alert
-
43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు
భువనేశ్వర్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి ఠారెత్తిస్తోంది. ఒడిశా(Odisha)లోని పలు నగరాల్లో ఇప్పటికే వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం ఒడిశాలోని బౌధ్ సోమవారం వరుసగా మూడవ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Highest temperatures) నమోదైన ప్రదేశంగా నిలిచింది.సోమవారం ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఒడిశాలోని బార్గడ్లో 42 ఢిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల తర్వాత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది.మంగళవారం నుండి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని, మార్చి 25- 31 మధ్య రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువ. ఢిల్లీతో పాటు ఇతర మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి జమ్ముకశ్మీర్లో కురుస్తున్న హిమపాతం కారణంగా నిలిచింది. ఒడిశా విషయానికొస్తే బౌధ్లో శనివారం 42.5 డిగ్రీల సెల్సియస్, ఆదివారం 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని ఆరు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.ఇది కూడా చదవండి: జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
ముంబైలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో కొన్ని రోజులపాటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ముంబై వాసులు విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నారు. జనవరిలో ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 34 డిగ్రీల సెల్సియస్ను దాటి వెళ్లింది. ముంబై శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం శాంటా క్రూజ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగటి వేళ వేడి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ముంబై ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రత పెరగడంతో బయటికి వెళ్లే ప్రజలు సౌకర్యవంతంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు పుష్కలమైన నీరు తాగాలని, పొడి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎండ వేడికి అధికంగా గురికాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవడం, గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం, ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. -
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. -
పలు రాష్ట్రాలకు కోల్డ్వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్ప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్పై టోర్నడోల ఎఫెక్ట్ -
ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
-
కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వయనాడ్కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్యూ 3గ్రహశకలం 2018 ఎక్స్యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్కే 1గ్రహశకలం 2024 ఎక్స్కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్.. 17 దేశాల్లో మార్బర్గ్ వైరస్ ఆనవాళ్లు
కిగాలీ : విదేశాలకు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ముఖ్యగమనిక. తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్బర్గ్ వైరస్లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి 15 మంది మరణించారు. వందల మందికి సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో )..ఈ వైరస్ కూడా ఇతర వైరస్లా ప్రపంచమంతా విస్తరించకముందే నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాల్లోని ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయనే అంచనాలతో డబ్ల్యూహెచ్వో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఆయా దేశాల్ని అప్రమత్తం చేసింది. మార్బర్గ్ వైరస్ అంటేమార్బర్గ్ వైరస్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్ ఫీవర్ వైరస్నే. అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాలలో ఈ వైరస్ ఎక్కువగా ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మనుషుల్లో కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఈ వైరస్ పలు మార్లు వ్యాపించింది. తాజాగా, మరోసారి ఈ వైరస్ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. It's 21 days with no active cases on the 42-day countdown to declaration of end of #Marburg outbreak. @WHO & partners continue to support ongoing 🇷🇼 govt efforts in the Marburg response, with focus on surveillance, IPC, recovered pt (survivor) program & continuity of services. pic.twitter.com/4aaziYd01p— WHO Rwanda (@WHORwanda) November 30, 2024 -
వాయు'గండం'.. ఆరు రోజులపాటు వానలే వానలు
-
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల అలర్ట్ లిస్ట్లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్లో చేరుస్తారు. -
దూసుకొస్తున్న దానా తుపాన్
-
సోల్మేట్స్తో సోషల్గా...మనసుకు మేలే..!
సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
నేడు నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేలికపాటి చలి మొదలైంది. అక్టోబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు.దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన డోనా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రాంతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా డోనా తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కన్నడ, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, హవేరి, గడగ్, శివమొగ్గ, దావణగెరె, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను -
తస్మాత్ జాగ్రత్త!
ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ‘మనీ లాండరింగ్/టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ రిస్క్ అసెస్మెంట్ గైడెన్స్’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్ వంటి అంశాలు వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు, లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. -
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్తో నగరం అప్రమత్తమైంది.నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: పాక్కు ఘాటుగా బదులిచ్చిన భారత్ -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలపడింది.సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో మంగళ,బుధ వారాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందని వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ ,రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్నగర్,నాగర్కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాలకు భారీ వర్షసూచన ఉంది.దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం -
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్లోని ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసిపోయి.. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.SEVERE STORMS WARNING ⚠️ As peak convergence is expected, today will be WIDESPREAD powerful storms, lightining in RED marked districts next 24hrs. Multiple storms are expected ⚠️HYD - Multiple spells of powerful storms (2-3 strong ones) expected next 24hrs ⚠️⚡ pic.twitter.com/ySeub3wSdC— Telangana Weatherman (@balaji25_t) September 23, 2024 మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. -
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
దేశంలోని పలు రాష్ట్రాలకు భారీవర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(గురువారం) కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్వాంచల్, పశ్చిమ యూపీలో భారీ వర్షాలకు కురవనున్నాయనే హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో హిమాచల్ ప్రదేశ్లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. కిన్నౌర్, సిర్మౌర్, సోలన్, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు వర్షం కొనసాగుతుందిరాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు వాయువ్య దిశలో కదులుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు బీహార్లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా ఉంటాయని అంచనా. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది బెంగాల్ తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి బీహార్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నల్లమలలో పక్షుల కిలకిల -
గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం అర్బన్/ఏటూరునాగారం: గోదావరి నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 7:32 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది. దీంతో ఆర్డీ ఓ దామోదర్రావు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం అంతకంతకూ పెరు గుతూ సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్ర మాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వరద పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 15.80 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలోని ఓడవాడ, 1, 2, 10 వార్డుల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో నది ప్రవహిస్తోంది. 15.83 మీటర్లకు చేరితే.. రెండు ప్రమాద హెచ్చరిక, 17.33 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి కరకట్ట వద్ద పోలీసులు, రెవెన్యూ, కేంద్ర జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు పహారా కాస్తున్నారు. సాగర్ 26 గేట్లూ ఎత్తివేతనాగార్జునసాగర్/ దోమలపెంట: నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. దీంతో మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,257 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లు కూడా... కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 1,64,592 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్.. రెడ్ అలర్ట్ జారీ
-
రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు!
తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ,. స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. -
ఏపీకి తప్పిన గండం..
-
24 గంటల్లో భారీ వర్షాలు..
-
ఢిల్లీకి వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎల్లో అలెర్ట్ జారీ
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ తరుణంలో సోమవారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల కారణంగా భారీ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భావించిన వాతావరణ శాఖ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గురువారం వరకు తేలికపాటి వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.ఢిల్లీలో ఆదివారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 5.30వరకు వర్షం పడలేదు. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్కు సమీపంలో రుతుపవనాల ద్రోణి కదిలి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలపై మళ్లుతుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. -
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
-
ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జరీచేసింది. ఆగస్టు 22 ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలో ఆగస్టు 20 నుండి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. VIDEO | Delhi: Heavy rainfall lashes parts of the national capital. Visuals from Janpath.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/4XCCXwHrBN— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
హైదరాబాద్లో భారీ వర్షం.. రోజంతా వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకిలో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్జామ్ అయింది. నగరవ్యాప్తంగా క్యుములోనింబస్మేఘాలు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.కాగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్సున్నట్లు సమాచారం. -
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై పోలీస్ శాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్లో పోలీసులు నిఘా ఉంచారు. హైదరాబాద్లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టారు. హైదరాబాద్కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్న డీజీపీ.. బాలాపూర్ పరిధిలో ఐదువేల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని.. అలాగే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. -
తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ లింకుల్ని క్లిక్ చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.మరోవైపు.. రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్ జారీ చేసింది. -
ఏపీలో భారీ వర్షాలు..
-
దేశమంతా ఎల్లో అలెర్ట్
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14 గంటలు అంతరాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్తో పాటు ఉత్తర భారత్లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ప్రదేశ్ ఉన్నాయి. -
ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
-
కేరళలో భారీ వర్షాలు.. విద్యాసంస్థల మూసివేత
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
మహారాష్ట్రలోని ముంబై, పూణేలలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ముంబైలోని దహిసర్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రానున్న కొద్ది గంటల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, ముంబై సహా ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అదే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్,దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఇంతలోనే పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేరళలో రుతుపవనాలకు ముందు విస్తృతంగా వర్షాలు కురిశాయి. -
తెలంగాణను తాకనున్న భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
-
నేడో, రేపో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్: రేపు ఆన్లైన్ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లు మే 25వ తేదీ శనివారం తెల్లవారు జామున నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది.బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 25 ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లో అకౌంట్స్, డిపాజిట్లు, నిధుల బదిలీలు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, విత్ ఇన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు), ఆన్లైన్ చెల్లింపు, తదితర లావాదేవీలు అందుబాటులో ఉండవు.మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవల అంతరాయం గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ కూడా పంపింది. పేర్కొన్న సమయంలో వినియోగదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు. నిధులను బదిలీ చేయలేరు. యూపీఐ లావాదేవీలతో సహా ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేయలేరు. -
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా హీట్వేవ్ అలర్ట్ ఇచ్చింది. రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఉత్తర భారతమంతా మే 21వ తేదీ వరకు భానుడు చండ ప్రచండంగా నిప్పులు కురిపించనున్నాడని తెలిపింది. శుక్రవారం(మే17) దేశంలోనే రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. హీట్వేవ్ అలర్ట్ నేపథ్యంలో జైపూర్ నహార్ఘర్ బయలాజికల్ పార్కులోని జంతువులకు చల్లదనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పార్కు అధికారులు తెలిపారు. -
కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
ఢిల్లీ: కిర్గిజిస్తాన్ దేశంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం బిష్కెక్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీ విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అక్కడి భారతీయ ఎంబసీ ‘ఎక్స్’వేదికగా అడ్వైజరీ విడుదల చేసింది.‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థులతో టచ్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. విద్యార్థులు ఎంబీసీ అధికారులతో టచ్లో ఉండాలని సూచిస్తున్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎదైనా సమస్య వస్తే.. 0555710041 నంబర్ను సంప్రదించండి’ అని పేర్కొంది.Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024విదేశీ విర్థులపై దాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితిని భారతీయ ఎంబీసీ ఎప్పటికప్పుడు కనుకుంటోంది. అక్కడి పరిస్థితి ప్రసుతం సద్దుమణిగింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావోద్దు’ అని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.మే 13న కిర్గిజిస్తాన్, ఈజిప్ట్ దేశాల విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఇక.. మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద చెలరేగిన విద్యార్థుల హింసలో పాకిస్తాన్ను చెందిన పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తుఫాను, వర్షం, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఊహించని విధంగా మారింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మత్తు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. #WATCH | Noida, Uttar Pradesh: Several cars were damaged after a shuttering installed to repair a building in Sector 58 of Noida blew off due to gusty winds hitting the National Capital & the adjoining areas. pic.twitter.com/lz7F2WuX9q— ANI (@ANI) May 10, 2024 శనివారం(ఈరోజు) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉంది.రాజధానిలో గాలి దిశలో మార్పు కారణంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 180 వద్ద నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గంటకు సగటున ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
రెండోదశలో తగ్గనున్న ఓటింగ్ శాతం? కారణం ఇదే?
రెండో దశ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఓటింగ్ జరగనుంది. అయితే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఎన్నికల కమిషన్ను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26, రెండవ దశ ఓటింగ్ రోజున తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీయనున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్లో విపరీతమైన వేడి గాలులుల వీయనున్నాయనే అంచానాలున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రెండు రోజుల తర్వాత వేడిగాలు వీచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదు రోజుల పాటు హిట్ వేవ్ ఉండనుంది. ఏప్రిల్ 26న ఈ రాష్ట్రాలన్నింటిలో రెండో దశ పోలింగ్ జరగనుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వేసవి సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఓటర్లు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
దేశరాజధాని ఢిల్లీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని, పలు రాష్ట్రాల్లో వేడిగాలులు మొదలు కానున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్, ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటున్నదని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే రెండుమూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26న ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని ఉప-హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగతంగా తనతోపాటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న చానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. ఈ తరహా చానళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరిట పచ్చి అబద్ధాలను చూపిస్తున్నాయి. మాపై గుడ్డి వ్యతిరేకత లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలు, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోంది. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యలుగా వీటిని భావిస్తున్నాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తప్పవు ‘గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రస్తుతం చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా ఈ చానళ్లు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
నితీష్ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్సింగ్ కుష్వాహ సూచించారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. -
తెలియని సంస్థలకు పత్రాలు ఇవ్వకండి..
ముంబై: కేవైసీ అప్డేషన్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. గుర్తుతెలియని వారికి పత్రాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘అపరిచిత వ్యక్తులు లేదా సంస్థలకు కేవైసీ (గుర్తింపు, చిరునామా ధృవీకరణకు ఆధారాలు) పత్రాలు లేదా వాటి కాపీలను ఇవ్వకండి‘ అని పేర్కొంది. అలాగే అకౌంట్ లాగిన్ వివరాలు, కార్డు సమాచారం, పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలను కూడా ఎవరికీ చెప్పరాదంటూ సూచించింది. ‘సాధారణంగా ఈ తరహా మోసాల్లో.. కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారం, అకౌంటు వివరాలను తెలియజేసే విధంగా లేదా మెసేజీల్లో పంపే లింకుల ద్వారా అనధికారిక యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ మోసపుచ్చేలా ఖాతాదారులకు అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ మొదలైనవి వస్తుంటాయి. కస్టమర్లు అప్పటికప్పుడు స్పందించకపోతే అకౌంటు ఫ్రీజ్ అవుతుందని లేదా మూతబడుతుందని బెదిరించే ధోరణిలో ఇవి ఉంటాయి. అలాంటప్పుడు కస్టమర్లు తమ వ్యక్తిగత లేదా లాగిన్ వివరాలు గానీ ఇచ్చారంటే మోసగాళ్లు వారి ఖాతాల్లోకి అనధికారికంగా చొరబడతారు‘ అని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ అప్డేషన్ కోసం అభ్యర్ధన ఏదైనా వస్తే నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థనే సంప్రదించాలని సూచించింది. అలాగే, ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచే కాంటాక్ట్ నంబర్లు తీసుకోవాలని పేర్కొంది. సైబర్ మోసం జరిగితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ఇలాంటి మోసాలపై ఈ తరహా హెచ్చరికలు జారీ చేసింది. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు అలర్ట్!
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్లు రకరకాల ఆఫర్లు, క్యాష్బ్యాక్లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది. కారణం ఇదే.. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినప్పుడు పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్లను జారీ చేస్తుంటాయి. బ్యాంక్తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్ను కస్టమర్ అప్డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్పీసీఐ కోరినట్లు సమాచారం. -
కరోనా కొత్త వేరియంట్పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
-
తెలంగాణ పోలింగ్కు వరుణగండం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ. ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! -
చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కొవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో న్యుమోనియా తరహ లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలనుఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా, స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరక్టుగా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది. కొవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతున్న ఎనీమాటిక్ నుమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతున్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషేన్(డబ్ల్యూహెచ్వో) చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. ఇదీచదవండి..ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ -
దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 28న దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చలి మరింతగా పెరగనుంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మహారాష్ట్ర, గోవా, కొంకణ్తో పాటు అనేక ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లలో కూడా వర్షాలు కురవనున్నాయి. రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 27న పశ్చిమ యూపీలోని పలు జిల్లాలు, తూర్పు యూపీలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా శనివారం రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ ‘తీవ్రమైన’, ‘చాలా పేలవమైన’ విభాగంలోనే ఉంది. ఆదివారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారం అందించే ఏజెన్సీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: 26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే.. -
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్కు మరో ఆటంకం?
ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో అక్కడి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రభావం పడనుంది. మరోవైపు జమ్మూకశ్మీర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శ్రీనగర్తో పాటు ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. హిమాచల్లో ఆదివారం నుంచి వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 26 నుండి ఉత్తరాఖండ్తో పాటు హిమాలయ ప్రాంతంలో మంచు కురవనుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఫలితంగా పర్వత ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. సోమవారం ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పితోరాఘర్తో సహా 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ కాశ్మీర్లోని అతి శీతల ప్రాంతం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -3.4 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్, గుల్మార్గ్లలో -1.0 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుత శీతాకాలంలో శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూలో కూడా తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా చలిగా ఉంటుంది. పగటిపూట కాస్త ఉపశమనం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో 25 స్వైన్ కేసులు -
వైజాగ్ స్కూల్ ఆటో ఘటన.. విజయవాడ RTA అలర్ట్
-
ఆ రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ!
చెన్నై: తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వారం పాటు నిర్వరామంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురవగా.. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకూడి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నైలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైతుందని వెల్లడించింది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్ష సూచనతో విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో 400 మందితో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపేషన్ కోసం చెన్నైలో మరో 200 మంది సిబ్బందిని నిలిపి ఉంచారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదీ చదవండి: 80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి -
అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య. అమ్మాయిలు వీలైనంత వరకు తమ ఫొటోలు, వివరాలను పోస్ట్ చేయొద్దని కోరారాయన. శనివారం నగర శాంతి భద్రతల అంశంపై ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. తాజాగా నగర పోలీసులు చేధించిన సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ సూచన చేశారు. కేసు వివరాలు.. సోషల్ మీడియాలో నగరానికి చెందిన ఇద్దరు బాలికలను కొందరు ఆగంతకులు ట్రాప్ చేశారు. ఈ మూడు నెలలుగా వాళ్ల మధ్య ఛాటింగ్ వ్యవహారం నడిచింది. బాలికల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారు ఆ కేటుగాళ్లు. చివరకు.. కోరికలు తీర్చకపోతే ఇంటర్నెట్లో ఆ ఫొటోలు, వీడియోలు పెడతామని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులపై సీపీ శాండిల్య మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు కేసులు నా దృష్టికి వచ్చాయి. ఈ రెండింటిలోనూ యువతులే బాధితులుగా ఉన్నారు. వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి దుండగులు బ్లాక్మెయిల్ చేశారు. ఆ బెదిరింపులతోనే అత్యాచారం చేశారు. ఈ రెండు ఘటనలు యువతులు ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం వల్లే.. అపరిచితులతో ఛాటింగ్ చేయడం వల్లే జరిగాయి. కాబట్టి ఎవరూ అలాంటి ట్రాప్ల్లో పడొద్దు.. బాధితులు కావొద్దు అని అన్నారాయన. మేమున్నాం.. ‘‘సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్లలో వ్యక్తిగత ఫొటోలు పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్ పెట్టుకోండి. అపరిచితుల నుంచి రిక్వెస్ట్ వస్తే అంగీకరించవద్దు. ప్రొఫైల్ను రెండు దశలుగా సెక్యూర్ పెట్టుకోండి. స్నేహితులతో, అపరిచితులతో వీడియో కాలింగ్ చేయొద్దు. ఎవరైనా బ్లాక్మెయిల్, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందకండి. మీకు మేమున్నాం. ఎవరైనా ఇబ్బందులు పెడితే మా అన్న పోలీసు అని చెప్పండి. నేరుగా మా నెంబర్లను సంప్రదించండి.. ఫోన్ నెంబర్లు.. 9490616555, 8712660001 అమ్మాయిలు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే.. ఫిర్యాదు చెయ్యండి. పోలీసులను మీ సోదరులుగా భావించండి. నన్ను(కమిషనర్ శాండీ తనను తాను ఉద్దేశించుకుంటూ..) మీ అన్నగా భావించండి. మీ ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారాయన. తల్లిదండ్రులకు సూచన బీదర్ నుంచి మత్తు ట్యాబెట్లు తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నారు. ఆ ముఠా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటోంది. బీదర్కు నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు పోలీసులపై నిందితులు దాడి చేశారు. దాడుల్లో నార్కోటిక్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. పిల్లల తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. వాళ్లతో కలిసి ఉండండి.. ఒంటరిగా వాళ్లను వదిలేయకుండా దృష్టి పెట్టండి. -
అభ్యర్థులూ.. అలర్ట్! ప్రచారానికి ఎన్నికల సంఘం నిబంధనలు..
సాక్షి, వరంగల్/మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త. నిబంధనల మేరకే ప్రచారం నిర్వహించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీని ప్రకారం నాయకులు, కార్యకర్తలు ఉదయం 6 గంటల తర్వాతే ప్రచారం ప్రారంభించాలి. రాత్రి 10 గంటల కల్లా ముగించాలి. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చీరలు, చొక్కాలు, ఇతర దుస్తులు, క్రీడా పరికరాలు తదితర వస్తువులు పంపిణీ చేస్తే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు భావిస్తారు. టోపీలు, కండువాలు మాత్రం ఇవ్వొచ్చు. కానీ వాటి ఖర్చును అభ్యర్థి ఎన్నికల పద్దులో రాయాల్సి ఉంటుంది. ప్రచారం చేసే అభ్యర్థి ఎన్ని వాహనాలనైనా ఉపయోగించుకునే వీలుంది. కానీ ముందస్తు రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి పొందాలి. అనుమతి పత్రం స్పష్టంగా కనిపించేలా వాహనానికి అంటించాలి. పర్మిట్ మీద వాహన నంబర్, అభ్యర్థి వివరాలు ఉండాలి. ఓ అభ్యర్థి పేరిట పొందిన పత్రాన్ని మరో అభ్యర్థి ప్రచారానికి వినియోగిస్తే చర్యలు తీసుకుంటారు. కరపత్రాలు ముద్రించే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రింటింగ్ ప్రెస్ చిరునామా ప్రచురించాలి. బహిరంగ సభల సందర్భంగా.. బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రదేశం, తేదీ, సమయం ముందుగా పోలీసు అధికారులకు తెలిపి, రాత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలా అయితే పోలీసులే ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ ఏర్పాట్లు పరిశీలించే అవకాశం ఉంటుంది. సభ ఏర్పాటు చేసే ప్రదేశం.. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయాలకు సంబంధించి ఉండొద్దు. ప్రైవేట్ ఆస్తులైతే సంబంధిత స్థలం యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. సభ ఏర్పాటు చేసే స్థలం శాంతిభద్రతల దృష్ట్యా అభ్యంతరకరం కాదని నిర్ధారించుకోవాలి. సభకు మైక్ వినియోగానికి పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సభను అడ్డుకోవడం, గొడవ సృష్టించడం లాంటి ముప్పు కలిగించే శక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించి వారి సాయం తీసుకోవాలి. ఊరేగింపుల్లో.. ప్రతి అభ్యర్థి తమ ఊరేగింపు ఆరంభమయ్యే సమయం, సాగే రూట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, ముగింపు సమయం ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరేగింపు సాగే మార్గంలో, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని పోలీసు అధికారుల నుంచి నిర్ధారించుకోవాలి. అభ్యంతరాలుంటే మార్గం మార్చుకోవాలి. ఊరేగింపుల్లో అందరూ పోలీసులు సూచించిన విధంగా రోడ్డుకు ఒక పక్కన సాగుతూ క్రమ శిక్షణతో మెలగాలి. వేర్వేరు పార్టీలు ఒకే మార్గంలో, ఒకే సమయంలో ఊరేగింపులు తీయడానికి పోలీసులు అనుమతించరు. ఒకరికొక్కరు ఎదురు పడకుండా చూసుకోవడం ఉత్తమం. ఊరేగింపుల్లో పాల్గొనేవారు ఏ విధమైన మారణాయుధాలు, విపరీత శబ్దాలు కలిగించే పేలుడు పదార్థాలు వెంట తీసుకురాకుండా అభ్యర్థులు, వారి అనుచరులే చూసుకోవాలి. ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో ప్రతిపక్షాల దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇవి చదవండి: సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్లో.. నువ్వా.. నేనా!? -
అలిపిరి మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు సంచారం
సాక్షి, తిరుపతి: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఈ మేరకు భక్తులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక ప్రకటన విడుదల చేసింది. అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు కెమెరా ట్రాప్లో నమోదైంది. దీంతో నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వరుస దాడుల ఘటనల తర్వాత.. ఈ మార్గంలో ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. భక్తుల భద్రత తమకు మొదటి ప్రాధాన్యం అని చెబుతున్న టీటీడీ.. ఈ మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది. మరోవైపు నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో సర్వే చేపట్టింది. ►అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు బంటి సంచారం రికార్డయ్యింది. నరసింహస్వామి ఆలయం నుంచి ఏడవ మైలు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వీటి సంచారం గుర్తించారు. మూడు రోజులుగా వేకువజామున, రాత్రి సమయాల్లో అవి సంచరిస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలి :::వైల్డ్ లైఫ్ అధికారులు -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..ఏపీలో వర్షాలు
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! బ్యాంక్ అత్యవసర ప్రకటన!
SBI customers alert: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో ఎస్బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. కారణం ఇదే.. ఎస్బీఐ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేపట్టింది. దీని కారణంగా ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్బీఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్ ద్వారా తెలియజేసింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎస్బీఐ త్వరలోనే సమస్యను పరిష్కరిస్కామని వివరించింది. దేశంలో యూపీఐ చెల్లింపులు 2016లో ప్రారంభమయ్యాయి. డిజిటల్ పేమెంట్లు విస్తృతం కావడంతో నాటి నుంచి నేటి వరకూ యూపీఐ లావాదేవీలు అనేక రెట్లు పెరిగాయి. 2018 జనవరిలో 151 మిలియన్లు ఉన్న యూపీఐ లావాదేవీల సంఖ్య 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరింది. pic.twitter.com/yi5DVQjkYi — State Bank of India (@TheOfficialSBI) October 14, 2023 -
Indian Air Force Day: ఐఏఎఫ్ అత్యుత్తమమైందిగా ఉండాలి
ప్రయాగ్రాజ్: ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ఎయిర్ ఫోర్స్డేను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఏఎఫ్ అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుందని చెబుతూ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా ఐఏఎఫ్ అవతరించాలని అన్నారు. వ్యూహాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాలను సమకూర్చుకోవడం వంటివి భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించడంలో ఐఏఎఫ్కు ఎంతో కీలకమన్నారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నిరుపమాన సేవలు, త్యాగాల వల్లే మన గగనతలం సురక్షితంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!
పండగలు రాబోతున్నాయి. ఇంటిల్లిపాదికి బట్టలు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్న ప్లాన్లో ఉంది రోజా. ఆన్లైన్ షాపింగ్ అయితే సులువైన పని అనుకుంటూనే వాటిలోని ఆఫర్లను చెక్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వస్తువుల అమ్మకాలలో ఇచ్చే డీల్స్ చూస్తోంది. అనుకున్న బ్రాండ్లో ఓ ఫోన్ డీల్ కనపడింది. అత్యంత తక్కువ ధరకే వస్తోంది, నిమిషాల్లోనే ఆ డీల్ ముగుస్తుంది. అందుకే వెంటనే క్లిక్ చేసింది. అక్కడ నుంచి పోర్టల్లోకి వెళ్లడం, ఫోన్ బుక్ చేయడం చకచకా జరిగిపోయాయి. అమౌంట్ డెబిట్ అయ్యింది. కానీ, వస్తువు బుక్ అయినట్టుగా చూపించడం లేదు. ఆ తర్వాత చెల్లించిన డబ్బు గురించి ప్రయత్నించింది. కానీ, ఆ డబ్బు తిరిగి తన అకౌంట్లోకి రాలేదు. ఆన్లైన్లో నకిలీ పండగ ఆఫర్ మోసాలు అధికంగా జరుగుతుంటాయి. వాటిలో... ప్రీ డెలివరీ నోటిఫికేషన్ స్కామ్, ఫేక్ షాపింగ్ సైట్లు, ఫేక్ గిఫ్ట్ కార్డులు, వోచర్లు, కూపన్లు, ఫేక్ స్వచ్ఛంద సంస్థలు, ఫేక్ ప్రయాణ ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ. డీల్ ఆఫ్ ది డే, ఆఫర్స్ అంటూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. తక్కువ ధరకు వస్తువులు, సేవలు లభిస్తాయన్న మన ఆశ స్కామర్ల చేతికి చిక్కేలా చేస్తుంది. నకిలీ షాపింగ్ సైట్లను గుర్తించడానికి సులభమైన మార్గాలు యుఆర్ఎల్ ప్రక్కన ప్యాడ్లాక్ ఉన్న //http చెక్ చేయడం ద్వారా సైట్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవచ్చు. సైట్ యుఆర్ఎల్ సందేహంగా నిజమైన రిటైలర్ అధికారిక చిరునామాకు దగ్గరగా ఉండి, కొన్ని అక్షరాలలో తేడా ఉండటం మరొక సంకేతం. బ్రౌజ్ చేస్తున్నప్పుడు రిటైలర్ యుఆర్ఎల్ని మాన్యువల్గా టైప్ చేయడం ద్వారా నకిలీ డొమైన్లను అడ్డుకోవచ్చు. ఇ–మెయిల్, టెక్ట్స్ లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి. మీ ఆర్డర్ గురించి మీకు సందేహాలు ఉంటే ఆన్లైన్లో అమ్మకందారు ఏరియా చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్ను నిర్ధారించుకోవాలి. సైట్లో కస్టమర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు లేనట్లయితే సందేహించాలి. మీరు షాపింగ్ స్కామ్కు గురైతే... వెంటనే మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫిర్యాదు చేయాలి. స్కామర్ మీ అకౌంట్స్కి యాక్సెస్ తీసుకున్నట్లు వారికి తెలియజేయాలి. మీ బ్యాంక్ అకౌంట్పై కంట్రోల్కి ఆన్లైన్ పాస్వర్డ్లను మార్చండి. రెండు కారకాల ప్రమాణీకరణను (2ఊఅ)ని పాటించాలి. ∙అనుమానిత సైట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసినట్లయితే, స్కామర్లు ఇన్స్టాల్ చేసిన మాల్వేర్, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ కోసం మీ పరికరాలను స్కాన్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. మీరు ఇంతకు ముందెన్నడూ ఆర్డర్ చేయని సైట్ని సందర్శిస్తున్నట్లయితే, వెబ్సైట్లోని ‘అబౌట్’ సెక్షన్ని చెక్ చేయాలి. వెబ్సైట్ ఎంత పాతదో దానితోపాటు కొన్ని కస్టమర్ రివ్యూలను చూడాలి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు స్కామ్కు గురైనట్లయితే వెంటనే పోలీసు రిపోర్ట్ ఫైల్ చేయాలి. https://cybercrime.gov.in/ కూ రిపోర్ట్ చేయచ్చు. --అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!) -
సెల్ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిందేమీలేదని స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్లు వచ్చాయి. What is this alert all about? @airtelindia @airtelnews @Airtel_Presence It's like a real high vibration and emergency alarm. pic.twitter.com/dLdohymNxL — Aksh (@aksh2810) September 21, 2023 మొబైల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్ రావడం ఇటు హైదరాబాద్లోనూ కలకలం సృష్టించింది. ఒక సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ అలారం వచ్చింది. ఒక్కసారిగా వార్నింగ్ సౌండ్ రావడంతో ఏమైందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో అక్కడే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే ఇది టెస్ట్ అలారం అని తెలియడంతో సమావేశాన్ని కొనసాగించారు. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్తోపాటు మెసేజ్లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్లు కూడా స్మార్ట్ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్లు వచ్చాయి. -
మరో ఐదు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
-
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్తో సంబంధం లేకుండానే బ్లాస్ట్పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
-
గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకున్నారా? తక్షణమే చేయండి!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితో మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్టాప్ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కోరింది. గూగుల్ క్రోమ్బ్రౌజర్లో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. దీంతో హ్యాకర్లు చొరబడి యూజర్ల పెర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. CERT-In హైలైట్ చేసినవి CVE-2023-4427 CVE-2023-4428 CVE-2023-4429 CVE-2023-4430 CVE-2023-4431 ప్రభావిత సాఫ్ట్వేర్ గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్లలో లోపాలను గుర్తించామని, వీటిని యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని, అలాగే అనుమానాస్పద, నమ్మశక్యం కాగాని వెబ్సైట్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. Google Chromeని ఎలా అప్డేట్ చేసుకోవాలి కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి కుడివైపున టాప్లో క్లిక్ మోర్మీద క్లిక్ చేయాలి చేయాలి. ‘హెల్ప్ అబౌట్ గూగులో క్రోమ్’ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ క్రోమ్ బటన్ కనిపించకపోతే మీ కంప్యూటర్ ఇప్పటికే అప్డేట్ అయినట్టు అర్థం. అపుడు రీలాంచ్ అనే బటన్మీద క్లిక్ చేయాలి. ఇప్పటికే కొన్నింటిని అప్డేట్ చేసింది.అయితే ఆటోమేటిక్గా అప్ డేట్ కానిపక్షంలో ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే మెసేజ్ వస్తుంది. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది
ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్లైన్స్కే చెందిన రెండు విమానాలు ఒకే రన్వేలో ఎదురెదురుగా వచ్చాయి. కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్యవేక్షణలో పార్కింగ్ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విస్తారా విమానానికి అదే రన్వే నుంచి టేకాఫ్కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్-ఢిల్లీ ఫ్లైట్లో ఉన్న కెప్టెన్ సోనూ గిల్(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్వే. ఒకవేళ ఆమె(సోనూ గిల్) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. A potentially catastrophic incident was narrowly averted at #Delhiairport on Wednesday morning when a #Vistara Airlines plane was cleared for take-off while another aircraft was in process of landing. The incident involved Flight UK725 en route from #Delhi to #Bagdogra,… pic.twitter.com/5GnT7RixLF — Thomas Nahar (@Thomasnahar_gfx) August 23, 2023 -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్లు, ఇమెయిల్లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) -
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంగళవారం కూడా ఘర్షణ వాతావరణం అలాగే ఉండటంతో కర్ఫ్యూ విధించినట్లు హెం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అల్లర్లను అరికట్టే విధంగా పోలీసు బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. 20 మందిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సోమవారం వెల్లడించారు. #WATCH | On Nuh incident, Haryana CM ML Khattar says "This is an unfortunate incident. A Yatra was being organised during which some people conspired an attack Yatris and police. Violent incidents were reported at several places. There seems to be a big conspiracy behind this.… pic.twitter.com/zK0VY2h3cL — ANI (@ANI) August 1, 2023 రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. అలాగే ఈ రోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక వీడియో దీనంతటికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. #WATCH | Jaipur: Police use water canon on BJP workers protesting against the Ashok Gehlot-led Government over the alleged corruption, atrocities against women, crumbling law and order and unemployment under CM Ashok Gehlot-led administration. pic.twitter.com/TYhFYV71zd — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2023 హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. హర్యానాలో భగ్గుమన్న ఘర్షణలు.. శోభాయాత్రతో మొదలు.. రాళ్లు రువ్వుకుంటూ.. -
తెలంగాణకు వర్ష సూచన
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
సాక్షి, భద్రాచలం: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ సందర్బంగా కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలి. గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: 5 లక్షల ఎకరాల్లో పంటల మునక! -
భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతు పవనాలు
-
IMD Alert: దంచికొడుతున్న వాన.. ఇంకా ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త!
ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఢిల్లీ: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధానిని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 153 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 40 ఏళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో వర్షం సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982 జులైలో మొదటిసారి ఇంత భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2-3 రోజులపాటు తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ను జారీ చేశారు అధికారులు. #WATCH | Delhi wakes up to rain lashing several parts of the city; visuals from Mayur Vihar Phase II area pic.twitter.com/WVXuHMyR0E — ANI (@ANI) July 9, 2023 భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్ పాస్లను అధికారులు మూసివేశారు. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ -
ఇంట్లో పెద్ద తాచుపాముంటే.. ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండగలమా!
జీవితంలో కొన్ని వదిలించుకుని తీరవలసినవి, ఎన్ని సర్దుబాట్లుచేసుకుని అయినా వదలకూడనివి కొన్ని ఉంటాయి... వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా దిద్దుకోకపోతే పచ్చటి జీవితాలు పాడయిపోతాయి, మోడయిపోతాయి. అందులో మొదటగా స్నేహితుడు.. అదీ ఆత్మీయుడు, ప్రాణసముడు.. అని నమ్మి మనం మన కష్టం, సుఖం, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మనసు విప్పి ఏవీ దాచుకోకుండా చెప్పేసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని మనల్ని మోసం చేయడానికి అతను కనిపెట్టుకుని ఉన్నాడు... అని తెలిసినప్పుడు మీరెంత ప్రమాదంలో ఉన్నారో ఊహించుకోండి. మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి... సాధ్యం కానప్పుడు దూరంగా పెట్టడానికి సందేహించకూడదు. అలాగే భృత్యుడు... సేవకుడికి వినయం ఉండాలి. యజమానిపట్ల గౌరవభావం ఉండాలి. ఆయన చెప్పిన ఆదేశాలను పాటించడం తన విధిగా అనుకోవాలి. తనసేవలతో యజమానిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుండాలి. అలా కాక యజమానికన్నా తాను ఎక్కువ చదువుకున్నవాడిననీ, దేనిలోకూడా ఆయనకేమీ తాను తీసిపోననీ, ఆయన మాటలు నేను వినేదేమిటనే సేవకుడు... యజమానిని ఎప్పుడూ తిరస్కార భావంతోనే చూస్తుంటాడు. అటువంటి భృత్యుడిని సంస్కరించగల శక్తి ఉంటే సంస్కరించగలగాలి... అది సాధ్యంకానప్పుడు వదిలించుకోవాలి. కపటి అయిన మిత్రుడు, అహంకారి అయిన భృత్యుడు మృత్యువుతో సమానం. ఇంట్లో పెద్ద తాచుపాము దూరింది.. ఇంట్లోనే ఎక్కడో ఉంది.. రోజుకు నాలుగైదు సార్లు కనిపిస్తున్నది. ఏదో దానిమానాన అది ఉందని ప్రశాంతంగా, నిబ్బరంగా ఇంట్లో ఉండగలమా... ఇవి కూడా అంతే... ఇక ... ఒకసారి అనుబంధం ఏర్పడిన తరువాత ఎన్ని అవాంతరాలు, ఎంత మానసిక క్లేశం ఎదురవుతున్నా సర్దుబాటు చేసుకుంటూ, చివరిదాకా కొనసాగించాల్సిన బంధం – దాంపత్య బంధం. ఇద్దరూ కలిసి చెయ్యిచెయ్యిపట్టుకుని ప్రస్థానం చేయాలి. ఎవరు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎవరు ఎవరిని కాపాడుకోవాలి.. అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు... ఒక చిన్న పిల్లను తీసుకుని తండ్రి నడిచి వెడుతున్నాడు. ‘అమ్మా! మనం నడుస్తున్న ప్రదేశం అంత మంచిది కాదు. కొండమీద నడుస్తున్నాం. జారితే ప్రమాదం. నా చేయి గట్టిగా పట్టుకో..’ అన్నాడు. దానికి ఆ పిల్ల .. ‘‘వద్దు నాన్నగారూ, నేను మీ చేయి పట్టుకున్నాననుకోండి. జారిపోవడం ఎంత ప్రమాదకరమో, మీ చేయి విడిచి పెట్టేయడం కూడా అంతే ప్రమాదకరం కావచ్చు. అందుకని నేను మీ చేయి పట్టుకోను. మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఎంత ప్రమాదం వచ్చినా మీరు నా చేయి వదలరు.. అది నా నమ్మకం’’ అన్నది. ఆ నమ్మకం ఎంత గొప్పది. ఇది భార్యాభర్తలమధ్య జీవితాంతం అలాగే ఉండాలి... ఒకరికొకరు బాసటగా. అంతే తప్ప ఎవరి చేయి ఎవరు ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకే తెలియకపోతే... వాళ్ల మధ్యే అభిజాత్యాలు, అహంకారాలు పుడితే, ఆ దాంపత్యం ఏం వర్ధిల్లుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది... ఇవి చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. తరువాత చూసుకోవచ్చులే అని కాక .. సమస్య మొదలయిందని గుర్తించిన మరుక్షణం దృష్టి పెట్టి దిద్దుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలల్లో వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్కు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది.. పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వాతావరణ మారుతుందని, యంత్రాంగాలను అలెర్ట్ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి -
దెబ్బకొట్టిన బిపర్జోయ్.. ఏపీకి మండుటెండల అలర్ట్
సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోపు ఆంధ్రప్రదేశ్లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. -
బిపర్జోయ్తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్భూమి ద్వారకా, జామ్నగర్, పోర్బందర్, రాజ్కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్జోయ్తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
గుజరాత్ అలెర్ట్.. తీవ్రరూపం దాల్చనున్న బిపర్ జాయ్ తుఫాను
గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు చెబుతోంది ఐఎండీ శాఖ. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర - కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు తెలిపారు ఐఎండీ శాఖ అధికారులు. రానున్న ఐదు రోజులు.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా పెను తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి గంటకు 170 కి.మీ కంటే వేగాంగా బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వారు తెలిపిన వివరాల ప్రకారం తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ జూన్ 15 నాటికి గుజరాత్ పాకిస్తాన్ తీరాన్ని తాకే అవకాశముందన్నారు. గుజరాత్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి మరింత తీవ్రమవుతుందన్నారు. అలెర్ట్.. అలెర్ట్.. కాబట్టి తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే పర్యాటక కేంద్రమైన తితాల్ బీచ్లో కెరటాల ఉధృతి ఎక్కువవడంతో పర్యాటకులు సందర్శించకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లోని జాలరులను వేటకు వెళ్లవద్దని కూడా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల వెంబడి అత్యవసర సేవలందించడానికి ముందుగానే విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపించారు. ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
రైలులో ప్రయాణిస్తున్నారా? దయచేసి ఇలా చేయకండి!
-
‘అత్యవసరం అయితేనే బయటకు రండి’
హైదరాబాద్/అమరావతి: భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం.. ఒక పక్క ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది. అయితే.. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ► గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వేసిన అంచనా నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వరంగల్ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ► మరోవైపు ఏపీలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ► ఇక వడదెబ్బతో తెలంగాణలో ముగ్గురు(తాజాగా.. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ మహిళ), ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏకంగా 20 మంది వడదెబ్బ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ► వాతావరణ మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలని, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ వెంటపెట్టుకుని వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడడం, కాటన్ దుస్తులు.. కళ్లజోడు ధరించడం లాంటి సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: డిశ్చార్జికి రీచార్జికి మధ్య.. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
-
హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు. కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్సెమ్మెస్లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. అనేక మంది బాధితులు ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్లో విత్డ్రా నోటిఫికేషన్లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది. అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది. ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి. 65,893 మోసాలు ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పగటిపూట రోకండ్లు పగిలే ఎండ.. మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్ బాల్ సైజ్లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తుయని పేర్కొంది వాతావరణ కేంద్రం. -
ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 29 మండలాల్లో మంగళవారం తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 17 మండలాల్లో వడగాడ్పులు వీచాయని చెప్పారు. కాకినాడ జిల్లాలో 2, కృష్ణా 1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్సార్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచినట్లు పేర్కొన్నారు. మరో 110 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో 44.7, నంద్యాల జిల్లా ఆత్మకూరు, గోస్పాడులో 44.5, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం, కర్నూలు జిల్లా మంత్రాలయం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అంబేద్కర్ తెలిపారు. చదవండి: ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ.. గౌరవ వేతనం ఎంతంటే? -
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలెర్ట్ ద్వారా వాతావరణ శాఖ తెలిపింది. సిద్దిపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయ్యి. ద్రోణి ప్రభావంతో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. మిగతా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చని, హైదరాబాద్లో మాత్రం 34-38 మధ్య నమోదు కావొచ్చని తెలిపింది. హైదరాబాద్లోనూ వర్ష ప్రభావం ఉండొచ్చని తెలిపింది. -
వార్నింగ్: మీ స్మార్ట్ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్లను గుర్తించాయి. వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ మీ డివైజ్లో ఈ యాప్లను ఇన్స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్ను పూర్తిగా రీసెట్ చేయండి. -
వాయుగుండంపై వాతావరణ శాఖ హెచ్చరిక.. 11 జిల్లాలకు అలర్ట్!
బంగాళాఖాతంలో (శ్రీలంక సమీపంలో) ఏర్పడిన అల్పపీడణ ద్రోణి క్రమంగా బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఫలితంగా తమిళనాడులోని సముద్ర ప్రభావిత జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. కాగా అకాల వర్షం వల్ల కొన్నిచోట్ల పంటనష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రానికి మరో వాయుగండం ఎదురుకానుంది. ఫలితంగా దక్షిణ తమిళనాడు సహా డెల్టా జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక సముద్రంలో గాలి ప్రభావం అధికంగా ఉండడంతో వేటకు వెళ్ల వెళ్లొద్దని జాలర్లను వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వివరాలు.. రాష్ట్రంలో గత ఏడాది ఈశాన్య రుతు పవనాల వల్ల వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు, కొంగు మండలం, డెల్టా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. అయితే దక్షిణ తమిళనాడులో ఈశాన్య రుతు పవనాల ప్రభావం తక్కువే. ఇక గత నెలాఖరుతోనే ఈశాన్య రుతు పవనాల సీజన్ ముగిసింది. వర్షాలు పూర్తిగా కనుమరుగైనట్లే అని కూడా వాతావరణ కేంద్రం ప్రకటించింది. కానీ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి, సోమవారం వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలపై దృష్టి.. దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, రామనాథపురం, డెల్టాలోని నాగపట్పం, మైలాడుతురై, పుదుకోట్టై తదితర సముద్ర తీర జిల్లాల్లో ఈనెల 31న మోస్తారు వర్షం, ఫిబ్రవరి ఒకటో తేదీన అనేక భారీ వర్షం పడే అవకాశాలు ఉంది. ఇక రాజధాని నగరం చెన్నై, శివారు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉందని వివరించారు. సోమవారం చెన్నై శివారు ప్రాంతాలతో పాటు డెల్టా జిల్లాలో అనేక చోట్ల వర్షం స్వల్పంగా కురిసింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో 11 జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సముద్రంలో శ్రీలంక వైపుగా గాలి ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. జాలర్లు వేటకు వెళ్లొద్దని, సముద్రంలోకి వెళ్లిన వారు సైతం తిరిగి రావాలని సూచించారు. -
Hyderabad: నగరవాసులకు ఎల్లో అలర్ట్.. పడిపోనున్న ఉష్టోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను చలి పులి గజ గజ వణికిస్తోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. రోజు రోజుకూ రాత్రి , పగలు తేడా లేకుండా దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. సుమారు 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే హైదరాబాద్లోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, వంటి ఐదు జోన్లలో విపరితమైన మంచు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున్న వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ఉదయం వేళ బయటకు వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ వెల్లడించింది. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
HYD: పబ్లిక్ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు!
కుమార్.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్ కోసం ఓ ఇనిస్టిట్యూట్లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్.. ఓ షాపింగ్ మాల్ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్కు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్కు ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్ప్యాక్లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా. నెట్తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ చదువుల మొదలు.. ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్ చెక్ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
కరోనా కొత్త వేరియంట్పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు) -
ఏపీ: కరోనాపై అప్రమత్తంగానే ఉన్నాం
సాక్షి, విజయవాడ: కోవిడ్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ నడుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ బుధవారం వెల్లడించారు. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయి. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి అని ఆయన వెల్లడించారు. దేశంలో చైనా నుంచి వచ్చిన కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. -
కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం
న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది మరింత తీవ్రం కానుందని, రాబోయే రోజులు కీలకమని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వైరస్ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో అధికారులను కోరారు ఆయన. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారాయన. అంతకు ముందు.. కోవిడ్ కథ ముగియలేదు. అన్ని విభాగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. బయటి దేశాల నుంచి వైరస్ వ్యాప్తి ముప్పు పొంచి ఉండడంతో నిఘా పటిష్టం చేయాలని సంబంధిత యంత్రాంగానికి తెలిపాం. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఆరోగ్య మంత్రి మాండవియా ట్వీట్ చేశారు. ఇక కొవిడ్పై ప్రధానంగా జరిగిన హైలెవల్ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రొటోకాల్లో ఎక్కడా.. మాస్క్ తప్పనిసరి అనే నిబంధం లేదన్న విషయం తెలిసిందే. In view of the rising cases of #Covid19 in some countries, reviewed the situation with experts and officials today. COVID is not over yet. I have directed all concerned to be alert and strengthen surveillance. We are prepared to manage any situation. pic.twitter.com/DNEj2PmE2W — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 21, 2022 ఇదిలా ఉంటే.. ఆరు ప్రధాన అంశాలపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గగన ప్రయాణాల ద్వారా.. దేశంలోకి కేసులు వ్యాప్తి చెందకుండా చూసుకోవడం. కొత్త సంవత్సరం నేపథ్యంలో బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న రోజూవారీ కేసుల శాంపిల్స్ను ఇన్సాకాగ్(INSACOG)జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపడం.. ఇతర ప్రధాన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో.. భారత్లో 129 తాజా కరోనా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,048గా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్ ప్రభావంతో ఒకరు మృతి చెందగా.. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా వైరస్ బారిన పడి 5,30,677 మంది మరణించారు. అమెరికా, జపాన్, కొరియా, బ్రెజిల్, చైనాలలో కరోనా కేసుల విజృంభణ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చైనాలో దారుణమైన పరిస్ధితి నెలకొంది. కొత్త వేరియెంట్ల అనుమానాల నేపథ్యంలో.. శాంపిల్స్పై పరీక్షలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి. -
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ‘జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్ నెట్వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.’ - కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి. ఇదీ చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు.. లక్షల్లో మరణాలు! -
అప్రమత్తంగా ఉండాలి.. మాండూస్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభావిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం తుపానుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో.. పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. ఇదీ చదవండి: మాండూస్కి అర్థం తెలుసా? -
ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి.. ఒక్కసారిగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను మరింత పెంచింది ఉత్తర కొరియా. గురువారం ఈ దుశ్చర్యకు పాల్పడగా.. దక్షిణ కొరియా తన దేశ ప్రజలతో పాటు జపాన్ను సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొరియా సరిహద్దులో ఉత్తర దిశగా లాంగ్ రేంజ్తో పాటు రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం నుంచి ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో దూర శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించినట్లు గుర్తించామని సియోల్ మిలిటరీ ప్రకటించింది. ఈస్ట్ ప్రాంతం వైపుగా ఈ ప్రయోగం జరిగిందని.. ఈ ప్రాంతానికి సీ ఆఫ్ జపాన్గా గుర్తింపు ఉందని తెలిపింది. ఆ వెంటనే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో.. ప్యోన్గాన్ దక్షిణ ప్రావిన్స్లోని కయెచోన్ నుంచి రెండు షార్ట్రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించినట్లు సియోల్ మిలిటరీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. సౌత్ కొరియా తూర్పు ద్వీపమైన ఉల్లెయుంగ్దో ప్రాంతంలో బుధవారం హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గురువారం దాడితోనూ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సియోల్ వర్గాలు సూచించాయి. ఇంకోవైపు జపాన్ సైతం ‘జే అలర్ట్’ ద్వారా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం ఒక్కరోజే నార్త్ కొరియా ఏకంగా 20 క్షిపణులను పరీక్షించింది. అందులో ఒకటి దక్షిణ కొరియా సరిహద్దు జలాల్లో పడిపోవడంతో అప్రమత్తం అయ్యింది సియోల్. కొరియా విభజన తర్వాత ఈ స్థాయిలో దగ్గరగా క్షిపణి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సియోల్-వాషింగ్టన్ దళాలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించగా.. ప్రతిగానే నార్త్ కొరియా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. రెండు రోజుల్లోనే 23 క్షిపణులను పరీక్షించి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. -
అలెర్ట్... బ్యాంకులు బంద్
-
WHO: ఆ భారత కంపెనీ సిరప్లను వాడొద్దు
జెనీవా: భారత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్తో సిరప్లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
ఈ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షం.. వాతావరణ శాఖ వార్నింగ్!
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు, తెలంగాణలో సైతం ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. కాగా, రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా, శుక్రవారం వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. pic.twitter.com/Zgzs9NCqwN — IMD_Metcentrehyd (@metcentrehyd) September 29, 2022 -
రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (చదవండి: ఘోర ప్రమాదం..గోడ కూలి 10 మంది దుర్మరణం) -
ఉక్రెయిన్ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్
US Embassy in Kyiv, warning: రానున్న రోజుల్లో ఉక్రెయిన్లో రష్యా బలగాలు మరిన్ని దాడులకు తెగబడనున్నట్లు సమాచారం. దీంతో యూఎస్ ఎంబసీ మరోసారి తమ దేశ పౌరులకు హెచరికలు జారీ చేసింది. ఆగస్టు 24 బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అంతేగాదు మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం పౌరులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్ నుంచి బయలుదేరమని యూఎస్ పౌరులని కోరుతోంది. అదీగాక బుధవారం సోవియట్ పాలన నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన రోజు కూడా కావడంతో రాజధాని కీవ్ బహిరంగ వేడుకలను నిషేధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్కి ముప్పు మరింత తీవ్ర స్థాయిలో ఉందని అధ్యక్షడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. (చదవండి: మృతి చెందిన పుతిన్ సన్నిహితుడి కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డు) -
భారత్లో టమాటో ఫ్లూ కలకలం...హెచ్చరించిన లాన్సెట్ నివేదిక
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. (చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం) -
ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, వాటికి అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వంటివి తోడవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరో మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 25వరకు వానల సరళి ఎలా ఉంటుందనే అంచనాలను తాజాగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు వారాల పాటు విస్తారంగా వానలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అప్రమత్తతే మేలు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల గత నెలంతా భారీ వర్షాలు నమోదయ్యాయి. మొత్తం నైరుతి సీజన్లో నమోదవ్వాల్సిన వర్షపాతంలో మూడింట రెండు వంతుల మేర ఒక్క నెలలోనే కురిసింది. చెరువులు, కుంటలు చాలా వరకు నిండిపోయాయి. వాగులు, వంకలతోపాటు కృష్ణా, గోదావరి ప్రధాన నదులు, ఉప నదుల్లోనూ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షాలు పడితే.. వరదలతో జన జీవనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం వానల తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఎండ.. కాసేపటికే వాన.. ఉదయం భారీ వర్షం.. కాసేపటికే భానుడి ప్రతాపం.. మళ్లీ సాయంత్రం మోస్తరు వర్షం.. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఇది. సాధారణంగా వర్షం కురిశాక వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారడం, కొన్నిసార్లు చలి వేయడం కనిపించేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉక్కపోత, వెంటనే వాన.. కాసేపటికే తిరిగి ఎండ తీవ్రత కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు -
Telangana: హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారీ వర్షాల నేపథ్యంలో.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో శనివారం, ఆదివారం భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ఇది వరకే హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకున్నంతో.. శుక్రవారం సాయంత్రం రెండు నుంచి మూడుగంటలపాటు కురిసిన వర్షాలకు.. నగరం నీట మునిగింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లోనూ భారీ వర్షాలు ఉన్నాయని, వారాంతం కావడంతో అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. వర్షం వెలిశాక హడావిడిగా బయటకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకోవద్దని చెప్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. వాహనదారులు జాగ్రత్తగా రోడ్లపై వెళ్లాలని, కరెంట్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. పలు జిల్లాలకు సూచన తెలంగాణలో పలు జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సైతం సిద్ధంగా ఉంది. -
తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్
-
ఏపీ వాసులకు చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ (రాయలసీమ)లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ఏపీలోకి విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పేర్కొంది. అలాగే మధ్య అరేబియా సముద్రం, గోవాలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తాయని పేర్కొంది. చదవండి: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే.. రుతు పవనాలు ఏపీకి దగ్గరగా రావడం వల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గినట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు కార్వార్, చిక్మంగళూర్, బెంగళూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: భానుడి ప్రతాపానికి చిగురుటాకులా అల్లాడిపోతోంది ఢిల్లీ. రానున్న నాలుగైదు రోజులు వాతావరణం పొడిగా ఉండి, తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదీగాక శనివారం ఒక్కరోజే 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. దీంతో ఢిల్లీలో వేడుగాలులు అధికమవుతాయని, వడ దెబ్బ అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఢిల్లీలో కనీసం ఐదు వాతావరణ స్టేషన్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. దీనికి తోడు ప్రస్తుతం ఢిల్లీ పీల్చే వాయువులో కూడా నాణ్యత లేక ఉక్కిరబిక్కిరి అవుతోంది. పైగా ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది అసలు అధిక ఉష్ణోగ్రతలు అంటే.. వాతావరణ శాఖ వివరణ ప్రకారం...గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా అంటే సాధారణం కంటే కనీసం 4.5 నాచ్లు ఎక్కువగా ఉంటే గరిష్ట ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. అంతేకాదు 6.5 నాచ్లు అధికంగా ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. వాస్తవంగా ఒక ప్రాంతం ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్ మార్క్ను దాటితే తీవ్రమైన ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. i) Increase in rainfall activity likely over South Peninsular India from 07th June. ii) Intense spell of rainfall over Northeast India and Sub-Himalayan West Bengal & Sikkim during next 5 days. pic.twitter.com/UFLgM7b6sF — India Meteorological Department (@Indiametdept) June 4, 2022 (చదవండి: భారత్లో కరోనా టెన్షన్.. కేంద్రం అలర్ట్) -
తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
-
కరోనా అలర్ట్.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క రోజులో ఏకంగా వెయ్యి కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 3, 172 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేసుల పెరుగుదలపై కీలక ప్రకటన చేసింది. కొత్త కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత కేసులు 3వేల మార్క్ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక డెయిలీ పాజిటివిటీ రేటు 0.05శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.67గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 19, 509గా ఉంది. ఇది కూడా ఆందోళనకు గురి చేసే అంశమని కేంద్రం పేర్కొంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 584 మంది కోలుకున్నారు. భారత్లో కరోనా రికవరీ రేటు ఇప్పటిదాకా 98.74 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్ ప్రభావంతో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొంది కేంద్రం. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో ఉత్తర భారత్కు చెందిన విద్యార్థులు కరోనా వైరస్ను వ్యాపింపజేస్తున్నారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ రాష్ట్రంలోనూ వంద దాకా కొత్త కేసులు వెలుగు చూశాయి. చదవండి: కోవిడ్ సోకితే అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం! -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, మీకు ఈ మెసేజ్ వచ్చిందా!
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? మీ బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేస్తామని మెసేజ్లు వస్తున్నాయా?అయితే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 కేవైసీ సబ్మిట్ చేయకపోతే అకౌంట్లను బ్లాక్ చేస్తామని వస్తున్న మెసేజ్లపై కేంద్రం అప్రమత్తమైంది.ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్బీఐ ఖాతాదారుల్ని టార్గెట్ చేశారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు కాల్ చేసినా,మెయిల్స్ పెట్టినా రిప్లయి ఇవ్వొద్దని తెలిపింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున వచ్చిన మెసేజ్లకు సమాధానాలు ఇచ్చి ఉంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని తెలిపింది. A message in circulation claiming that your @TheOfficialSBI account has been blocked is #FAKE #PIBFactCheck ▶️ Do not respond to emails/SMS asking to share your personal or banking details. ▶️ If you receive any such message, report immediately at report.phishing@sbi.co.in pic.twitter.com/Y8sVlk95wH — PIB Fact Check (@PIBFactCheck) May 18, 2022 ఇప్పుడు రెండో సారి డియర్ కస్టమర్ మీ ఎస్బీఐ బ్యాంక్ డాక్యుమెంట్లకు కాలం చెల్లింది. అందుకే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 24గంటల్లోపు కేవైసీ సబ్మిట్ చేయండి. అందుకోసం మేం పంపిన లింక్స్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయండి అంటూ సైబర్ నేరస్తులు ఓ లింక్ను ఎస్బీఐ ఖాతాదరులకు పంపిస్తున్నారు. ఇలా పంపడం ఇదే తొలిసారి కాదని, ఈ ఏడాది మార్చిలో ఒకసారి ఈ తరహా లింక్స్ పంపినట్లు ఎస్బీఐ అధికారికంగా తెలిపింది. అకౌంట్ హోల్డర్లు ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. అనుమానం ఉంటే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్లో పేర్కొంది. -
రెచ్చిపోవద్దు.. ఊరుకోం! నవనీత్ కౌర్కు హెచ్చరికలు
ముంబై: మహానగరంలో ‘హనుమాన్ చాలీసా’ ఛాలెంజ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఎలాగైనా చేరుకుని హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నగర వ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. చాలెంజ్ ప్రకారం.. ఎలాగైనా మాతోశ్రీని తన అనుచరులతో చేరుకోవాలని ఎంపీ నవనీత్కౌర్, ఆమె భర్త రవి రానాలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నవనీత్ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా శివ సేన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇక ఈ పరిణామాలపై సేన నేత, ఉద్దవ్ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్ రౌత్ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్కౌర్ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు ఎంపీ సంజయ్ రౌత్. అంతేకాదు రాష్ట్రపతి పాలన ప్రస్తావనపై స్పందిస్తూ.. కేంద్రం చర్యలకు బెదిరే ప్రసక్తే లేదంటూ బదులిచ్చాడు. ఆజాన్, లౌడ్స్పీకర్ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్ థాక్రేను హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పఠించాలంటూ సవాల్ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. ఈ తరుణంలో అప్రమత్తమైన శివ సేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట నిరసనలు శనివారం మోహరించారు. దీంతో ఆమె, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వాళ్ల దాడి నుంచి మాతోశ్రీని రక్షించుకునే ప్రయత్నమే తమదని సేన కార్యకర్తలు చెబుతున్నారు. ఓ పక్క ముంబై పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పొలిటికల్ జంటకు శుక్రవారం నోటీసులు జారీ చేయగా.. మరోవైపు కేంద్రం అమరావతి లోక్సభ సభ్యురాలైన నవనీత్ కౌర్కు కేంద్ర సాయుధ కమాండోలతో వీఐపీ భద్రత కలిపించడం విశేషం. చదవండి👉🏼: మేం తగ్గం.. ఆ పని చేసి తీరతాం -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఈ ఫోన్ నెంబర్స్తో జాగ్రత్త..లేకపోతే..!
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్ వెబ్సైట్లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. ఈ నంబర్ల పట్ల జాగ్రత్త..! తాజాగా ఎస్బీఐ కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్ నంబర్లను ట్విటర్లో పేర్కొంది. కేవైసీ అప్డేట్ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్, మెసేజ్స్ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించంది. ఈ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్స్ను ఒపెన్ చేయకూడదని విన్నవించింది. ఈ మెసేజ్స్తో ఖాతాదారులు అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ హ్యండిల్లో పేర్కొంది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది. Do not engage with these numbers, & don't click on #phishing links for KYC updates as they aren't associated with SBI. #BeAlert & #SafeWithSBI https://t.co/47tG8l03aH — State Bank of India (@TheOfficialSBI) April 20, 2022 చదవండి: ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్ -
చచ్చిపోవడానికి రెడీగా ఉండండి.. మాజీ సీఎంలకు వార్నింగ్
సాక్షి, బెంగళూరు: మాజీ సీఎంలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏకంగా 63 మందిని ఓ క్షణంలోనైనా చంపేస్తామనడం కర్నాటకలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, లేఖలో వీరందరూ ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ లేఖ అందినవారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు. ఈ లేఖపై మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని కోరారు. లేఖల విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు. -
'ది కశ్మీర్ ఫైల్స్'.. కక్కుర్తి పడి ఆ లింక్స్ ఓపెన్ చేయకండి
Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మీకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై పడింది. ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు. ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
-
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ జె. నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి 45నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని కలెక్టర్ నివాస్ సూచించారు. సముద్రంలో ఈతకు వెళ్లవద్దని సాగర తీర ప్రాంత వాసులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అల్ప పీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఒంగోలు, కడప, అనంతపూర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద అపరిచితుడి కలకలం
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్పథ్లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు. -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కచ్చితంగా..
ముంబై: రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీవో) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్లో సంస్థ ఈ విషయం పేర్కొంది. ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన రెండు వారాలు ముగిసేలోగా పాన్ వివరాలను ఎల్ఐసీ వద్ద అప్డేట్ చేసుకోని పాలసీదార్లను..షేర్ల కొనుగోలుగా అర్హులుగా పరిగణించబోమని తెలిపింది. కంపెనీ వెబ్సైట్లో నేరుగా లేదా ఏజెంట్ల సహాయంతో అప్డేషన్ చేసుకోవచ్చని వివరించింది. డీఆర్హెచ్పీ దాఖలు చేసే నాటికి, బిడ్/ఆఫర్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్న వారు.. పాలసీహోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారని పేర్కొంది. వారికి డీమ్యాట్ ఖాతా కూడా ఉండాలి. ఇష్యూలో దాదాపు 10 శాతం వరకూ పాలసీదారుల కోసం కేటాయించవచ్చని, పాలసీహోల్డర్లకు ఐపీవో ఇష్యూ ధరలో దాదాపు 10 శాతం వరకూ డిస్కౌంటు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఐపీవో కింద ఎల్ఐసీలో 5% వాటా (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ. 63,000 కోట్లుగా ఉంటుందని, ఇష్యూ మార్చిలో ఉంటుందని అంచనా. చదవండి: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు షాక్..! -
హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫారమ్ కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది. -
పాతబస్తీలో పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉత్తర ప్రదేశ్లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఓల్డ్ సిటీలో క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు కలగకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందుకోసం ఏకంగా 7వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత వార్త: ఒవైసీ కారుపై దుండగుల కాల్పులు.. ఒకరి అరెస్టు.. పిస్తోల్ స్వాధీనం -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి..!
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచుతోంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. కొత్త ఛార్జీలు..! డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకుగాను ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోనో బ్యాంకింగ్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ వర్తించదు. బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఐఎంపీఎస్ ఛార్జీని అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారులు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే రూ. 20తో పాటుగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఐఎంపీఎస్ సేవలతో డబ్బులను ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ చేయవచ్చును.సెలవు దినాలలో కూడా నగదు బదిలీ జరుగుతుంది. కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి..! రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్ లావాదేవీలకు కూడా వర్తించనుంది. ఐఎంపీఎస్ లావాదేవీల్లో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్ లావాదేవీపై రూ. 4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్ చేయనుంది. తాజాగా ఎస్బీఐ రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్ను యాడ్ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఎస్బీఐ కొత్త సర్క్యులర్.. ఒక్క నోటీసుతో సీన్ రివర్స్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన -
యాపిల్పై గూగుల్ సంచలన ఆరోపణలు
టెక్ దిగ్గజ కంపెనీలు పరస్పర ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. యాపిల్ మెసేజింగ్ సర్వీస్.. ఐమెసేజ్ విషయంలో యూత్ యూజర్లు ఆందోళన చెందుతున్నారట. అందుకు కారణం.. ఐఫోన్ యూజర్లు.. ఐమెసేజ్ ఉపయోగించి మెసేజ్లు పంపించుకున్నప్పుడు బ్లూ కలర్లో మెసేజ్లు చూపిస్తున్నాయి. అదే గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం గ్రీన్ కలర్ నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఇది యూజర్లను ఇబ్బందికి గురి చేస్తోందట!. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్.. డజన్ల మంది టీనేజర్లను, కాలేజీ స్టూడెంట్లను ప్రశ్నించి.. వాళ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది. వాళ్లలో చాలామంది ఈ ఆప్షన్పై ఇబ్బందిగా ఫీలవ్వడం విశేషం. మరోవైపు ఈ ఫీచర్పై గూగుల్ సైతం మండిపడింది. పోటీతత్వం పేరుతో భిన్నత్వం ప్రదర్శించడం, యువత మానసిక స్థితిని యాపిల్ దెబ్బ తీస్తోందని గూగుల్ ఆరోపణలు గుప్పించింది. Apple’s iMessage lock-in is a documented strategy. Using peer pressure and bullying as a way to sell products is disingenuous for a company that has humanity and equity as a core part of its marketing. The standards exist today to fix this. https://t.co/MiQqMUOrgn — Hiroshi Lockheimer (@lockheimer) January 8, 2022 అయితే యాపిల్ ఈ ఆరోపణల్ని ఓపెన్గా ఖండించకపోయినా.. ఓ ప్రకటనలో అదేం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది యాపిల్.. ఎపిక్ గేమ్స్ కేసు సందర్భంగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఐమెసేజ్ ఫీచర్ అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. చివరకు ఆ ప్రతిపాదనను యాపిల్ మేనేజ్మెంట్ తిరస్కరించిందని తేలింది. -
Facebook Scam: ‘ఈ వీడియోలో ఉంది మీరేనా?’
Facebook Messenger Video Link Scam Alert: ఆన్లైన్ మోసాలకు భారత్ నెంబర్ వన్ అడ్డాగా మారుతోంది. స్మార్ట్ఫోన్ యూజర్లు పెరిగిపోవడం.. కనీస అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో కొత్త తరహా ఆన్లైన్ స్కామ్లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్బుక్ మెసేంజర్ వీడియో స్కామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫేస్బుక్ అకౌంట్ టార్గెట్గా జరిగే పిషింగ్ స్కామ్ ఇది. ఈ గాలంలో చిక్కితే గనుక.. ఫేస్బుక్ లాగిన్ క్రెడెన్షియల్స్ సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. తద్వారా ఆన్లైన్ మోసగాళ్లు ఫేస్బుక్ అకౌంట్లపై పట్టు సాధిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సోఫోస్’ ఈ స్కామ్కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది కూడా. విశేషం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం ఇదే తరహా స్కామ్ ఒకటి ఫేస్బుక్ను కుదిపేసింది కూడా. లింక్కి టెంప్ట్ అయితే.. ముందుగా ఫేస్బుక్ మెసేంజర్ (మెసేజ్ బాక్స్) కు ఓ లింక్ పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఆ లింక్ పైన ‘ఈ వీడియో ఉంది మీరేనా?’ అని రాసి ఉంటుంది. ఆ లింక్ యూబ్యూట్ లింక్ మాదిరి ఉంటుంది. కాబట్టి, చాలా క్యాజువల్గా యూజర్ క్లిక్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి గనుక క్లిక్ చేసినట్లయితే.. నేరుగా ఫేస్బుక్ లాగిన్కు వెళ్తుంది. ఒకవేళ ఫేస్బుక్లోకి లాగిన్ గనుక అయినట్లయితే.. కిస్సా ఖల్లాస్. ఫేక్ పేజీ.. అది ఫేస్బుక్ లాగిన్ పేజీ అనుకుంటే పొరపాటే!. పక్కా ఫేక్ పేజీ. యూజర్ ఇన్ఫర్మేషన్ను తస్కరించేందుకే ప్రత్యేకంగా అలా డిజైన్ చేసి పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఒకవేళ అక్కడ లాగిన్ గనుక అయితే పాస్వర్డ్తో సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. వెంటనే ఫేస్బుక్ అకౌంట్ మీద పట్టు సాధించి.. ఆపై బ్లాక్మెయిల్కు, మోసాలకు దిగుతారు. గుర్తుపట్టడం ఎలా? ఆ ఫేస్బుక్ లాగిన్ లింక్ ఫేక్ లేదా ఒరిజినల్ అని గుర్తుపట్టడం ఎలా?. వెబ్సైట్ యూఆర్ఎల్ ఒక్కటే మార్గం. లింక్ పైన యూఆర్ఎల్లో HTTPS లేదంటే HTTPతో మొదలైందంటే.. అది ఒరిజినల్ అని గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో సేఫ్ ప్రొటోకాల్ కింద వెబ్సైట్లు అన్నీ HTTPS యూఆర్ఎల్ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి కాబట్టి. మోసపోయి ఫిర్యాదులు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చదవండి: మీ Whatsapp బ్యాన్ అని చూపిస్తుందా? పని చేయట్లేదా? ఇలా చేయండి -
చెడ్డీ గ్యాంగ్ ... యమడేంజర్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: చెడ్డీ గ్యాంగ్ ...ఈ పేరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే అయినా ఆ మాట వింటేనే ఏదో తెలియని వణుకు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్యాంగులు నేరాలకు పాల్పడని జిల్లాలు లేవంటే అతిశయోక్తి కాదు. కొంతకాలంగా ఈ గ్యాంగ్ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. నేరాలకు ఎంచుకునే ప్రాంతాలు ఇవే.. చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు. జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లలో నేరాలు చేసి క్షణాల్లో జాతీయ రహదారిపైకి చేరుకుని లారీలపై పరారౌతుంటారు. మూకుమ్మడిగా దాడి.. సుమారు 5 నుంచి 8 మంది సభ్యులుగా ఉండే ఈ గ్యాంగ్ నేరం చేసే ఇళ్లను ముందే ఎంపిక చేసి రెక్కీ నిర్వహించుకుంటారు. అలా ఎంపిక చేసిన ఇళ్ల సమీపంలో చెట్ల వద్ద, పొదల్లో బలమైన కర్రలు ముందే సిద్ధం చేసుకుంటారు. దొంగతనానికి పాల్పడేందుకు వెళ్లే సమయంలో కత్తులు, చాకులు తమ వద్ద ఉంచుకుంటారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల లోపు సమయాన్ని వీరు నేరాలకు అనువైనదిగా ఎంచుకుంటారు. ఎక్కువ సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను సైతం వీరు తమ లక్ష్యంగా ఎంచుకుంటున్నారంటే వీరిలో ఉన్న తెగింపే కారణం. అలాంటి సముదాయాల్లో ఇళ్ల ప్రహరీలు దూకి లోపలికి ప్రవేశించి తమ వద్ద ఉన్న పరికరాలతో తలుపులు పెకళించి ఇళ్లలో దూరుతారు. ఆ ఇళ్లలో కుటుంబ సభ్యులు ఉన్నా వారిని బెదిరించి దాడి చేసి దొంగతనానికి పాల్పడతారు. నిమషాల వ్యవధిలోనే విలువైన వస్తువులు చేజిక్కించుకుని అక్కడ నుంచి పరారౌతారు. ఆ పరంపరలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. నగర శివారుల్లో ఉండే ఇళ్లలో నేరం చేసే సమయంలో తలుపులు పగులగొట్టడానికి వెనకాడరు. పెద్దపెద్ద బండరాళ్లతో తలుపులను, అద్దాలను పగులగొడతారు. తలుపు తీయకపోతే చంపుతామని బెదిరిస్తారు. వీరి హడావిడికి భయానికి లోనైన కుటుంబ సభ్యులు తలుపులు తీస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చనే ఆశతో తలుపులు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ తలుపులు తీయని పక్షంలో పగులగొట్టి లోనికి ప్రవేశించే ఈ గ్యాంగ్ ముందుగా కుటుంబ సభ్యులపై దాడి చేస్తారు. వారి ఒంటిపై ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటారు. వీరు బయట తలుపులు పగులగొడుతున్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పినా ఈ నేరస్తులు 15 నిముషాల్లోనే తమ పని చక్కబెట్టుకుని పోతుండటంతో పోలీసులు అక్కడకి చేరుకున్నా వివరాలు నమోదు చేసుకోవడం, దర్యాప్తు చేయడం తప్ప నేరాన్ని నిరోధించే అవకాశం దక్కడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చెడ్డీగ్యాంగ్ కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పగటి సమయంలో ఇళ్ల సమీపంలో అనుమానిత వ్యక్తులు కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో అలికిడి అయినా, ఇంటి ఆవరణలో కుళాయిలు విప్పినట్టు గాని శబ్దం వస్తే వెంటనే తలుపులు తెరిచి చూడరాదు. చుట్టుపక్కల ఇళ్ల వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందిస్తే గస్తీ పోలీసులు అక్కడకు చేరుకుని నేరాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. నేరస్తులు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు గట్టిగా కేకలు వేయడం, చుట్టుపక్కల నివాసితులు కూడా కేకలు వేయడం చేస్తే ఈ గ్యాంగ్ నేరానికి తెగబడేందుకు వెనకాడతారు. గస్తీ పెంచాం రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ కదలికలు నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం అయ్యాం. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సహకారంతో అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా పెంచాం. ఫింగర్ ప్రింట్ యంత్రాలతో అనుమానితులను తనిఖీ చేస్తున్నాం. రాత్రి గస్తీ బీటు సిబ్బందిని పెంచాం. నియంత్రణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి. అనుమానం వస్తే 100కి ఫోన్ చేసి స్పష్టమైన చిరునామా చెబితే నిముషాల వ్యవధిలోనే సమీప గస్తీ పోలీసులు అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుంది. శివారు ప్రాంతాల్లో ప్రజలు అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –ఐశ్వర్య రస్తోగి, రాజమహేద్రవరం, అర్బన్ జిల్లా ఎస్పీ -
Tamil Nadu: మరో వరుణ‘గండం’!
రాష్ట్రానికి మరో వరుణ‘గండం’ ఎదురుకానుంది. ఇప్పటికే అల్పపీడనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు పంటనష్టం వాటిల్లింది. ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముప్పు రానుంది. వాయుగుండం కారణంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం స్పష్టంచేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఈనెల 18వ తేదీన తీరం దాటనుంది. ఫలితంగా మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు పువియరసన్ ప్రకటించారు. దీని ప్రభావంతో చెన్నై సహా పలు జిల్లాల్లో 17,18 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయి. 17వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, సేలం, అరియలూరు, పెరంబలూరు, పుదు చ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. అలాగే 18వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్టై, కాంచీపురం, సేలం, ధర్మపురం, కృష్ణగిరి, కల్లకురిచ్చి, ఈరోడ్, కడలూ రు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చిరాపల్లి, విళుపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది. అండగా ఉంటాం.. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన వారికి అండగా ఉంటాం.. ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. చేతికొచ్చిన పంటను కోల్పోయిన వ్యవసాయ కుటుంబాలకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈశాన్య రుతువపనాల ప్రభావంతో సుమారు 15 రోజులపాటూ విరుచుకుపడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయని దీంతో జన జీవనం అతలాకుతలమై పోయిందన్నారు. వర్షాలు అదుపులోకి వచ్చిన తరుణంలో ఏడుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో నియమించిన సర్వే బృందం ఈనెల 12వ తేదీన డెల్టా జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ బృందం సీఎంకు మంగళవారం సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సీఎం స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించినట్లు సీఎం చెప్పారు. నీట మునిగిన పంటకు సంబంధించి.. నష్టపోయిన రైతులకు అవసరమైన మేరకు వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్నరోడ్లు, సైడు కాలువల మరమ్మతుల కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక చెన్నైలో బుధవారం నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తల దృష్ట్యా నగరానికి తాగునీటి సరఫరా చేసే చెంబరబాక్కం, పుళల్, పూండి చెరువుల నుంచి బుధవారం ఉపరితల నీటిని విడుదల చేశారు. వరద ముంపు బాధిత ప్రాంతాల పునరుద్ధరణ పనులు బుధవారంతో పూర్తవుతాయని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్సింగ్ బేడీ మీడియాకు తెలిపారు.