book
-
మోదీకి స్పెషల్ గిఫ్ట్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్హౌస్లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది. ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. -
సాహిత్య సందడి
సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్ మీట్ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్ ఫెస్టివల్స్ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్ ఫోకస్ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్ పురస్కార ప్రకటన. అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు నోబెల్ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్ ఏసియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ‘ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్’ జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్లోనే జరిగింది. అక్టోబర్లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్ కోసం ఐదు నవలల షార్ట్ లిస్ట్ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.పురస్కార ప్రకటన నవంబర్ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ ప్రకటించింది. విజేతలను డిసెంబర్ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్లో ‘ద డెహ్రడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆరవ ఎడిషన్ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్ కపూర్, సల్మాన్ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.ఇక, ‘ముంబయి లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్’ను ఫోకస్ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.‘ద మెటమార్ఫసిస్’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్ అమెరికా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్కు డిజిటల్ రిక్రియేషన్ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్ ఝా, సుజయ్ ఘోష్, హుస్సేన్ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్ ఫెయిర్’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు. -
వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు?
అత్యంత ప్రభావవంతుల జీవితాలు ఎలా ఉంటాయో మనకు ఎప్పుడూ తెలీదు. కేవలం వారి కంపెనీల గురించిన ఉత్థాన పతనాలే తప్ప వ్యక్తిగతజీవితంలోని ఎగుడుదిగుళ్లు బయటికి రావు. ఇటీవల మరణించిన దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా చిన్నతనంలో తల్లితండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా అభద్రతకు గురయ్యారు. దానివల్లే పాఠశాలలో హేళన ఎదుర్కొన్నారు. ప్రేమించినప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయిన రతన్కు తన చివరి జీవితంలో తోడుగా ఉన్నది టిటో అనే కుక్క. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమంగా ఉండేదట.ఇలాంటి ఎన్నో అంశాలను ‘రతన్ టాటా: ఎ లైఫ్’ పుస్తకం వెల్లడిస్తుంది.మనందరికీ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలుసు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ప్రత్యేకత కలిగివున్నారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలా ఉండేవారు? ఆయనకు ఎలాంటి బాల్యం ఉండేది? ఆయన ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోని స్త్రీలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇలాంటి అంశాలను సాధారణంగా మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ థామస్ మాథ్యూ ఇటీవల ప్రచురించిన పుస్తకం ‘రతన్ టాటా: ఎ లైఫ్’ కలిగించే మహదానందం ఏమిటంటే, ఆయన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.రతన్ టాటా పదేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల వాళ్ల నానమ్మ (నవాజ్బాయి టాటా) వద్ద పెరిగాడు. లేడీ టాటా వైభవంగా ఒక పెద్ద భవంతిలో యూనిఫారం ధరించిన పనివాళ్లతో నివసించారు. ఆమెకు రోల్స్ రాయిస్ కారు ఉండేది. నేను ‘బీబీసీ’ కోసం రతన్ టాటానుఇంటర్వ్యూ చేసినప్పుడు, తాను చెడిపోలేదని టాటా నొక్కి చెప్పారు; కాకపోతే ఎంతో గారాబంగా పెరిగానని ఒప్పుకున్నారు. అయితేఆ విషయాన్ని కనుగీటి మరీ చిరునవ్వుతో చెప్పారు.తమ తల్లితండ్రుల విడాకులురతన్ పై, ఆయన సోదరుడు జిమ్మీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని థామస్ మాథ్యూ మనకు చెబు తారు. అది వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. వారు పాఠ శాలలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్కు గురయ్యారు, హేళనకు గురయ్యారు. ఈ సమయంలో టాటా తన నాన్నమ్మకు మరింత దగ్గర య్యారు. నిజం చెప్పాలంటే, ఆమెను ఆరాధించారు.సీనియర్ కేంబ్రిడ్జ్ విద్య పూర్తి చేసిన తర్వాత టాటా అమెరికా వెళ్లారు. కుమారుడు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి బ్రిటన్ వెళ్లాలని ఆయన తండ్రి కోరుకున్నారు. కానీ రతన్ ఆర్కిటెక్చర్పై మనసు పడ్డారు. చివరికి ఆయన నిర్ణయమే గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత రతన్ టాటా బొంబాయిలో హలేకై (సముద్రం పక్కని ఇల్లు అనిఅర్థం) అని పిలిచే తన సొంత ఇంటిని తానే డిజైన్ చేసుకున్నారు.అయితే టాటా అమెరికాతో ప్రేమలో పడ్డారు. వృద్ధురాలైన నానమ్మ ఆయన్ని తిరిగి రమ్మని గట్టిగా కోరుకోకపోతే, ‘‘ఆయన అమెరికాలోనే ఉండి పని చేస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపేవారు. దానిని ఆయన తన రెండవ ఇల్లు అని పిలుస్తారు’’ అని మాథ్యూ వెల్లడించారు.లాస్ ఏంజిల్స్లో ఆయన తన మొదటి ప్రియురాలు కరోలిన్ ఎమ్మన్స్ను కలుసు కున్నారు. ఆమె తండ్రి ఫ్రాంక్ ఆయన మొదటి బాస్. ఆయనే వారిని పరస్పరం పరిచయం చేశారు. రతన్ జీవితంలో మరో మూడు ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరినీ పెళ్లి చేసు కోలేదు. ‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇతర విషయాలకు ప్రాధాన్యంఇచ్చాను గానీ ఎన్నడూ పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. అయినప్పటికీ, కరోలిన్ తో టాటా టచ్లో ఉండేవారు. 2017లో జరిగిన ఆయన 80వ పుట్టినరోజుకు ఆమె హాజరయ్యారు. రతన్ అమెరికాలో ఉన్న ప్రతిసారీ కరోలిన్ను డిన్నర్కి తీసుకువెళ్లేవారని మాథ్యూ పేర్కొన్నారు. అందుకే దీన్ని చేదైన తీపి కథగా నేనుభావించడంలో పొరబడలేదు కదా? ఇది కచ్చితంగా నిజమని కూడా అనిపిస్తుంది.టాటా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయమైన అంశాలను థామస్ పుస్తకం వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఆయన చెక్స్ షర్టులను ఇష్టపడే వారు. ‘‘ఆయన బాలుడిగా లేదా పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలలో దాదాపు 90 శాతం వరకు ఆయన ఫార్మల్ దుస్తులుకాకుండా చెక్స్ షర్టు ధరించి ఉన్నట్లు చూపుతాయి.’’ ఆయనకుకార్లంటే కూడా మోజు ఉండేది. వాటిని హాలెకైలో ప్రత్యేకంగా నిర్మించిన నేలమాళిగలో భద్రపరిచారు. అమెరికన్ ‘మజిల్ కార్లు’ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.టీవీలో రతన్ టాటా అంత్యక్రియలను చూసిన మీకు, ఆయన పెంచిన కుక్క గోవా ఎలా దూకి శవపేటిక పక్కన కూర్చుందోగుర్తుకు వస్తుంది. టాటా తన కుక్కలకు ఎంత సన్నిహితంగాఉండేవారో ఇది తెలియజేస్తుంది. మాథ్యూ దీనిపై పూర్తి కథను వెల్లడించారు.ఆయన కుక్కలను తనకు లేని పిల్లలుగా చూసుకున్నారన్న భావన మీకు వస్తుంది. వీటిలో చాలా కుక్కలను టిటో, ట్యాంగోఅనిపిలిచేవారు. మాథ్యూ అదే పేరుతో ఉన్న మూడు తరాలకుక్కల గురించి చెబుతారు.2008లో ట్యాంగోలలో ఒకదానికి కాలు విరిగింది. అప్పుడు టాటా ఆ కాలిని రక్షించగల పశువైద్యుని కోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టారు. చివరికి ట్యాంగోను చికిత్స కోసం మిన్నెసోటా (యూఎస్ నగరం) తీసుకెళ్లారు.తన చివరి జీవితంలో టిటో ఆయన ప్రధాన సహచరుడు. ‘‘ఇప్పుడు టాటాకు టిటో మాత్రమే ఉంది’’ అని మాథ్యూ రాశారు. ‘‘ప్రతి సాయంత్రం టిటో కోసం ఏ అవాంతరం లేకుండా ఒక సమయం రిజర్వ్ చేయబడేది. ఆ షెడ్యూల్కు ఎవరైనా, లేదా ఏ కార్య క్రమమైనా భంగం కలిగించడం టాటాకు ఇష్టం ఉండేది కాదు. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమ సమయం’’ అని మాథ్యూ వివరిస్తారు.బహుశా నమ్మశక్యం కాని విధంగా, టాటాలో చిలిపిగుణం కూడా ఉండేది. బోర్డ్ మీటింగ్లలో వృద్ధ డైరెక్టర్లు తమ బూట్లను తీసేస్తారని గమనించిన తర్వాత, ఆయన నిశ్శబ్దంగా వాటిని వీలైనంత దూరంలోకి తన్నేవారు. ఆ బూట్లు ఎక్కడ ఉన్నాయో వారికి కనిపించనప్పుడు అల్లరిగా నవ్వుతూ ఉండేవారు. మాథ్యూ పుస్తకంలోని అన్ని విశేషా ల్లోకీ ఇది నాకు రసవత్తరమైన సంగతిగా అనిపించింది.అయితే, సైరస్ మిస్త్రీ, టెట్లీ టీ, కోరస్, జాగ్వార్ అధ్యాయాలతో సహా ఇంకా చాలానే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ వివరాలు ఉండకుండా ఎలా ఉంటాయి? కానీ వ్యక్తిగత వివరాలే నా దృష్టిని ఆకర్షించాయి. అవి మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయని నేను ఆశించవచ్చా?- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్షిప్గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
కృత్రిమ సంక్షిప్తం
పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు. అలా పుట్టినవే అబ్రిడ్జ్డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డ్రాకులా, రాబిన్సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు. సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది. పొలిటికల్ కరెక్ట్నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్లెక్సియా, తీవ్ర ఏడీహెచ్డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి. -
నీలినీడలో ఆడపిల్ల
‘ఐయామ్ వాట్ ఐయామ్’... సునీతకృష్ణన్ రాసుకున్న జీవన జ్ఞాపకాల గుచ్ఛం. ఆడపిల్లల అక్రమ రవాణా, లైంగికదాడి బాధితుల పునర్జీవనం పై పోరాడుతున్న సామాజిక కార్యకర్తగా సునీతా కృష్ణన్ ఈ పుస్తకంలో సాంకేతికత ముసుగులో సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితులను నమోదు చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలు...‘‘సైబర్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్’ మీద నేను జాతీయస్థాయి సర్వే చేస్తూ ఆధారాల కోసం ఒక యాప్ ద్వారా ‘పిల్లల అశ్లీల వీడియో’ల కోసం ప్రయత్నించాను. అందుకోసం 532 రూపాయలు చెల్లించాను. మూడు రోజుల్లో తొమ్మిదివేల వీడియోలు వచ్చాయి. ఆరు నెలల పసిబిడ్డ నుంచి ఎనిమిదేళ్ల అమ్మాయి వరకు ఉన్న వీడియోలు కళ్లు మూసుకోవాల్సినంత ఘోరంగా ఉన్నాయి. ఇది ఏ డార్క్ వెబ్లోనో కాదు, పబ్లిక్ డొమైన్లోనే. ఒక ఇన్ఫ్లూయెన్సర్కి డబ్బు పంపించాం, వీడియో రావడం ఆలస్యమైంది. ఫోన్ చేసి అడిగితే వచ్చిన సమాధానమేంటో తెలుసా... ‘నేను ట్యూషన్లో ఉన్నాను. తర్వాత పంపిస్తాన’ అని. అంటే ఆ కుర్రాడి వయసు ప్లస్టూ దాటలేదని అర్థమవుతోంది. సమాజం ఇలా ఉంది’మగపిల్లలకూ రక్షణ లేదు ‘ఒకప్పుడు మానవ అక్రమ రవాణా అంటే చదువులేక పేదరికంతో కష్టాలు పడుతున్న వారికి మాయమాటలు చెప్పి మోసం చేసేవారు. ఇప్పుడు ఆ ఆర్థిక రేఖ కూడా చెరిగిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా బాధితులవుతున్నారు. ఒకప్పుడు ఈ నేరాలు ఎవరు చేశారనేది దర్యాప్తులో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు నేరస్థులు సాంకేతికత మాటున దాక్కుంటున్నారు. మగపిల్లలు కూడా ట్రాఫికింగ్కి గురవుతున్నారిప్పుడు. ఈ ఘోరాలన్నింటికీ సోషల్మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. వీటన్నింటినీ నియంత్రించాలంటే ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలి, వాటిని కచ్చితంగా అమలు చేయాలి. మాలాంటి సోషల్ నేను నా పుస్తకం ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’లో ఉదహరించిన అనేక అంశాలు, వాటి నుంచి నేను నేర్చుకున్న ΄ాఠాలు కూడా ఈ సమస్యల మీద ముందుకెళ్లడానికి ఉపకరిస్తాయనే అనుకుంటున్నాను’ ఎందుకు రాశానంటే... ‘మా నాన్నకు తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక ఉందని తెలిసి పిల్లలుగా మేము సహకరించాం. ఆయన తుదిశ్వాస వదలడానికి రెండు నెలల ముందు పుస్తకం ఆవిష్కరించాం. బంధువులు, స్నేహితులకు ఆ ప్రతులను పంచినప్పుడు ఒక్కొక్కరూ ‘ఆయన సమాజం కోసం ఇంత సర్వీస్ ఇచ్చారని మాకిప్పటి వరకూ తెలియద’ంటూ నాన్నగారి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఆ మాటలు వినడానికి నాన్న లేరు. అప్పుడు నాకు ఒక మనిషి గురించి పదిమందికి ఆ మనిషి బతికుండగానే తెలియాలి. అలాగే ఆ పదిమంది ఏమనుకున్నారనేది అది మంచి అయినా చెడు అయినా సరే... ఆ మనిషి బతికుండగానే తెలుసుకోవాలి అనిపించింది. అది తొలి కారణం. రెండో కారణం బాలీవుడ్ బయోపిక్. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు నా బయోపిక్ తీస్తామని అనుమతి కోరారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యూ ట్యూబ్లో నా గురించి ఎవరికి తోచిన కథ వారు పెట్టారు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వడం కంటే నా స్టోరీ నా వెర్షన్ నేనే చె΄్పాలి అనుకున్నాను. నా పుస్తకంలో నేనేంటో ఉంది. ఒక గదిలో కూర్చుని రోజుకు 14 గంటల చొప్పున 13 రోజుల్లో పూర్తి చేసి జూన్ 17వ తేదీన విడుదల చేశాను. ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ ఆన్లైన్లో అందుబాటులో ఉంది’ అని వివరించారు సునీతాకృష్ణన్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : అనిల్ కుమార్ మోర్లబలహీనత తెలియడమే బలం మన బలహీనతలను గుర్తించగలగడమే మన శక్తి. నా బలహీనత ఏమిటో గుర్తించగలిగాను కాబట్టే శక్తిమంతమయ్యాను. మన ఇచ్ఛాశక్తిలో శుద్ధి ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు సహాయంగా వస్తాయి. ప్రజ్వల నిర్వహణ కోసం ఫండ్రైజింగ్ గురించి ్ర΄ోగ్రామ్ చేయడానికి ఎన్డీటీవీ, సాక్షి టీవీలు అవకాశం ఇచ్చాయి. లైవ్ పూర్తయ్యేలోపు ఒక చిన్న ΄ాప తన కిడ్డీ బ్యాంక్ని పగలకొట్టి ఏడువేల రూ΄ాయలిచ్చింది. ఇలాంటి ఎంతోమంది సహకారం అందించారు. ఇప్పటి వరకు బాధితులైన మహిళల రక్షణ కోసమే పని చేశాను. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న సామాజిక విధ్వంసం చూస్తుంటే ప్రమాదం బారిన పడుతున్న మహిళల గురించి పని చేయాలనుకుంటున్నాను.– సునీతా కృష్ణన్, ఫౌండర్, ప్రజ్వల ఫౌండేషన్ -
నేచర్స్ లవింగ్లీ!
పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్పీఎస్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం.. కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్పీఎస్ బేగంపేట క్యాంపస్లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.అనేక విషయాలు నేర్చుకున్నాం.. తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. భవన నిర్మాణాల్లో మార్పు రావాలి.. పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచి ఆసక్తితో.. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. – అజ్మా ఖాన్నెట్లో సరైన సమాచారం లేదు.. చాలా జీవుల గురించి ఇంటర్నెట్లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్ పర్యావరణం అంటే ఇష్టం.. పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. – ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్కెమెరా ముఖ్యమైనది.. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు -
అటవిక రాజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా రెండు వారాలుగా జిల్లాలో టీడీపీ మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాషీ్టకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలనే విచక్షణ మరిచి ఆటవికంగా హింసకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లపై శిలఫలకాల ధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జా సాగిస్తున్నారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల ఆస్తులను కాల్చి బూడిద చేశారు. వీరి ఆటవిక చర్యలను అడ్డుకునేందుకు సాహించలేక మౌనంగా రోధిస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోయినా.. సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు అంటున్నారు. నారా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం వెంకటాచలం పోలీస్స్టేషన్ ఎదుటే వైఎస్సార్సీపీ కార్యకర్త దూడల మనోజ్కుమార్ తన కారును పోలీస్స్టేషన్ బయట నిలిపి లోపలికి వెళ్లారు. ఆ కారును టీడీపీ కార్యకర్తలు సండి సురేష్ బాలిబోయిన మహేష్ ధ్వంసం చేశారు. పోలీస్స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. వీఎస్యూనూ వదలని మూకలు కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీ శిలాఫలకాలను టీడీపీ నాయకులు గడ్డపారతో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా భవనం వద్దకు చేరుకుని, ఆయన విగ్రహాన్ని భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు.నవరత్నాల బోర్డు ధ్వంసం రామాయపట్నం గ్రామ సచివాలయంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తాడుకట్టి పైకెక్కి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్కు చెందిన 29వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యకర్త సాజిద్పై స్థానిక టీడీపీ కార్యకర్త హమీద్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వీరి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్తున్న సాజిద్ను మార్గమధ్యలో అటకాయించి మరోమారు విచక్షణరహితంగా దాడి చేశారు. అప్పుడు కాదురా...ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడతారు.. వైఎస్సార్సీపీకి చెందిన కొందరి లిస్టు తమ వద్ద ఉందని.. వీరందరికీ ఇదే గతిపడుతుందని బెదిరించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నివాసం ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. డీజే పెట్టి, బాణసంచా పేలుస్తూ రామిరెడ్డి ఇంటి గేటును కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. దగదర్తిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కాండ్ర శ్రీనివాసులు ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. తడకలూరుకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడిపై దాడికి తెగబడ్డారు. దీంతో గిరినాయుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్నాయుడి ఇంటి ఎదుట కవి్వంపు చర్యలకు పాల్పడి బాణసంచా కాల్చి ఇంట్లో వేశారు. ద్విచక్ర వాహనం దహనం కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం యలమంచిపాడులో స్థానిక టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన తల్లి షేక్ బీబీపైన కూడా దాడి చేశారు. 75 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా తలపైన దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రోజు తడకలూరులో టీడీపీ నాయకులు స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగుల బెట్టారు.ఆర్బీకే శిలాఫలకం ధ్వంసం ఉలవపాడు మండలం ఆత్మకూరులో నిర్మించిన రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు. దీంతో పాటు రూమ్ తాళాన్ని సైతం పగలగొట్టారు. రూమ్ లోపల ఉన్న ఫ్యాన్ను సైతం ఎత్తుకెళ్లారని, టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని.. దీనిపై ఫిర్యాదు చేయనున్నామని కాంట్రాక్టర్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలో వైఎస్సార్సీపీ నేతలు గిరికృష్ణ, మురళీకృష్ణ ఇంటిపై 15 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు 15 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు బైక్లపై తన ఇంటి ముందు పెద్ద శబ్దాలు చేస్తూ.. బయటకు రా నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. తన తల్లి గుండెజబ్బుతో బాధపడుతోందని చెప్పినా, వినిపించుకోకుండా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తన ఇంటిపై వేశారని తెలిపారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి వచ్చి కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా త్వరలోనే చంపేస్తామని తనను బెదిరించారు. ఈ విషయమై పోలీస్స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.ట్రాక్టర్, ఆక్వా సామగ్రి దహనం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు పంచాయితీకి చెందిన వైఎస్సార్సీపీ నేత కావల్రెడ్డి రంగారెడ్డికి చెందిన ఓ ట్రాక్టర్, ఏయిరేటర్ల, ఇతర ఆక్వా సామగ్రిని టీడీపీ వర్గీయులు దహనం చేశారు. మాజీ మంత్రి కాకాణి సమీప బంధువైన రంగారెడ్డి గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులే అధికార అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న లేఅవుట్లోని నిర్మాణ ఇల్లు ధ్వంసం దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్లోని నిర్మాణంలో ఉన్న తొమ్మిది ఇళ్లను అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఏరుకొల్లు ఎస్సీ కాలనీ సమీపంలో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 36 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 20 నిర్మాణాలు చేపట్టి పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారని అక్కసుతో 9 ఇళ్ల నిర్మాణాలను జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశి్నస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు. ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి నివాసం వద్ద డీజే, బాణసంచా కాల్చుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. సర్పంచ్పై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ జెండా స్థూపం ధ్వంసం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత ఇల్లు ధ్వంసం కావలి పట్టణం 13వ వార్డు పుల్లారెడ్డినగర్లో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంటి నిర్మాణ పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు శనివారం జేసీబీతో ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా ఉన్నప్పటికీ అధికారులు ఇంటి నిర్మాణ పనులను తొలగించారు. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి పంచాయతీ నిధులతో నిర్మించిన రచ్చబండను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న మహిళపై ఇనుప రాడ్తో దాడికి తెగబడిన ఘటన వెంకటాచలం మండలం కసుమూరులో జరిగింది. పది మందికి ఉపయోగపడే రచ్చబండను ధ్వంసం చేసి ఇంటి నిర్మాణం చేసుకోవడం ఏమిటని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పు చెంగమ్మ ప్రశ్నించడంతో సదరు టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ ఆమె తలపై రాడ్డుతో దాడి చేశాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహిళపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది. పిల్లల కోసం స్పెషల్గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు. ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్గా ఉండబోతోందని ఆలియా ఇన్స్టాలో వెల్లడించింది. ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్ను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్లో విడుదల కానుంది -
సింగపూర్లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు. -
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) -
అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్ విజన్.. ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలుగెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది.ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్తో ప్రధాన, సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.తెలుగుదేశం పార్టీ, న్యూట్రల్ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్ గ్రూప్లు, 100కు పైగా పెయిడ్ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్బుక్ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివరాలు ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారుతుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్ విజన్’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు. -
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
చంద్రబాబు పుస్తకం..రక్తం పొంగుతుంది..
-
‘ఆంధ్ర సంపాదక శిఖరాలు’.. పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, విజయవాడ: సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన 'ఆంధ్ర సంపాదక శిఖరాలు' పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్,ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున యూనివర్సిటీ(ఎన్యూ)లో జరిగిన "తెలుగు భాష సేవా రత్న" అవార్డుల ప్రదానోత్సవ సభలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఆర్. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని ఉర్రూతలూగించిన తొలి తరం సంపాదకుల సంక్షిప్త జీవిత చరిత్రలను ప్రస్తుత తరానికి అందించాలన్న తలంపుతో మీడియా అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. ఆయా సంపాదకుల వివరాలు సేకరించి మా శర్మ ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించారని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీతో మీడియా అకాడమీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కొమ్మినేని గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకోసం తాను ఛైర్మన్గా పనిచేసిన కాలంలో ప్రారంభించిన జర్నలిజం డిప్లమో కోర్సుకు సహకరించిన వైస్ ఛాన్సిలర్, ప్రొ. రాజశేఖర్కు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ డా. జి. అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత మా శర్మను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సిలర్ ప్రొ. కొలకలూరి ఇనాక్ సి.ఆర్. మీడియా అకాడమీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రుల కమిటీ చైర్మన్, మేడపాటి వెంకట్, తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వాసుదేవరావు, జర్నలిజం హెచ్వోడీ డా. జి. అనిత, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి.. తిరుమల ధార్మిక సదస్సులో పలు తీర్మానాలు -
'మూడుదారులు': రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు!
నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు. చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి. నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మరోమారు జరగనుంది. తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’. భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు) -
సమస్యలు రాయరా అంటే సమోసాలు గురించి రాస్తాడు: పేర్ని నాని
-
‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్కు అందజేసిన ధర్మాన
సాక్షి, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు. ఇదీ చదవండి: అభిమానులపై ‘పంజా’! -
PRANAB, MY FATHER: రాహల్కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి?
ఏ మతంలోనైనా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. జుడాయిజంలో కూడా అదే ఉంది. ఆధునిక విద్యతో పాటు యూదులు తమ పిల్లలకు తమ మత విలువలను కూడా బోధిస్తారు. ప్రతి యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పిల్లలకు చదువుకునే వయసు రాగానే ఇంటి పెద్దలు జుడాయిజానికి సంబంధించిన విషయాల గురించి చెబుతారు. తమ పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను వారిచేత చదివిస్తారు. ప్రతి యూదు ‘తోరా’ను తప్పక చదివి అర్థం చేసుకుంటారు. ఇది చదివిన వారే నిజమైన యూదునిగా ఆ మత పెద్దలు గుర్తిస్తారు. ‘తోరా’ యూదుల ఆరాధనా గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా అంటే నేర్చుకోవడం అనే పదం నుండి రూపొందింది. మనం ఉపయోగిస్తున్న తోహ్-రా అనే పదం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరోనమీ. ‘తోరా’ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. భారతదేశంలోని యూదులు కూడా ఈ గ్రంథాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. వారు నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఉంచుతారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని చెబుతారు. దీనితో పాటు ప్రతి యూదు విశ్వసించాల్సిన మోషే చట్టాలు, నియమాలు దీనిలో ఉన్నాయని చెబుతారు. యూదుల ప్రత్యేక ప్రార్థన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదుల దేవుడైన యెహోవా పేరు ఈ పుస్తకంలో 1800 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి? -
తెలంగాణ సిక్కుల వెనక అసలు కథ రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ
గురునానక్ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. గురునానక్ బోధనల్లో మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. హిందూ, ఇస్లాం రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి,మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి, ఆయనిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే.. 'హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!' 200 ఏళ్ల కిందే సిక్కులొచ్చారు హైదరాబాద్లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో ఆనాటి హైదరాబాద్ 4వ నిజాం ( 1829-1857) తన ప్రధాని చందూలాల్ (పంజాబ్ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832 లో లాహోరి ఫౌజ్లో భాగంగా వీరిని హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు. ఆనాడు సిక్ రెజిమెంట్ క్యాంపు అత్తాపూర్ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మింపబడింది. తెలంగాణ అంతటా ఎన్నో గుర్తులు అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు. మాతృ భాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. ప్యారడైజ్కు మూడు కిలో మీటర్ల దూరంలోనున్న ఆనాటి 'సిక్కుల తోట'నే కంటోన్మెంట్ పరిధిలోనున్న నేటి 'సిక్ విలేజ్'. వ్యాపారాల్లో ఉద్ధండులు చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు. ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి 'గచ్చుబాయ్ తాండా' ఇప్పుడు' గురుగోవింద్ నగర్ 'గా మారిపోవడం విశేషం. సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 'డెక్కన్ సిక్కుల సంస్కృతి'పై సాలర్ జంగ్ మ్యూజియం లోనున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం. సిక్కు జీవితంలోంచి వచ్చిన కథ ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సిక్కు కుటుంబాల్లోంచి వచ్చిందే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి( 1857 - 1963 ) సర్దార్జీయే. నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్ గురుదేవ్ సింగ్ గారి వద్ద లభించగా దాన్ని వేముల ప్రభాకర్ పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో) తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య ఆవిష్కరించారు. -
భారత్లో క్రోమ్బుక్ల తయారీ షురూ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్పీ కలిసి భారత్లో క్రోమ్బుక్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్బుక్స్తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్ అందుబాటులోకి రాగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో హెచ్పీ వీటిని తయారు చేస్తోంది. కొత్త క్రోమ్బుక్స్ ఆన్లైన్లో రూ. 15,990 నుంచి లభిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 నుంచి హెచ్పీ భారత్లో తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఎలీట్బుక్స్, ప్రోబుక్స్, జీ8 సిరీస్ నోట్బుక్స్ వంటి వివిధ ల్యాప్టాప్లు, ఆల్–ఇన్–వన్ పీసీలు, డెస్క్టాప్లు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేస్తోంది. భారత్లో ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంది. -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా?
ఇటీవలే రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దీనికి ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భారత్ మండపాన్ని భవిష్యత్లో ఎందుకు వినియోగించనున్నారు? గత కొన్నేళ్లుగా వాణిజ్య ఉత్సవాలను ప్రగతి మైదాన్లో నిర్వహిస్తున్నారు. ఇలీవలి కాలంలో ప్రగతి మైదాన్ రూపాన్ని మార్చారు. జీ-20 సదస్సు కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్కు గ్రాండ్ లుక్ను అందించడంతోపాటు పలు నూతన భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ‘భారత్ మండపం’ ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. జీ-20 సదస్సు తర్వాత ‘భారత్ మండపం’ అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా మారనుంది. గతంలో దీనిని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవారు. ఇదే ఇప్పుడు ‘భారత్ మండపం’గా మారింది. ఇకపై ఇక్కడ పెద్ద కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు, పుస్తక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంతే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ప్రయివేటు సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా తగిన రుసుము చెల్లించి ‘భారత్ మండపం’ బుక్ చేసుకోవచ్చు. ‘భారత్ మండపం’ను ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షించనుంది. ఈ సంస్థను సంప్రదించి ఈ కన్వెన్షన్ సెంటర్ను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మితమయ్యాయి. వేలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్ల ఉన్నాయి. 5 వేలకు పైగా వాహనాలు పార్క్ చేసేందుకు అవకాశముంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ‘భారత్ మండపం’ రాబోయే మూడు నెలల వరకూ ప్రభుత్వ కార్యక్రమాల కోసం బుక్ చేశారు. ఇది కూడా చదవండి: ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం! -
ఎన్డీఏ సర్కార్పై బాంబు పేల్చిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్డేట్ ప్రిల్యూడ్ బుక్లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డు లాభాలు బదిలీ గత ప్రభుత్వాల హయాంలో ఆర్బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు. ఆర్బీఐ సెక్షన్ -7 వివాదం నిధుల బదిలీలో ఆర్బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు. కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్బుక్ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్బుక్లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్మెంట్, హౌస్వైఫ్ బదులుగా హోమ్మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
చంద్రబాబు మనసులో మాట...
-
తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్లు కలిసి రచించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరమని, దీంతో ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత ఉండాలని సూచించారు. తప్పుడు రిపోర్టింగ్, తప్పుడు సమాచారంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా భావిస్తున్నానన్నారు. ఈ పుస్తకం పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ మాట్లాడుతూ.. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని చెప్పారు. -
ఓ పల్లెలోని చిన్న కుటుంబం..ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందంటే..
ప్రపంచీకరణ లేదా గ్లోబలైజషన్ అనే పదాలను గూర్చి తరచుగా వింటున్నాం. సామాన్యుల పరంగా దీన్ని నిర్వచిస్తే..ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు, జ్ఞానం, సమాచారం, ఉత్పత్తులు, సేవల విస్తరణ. బిజినెస్ పరంగా, ఆర్థికపరంగా వాటి అర్థం మారుతుందేమో గానీ అంతిమంగా మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఒకచోటే చేర్చే సాధారణ పదంగా చెప్పవచ్చు. ఓ పల్లెలో చిన్న కుటుంబం పెద్దదిగా విస్తరించి ఎలా ప్రపంచీకరణవైపు అడుగులు వేస్తోందో చూస్తే.. కచ్చితంగా ప్రతి కుటుంబంలో ఇలానే జరగుతోంది కదా అనిపిస్తుంది. మనం గమనించకుండా మాటిమాటికి ప్రంపచీకరణ(గ్లోబలైజషన్ ) అని జపించామా! అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ రచయిత ఆ అంశంపై పుస్తకం రాసేంతవరకు కూడా..అందుకు తన కుటుబ గాథే ఓ చిన్న ఉదహారణ అని ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. నిశితంగా గమనిస్తే..ఆ రచయిత కుటుంబంలానే ప్రతి కుటుంబం ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తుందని అవగతమవుతోంది. ఆ రచయిత ఎవరూ? ఆ పుస్తకంలోని కథా కమామీషు ఏమిటంటే.. స్వామినాథన్ శంకర్ అంక్లేసరియా అయ్యర్ అనే వ్యక్తి 1992లో 'ప్రపంచీకరణ వైపు' (Towards Globalisation) అనే పుస్తకాన్ని రాశారు. ఆయనో ఓ జర్నలిస్ట్, కాలమిస్ట్ కూడా. ఐతే ఆయనకు ఆ పుస్తకం రాసేంత వరకు తెలియలేదు, అందుకు తన కుటుంబ నేపథ్యమే ఓ ఉదహారణ అని. ఈ మేరకు రచయిత స్వామినాథన్ ఆ పుస్తకంలో తన కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందో చెబుతూ..నా కుమార్తె తెలివైన విద్యార్థి. ఆమె లండన్ స్కూల ఆఫ్ ఎకనామిక్స్లో స్కాలర్షిప్ గెలుచుకుంది. లండన్లో ఆమెకు స్పెయిన్కు చెందిన జూలియా అను యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు చైనాలో బీజింగ్లో ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహాం చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చారు. వివాహ అతిధుల్లో ఉత్తర అమెరికా, యూరప్, చైనాకు చెందిన 70 మంది స్నేహితులు ఉన్నారు. ఈ వివాహంలో మొత్తం ప్రపంచమే కవర్ అయ్యిందనుకుంటే రచయిత పెద్ద కొడుకు శేఖర్ ఇంకాస్త ముందడుగు వేసి ఊహించని షాక్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు రచయిత స్వామినాథన్. ఇక అతను కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించాడు. ఆ తర్వాత కొలంబోలో ఒక పాఠశాలలో ఒక ఏడాదిపాటు బోధించి తదనంతరం ఉన్నత చదువుల కోసం కెనడాలోని టొరంటో వెళ్లాడు. అతను అక్కడ ఫ్రాంజిస్కా అనే జర్మన్ అమ్మాయి పరిచయమయ్యింది. ఇద్దరూ యూఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఉద్యోగాలు పొందారు. అదీగాక ఐఎంఎఫ్లో ఉద్యోగాల రీత్యా విభిన్న దేశాలకు ప్రయాణించారు. ఇక 2003 చివరిలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక చిన్న కొడుకు రుస్తమ్ వయసు కేవలం 15 ఏళ్లు అని, బహుశా ఆస్ట్రేలియాలో చదువుకుని, నైజీరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెరులో స్థిరపడతాడేమో అని చమత్కరించాడు. వాస్తవానికి రచయిత స్వామినాథన్ పూర్వికులు ఇల్లు తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం కర్గుడి. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు, పక్కా రోడ్డు వంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో ఉంది. అయ్యర్ల కుటుంబం నుంచే 50 మంది.. తంజావూర్లో తనకు రైలు దిగి, ఎద్దుల బండి ఎక్కి 45 నిమిషాలు ప్రయాణిస్తే పూర్వీకులు ఇల్లు చేరుకోవచ్చు. రచయిత తండ్రి ఆరుగురు సంతానంలో ఒకడు. వీరందరికి చాలామంది పిల్లలు ఉన్నారు. రెండు తరాల తర్వాత కర్గుడిలోని ఆ కుటుంబం కాస్త పెద్దదై క్రమంగా 200 మందికి పైగా చేరుకుంది. ప్రస్తుతం వీరిలో ముగ్గురు మాత్రమే గ్రామంలో నివశిస్తున్నారు. మిగిలిన వారు భారతదేశంతో సహా ప్రపంచమంతటా వేర్వేరు చోట్ల సెటిల్ అయ్యారు. తమ కుటుంబమే ఇప్పటికి సుమారు 50 మంది అమెరికన్ పౌరులను తయారు చేసినట్లు రచయిత చెప్పుకొచ్చాడు. దీన్ని గమనిస్తే..గ్లోబలైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ అని వాదించే వాదనలు ఒక్కసారిగా కొట్టిపారేయొచ్చు. కఠినమైన తమిళ బ్రాహ్మణ అయ్యర్ల నేపథ్యం కుటుంబం ఒక్కసారిగా ఎంతలా హైప్ తీసుకుని విస్తరించిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అయ్యర్ ఆధిపత్యం కాదు. దీని అర్థం ఒక వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసి ఎలా దురాబారాలను అధిగమించి వెళ్తాడో..ఆ క్రమంలో ఎలా ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టివచ్చి..ఎలా పరివర్తనం చెందుతాడనేది తెలుపుతోంది. వాస్తవానికి రచయిత స్వామినాథన్ కర్గుడి గ్రామంలో ఉంటే తన ఇంటిలో నేలపై చేతితో భోజనం చేస్తాడు. అదే..చైనాలో నూడుల్స్, స్పెయిన్లో స్టీక్, జపాన్లో టెరియాకి, మొరాకోలో కౌస్-కస్ తినగలడు. రచయిత స్వామినాథన్ తాను కార్గుడి గ్రామస్థుడిని, తమిళుడిని, ఢిల్లీ-వాలాను, భారతీయుడిని, వాషింగ్టన్ రెడ్స్కిన్స్ అభిమానిని, ప్రపంచ పౌరుడిని అని గర్వంగా చెబుతున్నాడు. తన పుట్టిన తంజావురూలోని బృహదీశ్వరాలయాన్ని చూడగానే తన హృదయం ఉప్పొంగుతుందని, ఇది నా మాతృభూమి అనే గర్వంగా చెప్పుకుంటానని భావోద్వేగంగా అన్నాడు. అలాగే భారత్లోని వివిధ ప్రదేశాలలో తాను నివశించిన వాటిని చూసినా అది నాదే అన్నభావం కలుగుతుంది. అంతేగాదు విదేశాల్లో తాను గడిపిన ఆయా ప్రదేశాల్లోని ప్రాంతాలను చూసినా అవి నాలో ఒక భాగమని ఫీలవుతానని రచయిత స్వామినాథన్ చెబుతున్నారు. ప్రపంచమంతా ఒక్కటే.. ఇక్కడ రచయిత నాన్న తరం మొదటగా గ్రామాన్ని విడిచిపెట్టి ప్రాంతీయ సంకెళ్లను తెంచుకోవడంతో..స్వామినాథన్ నాన్న లాహోర్లో చార్టర్ అకౌంటెంట్ అయ్యాడు. మామయ్య కరాచీలో హోటల్ మేనేజర్ అయ్యాడు. రంగూన్లో అతని అత్త సెటిల్ అయ్యింది. రచయిత తరం వచ్చేటప్పటికీ మతం సంకెళ్లను వదులుకుంది. రచయిత అన్నయ్య సిక్కును, తమ్ముడు క్రిస్టియన్ని, రచయిత స్వామినాథన్ అయ్యంగర్ పార్శిని పెళ్లి చేసుకుంటే..తరువాతి తరం ప్రపంచవ్యాప్తంగా పెళ్లి చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ఒక్క అయ్యర్ కుటుంబంలోనో ప్రపంచీకరణ జరిగి వస్తువులు, మూలధనం తరలింపు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో అటు వైపు అడుగులు వేస్తూ.. అయ్యర్ కుటుంబం కోవలోకే చేరుతున్నారు. ఈ ప్రపంచీకరణ ఒకరకంగా విభిన్న భాష, సంస్కృతులు సంప్రదాయాల మేళవింపుతో ఒక్కటై ప్రంపంచమంతా ఒక్కటి అనే స్ఫురణను తీసుకొస్తుంది. దీని వల్ల ఒక ప్రాంతీయ భాష, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ..మత విద్వేషాలకు చెక్ పెట్టి మనం అంతా ఒక్కటే అనే ఎలుగెత్తి చాటుతోందని స్వామినాథన్ తన పుస్తకంలో వివరించారు. (చదవండి: On This Day April 15th: ఏప్రిల్ 15 ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!) -
81 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం.. 17వ పేజీలో ఏమున్నదంటే..
ఇటీవల ఒక లైబ్రరీకి ఎవరో ఒక పుస్తకాన్ని తీసుకురాగా అక్కడి స్టాఫ్ దానిని చూసి అవాక్కయ్యారు. ఆ పుస్తకం 81 ఏళ్ల క్రితం ఇష్యూ చేసినది కావడం విశేషం. సిబ్బంది ఆ పుస్తకాన్ని తెరవగా, అక్కడున్న విచిత్రమైన మెసేజ్ చూసి తెగ ఆశ్చర్యపోయారు. పుస్తకప్రియులు లైబ్రరీలకు వెళుతుంటారు. కొందరు అక్కడే కూర్చుని చదువుకుంటారు. మరికొందరు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకుంటారు. అయితే ఆ పుస్తకాలను రిటర్న్ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. అది దాటితై ఫైన్ విధిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు తాము తీసుకువెళ్లిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో అప్పగించరు. ఇటీవల ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942,మార్చి 30 నాడు ఇష్యూ చేసినది కావడం విశేషం. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఉదంతం అమెరికాలోని వాషింగ్టన్లో గల ఎబర్డీన్లో చోటుచేసుకుంది. ఇది చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి! పాత సామానులలో దొరికింది లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్ నార్డాఫ్ అండ్ జేమ్స్ నార్మన్ హాల్ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ’’ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని పేర్కొన్నారు. పేజీ నంబరు-17లో.. కిరో7 న్యూస్ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్ రాశాడు..‘‘ ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను’’ అని రాసివుంది. దీని అర్థం ఏమిటంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. లేటు ఫీజు విధిస్తే.. లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్లు(సుమారు రూ.40 వేలు) అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. బహుమతిగా భావించి.. ఆ పేస్బుక్ పోస్టులో లైబ్రరీ ప్రతినిధి.. ఈ ఉదంతం నుంచి మనం ఒక విషయం తెలసుకోవాలన్నారు.. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకమైనా దుమ్ము, ధూళి బారిన పడి ఉంటే, దానిని వెంటనే లైబ్రరీకి తిరిగి ఇవ్వండి. మేము వాటిని బహుమతులుగా భావించి, ఆ పుస్తకం తీసుకుని వెళ్లినవారికి ఎటువంటి ఫైన్ వేయబోమని తెలిపారు. చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా! -
AP: జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది. ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్లో హిందీ లేదా ఇంగ్లీష్లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు. Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1 — Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023 (చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్) -
‘ఇలాంటి పిల్లల’కూ హక్కులుంటాయి!
‘దివ్యాంగులు మెట్లు ఎక్కలేకపో వడానికి కారణం వాళ్లకు కళ్లో, కాళ్లో లేకపో వడం కాదు సమాజానికి సహానుభూతి లేకపో వడం’ అంటుంది తమిళ రచయిత్రి కంభంపా టి శ్రీలత.డిస్లెక్సియాతో పుట్టిన కూతురి కోసం తానే టీచర్గా మారింది శ్రీలత. ‘నార్మల్ వ్యక్తుల మెజారిటీ సమాజం దివ్యాంగుల పట్ల ఎటువంటి బాధ్యత వహించకపో యినా వాళ్లు తమ జీవితాలను నిశ్శబ్దంగా నిర్మించుకుంటూనే ఉంటారు’ అంటుందామె. కూతురి జీవితాన్ని, ఆమెలాంటి దివ్యాంగుల జీవితాలను ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకంగా తీసుకొచ్చిందామె. శ్రీలత తాను రాసిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకాన్ని ఏడు అధ్యాయాలుగా విభజించింది. ఆ ఏడింటిలో ఒకదాని పేరు ‘దృష్టి లేనిది ఎవరికి?’. ‘ఈ సమాజంలో దృష్టి లేనిది అంధులకా దివ్యాంగుల పట్ల ఎటువంటి ఆలోచనా లేని సామాన్యులకా?’ అని ప్రశ్నిస్తుంది అందులో.‘సమర్థత (ఎబిలిటీ) మీకు మాత్రమే ఉంటుందా? అందుకే దివ్యాంగులను డిజేబుల్ అంటారా? వారూ సమర్థులే. కాని వారి కదలికలకు వీలు కల్పించలేని నిర్మాణాలు, చదవడానికి వీల్లేని చదువులు, వారికి సమాన అవకాశం ఇవ్వలేని స్కూళ్లు... ఇవి వారిని సమర్థత లేనివారుగా చేస్తున్నాయి’ అంటుందామె. చెన్నైలో నివసించే శ్రీలత సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి. ఆమె రాసిన కవితా సంకలనాలు ఆదరణ పొందాయి. ‘టేబుల్ ఫర్ ఫోర్’ అనే నవల పెద్ద పురస్కారాల వరకూ వెళ్లింది. అయితే ఆ రాసిన పుస్తకాల కంటే తాజాగా వెలువరించిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకం విలక్షణమైనది. దానికి కారణం ఆమె కూతురు అనన్యకు 9 ఏళ్లు ఉండగా ‘ఇలాంటి అమ్మాయిని స్కూల్లో ఉంచుకోలేం’ అని ప్రిన్సిపల్ నిర్దాక్షిణ్యంగా చెప్పడమే. ఆ ‘ఇలాంటి అమ్మాయి’ (దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్)ని గుండెలకు హత్తుకుని తానే చదువు చెప్పుకుంది శ్రీలత. దానికి కారణం అనన్య డిస్లెక్సియాతో బాధ పడుతూ ఉండటమే. ఇంకా కచ్చితంగా చె΄్పాలంటే అనన్యకు ‘స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ’ (ఎస్ఎల్డి) ఉంది. ‘నా కూతురిని కూడా అందరి పిల్లలతో పా టు కూచోబెట్టి చదివించే స్కూళ్లు ఉండాలి. ఆ స్కూల్లో నా కూతురు స్థితిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. నా కూతురే కాదు అలాంటి అందరు పిల్లలకు’ అంటుంది శ్రీలత. ‘న్యూరోడైవర్సిటీ’... అంటే మెదడు సంబంధమైన లోపా లతో పుట్టే పిల్లలు– ఆటిజమ్, డిస్ర్పా క్సియా, డిస్కాల్క్యులియా, డిస్గ్రాఫియా... తదితర అవస్థలతో బాధ పడుతుంటే వారి కోసం సమాజంలో ఎటువంటి ఆలోచనా ఉండదని ఈ పుస్తకంలో విపులంగా రాస్తుంది శ్రీలత. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి కంటే టీనేజ్కు వచ్చినప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక పరిస్థితుల గురించి చాలా అవగాహన లోపం ఉందని అంటుందామె. అందుకే తన పుస్తకంలో ‘మా షరతులతో మేము’ అనే చాప్టర్ను రాసింది. దివ్యాంగులు తమ పరిమితిని గుర్తించి ఆ పరిమితిని స్వీకరించి రాజీ పడక హక్కుల కోసం పో రాడాలని కోరుతుందామె. ‘దివ్యాంగుల హక్కులు మానవ హక్కులు. మీరు జాలి పడి రాల్చే సౌకర్యాలు కాదు’ అంటుంది శ్రీలత. దివ్యాంగుల విషయంలో అన్నింటి కంటే ముఖ్యమైన సమస్య ‘కేర్ గివర్స్’. అంటే ‘చూసుకునేవాళ్లు’. తల్లిదండ్రులు, భార్యాభర్తలు... వీరు దివ్యాంగులతో ఎలా మెలగాలో ఒక చాప్టర్లో రాస్తే తోబుట్టువులు, పిల్లలు ఎలా మెలగాలో ఇంకో చాప్టర్లో రాసింది. ‘పో లియోతో ఉన్న తండ్రితో నార్మల్గా పుట్టిన కొడుకు ఎలా మసలుకున్నాడో... తన తండ్రిని అర్థం చేసుకుని ఎలా బాసటగా నిలిచాడో ఒక కేస్స్టడీ ఈ పుస్తకంలో ఉంది’ అని చెబుతుంది శ్రీలత. అనేక మంది దివ్యాంగుల గెలుపు కథలను, తల్లిదండ్రుల, తోబుట్టువుల, సహాయకుల, స్పెషల్ ఎడ్యుకేటర్ల అనుభవాలను కథలుగా, ఇంటర్వ్యూలుగా, మౌఖిక కథనాలుగా ఈ పుస్తకంలో రికార్డు చేసింది శ్రీలత. దివ్యాంగుల నిజమైన అవసరాలు ఏమిటో సమాజానికి రావాల్సిన దృష్టి ఏమిటో ఈ పుస్తకం సమర్థంగా తెలియచేస్తుంది. ‘ఇలాంటి పుస్తకాలు ఎంతమంది రాస్తే అంత మంచిది’ అంటుంది శ్రీలత. అన్నింటి కంటే ముఖ్యం శ్రీలత కుమారుడు అనిరుద్ధ తన సోదరి అనన్యను చూస్తూ ‘ప్రతి స్కూల్లో పిల్లలకు దివ్యాంగుల గురించి పా ఠాలు చెప్పాలి. దివ్యాంగులతో ఎలా మెలగాలో పిల్లలకు సిలబస్గా ఎందుకు చెప్పరు? అప్పుడు కదా స్కూల్లో ఏ దివ్యాంగ పిల్లవాడైనా చేరితే ఇతర పిల్లలు అతనితో బాగా మెలిగేది’ అన్న మాట ఎంతో ఆలోచించదగ్గది. -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
ఏ విధిరాత వైపు పయనిస్తున్నాం?
భారత చరిత్రపై తాజాగా వచ్చిన ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’ ఆర్యన్ల మూలాల గురించి సరికొత్త వ్యాఖ్యానాన్ని అందజేసింది. ఆర్యన్లు భారత్ మూలాలను కలిగి ఉన్నారనే వాదనను ఖండిస్తూ, వీరు మధ్యాసియా నుంచి వచ్చినవారని చెబుతోంది. భారత ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఉద్రేకపరులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదని తేల్చి చెబుతోంది. ఔరంగజేబును పవిత్ర ముస్లింగా పేర్కొంటూనే, అత్యధిక హిందువులను ఉన్నత పదవుల్లో నియమించడానికి అది అడ్డురాలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం మెజారిటీ వర్గ ఆధిపత్యం దిశగా దేశం పయనిస్తోందని కూడా పుస్తకం అభిప్రాయపడింది. ఎట్టకేలకు, 450 కోట్ల సంవత్సరాల క్రితం భౌగోళిక కాలం ప్రారంభమైన నాటి నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు భారత చరిత్రను ఒకే సంపుటిలో వివరించిన పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీన్ని రాసిన ముగ్గురు రచయితలు– రుద్రాంక్షు ముఖర్జీ, శోభిత పంజా, టోబీ సిన్ క్లెయిర్– పుస్తకాన్ని ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’(భారతదేశ కొత్త చరిత్ర) అని చెబుతున్నారు. వారు ఈ విశేషణం ఎందుకు ఉపయోగించారో నాకైతే తెలీదు కానీ ఈ పుస్తకంలోని విషయాలు, చేసిన వ్యాఖ్యలు నన్ను కట్టిపడేశాయి. ఉదాహరణకు, ఇది మీకు తెలుసా? ‘‘హరప్పా నగరాల్లోని ఇళ్లు లేదా సమాధులు సంపద ఆడంబరానికి సంబంధించిన ఎలాంటి చిహ్నాలనూ ప్రదర్శించేవి కావు.... రాజమందిరం అని గుర్తించే ఎలాంటి భవనాలు లేవు... అలాగే ఈజిఫ్టు, చైనా, లేక మెసొపొటేమియాలో కనిపించినట్లు భారీ సమాధులు లేదా భవంతులు లేదా పాలకుల విగ్ర హాలు కనబడవు.’’ కాబట్టి ఇవి పాక్షిక సామ్యవాద గణతంత్రాలా? ఆర్యుల గురించి రచయితలు ఇలా చెబుతారు. ‘‘మధ్య ఆసియా నుంచి ఉత్తర భారతానికి వలస వచ్చారు, స్థానిక ప్రజలతో కలిసి పోయారు, క్రమంగా వారిని తమలో కలుపుకున్నారు... మరోలా చెప్పాలంటే, ఆర్యన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించలేదు, ద్రవిడి యన్లను దక్షిణాభిముఖంగా తరమలేదు.’’ ఇది కచ్చితంగా వివాదా స్పదమైంది. ఆర్యన్లు భారత్లోనే జన్మించినవాళ్లనే వాదనను ఇది ఖండిస్తుంది. అర్య సంస్కృతికి సంబంధించి, ఈ పుస్తక రచయితలకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ‘‘ఇది తరచుగా భారతీయ సంప్ర దాయం, సమాజానికి సంబంధించినదిగా చూడబడుతోంది’’ అని నొక్కి చెబుతూనే, దాన్ని ‘‘కులీనమైనది, ఇంకా అనితరమైనది’’ అని వర్ణిస్తారు. ‘‘ఇది ఉత్తర భారత జనాభాలోని విస్తృతమైన వర్గాలను స్పష్టంగా విస్మరించింది. అలాగే భారత ద్వీపకల్పం (వింధ్యకు ఆవలి భూమి)లో నివసిస్తున్న మొత్తం జనాభాను దూరం పెట్టేసింది.’’ పైగా ‘‘కులవ్యవస్థ పునాదులు’’ రుగ్వేద కాలంలోనే ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఇది మోహన్ భాగవత్ అభిప్రాయానికి కచ్చితంగా భిన్నమైనట్టిదే. ఇప్పుడు నన్ను ఔరంగజేబు వైపు దృష్టి మళ్లించనివ్వండి. ఆయనపై ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం కంటే ఆద్రే త్రూష్కే(అమెరికా చరిత్రకారిణి) అభిప్రాయాలకు దగ్గరగా ఉంటోంది. ‘‘ఔరంగజేబు పవిత్రమైన, పరి శుద్ధమైన ముస్లిం’’ అని వీరు పేర్కొంటున్నారు. ‘‘కానీ ఆయన మతో న్మాది కాదు’’ అంటున్నారు. దీనికి సాక్ష్యంగా, ఔరంగజేబు వ్యక్తిగత మత దృక్పథం అధిక సంఖ్యలో హిందూ మునసబుదార్లను నియమించకుండా ఆయనను అడ్డుకోలేదని వీరు పేర్కొంటున్నారు. ‘‘షాజహాన్ పాలనలో 1,000 జాత్(ర్యాంకు) లేదా అంతకు మించిన ర్యాంకు కలిగిన మునసబుదారుల్లో హిందువులు 22 శాతంగా ఉండేవారు. ఔరంగజేబు హయాంలో ఈ సంఖ్య 32 శాతానికి పెరిగింది.’’ విస్తృతమైన ముస్లిం పాలనలో అంటే 13వ శతాబ్ది నాటి సుల్తాన్ల నుంచి మొఘలుల అంతం వరకు చూస్తే ఈ కాలాన్ని 1,200 సంవత్సరాల బానిసత్వ సంవత్సరాలుగా పరిగణిస్తుంటారు. కానీ ఈ పుస్తకం మాత్రం దీనికి విరుద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉంది. ‘‘ముస్లింలందరూ లేక ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఇస్లామిక్ ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదు. ముస్లిం పాలకులు పెద్ద సంఖ్య లో ముస్లిమేతరులను ఉద్యోగాల్లో నియమించారు, వారికి అత్యున్నత పదవులను కూడా కట్టబెట్టారన్న వాస్తవాన్ని బట్టే ముస్లిం పాలకులందరూ మతమార్పిడి ఉన్మాదులు కారని తెలుస్తోంది’’ అని ఈ పుస్తకం తేల్చి చెబుతోంది. ఇస్లాం పాలకుల హయాంలో కళలు, నిర్మాణ కళ, సంస్కృతి, మతం వంటి అంశాల్లో జరిగిన అభివృద్ధి గురించి పుస్తకం చర్చించింది. భక్తి సంప్రదాయం, సూఫీతత్వం మధ్య ఈ పుస్తకం గుర్తించిన లంకెలను చూసి నేను నిరుత్తరుడినయ్యాను. ‘‘ఇస్లాంతో సన్నిహిత సంబంధం, ఇస్లాం రాకముందు భారత్లో ఉనికిలో ఉన్న భక్తిరూపాల వల్ల భక్తి ఉద్యమం పురుడు పోసుకుందని చెబితే అది మరీ అతిశయోక్తి కాజాలదు... భక్తి మార్మిక సంప్రదాయాలు, సూఫిజం మధ్య గొప్ప అతివ్యాప్తి, కలయిక ఉంది.’’ ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన విషయాలు కొన్ని దాని అపురూపమైన వివరాల్లో ఉన్నాయి. ‘‘వ్యభిచారులపై పన్ను విధించాలి’’ అని కౌటిల్యుడు విశ్వసించాడు. అది చాలా ప్రగతిశీలమైందని నేను చెబుతాను. ‘‘అశోకుడు తన సోదరులను చంపేశాడు. ఉన్న వారిలో మొత్తం 97 మందిని చంపేశాడు.’’ అంటే కళింగులకు చాలా కాలం క్రితమే ఆయన ఈ చంపడంలో మునిగివున్నాడు. అలాగే సిపా యిల తిరుగుబాటు ‘‘1857 మే 10న అపరాహ్న వేళ... దాదాపు 5 గంటల సమయంలో’’ మొదలైంది. అయితే అది మీరట్ కంటోన్మెంట్లో సాయంత్రం తేనీటికి కచ్చితంగా అంతరాయం కలిగించివుంటుంది. మన ప్రస్తుత ప్రధానికి సంబంధించి ఈ పుస్తకం రెండు అభిప్రాయాలను కలిగివుంది.›‘‘నరేంద్ర మోదీ తాను చేసిన అన్ని వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదు’’ అని చెబుతూనే, ‘‘ఆయన ఒక కొత్త విశ్వాసాన్ని, ఉల్లాసాన్ని తీసుకొచ్చారు’’ అని పొడుపుగా జోడించింది. అయితే ఆ తర్వాత, ఈ పుస్తకం ‘‘మోదీ నాయకత్వంలో మెజారిటీ వర్గ ఆధిపత్యం, మైనారిటీల పట్ల తీవ్ర అసహనం, అసమ్మతి వైపుగా ఒక సహజ ప్రవృత్తి బలపడిపోయింది. ఈ మెజారిటీ వైపు మలుపు మన సమాజాన్ని వేర్పాటుతత్వంతో విభజించివేసింది’’ అని అభిప్రాయపడింది. చివరగా, ఈ పుస్తకం చివరి వాక్యాన్ని చాలా తెలివిగా, కాకపోతే జిత్తులమారితనంతో రూపొందించారు.‘‘మార్పు, మథనానికి సంబంధించిన లోతైన, ప్రాథమిక ప్రవాహాలు భారత్ను ఒక కొత్త విధి రాత (ట్రిస్ట్ విత్ డెస్టినీ) వైపు లాగుతున్నాయి.’’ ఒక విరుద్ధమైన ఫలితాన్ని ముందుచూపుతో సూచిస్తూ, నెహ్రూ సుప్రసిద్ధ వాక్యాన్ని ఇక్కడ చమత్కారంగా ఉపయోగించారు. కరణ్ థాపర్ , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పుస్తక రూపంలో 'పొన్నియిన్ సెల్వన్' రచయిత కల్కి బయోగ్రఫీ
పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథా రచయిత, పత్రికా సంపాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన దివంగత కల్కి జీవిత చరిత్ర పుస్తకం రపంలో వెలువడనుంది. కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్ పుస్తకంగా తీసుకొస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎస్.చంద్రమౌళి కల్కీ పొన్నియిన్ సెల్వన్ సెల్వర్ పేరుతో కల్కీ జీవిత చరిత్రను రాశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలతోపాటు పొన్నియిన్ సెల్వన్ నవలకు సంబంధింన విశేషాలు ఉన్నాయి. సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు తొలి ప్రతిని కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత గొప్ప రచయిత కల్కి రచనలు తరాలకతీతంగా ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ఆయన రాసిన నవల ఆధారంగా రపొందింన పొన్నియిన్ సెల్వన్ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. దానికి రెండో భాగం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా కల్కీ జీవిత చరిత్ర పుస్తకంగా రావడం సరైన తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కొత్త విధానం.. ఇక పరీక్షల్లో చూసి రాయడమే.. ఎలాంటి అనుమానలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిపాటు పుస్తకాలు తిరగేయడం... ముఖ్యమైనవి బట్టీపట్టడం... ఆఖరులో పునశ్చరణతో హడావుడి చేయడం.. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన పరీక్ష విధానం. ఇందులో పరీక్ష హాల్లోకి చిన్న చిట్టీని కూడా అనుమతించరు. కానీ, ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షలు నిర్వహించింది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతించింది. గత నవంబర్లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్లో అకడమిక్ పుస్తకాన్ని చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పుస్తకాలు చూడకుండా 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సబ్జెక్టు పరీక్షలో కేవలం 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. ఇక నుంచీ ఇదే తరహా పరీక్ష విధానాన్ని మరికొన్ని సబ్జెక్టులకు విస్తరించాలనే యోచనలో అధికారులున్నారు. కాపీ కొట్టడం కాదు.. క్రియేటివిటీ పెంచడం చూచి రాస్తే మార్కులు రావా? రిజల్ట్ పెరిగితే గొప్పా? ఇలాంటి అనుమానులొస్తే పొరపాటే అంటున్నారు అధికారులు. ఇంతకాలం బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి, విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంచడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. పరీక్షకు మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలో ప్రశ్నలు అడగడంలోనే అసలు కిటుకు ఉంటుంది. ప్రశ్నలను నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో అడుగుతారు. క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నట్టు సమాధానాలు ఈ అకడమిక్ పుస్తకాల్లో నేరుగా దొరకవు. ఉదాహరణకు త్రికోణమితిని పాఠ్యాంశంలో పొందుపరిస్తే.. పరీక్షలో వచ్చే ప్రశ్న ఇదే మూస పద్ధతిలో ఉండదు. ఆ లెక్కను పూర్తిగా సాధన చేస్తే... సూత్రాల ప్రకారం అనుసరిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఒక రకంగా ఇది విద్యార్థి మరింత ఆలోచించి సమాధానం ఇవ్వగలిగేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు అంటున్నారు. చాప్టర్ మొత్తం చదవడమే కాకుండా, ఏ కోణంలోనైనా సమాధానం రాయగల నేర్పును ముందు నుంచే విద్యార్థి అలవర్చుకోవాలి. అప్పుడే ఓపెన్ బుక్ విధానంలో సమాధానం రాసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో బట్టీ విధానంలో ట్విస్ట్ చేసి ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఆలోచన దిశగా విద్యార్థి వెళ్లలేదని ఫలితాలను బట్టి తెలుస్తోందని అధికారులు అంటున్నారు. ఓపెన్ బుక్ విధానంపై ముందే అవగాహన కల్పించడం వల్ల వివిధ కోణాల్లో ఆలోచనాశక్తిని పెంచుకున్నారని చెబుతున్నారు. పరీక్షల నాణ్యత పెరుగుతుంది విద్యార్థి పట్టాతో బయటకు రావడం కన్నా... మంచి నైపుణ్యం, ఆలోచనాశక్తితో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరం మార్కెట్లో మంచి కేరీర్కు ఇదే దోహదపడుతుంది. ఓపెన్ బుక్ విధానంతో విద్యార్థి నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ సి.శ్రీనాథ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆలోచనకు పదును క్లోజ్డ్ బుక్ విధానానికి, ఓపెన్ బుక్ విధానానికి చాలా తేడా ఉంది. పుస్తకం దగ్గరున్నా, ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడానికి చాప్టర్ మొత్తం చదవాల్సి వచ్చింది. దీనిపై ముందే అవగాహన కల్పించడంతో సబ్జెక్ట్పై కమాండ్ తెచ్చుకున్నాం. బట్టీ పద్ధతి కాకుండా, మరింత ఆలోచించి సమాధానాలు రాశాం. మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సులువుగా జవాబులు రాయొచ్చనే విశ్వాసం పెరిగింది. – ఎన్.ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ విద్యార్థి, హైదరాబాద్ -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్లోని నమ్ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
కొన్ని సలహాలూ, సంఘటనలూ!
చాలామంది రాయరు గానీ, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ అనుభవాలను పుస్తకాలుగా తెస్తే, అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. అవి విలువైన పాఠాలు కూడా అవుతాయి. తాజాగా తన పదవీకాలపు జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చిన జాబితాలోకి భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన సి.రంగరాజన్ కూడా చేరారు. 1990లో దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గురించీ, చివరకు బంగారాన్ని తాకట్టుపెట్టి దానిలోంచి బయటపడిన ఘటన గురించీ ఆయన రాశారు. అప్పటి రాజకీయ వైఫల్యాన్ని కూడా బయటపెట్టారు. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా వివరించారు. గవర్నర్గా పనిచేసినప్పుడు రాజకీయ నాయకుల ముహూర్తాల సెంటిమెంట్లను ఆయన గమనించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, గవర్నర్లకు తమ అధికారాలు, పరిమితుల మీద ఉండవలసిన గ్రహింపు గురించి కూడా ఆయన విడమరిచారు. గవర్నర్లు తరచూ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది గమనార్హమైనది. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో ప్రకటించుకునే తరహా సంప్రదాయం మన దగ్గర పెద్దగా లేదు. మాంటెక్సింగ్ అహ్లూ్లవాలియా దీనికి ఒక మినహా యింపు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా తన దశాబ్ద కాలపు అనుభవాలను గురించి ఆయన రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా తన పదేళ్ల కాలం గురించి హమీద్ అన్సారీ సమగ్రమైన ఇంట ర్వ్యూను ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సి. రంగరాజన్... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్వల్పకాలం పాటు గవర్నర్ బాధ్య తలు నిర్వహించిన తన పదవీ కాలాల గురించిన రచనను(ఫోర్క్స్ ఇన్ ద రోడ్: మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్) ప్రచురించారు. అది ఎన్నో చక్కటి వివరాలతో, సంతోషకరమైన ఉపాఖ్యానాలతో కూడి ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్గా ఉన్నప్పుడు, 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఎంతో వివరంగా రాశారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాస్తూ, ‘‘ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సంప్రదించక తప్పని పరిస్థితి గురించి’’ పేర్కొంది. కానీ ‘‘ప్రభుత్వం తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు.’’ ఇది ‘‘రాజకీయ నాయకత్వ వైఫల్యమే’’ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆనాటి ‘‘పరిస్థితిలోని తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించకపోవడం, లేదా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) వద్దకు వెళ్లడానికి సైద్ధాం తికంగా విముఖత ప్రదర్శించడం’’ వల్ల చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిందని రంగరాజన్ రాశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ‘‘వేగంగా దిగజారిపోయింది’’ అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నాలుగు నెలల తర్వాత, ‘‘మన నిల్వలు... కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సమా నంగా ఉన్నాయి,’’ అని చెబుతూ ఆయన ఇలా కొనసాగిస్తారు: ‘‘పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందంటే, విదేశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మివేయాలని కూడా కొంత ఆలోచన సాగింది.’’ అలా అమ్మేయడానికి పరిగణించిన ఆస్తుల్లో జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒకటి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ‘‘డిఫాల్టర్గా ఉండటానికి కూడా సిద్ధమైంది... దీన్ని తప్పించుకోవడానికి చివరికి అదీ, ఇదీ అనకుండా ప్రతి విషయం గురించి కూడా ఆలోచించాం’’ అని రంగరాజన్ నాతో చెప్పారు. ఆ సమయంలో వారు ఎంపిక చేసు కున్న నిర్ణయాల్లో ఒకటి: 405 మిలియన్ డాలర్ల రుణం పొందడానికి గానూ, భారతదేశ బంగారు నిల్వల్లో 15 శాతం (ఇది 46.91 టన్నులకు సమానం) తనఖా పెట్టాలనుకోవడం! ఈ రోజు చూస్తే అది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ సమ యంలో ‘‘ఆ సొమ్ము చాలా కీలక మైంది... ఎగవేతను అడ్డుకోవ డానికి.’’ 1991 జూలై నాటి మరొక అద్భుతమైన కథ ఈ పుస్తకంలో ఉంది. అది – పీవీ నరసింహారావు ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించడం గురిం చినది. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అది రెండు దఫాలుగా జరిగింది. సి.రంగరాజన్ ఈ రెండో దఫా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఇక్కడ ఒక చిన్న నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తొలి విడత రూపాయి విలువను తగ్గించిన తర్వాత, దానిపై వచ్చిన తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందన చూసి ప్రధాని నరసింహారావు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో రెండో దఫా రూపాయి విలువ తగ్గింపును వాయిదా వేయాలని మన్మోహన్ సింగ్ను కోరారు. ఆ సందర్భంలో రంగరాజన్ చెప్పిన విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. రూపాయి విలువను రెండో దఫా తగ్గించిన రోజున (1991 జూలై 3) ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ఉదయం 9.30 గంట లకు రంగరాజన్కు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘పరిస్థితి ఎలా ఉంది?’’ అని మన్మోహన్ అడిగితే, ‘‘నేను జంప్ చేశాను’’అని రంగరాజన్ సింపుల్గా చెప్పేశారు. దాంతో మన్మోహన్ ‘‘అయితే సరే’’ అని చెప్పి సంభాషణను ముగించారు. ఆనాటి తన సమాధానం గురించి రంగరాజన్ నాకు చెబుతూ, రూపాయి విలువను తగ్గించడానికి ఆర్బీఐ కోడ్ భాష వాడిందని వివరించారు. ఆ కోడ్ ఏమిటంటే ‘హాప్, స్కిప్, అండ్ జంప్’. ‘నేను జంప్ చేశాను’ అనే సమాధానానికి ‘‘రెండో దశ రూపాయి విలువ తగ్గింపు ప్రక్రియ పూర్తయిందనీ, దాన్ని ఇక ఆపలేమనీ’’ అర్థం. రంగరాజన్ రాసిన పుస్తకం అయిదేళ్లు ఆయన గవర్నర్ పదవిలో ఉన్న రోజుల్లో చేసిన కొన్ని మంచి విషయాలను కూడా పొందుపర్చింది. ఈనాటి గవర్నర్లకు కొన్ని మంచి సలహాలను కూడా ఇది సూచించింది. ఒరిస్సాలో గవర్నర్గా ఉన్నప్పుడు భారత రాజకీయ నాయకులపై జ్యోతిష్యం ఎంత బలంగా ప్రభావం వేస్తోందో రంగరాజన్ కనుగొన్నారు. ఆనాడు ఒరిస్సా ముఖ్య మంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ కేవలం శుభ ముహూర్తాల్లో మాత్రమే గవర్నర్ని కలిసేవారట. ‘‘ఉదయం 11.13కు నేను మిమ్మల్ని కలుస్తాను’’ అని గమాంగ్ అనేవారని ఈ పుస్తకం చెబుతోంది. ఇక నేటి గవర్నర్లకు ఈ పుస్తకం ఇస్తున్న సలహా నిజంగానే ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గవర్నర్కి నచ్చకపోయిట్లయితే, ఆయన లేదా ఆమె ముఖ్య మంత్రితో నేరుగా చర్చించాలనీ, లేదా రాష్ట్రపతికి ఈ వ్యవహారంపై లేఖ రాయవచ్చనీ రంగరాజన్ తన పుస్తకంలో రాశారు. అంతకు మించి తన అసమ్మతిని, వ్యతిరేకతను గవర్నర్ బయటకు వెల్ల డించకూడదనీ, ప్రజా ప్రదర్శన చేయకూడదనీ సలహా ఇచ్చారు. ఈ మాటలు మమతా బెనర్జీ గానీ విన్నట్లయితే ఎంతో సంతోష పడతారు! గతంలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులను గవ ర్నర్లుగా నియమించినప్పుడు ‘‘కార్యాచరణలోకి దిగాలన్న దురద వారిలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని రంగరాజన్ అంటారు. ఆయన సలహా ఒకటే! అది ఏమిటంటే – ‘‘వారు తమ అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పక నేర్చుకోవలసి ఉంది... గవర్నర్లు తమకు గల అధికారాలను మాత్రమే కాకుండా తమ పరిమితులను కూడా అర్థం చేసుకోవలిసి ఉంటుంది.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో!
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో! -
కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?
గురజాడ వారి ‘కన్యాశుల్కం’ ఒక అపూర్వ నాటక శిల్పం. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతూనే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని ‘మానవవికాస వేదిక’ కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వనున్నారు. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, వారి సతీమణి ఇందిరాదేవిలకు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ జరగనున్న సమావేశంలో ‘కన్యాశుల్కం’ ప్రతులను అందివ్వనున్నారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలిచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలి పెట్టారు. లండన్లో మురికివాడల గురించి ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్ బెర్నార్డ్ షా ‘విడోవర్స్ హౌసెస్’ అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12వ తేదీన విజయనగరంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గుర జాడ ప్రదర్శించారు. (క్లిక్: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..) సమకాలీన సమస్యలపైన వచ్చిన తొలి నాటకంగా ‘కన్యాశుల్కం’ ప్రపంచ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. గిడుగు రామమూర్తికి బి.ఏ. లో సహ విద్యార్థి అయిన గురజాడ వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకోక ముందే, తన పాతికేళ్ల వయసులో వ్యవహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రాసి వ్యవహారిక భాషా ఉద్యమానికి బీజం వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కన్యాశుల్కాన్ని నిషేధించకపోయినా, 1929లో బాల్య వివా హాల నిషేధ చట్టం రావడానికి ‘కన్యాశుల్కం’ నాటకం దోహదం చేసింది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు వారి సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) – రాఘవ శర్మ -
She Is- Women In STEAM: స్ఫూర్తినిచ్చే సూపర్స్టార్స్.. ఆ 75 మంది మహిళలు..
అక్షరాలు అంటే వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలే కాదు... అగ్నిజ్వాలలు కూడా. ఆ వెలుగు ఎన్నో రకాల చీకట్లను పారదోలుతుంది. ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. స్ఫూర్తినిచ్చే ఎన్నో విజయాలు ఉన్నాయి... డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఎల్సా మేరి డిసిల్వా ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్)కు విస్తరణ ఈ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమేటిక్స్). సైన్స్ నుంచి సమాజసేవ వరకు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన డెబ్భై అయిదు మంది మహిళలను ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారు డిసిల్వా. పరిచయం అనడం కంటే వారి పర్సనల్, ప్రొఫెషన్ స్ట్రగుల్ను కళ్లకు కట్టారు అనడం సబబుగా ఉంటుంది. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వివిధ రంగాల మహిళలు... అదితి చతుర్వేది–టెక్నాలజీ పాలసీ ఆనంది అయ్యర్–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్ అంజలి మల్హోత్ర–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ అను ఆచార్య–హెల్త్ సైన్స్ అనుపమ్ కపూర్–హ్యూమన్ రిసోర్స్ అనుశ్రీ మాలిక్–ఎన్విరాన్మెంట్ సైన్స్ అపూర్వ బెడెకర్–మెడికల్ డివైజ్ అర్చన చుగ్–బయోలాజికల్ సైన్స్ ఆర్తి కశ్యప్–డిజైన్ అండ్ టెక్నాలజీ అజ్రా ఇస్మాయిల్–డిజైన్ అండ్ టెక్నాలజీ విజయలక్ష్మీ బిస్వాల్–హెల్త్ సైన్సెస్ బినేష్ పయట్టటి–ఎన్విరాన్మెంట్ సైన్స్ బిను వర్మ–ఎడ్యుకేషన్ బృంద సొమయ–ఆర్కిటెక్చర్చర్ చంద నిమ్బకర్–బయోలాజికల్ సైన్స్ చెర్లీ పెరైర–ఎన్జీవో దీప్తి గుప్త–ఇంజనీరింగ్ దర్శన జోషి–ఫిజిక్స్ మనిషా ఆచార్య–ఇన్నోవేషన్ రాఖీ చతుర్వేది–బయోలాజికల్ సైన్స్ శుభాంగి వుమ్బర్కర్–కెమికల్ సైన్స్ అర్చన శర్మ–ఇంజనీరింగ్ భారతి సింఘల్–బయోలాజికల్ సైన్స్ కల్పన నాగ్పాల్–ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రీతి షరన్–ఇంజనీరింగ్ షమిత కుమార్–ఎన్విరాన్మెంట్ సైన్స్ దుర్బసేన్గుప్త– బయోకెమిస్త్రీ ఏక్తా వివేక్ వర్మ–జెండర్ బేస్డ్ వాయిలెన్స్ గాయత్రి జోలి–డిజైన్ అండ్ టెక్నాలజీ గీత మెహత–డిజైన్ అండ్ టెక్నాలజీ గీతారాయ్–బయోలాజికల్ సైన్స్ జీవన్జ్యోతి పండ–బయోలాజికల్ సైన్స్ కైయిత్కి అగర్వాల్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ కరణ్ శైవ–సస్టేనబుల్ డెవలప్మెంట్ కవితా గోంసాల్వేజ్–డిజైన్ అండ్ టెక్నాలజి కిరణ్ బాలా–ఎన్విరాన్మెంట్ సైన్స్ కిరణ్ మన్రల్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ లిజీ ఫిలిప్–సివిల్ ఇంజనీరింగ్ మాధవీలత గాలి–సివిల్ ఇంజనీరింగ్ మిథాలి నికోర్–ఎకనామిక్స్ మోనాలి హజ్ర–ఎన్విరాన్మెంట్ సైన్స్ మోనాలీసా ఛటర్జీ–ఫార్మాస్యూటికల్ సైన్స్ నమ్రత రాణా–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ నందితాదాస్ గుప్త–ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నీలమ్–సోషల్ ఇంపాక్ట్ నిహారిక మల్హోత్ర–హెల్త్ సైన్స్ నిష్మ వాంగూ–నానోసైన్స్ అండ్ నానో టెక్నాలజీ పద్మ పార్థసారథి–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ప్రీతి అఘలయం–కెమికల్ ఇంజనీరింగ్ అర్పిత మోండల్–ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ జైదీప్ మల్హోత్ర–హెల్త్ సైన్స్, రాధిక–హెల్త్ సైన్స్ రంజని విశ్వనాథ్–కెమికల్ సైన్స్ రష్మీ పుట్చ–డిజైన్ అండ్ టెక్నాలజీ రీతూపర్ణ మండల్–సెమీ కండక్టర్స్ రుమ పాల్–హెల్త్ సైన్స్ సంఘమిత్ర బందోపాధ్యాయ–న్యూరోసైన్స్ షెలక గుప్త–కెమికల్ ఇంజనీరింగ్ శిలో శివ్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ శిల్పి శర్మ–ఎన్విరాన్మెంట్ సైన్స్ షీతల్ కక్కర్ మెహ్ర–సోషల్ ఇంపాక్ట్ శ్రుతి పాండే–ఆర్కిటెక్చర్ శ్యామల రాజారామ్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శిమ్మి దర్నిజ–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శ్రీదేవి ఉపాధ్యాయుల–కెమికల్ ఇంజనీరింగ్ సుసన్–బయోలాజికల్ సైన్స్ స్వర్ణలత జె– కమ్యూనిటి సర్వీస్ తృప్తిదాస్–ఎన్విరాన్మెంట్ సైన్స్ వందన ననల్–ఫిజిక్స్ వనమాల జైన్–డిజైన్ అండ్ టెక్నాలజీ వర్ష సింగ్–సైకాలజి విశాఖ చందేరె–క్లీన్ ఎనర్జీ యమ దీక్షిత్– క్లైమేట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ జైబున్నిసా మాలిక్ – కంప్యూటర్ సైన్స్. ‘ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్, డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసిన నేను వివిధ రూపాల్లో ఉండే పురుషాధిక్యతను చూశాను. మహిళ అనే కారణంతో వారి ప్రతిభను పట్టించుకోని వారిని చూశాను. రకరకాల అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం అయ్యాయి’ అంటోంది పుస్తక రచయిత్రి ఎల్సా మేరి డిసిల్వా. ‘షీ–ఈజ్’ బుక్సిరీస్లో ఇంకా ఎన్నో పుస్తకాలు రానున్నాయి. మహిళాశక్తిని ప్రపంచానికి చాటనున్నాయి. చదవండి: ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ -
ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది: దీప్తి నావల్
‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్సర్లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది. దీప్తి నావల్కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. 70 ఏళ్ల వయసులో... దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్సర్లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్సర్తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి. ఇంటి పేరు మార్పు దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్సర్లోని హాల్ బజార్లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం. దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్. 20 ఏళ్ల కృషి దీప్తి నావల్ పర్ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది. జపాన్లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్గా పని చేస్తూ రాజ్ కపూర్ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే. -
సినిమా కంటే ముందే పుస్తకరూపంలో ‘ప్యారీ’
మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్యారీ’. లక్ష్మణ్ అనే యువకుడు - ప్యారి అనే యువతి నడుమ నడిచిన ప్రేమకు సాక్షాత్కారమే ఈ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగానే ఈ ప్రేమకథను పుస్తకం రూపంలో ‘ప్యారి తారావలి ది ట్రూ స్టోరీ’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రజనీష్ దూబే రాసిన ‘ప్యారి - తారావలి ది ట్రూ లవ్ స్టోరీ’ అమెజాన్, ఫ్లిప్ కార్డ్, కిండిల్, ప్లే స్టోర్, గూగుల్ బుక్స్, కోబో, ఐ బుక్స్ వంటి మాధ్యమాల్లో లభ్యం కానుంది. ప్రేమ తాలూకు ఓ గొప్ప పార్శ్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ‘ప్యారి’ ప్రేమాస్పదులైన ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
భగ భగ మండే నిప్పుల కొలిమిలో వేసినా తగలబడదు
చరిత్రలో కనుమరుగు అయిన పుస్తకాలు ఎన్నో. చెదలు పట్టడమో, ప్రమాదాల్లో నాశనం అయిపోవడమో జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. ఇక్కడో పుస్తకం ఎంతో ప్రత్యేకం. మంటల్లో వేసిన కూడా తగలబడదు ఈ పుస్తకం. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?.. వెయ్యికిపైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా నాశనం కాదట!. మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని ప్రత్యేకమైన ఫైర్ఫ్రూఫ్ మెటీరియల్ని ఉపయోగించి ప్రింట్ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్ని ఉపయోగించి ఈ బుక్ను తయారు చేసినట్లు సమాచారం. ఈ అన్బర్నబుల్ బుక్ సెన్సార్షిప్కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో రూపొందించారు. ఈ పుస్తకం వేలంలో కోటి రూపాయలకు పైనే పలకింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును.. స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే 'పెన్ అమెరికా' సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట. ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదే . ఆ పుస్తక రచయిత అట్వుడ్ ఈ అన్బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్మెయిడ్స్ 'పెన్ అమెరికా' కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పుస్తకం చాలాసార్లు నిషేధించబడింది. అంతేకాదు బుక్ పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే పబ్లిషింగ్ సంస్థ, టోరంటోలోని రీథింక్ క్రియేటివ్ ఏజెన్సీ, ది గ్యాస్ కంపెనీ ఇంక్ అనే రెండు కంపెనీలు ఉమ్మడిగా ఈ అన్బర్నబుల్ బుక్ ప్రాజెక్ట్ని చేపట్టారు. దాదాపు 2200 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతకు గురైనప్పటికీ నాశనం కాదని, పైగా ప్రత్యేకమైన ఇంక్తో ముద్రించబడిందని బుక్ డిజైనర్లు వెల్లడించారు. అంతేకాదు ఒక కెనడా రచయిత ఫ్లేమ్ త్రోవర్తో పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: 14 ఏళ్ల టీనేజర్కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు ప్రవేశం లేదు) -
ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికీ సహించరని, మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉంటారని విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పారు. తాను రాసిన ‘‘మోదీ @20ః డ్రీమ్స్ మీట్ డెలివరీ’’ అనే పుస్తకంలో జై శంకర్ ఈ వివరాలను పేర్కొన్నారు. 2015లో తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సార్క్ దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని తనతో చెప్పిన మాటల్ని జైశంకర్ ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ‘ ‘నా అనుభవం, నా నిర్ణయం పట్ల మోదీకి ఎంతో విశ్వాసం ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ విషయంలో నాకు పలు జాగ్రత్తలు చెప్పారు. తన ముందు ప్రధానమంత్రుల్లా తాను ఉండడని, ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించనని చెప్పారు. ఉగ్రవాదం కట్టడిలో ఎలాంటి సందిగ్ధత ఉండకూదని మోదీ చెప్పారు’’ అని జై శంకర్ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. చదవండి: పాక్లో ఇద్దరు సిక్కుల కాల్చివేత -
వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. ఎంత అవమానకరం? మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు. 90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్చైర్ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి) సాయిబాబాను విడుదల చేయాలి: రాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు) -
ట్రంప్ నిర్వాకాలను బయటపెట్టే పుస్తకం
'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు. పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది. (చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు) -
మార్కెట్లోకి సోనాలికా పబ్లికేషన్స్ కొత్త బుక్ సిరీస్
ముంబై: సోనాలికా పబ్లికేషన్స్ ‘‘టేల్స్ ఆఫ్ డిఫరెంట్ టెయిల్స్’’ పేరుతో కొత్త బుక్ సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అనంత్ మిట్టల్, అతని తల్లి సురభి మిట్టల్ రచించిన ఈ పుస్తకంలోని కథలు మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు అద్దం పట్టేలా ఉన్నాయి. చిన్నారులను ఆకట్టుకునేలా కథనంలో పాత్రలతో పాటు జంతువులను కూ డా భాగం చేశారు. సోనాలికా గ్రూప్ సీఎస్ఆర్ డైరెక్టర్, సహ రచయిత సురభి మిట్టల్ మాట్లా డుతూ, పుస్తకంలో విలువలు, స్ఫూర్తి వంటి గొప్ప అంశాలను చర్చించామన్నారు. -
జీవప్రదాతలు పుస్తకావిష్కరణ
జీవన్ దాన్, నిమ్స్ హైదరాబాద్ విభాగంలో, సదాశయఫౌండేషన్ (గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా) ఆధ్వర్యంలో తీసిన జీవప్రదాతలు అనే ప్రత్యేక సంచికను గురువారం ఆవిష్కరించారు. డాక్టర్ స్వర్ణలత (జీవన్ దాన్ ఇంచార్జ్) పుస్తకావిష్కరణ చేశారు. ఈ పుస్తకంలో అవయవ, శరీరదానం గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దీటి వెంకటస్వామి (సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబెర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ గత 13సంవత్సరాలుగా చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. 500 నేత్రదానాలు, 70 శరీర, 65 అవయవదానాలు చేయడం అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, సెక్రటరీ లింగమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. -
ఆ రహస్యాలు చెప్పడం కోసం సింగర్కి రూ.112 కోట్లు
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో ఓ పుస్తక ప్రచురణ సంస్థ భారీ డీల్ కుదుర్చుకుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు పుస్తక రూపంలో వెలుగులోకి తీసుకురావడం కోసం ఆమెకు 15 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు) అప్పజెప్పేందుకు అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ ముందుకు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో ఆమెకు ఇవ్వడానికి కారణం ఏంటంటే... తన జీవితంలో చోటు చేసుకున్న కన్సర్వేటర్షిప్ గురించి అంతా బయట పెట్టేందుకు బ్రిట్నీ అంగీకరించడమే. ఈ పబ్లిషింగ్ హౌస్ విడుదల చేయబోయే బుక్లో బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలుంటాయట. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రి జేమిని స్పియర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని గతంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన లాస్ ఎంజిల్స్ కోర్టు.. గత ఏడాది నవంబర్లో తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చింది. బ్రిట్నీ జీవితంపై, ఆస్తిపాస్తుల ఆమె తండ్రికి ఎలాంటి నియంత్రణ ఉండబోదని కోర్టు వెల్లడించింది. ఫలితంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ ఏళ్ల కిందట న్యాయస్థానం విధించిన కన్సర్వేటర్షిప్ ఎట్టకేలకు రద్దైపోయింది. ప్రస్తుతం బ్రిట్నీ స్వతంత్రంగా జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఆమె కన్సర్వేటర్షిప్లో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను, తండ్రికి సంబంధించిన కొన్ని రహస్యాలను పుస్తక రూపంలో ప్రచురించేందుకు పలు ప్రచురణ సంస్థలు పోటీ పడినప్పటికీ యూస్లోని ఓ పబ్లిషింగ్ కంపెనీ రికార్డు స్ఘాయిలో రూ. 112 కోట్లు అప్పజెప్పి పుస్తకం హక్కులు కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్న బ్రిట్నీ.. ఎలాంటి రహస్యాలను బయటపెడుతుందో చూడాలి మరి. -
Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం..
సాక్షి, సిటీబ్యూరో: పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైవిధ్యభరితంగా.. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తకం మరోసారి వేడుక చేసుకుంటోంది. వైవిధ్యభరితమైన అంశాలపైన రూపొందించిన పుస్తకాలతో పాఠక మహాశయులకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. విభిన్న జీవన పార్శ్వాలను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలు ప్రదర్శనలో పుస్తకప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక మాద్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా మొదటి రోజే సందర్శకులతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. మరోసారి ‘చందమామ కథలు’ అనేక దశాబ్దాల పాటు తెలుగు పాఠకలోకాన్ని కట్టిపడేసిన చందమామ కథలు సంపుటాలుగా వెలువడ్డాయి. బాలల మనసు దోచుకొనే అద్భుతమైన కథలతో రూపొందించిన ఈ పుస్తకాలు మొత్తం 15 సంపుటాలుగా ముద్రించారు. 1950 నుంచి 2012 వరకు వచ్చిన కథలనన్నింటినీ ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేశారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ తదితర స్టాళ్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్రకు చెందిన 10 నుంచి 13వ స్టాల్ వరకు ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. చలం సమగ్ర సాహిత్యం.. చలం రాసిన పుస్తకాలన్నింటినీ 22 సంపుటాలుగా ముద్రించారు. ప్రియదర్శిని ప్రచురణ సంస్థకు చెందిన స్టాల్ నెంబర్ 112 లో ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. మైదానం, దైవమిచి్చన భార్య, అమీనా, చలం మ్యూజింగ్స్, స్త్రీ వంటి అనేక గ్రంధాలతో ఆ నాటి నుంచి నేటి వరకు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చలం సాహిత్యం అంతా ఒక్క చోట లభించడం విశేషం. చిందు ఎల్లమ్మ వేదిక.. పుస్తక ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన సాహిత్య వేదికకు ఈసారి యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ వేదికగా నామకరణం చేశారు. అలాగే మొత్తం ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణు మాధవ్ పేరు పెట్టారు. ♦ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కళారూపాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు. u యంగ్ రైటర్స్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా పుస్తకాలను ఆవిష్కరించలేకపోయిన వారికి సముచిత ప్రోత్సాహం ఉంటుంది. ♦పుస్తకం పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు సదస్సులు, చర్చలు ఉంటాయి. ♦ఈ నెల 22వ తేదీన పర్యావరణంపైన ప్రత్యేక సాహిత్య సదస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చారిత్రక నేపథ్యం... హైదరాబాద్ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. కానీ పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో అంటే 1948 నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ ప్రచురించిన పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకెళ్లాడు. 1961వరకు ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. హైదరాబాద్ నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు వచ్చాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రదర్శన ఆరంభం ఇలా.. ♦దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కేశవ మొమోరియల్ స్కూల్లో ప్రారంభించారు. ♦ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ♦ఆ నాటి నుంచి నేటి వరకు కథలు, నవలలు, గల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే అగ్రస్థానం. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్రావు వంటి ప్రముఖుల రచనలు ఇప్పటికీ హాట్కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. ♦‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావి తం చేస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఖడ్గసృష్టి వంటి గ్రంథాలకు ఇప్పుడూ అదే ఆదరణ ఉంది. ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది. కానీ న్యూజిలాండ్కు తీసుకెళ్లడం కష్టంకదా. చందమామ కథల సంపుటాలు తీసుకున్నాం. ఇప్పటి పిల్లలకు ఆ పుస్తకాలు చాలా అవసరం. – శ్రీలత మగతల, అధ్యక్షురాలు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పాఠకులకు నచ్చిన పుస్తకాలున్నాయి ఈసారి 260కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 2.5 లక్షల పుస్తకాలు అన్ని ప్రముఖ భాషలలో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కావలసిన అద్భుతమైన మెటీరియల్ ఉంది. అలాగే ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలను వారు కొనుక్కోవచ్చు. కవులు, రచయితల కోసం ఒక ప్రత్యేక స్టాల్ను కూడా ఏర్పాటు చేశాం. వారు అక్కడ స్వయంగా తమ పుస్తకాలను విక్రయించవచ్చు. – కోయ చంద్రమోహన్, బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి తెలుగు నవలల కోసం వచ్చాను తెలుగు నవలలపైన ఆసక్తితో వచ్చాను. తెలుగు భాషపైన పట్టు రావాలంటే సాహిత్యం చదవాలి కదా. ఈసారి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. బుక్ఫెయిర్ వారికి కృతజ్ఞతలు. – లహరి, దిల్సుఖ్నగర్ బైక్రైడింగ్..బుక్ రీడింగ్ బైక్ రైడింగ్ నా హాబీ. బైక్ పై చాలా దూరం వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో రోజంతా ఒక పుస్తకం చదువుకొని వస్తాను. చాలా హాయిగా ఉంటుంది. అందుకే నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేద్దామని వచ్చాను. – విశ్వేశ్వర్, ఓల్డ్సిటీ -
పుస్తకం హస్తభూషణం
‘వెర్బా వోలంట్, స్క్రిప్టా మానెంట్’ అని లాటిన్ సామెత. అంటే మాట అశాశ్వతం, రాత శాశ్వతం అని అర్థం. రోమన్ సెనేటర్ కేయస్ టైటస్ సెనేట్లో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన మాటే తర్వాతి కాలంలో సామెతగా నిలిచిపోయింది. మాటలదేముంది, తేలికగా గాలిలో కలిసిపోతాయి. అవి ఎంతోకాలం జ్ఞాపకం ఉండవు. మరపు మరుగున పడి కాలప్రవాహంలో కనుమరుగైపోతాయి. రాతలే చరిత్రలో శాశ్వత సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. అవి శిలా శాసనాలైనా కావచ్చు, మట్టి పలకలైనా కావచ్చు, తాళపత్ర, భూర్జపత్ర గ్రంథాలైనా కావచ్చు, అచ్చుయంత్రం వచ్చాక అందరికీ తేలికగా అందుబాటులోకి వచ్చిన పుస్తకాలైనా కావచ్చు, ఇప్పటి ఇంటర్నెట్ తరంలోని ఈ–పుస్తకాలైనా కావచ్చు– మాటలకు లిఖితరూపమైన అక్షరాలే శాశ్వతం. అలాంటి అక్షరాలను ఇముడ్చుకునే పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు, తరతరాలకు దిక్సూచికలు. మనిషి మాట నేర్చుకోవడం, మాటకు అక్షరరూపమిచ్చి లిపిబద్ధం చేయడం, అక్షరాలను తేలికగా నిక్షిప్తపరచుకునేందుకు తాళపత్ర, భూర్జపత్రాలు, రాగిరేకులు, తోలుపత్రాల పుస్తకాల దశను దాటి, ఆధునిక అచ్చుయంత్రాలతో ముద్రించిన పుస్తకాల వరకు ఎదగడం ఒక సుదీర్ఘ పరిణామక్రమం. రాత శాశ్వతత్వాన్ని గుర్తించినా, రాత పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చరిత్ర స్పష్టమైన ఆధారాలతో అందుబాటులో లేదు. ప్రాచీన ఈజిప్టు, మెసపొటేమియా, సింధులోయ, చైనా నాగరకతల ప్రజలకు వారి వారి లిపులు ఉండేవి. ఈ లిపులు వేటికవి స్వతంత్రంగా అభివృద్ధి చెందాయా, లేదా పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా అనేది తేల్చిచెప్పగలిగే ఆధారాలు లేవు. చాలామంది మేధావులు చరిత్రను పుస్తకాలకెక్కించారే తప్ప, పుస్తక చరిత్రను పుస్తకాలకెక్కించిన సందర్భాలు చాలా తక్కువ. వాట్ ఈజ్ బుక్ హిస్టరీ?’ పేరిట అమెరికన్ చరిత్రకారుడు రాబర్ట్ డార్న్టన్ 1982లో ఒక పరిశోధనా వ్యాసం రాశాడు. పుస్తక చరిత్ర రచనలో దీనినొక మైలురాయిగా పరిగణిస్తారు. పుస్తక చరిత్ర అధ్యయనానికి విధి విధానాలను రూపొందించిన వారిలో డార్న్టన్ ప్రముఖుడు. డార్న్టన్ సహా మరికొందరు చరిత్రకారుల కృషి ఫలితంగా కొన్ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో పుస్తక చరిత్ర అధ్యయనం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. మన దేశంలో ఏ ఒక్క విశ్వవిద్యాలయమూ దీనిని పట్టించుకున్న దాఖలాల్లేవు. భారతీయ భాషల్లో పుస్తకచరిత్ర గురించి చెదురు మదురు రచనలు వచ్చినా, అవన్నీ అచ్చు పుస్తకాల చరిత్రకే పరిమితమయ్యాయి. ఇప్పుడీ పుస్తక ప్రస్తావన ఎందుకంటే, మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది. జనవరి మొదట్లో విజయవాడలోనూ పుస్తకాల పండగ ఉంది. పుస్తక ప్రదర్శనలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా, అవి పుస్తక ప్రియులకు వేడుకలే! ‘కరోనా’ కారణంగా ఏడాది అంతరాయం తర్వాత ఈసారి జరిగే పుస్తక ప్రదర్శనల్లో పాఠకుల ప్రతిస్పందన రెట్టింపు స్థాయిలో ఉంటుందని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో తొలి పుస్తక ప్రదర్శన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. ఐదువందల ఏళ్లకు పైగా ఫ్రాంక్ఫర్ట్లో ఏటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతూనే ఉంది. మన దేశంలో కోల్కతాలో గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఏటా జరుగుతోంది. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలు మన దేశంలోని మరిన్ని నగరాల్లో కూడా నిర్వహించేట్లయితే, పుస్తక ప్రియుల జ్ఞానతృష్ణ మరింతగా తీరగలదు. ‘కరోనా’ కాలంలో ప్రజల్లో పఠనాభిలాష పెరిగినట్లు రకరకాల గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతికత పెరిగి, ఈ–పుస్తకాలు, ఆడియో పుస్తకాలు వంటివి అందుబాటులోకి వచ్చినా, మన దేశంలో అచ్చుపుస్తకాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, ‘కరోనా’ కాలంలో గణనీయంగా పెరిగింది. పుస్తకాల అమ్మకాలు కూడా పెరిగాయి. ‘కరోనా’ లాక్డౌన్ కాలానికి ముందు పాఠకులు వారానికి సగటున తొమ్మిది గంటల సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే, లాక్డౌన్ కాలం నుంచి ఈ సమయం పదహారు గంటలకు పెరిగిందని ‘అమెజాన్’ అధ్యయనంలో తేలింది. గడచిన ఏడాది కాల్పనిక సాహిత్యానికి చెందిన పుస్తకాల విక్రయాల్లో 21.4 శాతం, కాల్పనికేతర సాహిత్య పుస్తకాల్లో 38.3 శాతం పెరుగుదల నమోదైనట్లు ‘నీల్సెన్’ నివేదికలో వెల్లడైంది. పుస్తకాలకు మంచిరోజులు మళ్లీ మొదలయ్యాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం.‘లాక్డౌన్ కాలంలో జనాలకు బాగా తీరిక దొరికింది. టీవీ సీరియళ్లు, ఓటీటీల్లో నానా సినిమాలు, వెబ్సిరీస్లు చూసి చూసి విసిగి వేసారిన జనం ఈ కాలంలో నెమ్మదిగా వివిధ కళల్లో తమ ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకోవడం వైపు, పుస్తక పఠనం వైపు మళ్లారు. దాని ఫలితంగానే పుస్తక పఠనం మళ్లీ పుంజుకుంది’ అని ‘సేజ్’ పబ్లికేషన్స్ ఇండియా డైరెక్టర్ ఆర్తీ డేవిడ్ అభిప్రాయపడ్డారు. లక్షలాది ప్రాణాలను కబళించిన ‘కరోనా’ మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నా, పుస్తక పఠనం విషయానికొస్తే దీనివల్ల కొంత మేలు కూడా జరిగింది. ‘కరోనా’కు ముందు బిజీ బిజీ జీవితాల్లో పుస్తకాలకు దూరమైన జనాలు మళ్లీ పుస్తకాలను చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు. తమ అభిరుచులకు సంబంధించిన పుస్తకాలకోసం అన్వేషణ సాగించి మరీ కొనుగోళ్లు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. పాఠకులలో వచ్చిన ఈ మార్పు రచయితలకు, ప్రచురణకర్తలకు కొత్త ప్రోత్సాహాన్నిస్తోంది. హైటెక్ అరచేతుల్లో స్మార్ట్ఫోన్లే అలంకారంగా మారిపోయిన ఈ కాలంలో ఇదొక శుభ పరిణామం. ‘పుస్తకం హస్తభూషణం’ అనే నానుడి మళ్లీ నిజమవుతోంది. -
మహిళా మావోయిస్టుల జీవిత చరిత్రపై పుస్తకం
చర్ల: ప్రజాయుద్ధంలో 2005 నుంచి 2021 వరకు అసువులుబాసిన మహిళా అమరవీరుల జీవిత చరిత్రపై మావోయిస్టులు పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఓ లేఖ ద్వారా వెల్లడించారు. 178 పేజీల పుస్తకం పీడీఎఫ్ను కూడా విడుదల చేశారు. దశాబ్దాల పోరు చరిత్రలో ఎందరో మహిళా గెరిల్లాలు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ప్రజాఉద్యమ చరిత్రలో తమ చెరగని ముద్రవేశారని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. త్యాగధనుల జీవిత చరిత్రలు సమాజానికి తరగని గనిలాంటివని భావిస్తూ ఈ పుస్తకాన్ని తెచ్చామని చెప్పారు. గతంలోనూ 2005లో మహిళా మావోయిస్టుల అమరులపై ఎన్టీ ఎస్జడ్సీ (ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ) ఒక పుస్తకాన్ని ప్రచురించగా, ఇప్పుడు రెండో పుస్తకాన్ని వెలువరించినట్లు జగన్ తెలిపారు. -
పెళ్లిపీటలపై అరుదైన ఘటన
మండ్య(బెంగళూరు): ఈ ఇంటర్నెట్ యుగంలో మంగళవారం ఒక పెళ్లివేడుకలో వధూవరులు పుస్తకావిష్కరణ గావించి సాహిత్యానికి పెద్దపీట వేసిన అరుదైన ఘటన మండ్యలో చోటు చేసుకుంది. సాహితీవేత్త త.నా.శి. జగన్నాథ్ రచించిన పుస్తకాన్ని నూతన జంట వినుత– సంతోష్లు ఆవిష్కరించి అతిథులకు కానుకగా అందజేశారు. మరో ఘటనలో.. పర్యావరణ రక్షణపై సమీక్ష హోసూరు: పర్యావరణ పరిరక్షణపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖాధికార్లతో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ జయచంద్రభానురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శుద్ధీకరించిన తాగునీటి వినియోగం, పరిశ్రమల్లో కాలుష్య నివారణ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, వర్షపునీరు నిల్వ ప్రాంతాల పరిరక్షణ వంటి విషయాలపై వివిద శాఖాధికార్లతో చర్చించారు. హోసూరు ఆర్డీవో తేన్మోళి, అధికారులు సెంథిల్ కుమార్, పరమశివం, వేడియప్పన్, మరియ సుందరం పాల్గొన్నారు. చదవండి: గ్రామంలో నాగుపాము కలకలం -
‘అప్పుడే పాక్కి గట్టిగా సమాధానం చెప్పుండాల్సింది’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమితో పాటు కాంగ్రెస్ పలు చోట్ల గెలుపొంది తిరిగి పుంజుకుంటోందన్న సమయంలో తివారీ ట్వీట్ దుమారేన్ని రేపాయి. ఆయన రాసిన కొత్త పుస్తకం ‘10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్ సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా’ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని రూపా బుక్స్ ప్రచురిస్తోంది. ఆ పుస్తకంలో.. ముంబై ఉగ్రదాడులు గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2008, సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడులు జరిగిన వెంటనే పాక్ చర్యలకు భారత ధీటుగా బదులిచ్చుంటే బాగుండేదని తివారి అభిప్రాయపడ్డారు. కిరాతకంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను హతమార్చారు. అలాంటి పరిస్థితుల్లో మన్మోహన్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, ఆ సమయంలో కేవలం మాటలకే పరిమితం అయ్యిందని, తివారి తన పుస్తకంలో తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ ఎదుర్కొన్న జాతీయ భద్రతా అంశాలను కూడా తన పుస్తకంలో వెల్లడించారు మనీష్ తివారి. Happy to announce that my Fourth Book will be in the market shortly - '10 Flash Points; 20 Years - National Security Situations that Impacted India'. The book objectively delves into every salient National Security Challenge India has faced in the past two decades.@Rupa_Books pic.twitter.com/3N0ef7cUad — Manish Tewari (@ManishTewari) November 23, 2021 చదవండి: Viral Video:ట్రైన్లో సీట్ దొరకలేదు.. ‘ఓరి నీ తెలివి తగలెయ్య’ -
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
నిబద్ధతకు చిరునామా సీఎం జగన్
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): నిబద్ధతకు నిలువుటద్దంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలుస్తారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఏయూ టీఎల్ఎన్ సభా మందిరంలో డాక్టర్ జీకేడీ ప్రసాద్ వ్యాస సంకలనం ‘జనం కంటిరెప్ప జగన్’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పుస్తక రచయిత జీకేడీని అభినందించారు. అధికార భాషా సంఘం సభ్యుడు, ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ రెండేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలనపై విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనంగా పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్ మాట్లాడుతూ.. వారి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేఘం వర్షాన్ని, విత్తు పంటని, వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ మోహన రెడ్డిని మనకు ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ పరిపాలన అందిస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్ జీకేడీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పరిపాలనపై ప్రత్యేక కవితా సంపుటిని త్వరలో తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలపై కవితలు ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తమ కవితలకు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. సంబంధిత పోస్టర్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్ చైర్మన్ కె.వెస్లీ, ఏయూ హెచ్ఆర్డీసీ సంచాలకులు ఆచార్య ఎన్ఏడీ పాల్, న్యాయ కళాశాల ఆచార్యులు డి.సూర్యప్రకాశ రావు, పుస్తక ప్రచురణకర్త, బీహెచ్.ఎస్.ఆర్ అండ్ వి.ఎల్ డిగ్రీ కళాశాల సెక్రటరీ–కరస్పాండెంట్ డి.సువర్ణరాజు పాల్గొన్నారు. -
ఖుర్షీద్ పుస్తకంపై రగడ
న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ‘సన్రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పేరిట రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. బుధవారం విడుదలైన ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా సెగలు రాజేస్తున్నాయి. సనాతన ధర్మం, ప్రాచీన హిందూవాదంతో కూడిన హిందూత్వం పక్కకుపోయిందని, ప్రస్తుతం హిందూత్వం అనేది జిహాదీ ఇస్లామిక్ సంస్థలైన ఐసిస్, బోకో హరాంల మాదిరిగా మారిపోయిందని పుస్తకంలో ఖుర్షీద్ ఆక్షేపించారు. ఇప్పుడున్నది అతివాద హిందూత్వం అని పేర్కొన్నారు. ఖుర్షీద్పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వివేక్ గార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా మండిపడ్డారు. అయోధ్య తీర్పుపై ఖుర్షీద్ రాసిన పుస్తకం ప్రజల మతపరమైన మనోభావాలను గాయపర్చేలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. సోనియా, రాహుల్ ఆదేశాలతోనే ఖుర్షీద్ పుస్తకం రాశారని గౌరవ్ ధ్వజమెత్తారు. పుస్తకంలో సల్మాన్ అభిప్రాయాలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఖండించారు. హిందూత్వను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో పోల్చడం సరైంది కాదని, అది వాస్తవ దూరమని పేర్కొన్నారు. అతిశయోక్తులు వద్దన్నారు. -
బుల్లి భగవద్గీత.. చదరపు సెంటీమీటరు పుస్తకంలో..!
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు. -
‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలపై రామశాస్త్రి రచించిన ‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కె.విశ్వనాథ్ చేతుల మీదగా ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణలో సభలో పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ, విశ్వనాథ్ అంటే అందరికీ ఉండే అభిమానం, ప్రేమ.. రచయిత రామశాస్త్రి విషయంలో భక్తిగా మారిందన్నారు. విశ్వనాథ్ సినిమాలని పరమ పవిత్రమైన మనస్సుతో చూసి, పరిశీలించి, పరీక్షించి, పరామర్శించి, పరవశం చెంది ఈ పుస్తకం రాశారన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. తన చిత్రాల మీద సమగ్రమైన థీసిస్ వంటి రచన చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పుస్తకం రాయటం ఎంతో కష్టమైన పని అన్నారు. -
ఆ పుస్తకం నన్ను ఎంతగానో కదిలించింది: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రచయిత పెద్దింటి అశోక్కుమార్ రాసిన ‘గుండెలో వాన’ తనను కదిలించిందని మంత్రి కె.తారక రామారావు శనివారం ట్వీట్ చేశారు. ‘గుండెలో వాన’లోని కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను. మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్లు రాశారు పెద్దింటి అశోక్కుమార్. రెం డు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు. కంగ్రాట్స్ అన్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కథకుడిగా, నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన పెద్దింటి అశోక్కుమార్ గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటవాసి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సినిమాలకు మాటలు రాస్తున్నారు. -
బండ బూతులు.. ఎలన్ మస్క్కు ఘోర అవమానం!
వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలితోనే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. అయితే మరో దిగ్గజ కంపెనీ సీఈవో చేతిలో మస్క్ ఘోర అవమానం పాలయ్యాడనే వార్త ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో జోరుగా షికార్లు కొడుతోంది. ఇంతకీ మస్క్ను బండ బూతులు తిట్టింది ఎవరో కాదట. యాపిల్ సీఈవో టిమ్ కుక్. అది ఎందుకు జరిగిందంటే.. కాలిఫోర్నియా: చాలా కాలం క్రితం టెస్లాను విలీన ప్రతిపాదన యాపిల్ వద్దకు వచ్చింది. అయితే ఆ డీల్ అనుకున్న విధంగా నడవలేదు. కారణం.. ఆ డీల్ ఓకే కావాలంటే తనను యాపిల్కు సీఈవోగా ప్రకటించాలని మస్క్ కోరాడట. అంతే ఆ మాటతో ఉగ్రుడైన కుక్ .. మస్క్ను బండబూతులు తిట్టాడని, ‘F’ పదం చాలాసార్లు వాడాడని, కోపంగా ఫోన్ పెట్టిపడేశాడని సమాచారం. ఈ మేరకు ‘ది వాల్ స్స్ర్టీట్ జర్నల్’ రైటర్ టిమ్ హగ్గిన్స్ రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ అనే బుక్లో వాళ్లిద్దరి మధ్య సంభాషణలకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావించాడు. అయితే హగ్గిన్స్ రాతలను ఎలన్ మస్క్, టిమ్ కుక్లు ఖండించారు. తాను కుక్ అసలు ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఎలాంటి ప్రత్యుత్తరాలు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు ఎలన్ మస్క్. అయితే ఒకానొక దశలో టెస్లాను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానని, కానీ, కలవడానికే ఆయన నిరాకరించాడని మస్క్ గుర్తు చేసుకున్నాడు. ఇక కుక్ కూడా మస్క్ లాగే స్పందించాడు. ‘ఎలన్తో మాట్లాడాలని నేనేప్పుడు అనుకోలేదు. కానీ, అతను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఆ టైంకి టెస్లా విలువ.. ఇప్పుడున్న విలువలో 6 శాతం మాత్రమే ఉంది. బహుశా అందుకే ఆయనకి(కుక్) ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. నాన్ సెన్స్.. ఇలాంటి వాళ్ల రాతలు పనికి మాలినవి అంటూ హిగ్గిన్స్పై మండిపడ్డాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే మోడల్ ఎక్స్ అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత టెస్లా ఘోరమైన ఆర్థిక నష్టాల్ని చవిచూసింది. దీంతో 2016లో 60 బిలియన్ డాలర్ల ఒప్పందంతో యాపిల్కు టెస్లాను అమ్మే ప్రయత్నం చేశాడు మస్క్. అయితే ఆ డీల్ టైంలో ఇద్దరి మధ్య ‘ఘర్షణ వాతావరణంలోనే’ ఏదో జరిగిందనే వార్తని ఆనాడు ప్రముఖ మీడియా హౌజ్లు అన్నీ ప్రకటించాయి. అయితే ఆనాడు జరిగింది ఇదేనంటూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హగ్గిన్స్ ఆ ఫోన్ సంభాషణను బయటపెట్టడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. Higgins managed to make his book both false *and* boring 🤣🤣 — Elon Musk (@elonmusk) July 30, 2021 -
రచయితలో మానవత్వం, మాతృత్వం రెండూ ఉండాలి
ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటున్నామని, కానీ తిరిగి ఏమీ ఇవ్వడంలేదని ప్రముఖ రచయిత భువనచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు - 4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు జులై 17న సోషల్ మీడియా వేదికగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజులకు భువన చంద్ర ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా యండమూరి వీరేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ డా తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశాన్ని డాక్టర్ వంశీ రామరాజు నిర్వహించారు. -
కమలా హ్యారిస్ స్ఫూర్తితో పుస్తకం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నిక కావడంతోపాటు అమెరికాలో భారత సంతతి ప్రజలు సంఖ్యాపరంగా తక్కువే అయినా, పలుకుబడి కలిగిన వర్గంగా ఎదిగిన తీరుపై ఒక పుస్తకం వెలువరించేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం ఇందుకోసం ముందుకు వచ్చింది.‘అమెరికాకు వచ్చి స్థిరపడిన మొదటి రెండుతరాల వారి ఆశలు, ఆశయాలకు కమలా హ్యారిస్ ప్రతీక. దేశ ఉపాధ్యక్షురాలి స్థాయికి కమల ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఆమె పడిన కష్టం, ఎదురైన ఆటంకాలు, ఆమె విజయానికి భారత సంతతి ప్రజలు చేసిన కృషి వంటివి ఈ పుస్తకంలో ఉంటాయి’ అని ఈ పుస్తక రచయితల్లో ఒకరు, ప్రముఖ అమెరికన్– ఇండియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎంఆర్ రంగస్వామి వెల్లడించారు. ‘కమలా హ్యారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ అనే ఈ పుస్తకంలో అమెరికాలో భారత సంతతి ప్రజలు స్వయం కృషితో ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.40 లక్షల వరకు భారతీయ అమెరికన్లుండగా, అందులో 18 లక్షల మంది అర్హులైన ఓటర్లున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలు, మొట్టమొదటి దక్షిణాసియా సంతతి అమెరికన్గా కమలా హ్యారిస్(56) చరిత్ర సృష్టించారు. ఆమె తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్, తల్లి చెన్నైకు చెందిన శ్యామలా గోపాలన్. -
వామ్మో కరీనా పుస్తకం.. అమెజాన్లో ఓ రేంజ్ అమ్మకాలు
ముంబై: ఒకప్పుడు తన అందం, అభినయంతో బాలీవుడ్లో అగ్రతారగా కొనసాగిన అందాల భామ కరీనా కపూర్ తాజాగా మరోసారి సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే, అప్పుడు నటనతో ఆకట్టుకుంటే .. తాజాగా ఓ రచయిత్రిగా ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీపై కరీనా రాసిన పుస్తకం అభిమానులతోపాటు అందరి మనసులను దోచేసింది. ఇందుకు విపరీతంగా ఈ పుస్తకం అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. కరీనా ప్రెగ్నెన్సీ సమయంలో తన అనుభవాలను పంచడం ద్వారా తల్లులందరికీ సహాయపడుతుందనే ఉద్దేశ్యంతో ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకం రాసింది. ఈ పుస్తకాన్ని శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. దీని కోసం అమెజాన్లో ఆర్డర్లు వెల్లువలా వస్తున్నాయి. దాంతో సేల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారీగా ఆర్డర్లు సాధించిన పుస్తకంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ నిలిచింది. ఈ పుస్తకంలో ప్రత్యేకతల విషయానికొస్తే.. భారత స్త్రీ గైనాకాలజిస్ట్ నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అయిన ఎఫ్ఓజీఎస్ఐ చే ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ ధృవీకరించబడింది. మరోకటి.. ఇందులో పలు నిపుణుల సలహాలను కూడా కరీనా చేర్చింది. ఈ పుస్తకం ద్వారా కరీనా తనలోని రచయిత్రిని నిద్ర లేపిందనే చెప్పాలి. మార్కెట్లోకి విడుదలైన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ హాట్ కేకులా అమ్ముడై పాపులర్ రైటర్స్కు సైతం షాక్ ఇచ్చింది. పుస్తక లాంచ్ సందర్భంగా ఆమె ఇది తన మూడో బిడ్డ లాంటిదని వ్యాఖ్యానించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కరీనా కపూర్ ఖాన్ అమీర్ ఖాన్ సరసన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ లో కనిపించనున్నారు. ఆమె కరణ్ జోహార్ పిరియాడిక్ డ్రామా ‘తఖ్త్’లో నటిస్తోంది. -
‘మూడో బిడ్డను’ పరిచయం చేసిన కరీనా కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన పుస్తకాన్ని లాంచ్ చేశారు. తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ఆమె ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక విధంగా ఇది తన మూడో బిడ్డ లాంటిదని కరీనా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైందన్నారు. వంటగదిలో అవెన్ లోంచి ఈ బుక్ హాట్ హాట్ కాపీని బయటకు తీయడం విశేషం. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి మానసిక, శారీరక అనుభవాలు, కష్ట నష్టాలను, పలువురి నిపుణులు సలహాలు, సూచనలను ఇందులో పొందుపర్చినట్టు ఇన్స్టా పోస్ట్లో తెలిపారు. అలాగే తన పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు. కరీనా కపూర్ 2020లో తన మొదటి బిడ్డ తైమూర్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా కరీనా 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండేలా కీలకమైన చిట్కాలను, సమాచారాన్ని ఇందులో రాయబోతున్నట్టు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డ పుట్టాడు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
ఒకానొక సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి: కబీర్ బేడి
న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్ వీడియో చాట్లో ముచ్చటించారు. కబీర్ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు. కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి లేచాను. లైఫ్లో ఫెయిల్యూర్ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by ALAYA F (@alayaf) చదవండి: తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు -
తాప్సీ ఫేవరెట్ బుక్ ‘పర్వీన్బాబీ: ఏ లైఫ్’
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన తాప్సీ పన్ను ‘గేమ్ ఓవర్’ ‘తప్పడ్’ ‘బద్లా’... మొదలైన సినిమాలతో బాలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి పర్వీన్బాబీ: ఏ లైఫ్ బుక్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... చిత్రమేమిటంటే బాబీ గురించి మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఏమీ తెలియదు! గాసిప్ల నుంచి ఆమె జీవితాన్ని కాచి వడబోయలేం కదా! ఏదో ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి కదా.... సరిగ్గా ఈ ప్రయత్నమే పర్వీన్బాబీ: ఏ లైఫ్ బుక్. ఫిల్మ్ జర్నలిస్ట్ కరిష్మ ఉపాధ్యాయ్ ఈ పుస్తకాన్ని రాశారు. తన రిసెర్చ్లో భాగంగా పాత ఇంటర్య్వూలను సేకరించడంతో పాటు బాలీవుడ్ ప్రముఖులు డానీ, కబీర్బేడి, మహేష్భట్లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అనే భయంతో మొదట మాట్లాడడానికి నిరాకరించారు చాలామంది. వారిని ఒప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. సినిమా వ్యక్తులనే కాదు అహ్మదాబాద్లో బాబీ చదివిన కాలేజికి వెళ్లారు. ఆమెకు పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడారు. కెరీర్ మొదలైన రోజుల్లో బాబీ నటించిన ‘చరిత్ర’ కమర్శియల్ సినిమా ఏమీ కాదు. ఒక బాధిత యువతి పాత్రలో ఇందులో నటించింది. ‘ఇందులో నటించిన అమ్మాయికి గర్వం తలకెక్కపోతే భవిష్యత్లో మంచి నటి అవుతుంది’ అని రాసింది ఒక పత్రిక. ఆమెకు గర్వం తలకెక్కిందా లేదా అనేది వేరే విషయంగానీ, బాలీవుడ్ను ఊపేసిన కథానాయికగా ఎదిగింది. గ్లామర్డాల్గా మాత్రమే సుపరిచితమైన బాబీలో మరోకోణం...ఆమె గుడ్ స్టూడెంట్. మంచి చదువరి. రచనలు చేస్తుంది. పెయింటింగ్స్ వేస్తుంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిస కావడమే ఆమె మానసిక సమస్యలకు కారణమనే వాదాన్ని కరిష్మ ఖండిస్తారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లు అపోహలు, వాస్తవాలను వేరు చేసే క్లోజప్ వెర్షన్ ఈ పుస్తకం. -
చందమామ రావే... చక్కని పుస్తకం తేవే!
పిల్లలు టీవీలకే అతుక్కుపోతున్నారు, కంప్యూటర్గేమ్స్లోనే మునిగిపోతున్నారు...ఇవి నిజాలు అయితే కావచ్చుగానీ సంపూర్ణ నిజాలు మాత్రం కాదు. ఎందుకంటే పుస్తకం మళ్లీ పిల్లల దగ్గరికి నడిచొస్తుంది. పిల్లలు పుస్తకం దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళుతున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చంద్ర శ్రీవాస్తవ అనే టీచర్ ఉన్నారు. శ్రీవాస్తవ స్కూటర్ చప్పుడు ఏ పల్లెలో వినిపించినా పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారు. ఎందుకుంటే ఆ స్కూటర్ ఎన్నో పుస్తకాలను మోసుకు వస్తుంది. పిల్లలు వాటిని చదివి తిరిగి భద్రంగా ఇచ్చేస్తారు. దక్షిణ కశ్మీర్ లో దేవిపుర అనే గ్రామంలో పాడుబడిన బస్స్టాండ్ ఉంది. అక్కడ పనిచేసే ఆర్మీజవాన్లు దాన్ని పిల్లల లైబ్రరీగా మార్చారు. ఎటు చూసినా చెట్టు మీద వాలిన సీతకోకచిలకల్లా పిల్లలు! తాము పుస్తకాలు చదువుకోవడమే కాదు తమకు నచ్చిన పుస్తకాల గురించి ఆసక్తిగా స్నేహితులకు చెబుతుంటారు. ‘పిల్లల కాలక్షేపం కోసం ఇది ఏర్పాటు చేయలేదు. పుస్తకాలు చదివే మంచి అలవాటు ను వారిలో పెంపొదించాలని చేశాం. ఇందుకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది’ అని సంబరపడుతున్నారు సైనికులు. ఉత్తరాఖండ్లో నానకమట్ట అనే చిన్న ఊళ్లో పిల్లలే పూనుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి స్వచ్ఛంద సంస్థలు పుస్తకాల రూపంలో వారికి సహాయం అందిస్తున్నాయి. ఆరుబయట పచ్చటి గడ్డిలో పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం చూస్తే ఆహా! అనిపిస్తుంది. ఢిల్లీ పోలిస్ లైబ్రరీ వారు మురికివాడల్లోని పేదపిల్లలకు కథలు, స్ఫూర్తిదాయకమైన జీవితచరిత్ర పుస్తకాలు అందిస్తున్నారు. పిల్లలు వాటిని పోటీపడి మరీ చదువుతున్నారు. ‘పిల్లల్లో మంచివిలువలు రూపుదిద్దుకోవడానికి పుస్తకాలు దోహదం చేస్తాయి’ అంటున్నారు నిర్వాహకులు. ఒడిశాలోని ఒక ఫారెస్ట్పార్క్లో పిల్లల కోసం ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. పిల్లలు ఇక్కడికి రాగానే ఎగిరి గంతేస్తారు. రంగురంగుల బొమ్మల పుస్తకాలు చదివి సంతోషిస్తారు. ఇక మన హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్లు స్కూల్ బస్సులను పిల్లల గ్రంథాలయాలుగా మార్చి ముఖ్యమైన ప్రాంతాల్లో తిప్పుతున్నారు. ‘పాఠ్యపుస్తకాలకే వాళ్లకు టైమ్ సరిపోవడం లేదు. ఇక బయట పుస్తకాలేం చదువుతారు’ అని మనకు మనమే చెప్పుకోవడం కాకుండా పిల్లలకు పుస్తకం రుచి ఒక్కసారి చూపిస్తే అది ఎంత మంచి ఫలితం ఇస్తుందో చరిత్ర నిరూపించింది. నిరూపిస్తూనే ఉంటుంది. మనదే ఆలస్యం! చదవండి: సముద్ర సదస్సుకు నైన్త్ క్లాస్ యష్మి.. -
ఆమె పేరు వింటే శత్రువులకి దడ
తెలుగు సినిమా ‘లోఫర్’తో కెరీర్ మొదలుపెట్టిన దిశా పటానీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎంఎస్ ధోని:ది అన్టోల్డ్ స్టోరీ’, యాక్షన్ ఫిల్మ్ ‘బాఘీ’లతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరో ఫిల్మ్స్ ఇష్టపడే దిశకు నచ్చిన పుస్తకం ఏ లైఫ్ ఇన్ సీక్రెట్స్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... టైటిల్ కింద కనిపించే ట్యాగ్లైన్ ‘ఆట్కిన్స్ అండ్ ది మిస్సింగ్ ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ వార్–2’ చూసిన తరువాత పుస్తకం గురించి స్థూల అవగాహన వస్తుంది. ఎవరీ ఆట్కిన్స్? నాజీ గూఢచారి హ్యూగో బ్లేచెర్ మాటల్లో....‘నన్ను ఇంటరాగెట్ చేసిన వాళ్లలో ఒకరు ఆట్కిన్స్. మిగతా అధికారులతో పోల్చితే పోష్ ఇంగ్లిష్ యాక్సెంట్తో ఆమె చాలా భిన్నంగా కనిపించారు. కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మగరాయుడిలా అనిపించింది’ రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో ఫ్రాన్స్ సెక్షన్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేంది. కొద్దికాలంలోనే హెడ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెక్షన్కు అసిస్టెంట్గా పనిచేసే స్థాయికి ఎదిగింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఆమె ప్రధాన విధులు ఏమిటంటే, ఇంటర్వ్యూ చేసి స్పెషల్ ఏజెంట్లను ఎంపిక చేయడం. అలా ఎంపిక చేసిన వారిని 16వ శతాబ్దానికి చెందిన కంట్రీ హౌజ్లో బస ఏర్పాటు చేస్తారు. బాహ్యప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ ‘కమెండో కోర్స్’ చేయిస్తారు. ఫాల్స్ ఐడెంటిటీలతో ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట్టించాలో తర్ఫీదు ఇస్తారు. భాషకు సంబంధించిన మెలకువలు నేర్పించడంతో పాటు, ఆక్రమిత ఫ్రాన్స్లో పోలీస్ రూల్స్ ఎలా ఉంటాయి, కర్ఫ్యూ ఏ విధంగా ఉంటుంది, రేషనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏమిటి...మొదలైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించేది ఆట్కిన్స్. శిక్షణ పూర్తయ్యాక నాజీ జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్లోకి వీరిని పంపిస్తారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటారు. నాజీ జర్మని ఆక్రమిత ఫ్రాన్స్లోకి 470 మంది ఏజెంట్లను పంపుతారు. అందులో 39 మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ఏజెంట్ల పేర్లు, కోడ్నేమ్స్తో సహా ప్రతి చిన్న విషయం ఆట్కిన్స్కు కొట్టిన పిండే. ‘మోస్ట్ డేరింగ్ వుమెన్’గా పేరున్న ఆట్కిన్స్ ‘కవరింగ్’ స్టోరీలు అల్లడంలో, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పనిచేసిన జర్మనీ అధికారులు, గార్డులను ఇంటరాగేట్ చేయడంలో నెంబర్వన్ అనిపించుకుంది. జేమ్స్బాండ్ సిరీస్లో ‘మిస్ మనీ పెన్నీ’కి ప్రేరణ ఆట్కిన్స్ అంటారు. ‘ది సండే టైమ్స్ ఆఫ్ లండన్’ ‘ది ఇండిపెండెంట్’ పత్రికల్లో చాలాకాలం పాటు రిపోర్టర్గా పనిచేసిన సారా హెమ్ 1998లో ఆట్కిన్స్ను స్వయంగా కలుసుకొని ఈ పుస్తకానికి కావల్సిన ముడిసరుకు సమకూర్చుకున్నారు. రొమేనియా నుంచి కెనడా వరకు వేలమైళ్ల దూరం ప్రయాణం చేసి పుస్తకానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోగ్రాఫ్లు, ఫ్యామిలీ రికార్డులు సేకరించారు. తన పరిశోధనలో హెమ్కు తెలిసిన విషయం ఏమిటంటే, బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ముందు బచరెస్ట్ (రొమేనియా)లోని ఒక ఆయిల్ కంపెనీలో సెక్రెటరీగా పనిచేసింది ఆట్కిన్స్. ఆ కాలంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్కు అవసరమైన సమాచారాన్ని చేరవేసేది. ఆమె పనితీరు నచ్చడం, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో పట్టు ఉండడం...మొదలైన కారణాలతో ‘ఎఫ్–సెక్షన్’లోకి తీసుకున్నారు. అంత పెద్ద స్థాయిలో వెలిగిన ఆట్కిన్స్ కూడా ఇంగ్లిష్ ఉన్నత అధికారుల దగ్గర జాతివివక్ష ఎదుర్కుందట. మరో సంచలనం ఏమిటంటే, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విభాగంలో ‘పవర్ఫుల్ ఫిగర్’ అనిపించుకున్న ఆట్కిన్స్ జర్మన్, సోవియట్లకు ‘స్పై’గా పనిచేసిందని ఆరోపణలు వచ్చాయి. 92 ఏళ్ల వయసులో చనిపోయిన ఆట్కిన్స్ను రహస్యాల పుట్ట అంటారు. ఆ రహస్యాల అరల్లోకి వెళ్లడమే ఈ పుస్తకం చేసిన పని. చదవండి: మళ్లీ కెమెరాలకు చిక్కిన టైగర్-దిశా ‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’