Andhra Pradesh DGP
-
కేసులు పెట్టడం.. లోపలేయడం.. కొట్టడం..: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారు... అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప, ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే, ఆ వివరాలను తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టే, ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ కేసుల్లో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్ట్ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తాము ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్ట్ విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బొసా లక్ష్మి పిటిషన్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్కి చెందిన బొసా రమణను కొద్దికాలం కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్ట్ విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)ల వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వారు కోర్టుకు చెప్పారు. ఇచ్ఛాపురం పోలీసులు మరో కేసులో రమణను అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో హైకోర్టు ఇచ్ఛాపురం ఎస్హెచ్వోను ప్రతివాదిగా చేర్చింది. అనంతరం ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ముందు హాజరైన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు... లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ధర్మాసనం ఆదేశాల మేరకు సీఐలు చిన్నం నాయుడు, వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. రమణను తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది. ఇలాంటి నిర్లక్ష్యపు తీరును తాము ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పొదిలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ, బొసా రమణపై 27 కేసులున్నాయని తెలిపారు. రమణను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం మినహా దర్యాప్తు చేయడం లేదని పేర్కొంది. -
డీజీపీని కోర్టుకు పిలుస్తాం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండటమే కాక, నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరు పరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళుతుండటం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా.. అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజి్రస్టేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరు పరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని.. దీనిపై కోర్టు సమయం వృథా చేసుకోరాదంటూ ఇచ్ఛాపురం ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? అంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు (కక్షిదారులు) ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు (అధికారుల వైపు) ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒక్కటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాంగ్మూలం నమోదు చేశాక మళ్లీ నోటీసా? ⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్యనగర్కు చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బొసా లక్ష్మీ తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్రెడ్డి మాత్రం రమణ పోలీసుల అక్రమ నిర్బంధంలోనే ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరు పరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్పీ, పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను ఆదేశించింది. ⇒ నవంబర్ 13న కేసు విచారణకు రాగా, రమణను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను స్థానిక కోర్టు ముందు హాజరు పరచగా, కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్ఛాపురం ఎస్హెచ్వోను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి, ఇచ్ఛాపురం ఎస్హెచ్వోలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్హెచ్వోలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసి, అనంతరం విడిచి పెట్టామని పొదిలి ఎస్హెచ్వో చెప్పారు. ⇒ తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్హెచ్వో తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదంది. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి, ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి, ఇలా వదిలేశామని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. అరెస్ట్, విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్
గుంటూరు, సాక్షి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు.‘‘పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్సైడెడ్గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో... ట్రాన్స్ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్బుక్లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు. -
తిరుమల ఏఎస్పీ ముని రామయ్యపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమల శాంతిభద్రతల విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) ఉన్న ఎం.మునిరామయ్యపై వేటు పడింది. ఆయన్న బదిలీ చేస్తూ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముని రామయ్య హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారంలో ముని రామయ్య పాత్రపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సవాంగ్ ఆయనపై బదిలీ వేటు వేశారు. మరోపక్క సీసీఎస్ పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపారి చుండూరు సునీల్కుమార్ను డబ్బు కాజేయడానికి రంగంలోకి దింపిన నకిలీ డీఎస్పీ కేపీ రాజు కోసం గాలింపు ముమ్మరం చేశారు . చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... -
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
సేఫ్టీ టన్నెల్ నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, గుంటూరు: మహమ్మారి కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల ఎస్3 వీ సేఫ్టీ టన్నెళ్లను ప్రవేశ పెట్టింది. తాజాగా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టి సారించారు. సూక్ష్మ క్రిములను నివారించే ఎస్3వీ సేఫ్ టన్నెల్ను ఆయన బుధవారం ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్ను అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇకపై డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. (చదవండి: కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్ను ప్రారంభించిన సీఎం జగన్) (చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’) -
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్ఐఆర్ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలు చేయాలని సూచించారు. జీరో ఎఫ్ఐఆర్ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్ఐఆర్లో అవకాశముండదు. జీరో ఎఫ్ఐఆర్ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్ను ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు. చదవండి: జీరో ఎఫైఆర్ను కచ్చితంగా అమలుచేయాలి ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! పరిధి పరేషాన్ -
పోలీసులు ప్రజా సేవ కోసమే
-
ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం
సాక్షి, విజయవాడ : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల కౌటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. -
ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
-
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ను పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకెలాంటి సమాచారం లేదని, ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను అపహరించినట్లు తాజాగా వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం. టీడీపీ యాప్లోకి ఓటర్ల మాస్టర్ డేటా.. ఓటర్ల మాస్టర్ డేటా ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటా టీడీపీ సేవామిత్ర యాప్లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా ఆధార్ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్ డేటాలోనే ఆధార్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్లో ఆధార్ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. చదవండి: డేటా చోర్.. బాబు సర్కార్ -
ఏపీ డీజీపీకి ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మవురిలో సర్వే చేస్తూ ఆరుగురు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు పట్టుబడిన ఉదంతంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ డీజీపీ నుంచి సమాధానం వచ్చాక దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని కావడంతో ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పని చేయడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ల వినియోగంపై విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళా శక్తికి ప్రతీక అయిన గులాబీ రంగులో మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలనేది ఎన్నికల సంఘం ఆలోచన అని, ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో టీఆర్ఎస్ జెండా రంగు సైతం గులాబీ అన్న విషయం వారి దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులోనే ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న గుర్తింపు పొందని 22 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులు కేటాయించిందన్నారు. నవంబర్ 9 వరకు ఓటర్ల నమోదు! ఓటర్ల తుది జాబితా ప్రచురించిన అనంతర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదుకు దాదాపు 3 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్ కుమార్ వెల్లడించారు. ఓటర్ల నమోదుకు నవంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అదే నెల 19 వరకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదు తెలుసుకోవడానికి ప్రజలంతా ఎన్నికల సంఘం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 970 మంది మహిళా ఓటర్లు ఉండేవారని, ఇటీవల ప్రచురించిన తుది జాబితా అనంతరం ఈ నిష్పత్తి 1000:981కు పెరిగిందన్నారు. 18, 19 ఏళ్ల వయసుగల యువతతోపాటు మహిళా ఓటర్ల నమోదు పుంజుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానల్లో ఓటర్ల జాబితాలను ఉర్దూలో, జుక్కల్, ముథోల్ అసెంబ్లీల జాబితాలను మరాఠీ భాషలో ప్రచురించే కార్యక్రమం పూర్తయిందని, ఆసక్తిగల వారు స్థానిక అధికారుల నుంచి ఈ జాబితాలను పొందవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ రోజున వికలాంగులకు కల్పించనున్న సదుపాయాలను పరిశీలించేందుకు నవంబర్ 24 నుంచి 26 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రాష్ట్రానికి రానున్నారన్నారు. 307 కంపెనీల కేంద్ర బలగాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున మద్యం, డబ్బుల పంపిణీ జరుగుతోందని అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయని రజత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రూ. 31.14 కోట్ల నగదును, 65,364 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పోలీసు సిబ్బంది సరిపోతారని, పోలింగ్ నిర్వహణ కోసం 307 కంపెనీల కేంద్ర బలగాలను కోరామన్నారు. కేంద్ర బలగాల సంఖ్యపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. లైసెన్స్లేని 6 ఆయుధాలు, లైసెన్స్గల 7,411 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 8,622 ముందుజాగ్రత్త కేసులు నమోదు చేశామని, 43,101 మంది పాత నిందితులను బైండోవర్ చేశామని, 3,765 కేసుల్లో వారెంట్లు జారీ చేశామని ఆయన చెప్పారు. వివరణ అందాక కోడ్ ఉల్లంఘనలపై చర్యలు... ప్రగతి భవన్, మినిస్టర్ల క్వార్టర్లలో టీఆర్ఎస్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరామని, వివరణ అందాక నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోడ్ ఉల్లంఘన పరిధిలోకే వస్తుందన్నారు. ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ వివరణ కోరామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 59 ఫిర్యాదులు రాగా అందులో 11 ఫిర్యాదులను పరిష్కరించామని, 48 పెండింగ్లో ఉన్నాయన్నారు. -
‘పోలీసులైనా, ప్రజలైనా చర్యలు తప్పవు’
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అదే సమయంలో చింతలపూడి వసతి గృహం బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ చేపడతామన్నారు. ఈ కేసుల్లో పోలీసుల తప్పు ఉందని తేలితే ఎలాంటివారినైనా ఉపేక్షించమని ఠాకూర్ తెలిపారు. అసలు పోలీసులు పని చేసేది ప్రజల కోసమేనని, రౌడీయిజం, రోడ్డు ప్రమాదాలు, నేర నిరోధకంపై జిల్లా యంత్రాంగానికి సూచనలిచ్చామన్నారు. శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పశ్చిమలో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ పనితీరు బాగానే ఉందని కితాబిచ్చారు. నూతన టెక్నాలజీతో మరింత వేగంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్, ఫోరెన్సిక్ యూనివర్శిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ.. పెరుగుతున్న సైబర్ క్రైమ్లు నిరోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది సంతృప్తిగా ఉంటేనే పోలీసు శాఖలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లా రావూరుపాడు పోలీస్ స్టేషన్పై దాడి ఘటన చాలా విచారకరమన్న డీజీపీ ఠాకూర్.. తప్పు ఎవరిదైనా లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, అది ప్రజలైనా, పోలీసులైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
‘కేసుల పరిష్కారంతో వెయ్యికోట్ల ఆదాయం’
సాక్షి, అమరావతి: ఏసీబీలో నమోదైన కేసులన్నీ పరిష్కరించగల్గితే ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏసీబీ అర్ధవార్షిక సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్పషల్ కోర్టు యాక్ట్ అందుబాటులోకి తెచ్చామనీ, 2016 అనంతరం నమోదైన కేసులు దీని పరిగణలోకి వస్తాయని వెల్లడించారు. అవినీతిని నిర్మూలించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సిబ్బంది నియామకానికి కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నామని అన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ నిందితులు తప్పించుకోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఏసీబీ కార్యాలయాలను చక్కటి వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని వెల్లడించారు. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపవద్దు..!
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. -
ఏపీ డీజీపీ నియామకంలో లోకేష్ హస్తం!
-
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా రామ్ ప్రవేశ్ ఠాకూర్
-
రాష్ట్రం చాలా మారింది : మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎం.మాలకొండయ్య పదవీ విరమణ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వబెటాలియన్ పోలీసుల నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఏపీకి నూతనంగా 6వేల మంది పోలీసు సిబ్బంది వచ్చారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా నెరవేర్చామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్, క్రైం ఎక్కువగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, క్రైం రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. డీజీపీగా మాలకొండయ్య మంచి సేవలు అందించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో అందరూ బాగా పనిచేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో శాంతి భద్రతలను మాలకొండయ్య ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా వారి మనస్సులో ఉంటారని అన్నారు. మాలకొండయ్య 1985బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీ నేడు ఆదేశాలు
-
ఏపీ డీజీపీ రేసులో ఆ ఐదుగురు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవాంగ్, ఠాకూర్లలో ఒకరికి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకున్న విషయం తెలిసిందే. ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. ఈ నెల(జూన్) 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. -
ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడ్డుతున్నారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలిమేలును అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను డీఎస్పీ మాధవరెడ్డి మీడియా ముందు హాజరుపర్చారు. అయితే తన తల్లిని మీడియా ముందుకు తీసుకురావడం సరికాదంటూ అలిమేలు కుమారుడు కావటి సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల్ని, అనుమానితుల్ని మీడియా ముందు చూపించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధనలుంటే ఏ నిబంధన అనుగుణంగా ఉందో చెప్పాలని తెలిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్శాఖను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
‘ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. శనివారం డీజీపీకి కలిసిన నేతలు..తిరుపతిలో పరిస్థితులను అదుపుచేయని ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులు చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలను రక్షించండి అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మీడియాకు చెప్పి మరీ టీడీపీ సభ్యులు అమిత్ షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మోదీ దిష్టిబొమ్మలు దగ్థం చేసినా కేసులు పెట్టడంలేదని వాపోయారు. తిరుపతి ఘటనపై డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. అమిత్ షా మీద రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. కానీ అక్కడ రాళ్ల దాడి జరుగలేదని, కాన్వాయ్లో ఏడో వాహనం స్లోగా ఉన్నప్పుడు కర్రలతో మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టామని, ఒకరిని అరెస్ట్ కూడా చేశామని డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. -
దాచేపల్లి ఘటన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
-
సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లాడు
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య(55)ను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన దారుణమన్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. రిక్షావాలా అయిన సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతడు మానసిక వైఫల్యంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందన్నారు. చనిపోవడానికి వెళ్తున్నట్టు దారిలో కనిపించిన వ్యక్తికి చెప్పినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో 7 అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ఏడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాచేపల్లి కేసులో ఈ కేసులో పోలీసులు సమన్వయంతో వ్యహరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఆందోళనకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
నాకు గన్మెన్లు వద్దు: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ గతనెలలో డీజీపీ మాలకొండయ్యకు పవన్ లేఖ రాశారు. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం పవన్కు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అదే విధంగా తనకు కేటాయించిన గన్మెన్లు వద్దని ఆయన డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు. గన్మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. కానీ జనసేనకు సంబంధించిన వ్యవహారాలను గన్మెన్ల ద్వారా ప్రభుత్వం తెలసుకుంటోందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసమే వారిని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. -
సురేంద్రబాబుకా? అనురాధకా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎంపికకు రేస్ ముందే మొదలైంది. డీజీపీ మాలకొండయ్య జూన్లో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో తదుపరి డీజీపీ ఎవరనేదానిపై పోలీస్శాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నండూరి సాంబశివరావుకు రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు గతేడాది చివరివరకూ హడావుడి చేసిన చంద్రబాబు సీనియారిటీ ప్రాతిపదికన మాలకొండయ్యకు డీజీపీ పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డీజీపీగా విధులు చేపట్టిన మాలకొండయ్య జూన్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఇప్పటి నుంచే చంద్రబాబుకు కొందరు సిఫార్సు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ముక్కుసూటిగా వ్యవహరించే మాలకొండయ్యను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఇబ్బంది పడతామని చంద్రబాబుకు మరో వర్గం నూరిపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్వీ సురేంద్రబాబును తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్)లో ఏడీజీగా ఉన్న సురేంద్రబాబుకు ఈ ఏడాది మార్చి 14న డీజీపీగా పదోన్నతి కల్పించారు. అంతేకాక, మార్చి 22న ఆర్టీసీ ఎండీ పగ్గాలు అప్పగించారు. ఇది.. మూడు నెలల తరువాత ఆయనను పోలీస్ బాస్ చేసేందుకేనన్న ప్రచారం ఆ శాఖలో విస్తృతంగా జరుగుతోంది. డీజీపీ ఎంపిక ఇక రాష్ట్రం ఇష్టం గతేడాది చివరలో డీజీపీ ఎంపిక కసరత్తు దశలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెల్సిందే. చివరి నిమిషంలో పంపిన జాబితా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ పలుమార్లు తిప్పి పంపింది. దీంతో పంతానికిపోయిన చంద్రబాబు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా పోలీస్ చట్ట సవరణ చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించిన వారే పోలీస్ బాస్గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దినేష్రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య ఆర్టీసీ ఎండీ నుంచి పోలీస్ బాస్గా బాధ్యతలు చేపట్టిన వారే. అదే ఆనవాయితీకి కొనసాగింపుగా ఎన్నికల సమయానికి సురేంద్రబాబుకు డీజీపీ పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఐపీఎస్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన భార్య, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా సురేంద్రబాబు, అనురాధ పేర్లు ఇప్పుడు డీజీపీ రేసులో ముందువరుసలో ఉన్నాయి. కానీ, మాలకొండయ్య తరువాత సీనియర్లుగా ఉన్న వీఎస్కే కౌముది, వినయ్రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్లు ఉన్నారు. కౌముది, వినయ్రంజన్ రేలు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్పై ఉండగా.. ఏసీబీ డీజీగా ఠాకూర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా సవాంగ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కాగా, సీనియారిటీ కింద డీజీపీ పోస్టుకు ఠాకూర్, సవాంగ్లలో ఒకరిని సీఎం ఎంపిక చేస్తారా? లేక ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. -
గత 33 ఏళ్లలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాను
-
ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో కలిసి మాలకొండయ్య ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా మాలకొండయ్య 1985 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. -
మీడియాకు చెప్పాకే చేపడతా
సాక్షి, అమరావతి: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకులేదని, పదవీ విరమణ తరువాత 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్మించిన ఇండోర్ జిమ్, ఫిజియోథెరపీ హెల్త్ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్టులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో కొద్దిసేపు చిట్చాట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అని మీడియా ప్రశ్నించడంతో తనకు ఆ ఆలోచన లేదన్నారు. మీడియాకు చెప్పాకే తన భవిష్యత్ కార్యాచరణ చేపడతానని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలోగానీ, కులపరమైన ఆందోళలను అదుపు చేయగలగడంలోగానీ గట్టి ప్రయత్నమే చేశానని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ శాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు ప్రయత్నం చేశానని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని చెప్పారు. -
ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య!
అమారావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. -
పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూలై నుంచి సాంబశివరావు ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త డీజీపీని ఎంపిక చేసేందుకు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తోసుపుచ్చింది. ఏడుగురు అధికారుల పేర్లతో రాష్ట్రం పంపిన జాబితాను వెనక్కి పంపింది. అంతేకాకుండా ఆరునెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని పేర్లను తొలగించి తదుపరి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడింది. సాంబశివరావు పదవీ విరమణ చేస్తే డీజీపీ రేసులో ఠాకూర్, కౌముదిలు ఉంటారు. అయితే కౌముది ఏపీ డీజీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. సాంబశివరావు పొడిగింపు లేకుంటే ఠాకూర్ డీజీపీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఏపీ డీజీపీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
-
ప్రజా సంకల్ప యాత్రపై ఏపీ డీజీపీ ప్రకటన
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 6 నుంచి చేయతలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో పార్టీ కీలక నేతలు శనివారం ఏపీ డీజీపీ సాంబశివరావును కలిశారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు.. ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పలు వివరాలను డీజీపీకి తెలిపారు. భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. డీజీపీ సానుకూల స్పందన : వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి తాము చెప్పిన వివరాలకు డీజీపీ సానుకూలంగా స్పందించారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. యాత్రకు అనుమతి తీసుకోవాలనే ప్రశ్నే ఉత్పన్నం కాబోదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధానాలను తెలియజెప్పడానికే జగన్ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికే సంకల్ప యాత్రను చేపట్టారు’’ అని అన్నారు. భద్రత కొనసాగించాల్సిందే : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రపై టీడీపీ సర్కార్ కుట్రలు పన్నుతున్న దరిమిలా జన నేతకు యాత్ర పొడవునా భద్రత కొనసాగించాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు డీజీపీతో అన్నారు. ప్రస్తుతం జగన్కు భద్రత ఉన్నా, పాదయాత్ర ప్రారంభమైన తర్వాత దానిని ఉపసంహరించుకుంటారనే అనుమానాల నడుమ నేతలు ఈ విధంగా పేర్కొన్నారు. ఇడుపులపాయలో నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంకల్పయాత్ర ఆరు నెలల పాటు సాగనుంది. మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుంది : డీజీపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అనుమతులు ఉంటాయని డీజీపీ సాంబశివరావు చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం అనంతరం ఈ మేరకు ఆయన మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర వివరాలను, రూట్ మ్యాప్లను ఆయా జిల్లాల ఎస్పీలకు ముందుగానే అందజేయాలని డీజీపీ సూచించారు. -
‘వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత కల్పించండి’
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆయన పర్సనల్ సెక్రటరీ గురువారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ జెడ్ కేటగిరి భద్రత పరిధిలో ఉన్న విషయం మీకు విదితమేనని, దానికి అనుగుణంగా భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సుమారు ఏడు నెలల పాటు జరిగే వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ 13 జిల్లాల్లో సుమారు 3వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుందని, త్వరలోనే రూట్మ్యాప్ను పోలీసులకు జిల్లాల వారీగా ఆ పార్టీ ఇన్ఛార్జ్లు అందచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు,పార్టీ నేతలు, అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్ర పై డీజీపీకి YSRCP లేఖ#PrajaSankalpaYatra pic.twitter.com/3DQdcgsSM3 — YSR Congress Party (@YSRCParty) 2 November 2017 -
డీజీపీగా సాంబశివరావు మరో రెండేళ్లు గడువు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నండూరి సాంబశివరావును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖకు పొడిగింపునకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్లో సాంబశివరావు పదవీ కాలం ముగుస్తుంది. ప్రస్తుతం ఇన్చార్జి డిజిపిగానే కొనసాగుతున్న ఆయనకు మళ్లీ పొడిగింపు లభిస్తుందా అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. సాంబశివరావును డీజీపీగా కొనసాగించాలని పలువురు ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించిన నేపథ్యంలో డీజీపీ పదవీ పొడిగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే డీజీపీ పోస్టు కోసం ఇతర అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నా సాంబశివరావు వైపే సీఎం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పనితీరు, సామాజికవర్గ కోణంలో సాంబశివరావుకే ఆ పోస్టు మళ్లీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీనితో వెంటనే పదవీ పొడిగింపు కోరుతూ కేంద్ర హోంశాఖ, యుపీఎస్సీలకు ఫైల్ పంపించాలని సిఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. -
మల్టీనేషనల్ కంపెనీలా డీజీపీ ఆఫీస్: గంటా
సాక్షి, విజయవాడ : ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 21న కూడా పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని, విధుల్లో భాగంగా మరణించిన పోలీసులకు ఆరోజు నివాళ్లు అర్పిస్తామని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్టేషన్లకు పౌరులను పిలిచి వారికి ఆయుధాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇకపై ఇంట్లో ఉన్నా లేకపోయినా వారి కుటుంబానికి పోలీస్ నుంచి భరోసా కల్పిస్తామన్నారు. ఏడాది స్వచ్ఛభారత్లో భాగంగా జిల్లాకు పది స్కూళ్లని దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను తొలిసారి అమరావతిలోని డీజీపీ కార్యాలయానికి వచ్చానని, అచ్చం చూడడానికి మల్టీనేషనల్ కంపెనీలా అద్భుతంగా ఉందన్నారు. విద్యకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి అని, రాష్ట్రంలో 860 పోలీస్ స్టేషనలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్ కి ఒకటి చొప్పున దత్తత తీసుకోవటంపై డీజీపీని, పోలీసులను ప్రభుత్వం అభినందిస్తున్నదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యపై ఈ రోజు ప్రేవేట్ స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో, విద్యార్థి సంఘాలతో సీఎం సమావేశం కానున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులుపై ఒత్తిడి తీసుకురాకుండా చదివించాలని కోరుతున్నామన్నారు. -
ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి...కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఐలయ్యకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తక్షణమే వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించిన, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
ఆమెను చంపు.. లేదంటే నిన్ను చంపుతా..
అలా ఓ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడన్న గుంటూరు వాసి హత్య చేయాలంటూ రివాల్వర్, స్కూటీ ఇచ్చాడని వెల్లడి ప్రాణహాని ఉందని వివరిస్తూ ఏపీ డీజీపీ, ఎస్పీకి లేఖ పట్నంబజారు(గుంటూరు): ఓ మహిళను చంపాలని ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నా డని, ఇందుకోసం తనకు రివాల్వర్ కూడా ఇచ్చాడని ఏపీలోని గుంటూరు బ్రాడీపేటకు చెందిన మోదుగుల విజయభాస్కరరెడ్డి శుక్రవారం సాయంత్రం జిల్లా కోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట లొంగిపోవడం కలకలం రేపింది. కొంత మంది న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయన రివాల్వర్ అప్పగిస్తూ తను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ ఓ లేఖ అందజేశాడు. అనంతరం లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు నగరంపాలెం పోలీసులకు అతన్ని అప్పగించి, ఈ వ్యవహారంపై విచారించాలని ఆదేశించారు. మోదుగుల వెంట వచ్చిన న్యాయవాదులు ఆ లేఖలోని అంశాలను మీడియాకు వివరించారు. వారు వెల్లడించిన మేరకు మోదుగుల మాటల్లో వివరాలు.. ‘‘నేను (మోదుగుల విజయభాస్కరరెడ్డి) స్తంభాలగరువుకు చెందిన శనగా సోమశంకర్రెడ్డి గతంలో వ్యాపార భాగస్వాములం. కొద్ది కాలంగా చక్కెర వ్యాధి (డయాబెటిస్)తో బాధ పడుతున్న నేను స్తంభాలగరువులో సోమశంకర్రెడ్డి ఏర్పాటు చేసిన శంకర్ హోలిస్టిక్ యోగా కేంద్రంలో చేరాను. అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం జరుగుతోంది. శంకర్రెడ్డి నివాసంలోని ఐదో ఫ్లోర్లో అతని రెండో భార్య పోలీసు కానిస్టేబుల్ రమాదేవి ద్వారా నిత్యం మద్యం పార్టీ నిర్వహిస్తుంటాడు. మహిళల ద్వారా మగవారికి మసాజ్లు చేయించటంతో పాటు, వ్యభిచారం చేయించి వాటిని చిత్రీకరించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. 2004లో శంకర్రెడ్డి బెదిరించి పట్టాభిపురంలోని ఒక బ్రాహ్మ ణుల స్థలాన్ని కబ్జా చేశాడు. ఇందులో 2016లో బిల్డర్ అంకారావుతో కలిసి నిర్మా ణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే అంకారావు రూ.20 లక్షల వరకు నష్టం చేశాడని, అతని నుంచి డబ్బు వసూలుకు సహకరించాలని నన్ను కోరాడు. అందుకే యోగాకు వెళ్లడం మానేశా.. అదే సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేకపోవటం, శంకర్రెడ్డి నేరపూరిత చరిత్ర తెలియడంతో నేను యోగాకు వెళ్లటం మానేశాను. శంకర్రెడ్డితో చనువుగా ఉండొద్దని మా పక్క పోర్షన్లో ఉండే ఒక మహిళకు చెప్పాను. ఈ విషయం తెలిసి అతను నన్ను తుపాకీతో బెదిరించాడు. గతంలో చలసాని ఝాన్సీ అనే మహిళ విషయంలో కూడా ఇలానే చేశావంటూ నన్ను చంపుతానన్నాడు. 2004లో ఫైనాన్స్ ఇచ్చి ఝాన్సీని మోసం చేసి ఇంటిని అక్రమంగా కాజేశాడు. దీంతో ఝాన్సీ.. కాల్మనీ, రేప్ కేసులు పెట్టబోతోందని, ఆమెను చంపాలని జూన్ 15న నాకు రివాల్వర్, ఓ స్కూటీ ఇచ్చాడు. ఆమెను చంపకపోతే నన్ను చంపుతానని బెదిరించాడు. దీంతో తప్పులు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవాలని నేను జూన్ 17న శంకర్రెడ్డి, ఆయన కుమార్తె మృదుల, ఆయన అనుచరులు వణుకూరి సుబ్బారెడ్డి, సీహెచ్ అనంతబాబులకు వాట్సాప్లో మెసేజ్ పంపాను. దీంతో నాకు శంకర్రెడ్డి నుంచి ప్రాణ హాని ఉంది’’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు డీజీపీ, ఎస్పీలకు కూడా లేఖ ద్వారా వివరించినట్లు మోదుగుల న్యాయవాదులు తెలిపారు. మోదుగులను విచారిస్తున్నామని, ప్రాథమిక సమాచారం మేరకు భూ వివాదం కారణమని అర్బన్ఎస్పీ విజయరావు తెలిపారు. -
డీజీపీ సాంబశివరావుకు తప్పిన ప్రమాదం
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన కాన్వాయ్ ఢీకొట్టింది. డీజీపీ వాహనం సహా కాన్వాయ్లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. డీజీపీ సాంబశివరావు వేరే వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. -
ఏపీ డీజీపీ పోస్టుపై రాజకీయ నీడలు!
సాక్షి, అమరావతి : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ పోస్టు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. డీజీపీ నండూరి సాంబశివరావు సర్వీస్ పొడిగింపు(ఎక్స్టెన్షన్)పై నిన్న మొన్నటి వరకు సుముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మనసు మార్చుకోవడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 26వతేదీ నుంచి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తున్న ముద్రగడను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముద్రగడ ఆగస్టు 27న పోలీస్ వలయాన్ని చేధించి కిర్లంపూడి నుంచి రాజుపాలెం వరకు పాదయాత్ర కొనసాగించటంతో ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఇదే అదనుగా కొందరు మంత్రులు దీన్ని డీజీపీ మెడకు చుట్టినట్టు తెలిసింది. సీఎం సీరియస్ కావడంతో ముద్రగడను అరెస్టు చేస్తారా? నేనే రావాలా? అంటూ డీజీపీ నేరుగా తూర్పుగోదావరి పోలీస్ అధికారులను హెచ్చరించారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రాజుపాలెం వద్ద ముద్రగడను అరెస్టు చేసి ఇంటికి తరలించిన పోలీసులు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే డీజీపీపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు. రేసులో ముగ్గురు.. డీజీపీ సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీస్ను మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని భావించినా కొందరు అడ్డుపడటంతో సీఎం మనసు మారినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 1985 బ్యాచ్కు చెందిన మాలకొండయ్య, 1986 బ్యాచ్కు చెందిన కౌముదిలతోపాటు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పేర్లను డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ ప్యానల్కు ప్రతిపాదిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న మాలకొండయ్యకు మరో ఏడాది ఆర్టీసీ ఎండీగా ఎక్స్టెన్షన్ ఇస్తామని నచ్చజెప్పి రేసు నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఏపీ క్యాడర్కు చెందిన కౌముది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ)లో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి డీజీపీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో ఠాకూర్ను డీజీపీగా చేయాలని ఓ యువనేత పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
-
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
విజయవాడ: చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు. కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. చట్టం గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. ఇక ఏపీలో డ్రగ్స్ కంటే గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, గంజాయి సరఫరా చాలావిధాలుగా జరుగుతుంనద్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టామని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. -
‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’
గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ శ్రీ కోరారు. ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆమె లేఖ ద్వారా విన్నవించారు. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ అవినీతి, ఆక్రమాలు ప్రశ్నించినందుకు, తన గూండాలు, అనుచరులు ద్వారా బెదిరింపులు వస్తున్నాయని పద్మశ్రీ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తన పై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. కాగా ఈ విషయంపై పద్మశ్రీ ఇప్పటికే విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
బాలికల ప్రవర్తన దేనికి సంకేతం?
- ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు - ఒక్క బాపట్లలోనే 16 మంది బాలికలు ఇళ్లనుంచి వెళ్లిపోయారు - పిల్లల సంరక్షణ తల్లిదండ్రులకు పట్టదా? - ‘లిఖిత కిడ్నాప్ కేసు’ వివరాలను వెల్లడించిన పోలీస్ బాస్ - 5 కోట్ల మందికి 50 వేల పోలీసులే.. అందులోనూ ఎన్నో లోపాలు అమరావతి: సోషల్ మీడియా దురుపయోగాలపై సమాజంలోని అన్ని వర్గాలూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో, మొబైల్ఫోన్లలో ఏం చూస్తున్నారో నిరంతరం కనిపెట్టాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ‘లిఖిత కిడ్నాప్’ కేసును ఛేదించిన సందర్భంగా, ఆ కేసులో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను డీజీపీ మీడియాకు వివరించారు. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. లిఖిత కేసు గురించి మాట్లాడేక్రమంలో డీజీపీ సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల మందికి 50 వేల మంది పోలీసులే ఉన్నారని, పోలీసులు తలుచుకుంటే ఎలాంటి కేసునైనా ఛేదించగలరుకానీ.. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘ఇటీవలి కాలంలో ఏపీలో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోనూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయే బాలికల సంఖ్య అధికంగా ఉంది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లలో పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో, అవి చూడటం వల్ల వారు ఎలా మారుతున్నారో కనిపెట్టాల్సిన అవసరం లేదా?’ అని డీజీపీ ప్రశ్నించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఏనాడూ ఉచిత సలహాలు ఇవ్వలేదన్న సాంబశివరావు.. పరిస్థితులు చేయిదాటిపోతున్నందునే ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక్క బాపట్ల డివిజన్లోనే 16 మంది మైనర్ బాలికలు ఇండ్లలో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారని, వాళ్లలో 13 మందిని పోలీసులు పట్టుకోగలిగారని డీజీపీ తెలిపారు. లిఖిత కోసం 20 లక్షలు ఖర్చుపెట్టాం! ‘గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన లిఖిత(13) మూడు నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. నాగేశ్వర్రావు(45)అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్చేశాడని నిర్ధారించుకున్న తర్వాత మా బృందాలు రంగంలోకి దిగాయి. ఎక్కడో పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా సెక్టార్లో వీళ్లు దొరికారు. కశ్మీర్ క్యాడర్కు చెందిన అధికారి మా టీంలో ఉండటం వల్ల అక్కడి పోలీసులతో మాట్లాడటం సులువైంది. లిఖితను సురక్షితంగా ఇంటికి చేర్చడం సంతోషమే అయినా, ఇన్ని నెలల దర్యాప్తు కోసం పోలీసు శాఖకు 20 లక్షలు ఖర్చయింది. డబ్బుల విషయంలో సమస్యలేదు కానీ పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులే బాధాకరం. నిందితుడికి 45ఏళ్లు.. ఆ అమ్మాయికి 13 ఏళ్లు! ఒక వేళ తనంతట తానుగా వెళ్లాలనని అమ్మాయి చెప్పినా, ఆమె మైనర్ కాబట్టి చట్టం ఒప్పుకోదు. మైనర్ బాలిక జీవితంతో ఆటలాడుకున్న నిందితుడికి జీవితాంతం జైలుశిక్ష పడేలా బలమైన కేసులు నమోదుచేస్తాం’ అని డీజీపీ సాంబశివరావు వివరించారు. అసలేం జరిగింది?: గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన లిఖిత మూడు నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బీఎస్ఎఫ్లో ఉద్యోగవిరమణపొంది ఆటో డ్రైవర్గా జీవిస్తోన్న నాగేశ్వర్రావు(45) అనే వ్యక్తి లిఖితను కిడ్నాప్ చేసినట్లు పోలీసు కేసు నమోదయింది. బాలిక తల్లిదండ్రులు మహిళా కమిషన్ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు నాగేశ్వర్రావు-లిఖితలను కశ్మీర్లో దొరకబుచ్చుకున్నారు. గురువారం మీడియా సమక్షంలో లిఖితను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. -
తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!
విశాఖపట్నం కేంద్రంగా సాగిన మనీలాండరింగ్ వ్యవహారంలో మొత్తం 683 కోట్ల రూపాయలు దేశం నుంచి విదేశాలకు తరలిపోయిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. అందులో ఒక్క కెనరా బ్యాంకు నుంచే రూ. 533 కోట్లు వెళ్లాయని ఆయన చెప్పారు. ఈ స్కాం దర్యాప్తు వివరాలను ఆయన శుక్రవారం నాడు విజయవాడలో మీడియాకు వివరించారు. మన రాష్ట్రం నుంచి డబ్బు విదేశాలకు వెళ్తున్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించిందని, కొంతమంది బోగస్ కంపెనీలు పెట్టి ఫోర్జరీ పేపర్లు తయారుచేసి, వాటినే నిజమైన పత్రాలుగా చూపించి డబ్బును విదేశాలకు తరలించారని ఆయన చెప్పారు. ఐటీ శాఖ విచారణ చేసి ఈడీ ద్వారా ఈ వ్యవహారాన్ని అడ్డుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోందని, మొత్తం 17 మంది నిందితులను సీఐడీ అధికారులు పట్టుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఆయుష్ గోయల్, వినీత్ గోయెంకా, వికాస్ గుప్తాలను ప్రధాన నిందితులుగా భావిస్తున్నామని, అయితే కేసు దర్యాప్తు పూర్తయితే గానీ అసలు నిందితులు వేరే ఎవరైనా ఉన్నారా, వీళ్లేనా అన్న విషయం ఖరారు కాదని ఆయన అన్నారు. ఈ ముగ్గురిలో ఒకరి పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నామన్నారు. వడ్డి మహేష్, అతడి తండ్రి శ్రీనివాసరావు తదితరులను కూడా పట్టుకున్నామని చెప్పారు. వీరిలో శ్రీనివాసరావు కోల్కతాలో ట్రాన్స్పోర్టర్గా ఉండగా, వడ్డి మహేష్ తాను కేవలం బ్రోకరింగ్ మాత్రమే చేస్తానని చెబుతున్నాడని, ఒక డాలర్కు తనకు 85 పైసలు ముడుతుందని చెప్పాడని డీజీపీ తెలిపారు. అలా చేయడం కూడా తప్పేనని, ఇందులో సూత్రధారులను పట్టుకుంటే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. సీఐడీ కూడా ఇక్కడి ఆస్తులు ఎటాచ్ చేయొచ్చుగానీ, విదేశాల్లో ఆస్తులు ఎటాచ్ చేయాలంటే మాత్రం ఈడీ వల్లే అవుతుందని తెలిపారు. చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు మొత్తం రూ. 683 కోట్లు తరలిపోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇది హవాలా కాదని, మనీ లాండరింగ్ అని వివరించారు. వడ్డి మహేష్తోపాటు అతడి బంధువులను, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లను కూడా అరెస్టు చేశామన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకుల పాత్ర ఏమిటన్న విషయంపైనా విచారణ జరుగుతోందన్నారు. ప్రధాన నిందితులు ముగ్గురిపై ఇంటర్పోల్కు కూడా సమాచారం అందించి, రెడ్కార్నర్ నోటీసులు వచ్చేలా చూస్తామని, వాళ్లు ఎక్కడున్నా రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు. అయితే ఈ కేసులో తాము చెప్పిన పేర్లు తప్ప వేరే రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు మాత్రం ఇంతవరకు తేలలేదని చెప్పారు. -
తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!
-
హవాలా కేసు సీఐడీకి అప్పగింత: డీజీపీ
విశాఖపట్నం: బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను విశాఖ కేంద్రంగా హవాలా రూపంలో తరలించిన ముఠా వెనుక ఎవరున్నారన్నదని దర్యాప్తులో తేలుతుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశిరావు అన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. కుంభకోణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని చెప్పారు. వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో విదేశాలకు తరలించారన్నారు. విచారణ తర్వాత మొత్తం వివరాలు వెల్లడవుతాయని డీజీపీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్.. ఓ ఏపీ మంత్రి, ఎంపీ అండతోనే వ్యవహారం సాగించినట్టు అనుమానిస్తున్నారు. -
ఏక్షణమైనా దాడిచేసే అవకాశం
-
రోజా హామీ ఇస్తే పరిశీలిస్తాం: ఏపీ డీజీపీ
విజయవాడ: మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ విషయమై నేతలు ర్యాలీగా వెళ్లి డీజీపీని కలిశారు. రోజాను అక్రమంగా నిర్బంధించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే.. రోజా పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోషల్ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రోజా వల్ల మహిళా పార్లమెంట్ సదస్సుకు ఇబ్బంది కలుగుతుందనే ముందస్తుగా అదుపులోకి తీసుకుని, హైదరాబాద్కు తరలిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. (చదవండి: ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మహిళా పార్లమెంట్ సదస్సులో వివిధ ప్రాంతాల మహిళా నేతలు పాల్గొంటుండగా.. సొంత రాష్ట్ర మహిళానేతలపై పోలీసులు, ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముందుగా హామీ పత్రం రాసిచ్చి మహిళా నేతలు సదస్సుకు హాజరుకావాలా అని.. డీజీపీ వ్యాఖ్యలపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రోజా హామీ ఇస్తే పరిశీలిస్తాం: ఏపీ డీజీపీ
-
డిసెంబర్లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ గురువారం జీవో జారీ చేశారు. -
'నిందితులను కఠినంగా శిక్షిస్తాం'
విజయవాడ : వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ ఫుటేజి ఆధారంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. సింగ్నగర్లో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం, కైకలూరులో ఫ్లెక్సీల చించివేత కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అభిమానం వెర్రి తలలు వేయరాదని, గొడవలను ప్రొత్సహించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ప్రతి విగ్రహానికీ, ఫ్లెక్సీకి భద్రత కల్పించలేమన్నారు. ఇకపై ఫ్లెక్సీలను కూడా రెగ్యులేట్ చేస్తామని డీజీపీ తెలిపారు. -
అభిమానులు హద్దుదాటితే తాట తీస్తాం
-
అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరిక
సంక్రాంతి రేసులో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నం.150 చిత్రాల విడుదల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఏపీ డీజీపీ శనివారం సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా అభిమానులు హద్దు దాటితే తాటా తీస్తాం అంటూ హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇతర హీరోల బ్యానర్లు, పోస్టర్లు చించేవారిపై, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీలు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. కాగా ఈ రోజు సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ వేదికగా చిరంజీవి సినిమా "ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ప్రకటన ప్రాదాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మెగా వేడుకకు అనుమతి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీస్ బాస్ హెచ్చరికలు అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి. -
ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ
-
ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఐజీ గుప్తాకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పీ గౌతమ్ రెడ్డి ఈ లేఖను అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి.. పార్టీ అధినేత జగన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలను నిష్పాక్షికంగా జరుపాలని వారు ఎన్నికల కమిషనర్ను కోరారు. మంత్రి పరిటాల సునీత దౌర్జన్యానికి పాల్పడాలని చూస్తున్నారని, బలం లేకున్నా ఎంపీపీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు. -
బాబుపై హత్య కేసు ఎందుకు పెట్టలేదు?
- డీజీపీ సాంబశివరావుకు ముద్రగడ బహిరంగ లేఖ - పుష్కరాల్లో 30 మంది భక్తులను చంద్రబాబు చంపారు జగ్గంపేట: గోదావరి పుష్కరాల్లో తొక్కిస లాటలో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మ నాభం ప్రశ్నించారు. ఆయన రాష్ట్ర డీజీపీ సాంబశివరావుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లం పూడిలోని తన నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ముద్రగడ ఈ లేఖ విడుదల చేశారు. డీజీపీని ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ముఖ్య వివరాలు.. ‘‘కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి లేదని మీరు తెలిపారు. రాష్ట్రమంతా సెక్షన్-30 అమల్లో ఉందన్నారు. గతంలో వివిధ నేతలు చేసిన పాదయాత్రలు, పార్టీల కార్యక్రమా లు, ఇతర కుల సోదరుల ర్యాలీలకు పర్మి షన్లు పొందారా? ఎవరికీ లేని పర్మిషన్లు నాకే కావాలా? గోదావరి పుష్కరాలకు సెక్యూరిటీ ఉన్న వీఐపీ ఘాట్లో కాకుండా, సామా న్యులకు కేటారుుంచిన ఘాట్లో సీఎం, వారి బంధుగణం స్నానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రపంచ వ్యాప్తంగా తెలియడాని కి వీడియో తీయడం కోసం భక్తులు కిక్కిరిసి ఉండగా 30 మందిని చంపివేశారు. సీఎం, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదు? ఈ కేసులో సీఎం ప్రధాన నిందితుడు కాబట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ధ్వంసం చేసిన ఘటన మీకు తెలియదా? చట్టాన్ని కాపాడాల్సిన మన పోలీసులు, సీఎం, వారి బంధుగణంపై హత్యానేరం కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. సదరు నేరంపై ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసి, నష్టపరిహారం వసూలు చేయాలి. తుని ఘటనతో నాకు, మా జాతికి ఎటువంటి సంబంధమూ లేదు. అరుునప్పటికీ మాపై పెట్టిన ఆరోపణలు రుజువైతే ఆ ఘటనలో జరిగిన ఆస్తినష్టానికి మా ఆస్తులు పబ్లిక్గా అమ్మి పరిహారం చెల్లిస్తాను’’ అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. -
సెక్షన్ 30 జీవితాంతం అమల్లో ఉంటుందా?: ముద్రగడ
కాకినాడ: సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ డీజీపీ సాంబశివరావును కోరారు. ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సన్నద్దమైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు. ఈ నేపధ్యంలో ముద్రగడ మంగళవారం డీజీపీ సాంబశివరావు కు లేఖ రాశారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తుని ఘటనలో తనపై, తన జాతిపై వస్తన్న ఆరోపణలు రుజవైతే ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తానని ముద్రగడ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని.. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా.. లేదా 2019 లో జరిగే ఎన్నికల వరకు అమలు చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. -
'వాళ్లు కాల్పులు జరిపాకే మేం జరిపాం'
ప్రకాశం: ఏవోబీ ఎన్కౌంటర్పై వస్తున్న వదంతులు వాస్తవం కాదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు కాల్పులు జరిపిన తర్వాతే తాము కాల్పులు జరిపామని చెప్పారు. ఏపీ పోలీసుల అదుపులో గిరిజనులు లేరని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 100 ఆదర్శ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం త్వరలో యాక్సిడెంటల్ జోన్ అలర్ట్ యాప్ను రూపొందించబోతున్నట్లు తెలిపారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడమే కాదని, పోలీసులు కూడా ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని సాంబశివరావు కోరారు. -
రూ.253 కోట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ : డీజీపీ
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.253 కోట్లతో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సైతం పోలీసు అనుమతి తీసుకోవాలని, ఇకపై చట్టపరంగా పరిశీలించిన తర్వాతే పాదయాత్రలకు అనుమతి ఇస్తామన్నారు. 1994లో జరిగిన పాదయాత్రలను కూడా పరిశీలిస్తున్నామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే దేనికైనా అనుమతి ఇస్తామని చెప్పారు. విశాఖ సమీపంలో రూ.850 కోట్లతో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం, విజయవాడలో రూ.9.8 కోట్లతో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 868 పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదునూ స్వీకరించి రశీదు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కులపరమైన ఘర్షణలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఒక్క అమలాపురం సబ్ డివిజన్లోనే వందకుపైగా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఆర్కే విషయంలో మావోయిస్టుల ఆరోపణలు అసత్యమని నిరూపితమైందని, వారు మొదటి నుంచి ఇదే పంథాలో ఉన్నారంటూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
రూ.253 కోట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ : డీజీపీ
-
ఆర్కే ఎక్కడున్నాడో చెప్పాలి: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ ప్రజాసంఘాలు మైండ్ గేమ్ ఆడిన విషయం మరోసారి బయటపడిందని ఏపీ డీజీపీ ఎన్.సాంబశివరావు గురువారం వ్యాఖ్యానించారు. ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ విరసం నేత వరవరరావు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ పైవిధంగా స్పందించారు. తాము ముందునుంచీ ఊహిస్తున్నదే నిజమయ్యిందని, గత ఇరవై ఏళ్లుగా మావోయిస్టులు ఇదే విధమైన మైండ్గేమ్ను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్కే మా(పోలీసుల) వద్దే ఉన్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారు ఇప్పుడేం చెపుతారని డీజీపీ ప్రశ్నించారు. రాజ్యాంగంపై నమ్మకం ఉండి కోర్టును ఆశ్రయించిన వారు ఇప్పటికైనా ఆర్కే ఎక్కడున్నాడో చెప్పాలన్నారు. -
9 మంది సామాన్య పౌరులను చంపారు!
-
9 మంది సామాన్య పౌరులను చంపారు!
- హత్యకు గురైన వారిలో 22 మంది మావోలే! - ఏపీ డీజీపీ రాకకు స్వాగతంగా నలుగురు పౌరుల హత్య - మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట ఆడియో టేపుల విడుదల హుకుంపేట: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మల్కన్గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన పోలీసు కాల్పులల్లో మొత్తం 31 మంది చనిపోయారని వీరిలో 22 మంది మావోయిస్టులు కాగా, మరో తొమ్మిది మంది సాధారణ పౌరులని మావోయిస్టు పార్టీ తెలిపింది. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట బుధవారం ఆడియో టేపులు విడుదలయ్యాయి. పోలీసులు ఏవోబీలో కూంబింగ్ చర్యలు ఆపని పక్షంలో మావోయిస్టు పార్టీ నుంచి ప్రతిఘటన తప్పదని జగబంధు హెచ్చరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘31 మంది కామ్రేడ్స్ హత్యపై పోలీసులు పూర్తి అవాస్తవాలు చెబుతున్నారు. పోలీసుల దిగ్బంధం వల్ల ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ఆలస్యం జరిగింది. వాస్తవమేమంటే.. 23న రామగూడకి చేరుకొని రాత్రికి అక్కడే పడుకున్నాం. 24న ఉదయం ప్రజలు మాకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిం చగా పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిం చారు. ఉదయం 6 గంటల సమయంలో రెండు వైపుల నుంచి పోలీసులు అతి సమీపానికి రాగా, అప్రమత్తమైన పీఎల్సీఏ కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతో పాటు ఉన్న చుట్టుపక్క గ్రామాల నిరాయుధులైన యువతీ యువకులు పక్క గ్రామానికి పరిగెత్తారు. వారిపైనా, పక్కనే నది వద్ద ప్రయాణికులపైనా పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఘటనలో అనేక మంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మైదానంలో విచ్చలవిడి కాల్పులు వారిని ప్రతిఘటిస్తూనే పక్కనే ఉన్న కొండలపైకి మేం సురక్షితంగా చేరాం. అప్పటికే మా మకాంను రెండు వలయాల పోలీసులు చుట్టివేశారు. ఒక వలయాన్ని ఛేదించి సురక్షితంగానే బయటపడ్డాం. తర్వాత మరో వలయం చుట్టివేసింది. వారంతా కొండలను ఆక్రమించుకొని మా దిశను గుర్తించి అన్ని దిశల్లో కాల్పులు ప్రారంభించారు. అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచింది. చివరి వలయాన్ని ఛేదించే క్రమంలో ఒక కొండ నుంచి మరో కొండకు వెళ్లేటప్పుడు చిన్న మైదానాన్ని దాటాల్సి వచ్చింది. వందలాది మంది పోలీసు లు అనుకూల రక్షణ ఉండే కొండలపైకి చేరి మమ్మల్ని చుట్టుముట్టి, విచ్చలవిడిగా కాల్పు లు జరిపారు. దీంతో కొంత మంది కామ్రేడ్స్ అమరులై అనేక మంది గాయపడ్డారు. గాయాలైన వారిని హతమార్చారు గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న కొంతమంది కామ్రేడ్స్ను వందలాది బలగాలు చుట్టుముట్టి హతమార్చాయి. 27వ తారీఖున అదనపు బలగాలను రప్పించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాయపడి ఉన్న కామ్రేడ్స్ను తప్పించుకోనీయకుండా వెతికారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాకకు స్వాగతంగా అప్పటికే వారి చేతుల్లో ఉన్న నలుగురు సాధారణ యువతీ యువకులైన కుదిరిగుడ కొమలి, శ్యామల పిల్లిపొదిరి, కావేరి ముదిలి-లచ్చ ముదిలి, డక్క ముదిలినిలను కాల్చి చంపి మరో ఎన్కౌంటర్ కథనాన్ని అల్లారు. గాయపడి శత్రు వలయంలో చిక్కిన మరో మహిళా కామ్రేడ్ను 26న రామగూడ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు కామ్రేడ్లు గౌతమ్, నరేశ్లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ ఎన్కౌంటర్ ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తే దీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే. రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం మా అమరుల శవాల పట్ల కూడా పోలీసులు అభ్యంతర వైఖరి ప్రదర్శించారు. వారు కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా చేసి, పెట్టెల్లో పెట్టారు. మా కామ్రేడ్స్ను హత్య చేసిన రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి 90 మందిగా ఉన్న పేదల సమస్య. మా పార్టీకి త్యాగాలు కొత్త కాదు. ఈ హత్య కాండను ప్రజలు, పౌర సంఘాలు ఖండించాలి. దున్నేవారికే భూములు అన్న దానిపై పోరాటాలు జరిపాం. ఈ ఘటనకు మా లోపాలు ఉన్నాయి. వాటిని పునఃసమీక్షించుకుంటాం. అలాగే ఈ హత్యాకాండకు లొంగిపోయిన మాజీల (మాజీ మావోయిస్టులు) సహకారం కూడా తీసుకున్నారు. ప్రజల సహకారంతోనే విప్లవ ద్రోహులను శిక్షిస్తాం.’’ అని ఆడియో టేపులో జనబంధు పేర్కొన్నారు. ఏఓబీలో వెంటనే కూంబింగ్ను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. -
కూంబింగ్ నిలిపివేశాం: ఏపీ డీజీపీ
-
కూంబింగ్ నిలిపివేశాం: ఏపీ డీజీపీ
విజయవాడ: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ పోలీసుల అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఏవోబీ ఎన్కౌంటర్ ఆర్కే లక్ష్యంగా జరగలేదని స్పష్టం చేశారు. ఏవోబీలో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసు బలగాలు కూంబింగ్కు వెళ్లాయని, మావోయిస్టులు ఎదురుకావడం వల్లే ఎదురుకాల్పులు జరిగాయని డీజీపీ వివరించారు. భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు లభించాయని, దీన్నిబట్టి అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉండే అవకాశముందని డీజీపీ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిలిపివేశామని తెలిపారు. ఆర్కే నుంచి మావోయిస్టులకు సమాచారం లేకపోవడం వల్లే పోలీసుల అదుపులో ఉన్నాడని ఆరోపిస్తున్నారని డీజీపీ సాంబశివరావు చెప్పారు. -
చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సివుంది
విశాఖపట్నం: ఏవోబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సివుందని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. మల్కాన్గిరిలోనే మావోయిస్టులకు పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడి, సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సతీష్ను డీజీపీ పరామర్శించారు. సతీష్ కాలిలో ఇంకా బుల్లెట్ ఉందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అజీజ్ బాషా కుటుంబానికి 40 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అజీజ్ స్వస్థలం విశాఖపట్నం గాజువాక అని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్లు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. అలాగే మోడల్ స్టేషన్లను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని నగరంపాలెం, పాత గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
- ఏపీ డీజీపీ సాంబశివరావు - ఆలయ వీధుల్లో భద్రత ఏర్పాట్ల తనిఖీ తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భద్రత పటిష్టం చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ వీధుల్లో సాగుతున్న బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ ఇనుప కంచె కారణంగా భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు ఉండే అవకాశం లేదన్నారు. టీటీడీ విజిలెన్స్, అర్బన్ జిల్లా పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతను కట్టుదిట్టం చేశాయన్నారు. తిరుమల ఆలయ ఆగమ శాస్రాల ప్రకారం డ్రోన్లు వినియోగించలేమన్నారు. ఈ సారి బందోబస్తుతోపాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు ప్రింట్స్తో అనుమానితులను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల సేవ కోసం ప్రత్యేంగా 150 మంది సిబ్బందితో 'పోలీస్ సేవాదళ్' ఏర్పాటు చేశామన్నారు. చైల్డ్ ట్రాకింగ్ పద్ధతి అమలు ద్వారా చిన్నారులు తప్పిపోయినా త్వరగా వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ యూనిట్ ప్రారంభించామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీవ్రంగా ఉందని, 8 మంది అదనపు డీజీలు, 25 మంది ఐజీలు మాత్రమే ఉన్నారన్నారు. అందువల్లే టీటీడీకి శాశ్వత సీవీఎస్వో పోస్టు నియమించలేదని, త్వరలోనే సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. తిరుమల భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. ఆయన వెంట ఐజీ శ్రీధర్రావు, డీఐజీ ప్రభాకర్రావు, టీటీడీ సీవీఎస్వో శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి జయలక్ష్మి ఉన్నారు. -
తిరుమలలో పలువురు ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్, ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శనంలో సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మాడవీధుల్లో భద్రతను సాంబశివరావు పరిశీలించారు. ఉన్నతాధికారులకు సాంబశివరావు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే... తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామి వారిని 84,787 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
జేవీ రాముడికి ఆత్మీయ వీడ్కోలు
-
'ఏవోబీలో పరిస్థితి అదుపులో ఉంది'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో పరిస్థితి అదుపులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. మంగళవారం విజయనగరం గ్రామీణ పోలీస్స్టేషన్తోపాటు పీటీసీలోని నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జె.వి.రాముడు మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులతోపాటు పోలీస్ సౌకర్యాలు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని చెప్పారు. పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డీఐజీ, జిల్లా ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జైలుకు వెళ్లడానికి సిద్ధం : ముద్రగడ
కాకినాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఆయన ఈ సారి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి.రాముడుకు లేఖ రాశారు. తుని ఘటనలో అమాయకులపై జిల్లా పోలీసులు కేసులు పెట్టడం వింతగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జె.వి. రాముడుకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రామంలో ముద్రగడ విడుదల చేశారు. తమ ఉద్యమం ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏ సమాచారం కావాలన్నా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తామని... అలాగే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని డీజీపీకి రాసిన లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు. కాపు గర్జనలో పాల్గొన్నవారిలో సంఘ విద్రోహ శక్తులు ఎవరూ లేరన్నారు. అమాయకులను మాత్రం వేధించవద్దని రాముడికి రాసిన లేఖలో ఆయన్ని ముద్రగడ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినవారిపై బైండోవర్ కేసులు, రౌడీ షీట్స్ తో పాటు అనేక సెక్షన్లతో 144 & 30 సెక్షన్లు ఉల్లంఘించారని కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'త్వరలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ'
కర్నూలు : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తూ మార్గమధ్యంలో కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో రూ.82 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుధాగారానికి మంగళవారం ఉదయం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంచేందుకు నల్లమల అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు. అడవుల్లోకి వెళ్లిన ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడి చేసేందుకు నిఘా పెంచామని చెప్పారు. ఎర్రచందనం దొంగలకు శిక్షలు పడేలా చట్టాన్ని సవరణ చేసేందుకు కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ఎర్రచందనం దొంగల విచారణకు ప్రత్యేక కోర్టు కోసం కూడా నివేదించామన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
ఒక్క కేసులోనే సత్యానందంకి బెయిల్ : డీజీపీ
విజయవాడ : కాల్మనీ కేసుకి సంబంధించి ఓ కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. అతని మీద మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని రాముడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు. -
'సీఐడీకి అవసరం లేదు.. పోలీసులే విచారిస్తారు'
అనంతపురం: నకిలీ పాస్ పుస్తకాల కేసును పోలీసులే విచారిస్తారని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాల్సిన పనిలేదని అన్నారు. అనంతపురం పోలీసులే ఈ కేసు విచారణను కొనసాగిస్తారని వివరించారు. ఇక కాల్ మనీ వ్యవహారంపై స్పందిస్తూ అధిక వడ్డీలతో ప్రజలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. కొత్త మనీ ల్యాండరింగ్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. -
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
-
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి రాముడు తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ లడ్హా నేతృత్వంలో 9 మంది కమిటీ విజయవాడ కల్తీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత కల్తీ మద్యం కేసులో స్పష్టత వస్తుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కల్తీ మద్యం మరణాల కేసులు కూడా సిట్ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటుందని రాముడు చెప్పారు. ఇక ఈ కేసులో తొమ్మిది మంది బార్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.