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి
ముస్తాబాద్(సిరిసిల్ల): కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్ ఐశ్వర్య (20)కు గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ్య, విజయ దంపతుల కుమారుడు హరీశ్తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఝాన్సీ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఇటీవలే భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఝాన్నీ అనారోగ్యానికి గురికాగా నెల రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ మృతిచెందడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. ఆమె కడసారి చూపునకు భర్త -
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్వర్క్స్ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్తో వేసిన డ్రాయింగ్ సిరీస్కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
హీరోను పెళ్లాడిన అర్జున్ కూతురు.. ఫోటోలు వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్ఫుల్గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య
-
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
Aishwarya Wedding Reception: డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్లో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రజతంగా ఐశ్వర్య కాంస్యం
గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. ఈ ఈవెంట్లో రజతం సాధించి ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫరీదా సొలియెవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దాంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా ఐశ్వర్య టైమింగ్ (53.07)ను రెండో స్థానంగా గుర్తిస్తూ ఆమె కాంస్యాన్ని రజతంగా మార్చారు. -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్గా పనిచేస్తున్న రోహిత్ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
నేను చనిపోవాలట.. వారికేం వస్తుందో మరి!: బుల్లితెర నటి
ఒకప్పుడు సెలబ్రిటీలను ఆరాధించేవారు. పొగడ్తలే ఎక్కువగా వినిపించేవి.. విమర్శలు అంతగా ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా ముఖం పట్టుకుని తిట్టేంత సీన్ అయితే లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని తారలు ఏ పోస్ట్ పెట్టినా.. అక్కడే తిట్టేస్తున్నారు, నోటికొచ్చింది అనేస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ బాధితురాల్లో బుల్లితెర నటి ఐశ్వర్య శర్మ ఒకరు. నేను చనిపోవాలట ఒకరైతే ఏకంగా ఆమెను చచ్చిపోమని కోరారు. దానికి ఐశ్వర్య.. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం.. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలనే కోరుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'ట్రోలింగ్ అనేది ఒక దినచర్యలా మారిపోయింది. ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను ఏ తప్పూ చేయలేదు అయినా అటువంటి కామెంట్స్ వస్తుంటే బాధగా ఉంటుంది. మరోవైపు నా అభిమానులు చాక్లెట్స్, పువ్వులు.. ఇలాంటి బహుమతులు పంపుతూ ఉంటారు. గిఫ్టులు తీసుకోవడంలో నాకే ఇబ్బందీ లేదు. కానీ ఏ కారణం లేకుండా నా కోసం ఖర్చు పెట్టొద్దని నా అభిప్రాయం. అందుకే వారిని బహుమతులు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. బహుమతులు, విమర్శలు.. ఏదీ వద్దు అయినా వాళ్లు వినరు.. కానీ ఓసారి గుర్తు చేయాలనుకున్నాను. ఓ వ్యక్తి దీన్ని కూడా తప్పుపట్టి నాపై విమర్శలు గుప్పించాడు. నేను కూడా ఒక మనిషినే.. నేనేదైనా తప్పు చేస్తే మీరు ఇష్టమొచ్చినట్లు తిట్టండి, ప్రశ్నించండి. కానీ ఏమీ చేయకపోయినా నన్ను అనరాని మాటలు అంటున్నారు. అదెందుకో అర్థం కావడం లేదు. నాకు ఎవరి బహుమతులు వద్దు, ఎవరి విమర్శలూ వద్దు. ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను చచ్చిపోతే వారికి మనశ్శాంతి వస్తుందా? శాడిస్టులు.. ముందేమో తిడతారు.. నటులు ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతారు. అసలు మీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు. కొందరు శాడిస్టులు పక్కవాళ్లను మాటలతో హింసించి ఆనందం పొందుతారు. సెలబ్రిటీల జీవితం ఎంతో ఆకర్షణీయంగా బాగుంటుందనుకుంటారు. కానీ దాని వెనక వారు పడ్డ కష్టాలను ఎవరూ పట్టించుకోరు. ఒక ఆర్టిస్టుగా నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక నెగెటివ్ రోల్ చేస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాననుకుంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్?' అని ఆవేదన వ్యక్తం చేసింది నటి ఐశ్వర్య. చదవండి: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే కల్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్ దేవ్ గతంలో తన తల్లి బర్త్డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)
-
ప్రభు కూతురిని పెళ్లాడిన ప్రముఖ డైరెక్టర్, ఫోటో వైరల్
ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'డార్లింగ్ అధిక్, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లిని మహారాణిలా చూసుకోవాలి జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సర్, పునీత ఆంటీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? సరదాగా అన్నానులే.. నువ్వు తనను బాగా చూసుకుంటావని నాకు తెలుసు. అదేంటో కానీ నా సోదరీమణులందరూ ఐశ్వర్య అనే పేరుతోనే కనిపిస్తారు. మీ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఐశ్వర్యకు రెండో పెళ్లి.. కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో బంధువైన కునాల్తో ఆమె పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. కానీ కొంతకాలానికి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు విడాకులిచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో దర్శకరచయితగా సినీ కెరీర్ ఆరంభించాడు. 'దబాంగ్ 3' అనే బాలీవుడ్ సినిమాకు రచయితగానూ పని చేశాడు. ఇటీవల 'మార్క్ ఆంటోని' సినిమాతో కోలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ 'కే-13', 'నేర్కొండ పార్వై', 'కోబ్రా' సినిమాల్లో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అజిత్తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్! So damn happy for u my darling Adhik and my dearest sister Aishwarya on your wedding today and starting a new chapter in your lives and u hav the universe s blessings and especially your parents prabhu sir and punitha aunty's positivity and blessings now. Coming to the point,… pic.twitter.com/Vucqwch3J0 — Vishal (@VishalKOfficial) December 15, 2023 చదవండి: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు) -
మూడు రోజుల్లో పెళ్లి.. వరుని ఇంట్లో వధువు మృతి
కర్ణాటక: పెళ్లిపత్రికలు పంచారు, వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది, ఇంతలోనే ఘోరం జరిగింది. తాలూకాలోని టీబీ డ్యాం వద్ద మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి అనుమానాస్పదరీతిలో శవమైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు..టీబీ డ్యాం నివాసి ఐశ్వర్య (26) అనే యువతి వరుని ఇంట్లో విగతజీవిగా మారింది. వివరాలు.. అశోక్ (27), ఐశ్వర్య ఇద్దరు టీబీ డ్యాం వాసులు కాగా ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేర్వేరు కులాల వారు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పలు షరతుల ప్రకారం వివాహానికి సిద్ధమయ్యారు. తమ సంప్రదాయ ప్రకారం పెళ్లాడదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడని, తమ తరఫు నుంచి ఎవరూ రావద్దని చెప్పారని అమ్మాయి బంధువులు తెలిపారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుందని హఠాత్తుగా కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు. ఇది హత్యే: యువతి తండ్రి వారితో మనకు పొసగదని, ఈ పెళ్లి వద్దు అని మా కూతురికి చెప్పాం. ఆమె చాలా దృఢమైన మనస్సు గలది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, యువకుడి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి సుబ్రమణి మాట్లాడుతూ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి వద్దని నేను వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, 15వ తేదీన ఆమె అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాము. 16వ తేదీన అశోక్ ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. అంతకుముందే వారు రెండు ఆస్పత్రులకు ఆమెను తీసుకెళ్లారు. ఎలా చనిపోయిందో తెలియదు అని వాపోయారు. అశోక్ కుటుంబమే హత్య చేసిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వరున్ని అరెస్టు చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్య
బోనకల్/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఐశ్వర్య హైదరాబాద్లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎవరూలేని సమయంలో.. 'డెత్నోట్' రాసి.. విషాద నిర్ణయం!
సాక్షి, కర్ణాటక: వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళా టెక్కీ కేసులో శుక్రవారం గోవిందరాజనగర పోలీసులు ఐదుమందిని అరెస్ట్చేశారు. భర్త రాజేశ్, మామ గిరియప్ప, అత్త సీతా, విజయ్, తస్మితాను కటకటాల వెనక్కు పంపారు. అమెరికాలో ఎంబీఏ చదివిన ఐశ్వర్య(26)కు డైరీరీచ్ ఐస్క్రీమ్ కంపెనీ యజమాని రాజేశ్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఐశ్వర్య తండ్రి సుబ్రమణి చెల్లెలి భర్త రవీంద్ర.. రాజేశ్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నారు. ఇతనే రాజేశ్కు పెళ్లి సంబంధం చూశాడు. మూడునాలుగేళ్లు ఇరుకుటుంబాలు సంతోషంతో అన్యోన్యంగా ఉన్నాయి. ఆస్తి విషయంలో రవీంద్ర, సుబ్రమణి కుటుంబాల్లో గొడవలు ఏర్పడ్డాయి. ఐశ్వర్య తండ్రిపై కోపంతో రవీంద్ర ఐశ్వర్య సంసారంలో నిప్పులు పోశారు. ఐశ్వర్యపై రాజేశ్కు లేనిపోని అబద్దాలు చెప్పి దంపతుల మధ్య గొడవలు పెట్టాడు. దీంతో రాజేశ్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యను వేధించారు. అయినప్పటికీ ఐశ్వర్య సహనం కోల్పోలేదు. ఉద్యోగం చేసిన సంపాదనలో భర్తకు విలాసవంతమైన బైకు, బంగారు ఆభరణాలు అందించింది. కానీ కుటుంబ సభ్యులు మాటలు విని రాజేశ్ దూషణలకు పాల్పడటంతో ఐశ్వర్య 20 రోజుల క్రితం విజయనగరలోని పుట్టింటికి చేరుకుంది. గతనెల 26 తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో డెత్నోట్రాసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అల్లుడు, కుటుంబసభ్యులే కారణమని పలువురు పేర్లతో గోవిందరాజనగర పోలీస్స్టేషన్లో ఐశ్వర్య తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య భర్తతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్చేసి విచారణ చేపడుతున్నారు. ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం భర్త రాజేశ్, తల్లిదండ్రులు గిరియప్ప, సీతా, విజయ్, తస్మిన్ గోవా, ముంబైలో పార్టీ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా.. -
ఐశ్వర్య రాయ్ బర్త్డే @ 50.. ఆమె పేరుతో ఫ్లవర్.. కోట్లల్లో సంపద
ఆమె అందాల రాశి, నీలి కళ్ల సుందరి, ప్రపంచ సుందరి ఇలా ఎన్నో ఐశ్వర్య రాయ్ బచ్చన్కు ఉన్న ట్యాగ్లైన్స్.. నేడు ఆమె పుట్టినరోజు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం. మిస్ వరల్డ్ కిరీటం కూడా ఆమె ధరించాకే దానికి విలువ పెరిగిందా అనేలా ఆమె సోయగం ఉంటుంది. అలా ఒక నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు. నేడు నవంబర్ 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... ఐష్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. ఆమె కాలేజీలో చదువుకునేప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు)తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య. సల్మాన్తో గొడవ.. అభిషేక్ బచ్చన్తో పెళ్లి అలా బాలీవుడ్లో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది. అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఐశ్వర్య నటించింది. 1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయానని వివరించారు ఆమె. ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వారు నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పుట్టుకతో హిందువైన ఐశ్వర్యకు సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి ఎక్కువ. 16 నవంబరు 2011న వీరికి ఒక పాప జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు. 50వ పుట్టినరోజు ఈ సందర్భంలో, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. స్క్రీన్ స్టార్ల అభిమానులుగా అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సమయంలో మిస్ వరల్డ్గా కీర్తించబడుతున్న ఐశ్వర్యరాయ్ ఆస్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా వెలుగొందుతున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ నికర విలువ రూ. 776 కోట్లుగా అంచనా వేయబడింది. ఆమె భారతీయ సినిమాలో అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా గుర్తించపడ్డారు. ముంబైలోని రూ. 112 కోట్ల విలువైన బంగ్లాలో తన కుటుంబంతో ఆమె కలిసి నివసిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్ల నుంచి 12 కోట్లు తీసుకుంటుందని ప్రచారం ఉంది. ప్రకటనల కోసం అయితే సుమారు రూ. 6 కోట్ల రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఐశ్వర్య రాయ్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం ► డాక్టర్ కావాలని యాక్టర్ అయిన ఐశ్వర్య.. కాలేజీ రోజుల్లో ఆమె పెప్సీ యాడ్ చేసింది. దీంతో వచ్చిన గుర్తింపుతో మోడలింగ్ వైపు వెళ్లింది ► 1994లో ఐష్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్ 'మిస్ యూనివర్స్'గా నిలిచింది. ► ఐశ్వర్యకు భారత్లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఈమె నటించిన 'జోధా అక్బర్' చిత్రంలో ఆమె లుక్ ఆధారంగా బార్బీ బొమ్మలను తయారు చేశారు. ► నెదర్లాండ్స్లోని క్యూకెనోఫ్ గార్డెన్లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు. ► సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం..ఆయనకు అభిమాని ఐశ్వర్య ► 2009లో భారత ప్రభుత్వం 'పద్మ శ్రీ' అవార్డుతో ఐశ్వర్యను సత్కరించింది ► 2012లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం 'ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్' పురస్కారాన్ని అందించింది. ► 2003లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా ఐష్ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి ఆమెనే ► 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిశ్చితార్థం పూర్తి
ప్రవీర్ శెట్టి, ఐశ్వర్యా గౌడ జంటగా రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంగేజ్మెంట్’. రోడియమ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జయరామ్ దేవ సముద్ర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జయరామ్ దేవ సముద్ర మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఎంగేజ్మెంట్’. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. రాజు బొనగాని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒడియా భాషల్లో రిలీజ్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, రజత్ గోష్, కెమెరా: వెంకట్ మన్నం, సహనిర్మాతలు: లక్ష్మీకాంత్ ఎన్ఆర్, నారాయణ స్వామి .ఎస్. -
Aishwarya Upendra: ఉపేంద్ర కూతురిని చూశారా? గ్లామర్తో మెరిసిపోతోంది (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్కు రజినీకాంత్ వార్నింగ్.. ఆమె కోసమేనా?
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. బెజవాడ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతోనూ నటించింది. లవ్ ఫెయిల్యూర్, నాయక్, రఘువరన్ బీటెక్ చిత్రాలతో మెప్పించింది. ఆడై చిత్రంలో అమల న్యూడ్గా నటించి అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్, శాండల్వుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటోంది. (ఇది చదవండి: ఆటో డ్రైవర్తో గొడవపడ్డ నటి.. డబ్బులివ్వకుండా చెక్కేసింది! ఇంత ఘోరమా?) అయితే తాజాగా ఓ మలయాళీ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ధనుశ్తో చాలా క్లోజ్గా ఉండేదని అంటున్నారు. వీరిద్దరు కలిసి నటించిన వేళైల్లై పట్టదారి సినిమాతో సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో తెగ వైరలైంది. అంతే కాకుండా వీరిద్దరి రిలేషన్పై కోలీవుడ్లో తెగ చర్చ నడిచింది. అయితే ప్రస్తుతం అమలాపాల్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ధనుశ్తో అమలాపాల్ సన్నిహితంగా మెలగడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. ధనుశ్, అమల మధ్య రిలేషన్ వల్లే రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని సమాచారం. రజినీకాంత్ తన కూతురు జీవితం కోసమే అమలా పాల్ ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే ఈ వార్తల్లోన నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. కొందరేమో ఇదంతా రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. (ఇది చదవండి: హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!! ) -
Brahmanandam 2nd Son Haldi Photos: బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య హల్దీ ఫంక్షన్ (ఫోటోలు)
-
అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు... తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
భార్యకు దూరంగా స్టార్ హీరో.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!
అభిమానం వేరు.. అనుబంధం వేరని కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ మరోసారి నిరూపించారు. తాను రజనీకాంత్ వీరాభిమానిగా గతంలో చాలాసార్లు బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం చాలా కాలం సంతోషంగా సాగింది. అంతేకాకుండా ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా ధనుశ్, ఐశ్వర్య మనస్వర్థల కారణంగా విడిపోయి అందరికి ఊహించని షాక్ ఇచ్చారు. (ఇది చదవండి: హైపర్ ఆది ఓవరాక్షన్.. చిరంజీవిని జీరోగా.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం) అప్పటి నుంచి చాలాకాలంగా రజనీకాంత్ కుటుంబానికి దూరంగా ఉంటున్న ధనుష్.. తాజాగా చేసిన ట్వీట్తో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ధనుష్ ఇట్స్ జైలర్ వీక్ (ఇది జైలర్ వారం) అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ధనుష్ అభిమానులు తాను ముందు రజనీకాంత్ అభిమాని అని.. ఆ తర్వాతే అన్నీ అని ధనుష్ మరోసారి నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: మహేశ్ 'రీమేక్స్' అస్సలు చేయడు.. ఎందుకో తెలుసా? ) It’s JAILER week 😁😁😁 — Dhanush (@dhanushkraja) August 7, 2023 -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది'!
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. (ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) సాయికుమార్ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీమ్ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ.. 'జబర్దస్త్ కమెడియన్గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్ సరే అనగానే నేను సక్సెస్ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బిగ్బాస్లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) -
రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?
తమిళనటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. కానీ మళ్లీ కొద్దిరోజుల కిందట విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరిద్దరు మళ్లీ కలవడం అనేది అసాధ్యం అని అభిమానులు కామ్ అయిపోయారు. (ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్థుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్గా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఐశ్వర్యపై ఈమధ్య కోలీవుడ్కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించిందని తెలుస్తోంది. చెన్నైలోని ఓ రిసార్ట్లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియదు. ఇదే విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు. ఎందుకు విడిపోయారు.. కారణం ఇదేనా? కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా బయటకు తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించగా తర్వాత ధనుష్ ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కానీ సుచీ లీక్స్లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినరోజు నుంచే వీరి మధ్య గొడవ స్టార్ట్ అయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ధనుష్ ఓ హీరోయిన్తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే ఐశ్వర్య విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందనే టాక్ ఉంది. కోలీవుడ్లో ధనుష్కు ఉన్న ఎఫైర్ విషయంలో ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చి.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) -
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్
-
గుండెల్లో మోగిందే నీ కబురే!
నిఖిల్, ఐశ్వర్యా మీనన్ జంటగా ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ ఆదివారం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
రజనీ రాజకీయాల్లోకి వచ్చినా వేస్ట్: సోదరుడు సత్యనారాయణ రావు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించి తర్వాత వెనక్కి తగిన విషయం తెలిసిందే. దానికి ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ, అప్పటి నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్తో పాటు తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్రలోనూ నటిస్తున్నారు. ఇవి గాక మరో రెండు చిత్రాలకూ పచ్చజెండా ఊపేశారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని స్వయానా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొనడం విశేషం. ఇందుకు కారణాన్ని కూడా వివరించారు. రజనీకాంత్ ఇకపై రాజకీయాల్లోకి రావాలని, వచ్చినా ప్రయోజనం ఏమీ లేదనీ వ్యాఖ్యానించారు. కారణం ఆయన వయస్సు ఏడు పదులు దాటడమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ఎవరికీ మద్దతు పలికే అవకాశం లేదని స్పష్టం చేశారు. దేవుని దయ వల్ల ఆయన సుదీర్ఘ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సోదరుడు సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం తిరుచెందూర్ కుమారస్వామి ఆలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్ నటిస్తున్న జైలర్, లాల్ సలాం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు. -
కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ
ఇటీవల టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న మధ్యాహ్నం టెక్సాస్లోని ఓ షాపింగ్ మాల్లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. హీరో సూర్యకి ఐశ్వర్య పెద్ద అభిమాని. (చదవండి: యుద్ధ భూమిలో కలుద్దాం తారక్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్ ) తన అభిమాని చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశాడు. ‘మిమ్మల్ని(ఐశ్వర్య పేరెంట్స్) ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి మనకు తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బతికే ఉంటుంది’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రును ఓదార్చాడు. అలాగే ఐశ్వర్య గురించి రాస్తూ.. ‘నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు.. ప్రేమను పంచే నీ గుణం.. ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది’ అని రాసుకొచ్చాడు. A man who respects his fans is a real star. Heartfelt note from @Suriya_offl to his fan #Aishwarya, who was shot at the Allen Mall shooting in Texas, USA. Such comforting words. pic.twitter.com/pfGJbM1fpl — Siddarth Srinivas (@sidhuwrites) May 19, 2023 -
అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..
నల్గొండ: మరో పది రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఐశ్వర్యను అంతలోనే మృత్యువు కబలించింది. పుట్టిన రోజు వేడుక సన్నాహాల్లో భాగంగా షాపింగ్కు వెళ్లిన ఐశ్వర్య దుండగుడి తూటాలకు బలికావడం ఆమె కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఐశ్వర్య ఈ నెల 18న పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల నడుమ జరుపుకోవాలని భావించింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఎలెన్ సూపర్ మార్కెట్కు షాపింగ్ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చలాకీగా, సరదాగా ఉండే ఐశ్వర్య ఇక లేదని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆమె చదువు పూర్తి కాగానే అక్కడే ఫర్ఫెక్ట్ జనరల్ కాంటాక్టర్స్ కంపెనీలో మేనేజర్గా పని చేస్తోంది. ఇంకో నెల రోజుల్లో అదే కంపెనీకి సీఈవోగా నియమించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఉద్యోగోన్నతి పొందకుండానే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపో యింది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తల్లిదండ్రులు తాటికొండ నర్సిరెడ్డి–అరుణతో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా షాపింగ్కు వెళ్తున్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. తల్లి దండ్రులతో అవే చివరి మాటలు. కాగా, ఐశ్వర్య భౌతికకాయం బుధవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేల పరామర్శ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దుండుగల తూటాలకు బలైన నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్లకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని వారి నివాసంలో మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పరామర్శించారు. ఐశ్వర్య భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. -
ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం
టెక్సాస్ అలెన్ ప్రీమియం ఔట్లెట్ మాల్లో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య(26) మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఆమె కుటుంబానికి సహకరిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ తెలియజేసింది. శనివారం టెక్సాస్ మాల్ కాల్పుల్లో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐశ్వర్య మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి తమ వంతు సాయం అందిస్తున్నామని హూస్టన్లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీమ్ మహాజన్ చెప్పారు. కాల్పుల్లో ఐశ్వర్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య పార్థివ దేహాన్ని భారత్కు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధి అశోక్ కోళ్ల కృషి చేస్తున్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు తీసి పంపుతున్నారు.. ప్రముఖ నటి ఆవేదన!
తమిళ నటి, పలు తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య భాస్కరన్. సీనియర్ నటి లక్ష్మి కూతురు అయిన ఐశ్వర్య టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అమ్మానాన్న తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్తో మెప్పించింది. అయితే తాజాగా తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇటీవల తాను ఆన్లైన్ లైంగిక వేధింపులకు గురయ్యానని ఐశ్వర్య తెలిపింది. చాలా మంది తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో డిప్రెషన్కు గురైనట్లు పేర్కొంది. కూతురి సలహాతోనే ఈ విషయాన్ని మీ అందరితో చెబుతున్నానని వివరించింది. కొందరు వ్యక్తులు అశ్లీల ఫొటోలు పంపిస్తూ తనను మానసికంగా వేధించారంటూ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సోప్స్ బిజినెస్ను ఆమె ప్రారంభించారు. ఐశ్వర్య మాట్లాడుతూ..'సోప్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ షేర్ చేశా. అప్పటి నుంచి తనకు అనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారు. కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేశారు. దీంతో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను.' అంటూ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో ద్వారా పంచుకున్నారు ఐశ్వర్య. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వీడియో ద్వారా హెచ్చరించారు. ఈ విషయంలో ఆమెకు చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కాగా.. ఐశ్వర్య భాస్కరన్ దక్షిణాదిలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. అడవిలో అభిమన్యుడు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. -
దొంగతనం చేయడానికి ఐశ్వర్యే కారణం.. పనిమనిషి షాకింగ్ స్టేట్మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఈమెను అరెస్ట్ చేసి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ విస్తుపోయే సమాధానం ఇచ్చింది. 'నేను ఐశ్వర్య ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాను. ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. అయితే ఐశ్వర్య దగ్గర బోలెడు డబ్బులు ఉన్నా నాకు రూ. 30వేల జీతమే ఇచ్చేవారు. ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టా. మొదట చిన్నచిన్న వస్తువులు దొంగిలించేదాన్ని. కానీ దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశాను' అంటూ విచారణలో ఈశ్వరి చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఐశ్వర్య చెప్పినదాని కంటే ఈశ్వరి ఇంట్లో ఇంకా ఎక్కవ బంగారమే దొరికింది. ఆమె ఐశ్వర్య ఇంటితో పాటు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో కూడా పనిచేసేదట. దీంతో ఆ నగలు అక్కడ దొంగిలించిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్ను తీసుకొని రోజూ బైక్పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్స్పోర్ట్స్, మోటర్స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్బాల్లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్లో మహిళలు మోటర్స్పోర్ట్స్లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
డోపింగ్లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్హామ్కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
నాకు పక్షవాతం వచ్చింది: బుల్లితెర నటి
రామ్సే హంట్ సిండ్రోమ్.. ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల ముఖభాగం పక్షవాతానికి గురవుతుంది. ప్రతి లక్ష మందిలో 5 నుంచి 10 మంది ఈ వ్యాధి బారిన పడుతారు. ఇటీవలే స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ తాను రామ్సే హంట్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. తాజాగా బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ మాట్లాడుతూ.. తాను కూడా రామ్ సే హంట్ బాధితురాలినేనని చెప్పుకొచ్చింది. 'ఇది 2014 నాటి సంగతి. షూటింగ్తో చాలా బిజీగా ఉన్నాను. నాకు గుర్తున్నంతవరకు అప్పుడు నేను మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్కు వెళ్లాను. రోహిత్(ఐశ్వర్య భర్త) ఎందుకు కన్ను కొడుతున్నావంటూ అడిగాడు. ఏదో జోక్ చేస్తున్నాడనుకుని లైట్ తీసుకున్నాను. కానీ తర్వాతి రోజు ఉదయం పళ్లు తోముకునేటప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది. తర్వాత నా రూమ్మేట్ నా ముఖం మారిపోతున్నట్లు గ్రహించింది. నేను వెంటనే డాక్టర్ను కలిశాను. అప్పుడు నాకు రామ్సే హంట్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. కానీ నేను ఒప్పుకున్న షెడ్యూల్స్ కారణంగా విశ్రాంతి తీసుకోలేదు. నా ముఖం సగం కనిపించకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్స్ చేశారు. తర్వాత స్టెరాయిడ్స్ ఇచ్చి వైద్యం అందించారు. నటిగా అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం. తిరిగి నార్మల్ అవుతానో లేదోనని భయపడ్డాను. కానీ నెల రోజుల్లోనే ఈ వ్యాధి నుంచి కోలుకున్నాను. జస్టిన్ బీబర్ కూడా దీన్నుంచి తప్పకుండా బయటపడతాడు' అని చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య చివరగా 2019లో 'ఉజ్దా చమాన్' సినిమాలో ఏక్త పాత్రలో నటించింది. 'సాస్ బీనా ససురాల్', 'ఆషికి', 'త్రిదేవియాన్', 'యే హై చహతే' వంటి పలు సీరియల్స్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Sakhuja (@ash4sak) చదవండి: షూలతో ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ? -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న హీరో అర్జున్ కూతురు!
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే కన్నడలో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మను తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం చేయాలని అర్జున్ భావిస్తున్నారట. తన సొంత డైరెక్షన్లోనే ఓ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్సేన్ను ఈ సినిమాలో హీరోగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త చిత్రం
కేరింత ఫేమ్ పార్వతీశం, ఐశ్యర్య హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ హరియాల, శ్రీమతి తాలబత్తుల మాధవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ...ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్నారు. ‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది’అని నిర్మాత సిద్దార్థ హరియాల అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Aishwarya: మూడు వందలకు పైగా డాన్స్ ప్రదర్శనలు.. ఇంకా
చక్కటి రూపం, పొడవైన జడ, చెవులకు జూకాలు ధరిస్తూన్న అచ్చమైన తెలుగు యువతి, ఆ పక్కనే మాయాబజార్ ప్రియదర్శినిలో అభిమన్యుడిని తన్మయత్వంతో చూస్తున్న శశిరేఖ, మరో చిత్రంలో ఓ పాపాయి. తండ్రి చేతుల్లో భద్రంగా ఉన్నాననే భరోసా ఆ పాపాయి కళ్లలో ప్రతిబింబిస్తోంది. ఇక కెంపులు పొదిగిన ఈ కంఠాభరణం సహజమైన మెరుపుతో అచ్చమైన బంగారు ఆభరణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రాలకు రూపమిచ్చిన కళాకారిణి ఈ పక్కన ఉన్న భరత నాట్యకారిణి... ఐశ్వర్య భాగ్యనగర్. భరతనాట్యం, బాలీవుడ్ డాన్స్ ఫ్యూజన్, భాంగ్రా నృత్యం, హిప్హాప్, థియేటర్ స్కిట్, టిక్టాక్... వీటన్నింటి మధ్యలో కుంచె పట్టుకుని సుదీర్ఘంగా పెయింటింగ్లో నిమగ్నమైపోవడం... ఇదీ ఈ అమ్మాయి ప్రపంచం. యూఎస్లో పుట్టిపెరిగిన ఈ తెలుగమ్మాయి తనకు తానుగా సృష్టించుకున్న ప్రపంచం. ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే నాకిష్టం. ఎదుటివారిని ఎంటర్టైన్ చేయడంలో నేను ఎంటర్టైన్ అవుతాను’ అంటున్న ఐశ్వర్య భాగ్యనగర్ పరిచయం. ఐశ్వర్య భాగ్యనగర్ పూర్వికులది కరీంనగర్ జిల్లా. ఆమె తండ్రి వేణు భాగ్యనగర్ యూఎస్లో స్థిరపడ్డారు. రెండేళ్లకోసారి ఇండియాకి వచ్చే ఈ అమ్మాయి భారతీయతతో ఎక్కువగా కనెక్ట్ అయింది. ఫ్యాషన్ ప్రపంచం ఇండియాని వెస్ట్రనైజ్ చేస్తుంటే, ఐశ్వర్య మాత్రం యూఎస్కి ఇండియా అంటే ఏమిటో తెలియచేస్తోంది. ఇక్కడి కళలను అక్కడ ప్రదర్శించి అలరిస్తోంది. శాస్త్రీయ నాట్యానికే జీవితాన్ని అంకితం చేసిన కళాకారిణులకు దీటుగా ప్రదర్శనలిస్తోంది. ‘‘మేము డాలస్లో మన పండుగలన్నీ జరుపుకుంటాం. బతుకమ్మ, ఉగాది, ఇంకా తెలుగు వాళ్ల చిన్న చిన్న గ్యాదరింగ్లలో కూడా ఏదో ఒక పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది. నాకు స్టేజ్ షోలంటే ఇష్టం. అమ్మానాన్నలకు ఓన్లీ కిడ్ని. ఇక నన్ను ఆపేదెవరు? ఏ చిన్న కార్యక్రమం అయినా నా ఆర్ట్ ఫార్మ్ ఒక్కటైనా ఉంటుంది. నాలుగేళ్ల కిందట ఇండియాకి వచ్చినప్పుడు రవీంద్రభారతిలో కూడా ప్రదర్శన ఇచ్చాను. ఒక సామాజిక ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం అది. అందులో ప్రదర్శన ఇవ్వడంలో ఒక సంతృప్తి ఉంటుంది. పైగా నా రూట్స్ ఉన్న నేలకు ఇస్తున్న గౌరవం అది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను’’ అన్నది ఐశ్వర్య 2018లో హైదరాబాద్లో ఇచ్చిన సోలో ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ. ఆరంగేంట్రానికి అన్నీ ఇక్కడి నుంచే! ఐశ్వర్య ఐదేళ్ల వయసులో నాట్యసాధన ప్రారంభించింది. నాట్యగురువు మధుశ్రీ సేతుపతి ఆధ్వర్యంలో 2016లో ఆరంగేంట్రం చేసింది. ఆరంగేంట్రానికి అన్నీ చెన్నై నుంచి తీసుకువెళ్లింది. ‘‘పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకూడదు. ప్రతిదీ కచ్చితంగా ఉండాలి. నాట్యంలో దుస్తులు, ఆభరణాలు కూడా సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించి తీరాలి. ఇవన్నీ కల్చర్ని ఒకతరం నుంచి మరో తరానికి తీసుకువెళ్లే వాహకాలు. ఇప్పటి ఫొటోలు తర్వాతి తరానికి డాక్యుమెంట్లు. ఆ తరం అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే ఆధారాలు. అందుకే రాజీ పడకూడదంటాను. మనం కొంత రాజీపడితే ఆ ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో ఒకరు వాటినే ప్రామాణికంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే అంత కచ్చితంగా ఉంటాను’’ అంటోంది ఐశ్వర్య. ఆమె ఆ మాట అనడమే కాదు, ఆమె పెయింటింగ్స్లో భరతనాట్యంలో ధరించే ఆభరణాలున్నాయి. భరతనాట్యం థీమ్తో వేసిన వాటిని చూస్తే ఇది పెయింటింగా లేక యాంటిక్ ఆభరణాల ఫొటోనా అని సందేహం కలిగేటంత సహజంగా ఉన్నాయి. ఆర్ట్ని చదివింది ‘‘ఆర్ట్ని హాబీగా నేర్చుకోవడం కాదు, సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఆర్ట్ని ఒక సబ్జెక్ట్గా చదివాను. అందుకే స్కూల్డేస్ నుంచి పెయింటింగ్ కాంపిటీషన్లు, ఎగ్జిబిషన్లు పాతిక వరకు ఉన్నాయి. డాన్స్ ప్రదర్శనలైతే మూడు వందలు దాటి ఉంటాయి. అయితే అందులో భరతనాట్యం ప్రదర్శనలే ఎక్కువ. ఇవి కాకుండా ఇండియన్ కాస్ట్యూమ్స్కి మోడలింగ్ చేస్తాను. అయితే సీరియస్ మోడల్ని కాను. సరదాగా చేస్తానంతే. డాలస్లో మాకు ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. తెలుగు సినిమాలు కూడా బాగా చూస్తాం. నేనైతే ఫస్ట్డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఆచార్య సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఇవన్నీ చేస్తుంటే నేను చదువు ఎప్పుడు చదువుతానని సందేహంగా ఉంది కదా! డిసెంబర్లో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను. ఇప్పుడు జాబ్ చూసుకోవాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నా ఆర్ట్స్ని కొనసాగించాలనేది ఆకాంక్ష. నేను ఇన్ని రకాల డాన్స్లు చేయడానికి ఫౌండేషన్ భరతనాట్యం ప్రాక్టీసే. అందుకే డాన్స్ని కొనసాగించే విధంగా కెరీర్ని డిజైన్ చేసుకుంటాను’’ అన్నది ఐశ్వర్య. తన ప్రపంచంలో తాను హాయిగా ఉంది. అంతకు మించి చక్కటి ఆకాంక్షలతో ఉంది. అందుకు తగిన ఆత్మవిశ్వాసంతోనూ ఉంది. అందుకే ఐశ్వర్య భాగ్యనగర్కి ఆల్ ది బెస్ట్ చెబుదాం. – వాకా మంజులారెడ్డి -
30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్గ్రీన్ జోడి
తమిళసినిమా : ముప్ఫై ఏళ్ల తరువాత నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ, నటి ఐశ్వర్య మళ్లీ జంటగా కలిసి నటిస్తున్నారు. నటుడు కెవిన్, అపర్ణదాస్ హీరో హీరోయిన్లుగా ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్ కుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి గణేష్ కె.బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఇందులో సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్, నటి ఐశ్వర్య, కథానాయకుడు కెవిన్కు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. వీరిద్దరూ 1992లో విడుదలైన రాసకుట్టి అనే చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి ఎళిల్ అరసు చాయాగ్రహణంను, జెన్మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు తెలిపారు. -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
ఆసుపత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య..
Dhanush Ex wife Aishwaryaa R Dhanush Admitted Into Hospital: రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 20211..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే ధనుష్కి సైతం కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా కోలీవుడ్లో స్టార్ కపుల్గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) -
ధనుష్-ఐశ్వర్య విడాకులు: అంతలోనే ఏం జరిగింది?
ధనుష్-ఐశ్వర్యల విడాకుల వ్యవహారం తమిళనాట హాట్టాపిక్గా మారింది. 18ఏళ్లు కలిసున్న ఈ స్టార్ కపుల్ అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఐశ్వర్య ధనుష్ కంటే రెండేళ్లు పెద్ద. కాదల్ కొండై సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమ దాకా వెళ్లింది. అలా ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి 2004లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కొన్నాళ్ల క్రితమే విభేదాలు వచ్చాయని, కానీ మామ(రజనీకాంత్)జ్యోక్యంతో గొడవలు సద్దుమణిగాయని కోలీవుడ్ టాక్. ఇటీవలె ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి నేషనల్ అవార్డును సంపాదించగా, అదే సమయంలో రజనీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సైతం ఐశ్వర్య షేర్ చేస్తూ.. ఇద్దరూ నా వాళ్లు అంటూ సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్ అస్వస్థతకు గురైన సమయంలో కూడా ధనుష్ దగ్గరుండి మామగారికి సేవలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈనెలలోనే ప్రారంభమైన ధనుష్ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ 'సార్' చిత్ర షూటింగ్కి సైతం ఐశ్వర్య హాజరైంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా అంతలోనే విడాకులు ప్రకటించి అనూహ్యంగా షాక్ ఇచ్చారు ఈ కోలీవుడ్ కపుల్. -
నా అల్లుడు చాలా మంచి వాడు: రజనీకాంత్ వీడియో వైరల్
Rajinikanth Praising Dhanush Old Video Goes Viral: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యల విడాకుల విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక భార్యభర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్ విడాకులు తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాలా సినిమా ఆడియో ఫంక్షన్లో ధనుష్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. 'ధనుష్ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు' అంటూ రజనీ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా కూతురి విడాకుల నేపథ్యంలో స్టే స్రాంగ్ తలైవా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong 🙏 #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu — பாண்டி💙❤💚 (@PandiyanKpm) January 18, 2022 -
Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం
Dhanush and Aishwaryaa Rajinikanths Separation: నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల 18 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. తాము విడిపోతున్నట్లు ఈ జంట సోమవారం రాత్రి విడివిడిగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వైవాహిక బంధం 18 ఏళ్లు కొనసాగింది. వీరి మధ్య మనస్పర్థలంటూ ఇప్పటి వరకు వదంతులు కూడా దొర్లలేదు. అలాంటిది ఈ జంట విడిపోవడం అనేది కోలీవుడ్ వర్గాలే జీర్ణించుకోలేని పరిస్థితి. చదవండి: (సూపర్స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు) గత ఏడాది అక్టోబర్ నెల 25వ తేదిన రజినీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, ధనుష్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఒకే వేదికపై అందుకున్న సందర్భాన్ని ఐశ్వర్య ఇది చారిత్రాత్మకం అంటూ గర్వంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇకపోతే కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. ఐశ్వర్య రజనీకాంత్ కూడా సినీ దర్శకురాలే. ఆమె తాజాగా ఒక చిత్రానికి దర్శకత్వం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇది ధనుష్కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ మధ్య బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ధనుష్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని, అదే మనస్పర్థలకు దారి తీసి విడిపోయే వరకు వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: (ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్గా సౌందర్య.. ఫోటో వైరల్) అయితే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లు మధ్య మనస్పర్థలు గత రెండు నెలల క్రితమే మొదలయ్యాయని సమాచారం. వాటిని పరిష్కరించే ప్రయత్నం రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు చేసినా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని సమాచారం. కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య కూ డా మొదటి భర్త అశ్విన్ రామ్కుమార్కు విడాకులిచ్చి విశాఖన్ వణంగాముడిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఐశ్వర్య కోసం పాట పాడిన ధనుష్.. పాత వీడియో వైరల్
Dhanush Singing Song For Aishwarya At A Party Goes Viral: స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్యల విడాకుల అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కోలీవుడ్లో బ్యూటిఫుల్ కపూల్గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను షాక్కి గురి చేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు వీరిద్దరి క్యూట్ మూమెంట్స్ని గుర్తుచేసుకొంటున్నారు. గతంలో ఓ పార్టీలో హీరో ధనుష్ భార్య కోసం ఎంతో ప్రేమగా పాట పాడగా, భర్త ఇచ్చిన సర్ప్రైజ్కి ఐశ్వర్య సిగ్గుపడుతుంది. 8నెలల క్రితం నాటిది ఈ వీడియో. తాజాగా ధనుష్-ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో మరోసారి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ వార్త చాలా షాకింగ్గా ఉందని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా ఓ సినిమా ఫంక్షన్లో ఇద్దరూ కలిసి కనిపించారు. అంతలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. This one 💔 #Dhanush #Aishwarya pic.twitter.com/c8FDeuzqyL — VCD (@VCDtweets) January 17, 2022 -
మరోసారి హాట్టాపిక్గా మారిన సుచీలీక్స్, ఆ ఫోటోలతోనే..
Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా,దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీ లీక్స్ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. తమిళనాట స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ పేరు సుచీ లీక్స్లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్కు దారితీసింది. అసలేంటీ సుచీ లీక్స్? 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్లో స్వయంగా రజనీకాంత్ అల్లుడు, అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకన్న ధనుష్ ఉండటం మరింత హాట్ టాపిక్గా మారింది. త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్కు ఉన్న అఫెర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
లక్ష్మికి ఇంత అసహ్యమైన కూతురా? అన్నారు: ఐశ్వర్య
Actress Aishwarya: గతంలో హీరోయిన్గా తర్వాత సహాయకపాత్రల్లో నటిగా కనిపించి అలరించింది ఐశ్వర్య. నటనలో తల్లి(సీనియర్ నటి లక్ష్మి)కి తగ్గ కూతురిగా ప్రశంసలు దక్కించుకుంది. జగపతిబాబు హీరోగా నటించిన 'అడవిలో అభిమన్యుడు' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య అన్ని భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు చేసింది. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకూ చేరువైంది. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ విరామ సమయంలో పెళ్లి జరిగిందన్న ఐశ్వర్య తమ దాంపత్య జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదని తెలిపింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తమకు విడాకులు కూడా మంజూరయ్యాయని పేర్కొంది. కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక దర్శకుడిని కొట్టాలనిపించిందని చెప్పుకొచ్చింది. తన సహనాన్ని పరీక్షించిన అతడు కోటి రూపాయలు ఇచ్చినా ఆయన సినిమాలో మాత్రం నటించనని తేల్చి చెప్పింది. కానీ తర్వాత ఓసారి అతడు తారసపడినప్పుడు మాత్రం అన్నీ మర్చిపోయి గౌరవవంగా మాట్లాడితే ఆ డైరెక్టర్ మాత్రం తన గురించి ఇతరులతో చాలా చెత్తగా మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అప్పుడే కొట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. తనను అంతలా ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు. తను సినిమాల్లోకి రావడాన్ని చాలామంది ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. సినిమా వైపు కాదు కదా, అద్దంలో కూడా చూసుకోవద్దని, చూస్తే అద్దం పగిలిపోతుందని తన బంధువులే హేళన చేశారంది. సినిమాల్లోకి వచ్చి అమ్మ పేరు చెడగొట్టొద్దని హెచ్చరించారని తెలిపింది. లక్ష్మి గారికి ఇంత అసహ్యమైన కూతురు పుట్టిందా? అని కామెంట్లు కూడా చేశారని, కానీ అనుకోకుండా ఈ ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చిందని తెలిపింది. మొదట్లో ఆ కామెంట్లు బాధనిపించినా తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానంది. -
పాపం గణపయ్య
-
ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్ రోహిత్ దామోదరన్తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరుడు రోహిత్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇదిలా వుంటే శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్తో అపరిచితుడు రీమేక్ కూడా చేయనున్నట్లు భోగట్టా. చదవండి: క్రికెటర్తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి -
లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజుల తగ్గింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోన్న తెలంగాణ విద్యార్థిని ఆర్థిక సమస్యలతో చదువుని కొనసాగించలేక, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కళాశాల కొన్ని కోర్సులకు ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ల్యాప్టాప్లను అందించేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులను హాస్టళ్ళలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కళాశాల పేర్కొంది. కాలేజీలు మూసివేయడంతో విద్యార్థులు కళాశాల సౌకర్యాలను వినియోగించుకోలేకపోతుండడంతో ఈ యేడాది ఫీజులో ఆ చార్జీలను తగ్గిస్తూ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. (ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి..) దీంతో ఫీజు గణనీయంగా తగ్గనుంది. అలాగే మిగిలిన పీజు సైతం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని సైతం కళాశాల కల్పించింది. కోవిడ్ తగ్గిన తరువాత అవసరాన్ని బట్టి రెండు, మూడో యేడాది విద్యార్థులకు మరింత మందికి హాస్టల్ వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థుల హాస్టల్ సౌకర్యం పొడిగింపుని నిరోధించే కొన్ని వాక్యాలను సైతం దరఖాస్తు ఫారం నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల అధికారులు పేర్కొన్నారు. (చదువుల తల్లి బలవన్మరణం) -
ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్మెంట్
-
చదువుల తల్లి బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుని శిఖరాగ్రాన్ని అందుకోవాలని కలగన్న విద్యార్థిని ఐశ్వర్య చివరకు బలవన్మరణానికి పాల్పడటం మన విద్యా వ్యవస్థలో అమలవుతున్న అస్తవ్యస్థ విధానాలకు అద్దం పడుతోంది. మన పాలకులు ప్రాథమిక విద్యారంగంలో చాలా కృషి చేసినట్టు కనబడతారు. 14 ఏళ్ల వయసొచ్చేవరకూ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తున్న పాలకులు ఆ తర్వాత ‘మీ చావు మీరు చావండ’ని వదిలేస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ పైపైకి ఎదగాలని కలగంటున్నవారికి మాత్రం ఎలాంటి దారీ చూపడం లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంటు పథకంవంటివి దేశంలో చాలాచోట్ల లేవు. కనుకనే విద్యా వ్యాపారం వేయి తలల నాగుపాములా విద్యార్థుల్ని కబళిస్తోంది. యువతను ఊరిస్తూ, వారి ఆకాంక్షల్ని సొమ్ము చేసుకోవ డానికి ప్రయత్నిస్తోంది. దాన్ని కూడా దాటుకుని ముందుకెళ్ల గలిగినవారికి ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఈ వైకుంఠపాళిలో అత్యంత ప్రతిభావంతురాలైన ఐశ్వర్య బలైపో యింది. ఆమె నిరుడు ఇంటర్మీడియెట్లో 98.5 శాతం మార్కులు సాధించడమే కాదు...ఢిల్లీ యూని వర్సిటీకి చెందిన పేరెన్నికగన్న లేడీ శ్రీరాం కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్(ఆనర్స్)లో సీటు కూడా సంపాదించుకుంది. అందుకోసం ఆ నిరుపేద కుటుంబం తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 2 లక్షలు సమకూర్చవలసివచ్చింది. రెండో కుమార్తెను పాఠశాల మాన్పించవలసివచ్చింది. ‘సా విద్యా యా విముక్తయే’(విముక్తి ప్రసాదించేదే విద్య’) అన్న మకుటాన్ని ధరించిన ఆ కళాశాల ఆచరణలో ఐశ్వర్యవంటి నిరుపేద యువతులకు నిజంగా అక్కరకొస్తోందా? ఐశ్వర్య అక్కడ చేరడానికి ఆ కుటుంబం పడిన పాట్లు గమనించినా, ఆ చదువును కొనసాగించడం అసాధ్యమని నిర్ణయించుకుని ఆమె తనువు చాలించిన తీరు చూసినా ఆ కళాశాల ప్రకటిత ఉద్దేశానికీ, అక్కడ చదువుకునే నిరుపేద పిల్లల సమస్యలకూ పొంతన లేని వైనం వెల్లడవుతుంది. ఆ కళాశాలనుంచి మెరికల్లాంటివారు బయటికొస్తున్నారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు భిన్నరంగాల్లో కీలక స్థానాల్లో వున్న అనేకమంది మహిళలు అక్కడ చదువుకున్నవారే. మయన్మార్ నేత ఆంగ్సాన్ సూకీ, బ్రిటానియా ఎండీ వినితా బాలి, బోఫోర్స్ స్కాంను బయటపెట్టిన చిత్రా సుబ్రహ్మణ్యం, ఐఎంఎఫ్లో కీలక పదవిలో వున్న గీతా గోపీనాథ్, ఇంకా అనేకమంది నాయకులు, ఉన్నతాధికారులు, ప్రముఖ జర్న లిస్టులు, రచయితలు ఒకప్పుడు ఆ కళాశాల విద్యార్థినులే. ఐశ్వర్య చదువుకు లేడీ శ్రీరాం కళాశాలలో ఎదురైన అడ్డంకులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటర్మీడియెట్లో ప్రతిభ చూపినందుకు ఆమెకు ఇన్స్పైర్ పథకం కింద ఇవ్వాల్సిన ఉపకారవేతనం తొలి విడత మొత్తం ఎన్నడో మార్చిలో అందవలసివుండగా ఎనిమిది నెలలుగా అది పెండింగ్లో వుండిపోయింది. సెకండియర్ అయ్యాకే దాన్ని అందిస్తామని చెప్పారట. పైగా ఆ కాలేజీకి అను బంధంగా వుండే హాస్టల్ని సైతం కరోనా పేరుతో మార్చి 15న మూసేశారు. మొదటి సంవత్సరానికి మాత్రమే హాస్టల్ వుంటుందని, సెకెండియర్ విద్యార్థులు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని విద్యార్థిను లకు వర్తమానం పంపారు. అందుకు కారణాలేమైనా చెప్పవచ్చుగానీ... అవి సహేతుకమైనవి కాదు. సుప్రీంకోర్టు ఓబీసీ కోటా విషయంలో జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సివస్తోందని ప్రిన్సిపాల్, యాజమాన్యం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రెండు సంవత్సరాలూ ఐశ్వర్యవంటి నిరుపేద విద్యార్థులు ఖరీదైన దేశ రాజధాని నగరంలో ఎలా మనుగడ సాగించాలో, చదువులెలా పూర్తిచేసుకోవాలో వారి బుర్రలకు తట్టలేదు. హాస్టల్ మూసివేతపై చర్చలకొస్తామని చెప్పిన విద్యార్థి సంఘానికి జవాబు లేదు. సెప్టెంబర్ 27న హాస్టల్ ఖాళీ చేయాలని ఐశ్వర్యకు తాఖీదు వచ్చింది. ఢిల్లీ వంటిచోట పేయింగ్ గెస్ట్గా వుండాలన్నా నెలకు రూ. 30,000 తప్పనిసరి. పైగా ఈమధ్య మొదలైన ఆన్లైన్ విద్య అంతరాలను మరింతగా పెంచింది. రోజూ జరిగే 6, 7 తరగతుల కోసం ఒక మంచి ల్యాప్ట్యాప్, చదువుకు ఆటంకంలేకుండా మెరుగైన డేటాతో వైఫై కనెక్షన్ వుంటే తప్ప విద్యార్థుల అవసరాలు తీరవు. ఈ అవకాశంలేనివారు చదువుకు దూరం కావాల్సిందే. తరగతి గదినుంచి నిష్కారణంగా విద్యార్థిని గెంటేయడానికీ, దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఉద్యోగాలు, ఉపాధి చర్చకొస్తాయిగానీ... చదువులకు మాత్రం ఎప్పుడూ చోటుండదు. మంగళవారం ఫలితాలు వెలువడుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలే తీసు కుంటే అక్కడ పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒకరంటే, కాదు... కాదు 19 లక్షల ఉద్యోగాలిస్తామని మరొకరు హామీలిచ్చారు. ముఖ్యమంత్రిగా వున్న నితీష్కుమార్ అయితే ‘మేం ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చేశాం’ అని చెప్పారు. కానీ ప్రతిభగల పిల్లల్ని పాడె ఎక్కిస్తున్న విద్యారంగ అస్తవ్యస్థ విధానాల గురించి మాత్రం అక్కడ చర్చ లేదు. అక్కడే కాదు... చాలా రాష్ట్రాల్లో చదువులపై సమగ్ర మైన చర్చ జరగడం లేదు. విద్యను ఆధునికీకరిస్తామని చెబుతున్న జాతీయ విద్యావిధానం కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా, ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించుకోవడానికి అనుమతి స్తోంది. అయితే సామాజిక బాధ్యతగా కనీసం 20 శాతంమంది పిల్లలకు ఉచిత విద్య, మరో 30 శాతంమందికి ఉపకారవేతనాలు ఇవ్వడం తప్పనిసరి చేస్తారట. ఆచరణలో ఇదేమవుతుందో చూడాలి. ఏదేమైనా తన మరణంతో ఐశ్వర్య ఉన్నత విద్యలో వున్న అంతులేని అగాధాలను బయట పెట్టింది. రకరకాల కారణాలతో ప్రతిభగల నిరుపేద పిల్లలకు తలుపులు మూసుకుంటున్న ఉన్నత విద్యాసంస్థల తీరును బయటపెట్టింది. ఈ లోపాలను సవరించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక కారణాలతో ప్రతిభగల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటం పాలకుల బాధ్యత. -
ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి...
షాద్నగర్ రూరల్: ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఆమె కల. దాని కోసం శ్రమిస్తోంది. కానీ, ఆర్థిక పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డి, సుమతి దంపతులకు ఐశ్వర్య(19), వైష్ణవి కూతుళ్లు. శ్రీనివాస్రెడ్డి బైక్ మెకానిక్. ఐశ్వర్య 8వ తరగతి వరకు హైదరాబాద్లో వారి బంధువుల వద్ద చదువుకుంది. ఆ తర్వాత 9, 10 తరగతులు, ఇంటర్ షాద్నగర్లో అభ్యసించింది. ఇంటర్లో 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఢిల్లీ వెళితే డిగ్రీతో పాటు సివిల్స్లో కూడా శిక్షణ తీసుకోవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. అయితే, ఐశ్వర్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. షాద్నగర్కు చెందిన కొందరు చదువులకయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వర్సిటీ వారు సెలవులు ప్రకటించడంతో ఐశ్యర్య షాద్నగర్కు వచ్చింది. ఇటీవల ఆమె ఫోన్కు వర్సిటీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే హాస్టల్ను ఖాళీ చేయాలని అందులో ఉంది. మరోవైపు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్స్పైర్ స్కాలర్షిప్ రాలేదు. బయట అద్దెకు ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. (చదవండి: ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!) దీంతో ఆమె తల్లిదండ్రులు అప్పు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన వారు కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన చదువు తల్లిదండ్రులకు భారమని.. అలా అని చదువు లేకపోతే బతకలేనని.. నన్ను క్షమించండి అని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కనీసం ఒక సంవత్సరం ఇన్స్పైర్ స్కాలర్షిప్ వచ్చేలా చూడండి అంటూ ఐశ్వర్య ఆ లేఖలో వేడుకుంది. (చదవండి: ‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’) చదువులు కొనసాగవనే బెంగతోనే ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఏ పరీక్షలు రాసినా మంచి మార్కులు సాధించేది. ఐఏఎస్ కావాలని కలలు కనేది. తన కలలను సాకారం చేయలేకపోయాం. చదువులు కొనసాగవనే బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. – శ్రీనివాస్రెడ్డి, ఐశ్వర్య తండ్రి -
ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్ఎస్ఆర్ ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, జేఎన్యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్యూ స్టూడెంట్ యూనియన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ (టీఎస్ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి. జస్టిస్ ఫర్ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. ‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్ఏ ప్రతినిధి వివేక్ తెలిపారు. ఎల్ఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కౌన్సిలర్ నవీన లాంబా, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ, తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. ఒత్తిడికి లోనై.... ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతికి రాహుల్ సంతాపం ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. -
‘ఐశ్యర్యకి ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులే తమ కూతుర్ని పొట్టనపెట్టుకున్నాయని షాద్నగర్లో ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్రెడ్డి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులు వినడానికై కనీసం తమ కూతురికి ఫోన్ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘:ఐశ్యర్య మొదటి నుంచి చదువులో ఎంతో ముందుండేది. ఉన్నత చదువు కోసం అప్పు చేసి మరీ ఆమెను ఢిల్లీకి పంపించాం. కూతుర్ని ఐఏఎస్ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినడం కోసం ఫోన్ లేదా ల్యాప్టాప్ అడిగింది. మా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం. చనిపోయే ముందు కూడా ఐశ్యర్య మా అందరితో కలివిడిగానే మాట్లాడింది. స్కాలర్షిప్ రాకపోవడం ఐశ్యర్యను మరింత కుంగదీసింది. గతంలో మా కూతురు టాపర్గా నిలిచినప్పుడు ఎందరో అండగా ఉంటామని ముందుకు వచ్చారు, కానీ కొద్దిరోజులకే ముఖం చాటేశారు. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావొద్దు’ అని ఐశ్యర్య తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకొని తమ చిన్న కూతురు చదువుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్ స్పందన) షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్ఎస్ఆర్లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇది నిజం! ఇదే నిజం!!: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్నగర్ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు. (చదవండి: స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!) ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్ఎస్ఆర్లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
రంగారెడ్డి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
-
షాద్నగర్లో విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బలవంతంగా హాస్టల్ను ఖాళీ చేయించింది. యాజమాన్యం తీరుకు మనస్తాపానికి గురైన విద్యార్థిని ఐశ్వర్య షాద్నగర్ వచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: (తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!) (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) (పరిటాల సునీత ముఖ్య అనుచరుడి అరెస్ట్) -
అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్ నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, సుప్రియా, నాగసుశీల, సుశాంత్తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలాగే తన సోదరుడు ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోలో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడంతో.. సమంత ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, వెంకటేశ్తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామా’ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య...
-
ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. శివకుమార్ ఈడీ కస్టడీ మరో రోజులో ముగుస్తుందనగా ఈడీ అధికారులు ఐశ్వర్యను ప్రశ్నించారు. ఏడు గంటలుపైగా ఆమెను ఈడీ అధికారులు విచారించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేసిన ఐశ్వర్య ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కొచ్చారు. ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆమె రాత్రి 7.30 గంటలకు తిరిగి వెళ్లారు. ఐశ్వర్య పేరు మీదే ట్రస్ట్ ఫండ్ ఏర్పాటవడంతో పాటుగా 2013–18 మధ్య ఆమె ఆస్తిపాస్తులు విపరీతంగా పెరిగాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్యకు 108 కోట్లు ఉన్నట్టుగా ప్రకటించారు. 2013లో ఆమె ఆస్తుల విలువ రూ.1.09 కోట్లు మాత్రమే. కాగా, 9 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో నేడు శివకుమార్ను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.