delivery boy
-
Visakha: స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
-
‘సార్ అని పిలవాలంటూ మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు’
విశాఖ: మూడు రోజుల క్రితం అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆక్సిజన్ టవర్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ అనే యువకుడిపై ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అయితే ఈ అవమానం భరించలేక అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనాలు రావడంతో డెలివరీ బాయ్స్ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ యువకుడి అండగా నిలబడింది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ యువకుడు ‘సాక్షి’ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు.‘ అన్నా అనీ పిలిచినందుకు ప్రసాద్ అనే వ్యక్తి నాపై దాడి చేశాడు. సార్ అని పిలవాలి అంటూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో జాయిన్ మొదట రోజు మొదటి ఆర్డర్ ఆక్సిజన్ టవర్ లో వచ్చింది. నాకు అడ్రస్ తెలియక వెతుక్కొని వెళ్లాను. ఆక్సిజన్ టవర్ లో ఉన్న 29 ఫ్లోర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఒక యువతి తీసుకున్నారు. లిఫ్ట్ వద్దకి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి నా పై దాడికి యత్నించిన్నారులిఫ్ట్ వద్దకి వచ్చిన ప్రసాద్.. మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు. నా బట్టలు విప్పించి కర్రతో కొట్టారు. నాతో బలవంతంగా రెండు లేటర్లు రాయించారు. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నాకు తగిన న్యాయం కావాలి. ప్రసాద్ నన్ను ఎవరు ఎం చెయ్యలేరు అని చెప్పి దాడి చేశారు’ అని పేర్కొన్నాడు బాధితుడు అనిల్ నిందితుడికి ఏప్రిల్ 7 వరకూ రిమాండ్ఈ దాడిలో నిందితుడిగా ఉన్న ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితుడు ప్రసాద్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. -
విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు. డెలివరీ ఇచ్చేటపుడు మర్యాదగా మేడం అని పిలవలేదని ఇంట్లో పని మనిషి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సెక్యూరిటీ సిబ్బంది బట్టలు విప్పించి దాడి చేసినట్లు సమాచారం. అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అపార్ట్మెంట్ వద్ద నగరంలో డెలివరీ బాయ్స్గా విధులు నిర్వహిస్తున్న యువకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటో
సోషల్ యాక్టివిస్ట్.. ఇన్ఫ్లుయెన్సర్ 'కిరణ్ వర్మ' అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో.. కస్టమర్కు డెలివరీ చేయాల్సిన ఫుడ్ను, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తినడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఈ విషయాన్ని జొమాటో పార్ట్నర్తో మాట్లాడాలనుకున్నారు. కానీ నిజం తెలుసుకుని.. 'దీపిందర్ గోయల్'కు థాంక్స్ చెప్పారు.వర్మ తన కారును పార్కింగ్ చేస్తుండగా, జొమాటో రైడర్ ఒకరు తన బైకుపై కూర్చుని భోజనం చేస్తున్నట్లు గమనించారు. ఆ రైడర్ కస్టమర్ ఆర్డర్ తింటున్నాడని మొదట అనుమానించి, ఒక ఫోటో తీశాడు. అయితే అతని దగ్గరకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎందుకు ఇంత ఆలస్యంగా భోజనం చేస్తున్నారని అడిగినప్పుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ తీసుకున్నారని, కానీ ఎంతసేపటికీ డెలివరీ తీసుకోవడానికి ఎవరూ రాలేదని పేర్కొన్నాడు.ఎంతసేపు వెయిట్ చేసినా.. ఎవరూ రాకపోవడంతో, ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లుగా మార్క్ చేయాలని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ను కోరానని డెలివరీ బాయ్ తెలిపాడు. ఆలా చేస్తే.. జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఆర్డర్ను ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఈ ఫుడ్ నేను తింటున్నాను అని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!సాయంత్రం వరకు ఎందుకు భోజనం చేయలేదు అనే ప్రశ్నకు.. హోలీ పండుగ సందర్భంగా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ డెలివరీ చేస్తే.. ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయని డెలివరీ బాయ్ చెప్పారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఆర్డర్కు రూ. 10 నుంచి రూ. 25 వరకు లభిస్తుంది. ఇలా వారు నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు సంపాదిస్తారు.చూడగానే.. డెలివరీ చేయాల్సిన ఫుడ్ తింటున్నాడని అనుకున్నాను. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా.. ఎవరినీ నిందించడం కరెక్ట్ కాదు. ఇది వర్మ గిగ్ కార్మికుల కష్టాలను ప్రతిబింబించేలా చేసిందని కిరణ్ వర్మ అన్నారు. -
2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోను.. మంత్రి అభినందించారు.ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక.. భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు. -
ఆలస్యంగా ఫుడ్ డెలివరీ.. ఆపై తీవ్ర దూషణలు!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సేవలపై ఓ మహిళా కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్ ఫుడ్ ఐటమ్ను ఆలస్యంగా అందించడమే కాకుండా దూర్భాషలాడినట్లు ఓ కస్టమర్ తెలిపారు. దీనిపై సంస్థ ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ను ట్యాగ్ చేశారు. అందుకు సంబంధించి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన రాధిక బజాజ్ తన ఎక్స్ ఖాతాలో..‘జొమాటోలో ఫుట్ ఆర్డర్ పెట్టాను. నా తరఫు ఆర్డర్ రిసీవ్ చేసుకునేందుకు మా కంపెనీ ఆఫీస్బాయ్ను ఏర్పాటు చేశాను. ముందుగా నిర్ణయించిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేశాడు. ఆలస్యానికి కారణం అడిగిన మా ఆఫీస్ బాయ్ను తీవ్రంగా దూషించాడు. జొమాటో డెలివరీ బాయ్ల ప్రవర్తనను మెరుగుపరచడంపై కంపెనీ ప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టరు. ఇలా దుర్భాషలాడే హక్కు ఎవరికీ లేదు. డెలివరీ బాయ్కి అయినా.. లేదా కంపెనీ సీఈఓ అయినా గౌరవ మర్యాదలు ఒక్కటే విధంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ వ్యవహారంపై జొమాటో సంస్థ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ‘ఇది ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. వెంటనే సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము త్వరలో మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం’ అని స్పందించారు. -
సీఈవో అయినా డెలివరీ బాయ్గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్లోని ఓ మాల్కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.డెలివరీ ఏజెంట్గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్తో ఆర్డర్లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలుదీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
ఐ ఫోన్ కోసం హత్య.. డబ్బులిస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి..
డెలివరీ ఏజెంట్ల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సరుకులు సరఫరా చేసే డెలివరీ ఏజెంట్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది. దీంతో వేలాది మందికి ఇది ఉపాధి మార్గంగా మారింది. ఆన్లైన్లో బుక్ చేసిన వాటిని వినియోగదారులకు సరైన సమయంలో చేరవేయడం డెలివరీ ఏజెంట్ల పని. అయితే చెప్పినంత ఈజీ కాదు ఈ జాబ్ చేయడం.సవాళ్లు ఎన్నో..విధి నిర్వహణలో డెలివరీ ఏజెంట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమయానికి సరుకులు చేరవేయడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే తీవ్రమైన ట్రాఫిక్ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకోసారి అడ్రస్ వెతుకులాటలోనే సమయం గడిచిపోతుంటుంది. లేటుగా వెళితే కస్టమర్లు నెగెటివ్ రేటింగ్ ఇస్తారనే భయంతో వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. వీటితో పాటు దాడులు కూడా పెరిగాయి.ఐ ఫోన్ కోసం హత్యతాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఐ ఫోన్ కోసం ఓ డెలివరీ ఏజెంట్ను హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్హాట్కు చెందిన గజేంద్ర ఫ్లిప్కార్ట్లో ఆఫర్ సేల్లో లక్షన్నర రూపాయల ఐ ఫోన్ ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. సెప్టెంబర్ 23న ఆర్డర్ ఇవ్వడానికి డెలివరీ ఏజెంట్ భరత్ సాహు వచ్చాడు.ఫోన్ తీసుకున్న గజేంద్ర, డబ్బులిస్తానంటూ అతడిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఫ్రెండ్తో కలిసి సాహును చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని కాల్వలో పడేశారు. సాహు కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాస్ట్ డెలివరీ గజేంద్రకు చేశాడని విచారణలో తేలింది. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఫ్రెండ్ ఆకాశ్ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఈ దారుణం బయటపడింది.గతంలోనూ దాడులుకాగా, డెలివరీ ఏజెంట్లపై దాడులు గతంలోనూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి. 2021లో బెంగళూరులో దోపిడీ యత్నంలో ఫుడ్డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. డబ్బుల విషయంలో కస్టమర్తో గొడవ జరగడంతో డెలివరీ ఏజెంట్ ఒకరు కత్తిపోట్లకు గురయిన ఘటన 2022లో నోయిడాలో కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా యూపీ ఘటన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని చేయి చేసుకుంటే..
చెన్నై: ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం..ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చెన్నైకి చెందిన పవిత్రన్(19) బీకాం చదువుకుంటూ తీరిక వేళల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన కొరట్టూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్డర్ను అందజేయడానికి పవిత్రన్ బయలుదేరాడు. లొకేషన్ గుర్తించి, చేరుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో మహిళా కస్టమర్తో పవిత్రన్కు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత పవిత్రన్ రాయి విసరడంతోనే తన ఇంటికి కిటికీ అద్దం పగిలిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పవిత్రన్ తన ఇంట్లో ఉరి వేసుకుని, తనువు చాలించాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు మహిళా కస్టమర్ తనను కొట్టడంతో తీవ్ర మనస్తాపంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్లో ఉండేలా నేరుగా మెసేజ్లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
డెలివరీ ఏజెంట్కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్డే.. వేడుక ఏదైనా మనకు టైమ్కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
గ్యాస్ దొంగ ను ఎప్పుడైనా చూసారా..!
-
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్సైకిల్పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
జొమాటో డెలివరీ బోయ్ హోం టూర్ వీడియో వైరల్
దేశ వాణిజ్య రాజధాని ముంబై మురికివాడలో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో గతంలో చాలా సినిమాల్లో చూశాం. తాజాగా జొమాటో డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన అతని హోం టూర్ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ప్రంజయ్ బోర్గోయరీ ఇన్స్టాలో రూ. 500 అద్దెతో జీవిస్తున్న తన గదికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే 50 లక్షలకు పైగా మిలియన్స్తో ఇది వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by qb_07 (@qb__.07) ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రంజయ్ బోర్గోయరీ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చాడు. మహానగరాల్లో ఉద్యోగంలో వెతుక్కునే సమయంలో అందరికీ కనిపించే తొలి ఆప్షన్. డెలివరీ బాయ్ లేదా, క్యాబ్, బైక్ రైడింగ్. ఇతను కూడా జొమాటో డెలివరీ బాయ్ పనే ఎంచుకున్నాడు. సోనూ అనే స్నేహితుడితో కలిసి ఇరుకు గదిలో ఉంటున్నాడు.ఈ క్రమంలో తన కఠినమైన జీవన పరిస్థితులను గురించి ‘స్ట్రగులింగ్ ఆర్టిస్ట్’ అనే క్యాప్షన్తో ఇన్స్టాలో షేర్ చేశాడు. తన కుటుంబ నేపథ్యం, నిరుపేదలైన తల్లిదండ్రులను కష్టాలను ఈ వీడియోలో పంచుకున్నాడు. ఇప్పటికే తన కోసం వారు చాలా ఖర్చుచేశారని, ముఖ్యంగా తాను అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్లు ఎంతో ఇబ్బంది పడి వైద్యం చేయించారని గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇకపై వాళ్లపై ఆధారపడి జీవించడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే టాయిలెట్ రూం కష్టాలను కూడా కళ్ళకు కట్టినట్టు మరో వీడియోలో చూపించాడు. అన్నట్టు వీళ్లకి ఒక పిల్లి పిల్ల కూడా ఉంది. సింగర్గా ఫుట్ బాయల్ ప్లేయర్గా రాణించాలనే ఇతని డ్రీమ్.త్వరలోనే ఈ పరిస్థితులనుంచి బయటపడేలా కృషి చేస్తా అన్నాడు. ముంబై మురికివాడల్లో జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో తెలిసింది అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. బోర్గోయరీకి ఆన్లైన్లో భారీ మద్దతు లభిస్తోంది. అతడి వీడియో చూసిన స్పందించిన ఖుషీ యూజర్ మూడు నెలల అద్దె చెల్లించాడు. మంచి రోజులు వస్తాయంటూ శుభాకాంక్షలందించారు మరికొంతమంది. ఇతనికి ప్రస్తుతం ఇన్స్టాలో 1.45 లక్షల మంది ఫాలోయర్లు ఉండటం విశేషం. -
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్ తన యాప్లో ఎస్వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్లోని ఉదయపూర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
దొంగతనం చేసిన డెలివరీ బాయ్కు సపోర్ట్.. సోనూసూద్పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డెలివరీ బాయ్గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్గా, డీటీపీ ఆపరేటర్గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
పెట్రోల్ తిప్పలు..గుర్రం మీద ఫుడ్ డెలివరీ
-
అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి
హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్ అయిపోయింది. బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్లోని ఇంపీరియల్ హోటల్లో పార్శిల్ తీసుకుని చంచల్గూడలో కస్టమర్కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. #Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo — rajni singh (@imrajni_singh) January 3, 2024 -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
పిస్టల్తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి
నోయిడా: ఒక కస్టమర్పై ఆమె ఫ్లాట్లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్ సుమిత్ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్మెంట్లో పార్సిల్ డెలివరీ సందర్భంగా ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్లో అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్లో టైమ్కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
డెలివరీ బాయ్కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
డెలివరీ బాయ్గా మారిన జొమాటో సీఈవో! బైక్పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్షిప్డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
ఫుడ్ కోసం వెయిటింగ్.. కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఇంత లేజీగా ఉన్నావేంటి!
ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్లైన్ డెలివరీ యాప్లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ని నేనే తిన్నట్లు కస్టమర్కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు. డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్ను ఫుడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు -
ఎంత కష్టం! కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని తింటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి.. మన కడుపు నింపడం కోసం కడుపు మాడ్చుకుని పనిచేసే ఇలాంటి డెలివరీ బాయ్ ల యోగక్షేమాలు కూడా పట్టించుకోండని ఒక ఐఏఎస్ అధికారి నెటిజెన్లను కోరారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. బాగా బిజీగా ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్ పార్సిల్ అందించిన తర్వాత అక్కడే పార్కింగ్ ఏరియాలో తన బైక్ వద్ద నిలబడి ప్లాస్టిక్ కవర్లో తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారుగా తింటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోయే ఈ సన్నివేశాన్ని అవనీశ్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో అప్లోడ్ చేయగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా.. "ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి గురించి కూడా కొంచెం పట్టించుకోండి.." అని రాశారు. इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023 ఈ వీడియోకు వీక్షకుల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందించారు. అలాంటి వారికి మీకు తోచినది పెట్టి వారి కడుపు నింపమని, కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇచ్చి వారి గొంతు తడపమని అభ్యర్థిస్తున్నారు నెటిజన్లు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి జీవన విధానం తేలికైపోయింది. వైవిధ్యమైన, నోరూరించే ఆహారాల్లో ఏది కావాలంటే అది ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు నచ్చిన ఐటమ్ నిముషాల్లో మన ముందు వాలిపోతుంది. కానీ దాని వెనుక ఇలాంటి ఎందరో శ్రామికుల కష్టం దాగుంది. కుటుంబ పోషణ కష్టమైన ఈ రోజుల్లో, వారు ఆకలికి ఓర్చుకుని ఎదుటివారి ఆకలిని తీరుస్తున్నారన్న విషయాన్ని మరువకూడదు. ఇది కూడా చదవండి: 106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ -
పిజ్జా సైజ్ ఎందుకు తగ్గిందంటే..
-
లిఫ్ట్లో బాలికకు లైంగిక వేధింపులు
బనశంకరి: ఫుడ్ డెలివరీ బాయ్ లిఫ్ట్లో ఓ బాలికను లైంగికంగా వేధించాడు. ఈఘటన తలఘట్టపుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేతన్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ ఈనెల 21న తలఘట్టపురలోని ఒక అపార్టుమెంటులోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్లోకి వెళ్లాడు. 13వ అంతస్తుకు చెందిన ఒక బాలిక ట్యూషన్కు వెళ్లేందుకు ఇదే లిఫ్ట్లో ఎక్కింది. ఈ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లిఫ్ట్నుంచి బయటికి వచ్చిన బాలిక ట్యూషన్ టీచర్కు విషయం తెలిపింది. ఆమె బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా సెక్యూరిటీ సిబ్బంది చేతన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
డెలివరీ బాయ్ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు
యశవంతపుర(బెంగళూరు): కారు ఢీకొని ఫుడ్ డెలివరి బాయ్ మృతి చెందిన ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడిని మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాకు చెందిన ప్రసన్నకుమార్ (25)గా గుర్తించారు. ప్రసన్న ఆదివారం అర్ధరాత్రి వరకు ఓ సంస్థలో క్యాషియర్గా పనిచేసి , తెల్లవారుజామున ఫుడ్ డెలివరీకి బయలుదేరాడు. ఫుడ్ ఇవ్వడానికి బైక్పై మైసూరు రోడ్డులో వెళ్తుండగా వాయు వేగంతో వచ్చిన ఓ కారు ప్రసన్నను బలంగా ఢీకొంది. దాదాపు వంద మీటర్ల వరకు బైక్ను కారు లాక్కెళ్లడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పారిపోతుండగా ఆర్ఆర్నగర మెట్రో స్టేషన్ వద్ద స్థానికులు అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారును నడుపుతున్న వినాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్ -
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా!
Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్మేట్కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. (ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్తో పండగ చేసుకోండి!) నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్, బైజూస్లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. -
మరో దారుణం.. మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి...
ముంబైకి చెందిన ఒక డెలివరీ బాయ్ పొరుగింటిలో ఉంటున్న వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వివాదమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని షాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న పాల్ కానారన్ అనే వ్యక్తి తన పొరుగు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని హత్య చేశాడు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ఒక ఇంటి నుంచి దుర్ఘంధం వస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ ఇంటిలో దుప్పటిలో చుట్టిన స్థితిలో ఒక మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ను అతని పొరుగింటిలో ఉన్న వ్యక్తి మందు పార్టీకి ఆహ్వానించాడు. పార్టీ చేసుకుంటున్న సందర్భంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ పొరుగింటిలోని వ్యక్తిని దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని ఒక బెడ్షీట్లో చుట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
యువతితో డెలివరి బాయ్ అసభ్య ప్రవర్తన.. బుద్ధి చెప్పిన స్థానికులు
-
కుక్కకు భయపడి.. మూడో అంతస్తు పైనుంచి దూకి..
సాక్షి, హైదరాబాద్: డెలివరీ పార్సిల్ను అందించేందుకు వచ్చిన ఓ యువకుడు...పెంపుడు కుక్క అరవడంతో భయపడి అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్న నీలారాణి మూడు రోజుల క్రితం అమెజాన్లో పరుపు(బెడ్)ను ఆర్డర్ చేసింది. దాంతో ఆదివారం దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ ఇలియాజ్ వారి ఇంటికి లిఫ్ట్లో వచ్చాడు. అతను తెచ్చిన బెడ్ను తలుపు తెరచి ఉండటంతో ఇంట్లోకి నేరుగా వచ్చి హాల్లో వేశాడు. దాని చప్పుడుకు ఇంట్లో ఉన్న లాబ్ జాతి కుక్క ఒక్కసారిగా అరవటంతో అతను భయపడి పోయాడు. ఆ సమయంలో కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో ఏకంగా మూడవ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై పడటంతో నడుము భాగంలో గాయమయ్యింది. దీంతో నీలారాణి భర్త డాక్టర్ సుబ్బరామిరెడ్డి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపారు. డెలివరీ బాయ్ ఉదయం ఫోన్ చేసి ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పాడని, వచ్చే ముందు ఎలాంటి ఫోన్ చేయటం, ఇంటి ముందుకు వచ్చి బెల్ కొట్టడం చేయలేదని, నేరుగా ఇంట్లోకి రావడం వల్లే కుక్క అరిచిందని నీలారాణి తెలిపారు. బాధితుడు తన అన్నకు ఫోన్ చేయటంతో ఓవైసీ ఆసుపత్రికి తీసుకుని రావాలని చెప్పటంతో 108 సిబ్బంది అతన్ని అక్కడకు తరలించినట్టు సమాచారం. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సమాచారం సేకరించారు. అనంతరం నీలారాణిపై కేసు నమోదు చేశారు. చదవండి: కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే! -
Hyderabad: లిఫ్ట్ విషయంలో గొడవ.. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ శాంతకుమార్ గచ్చిబౌలిలోని ఎన్సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్ సర్వీస్ లిఫ్ట్లో వెళ్లానని చెప్పగా, లేదు నువ్వు మెయిన్ లిఫ్ట్లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం! -
వార్నీ.. రూ.650 టిప్ సరిపోలేదట! కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ గర్ల్..
ఆన్లైన్ డెలివరీ యాప్లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. కరోనా నుంచి వీటికి జనాదరణ కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే డెలివరీ బాయ్స్ కస్టమర్లకు ఫుడ్ డెలవరీ చేసే క్రమంలో పలు వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ డెలివరీ పార్టనర్ టిప్ సరిపోలేదని అసహనంతో కస్టమర్తో జరిపిన సంభాషణ వైరల్గా మారింది. ఆ టిప్ సరిపోలేదు.... ఇటీవల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చాలా పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఇక చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు నిమిషాల్లో కొన్ని సేవలు ఏదైన మన ఇంటి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతున్నాయి. ఫుడ్ సంబంధించి కూడా ఆన్లైన్ యాప్ల రాకతో మనం కోరుకున్న ఫుడ్ జస్ట్ ఒక క్లిక్తో వచ్చేస్తుంది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్కు షాకిచ్చింది డెలివరీ పార్టనర్. అసలేం జరిగిందంటే.. డెలివరీ పార్ట్నర్ కస్టమర్ ఇంటి ముందుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ‘మీ ఫుడ్ ఆర్డర్ తీసుకువచ్చేందకు నేను పన్నెండున్నర మైళ్లు దూరం 40 నిమిషాల పాటు డ్రైవింగ్ చేసి వచ్చాను. అయితే మీరిచ్చిన టిప్ 8 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.650) నేను సంతోషంగా లేనని’ ఆమె అతనికి చెబుతుంది. అయితే కస్టమర్ అదనంగా చెల్లించేందుకు నిరాకరిస్తాడు. దీంతో డెలివరీ పార్టనర్కు చిరెత్తుకురావడంతో ఫుడ్ ప్యాకెట్ను తీసుకొని కస్టమర్కు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్కు, కస్టమర్కు మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Guinness Record: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు.. -
డెలివరీ బాయ్తో భవిష్ అగర్వాల్ సెల్ఫీ: ఓలా స్కూటర్తో చాలా అదా అంటూ..
ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సజావుగా ముందుకు సాగిపోతోంది. క్రమంగా కంపెనీ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల భవిష్ అగర్వాల్ ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్తో ఉన్న జొమాటో డెలివరీ బాయ్ని చూడవచ్చు. ఈ డెలివరీ బాయ్ 9 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఖర్చులను ఆదా చేసాడని, అతడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నాడని కూడా భవిష్ ట్విట్టర్ పోస్ట్లో రాశాడు. జొమాటో డెలివరీ బాయ్ ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకదానిలో ఛార్జింగ్ పూర్తయినప్పుడు, ఇంకోదానిని ఉపయోగిస్తాడు. అప్పుడు ఛార్జింగ్ కాలీ అయిన స్కూటర్కి ఛార్జింగ్ వేసుకుంటాడు. ఈ విధంగా రెండు స్కూటర్లను నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నాడు డెలివరీ బాయ్ సంతోష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో సాధారణ 9 నెలల్లో లక్షకంటే ఎక్కువ ఆదా చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా కంపెనీ స్కూటర్లు ఉండటం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో 4 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీతో 181 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్తో దాదాపు 6 గంటల్లో, ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. Met Santosh at a traffic junction. Very enterprising guy! Owns 2 @OlaElectric scooters and has driven more than 50000 kms! Drives the second one when the first is on charging at our hyper charging station. Has saved more than ₹1 lakh in just 9 months! pic.twitter.com/89OxmM2uy9 — Bhavish Aggarwal (@bhash) February 28, 2023 -
షాకింగ్ ఘటన: ఐ ఫోన్ బుక్ చేసి.. ఎంత దారుణం చేశాడంటే..
యశవంతపుర(కర్ణాటక): ఆన్లైన్లో ఐ ఫోన్ బుక్ చేసిన యువకుడు డబ్బులు ఎగ్గొట్టాలని ఏకంగా డెలివరీ బాయ్ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా అరసికెరెలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్ దత్త (20) నిందితుడు. ఇతడు ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ను బుక్ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్ పెట్టాడు. అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ (23) ఈ నెల 11న ఫోన్ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హేమంత్దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్పై కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంట్లోనే మూడురోజులు తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్ సమీపంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్ నాయక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్ నాయక్ మృతదేహంగా గుర్తించారు. నాయక్ మొబైల్కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా వెంటనే హేమంత్దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నోరు విప్పాడు. కఠినంగా శిక్షించాలి పోలీసులు అతని ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా హేమంత్దత్త స్కూటర్పై బంక్ వద్దకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లిన దృశ్యాలను కనుగొన్నారు. హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి హేమంత్దత్త అన్ని ప్రయత్నాలు చేశాడని ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఈ దురాగతం స్థానికంగా సంచలనం కలిగింది. ఇటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. చదవండి: భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్ -
జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? ఆర్డర్ పెట్టిన ఫుడ్కు ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా? లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆప్షన్ను సెలక్ట్ చేసుకుంటున్నారా? చేస్తే చేశారు కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి. సీవోడీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు ఆదా చేసుకోవచ్చు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫుడ్ ఆగ్రిగేటర్కు చెందిన డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు. అందులో ఓ కస్టమర్ డెలివరీ బాయ్ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట్లో వైరల్గా కాగా.. సదరు కంపెనీ సీఈవో స్పందించారు. సంస్థలోని లోపాల్ని సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తరాఖండ్ చెందిన ఎంట్రప్రెన్యూర్ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్ తెచ్చిన ఆ డెలివరీ బాయ్.. వినయ్తో.. ‘ సార్ నెక్ట్స్ టైం నుంచి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. ఎందుకుంటే? మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఖరీదు రూ.700 నుంచి రూ.800 ఉంటే.. క్యాష్ ఆన్ డెలివరీలో కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. మీరు నాకు రూ.200, రూ.300 ఇచ్చి రూ.1000 ఖరీదైన ఫుడ్ను ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ సెలవిచ్చాడు. దీంతో షాక్ తిన్న వినయ్ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిఇన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో...జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్బంప్స్ వచ్చాయి. ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్ఘతం చేయాలా? అని ప్రశ్నించారు. నేను ఎంట్రప్రెన్యూర్ను కాబట్టి సెకండ్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకున్నా. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్ పై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి పోస్ట్పై జొమాటో సీఈవో స్పందన చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు..
దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సంచలనం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్విగ్గీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం పొందాలనుకునే డెలివరీ బాయ్స్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం లేదా ఎస్ఓఎస్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. చదవండి👉 కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు స్విగ్గీ డెలివరీ బాయ్, లేదంటే వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యం లభిస్తుందని స్విగ్గీ తెలిపింది. ఈ సౌకర్యం పొందేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, కేవలం పార్టనర్ ఐడీని చెబితే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. అంతేకాదు స్విగ్గీ అందిస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీతో మా యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ, వారి జీవిత భాగస్వాములు, ఇద్దరు పిల్లలుకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. ఖర్చులో సబ్సిడీ కల్పిస్తాం’ అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అంబులెన్స్ సౌకర్యాన్ని దేశ వ్యాప్తంగా బెంగళూరు, ఢిల్లీ,ఎన్సీఆర్,హైదరాబాద్, ముంబై,పూణే, కోల్కత ప్రాంతాల్లో యాక్టీవ్ డెలివరీ బాయ్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసలు బాటు కల్పించింది. ఇందుకోసం అంబులెన్స్ సర్వీసులు అందించే సంస్థలతో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
పెంపుడు కుక్క దాడి ఘటనలో స్విగ్గీ బాయ్ మృతి
-
Hyderabad: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
సాక్షి, హైదరాబాద్: పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్పై పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్మెంట్లో నివసించే శోభనా నాగాని ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) స్విగ్గి డెలివరీ బాయ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్ షెపర్డ్ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు. అతడి వెంట కుక్క పడడంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యజమానురాలు కుక్కను కట్టకుండా నిర్లక్ష్యం వదిలివేయడంతోనే తమ సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి సోదరుడు ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ..
సాక్షి, హైదరాబాద్ : హుమయూన్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైందని డెలివరీ బాయ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులు 15 మందితో కలిసి మాసబ్ ట్యాంక్లోని హోటల్ వద్దకు వచ్చాడు. వారితో కలిసి అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. భయంతో సదరు డెలివరీ బాయ్ హోటల్లోకి పరుగుతీశాడు. వారు కూడా అతన్ని వెంబడిస్తూ హోటల్లోకి పరుగెత్తి మరీ డెలివరీ బాయ్పై మూకుమ్మడిగా దాడి చేశారు. హోటల్ లోపలే అతడిని పట్టుకుని చితకబాదారు. హోటల్ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దాడి నుంచి తప్పించుకోవడానికి వంటగదిలోకి వెళ్లగా.. స్టౌమీద ఉన్న మరుగుతున్న నూనె మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్తో పాటు మరో ఇద్దరు హోటల్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్, హోటల్ ఉద్యోగులు సోను, సజ్జన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు కుమారులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మరికొందరిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సప్లయ్
సాక్షి, హైదరాబాద్: జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సప్లయ్ చేస్తున్న చుంచు నితీష్ చంద్రని తుకారంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడ్లర్ రాహుల్ ఆదేశాలతో అవసరమైనవారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఐటమ్లో కోడ్ భాషను ఉపయోగిస్తూ గంజాయి సరఫరా జరుగుతోంది. జొమాటోలో ఉద్యోగం చేస్తూ డబ్బు కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడు. నితీష్ చంద్ర వద్ద 600 గ్రాముల గంజాయి, రూ.5వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 30 మంది కస్టమర్లకు గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించారు. నితీష్ చంద్ర అరెస్ట్తో భువనగిరి పీఎస్లో పెడ్లర్ రాహుల్ లొంగిపోయారు. చదవండి: (కాంగ్రెస్ను నాశనం చేస్తోంది వారేనా?.. గాంధీభవన్లో అసలేం జరుగుతోంది?) -
అలర్ట్: సరుకుల డెలివరీ కోసం వచ్చి.. మహిళతో అసభ్యకర ప్రవర్తన..
ఇటీవలే కొరియాకు చెందిన ఓ యూట్యూబర్తో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు ఓ కస్టమర్ట్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్.. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఖర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సబీనా ఆమె కుటుంబంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సరుకుల డెలివరీ కోసం ఆన్లైన్ డెలివరీ సంస్థను ఆశ్రయించింది. దీంతో, ఆన్లైన్ సంస్థకు చెందిన షాజాదే షేక్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని డెలివరీ బాయ్ గమనించాడు. ఈ క్రమంలోనే సరుకుల డెలివరీ తర్వాత.. వీడియో తీయాలని చెప్పి ఫోన్లో వీడియో మోడ్ ఆన్చేశాడు. అనంతరం.. ఆమె చేయి పట్టుకుని అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. Another #Mumbai molestation horror as a delivery boy molests a girl who had ordered groceries via #Zepto App. The delivery boy entered the house forcefully.@AtkareSrushti reports | @ZeptoNow @zeptocares pic.twitter.com/vvNYbRD1rV — Mirror Now (@MirrorNow) December 2, 2022 దీంతో, ఒక్కసారిగా షాకైన బాధితురాలు.. వెంటనే కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ సాయంతో సెక్యూర్టీకి కాల్ చేసింది. వెంటనే స్పందించిన అక్కడికి వచ్చిన సెక్యూర్టీగార్డ్ అతడిని అడ్డుకున్నాడు. అనంతరం, అతడిలో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని బాధితురాలు వీడియోను డిలీట్ చేసింది. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపింది. ఈ క్రమంలో సదరు డెలివరి సంస్థపై బాధితురాలు సీరియస్ కామెంట్స్ చేసింది. ఇలాంటి వారితో రోజు ఇంకెంత మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారో అని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత, సదరు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. @CPMumbaiPolice @bombaytimes @timesofindia @MumbaiPolice @ZeptoNow #harssment #WomenSafety #womenharssment #justice #mumbai #zepto #harssment pic.twitter.com/gJop6NAk6T — Sabeena (@sabeenasyed8) December 1, 2022 ఇక, ఘటనపై సదరు డెలివరీ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేము ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటాము. స్థానిక చట్టాన్ని అమలు చేసే సంస్థలతో ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. విచారణలో మేము కూడా పాల్గొంటున్నాము. ఇలాంటి ప్రవర్తనను త్రీవంగా ఖండిస్తున్నాము. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. Hi Sabeena, We take such matters with utmost seriousness. We are partaking in a thorough investigation of the incident with the local law enforcement bodies. We condemn such behavior. Stringent action will be taken on perpetrators based on facts. — Zepto Cares (@zeptocares) December 1, 2022 -
విషాద ఘటన: నాన్స్టాప్ డెలివరీలతో కుప్పకూలాడు
పండుగ సీజన్లను క్యాష్ చేసుకోవడం ఈ-కామర్స్ సంస్థలకు అలవాటైన పనే. అదే సమయంలో డెలివరీ ఏజెంట్లకు కూడా చేతి నిండా పని ఉంటుంది కూడా. అయితే ఆ పని హద్దులు దాటిపోతే. కంపెనీ ఇచ్చే టార్గెట్ను రీచ్ కావాలనే ఆత్రుతతో హక్కులు లేని గిగ్ సెక్టార్ ఉద్యోగులు తీవ్రంగా పని చేస్తుంటారు. సరిగా ఇలాంటి ఘటనే ఓ డెలివరీ ఏజెంట్ ప్రాణం తీసింది. ఆ డెలివరీ ఏజెంట్.. ఆర్డర్లను కస్టమర్లకు అందించడానికి యత్నించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేశాడు. రోజుకు 14 గంటలపాటు ఒక వారం రోజులు పని చేశాడు. విరామం లేకుండా పని చేసే సరికి బాడీ అలిసిపోయింది. చివరకు ఆ వ్యాన్లోనే హ్యాండిల్పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. యూకేలో డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న వారెన్ నోర్టన్ (49).. డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ల డెలివరీ చేస్తున్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా తన వ్యాన్ను ఉపయోగించుకుంటున్నాడు. అయితే.. బ్లాక్ ఫ్రైడే తరుణంలో విపరీతమైన ఆర్డర్లు రావడంతో విరామం ఎరుగకుండా పని చేశాడు. రోజులో 14 గంటలు ఆర్డర్లు డెలివరీ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అలా ఓ వారంపాటు డెలివరీ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం వ్యానులో డెలివరీకి వెళ్లిన ఆయన.. అలాగే స్టీరింగ్పై కుప్పకూలి పోయాడు. అది గమనించిన ఓ కస్టమర్.. డోర్ తెరవడంతో సరాసరి రోడ్డు మీదకు పడిపోయాడు. వెంటనే సీపీఆర్ ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. సదరు కంపెనీకి సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పని ఒత్తిడితోనే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరిమితికి మించి పని చేయడంతోనే అతను చనిపోయినట్లు ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు చెప్తున్నారు. అయితే.. ఆ కంపెనీ మాత్రం పని ఒత్తిడి ఆరోపణలను కొట్టేసింది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటామని చెబుతూ.. వారెన్ నోర్టన్ మృతిపై మొక్కుబడిగా ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. -
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్గా ఉందే!
-
చెంప దెబ్బ ఎఫెక్ట్: పోలీసులకు చుక్కలు చూపించాడు
ఓ యువతి.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్తో గొడవపడి పోలీసుల దాకా వెళ్లింది. ‘రాతపూర్వక ఫిర్యాదు ఎందుకు మేడమ్.. మేం చూసుకుంటాం లే’ అంటూ ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు పోలీసులు. ఆమె అటు వెళ్లగానే.. అతగాడి చెంప చెల్లుమంది. ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ, అవమాన భారంతో రగిలిపోయిన ఆ యువకుడు ఇచ్చిన రియాక్షన్ మరీ వయొలెంట్గా ఉండడంతో పోలీసులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఢిల్లీ పోష్ ఏరియా ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం హైడ్రామా నెలకొంది. ఓ యువకుడు తన బైక్కు నిప్పటించుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వాడు. అంతటితో ఆగకుండా .. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద సైతం రాళ్లు విసిరాడు. చివరికి.. నాటకీయ పరిణామాల నడుమ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. జొమాటోలో డెలివరీబాయ్గా పని చేసే నదీమ్(23).. శనివారం ఖాన్ మార్కెట్లో ఓ రెస్టారెంట్కు ఫుడ్ ప్యాకేజీల కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి ఓ జంట వచ్చింది. యువతి.. నదీమ్ తననే చూస్తున్నాడంటూ గొడవకు దిగింది. ఆపై దగ్గర్లోని స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అక్కడున్న ఓ కానిస్టేబుల్ ఊగిపోతూ అతని చెంప పగలకొట్టాడు. దీంతో అకారణంగా తనను కొట్టారంటూ ప్రతీకారంతో రగిలిపోయాడు నదీమ్. ఆ మరుసటి రోజు స్టేషన్ బయట తన బండిని పార్క్ చేసి దానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ ఫర్నీఛర్ షాపునకు పాకడంతో.. అక్కడ గందరగోళం నెలకొంది. ఇంతలో ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటల్ని అదుపు చేశారు. ఆపై నదీమ్ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. అతను వాళ్లపై రాళ్లు రువ్వాడు. చివరకు పోలీసులు అతన్ని ఎలాగోలా పట్టుకున్నారు. ఆ సమయంలో తనకు అవమానం జరిగిందంటూ అతను అరవడమూ వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనతో అక్కడ జనం గుమిగూడగా.. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు బారికేడ్లను ఉంచారు. -
దారుణంగా కొట్లాడుకున్న ఫుడ్ డెలివరి మ్యాన్, సెక్యూరిటీ గార్డు... షాక్లో స్థానికులు
నోయిడా: ఫుడ్ డెలివర్ మ్యాన్, సెక్యూరిటీ గార్డుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన నోయిడా గార్డెనియా సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సబీ సింగ్ అనే జోమాటో ఫుడ్ డెలవరీ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ల మధ్య ఎంట్రీ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరి ఒకరినోకరు గాయపరుచుకునే వరకు వచ్చింది. మొదటగా ఫుడ్ డెలివరీ మ్యాన్ సబీ సింగ్ సెక్యూరిటీ గార్డుని కొట్టడం, నెట్టడం వంటివి చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గార్డు కర్ర తీసుకుని ఫుడ్ డెలివరీ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కాసేపు కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించిన ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాసేపటికి ఫుడ్ డెలవరీ మ్యాన్ స్ప్రుహ తప్పి నేలపై పడిపోయాడు. దీంతో ఘటనా స్థలం వద్ద ఉన్న స్థానికులు అతనికి సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని ఇరువురి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...) -
జొమాటో డెలివరీ బాయ్కు బొట్టుపెట్టి, హారతిచ్చి స్వాగతం.. ఎందుకో తెలుసా?
ప్రస్తుత జనరేషన్లో దాదాపుగా అందరూ ఫుడ్ హోమ్ డెలివరీనే ప్రిఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ రోజు, ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అయితే.. కచ్చితంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఇంట్లో దర్జాగా కూర్చుని.. చేతిలో స్మార్ట్ఫోన్ పట్టుకుని ఒక్క క్లిక్తో ఆర్డర్ పెట్టేస్తారు. ఈ క్రమంలో వారు పెట్టిన ఆర్డర్ కొంచెం లేట్గా వస్తే.. డెలివరీ బాయ్కు చుక్కలు చూపిస్తారు. కాగా, తాజాగా ఆర్డర్ చేసిన ఫుడ్ను తెచ్చిన డెలివరీ బాయ్కు ఓ కస్టమర్.. వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కస్టమర్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. కాగా, ఆ కస్టమర్ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్.. ఓ గంట ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. అటు వర్షం.. ఇటు పండుగ కావడంతో ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్ ఎట్టకేలకు ఫుడ్ను డెలివరీ అందించాడు. అయితే, ఫుడ్ను డెలివరీ ఇస్తున్న సమయంలో సదరు కస్టమర్.. వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్ డెలివరీ బాయ్ కుమార్.. గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్.. డెలివరీ బాయ్కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. దీంతో, సదరు డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ అలాగే నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డెలివరీ బాయ్లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు ఇలాగే స్పందిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sanjeev Tyagi (@sanjeevkumar220268) -
కాళ్లకు చెప్పులు లేవ్.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’
వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్లు/ఏజెంట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్ఇన్లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్ఇన్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. -
ఫుడ్ డెలివరీ బాయ్ పాడుపని.. స్పందించిన జొమాటో
ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్.. యువతిని లైంగికంగా వేధించిన విషయంపై జొమాటో స్పందించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయతే డెలివరీ ఏజెంట్తో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.‘ మేము విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మేము ఏ వ్యక్తినైనా ఆన్బోర్డ్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లను నిర్వహిస్తాం. అలాగే మేము(జొమాటో కంపెనీ) జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉంటాం’ అని తన ప్రకటనలో పేర్కొంది. అంతేగాక నిందితుడు సర్టిఫైడ్ డెలివరీ ఏజెంట్ కాని పేర్కొంది. అయితే జొమాటో స్టేట్మెంట్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదని, నిందితుడు అధికారిక డెలివరీ భాగస్వామి కాకపోతే బాలిక ఇంటికి ఫుడ్ ఎలా డెలివరీ చేశాడని ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు భద్రతా చర్యలను నిర్మించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అసలేం జరిగిందంటే పుణెలోని యోవలేవాడి ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 19 ఏళ్ల యువతి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఫుడ్ డెలివరీకి వెళ్లిన రయీస్ షైల్జ్ అనే 42 ఏళ్ల యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈఘటన మహారాష్ట్రలో సెప్టెంబర్ చోటుచేసుకుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది. దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం డెలివరీ బాయ్.. ఆమెకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. -
ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..!
ముంబై: ప్రస్తుత రోజుల్లో కోరుకున్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే ఇంటికి చేరవేస్తున్నాయి పలు సంస్థలు. కరోనా వ్యాప్తి తర్వాత చాలా మంది యాప్ల ద్వారా ఇంటికే ఫుడ్ తెప్పించుకుంటున్నారు. అయితే.. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్స్ దుశ్యర్యలకు పాల్పడుతూ కటకటాల పాలైన పలు సంఘటనలు చూసే ఉంటారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలుగు చూసింది. యేవెల్వాడీ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ 42 ఏళ్ల డెలివరీ మ్యాన్.. 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది. దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ముందుగా బాధితురాలు బయపడింది. ఈ సంఘటన సెప్టెంబర్ 17న రాత్రి 9.30 గంటలకు జరిగింది. బాధితురాలి ఇంటి నుంచి వెళ్లిన డెలివరీ బాయ్.. ఆమెకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. ఎలాంటి సాయం కావాలన్న అడగాలని చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ బాయ్ని అరెస్ట్ చేయగా.. తర్వాత బెయిల్పై విడుదలైనట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సర్దార్ పాటిల్ తెలిపారు. ఇదీ చదవండి: వీడియో: ఘోరం.. మరుగుదొడ్డిలో కబడ్డీ ప్లేయర్స్కు భోజనం -
సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్పై వెంటపడి మరీ..
చైతన్యపురి(హైదరాబాద్): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు. చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన.. అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్నగర్లో పట్టుకుని ముందుగా సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్పేటకు చెందిన ఎన్ఆర్ఐ పి.ఆకాష్రాజ్ (26), సైదాబాద్కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. -
నువ్వు తోపు బ్రదర్.. డెలివరీ బాయ్ సాహసానికి మహిళా కస్టమర్ ఫిదా!
ఓ వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. కదులుతున్న రైలును సైతం చేజ్ చేసి ఓ కస్టమర్కు వస్తువును డెలివరీ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. వివిధ రకాల వస్తువులను హోమ్ డెలివరీ అందించే డంజో ఏజెంట్ రన్నింగ్లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. కాగా, సదరు మహిళా కస్టమర్.. ఆ ఏజెంట్ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఘటన ముంబైలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్ వద్ద నిలబడిన ఓ మహిళ.. డంజో డెలివరీ బాయ్ను ఫాస్ట్.. ఫాస్ట్ అంటూ చేతులతో సైగలు చేసింది. దీంతో, అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్ను సదరు మహిళకు అందించాడు. ఆమె దానిని చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని ఒకరు.. అతడికి 10 టైమ్స్ టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు అని మరొకరు కామెంట్స్ చేశారు. Just Came Across This Viral Video. His Dedication Is Really Amazing! #DDLJ #TrendingReels #SRK #Dunzo @DunzoIt @iamsrk @itsKajolD pic.twitter.com/GfGp0zmQLF — Prathamesh Avachare (@onlyprathamesh) September 15, 2022 -
అయ్యో కుక్క ఎంత పనిచేసింది.. తల్లడిల్లిన జొమాటో డెలివరీ బాయ్
అతనో డెలివరీ బాయ్.. జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి అనుకోని ప్రమాదంలో పడ్డాడు. తన జాగ్రత్తలో తాను ఉన్నప్పటికీ ఓ కుక్క అతడి ప్రైవేటు భాగాలపై కరిచింది. దీంతో, డెలివరీ బాయ్ తీవ్రమైన బాధతో కన్నీరు పెట్టుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, కుక్క ఓనర్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల ప్రకారం, ముంబైలో జొమాటో డెలివరీ బాయ్ నరేంద్ర పెరియార్.. పన్వెల్ ప్రాంతంలోని ఇండియాబుల్స్ కాంప్లెక్స్కు వచ్చిన ఫుడ్ ఆర్డర్ను ఇచ్చేందుకు అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఈ క్రమంలో లిఫ్ట్లో భవనంపైకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో అటుగా వచ్చాడు. లిఫ్ట్ తెరిచే క్రమంలోనే కుక్క.. డెలివరీ బాయ్ను కరవబోయింది. వెంటనే తప్పించుకోవడంతో.. లిఫ్ట్లోని నుంచి బయటకు రాగానే డెలివరీ బాయ్ ప్రైవేటు భాగాలపై కుక్క కరిచింది. కాగా, నొప్పి ఉన్నప్పటికీ డెలివరీ బాయ్ చాకచక్యంగా హెల్మెట్ అడ్డుపెట్టుకొని లోపలికి వెళ్లి ఆర్డర్ ఇస్తాడు. అయితే, కుక్క దాడి చేస్తుంటే కంట్రోల్ చేయాల్సిన ఓనర్ ఏదో వింత చూస్తున్నట్టు వ్యవహరిస్తాడు.డెలివరీ బాయ్ నరేంద్ర.. కుక్క చేసిన గాయంతో తీవ్రరక్త స్రావం కావడంతో గట్టిగా అరిచాడు. వెంటనే సహాయం కోసం అరుస్తూ పార్కింగ్ స్థలానికి పరిగెత్తాడు. దీంతో, అపార్ట్మెంట్లోని కొందరు వ్యక్తులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా?
బిర్యానీ, దోశ, స్వీట్స్.. ఇలా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం.. హా ఇంట్లో వండుకొని తింటాం అంటారా.. కానీ ఇప్పుడంతా ఏమంటున్నారో తెలుసా..? వండుకునేంత టైం లేదండీ ఆన్లైన్లో ఫుండ్ ఆర్డర్ చేసుకొని లాగించడమే అని అంటున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ప్రిపరేషన్, డెలివరీ బాయ్ పికప్, ఆర్డర్ డెలివరీ ఎప్పుడు అవుతుందో ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా డెలివరీ ట్రాకింగ్ ఇంటర్ ఫేస్లో బైక్పై వ్యక్తి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్లు చూపిస్తుంది. తాజాగా స్విగ్గీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ను తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాకింగ్లో డెలివరీ పార్ట్నర్ బైక్ ప్లేస్లో స్విగ్గీ డ్రాగన్గా మార్చింది. చదవండి: Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. స్విగ్గీలో ఆర్డర్ ట్రాకింగ్లో ‘ఆకలితో ఉండకండి. మా డ్రాగన్ మీ ఫుడ్ను డెలివరీ చేస్తాడు’ అనే ట్యాగ్లైన్తో కనిపిస్తోంది. అంటే మన ఆర్డర్ను డ్రాగన్ డెలివరీ చేస్తున్నట్లు కస్టమర్లు ఫీల్ అయ్యేలా ఆలోచన చేసింది. ఇక స్విగ్గీలో కొత్తగా హౌజ్ ఆఫ్ డ్రాగన్ థీమ్ కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆర్డర్ ట్రాకింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్విగ్గీ క్రియెటివిటీని మెచ్చుకుంటున్నారు. చదవండి: చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు
ముంబై: పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండటం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్ డ్రెస్సుల్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్ స్నాచర్లు అనేక దోపీడీలు చేసి పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్లుగా వేషాధారణ మార్చుకొని చాకచక్యంగా వారిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివారాల ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమ్నాథ్ ఘర్గే వివరించారు.. ఇద్దరు చైన్ స్నాచర్లపై కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్లో 3, బంగూర్ నగర్ పీఎస్లో ఓ కేసు నమోదయ్యాయి. వీరిని గాలించేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు 300 సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో దొంగతనం చేసే సమయంలో ఉపయోగించిన బైక్ను రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ బైక్ను తీసుకెళ్లేందుకు వస్తారని పోలీసులు ఖచ్చితంగా భావించారు. చదవండి: ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’ దీంతో కస్తూర్బా పోలీసుల బృందమంతా జొమాటో డెలివరీ బాయ్ల దుస్తులను ధరించి స్టేషన్ వద్ద సుమారు 3 రోజులు వేచి ఉన్నారు. అనంతరం నిందితుల్లో ఒకరు తమ బైక్ను తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యండెడ్గా పట్టుకొని పీఎస్కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్లు, దొంగిలించిన గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఫిరోజ్ నాసిర్ షేక్, జాఫర్ యూసుఫ్ జాఫ్రీగా గుర్తించారు. ఇద్దరూ విఠల్వాడి, అంబివిలి నివాసితులుగా తెలిపారు. ఇద్దరు 20కి పైగా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. -
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్పై యువతి దాడి
ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. వర్షం, ట్రాఫిక్ వంటి అడ్డంకులను అధిగమించి ఆహారాన్ని మన వద్దకు చేరుస్తారు డెలివరీ ఏజెంట్లు. కొన్ని సార్లు చిన్న పొరపాట్లు జరిగాయని క్షణికావేశంలో డెలివరీ ఏజెంట్లపై కస్టమర్లు దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దృశ్యాలను బోగాస్04 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్పై దాడికి దిగింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘హాయ్ జొమాటోకేర్.. నా ఆర్డర్ అందించేందుకు వస్తుండగా డెలివరీ బాయ్ దాడికి గురయ్యాడు. అతడి నుంచి ఆర్డర్ లాక్కున్న కొందరు మహిళలు అతడిని షూతో కొట్టారు. నా వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు ఉద్యోగం పోతుందని బాధపడ్డాడు.’ అంటూ రాసుకొచ్చారు నెటిజన్. జొమాటో కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తన ఆర్డర్ గురించి పట్టించుకోనవసరం లేదని, దాడికి గురైన బాధితుడికి సాయం చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
పిల్లలతో ఇంటింటికి తిరుగుతూ ఫుడ్ డెలివరీ.. నెటిజన్లు ఫిదా!
అవాతంరాలను దాటుకుంటూ కుటుంబ పోషన కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న పలువురి వీడియోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి. అలాంటి వీడియోనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురిని ఎత్తుకుని, కొడుకుని చేతపట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆహారం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘ఆయనను చూడంటం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒకవ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి.’ అంటూ రాసుకొచ్చారు సౌరభ్. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆర్డర్ను డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఆ వెనకాలే అతడి కుమారుడు తిరుగుతూ కనిపిస్తున్నాడు. పిల్లలతో కలిసి డెలివరీ చేసేందుకు రావటంపై ఆ వ్యక్తిని అడగగా.. కూతురిని ఇంట్లో వదిలేయలేక తనతో తీసుకొస్తున్నానని, తన కొడుకు డెలివరీ చేయటంలో సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. జొమాటో స్పందన.. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ‘ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. మరోవైపు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Saurabh Panjwani (@foodclubbysaurabhpanjwani) ఇదీ చదవండి: ప్లాస్టిక్లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్పై లీగల్గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్గా ఏడేళ్ల బాలుడు
ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం. ఇంట్లో పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదానికి గురై మంచనా పడితే ఆ బాధ వర్ణనాతీతం. కష్టాల్లో చేయందించే మానవ లోకంలో..అదే కష్టాలను చూస్తే కను చూపు తిప్పుకునే వాళ్లూ ఉన్నారు. అందుకే బడికెళ్లే ఏడేళ్ల బాలుడు డెలివరీ బాయ్గా మారాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. అమ్మా..నాన్న..ఓ అబ్బాయి. అమ్మ చిన్నా చితాకా పనులు చేస్తుంటే.. నాన్న డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే వాడు. అన్యోన్యమైన అనుబంధాలున్న ఆ పచ్చని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో..ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీనితోడు ఆర్ధిక ఇబ్బందులు. ఓ వైపు నాన్న ట్రీట్మెంట్. ఆ పసి హృదయం తల్లడిల్లింది. అయితేనేం ఆ బాలుడు కుంగిపోలేదు. నాన్న వైద్యం, పోషణ కోసం కుటుంబ బారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం స్కూల్కు వెళ్లడం, సాయంత్రం 6గంటల నుంచి 11గంటల వరకు ఫుడ్ ఆర్డర్లు అందించే జొమాటో డెలివరీ బాయ్గా మారాడు. This 7 year boy is doing his father job as his father met with an accident the boy go to school in the morning and after 6 he work as a delivery boy for @zomato we need to motivate the energy of this boy and help his father to get into feet #zomato pic.twitter.com/5KqBv6OVVG — RAHUL MITTAL (@therahulmittal) August 1, 2022 ఈ తరుణంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న రాహుల్ మిట్టల్ అనే యువకుడు ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. రాహుల్కు ఆ ఫుడ్ను అందించేందుకు సైకిల్పై ఆ బాలుడి రావడం.. అతడి గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురైతే తన తండ్రి ప్రొఫైల్ మీద డెలివరీలు అందిస్తున్నట్లు చెప్పాడు. ఆ సంభాషణను రాహుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్గా మారడంతో నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్పందించిన జొమాటో కష్టకాలంలో డెలివరీ బాయ్స్కు అండగా ఉంటామని మరోసారి నిరూపించింది జొమాటో. కొద్ది నెలల క్రితం మద్యం మత్తులో కానిస్టేబుల్ జిలే సింగ్ చేసిన తప్పిదానికి జొమాటో డెలివరీ బాయ్ సలీల్ త్రిపాఠి మరణించాడు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసిన జొమాటో అండగా నిలిచింది. ఆర్ధిక సాయం చేసింది. ఇప్పుడు చిన్న వయస్సులో కుటుంబ బారాన్ని మోస్తున్న ఏడేళ్ల బాలుడికి సాయం చేసేందుకు సిద్ధమైంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న బాలుడి వీడియోపై జొమాటో స్పందించింది. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరింది. -
Crime News: జొమాటో డెలివరీ బాయ్ దారుణ హత్య
భోపాల్: పొట్టకూటి కోసం డెలివరీ బాయ్గా పని చేస్తున్న కుర్రాడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు దుండగులు. చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి అక్కడా నిర్లక్ష్యమే ఎదురైంది. చికిత్స ఆలస్యం కావడంతో ఒక నిండు ప్రాణం బలైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ బాన్గంగా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. సునీల్ వర్మ అనే 20 ఏళ్ల యువకుడు డిగ్రీ చదువుతూనే.. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి తన మోటార్బైక్పై అరబిందో సమీపంలోని కరోల్బాగ్ వద్ద ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ముగ్గురు అతన్ని బైకులపై వెంబడించారు. అతన్ని అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో స్వయంగా బండి నడుపుతూనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. అయితే ఆస్పత్రిలోనూ అతనికి సకాలంలో చికిత్స అందలేదు. ఆలస్యంగా చికిత్స ప్రారంభించిన వైద్యులు.. పరిస్థితి విషమించే సరికి మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి అతను కన్నుమూశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా అతన్ని ముగ్గురు వెంబడించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శరీరంలో ఐదు కత్తిపోట్లు ఉన్నాయని, దొంగతనంలో భాగంగా పెనుగులాటలో అతని బ్యాగ్ చినిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై పలు కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు, నిందితులను పట్టుకుంటామని ఇండోర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు టైంకి చికిత్స అందించని ఆస్పత్రి వర్గాలపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్ట్యాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
ట్రెండ్ మారింది గురూ! ఫుడ్డే కాదండోయ్..రెజ్యూమ్లు డెలివరీ చేస్తాం!
ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్ను పక్కన పెట్టాల్సిందే. ఇన్నోవేటీవ్గా ఆలోచించాల్సిందే.అలా చేస్తేనే జాబ్స్ వస్తాయి. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదిగో ఇలా ఆలోచించిన ఓ యువకుడు వినూత్నంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు. జొమాటోలాంటి దిగ్గజ సంస్థల దృష్టిలో పడుతున్నాడు. సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ ఏం చేస్తుంటారు. కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఫుడ్ను వారికి డెలివరీ చేస్తుంటారు. కానీ బెంగుళూరుకు చెందిన అమన్ ఖండేల్వాల్ అలా కాదు. జొమాటో డ్రెస్ ధరించి నగరంలోని స్టార్టప్లకు తన రెజ్యూమ్లను డెలివరీ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వరకు కరోనా కారణంగా ఉద్యోగం దొరకడం అసాధ్యం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయ్. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. స్టార్టప్లు సైతం వెలుస్తున్నాయి. టెక్నాలజీ తోడుతో ఉద్యోగ అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులు జాబ్స్ కోసం ఆఫీస్ల బాట పట్టారు. కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. Dressed as a @zomato delivery boy I delivered my resume in a box of pastry. Delivered it to a bunch of startups in Bengaluru. Is this a @peakbengaluru moment.@zomato #resume pic.twitter.com/HOZM3TWYsE — Aman Khandelwal (@AmanKhandelwall) July 2, 2022 ఈ నేపథ్యంలో అమన్ ఖండేల్వాల్ ఇంటర్వ్యూలకు వెళ్లే మూసధోరణికి గుడ్బై చెప్పాడు. జొమాటో డ్రెస్ ధరించి డెలివరీ బాక్సుల ద్వారా తన రెజ్యూమ్ను డెలివరీ చేస్తున్నాడు. ఖండేల్వాల్ తన రెజ్యూమ్ డెలివరీ గురించి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు.“జోమాటో డెలివరీ బాయ్గా దుస్తులు ధరించి నేను నారెజ్యూమ్ను ఫుడ్ బాక్స్లో పెట్టి స్టార్టప్లకు డెలివరీ చేస్తున్నాను" అని తెలిపాడు. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఖండేల్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుండి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను పూర్తి చేశాడు. ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ఇంటర్న్షిప్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్ కోసం చూస్తున్నట్లు వెల్లడించాడు. ఇంతకముందు ఇంకెవరైనా.. ఇక రెజ్యూమ్ డెలివరీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యూజర్లు ఖండేల్ వాల్ విన్నూత్నంగా ఆలోచిస్తున్నాడని, 2016లో యూఎస్కు చెందిన మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లూకాస్ య్లా తొలిసారి ఈ టెక్నిక్ను ఉపయోగించాడని గుర్తు చేసుకున్నాడు. లూకాస్ తన రెజ్యూమ్ను డోనట్ బాక్స్లో డెలివరీ చేసేందుకు వీలుగా డెలివరీ బాయ్ దుస్తుల్ని ధరించాడు. ఇప్పుడు ఖండేల్వాల్ సైతం అదే తరహాలో రెజ్యూమ్ డెలివరీ చేయడం ఆసక్తికరంగా మారింది. కొంతమంది నెటిజన్లు సైతం డెలివరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. స్పందించిన జొమాటో ఖండేల్వాల్ ఇన్నోవేటీవ్ థాట్పై జొమాటో స్పందించింది. జొమాటో తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఖండేల్వాల్ పోస్ట్కు ట్యాగ్ చేసింది. “హే అమన్, మీ 'గిగ్'(డెలివరీ) మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఆలోచన చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ - టాప్ ఆఫ్ ది లైన్ అని రిప్లయి ఇచ్చింది. -
స్విగ్గీ బంపర్ ఆఫర్: నెటిజన్ల సెటైర్లు
సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
వాట్ ఎన్ ఐడియా.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. వైరలవుతోన్న వీడియో
ముంబై: ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. వారానికి నాలుగు సార్లైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన సమయంలో డెలివరీ బాయ్స్ ఫుడ్ను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఎండలు, వానలతో సంబంధం లేకుంటా టైమ్కు డెలివరీ అవ్వాల్సిందే. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్స్లో డెలివరీ బాయ్స్ సాధారణంగా బైక్ మీద వస్తుంటారు. కానీ ముంబైలో వర్షాలు ఎక్కువగాపడుతుంటంతో ఓ డెలివరీ బాయ్ వినూత్న ఆలోచన చేశాడు. అతను చేసిన పని తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అతనేం చేశాడంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డుపై నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ తీసుకెళ్లడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలో వర్షాలు కురుస్తుండడంతో బైక్పై ప్రయాణించేందుకు రోడ్లు వీలుగా లేకపోవడంతో స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రమెక్కాడు. వెనక బ్యాగ్ తగిలించుకుని ఆర్డర్లు డెలివరీ చేసేందుకు గుర్రంపై వెళ్తున్నాడు. దీనిని వెనకాల ఉన్న వారు వీడియో తీశారు. జస్ట్ ఏ వైబ్ అనే యూట్యూబ్ చానల్లో ఇది పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డెలివరీ ఆలస్యం కాకూడదని భావించిన డెలివరీ బాయ్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా గుర్రాన్ని ఉపయోగించడం మంచి ఆలోచన.. ఏదో ఒక రోజు మనం వీధుల్లో గుర్రాలపై స్వారీ చేస్తామని ఆశిస్తున్నా.. నా కల నిజమైంది.’ అంటూ స్మైలీ, హార్ట్ ఎమోజీలను పంచుకుంటున్నారు. చదవండి: టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి -
‘మిమ్మల్ని బాగా మిస్సవుతున్నాను’.. వీటినే తలతిక్క పనులు అంటారు!
దేశంలో అనతి కాలంలోనే వటవృక్షంలా ఎదుగుతోంది గిగ్ ఎకానమి. డిగ్రీలు, ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ ఇలాంటివేమీ లేకుండానే వెంటనే నేటి తరం యువత గిగ్ ఎకానమీలో జాబ్లు పొందుతున్నారు. ఫ్లిప్కార్ట్ మొదలు స్విగ్గీ మీదుగా ర్యాపిడో ఎంతో మంది డెలివరీ ఏజెంట్ అవతారంలోకి ఈజీగా మారిపోతున్నారు. అయితే ఇటీవల ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని నెట్టింట సరికొత్త చర్చకు దారి తీసింది. ప్రాప్తి అనే నెటిజన్ ఇటీవల స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ ఏజెంట్ ద్వారా ఫుడ్ను అందుకుంది. కానీ ఆ తర్వాతే కొత్త సమస్య ఎదురైంది. ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి అవాంచిత మెసేజ్లు రావడం మొదలైంది. ‘మీ ప్రవర్త బాగుంది’, ‘మీరు చాలా అందంగా ఉన్నారు’, ‘ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అంటూ వరుసగా మెసేజ్లు రావడం మొదలైంది. ఇవి మరీ శృతి మించిపోవడంతో స్విగ్గీ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసింది. ఇదేం బాగాలేదు ఫిర్యాదు చేసినా స్విగ్గీ నుంచి సరైన స్పందన రాలేదు. మరోవైపు నుంచి డెలివరీ ఏజెంట్ నుంచి మెసేజ్ల దాడి కూడా ఎక్కువైంది. దీంతో తాను పడుతున్న ఇబ్బందనులను ట్విటర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిపింది ప్రాప్తి. డెలవరీ ఏజెంట్ ప్రవర్తనను నిరసిస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. అదే విధంగా సున్నితమైన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్విగ్గీ తీరును కూడా ఖండించారు. క్షమించండి ఎట్టకేలకు స్విగ్గీ దిగి వచ్చింది. ఈ కంపెనీ తరఫున ప్రతినిధులు ప్రాప్తితో మాట్లాడారు. జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఇబ్బందులకు గురి చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పకబ్బంధీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాస్కింగ్ ఫీచర్ ఈకామర్స్ రంగంలో ఉన్న కంపెనీలు సాధారణంగా కస్టమర్లతో వ్యవహారం నడిపేందుకు మాస్కింగ్ ఫీచర్ను ఉపయోగిస్తాయి. ఈ విధానంలో కస్టమర్ నంబర్ డెలివరీ ఏజెంట్కి తెలియకుండా జాగ్రత్త పడతాయి. అయితే గట్టిగా ప్రయత్నిస్తే మాస్క్ ఫీచర్లో కూడా కస్టమర్ల నంబర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మరింత కట్టుదిట్టంగా టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చదవండి: ఏంటీ మీ తొక్కలో సర్వీస్.. ఇలాగైతే కుదరదు మరి.. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డెలివరీ బాయ్ అంటే అంత చులకనా..?
నేను పోలీసును.. నేనేం చేసిన ఎవరూ అడ్డుచెప్పరు.. అనే అహంకారంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ను దారుణంగా కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సింగనల్లూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఓ స్కూల్కు చెందిన బస్సు డ్రెవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి.. బైక్లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరం.. బస్సును ఆపి డ్రైవర్ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకున్న సతీష్.. ఏం జరిగింది అని కూడా అడగకుండా.. డెలివరీ బాయ్ చెంపపై పదే పదే కొట్టాడు. అనంతరం అతడి సెల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సతీష్.. మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్ బస్సు ఓనర్ ఎవరో తెలుసా అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్కు బదిలీ చేశారు. "This happened yesterday evening at the fun mall signal and there was a slight traffic block due to this delivery boy and all of a sudden this Cop Started beating up the Delivery person " . #welovecovai . 👉 IG : FB :TW @WELOVECOVAI .#coimbatore #delivery #deliveryboy #traffic pic.twitter.com/OBEwmghc1R — We Love Covai ❤️ (@welovecovai) June 4, 2022 ఇది కూడా చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్పై దుమారం -
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. యువతులకు అసభ్యకర వీడియోలు పంపి..
బనశంకరి(బెంగళూరు): ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అశ్లీల చిత్రాల వీడియోలను పంపుతున్న వ్యక్తిని బుధవారం ఆగ్నేయ విభాగ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్చేశారు. మడివాళ బైబీమ్ నగరలో ఉండే 40 ఏళ్ల ఫుడ్ డెలివరి బాయ్ నిందితుడు. అతను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా యువతులు, మహిళలకు పోర్న్ను పంపేవాడు. ఫిర్యాదులు రావడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. బావమరిది చేతిలో బావ హతం కేజీఎఫ్: తాగిన మైకంలో స్వంత బావనే బావమరిది హత్య చేసిన ఘటన బంగారుపేట పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్.ఎ మోహన నగర్లో నివాసం జయప్ప (56) తన బామరిది మురళీతో కలిసి మంగళవారం మద్యం తాగి పరస్పరం గొడవ పడ్డారు. ఓ దశలో మురళీ జయప్ప తలపై రాడ్తో బలంగా బాదాడు. దీంతో అతను తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు నిందితుడు మురళీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్య నగ్న ఫొటోలను బంధువులకు షేర్ చేసిన భర్త.. ఆమె ఏం చేసిందంటే? -
డెలివరీ బాయ్లను చులకనగా చూస్తున్నారా!
కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నారు పెద్దలు. కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాల్ని అలవోకగా సాధించవచ్చని నిరూపించాడు ఓ డెలివరీ బాయ్. ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించాలనే కలలు కన్నాడు. ఆ కలల్ని సాకరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. కానీ ఆర్ధిక ఇబ్బందులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలన్న ఆ యువకుడి కలల్ని చిన్నాభిన్నం చేశాయి. అయినా సరే ఓ వైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. మరో వైపు తాను అనుకున్న గోల్ను రీచ్ అయ్యేందుకు శ్రమించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడి రియల్ లైఫ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డెలివరీ బాయ్ అంటే సమాజంలో ఓ చిన్నచూపుండేది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటుంటారని, కస్టమర్లతో మిస్ బిహేవ్ చేస్తుంటారానే అపవాదు ఉండేది. ‘మేమూ మనుషులమే..మమ్మల్ని చులకనగా చూడొద్దని వేడుకుంటున్న వారు..ప్రతిభలో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. కరోనా లాంటి ఆపత్కాల సమయాల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి కస్టమర్లకు కావాల్సిన నిత్యవసర సరుకుల్ని అందించారు. ఓవైపు కుంటుంబం బాధ్యతల్ని మోస్తూనే మరోవైపు ఉన్నతావకాశల కోసం ప్రయత్నించే వారేందరో ఉన్నారు. అలాంటి డెలివరీ బాయ్స్లో ఇప్పటికే ఎంతో మంది ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. తాజాగా ఆ కోవకే చెందుతాడు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు చెందిన డెలివరీ బాయ్ షేక్ అబ్దుల్ సతార్. ఒకప్పుడు డెలివరీ బాయ్ అయిన షేక్ అబ్దుల్ సతార్ ఇప్పుడు ఓ కంపెనీలో సాఫ్ట్వేర్గా ఉద్యోగం సంపాదించాడు. సతార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో సతార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తన రియల్ లైఫ్ స్టోరీని నెటిజన్లతో పంచుకున్నాడు. “నేను కలలు కనే డెలివరీ బాయ్ని. వీలైనంత త్వరగా ఆర్థికంగా ఎదగాలని అనుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న కాంట్రాక్ట్ కార్మికుడు. కాబట్టి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో అందుకే ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని డెలివరీ బాయ్ ఉద్యోగం చేసేవాడిని. ఈ పని చేసేందుకు మొదట్లో నేను చాలా సిగ్గుపడేవాడిని. కానీ డెలివరీ బాయ్ అనుభవం నాకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడింది." అని సతార్ తన లింక్డ్ ఇన్ లో తెలిపాడు. ఒకరోజు, కోడింగ్ నేర్చుకోమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. అందుకు కావాల్సిన కోర్స్లో జాయిన్ అవ్వమని, కోర్స్ వివరాలందించాడు. అతను చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. నేను అతని సూచనను సీరియస్గా తీసుకున్నా. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోడింగ్ నేర్చుకోవడం. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు డెలివరీలు అందించేవాడిని . వాటి ద్వారా సంపాదించిన డబ్బుతో పాకెట్ మనీగానూ, కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగించాను. అదే సమయంలో కోడింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాను. త్వరలో నేను సొంతంగా వెబ్ అప్లికేషన్లను తయారు చేయబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం సతార్ గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ పరిస్థితులే..డెలివరీ బాయ్ పనిచేసేలా దోహదం చేస్తాయి. డెలివరీ బాయ్స్ను చులకనగా చూడొద్దని.. అనుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేధించే సత్తా తమలో ఉందంటూ తోటి డెలివరీ బాయ్స్ ధీమాగా చెబుతున్నారు. -
కుక్కను కరిచాడు!
ఫెయిర్ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
Zomato Delivery: సైకిల్ పోయి బైకు వచ్చే...
దేశవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకున్న రాజస్థాన్లోని జోమాటో డెలివరీ బాయ్ దుర్గా మీనా చిరకాల కోరిక నెరవేరింది. ఇకపై అతడు పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక్కో కష్టాన్ని దాటుకుంటూ వెళ్లగలడు. ఇదే సమయంలో దుర్గామీనాకు అండగా నిలబడిన ఆదిత్య శర్మపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా కష్టాల కారణంగా టీచరు ఉద్యోగం పోయి బతుకుదెరువు కోసం దుర్గామీనా జొమాటో డెలివరీ బాయ్గా మారాడు. అతనికి బైక్ లేకపోవడంతో సైకిల్పైనే ఎర్రటి ఎండలో డెలివరీలు చేస్తున్నాడు. అతడి కష్టాన్ని చూసిన ఆదిత్య శర్మ అనే టీనేజర్ ట్విట్టర్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇలా పోగైన సొమ్ముతో దుర్గామీనాకి ఓ బైక్ను కొనిచ్చారు. ఆదిత్య శర్మ ట్వీట్కి నెటిజన్ల నుంచి మంచి స్పందన రావడంతో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే దుర్గామీనాకి బైక్ వచ్చింది. హీరో షోరూమ్లో బైక్ని హండోవర్ చేసుకునే సమయంలో భావోద్వేగానికి లోనయ్యాడు దుర్గామీనా. కాగా సాటి మనిషి కష్టాలను చూసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపిన ఆదిత్యశర్మని నెటిజన్లు కొనియాడుతున్నారు. ✅❤️ All thanks to you guys. He was emotional during buying bike ❤️ pic.twitter.com/XTgu17byOm — Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022 చదవండి: రాజస్థాన్లో మండిపోతున్న ఎండలు.. సైకిల్పై జొమాటో డెలివరీ.. ఆ తర్వాత.. -
సైకిల్పై వచ్చిన డెలివరీ బాయ్కి బైక్ కొనిచ్చిన జొమాటో యూజర్
రాజస్థాన్కి చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్ కథ నెట్టింట వైరల్గా మారింది. ఎర్రటి ఎండలో ఆ జొమాటో డెలివరీ బాయ్ పడుతున్న కష్టం.. దాన్ని గుర్తించిన ఓ యూజర్.. వెంటనే స్పందించిన నెటిజన్లు.. వెరసి ఓ స్ఫూర్తినిచ్చే ఘటనగా మారింది. రాజస్థాన్కి చెందిన ఆదిత్యశర్మ ఏప్రిల్ 11న మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. కాసేపటికే ఆర్డర్ వచ్చింది. తీసుకుందామని వెళ్లిన ఆదిత్యకు అక్కడ కనిపించిన దృశ్యం కదిలించి వేసింది. రాజస్థాన్లో తీవ్రంగా ఎండలు కొడుతున్న వేళ ఓ వ్యక్తి మిట్టమధ్యాహ్నం చెమటు కక్కుకుంటూ సైకిల్పై జొమాటో ఆర్డర్లు డెలివరీ చేయడం అతన్ని కలిచి వేసింది. దీంతో ఆర్డర్ తీసుకుని అతనితో మాటలు కలిపాడు. కష్టాల్లోకి నెట్టిన కరోనా సైకిల్పై డెలివరీ సర్వీస్ చేస్తున్న ఆ వ్యక్తి పేరు దుర్గామీనా అని. బీకామ్ చదివిన దుర్గా మీనా దాదాపు పన్నెండేళ్లు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో జొమాటో డెలివరీ బాయ్గా మారాడు. క్షణం తీరిక లేకుండా పని చేసినా సైకిల్ మీద పది నుంచి పన్నెండు డెలివరీలు ఇవ్వడం వీలు కావడం లేదు. కొత్త బైకు కొనుక్కునేందుకు డబ్బులు కూడబెడుతున్నా కనీసం డౌన్ పేటెంట్కు కావాల్సినంత అమౌంట్ కూడా కూడటం లేదని తెలిసింది. డౌన్పేమెంట్ కడితే చాలు తన కష్టాలు వింటున్న ఆదిత్య ముందు మరో ప్రపోజల్ ఉంచాడు దుర్గామీనా. తనకు డౌన్పేమెంట్ చెల్లంచి బైక్ కొనిస్తే ఇంకా ఎక్కువ డెలివరీలు చేస్తానని అదనంగా వచ్చే డబ్బుతో నెలవారీ ఈఎంఐలు కట్టుకోవడంతో పాటు డౌన్పేమెంట్గా అందించిన సాయాన్ని నాలుగు నెలల్లో ఇస్తానంటూ తెలిపాడు. అంతేకాదు ఎవరైనా ట్యాబ్, వైఫై సౌకర్యం కల్పించినా టీచింగ్ చేసుకుంటానంటూ మరో ప్రతిపాదన ఆదిత్య ముందు ఉంచాడు దుర్గామీనా. Today my order got delivered to me on time and to my surprise, this time the delivery boy was on a bicycle. today my city temperature is around 42 °C in this scorching heat of Rajasthan he delivered my order on time I asked for some information about him so 1/ pic.twitter.com/wZjHdIzI8z — Aditya Sharma (@Adityaaa_Sharma) April 11, 2022 ట్విట్టర్ స్టోరీ మండే ఎండలో సైకిల్పై డెలివరీ చేస్తున్న దుర్గామీనా ఫోటోను జత చేసి.. మొత్తం స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆదిత్య శర్మ. దుర్గామీనా బైక్ కొనుక్కునేందుకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేయాలంటూ నెటిజన్లను కోరుతూ 2022 ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3:57 గంటలకు మెసేజ్ పెట్టాడు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే దుర్గామీనా బైక్ కొనేందుకు అవసరమైనంత సొమ్ము క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందింది. బైక్ ఆగయా.. కేవలం 24 గంటల్లోనే దుర్గామీనాను ఆదుకునేందుకు నెటిజన్లు భారీగా స్పందించారు. దుర్గామీనా సొంతం చేసుకోబోయే బైకు ఫోటోను 2022 ఏప్రిల్ 12 మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదిత్య శర్మ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సైకిల్ డెలివరీ బాయ్ కథనం నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియా స్ట్రెంథ్, క్రౌడ్ ఫండింగ్ ప్రభావం ఎంటో తెలియజెప్పింది. He is on his way ✅to reach showroom pic.twitter.com/JN1OzPr3wO — Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022 చదవండి: అలా చేస్తేనే రైతుల ఆదాయం రెట్టింపు -
ఫుడ్ డెలివరి బాయ్గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
సోషల్ మీడియాలో సెలబ్రెటీ షాకింగ్ ఫొటో దర్శనం ఇచ్చింది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు డెలివరి బాయ్గా అవతారం ఎత్తి ఒడిసా రోడ్లపై కనిపించాడు. ఇక ఆయనను లైవ్గా చూసిన వారంత నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ నటుడు ఎవరంటే బాలీవుడ్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన ఫుడ్ డెలివరి చేస్తూ ఒడిసా రోడ్లపై కనిపించాడు. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ ఆయనను దగ్గరగా చూసినవారు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం కపిల్ శర్మ నటి, దర్శకురాలు నందిత దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఫుడ్ డెలివరి బాయ్ పాత్రలో కనిపించానున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ ఒడిసాలో షూటింగ్ను జరుపుకుంది. అక్కడ ఎల్లో కలర్ టీ-షర్ట్, డెలివరి బ్యాగ్, బ్లాక్ హెల్మెట్తో ద్విచక్ర వాహనంపై వెళుతూ కనిపించాడు. ఇక ఆయనను అలా చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. దీనికి ‘సర్ మిమ్మల్ని నేను లైవ్లో చూశాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్పై కపిల్ స్పందిస్తూ.. ‘ఎవరికి చెప్పకు’ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా బీటౌన్లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోతో స్టార్ కమెడియన్గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. Kisi ko batana mat 🤓 https://t.co/3rCAjuPKva — Kapil Sharma (@KapilSharmaK9) March 18, 2022 -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
మియాపూర్: డివైడర్ను ఢీకొని అమెజాన్ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, మియాపూర్: ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్ను ఢీకొని ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కృష్ణా జిల్లా, పునాదిపాడు మండలం, కంకిపాడు గ్రామానికి చెందిన రావూరి దుర్గప్రసాద్(37) మియాపూర్లోని ప్రజయ్ సిటీలోని బ్లాక్ నంబర్.5లో ఉంటూ అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య శ్రావణి, మూడేళ్ల పాప ఉన్నారు. ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు బైక్పై ఇంటికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ నంబర్.631 వద్ద డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణం: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పసికందు -
శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!
రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్కు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అండగా నిలిచింది. సలీల్ త్రిపాఠి కుటుంబానికి రూ.10లక్షల బీమాను మంజూరు చేసింది. ఇదే విషయాన్ని జొమాటో సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు జొమాటో డెలివరీ బాయ్లు సైతం సలీల్ కుటుంబానికి రూ.12లక్షల మొత్తాన్ని వారి కుటుంబానికి అందించినట్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా 'మా డెలివరీ పాట్నర్ (డెలివరీ బాయ్) సలీల్ త్రిపాఠి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినందకు బాధపడుతున్నాం. ప్రమాదంలో ఒంటరైన బాధితుడి కుటుంబానికి అండగా నిలిచేలా అన్నీ విధాల సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జొమాటో పాట్నర్ మరణిస్తే వారి కుటుంబానికి జొమాటో వ్యక్తిగతంగా సాయం అందిస్తుంది. ప్రమాదం జరిగిన రాత్రి సలీల్ కుటుంబంతో కలిసి ఆస్పత్రిలోనే ఉన్నాం. మరణించిన తర్వాత ఇతర ఖర్చుల కింద కుటుంబానికి సాహాయం చేశామని' దీపిందర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. We are deeply aggrieved by the death of our delivery partner Salil Tripathi in an unfortunate road incident. We are extending all possible support to help the family get through this – pic.twitter.com/yJOUDsPpet — Deepinder Goyal (@deepigoyal) January 13, 2022 ఇక డెలివరీబాయ్ మరణించిన వారి కుటుంబానికి ఎలాంటి అవసరాలున్నాయో.. వాటి అనుగుణంగా జొమాటో సాయంతో చేసేలా అండగా నిలుస్తోంది.సలీల్ భార్య సుచేతకు ఉద్యోగం కావాలంటే జొమాటో అన్ని ప్రయత్నాలు చేస్తుందని, తద్వారా ఆమె ఇంటిని పోషించడానికి, 10 ఏళ్ల కొడుకును చదివించేందుకు తోడ్పడుతుందని గోయల్ ట్వీట్లో ప్రస్తావించారు. తప్పతాగి గత శనివారం రాత్రి ఢిల్లీలో జొమాటోలో డెలివరీబాయ్ సలీల్ త్రిపాఠీ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వెళుతున్న ఓ కార్ సలీల్ త్రిపాఠీ బైక్ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాధితుడు సలీల్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో సలీల్ మరణానికి కానిస్టేబుల్ జిలే సింగ్ కారణమని నిర్ధారించారు. మద్యం మత్తులో సలీల్ మరణానికి కారణమైన జిలే సింగ్ను పోలీస్ శాఖ అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: శెభాష్ జొమాటో.. అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండు! -
డెలివరీబాయ్ దుర్మరణం.. జొమాటో స్పందన ఇది
ఫుడ్, గ్రాసెసరీస్, రైడ్.. ఇలాంటి సేవలందించే గిగ్ ఎంప్లాయిస్ పడే కష్టాలు, ఇతరత్ర ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితుల్లోనూ అందించే సేవల గురించి తరచూ చూస్తుంటాం. అఫ్కోర్స్.. నాణేనికి రెండో వైపు మాదిరి ఇక్కడా సిన్సియారిటీ లేనివాళ్లూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ.. కంపెనీల నుంచి వాళ్లకు అందే సాయం, తోడ్పాటు విషయంలో మాత్రం విమర్శలే వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా జొమాటో చేసిన ఓ ప్రకటనపై ఇంటర్నెట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ జొమాటో డెలివరీబాయ్ విధుల్లో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోగా.. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది జొమాటో. ‘విధి నిర్వహణలో మా ఎగ్జిక్యూటివ్స్ పడే కష్టం ఏంటో మాకు మాత్రమే తెలుసు. అది అభినందనీయం. కానీ, సకాలంలో అందించాలనే తొందరలో మీరు (డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ను ఉద్దేశించి) ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మీకుటుంబాల గురించి కూడా కాస్త ఆలోచించండి’ అంటూ ఢిల్లీ జొమాటో ప్రతినిధి ఒకరు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీబాయ్ సలిల్ త్రిపాఠి కుటుంబానికి తోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బాధితుడి పేరు సలిల్ త్రిపాఠి. ఢిల్లీ రోహిణి ఏరియాలో ఉంటోంది అతని కుటుంబం. సలిల్ తండ్రి కరోనాతో ఈమధ్యే చనిపోయాడు. దీంతో కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యాడు సలిల్. జొమాటోలో డెలివరీబాయ్గా అతను సంపాదించిన దాంతోనే ఆ కుటుంబం గడుస్తోంది. శనివారం రాత్రి బుధ్ విహార్లో డెలివరీ కోసం వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సలిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ మహేంద్ర.. ఆ సమయంలో తప్పతాగి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 50 లక్షలకు పైగా ఉన్న ఇండియన్ గిగ్ సెక్టార్లో.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఫెయిర్వర్క్2021 లిస్ట్ జాబితా ఈమధ్యే విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయంలో జొమాటో గతంతో పోలిస్తే.. ఉద్యోగుల కోసం మెరుగ్గా ఆలోచిస్తోందని (ఒకటి నుంచి 3 పాయింట్లకు చేరుకుంది) వెల్లడైంది. చదవండి: ఓలా, ఉబెర్.. కనీసం మనుషుల్లా చూడట్లేదా? -
ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!
బీజింగ్: ఒక్కొసారి జీవితంలో మనం ఊహించుకునే దానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలు.. పూర్తిగా తలకిందులుగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే.. మరికొందరు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో వీరు .. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ మిత్రులకు గానీ, దగ్గరి వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెబుతుంటారు. ఈ సమయంలో అవతలివారు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే.. బాధితుల ప్రాణాలు నిలుస్తాయి. తాజాగా, ఒక డెలీవరీ బాయ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ఒక నిండు ప్రాణం నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావీన్స్లో ఒక కస్టమర్ వ్యాపారంలో నష్టపోయాడు. ఈ క్రమంలో తాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహరం తిని చనిపోవాలనుకున్నాడో.. ఏమో గానీ.. ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఈ క్రమంలో.. డెలీవరీబాయ్ డెలీవరీని ఇవ్వడానికి కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ‘ది లాస్ట్ మీల్ ఇన్ మై లైఫ్ ’ ఇది నా జీవితంలో చివరి భోజనం.. అంటూ నోట్ రాసిపెట్టి ఉంది. దీన్ని చూసిన డెలీవరీబాయ్ షాక్కు గురయ్యాడు. కస్టమర్ ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్ను.. తలుపును తీయాలని కోరారు. అయితే, బలవంతంగా లోపలికి వస్తే.. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడిని ఓదార్చి.. మాటల్లో పెట్టారు. ఆ తర్వాత.. బాధితుడు చెప్పిన విషయాన్ని ఓపికతో విన్నారు. కాగా, కస్టమర్.. తాను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా గదిలోపలికి ప్రవేశించారు. కస్టమర్ అప్పటికే బాధతో 60 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడంతో బాధితుడి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం .. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డెలీవరీ బాయ్ను అభినందిస్తున్నారు. -
నిప్పులాంటి నిజం! సిలిండర్పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!
ఇంటి గుమ్మం వద్దకు ఎల్పీజీ సిలిండర్ మోసుకొచ్చే బాయ్స్ నిర్ణీత రీఫిల్ ధరపై అదనంగా వసూలు చేసేది కొంత మొత్తమే అయినా.. మహానగరంలో దినసరి మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.. రోజుకు అక్షరాలా రూ.22.40 లక్షలు. నెలకు రూ.6.72 కోట్ల పైమాటే. సిలిండర్లపై ఇంతలా అదనంగా బాదుతున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ.. ఇది నిప్పులాంటి నిజం. అగ్గిలాంటి వాస్తవం. సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వంట గ్యాస్ ధర మంట మండిస్తుండగా.. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం.. సిలిండర్పై అదనపు మోత మోగిస్తున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సిలిండర్ రీఫిల్ నిర్ణీత ధర కంటే అదనంగా వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గృహాపయోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.952. డోర్డెలివరీ బాయ్స్ మాత్రం రూ.980కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత బిల్లు కంటే రూ.28 అదనం. అయినా చెల్లించాల్సిందే. చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. గ్యాస్ ధర, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితరాలన్నీ కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్ల బిల్లింగ్తో వినియోగదారులకు సిలిండర్ సరఫరా అవుతోంది. చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు రవాణా భారాన్ని మాత్రం డెలివరీ బాయ్స్పై వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ డీలర్లు డెలివరీ బాయ్స్కు నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు డీలర్లు రీఫిల్ డోర్ డెలివరీపై కమీషన్న్ అందిస్తున్నట్లు సమాచారం. వేతనాలు సరిపడకపోవడంతో బాయ్స్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదీ లెక్క.. నగరంలో వంటగ్యాస్ వినియోగదారులు సుమారు 26.80 లక్షల వరకు ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 90 వేల మంది వరకు రీఫిల్ కోసం బుకింగ్ చేస్తుంటారు. ప్రధాన ఆయిల్కంపెనీల సుమారు 115 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు తమ 1,250 బాయ్స్ (సిబ్బంది) ద్వారా ప్రతి నిత్యం కనీసం 80 వేల వరకు రీఫిల్స్ డోర్ డెలివరీ చేస్తుంటాయి. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం ప్రస్తుత సిలిండర్ ధరను బట్టి ఒక్కో రీఫిల్పై రూ.28 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.22.40 లక్షలు అంటే నెలకు వసూలయ్యేది రూ. 6.72 కోట్లకు పైమాటే. ఇలా బహిరంగా దోపిడీ జరుగుతున్నా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేదెలాగో ప్రభుత్వ యంత్రాంగమే జవాబు చెప్పాలి మరి. రీఫిల్ డెలివరీ నిబంధనలివీ... ► వినియోగదారులు ఆన్లైన్లో సిలిండర్ రీ ఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా డిస్ట్రిబ్యూ టర్లు తమ సిబ్బందిచే వినియోగదారులకు రీఫిల్ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ► స్ట్రిబ్యూటర్ తమ గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ డోర్ డెలివరీ చేయాలి. 6– 15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీలకు రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలో మీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి. ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది. ► సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది. -
డెలివరీ బాయ్ నిర్వాకం: ‘మీ ఫుడ్ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’
పిల్లలు ఆకలి అనడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది ఓమహిళ. ఆర్డర్ పెట్టిన తర్వాత తన అడ్రస్ బదులు స్నేహితురాలి ఇంటి చిరునామా ఇచ్చినట్లు గుర్తించింది. వెంటనే డెలివరీ బాయ్కు కాల్ చేసి.. ఆర్డర్లో ఉన్న అడ్రస్కు కాకుండా.. తన ఇంటికి ఫుడ్ తీసుకురమ్మని కోరింది. అందుకు అంగీకరించని డెలివరీ బాయ్.. ఆమె ఆర్డర్ చేసిన ఆహారాన్ని చెత్తలో పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు డెలివరీ బాయ్పై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. జీనెట్ ఎరిక్సన్-గ్రే అనే మహిళ తన ఏడు సంవత్సరాల కుమార్తె కోసం ఉబర్ ఈట్స్లో మెక్డోనాల్డ్స్ హ్యాపీ మీల్స్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత అడ్రస్లో తన ఇంటి చిరునామాకు బదులు.. ఫ్రెండ్ అడ్రస్ ఉన్నట్లు గుర్తించింది. వెంటన్ డెలివరీ బాయ్కు కాల్ చేసి.. అడ్రస్ తప్పుగా ఉంది.. అందులో ఉన్న చిరునామాకు కాకుండా.. ఇప్పుడు తాను చెప్పబోయే అడ్రస్కు ఆర్డర్ తీసుకురావాల్సిందిగా కోరింది. (చదవండి: కాఫీ లేట్ అవుతుందని చెప్పినందుకు ఎత్తి పడేసింది.. అంతా షాక్!) అందుకు డెలివరీ బాయ్ ఒప్పుకోలేదు. ‘‘మొదట ఇచ్చిన అడ్రస్కే ఆర్డర్ తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. కావాలంటే మీరే మీ స్నేహితురాలి ఇంటికి రండి’’ అని తెలిపాడు. అందుకు ఆ మహిళ బయట వర్షం వస్తుంది.. ఆర్డర్లో ఉన్న అడ్రస్కు సమీపంలోనే మా ఇల్లు ఉంది.. దయచేసి రండి.. కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తాను అని తెలిపింది. తన ఇంటి అడ్రస్ని సెండ్ చేసింది. కానీ డెలివరీ బాయ్ అందుకు ససేమీరా అన్నాడు. ఆ తర్వతా సదరు డెలివరీ బాయ్ జీనెట్కు ఓ ఫోటో షేర్ చేశాడు. మీ ఆర్డర్ని ఇక్కడ పడేశాను.. వెళ్లి తీసుకోండి అని మెసేజ్ చేశాడు. తీరా చూస్తే అది తన స్నేహితురాలి ఇల్లు కూడా కాదు.. ఎక్కడో రోడ్డు పక్కన చెత్తలో తాను ఆర్డర్ చేసిన ఫుడ్ని పడేసి వెళ్లాడు. ఇక చేసేదేం లేక జీనెట్ తన పిల్లలను తీసుకుని.. డెలివరీ బాయ్ పంపిన ఫోటోలోని చోటకు వెళ్లింది. కానీ అక్కడ వారికి తాము ఆర్డర్ చేసిన ఫుడ్ కనిపించలేదు. చేసేదేం లేక ఉత్త చేతులతో అక్కడ నుంచి వచ్చేశారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఇక దీని గురించి జీనట్ ఉబర్ యాప్లో ఫిర్యాదు చేసింది. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించలేదు. జరిగిన సంఘటన గురించి జీనట్ సోషల మీడియాలో షేర్ చేయగా.. సదురు డెలివరీ బాయ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. వ్యవహారం కాస్త ముదరడంతో ఉబర్ యాజమాన్యం దీనిపై స్పందించింది. ‘‘మా డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. జీనట్కు క్షమాపణలు తెలుపుతున్నాం. ఆమె డబ్బులను పూర్తిగా తిరిగి ఇవ్వడమేకాక.. ఉబర్ ఈట్స్ క్రెడిట్ని జీనట్కు టిప్గా ఇస్తున్నాం’’ అని తెలిపారు. కానీ జీనట్ మాత్ర మళ్లీ జన్మలో ఉబర్లో ఫుడ్ ఆర్డర్ చేయనని తెలిపింది. చదవండి: మెక్డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్ -
ఆ పని చేసిన జొమాటో బాయ్.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు!
సాధారణంగా మనం ఏదైన పని చేస్తున్నప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తే అంత ఈజీగా ఆ పనిని ముందుకు తీసుకు వెళ్లలేం. అలానే పనిలో ఉండగా పర్సు పోయినట్లు తెలిస్తే అప్పటికప్పుడు అన్ని పనులను పక్కన పెట్టి పోయిన పర్సు కోసం వెతుక్కుంటాం, అంతేనా. తాజాగా ఓ జొమాటో డెలివరీ బాయ్కి ఇదే పరిస్థితి ఎదురైతే తాను చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. మరి అంతగా ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే.. తనకు వచ్చిన ఫుడ్ ఆర్డర్ని తీసుకోవడానికి రెస్టారెంట్కు వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్డర్ తీసుకుని తిరిగు ప్రయాణమవుతున్న సమయంలో అతని పర్సు పోయిందని గ్రహించాడు. అయితే పోయిన తన పర్సు కోసం ఆలోచించక తన చేస్తున్న పని పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు కదిలాడు. ఈ క్రమంలో ఆ డెలివరీ బాయ్ కస్టమర్కి కాస్త ఆలస్యంగా డెలివరీ చేశాడు. అందుకు అతను క్షమాపణలు కూడా కస్టమర్కు చెప్పాడు. ఈ విషయాన్ని సచిన్ కాల్బాగ్ అనే ఒక జొమాటో యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. వృత్తిపై అతని నిబద్ధత చూసి తనకు మతిపోయిందని మెచ్చుకున్నాడు. దీనిపై స్పందించిన జొమాటో ఇలాంటి డెలివరీ పార్టనర్లతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ ఆర్డర్ వివరాలు తమకు మెసేజిలో పంపితే అతనికి సహాయం అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ట్విటర్లో అతని కథ వైరల్గా మారి హల్ చల్ చేస్తోంది. Hi @zomato @deepigoyal, mindblown by Manish Bhageluram Gupta's work ethic. He accidentally dropped his wallet at a restaurant where he picked up our food. It was stolen. Instead of waiting there, he came to our house to deliver our order, and even said sorry for the short delay. pic.twitter.com/N6DBiRo91h — Sachin Kalbag (@SachinKalbag) October 16, 2021 -
ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మాజీ మంత్రి నేడు డెలివరీ బాయ్గా
అఫ్గానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ భయంతో పక్కదేశాలకు తరలి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. మొన్నటి దాక అధికారంలో ఉన్న ఆయన ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్నారు. ఆయనే అఫ్గానిస్తాన్ ఐటీ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్. మొన్నటి దాక స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్ ఇప్పుడు విదేశంలో పిజ్జాలు అందించడంపై దృష్టి పెట్టారు. ఈ దుస్థితికి గల కారణాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘గతేడాది దేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీతో తనకు విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశా. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా జీవనం సాగింది. అనంతరం నా వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్గా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. సాదత్ ప్రస్తుతం జర్మన్లోని లీప్జిగ్ పట్టణంలో పిజ్జాలు సైకిల్పై డెలివరీ చేస్తున్నారు. ఈ పని చేయడానికి తానేమీ మొహమాట పడడం లేదని పేర్కొన్నారు. సాదత్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్లో మొబైల్ నెట్వర్కింగ్ అభివృద్ధి చేశారు. మాజీ మంత్రిగా మారిన అనంతరం స్వదేశంలోనే ఉన్నారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి తాలిబన్లు ఆక్రమించే వారం రోజుల ముందే జర్మన్కు వచ్చేశారు. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో కుటుంబ పోషణ కోసం విధిలేక డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. وزير الاتصالات والتكنولوجيا الأفغاني السابق سيد أحمد سادات يلجأ لمهنة توصيل طلبات الطعام على متن دراجة هوائية في مدينة لايبزيغ الألمانية التي وصلها نهاية عام 2020، بعد تخليه عن منصبه pic.twitter.com/zfFERbqCmD — قناة الجزيرة (@AJArabic) August 24, 2021 -
కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి డెలివరీ బాయ్ షాక్!
ఫుడ్ డెలివరీ యాప్లు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాటికి ఆర్డర్లు ఇస్తున్నారు. కరోనా సమయంలో ఫుడ్ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. డెలివరీ యాప్లకు సంబంధించిన వార్తలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఓ సంఘటన వైరల్గా మారింది. ఆర్డర్ పెట్టిన కస్టమర్కు ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ టిప్ అడిగాడు. అయితే అప్పటికే కస్టమర్ వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్కు ఊహించని టిప్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు. సీసీ టీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. పిజ్జాను తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. టిప్ ఇవ్వాలని డెలివరీ బాయ్ అడగ్గా.. ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్) తీసుకో’ అని కస్టమర్ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్ ‘మీరేమైనా జోక్ చేస్తున్నారా’! అని ప్రశ్నించాడు. ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్టాక్లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. ఈ భిన్నమైన స్పందన లభిస్తోంది. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. -
భార్య కోరికలు తీర్చడం కోసం కొత్త పెళ్లి కొడుకు తిప్పలు
ముంబై: కొత్తగా పెళ్లైంది. భార్యను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఆమె ఏం కోరితే అది తెచ్చి భార్యకివ్వాలనుకున్నాడు. కానీ వాస్తవంగా పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. చేసేదేమో ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగం. ఆ సంపాదనతో భార్య కోరికలు తీర్చడం కష్టం అని భావించి చైన్ స్నాచర్గా మారాడు. కట్ చేస్తే పోలీసులకు చిక్కి కటకటాల్లో చేరాడు. ఈ సంఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పుణె వాకడ్ ప్రాంతానికి యాదవ్ అనే వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతడికి వివాహం అయ్యింది. కొత్తగా పెళ్లైంది.. ఇక భార్య గోముగా తన కోరికల చిట్టా విప్పడంతో యాదవ్కు ఏం చేయాలో పాలుపోలేదు. ఫుడ్ డెలవరీ బాయ్గా తనకు వచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రవృత్తిగా చైన్ స్నాచింగ్ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు నెట్టింట్లో పలు చైన్ స్నాచింగ్ వీడియోలను నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగాడు యాదవ్. ఇక చైన్ స్నాచింగ్ చేయడం కోసం యాదవ్ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడి.. సుమారు 121 గ్రాముల బంగారం.. రెండు బైక్లు దొంగిలించాడు. ఈ క్రమంలో ఆదివారం వాకడే ప్రాంతాన్ని తన టార్గెట్గా ఎంచుకున్నాడు యాదవ్. ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించసాగాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు యాదవ్ కదలికల్లో తేడా కొట్టింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాదవ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. -
Zomato: డెలివరీ బాయ్ జీవితం మార్చేసిన ‘ఆరోజు రాత్రి’
సాక్షి, హైదరాబాద్: పేదరికంతో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ యువకుడు అతికష్టమ్మీద చేతనైన పని చేస్తున్నాడు. జొమాటోలో డెలివరీ బాయ్గా చేరాడు. అయితే అతడు డెలివరీ చేసేది సైకిల్పై. నిజమే జొమాటో యాప్లో వచ్చిన ఆర్డర్లు తన సైకిల్పై డెలివరీ చేస్తుంటాడు. పేదరికంతో బైక్ లేక సైకిల్పై ఆర్డర్లు ఇస్తున్న విషయాన్ని ఓ కస్టమర్ చూశాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే అతడి వివరాలు కనుక్కుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హైదరాబాద్ ప్రజలు చేదోడుగా నిలిచారు. అందరి సహాయంతో ఇప్పుడు ఆ యువకుడికి బైక్ లభించింది. ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 14వ తేదీన హైదరాబాద్లోని కింగ్కోఠికి చెందిన రాబిన్ ముకేశ్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ను పాతబస్తీలోని తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆకీల్ (21) లక్డీకాపూల్ నుంచి పార్సిల్ తీసుకుని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్కోఠిలో ఇచ్చేందుకు వెళ్లాడు. పార్సిల్ తీసుకోవడానికి కిందకు వచ్చిన రాబిన్ ముకేశ్ ఆకీల్ను చూసి షాకయ్యాడు. అతడు డెలివరీ చేసేది ఒక సైకిల్పై అని తెలుసుకుని చలించిపోయాడు. పైగా వర్షంలో తడుచుకుంటూ సైకిల్పై రావడంతో అతడి పరిస్థితి తెలుసుకున్నాడు. ఆకీల్ది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదన అంతత మాత్రమే ఉండడంతో ఆకీల్ డెలివరీ బాయ్గా చేరాడు. బైక్ కొనే స్థోమత లేక సైకిల్పైనే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. జొమాటో వారికి తన పరిస్థితి చెప్పి సైకిల్పై డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ చేస్తూనే ఆకీల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదంతా విన్న రాబిన్ వెంటనే ఈ విషయాలన్నీ 32 వేల మంది ఉన్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. అతడికి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొనేందుకు రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా వెంటనే స్పందించి తోచినంత సహాయం చేశారు. దీంతో రెండు రోజుల్లోనే రూ.73 వేలు పోగయ్యాయి. ఆ డబ్బులతో రాబిన్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొని ఆకిల్కు అందించాడు. బైక్తో పాటు హెల్మెట్, రెయిన్ కోట్, శానిటైజర్, మాస్క్లు, మిగిలిన డబ్బులను ఆకీల్ బీటెక్ చదువు ఫీజుల కోసం అందించారు. బైక్ రావడంతో ఇప్పుడు మరిన్ని ఆర్డర్లు చేసి అధిక ఆదాయం పొందుతానని ఆకీల్ చెబుతున్నాడు. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫేసుబుక్ గ్రూప్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. ఆకీల్ కుటుంబానికి తాము సహాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. ఆకీల్ పరిస్థితిపై జూన్ 17న ‘సాక్షి’లో ‘ముందుకు సాగిపో.. నీ గమ్యం చేరిపో’ అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మహ్మద్ ఆకీల్కు ద్విచక్ర వాహనం అందిస్తున్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేసుబుక్ గ్రూప్ ప్రతినిధులు -
స్విగ్గీ డెలివరీ బాయ్ని చితకబాది.. నగదు చోరీ
బెంగళూరు: జొమాటో డెలివరీ బాయ్ సంఘటన మరువక ముందే కర్ణాటకలో అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ సారి బాధితుడు స్విగ్గీ డెలివరీ బాయ్. ఉచితంగా భోజనం ఇవ్వనన్నందుకు స్విగ్గీ డెలివరీ బాయ్ని నలుగురు యువకులు దారుణంగా చితకబాదారు. మే 28న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కార్తీక్ హరిప్రసాద్(25) అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న సాయంత్రం 4 గంటలకు రాజాజీనగర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ క్రమంలో కార్తీక్ వారు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆర్డర్ చేశాక సదరు వ్యక్తులు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. ఇక కార్తీక్ ఫుడ్ తీసుకెళ్లి వారికి ఇచ్చి.. డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ వారు తాము ఆర్డర్ క్యాన్సిల్ చేశామని.. ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కార్తీక్ అందుకు ఒప్పుకోలేదు. ఈ ఆహారాన్ని బయట ఆకలితో ఉన్న వారికి ఇస్తానని తెలిపాడు. ఈ క్రమంలో కార్తీక్కు, ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో నిందితులు కార్తీక్ను చితకబాది.. అతడి చేతిలో నుంచి మొబైల్, హెల్మెట్ లాక్కుని విసిరేశారు. ఆ తర్వాత అతడి వాలెట్ నుంచి 1800 రూపాయలు దొంగతనం చేశారు. కార్తీక్ తలపై రాళ్లతో కొట్టి.. రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి పారిపోయారు. కార్తీక్ అదృష్టం కొద్ది వేరే డెలవరీ బాయ్స్ అతడిని గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్ స్నేహితుడు ఒకరు జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చాలా మంది నెటిజనులు కార్తీక్కు ధన సహాయం చేయడానిక ముందుకు వచ్చారు. ఈ సమయంలో తనకు మగాది రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా సాయం చేశాడని.. తనతో నిరంతరం టచ్లో ఉన్నాడని తెలిపాడు. ఇక త్వరలోనే బెంగళూరుకు వచ్చి.. తన మీద దాడి చేసిన కస్టమర్ల మీద ఫిర్యాదు చేస్తానని తెలిపాడు కార్తీక్. స్విగ్గీ కంపెనీ సదరు కస్టమర్ల వివరాలు పోలీసులకు అందజేస్తుందన్నాడు. ఇక కంపెనీ, పోలీసులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపాడు కార్తీక్. 4 CUSTOMERS BEAT UP DELIVERY EXECUTIVE! A delivery executive from #Swiggy was assaulted & left to bleed in #Bengaluru after customers refused to pay for food on May 28. 4 customers who failed to cancel the order, refused to pay which led to an argument.@NehaHebbs reports! pic.twitter.com/i4FkR4GCL0 — Mirror Now (@MirrorNow) June 8, 2021 చదవండి: ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే... స్విగ్గీ ఆర్డర్..ఇల్లు దోచేశారు! -
ఓరి నాయనో, ఏకంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ అవతారం!
కోవిడ్ సెకండ్ వేవ్ను అడ్డుకోవడానికి ఉద్దేశించిన లాక్డౌన్ను నగరంలో శనివారం నుంచి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వచి్చన వారిపై చెక్ పోస్టుల్లోని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనేక మంది యువకులు బయట సంచరించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పాసులు, గడువు ముగిసిన లెటర్లు, పాత తేదీలతో ఉన్న మందుల చీటీలను చూపించి పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ తరహాకు చెందిన ఉదంతాలు వందల సంఖ్యలో వెలుగు చూశాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పాసులు, లెటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరో ‘‘చిలకలగూడ ప్రాంతానికి చెందిన ఓ చికెన్ షాపు నిర్వాహకుడు తన వాహనంపై ప్రెస్ అని రాయించాడు. ఇతడి వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. అప్పుడు కానీ అతగాడు అసలు విషయం చెప్పలేదు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ప్రెస్ అని రాయించినట్లు చెప్పడంతో వారు అవాక్కయ్యారు.’’ గ్రేటర్లో ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అత్యవసర సేవలతో పాటు కీలకాంశాలకు సంబంధించి బయటకువచి్చన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారు బయటకు రావడానికి వినియోగించిన వాహనాన్ని స్వా«దీనం చేసుకుంటున్నారు. వీటిని లాక్డౌన్ తర్వాతే తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. (చదవండి: ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు !) ► అత్యవసర ప్రయాణాలు, వ్యవసాయ అవసరా లు, ఇతర తప్పనిసరి అంశాల కోసం పోలీసు వి భాగం ఈ–పాస్ జారీ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారు తెలిపిన కారణాలతో పాటు ఇతర పూర్వాపరాలు పరిశీలించి వీటిని ఇస్తున్నారు. ► ఈ పాస్లు తమకు రావని భావిస్తున్న వారితో పాటు సరదాగా బయట సంచరించాలనే ఉద్దేశంతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వాహనాలపై ప్రెస్ అని రాయించుకుంటున్నారు. ► మరికొందరైతే గత ఏడాది జారీ చేసిన పాసులతో తిరుగుతున్నారు. ఇంకొందరు ఆకతాయిలు వేరే వారికి జారీ చేసిన పాసుల్లో మార్పు చేర్పులు చేసుకుని తమ వాహనాలపై ఏర్పాటు చేసుకుని సంచరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ► వీరంతా ఒక ఎత్తయితే... డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతున్న వారిది మరో ఎత్తు. ఫుడ్తో పాటు ఈ–కామర్స్ డెలివరీ సంస్థలకు చెందిన టీ–షర్టులు వేసుకుని, ఏదో ఒక బ్యాగ్ పట్టుకుని శని, ఆదివారాల్లో అనేక మంది రోడ్డెక్కారు. ► ఇలా అడ్డదారులు తొక్కుతూ శనివారం వందల సంఖ్యలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పా టు చేసిన చెక్ పోస్టుల్లో చిక్కారు. ఈ కారణంగానే డెలివరీ బాయ్స్ను కూడా ఆపి తనిఖీ చేశారు. ► ఈ పంథాలో బయటకు వస్తున్న వాళ్లంతా ఆకతాయిలు కాదని పోలీసుల వివరిస్తున్నారు. అత్యవసర పనులపై వస్తున్న వారు, ఈ–పాస్ జారీ ఆలస్యమైన వాళ్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నారని వివరిస్తున్నారు. ► దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చిక్కిన వారందరి ప ట్లా ఒకే వైఖరి అవలంబించట్లేదని చెబుతున్నారు. (చదవండి: పంటలపై ‘లాక్డౌన్’ పిడుగు) -
ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే...
సాక్షి, కురవి (జయశంకర్ భూపాలపల్లి): ఓ ఆన్లైన్ సంస్థలో బ్లూటూత్ హెడ్సెట్ బుక్ చేస్తే ఖాళీ డబ్బా వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని మల్సూర్గౌడ్ బోట్ కంపెనీ బ్లూ టూత్ కోసం ఆర్డర్ చేశాడు. మంగళవారం కొరియర్ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన బాక్స్ తీసుకుని రూ.1,670 చెల్లించాడు. ఆ తర్వాత డబ్బాలో ఏమీ లేకపోవడంతో డెలివరీ బాయ్ను నిలదీశాడు. తన చేతిలో ఏమీ ఉండదని ఆయన చెప్పగా, వాదనకు దిగడంతో చివరకు డెలివరీ బాయ్ డబ్బు ఇచ్చేసి వెళ్లిపోయాడు. -
డెలివరీ బాక్స్లో ముసిముసి నవ్వుల ‘చిన్నారి’
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది తల్లులు తమ చంటి పిల్లల్నీ ఎదరు పొట్టకుగానీ వెనుక వీపు మీద కట్టుకుని పనిచేస్తూ.. జీవనం సాగిస్తూంటారు. ఇది మనం రెగ్యులర్గా ఎక్కడో ఒకదగ్గర చూస్తూనే ఉంటాము. యాచించే స్త్రీలు అయితే పిల్లల్ని చూపిస్తూ డబ్బులు అడుగుతుంటారు. అయితే చైనాలో ఓ తండ్రి మాత్రం తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో చంటిబిడ్డను వెంటబెట్టుకుని మరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ చిన్నారి పాప కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ.. తండ్రితోపాటు తనుకూడా వస్తువులను డెలివరీ చేస్తోంది. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో ప్రస్తుతం ముసిముసి నవ్వుల డెలివరీ గార్ల్ ‘బుజ్జాయి’ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన లీ యువాన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. రోజూ తన స్కూటర్ మీద వస్తువులను డెలివరీ చేసే యువాన్ తన రెండేళ్ల కూతుర్ని డెలివరీ బాక్స్లో కూర్చోబెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాడు. డెలివరీ బాక్స్లో తన కూతురి కోసం డయపర్లు, తను తినే ఫుడ్ను తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఎటు వెళ్తే అటు తీసుకెళ్తున్నాడు. రోజూ తను ఎక్కడకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది తెలియని పసిమనుసు..ఎవరైనా చూడగానే అందంగా నవ్వుతూ హాయ్ చెబుతోంది. లీయువాన్ మాట్లాడుతూ..‘‘తన కూతురు లీ ఫెర్రీ ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తనకి నిమోనియా ఉన్నట్లు తెలిసింది. అప్పటి నుంచి తన చికిత్సకు చాలా ఖర్చవుతోంది. సేవింగ్స్లో ఎక్కువ భాగం ట్రీట్మెంట్కే కేటాయిస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఈ క్రమంలోనే లీఫెర్రీనీ చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఉదయం తనని తనతోపాటు తీసుకెళ్తాను. సాయంత్రానికి ఇంటికి వచ్చాక లీఫ్రెర్రీ రాత్రంతా అమ్మతో గడుపుతోంది’’ ఇలా తనని చూసుకునే సమయాన్నీ షేర్ చేసుకున్నాము’’ అని లీయువాన్ చెప్పాడు. లీ ఫెర్రీ ఆరునెలల వయసు ఉన్నప్పటినుంచే తనని నా డెలివరీ బాక్స్లో కూర్చోపెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాను. ఇది కాస్త కష్టంగా ఉన్నప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం ఫెర్రీ పెద్దది అయ్యింది. రెండేళ్లు నిండడంతో తను ఇప్పుడు నడవ గలుగుతుంది. దీంతో తనని వెనుకాల కూర్చోపెట్టుకుని తీసుకెళ్లగలుగుతున్నాను’’అని లీ చెప్పాడు. ప్రస్తుతం నడుస్తోన్న ఫెర్రీ తండ్రితోపాటు డెలివరీ చేసేందుకు తెగ ముచ్చటపడుతూ తండ్రి వెనక హుషారుగా కూర్చుంటోంది. నెలల పసికందునుంచి రెండేళ్ల చిన్నారివరకు ఫెర్రీ డెలివరీ చేయడానికి వెళ్లిన వీడియోలు వైరల్ అవుతుండడంతో నెటిజన్లు లీయువాన్ను అభినందిస్తున్నారు. -
జొమాటో వివాదం: చంపుతామని బెదిరిస్తున్నారు
సాక్షి, బెంగళూరు: నెట్టింట అగ్గి రాజుకుంటున్న జొమాటో వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు! తప్పు నాది కంటే నాది కాదని అటు జొమాటో బాయ్ కామరాజ్, ఇటు ఆర్డర్ అందుకున్న యువతి హితేషా చంద్రాణి ఇరువురు ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రెండుగా చీలిపోయి ఇద్దరికీ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వ్యతిరేకతపై కలత చెందిన హితేషా చంద్రాణి గురువారం నాడు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ లేఖను షేర్ చేసింది. "డెలివరీ బాయ్ నా మీద దాడి చేశాడన్న విషయాన్ని చెప్పినప్పటి నుంచి సెలబ్రిటీలతో సహా చాలామంది నన్ను మాటలతో చంపుతున్నారు. కొందరైతే చంపుతామంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాకు, నా కుటుంబానికి హాని తలపెడతామని హెచ్చరిస్తున్నారు. నా జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫోన్లు, మెసేజ్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్.. ఇలా అన్ని వేదికలను ఆసరాగా చేసుకుని నాపై వేధింపులకు దిగుతున్నారు. నాకు సపోర్ట్ చేయండని చాటింపు చేసేందుకు నాకేం పీఆర్ టీం లేదు. ప్రస్తుతం నా ముక్కుకు అయిన గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. అయితే కొందరు తప్పు నాదే అన్నట్లుగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో వాస్తవమెంత? అని ఆలోచించకుండానే కొందరు సెలబ్రిటీలు నాదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ గొడవకు నేనే కారణమని చెప్తున్నారు. సెలబ్రిటీల నోటి నుంచి వచ్చే మాటలు జనాలను ప్రభావితం చేస్తాయి. అలాంటిది వారే ఇలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది. మరికొందరు డెలివరీ బాయ్పై నేను చేసిన కంప్లైంట్ను వెనక్కు తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా అందరికీ చెప్పొచ్చేదేంటంటే నేను ఎక్కడికీ పారిపోలేదు. బెంగళూరులోనే ఉన్నాను. పోలీసులకు సహకరిస్తున్నాను. కొన్ని రోజులుగా నా జీవితం నేను బతకడమే కష్టమైపోయింది. నాకు కనీస రక్షణ కరువైంది. ఏదేమైనా దర్యాప్తులో అసలు నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటా. అప్పటి వరకు నా జీవితానికి, గౌరవమర్యాదలకు, ప్రశాంతతకు భంగం కలిగించకండి. అసలు నిజం బయటకొచ్చేవరకు దయచేసి ఎవరూ ఈ వివాదం గురించి స్పందించకండి" అని నెటిన్లను అభ్యర్థించింది. కాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా స్పందిస్తూ డెలివరీ బాయ్ అమాయకుడంటూ అతడికే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. యువతిది తప్పని తేలితే ఆమెను తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్ చేసింది. చదవకండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్ జొమాటో వివాదం : ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్ -
జొమాటో వివాదం.. ఇదట సంగతి
-
జొమాటో వివాదం : ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్
సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో గత కొన్ని రోజులుగా మరోసారి వార్తల్లో నిలిచింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్, యువతిపై దాడి వివాదం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. జొమాటో బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మొదలు రోజుకొక కొత్త వెర్షన్ వెలుగులోకి వస్తోంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలీవుడ్ హీరోయిన్ సహా కొంతమంది హితేషా చంద్రాణీకి మద్దతిస్తోంటే.. మరికొందరు డెలివరీ బాయ్కు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దశలో చంద్రాణిపై భారీ ట్రోలింగే నడిచింది. అటు తనకే పాపం తెలియదని, తనకు హయ్యస్ట్ రేటింగ్ ఉందంటూ జొమాటో బాయ్ కామరాజ్ వాదిస్తున్నారు. కేసులు నమోదైనాయి. విచారణ జరుగుతోంది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. (యువతిపై జొమాటో బాయ్ పిడిగుద్దులు: వైరల్) -
జొమాటో వివాదం: పరారీలో యువతి..!
బెంగళూరు: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న జొమాటో వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెలివరీ బాయ్ తనను కొట్టాడని ఆరోపించిన యువతి హితేషా చంద్రాణి బెంగళూరు నుంచి పారిపోయినట్లు సమాచారం. డెలివరీ బాయ్ కామరాజ్ చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆమెని విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. కానీ ఆమె ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. మహారాష్ట్ర వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేం చంద్రాణి మీద కేసు నమోదు చేశాం. విచారణకు రావాల్సిందిగా కోరాం. అయితే ఆమె ‘‘ప్రస్తుతం నేను సిటీలో లేను.. మహారాష్ట్రలోని మా బంధువుల ఇంటికి వెళ్లాను’’ అని తెలిపింది. బెంగళూరు వచ్చాక విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాం. ఒకవేళ చంద్రాణి విచారణకు హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తాం’’ అన్నారు. అంతేకాక ప్రసుత్తం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. చంద్రాణి ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు కామరాజ్ను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద విడుదలైన అతను చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా తనను అవమానించిందని.. నేరపూరిత బెదిరింపులకు పాల్పడిందని.. తన మీదకు షూ విసిరి అవమానించిందని.. తప్పుడు ఫిర్యాదుతో తన పరువు తీసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లు సహా ఎక్కువ మంది నెటిజనులు డెలివరీ బాయ్కు మద్దతుగా నిలుస్తున్నారు. వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్ లీగల్ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్ -
కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్
బెంగళూరు: గత కొద్ది రోజులుగా యువతి-జొమాటో డెలివరీ బాయ్ల మధ్య వివాదానికి సంబంధించిన వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన కామరాజ్ సదరు యువతిపై కేసు పెట్టాడు. తనపై ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదయ్యిందో.. అదే పీఎస్లో ఆమెపై కేసు పెట్టాడు. ఈ సందర్భంగా కామరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను సదరు యువతిపై ఎలాంటి దాడి చేయలేదు. డెలివరీ ఆలస్యం అయినందుకు నేను ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాను. ఆర్డర్ క్యాన్సిల్ అయినందున ఫుడ్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాను. కానీ ఆమె అంగీకరించలేదు. పైగా నన్ను అసభ్య పదజాలంతో దూషించింది. నా మీదకు షూ విసిరింది. ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుంది. చివరకు నేను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆమె నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. అవమానించింది. అందుకే ఆమెపై కేసు పెట్టాను’’ అన్నాడు. కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సదరు యువతి మాత్రం ‘‘ముందు నేను డెలివరీ బాయ్ను తిట్టలేదు. ఫస్ట్ అతనే చాలా రూడ్గా ప్రవర్తించాడు. ఆ భయంలో, కంగారులో నేను అతడిని తిట్టాను. అంతే తప్ప కావాలని అతడిని దూషించలేదు.. అవమానించలేదు’’ అని తెలిపారు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియా జనాలు రెండుగా విడిపోయారు. కొందరు సదరు యువతికి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం డెలివరీ బాయ్ను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్ -
జొమాటో వివాదం: ఈ ఘటన సిగ్గుచేటు అంటున్న హీరోయిన్
-
డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్
సాక్షి, బెంగళూరు: ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకు జొమాటో డెలివరీ బాయ్ తనపై పిడిగుద్దులు కురిపించాడంటూ బెంగళూరు మహిళ హితేషా చంద్రానీ తీసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళే తనను తిట్టి, చెప్పులతో కొట్టి అవమానించిందని సదరు డెలివరీ బాయ్ కామరాజ్ మీడియాకు తెలిపాడు. కాస్త ఆలస్యంగా వెళ్లినందుకు ఆర్డర్ తీసుకుని డబ్బులివ్వకుండా నెట్టివేసిందని ఈ క్రమంలోనే ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం కారిందని డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. ఆమెపై తను చేయి చేసుకోలేదని, అన్యాయంగా తనను కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు మహిళకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం డెలివరీ బాయ్ మాటల్లో నిజమున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఈ వివాదంపై స్పందించింది. దయచేసి ఈ విషయంలో నిజానిజాలేంటో నిగ్గు తేల్చి ప్రజలముందుంచండని జొమాటో యాజమాన్యాన్ని కోరింది. "ఒకవేళ అతడు అమాయకుడైతే(నేనైతే అతడు ఏ పాపం ఎరుగడనే నమ్ముతున్నా) ఆ యువతిని శిక్షించండి. ఈ ఘటన నిజంగా అమానవీయం, సిగ్గుచేటు, గుండె తరుక్కుపోతోంది. దయచేసి ఈ విషయంలో నేనేమైనా సాయం చేయగలనేమో చెప్పండి" అని అభ్యర్థిస్తూ ట్వీట్ చేసింది. కాగా ఈ వివాదంలో డెలివరీ బాయ్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా గురువారం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతడు గత 26 నెలలుగా జొమాటోలో పని చేస్తున్నాడు. తను అందించిన సేవలకు గానూ 4.75/5 రేటింగ్ పొందాడు. మరి ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలోనూ #JusticeForKamraj హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. Zomato India - PLEASE find and publicly report the truth.. If the gentleman is innocent (and I believe he is), PLEASE help us penalise the woman in question. This is inhuman, shameful and heartbreaking .. Please let me know how I can help.. #ZomatoDeliveryGuy @zomato @zomatoin — Parineeti Chopra (@ParineetiChopra) March 14, 2021 చదవండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్ ‘ఆ గాయం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.. ఆమే స్వయంగా’ -
యువతి- జొమాటో డెలివరీ బాయ్ వివాదంలో ట్విస్టు!
బెంగళూరు: మహిళా కస్టమర్- ఫుడ్ డెలివరీ బాయ్ వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్ లీగల్ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు మేం సహకరిస్తున్నాం. హితేషతో మేం కాంటాక్ట్లో ఉన్నాం. తన వైద్య ఖర్చులు భరిస్తున్నాం. అదే విధంగా కామరాజ్తో కూడా టచ్లోఉన్నాం. ఇద్దరూ తమ తమ వాదనలతో ముందుకు వచ్చారు. నిజం ఏమిటన్నది తెలుసుకోవడమే మా మొదటి ప్రాధాన్యం. అప్పటి వరకు ఇద్దరికి కావాల్సిన సహాయం అందిస్తాం’’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక కస్టమర్పై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామరాజ్, గత 26 నెలలుగా తమ సంస్థతో కలిసి పనిచేస్తున్నారన్న గోయల్.. ‘‘అతడు ఇప్పటి వరకు 5 వేల ఫుడ్ డెలివరీలు చేశాడు. తన సేవలకు గానూ 4.75/5 రేటింగ్ పొందాడు. నిజం నిర్ధారణ అయ్యేంత వరకు తనకు మద్దతుగా ఉంటాం’’ అని స్పష్టం చేశారు. జొమాటోలో భోజనం ఆర్డర్ చేసిన బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ హితేషా చంద్రానీ, ఫుడ్ డెలివరీ బాయ్ తనపై పిడి గుద్దులు కురిపించాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎందుకు ఆలస్యం చేశారని అడిగినందుకు, రక్తం వచ్చేలా తనపై దాడి చేశాడంటూ ఆమె విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో డెలివరీ బాయ్ కామరాజ్, జొమాటోపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. గాయాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది! ఈ నేపథ్యంలో కామరాజ్ గురువారం న్యూస్ మినిట్తో మాట్లాడుతూ.. ‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్ ప్యాకెట్ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్ I want to chime in about the incident that happened in Bengaluru a few days ago. @zomato pic.twitter.com/8mM9prpMsx — Deepinder Goyal (@deepigoyal) March 12, 2021 -
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్పై దాడి చేసిన జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ కామరాజ్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్చేశారు. మంగళవారం మధ్యాహ్నం హితేశా చంద్రాణి అనే మహిళ జొమాటో యాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేశారు. నిర్ధేశిత సమయం దాటి సాయంత్రం 4.30 అయినా భోజనం ఇంకా డెలివరీ కాకపోవడంతో ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేశారు. ఇంతలో ఫుడ్ డెలివరీ బాయ్ కామరాజ్.. ఆ డెలివరీతో ఇంటికొచ్చాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేశానని కామరాజ్తో చంద్రాణి చెప్పారు. అయినా వినకుండా ఇంట్లోకి చొరబడి కామరాజ్ ఫుడ్ పార్శిల్ను పెట్టడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు చంద్రాణిని కామరాజ్ కొట్టడంతో ఆమె ముక్కుపై గాయాలయ్యాయి. దాడి విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు కామరాజ్ను అరెస్ట్చేశారు. చంద్రాణికి తమ తరఫున క్షమాపణ చెబుతున్నామని, ఆమెకు వైద్య చికిత్స సాయం అందిస్తామని ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’ ట్వీట్ చేసింది. చదవండి: (యువతిపై జొమాటో బాయ్ పిడిగుద్దులు: వైరల్) -
జొమాటో డెలివరీ బాయ్ దౌర్జన్యం
-
యువతిపై జొమాటో బాయ్ పిడిగుద్దులు: వైరల్
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. తాజాగా జొమాటో డెలివరీ బాయ్ ఒక మహిళపై దాడికి పాల్పడ్డాడు. స్వల్ప వివాదంతో ఆమెపై రక్తమొచ్చేలా అనుచితంగా దాడిచేశాడు. దీంతో తన అనుభవాన్ని ఇన్స్టాలో షేర్ చేశారు. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న ముఖంతో ఉన్న వీడియోను అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే మార్చి 9 న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ ఇచ్చానంటూ హితేషా తన అనుభవాన్ని వెల్లడించారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉందని, అయితే సమయానికి ఆర్డర్ రాలేదని ఆమె ఆరోపించారు. దీంతో ఆర్డర్ ఆలస్యం కావడంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి, తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని బెంగళూరుకు చెందిన కంటెంట్ సృష్టికర్త మేకప్ ఆర్టిస్ట్ హితేషా కోరింది. ఇంతలోనే డెలివరీ బాయ్ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఈ సందర్భంగా వాదనకు దిగిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. తరువాత ఆర్డర్ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా అంటూ వాపోయారు. దయచేసి తనకు మద్దతుగా నిలవాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. క్షమించండి : జొమాటో మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన జొమాటో విచారం వ్యక్తం చేసింది. హితేషాకు క్షమాపణలు తెలిపింది. ఆమెకు అవసరమైన వైద్య సహాయంతోపాటు, దర్యాప్తునకు సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే సంబంధిత డెలివరీ ఎగ్జిక్యూటివ్ను తొలగించామని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చింది. నిందితుడి అరెస్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెర్షన్ వేరేలా ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు. డెలివరీ ఆలస్యం కావడంతో డబ్బులు రిఫండ్ కావాలని డిమాండ్ చేయడంతో, అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పానన్నాడని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆమె చెప్పులతో తనను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఆత్మరక్షణలో భాగంగా నెట్టడంతో ఆమెకు గాయమైందన్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు -
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్ దీన గాథ
ఆకలేస్తే ఇంట్లో ఉంది తింటాం, లేదంటే ఒక్క క్లిక్కుతో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. డెలివరీ బాయ్ ఆ ఫుడ్ పార్సిల్ను చేతికందించగానే ఆవురావురుమంటూ తృప్తిగా ఆరగిస్తాం. అయితే ఎంత ట్రాఫిక్లో ఉన్నా, ఏ మూలనో ఉన్నా చెప్పిన సమయానికి మన దగ్గరకు చేరుకునేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. కానీ ఎవరూ ఈ కష్టాన్ని గుర్తించరు, కొందరైతే కనీసం గౌరవించరు కూడా! ఈ క్రమంలో వారి కన్నీటి గాధలను కళ్లకు కట్టినట్లు చెప్పాడు ఉబర్ ఈట్స్కు చెందిన డెలివరీ డ్రైవర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా అది వీక్షకుల మనసులను కదిలించి వేస్తోంది. మీరందరూ మా డెలివరీ డ్రైవర్లను తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. "ఆర్డర్ తీసుకోవడానికి ఓ వ్యక్తి కిందకు రాలేదు. దీంతో నాకు ఆ డెలివరీ ఇవ్వడానికి 45 నిమిషాలు పట్టడంతో పాటు మూడు డాలర్లు ఖర్చయ్యాయి. అతడు నాకు ఒకటిన్నర డాలర్లు టిప్పు ఇచ్చాడు. ఈ డెలివరీ చేసినందుకు ఉబర్ నాకు రెండున్నర డాలర్లు మాత్రమే ఇస్తుంది. నిలువ నీడ లేని నేను పొట్టకూటి కోసం నిద్ర మానుకుని మరీ ఈ చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటున్నాను. అయినప్పటికీ చాలామంది జనాలు డెలివరీ డ్రైవర్లకు కనీసం టిప్పు కూడా ఇవ్వరు. కరోనాను కూడా లెక్క చేయకుండా మా ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా ఎవ్వరూ మమ్మల్ని ఖాతరు చేయరు" అని తెగ బాధపడ్డాడు. ఈ వీడియో చూసి చలించిపోయిన నెటిజన్లు అతడిపై సానుభూతి వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం, ఇక నుంచి నేను డెలివరీ బాయ్స్కు మూడున్నర డాలర్ల టిప్పిస్తాను అని ముందుకొస్తున్నారు. బర్నర్డ్ హవక్యాంప్ అనే వ్యక్తి అతడికి వంద డాలర్లు పంపించానని, మీరు కూడా పంపించండంటూ పిలుపునిచ్చాడు. చదవండి: ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’ డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం.. -
‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయటం ఒకెత్తయితే.. దారి మర్చిపోయిన డెలివరీ బాయ్కి అడ్రస్ చెప్పటం మరో ఎత్తు. రాత్రి వేళల్లో అయితే ఈ పని మరింత కష్టంగా ఉంటుంది. మనం చెప్పే దానికి చీకట్లో అతడు చూసే దానికి పొంతన లేక.. ఆకలి చచ్చిపోయేవరకు అతడికి రూటు చెబుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కోవటానికి ఓ చక్కటి ఉపాయం ఆలోచించాడు ఓ కస్టమర్. ఫుడ్ డెలివరీ బాయ్కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్ను వాడాడు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి ‘‘ఎస్పీఎక్స్సీ’’ ట్విటర్ ఖాతాదారుడు ఊబర్ ఫుడ్స్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఆయన ఇంటిని కనుక్కోలేక ఫోన్ చేశాడు. దీంతో డెలివరీ బాయ్కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్ను ఉపయోగించాడాయన. అతడు వస్తున్న వైపు లైటు వేసి ‘ఆకాశాన్ని చూడు.. బ్లూ లైటు వెంబడి రా!’ అని చెప్పాడు. డెలివరీ బాయ్ మొదట తికమకకు గురైనా తర్వాత బ్లూ లైటు వెంట ఇంటికి వచ్చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎస్పీఎక్స్సీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ హ్యాకింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను కూడా ఇలాంటి హ్యాక్ను వాడతాను..’’ ‘‘నా జీవితంలో ఇలాంటి బీమ్ లైట్లు చాలా అవసరం’’ .. ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’’.. ‘‘ సూపర్: ఇలా కూడా అడ్రస్ చెప్పొచ్చా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి! -
కరెంట్ షాక్తో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
అబిడ్స్: అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో విద్యుత్ వైరు తెగిపడడంతో స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిదిలోని గోడేకికబార్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ముస్తాఫ్ఉద్దీన్(40) స్విగ్గీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గోషామహల్ పాన్మండి నుండి మంగళ్హాట్ ప్రాంతానికి గురువారం అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి అతనిపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్ ఉద్దీన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న కొంత మంది స్థానికులు షాహినాయత్గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ అజయ్కుమార్, ఎస్ఐ కిషన్లు విద్యుత్ అధికారులను రపించి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దాదాపు 3 గంటల పాటు శుక్రవారం తెల్లవారు జాము వరకు గోడేకికబర్, మంగళ్హాట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాన్స్జెండర్తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
లేడీ కస్టమర్ విచిత్ర రిక్వెస్ట్.. మాజీ ప్రియుడి ముఖంపై
బీజింగ్ : ఓ లేడీ కస్టమర్ విచిత్రమైన రిక్వెస్ట్తో ఫుడ్ డెలివరీ బాయ్ షాక్ అయ్యాడు. అనంతరం కస్టమర్ రిక్వెస్ట్ వెనకున్న బలమైన కారణం అర్థం చేసుకున్నాడు. కస్టమర్ కోరినట్లుగానే ఆమె మాజీ ప్రియుడి ముఖంపై కాఫీ చల్లాడు. వివరాలు.. చైనాలోని షాంగ్డాంగ్కు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సైట్లో ఓ కాఫీ ఆర్డర్ చేసింది. అయితే అది తనకోసం కాదు! మాజీ ప్రియుడి కోసం. ‘‘ అతడితో మర్యాదగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. అతడి ముఖంపై కాఫీ చల్లితే సరిపోతుంది’’ అని ఫుడ్ డెలివరీ బాయ్ని ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంది. కస్టమర్ విచిత్రమైన రిక్వెస్ట్తో డెలివరీ బాయ్ మొదట షాక్ అయినా.. ఆ తర్వాత ఆమె చెప్పినట్లుగానే చేయటానికి సిద్ధపడ్డాడు. ( లైవ్లో ఏడ్చేసిన హీరోయిన్ ) ఆమె మాజీ ప్రియుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనే అతడిపై కాఫీ చల్లాడు. కస్టమర్ మాజీ ప్రియుడు.. డెలివరీ బాయ్ చర్యతో షాక్ తిన్నాడు. ఏం జరుగుతోందో అర్థంకాక అతడివైపు చూశాడు. డెలివరీ బాయ్ ఆ వెంటనే తన చేతిలోని ఓ చీటీ ముక్క కస్టమర్ మాజీ ప్రియుడి చేతిలో పెట్టి, క్షమాపణలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్ల వద్దనుంచి మిశ్రమ స్పందన వస్తోంది. -
లేడీ కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ బాయ్
లండన్ : ఆన్లైన్ ద్వారా మీరు ఫుడ్ ఆర్డర్ చేసి దాని కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. పిచ్చ ఆకలి మీద ఉండి.. పదేపదే తలుపు వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ డోర్ బెల్ మోగిస్తాడా అని. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ దారిలో ఉంది... డెలివరీ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడు అంటూ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. రావాల్సిన ఫుడ్ రాలేదు. దానికి బదులు ‘‘ సారీ అండీ! మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ నేను తినేశాను’’ అని డెలివరీ బాయ్నుంచి మెసేజ్ వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు?.. మామూలుగా అయితే కోపంతో ఊగిపోతారు. పుడ్ డెలివరీ కంపెనీకి ఫోన్ చేసి నిలదీస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఉద్యోగం పోయేలా చేసి ఆకలి చల్లార్చుకుంటారు. కానీ, బ్రిటన్కు చెందిన ఇల్లీ అనే యువతి మాత్రం అలా చేయలేదు. తన కడుపు మాడ్చిన డెలివరీ బాయ్ కడుపు కొట్టకుండా అతడు చేసిన పనికి నవ్వుకుని ఊరుకుంది. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? ) వివరాల్లోకి వెళితే.. లండన్కు చెందిన ఇల్లీ ఇలీస్ అనే 21 ఏళ్ల యువతి గత శనివారం ఊబర్ ఈట్స్ యాప్లో రెండు బర్గర్లు, చిప్స్, చికెన్ వ్రాప్స్ ఆర్డర్ చేసింది. వాటి విలువ దాదాపు 1500 రూపాయలు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత ‘ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ దారిలో ఉంది’ అని నోటిఫికేషన్ వచ్చింది. మరికొద్దిసేపటి తర్వాత ‘డెలివరీ బాయ్ మీకు దగ్గరలో ఉన్నాడు’ అని వచ్చింది. ఇల్లీ ఎంతో ఆత్రుతగా తను ఆర్డర్ చేసిన ఆహారం కోసం ఎదురుచూడసాగింది. ఏ క్షణంలోనైనా డోర్ బెల్ మోగవచ్చని తలుపువైపు చూడసాగింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఆశలు అడియాశలు చేశాడు. ‘సారీ లవ్! నేను నీ ఫుడ్ తినేశాను’ అని మెసేజ్ పెట్టాడు. దీంతో కంగుతిన్న ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఊబర్ ఈట్స్ యాప్ ఓపెన్ చేసి చూసింది. ఆహారం డెలివరీ అయినట్లు అందులో చూపించింది. ఊబర్ కంపెనీకి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసి ఆహారాన్ని తిరిగిపొందే అవకాశం ఉన్నా ఆమె అలా చేయలేదు. దీనిపై ఇల్లీ మాట్లాడుతూ.. ‘‘ ఏమో! అతడికి నిజంగానే ఆకలిగా ఉన్నట్లుంది అందుకే తినేసుంటాడు. ఈ కరోనా కష్టకాలంలో అతడి ఉద్యోగం పోవటానికి నేను కారణం కాదల్చుకోలేదు. నాకెందుకో అదంతా కామెడీగా అనిపించింది. ఇలా నాకెప్పుడూ జరగలేదు. అతడి మెసేజ్తో నాకు నవ్వొచ్చింది. అందుకే అతడ్ని క్షమించేశాను’’ అని అంది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. సుబ్బరంగా మెక్కాడు
లండన్: ఫుడ్ డెలివరీ బాయ్ల నిర్వాకాలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు వచ్చాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ని మార్గమధ్యలోనే ఒపెన్ చేసి తినడం వంటి వార్తలు గతంలో చాలా చూశాం. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి.. వారు బుక్ చేసుకున్న ఆహారాన్ని తాను తినేశాడు. అది కూడా ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఇంటి బయటనే కూర్చుని దర్జగా లాగించేశాడు. సదరు కస్టమర్ డెలివరీ బాయ్ చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. వివరాలు.. లండన్ కెంటిష్ టౌన్లో నివాసం ఉంటున్న మహిళ స్థానిక మెక్డొనాల్డ్స్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక దాన్ని ట్రాక్ చేస్తుండగా.. ఇంటి దాక వచ్చిన ఆర్డర్ సడెన్గా క్యాన్సిల్ అయ్యింది. తన ప్రమేయం లేకుండా ఆర్డర్ ఎలా క్యాన్సిల్ అయ్యిందని ఆలోచిస్తుండగా.. తన ఇంటి బయట మెక్డొనాల్డ్స్ డెలివరీ బాయ్ కూర్చుని.. ఫుడ్ని ఒపెన్ చేయడం చూసింది. (చదవండి: వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్) అనుమానంతో తనకు పంపిన డెలివరీ బాయ్ నంబర్కు కాల్ చేయగా.. తన ఇంటి బయట ఉన్న వ్యక్తి ఫోన్ రింగవ్వటం.. అతడు కట్ చేయడం ఆమె గమనించింది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్ అక్కడే ఇంటి బయట కూర్చుని ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ని సుబ్బరంగా లాగించేశాడు. ఈ తతంగం మొత్తాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోది. ఈ సందర్భంగా మెక్డొనాల్డ్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా ఆహారం, సేవలతో కస్టమర్లు మనసు గెలుచుకోవాలనేది మా లక్ష్యం. ఇక ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే.. మాకు తెలియజేయండి. ఇలాంటి వాటిని మేం అస్సలు సహించం. ఇక ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!
సాధారణంగా ఈ కామర్స్ నుంచి వచ్చే డెలివరీలు బైక్లపై తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తారు ఏజెంట్లు. ఒక వేళ ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువు పెద్దదైతే వ్యాన్లో తీసుకొస్తారు. ఇది అందరు ఏజెంట్లు చేసే పనే. అయితే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఓ కశ్మిర్ ఏజెంట్ మాత్రం వెరైటీగా ఆర్డర్లు డెలివరీ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. బైక్, వ్యాన్ కాకుండా గుర్రంపై వెళ్లి పార్సిల్ అందజేశాడు. శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్లో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదాలన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లకు సమయానికి పార్సిల్ని అందించాలని భావించిన ఓ అమేజాన్ ఏజెంట్కు ఓ చక్కటి ఉపాయం వచ్చింది. రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ... కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అమేజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. కాగా, తనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని సదరు ఏజెంట్ చెబుతున్నాడు. అలాగే కొందరు అత్యవసరాల కోసం ఆర్డర్లు చేస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ మార్గంలో వెళ్లి సమయానికి వారికి ఆర్డర్లను అందిస్తున్నానని చెప్పారు. Amazon delivery innovation 🐎#Srinagar #Kashmir #snow pic.twitter.com/oeGIBajeQN — Umar Ganie (@UmarGanie1) January 12, 2021 -
ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు
న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్, ఎక్కువ డిస్కౌంట్లు వంటి వాటి వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ అంటే ఆసక్తి చూపుతున్నారు. నిత్యావసరాల నుంచి ఎలాక్ట్రానిక్ పరికరాల వరకు ప్రతిదానిని ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ ఒకరు ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందంటూ కస్టమర్కి అబద్దం చెప్పి మొబైల్ని అమ్ముకున్నాడు. కస్టమర్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ కిద్వాయ్ నగర్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్లో మొబైల్ని బుక్ చేశాడు. అక్టోబర్ 1న అది డెలివరీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో డెలివరీ బాయ్ అతడి ఇంటికి వచ్చి.. మీ ఆర్డర్ క్యాన్సల్ అయ్యింది.. త్వరలోనే మీ డబ్బు తిరిగి రీఫండ్ చేస్తారని చెప్పాడు. దాంతో అతడు అమెజాన్ సైట్లోకి వెళ్లి రీఫండ్ గురించి కంప్లైంట్ చేశాడు. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం) దీని గురించి చెక్ చేసిన అమెజాన్ అతడి మొబైల్ ఆల్రెడీ డెలివరీ చేశామని చెప్పింది. దాంతో అతడు కిద్వాయి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడిని ఢిల్లీ జవహర్ క్యాంప్కి చెందిన మనోజ్గా గుర్తించారు. ఇక విచారణలో డబ్బు అవసరం ఉండటంతో మొబైల్ని తానే అమ్ముకున్నానని తెలిపాడు. -
డెలివరీ బాయ్ ఘనకార్యం.. అశ్లీల చిత్రాలు, వీడియోలు
సాక్షి, అమీర్పేట: యాప్ ద్వారా ఆన్లైన్లో ఆహార పదార్థాలను తెప్పించుకున్న ఓ మహిళకు మొబైల్ ఫోన్లో అశ్లీల సందేశాలు, చిత్రాలు పంపి వేధిస్తున్న డెలివరీ బాయ్పై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. అమీర్పేట ఈస్ట్ శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన మహిళ గత నెల 31న మొబైల్ యాప్లోని రాపిడో బైక్ టాక్సీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. రవి అనే డెలివరీ బాయ్ వాటిని తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన డబ్బును గూగుల్ పేద్వారా చెల్లించి నిర్ధారణ కోసం రవి సెల్ ఫోన్కు స్క్రీన్ షాట్ పంపింది. మూడు రోజుల తరువాత రవి సదరు మహిళ ఫోన్కు అశ్లీల చిత్రాలు, వీడియోల సందేశాలను పంపడం ప్రారంభించాడు. దీంతో ఆమె నంబరును బ్లాక్ చేసింది. అయినా మరో సెల్ నంబర్ ద్వారా వేధించగసాగాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రవి కోసం గాలిస్తున్నారు. -
వైరల్: మనసు మార్చుకున్న దొంగలు!
దొంగలు ఎప్పుడైనా ఏం చేస్తారు. మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. వినకపోతే చితగ్గొట్టి మరీ విలువైన వస్తువుల్ని కొల్లగుడుతుంటారు. అయితే, పాకిస్తాన్లోని కరాచీలో మాత్రం ఓ ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గర దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు అతనికి ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లిపోయారు. వివరాలు.. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ను బెదిరించి అతని మనీ పర్స్, ఇతర విలువైన వస్తువులు లాక్కున్నారు. బైక్ ఎక్కి అక్కడి నుంచి ఉడాయిద్దామనుకున్నారు. కానీ, అంతలోనే మనసు మార్చుకుని... సదరు డెలివరీ బాయ్కి ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంతకూ వారి మనసు మారడానికి కారణమేంటో తెలుసా? దొంగలు తన వద్ద నున్న సొమ్ములను తీస్కుకుంటున్నప్పుడు సదరు డెలివరీ బాయ్ నిశ్చేష్టుడయ్యాడు. ఏమీ చేయలేక, వారిపై తిరగబడలేక ఏడుస్తూ ఉండిపోయాడు. దాంతో ఆ దొంగలు వస్తువుల్ని తిరిగి ఇచ్చేశారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. నిముషం నిడివి గల ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అయింది. దొంగల్లో కూడా మానవత్వం దాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘వీళ్లు మామూలు దొంగలు కాదు. మనసు దోచుయున్న మంచి దొంగలు’ అని మరికొందరు పేర్కొన్నారు. (చదవండి: గాల్వన్ లోయ మాదే : చైనా) -
వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్
వూహాన్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అడుగు బయటకు పెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ మనకోసం నిత్యావసర సరుకులు, ఆహారాన్ని అందించడానికి డెలివరీ బాయ్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన జనాలు వారిపై తమకు తోచినవిధంగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. అయితే తొలిసారిగా కరోనా బయటపడ్డ వూహాన్ నగరంలో ఓ డెలివరీ బాయ్కు మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే ఏప్రిల్ 15న కూడా తనకు వచ్చిన ఆర్డర్లను చూసుకుని వాటిని డెలివరీ చేస్తున్నాడు. అందులో భాగంగా రాత్రి వచ్చిన కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేకరీకి వెళ్లగా షాపులో పనిచేసే వ్యక్తి అది తనకోసమేనని చెప్పాడు. (ఓవర్నైట్లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ) దీంతో అయోమయానికి లోనైన ఆ యువకుడు "పొరపాటుపడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి" అని మరీమరీ చెప్పగా అతను మళ్లీ డెలివరీ బాయ్ పేరే చెప్పాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన డెలివరీ బాయ్కు అప్పుడు గుర్తుకు వచ్చింది ఆరోజు తన పుట్టిన రోజని. ఉప్పొంగుకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కేక్ తీసుకుని బేకరీ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కళ్ల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ ఆ కేక్ను ఆదుర్దాగా తిన్నాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "ఆ అజ్ఞాత కస్టమర్ ఎవరో కానీ డెలివరీ బాయ్కు జీవితాంతం గుర్తుండిపోయే కానుకిచ్చార"ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (డెలివరీ బాయ్ వెంటపడుతున్న నెటిజన్లు) -
డెలివరీ బాయ్ ముస్లిం అని...
థానే: ముస్లిం డెలివరీ బాయ్ నుంచి సరుకులు తీసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. కశిమీరా ప్రాంతానికి చెందిన ఘనశ్యామ్ చతుర్వేది ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేశాడు. వీటిని డెలివరీ చేసేందుకు ఓ ముస్లిం వ్యక్తి మంగళవారం చతుర్వేది ఇంటికి వచ్చాడు. అతను ముఖానికి మాస్కులతోపాటు చేతులకు గ్లవ్స్ కూడా ధరించి ముందుజాగ్రత్త చర్యలను పాటించాడు. ఇంతలో చతుర్వేది, తన భార్యతో కలిసి గేటు దగ్గరకు వచ్చి ముందు అతడి పేరు అడిగాడు. అతను సమాధానం చెప్పగానే ముస్లిం అని అర్థమై సరుకులు తీసుకోడానికి నిరాకరించాడు. ముస్లిం తెచ్చిన వస్తువులను ముట్టుకునేది లేదని కరాఖండిగా చెప్పాడు. దీంతో ఖంగుతిన్న డెలివరీ బాయ్ అక్కడ సంభాషణ అంతటినీ ఫోన్లో రికార్డు చేసి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చతుర్వేదిని అరెస్టు చేశారు. నేడు అతడిని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. (రోడ్లపైకి భారీగా జనం.. గుంజీలు తీయించిన పోలీసులు) -
హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ బాయ్కు కరోనా
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్కు కరోనా సోకిన ఘటన మరువకముందే హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దీనికి తబ్లిగి జమాత్ సభ్యుల ఆధ్యాత్మిక కార్యక్రమానికి లింకు ఉండటంతో మర్కజ్ నీడలు ఇంకా చెరిగిపోలేదని రుజువు చేస్తోంది. నాంపల్లిలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సుమారు ఏడాది నుంచి ఆన్లైన్ ఫుడ్ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లిరాగా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని కుటుంబం మొత్తాన్ని సరోజినీ దేవీ ఆసుపత్రిలో క్వారంటైన్కు తరలించారు. (పిజ్జా డెలివరీ బాయ్కు కరోనా) అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో డెలివరీ బాయ్ నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. తాజా ఫలితాల్లో శనివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతను ఏయే రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని సేకరించాడు? ఎక్కడెక్కడ ఫుడ్ డెలివరీ చేశాడు? అనే వివరాలను సేకరిస్తున్నారు. సుమారు 25 మందికి ఫుడ్ డెలివరీ చేశాడని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అతనితోపాటు పనిచేసిన వారందరూ వెంటనే క్వారంటైన్కు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. (‘కరోనా’ ఆటవిడుపు) -
ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే...
-
ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే...
హృదయాన్ని కదిలించే చాలా విషయాల్ని మనం ట్వీటర్లో చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. ఫెడ్ఎక్స్ డెలీవరీ బాయ్ ఒకరు తాను డెలీవరీ ఇవ్వడానికి వెళ్లిన ఇంట్లో 11 ఏళ్ల పాప ఆటో ఇమ్యూనే అనే వ్యాధితో బాధపడుతుందని వాళ్ల ఇంటి డోర్ మీద ఉన్న దాన్ని చదివాడు. వెంటనే అతను బయటకు శానిటైజర్ తెచ్చి పార్శిల్ని చక్కగా తుడిచి వారికి అందించాడు. వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఆ పాపను కాపాడటానికి అతను చేసిన ప్రయత్నాన్ని అమెరికాకు చెందిన క్యారీ బ్లాసీ తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు. దానికి సంబంధించిన వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా ఆమె తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. (వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం) మేం ప్యాకేజీలు డెలివరీ చేసే వారికి కోసం మా 11 ఏళ్ల పాప టైప్ 1 డయాబెటిక్ అని మా తలుపు మీద రాశాము. ఇది చూసిన ఫెడ్ఎక్స్ డెలివరీ బాయ్ నేను మీ డోర్ మీద ఉన్న నోటీసును చూడగానే నేను ఈ బాక్స్ని శానిటైజర్తో శుభ్రం చేశాను అని రాసి బాక్స్ను మాకు డెలివరీ చేశాడు అని తెలిపారు. అయితే వీటన్నింటికి సంబంధించి ఆమె చేసిన 24 సెకన్ల నిడివి గల వీడియోని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు మాకు కూడా అలాంటి వ్యాధితో బాధపడే పాప ఉంది ఈ వీడియో చూడగానే కళ్లలో నీళ్లు వచ్చాయి అని కామెంట్ చేశారు. (వైరల్: థ్యాంక్స్ చెప్పిన తల్లి ఏనుగు.. నెటిజన్లు ఫిదా) -
ఒకే రోజులో 70 డబ్బాల కోక్, వయాగ్ర డెలివరీ
బ్రసీలియా: కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో ఇళ్లలో ఉండే వారికి నిత్యావసరాల కొరత ఏర్పడటంతో డెలివరీ బాయ్స్ డిమాండ్ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే డెలివరీ బాయ్స్గా పనిస్తున్నారు. వారిలో బ్రెజిల్కు చెందిన ‘ఎరిక్ థియాగో(22)’ అనే వ్యక్తి ఒకరు. అయితే ప్రతి ఒక్కరు తమకు నిర్దేశించిన పనిగంటల్లో మాత్రమే పని చేస్తుంటే.. థియాగో మాత్రం 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాడు. (కరోనా : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!) బ్రెజిల్లో ఇప్పటికే మూడు వేల కేసులు నమోదవ్వగా.. 77 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి బ్రెజిల్ నగరంలో 12 మిలియన్ల మంది ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 22 ఏళ్ల కుర్రాడు థియాగో మాత్రం రోడ్లపై తిరుగుతూ ఇళ్లలో ఉండే వారి కోసం కిరాణ సామాన్లు, కూరగాయలు, మందులు వంటి వాటిని డెలివరీ చేస్తున్నాడు. అంతేగాకుండా ముఖానికి మాస్క్ వేసుకోకుండానే ఈ పని పూర్తి చేస్తున్నాడు. కేవలం హ్యండ్ శానిటైజర్ను తన వద్ద ఉంచుకొని, ప్రతి డెలివరీ తర్వాత శానిటైజర్ను ఉపయోగిస్తున్నాడు. కాగా థియాగో ‘రాపి’ అనే మొబైల్ యాప్ ద్వారా తన సేవలు కొనసాగిస్తున్నాడు. లాటిన్ అమెరికాలో దాదాపు రెండు లక్షల మంది ఈ యాప్ ద్వారా పని చేస్తున్నారు. (మాంద్యం వచ్చేసింది..) ఈ విషయంపై ఎరిక్ థియాగో ప్రశ్నించగా.. ‘నేను అనారోగ్యానికి గురయ్యే వరకు, లేదా ప్రభుత్వం తనను బలవంతంగా ఆపే వరకు బైక్పై డెలివరీ చేయడం ఆపను. ఒకవేళ నాకు ఆరోగ్యం చెడిపోయినప్పటికీ పని చేయడం మాత్రం మానేయను. నేను సంపాదించిన డబ్బులో కొంత నా ఆరోగ్యం కోసం దాచుకుంటాను. లాక్డౌన్ సమయంలో ఓ కస్టమర్ 70 డబ్బాల కోక్, వయాగ్ర ఆర్డర్ చేశాడు. ఇందుకు నేను ఏమాత్రం కష్టంగా ఫీల్ అవ్వలేదు. అనుకున్న సమయానికి వాటిని డెలివరీ చేశాను. అలాగే కొన్ని సార్లు నాకు విచిత్రమైన ఆర్డర్లు వస్తుంటాయి.. షాంపులు, వయాగ్ర, బ్లీచ్ వంటివి. డిమాండ్ను బట్టి ఓ రోజు ఇంటికి 20 డాలర్లు తీసుకెళ్తాను. కానీ వెంటనే డిమాండ్ మారుతుంది. నేను చేస్తున్న సేవకు ప్రజలు నాకు కృతజ్ఞతలు చెబుతారు. అయితే మిగతా సమయాల్లో మా సేవలను ఎవరూ గుర్తించరు. అయినప్పటికీ నాకు ఎటువంటి బాధ లేదు. ప్రజలకు సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కరోనా నేపథ్యంలో నాకు కూడా ఇంట్లోనే ఉండాలని ఉంది. కానీ అది కుదరదు’ అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు. (న్యూయార్క్, న్యూజెర్సీలలో భయం.. భయం!) -
స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం
మియాపూర్: అతడిది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూనే ఎస్ఐ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మియాపూర్లో ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కానీ.. అతడిని విధి చిన్నచూపు చూసింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్పై వెళ్లి ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అతడి భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. భర్త మృతిని జీర్ణించుకోలేని ఆమె భోరున విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఎస్ఐ రవికిరణ్, మృతుడి స్నేహితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంనకు చెందిన లునావత్ మితియా నాయక్, మోతి దంపతుల రెండో కుమారుడు లునావత్ సుమన్ (22). మియాపూర్ రెడ్డి ఇన్క్లేవ్లో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. లక్ష్మి ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తోంది. సుమన్ స్విగ్గీలో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. అతను రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరాడు. మియాపూర్ టాకీ టౌన్ సమీపంలో ఇడ్లీ దోశ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకొని బొల్లారం క్రాస్ రోడ్డు వైపు వెళుతున్నాడు. హోటల్ నుంచి 100 మీటర్ల దూరంలో బైక్పై వెళ్లగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను కిందపడ్డాడు. సుమన్ తలపై నుంచి వెనక చక్రం వెళ్లింది.హెల్మెట్ ఉన్నప్పటికీ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా ఓ బైక్ను వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతున్ని స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న సుమన్ నాయక్గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుమన్ కొంత కాలంగా మియాపూర్లో నివాసం ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. -
ఓవర్నైట్లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ
న్యూఢిల్లీ: జొమాటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఓవర్ నైట్లో అతడు పాపులర్ అయ్యాడు. మొహం మీద చెరగని చిరునవ్వుతో ఇంటర్నెట్ను ఊపేస్తున్నాడు. ఒక చిరునవ్వు అతడి జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇండియా డెలివరీ బాయ్ పిక్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రొఫైల్ పిక్గా పెట్టింది. అతడి పేరు సోను అని ఈ వీడియోలో తెలిపాడు. ఓ వ్యక్తి అతడితో మాట్లాడుతూ జొమాటోలో రోజుకు ఎంత సంపాదన ఎంత వస్తుంది? ఎన్ని గంటలు పనిచేస్తావ్? ఏమి తింటావ్ అనే ప్రశ్నలు అడిగాడు. వీటికి సోను సమాధానంగా.. నేను రోజూ 12 గంటలు పనిచేస్తాను. ఇన్సెంటివ్స్తో కలిపి రోజుకు రూ.350 వస్తుంది అని తెలిపాడు. మీరు తినేందుకు కంపెనీ ఏమైనా ఇస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ.. లేదు కానీ, ఏదైనా ఆర్డర్ క్యాన్సిల్ అయితే అది మేం తీసుకోవచ్చు అని తెలిపాడు. మరి, కస్టమర్లకు ఇవ్వాల్సిన డెలివరీ ఫుడ్ కూడా తినేస్తావా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అలాంటి పనులు ఎప్పుడూ చేయను. కంపెనీ నాకు సమయానికి జీతం ఇస్తుంది. నాకు వారితో ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపాడు. చదవండి: విమానంలోకి పావురం ఎలా వచ్చిందో! ఈ వీడియో ఆద్యంతం అతను చిరునవ్వు చిందిస్తూనే ఉంటాడు. దీంతో నెటిజన్స్ అతడికి జొమాటో రైడర్.. హ్యాపీ రైడర్ అని పేరు పెట్టారు. ఈ వీడియోని ఢిల్లీ డీసీ రైడర్ విలాగర్ టిక్ టాక్లో పెట్టింది. ఇక అంతే ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. వీడియోలో సోను ఇచ్చిన స్మైల్ నెటిజన్లను ఫిదా చేసింది. టిక్ టాక్లో ఆ వీడియోని 47లక్షల మంది చూశారు. అలా అలా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇది గమనించిన జొమాటో ఇండియా వెంటనే తమ ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లకు డెలివరీ బాయ్ సోను పిక్ని ప్రొఫైల్ పిక్గా పెట్టింది. నౌ ఏ హ్యాపీ రైడర్ ఫ్యాన్ అకౌంట్ అంటూ ట్యాగ్ చేసింది. క్షణాల్లో ఆ వీడియోలోని సోను ఫేస్ మీమ్స్కు వేదికైంది. పాపులర్ వ్యక్తుల ముఖాలను మార్చేసి సోను పిక్ని ఉంచారు. ఇలా ఓవర్నైట్లో డెలివరీ బాయ్ సోను కాస్త సెలబ్రిటీ అయ్యాడు. pic.twitter.com/YVCiOLrEjK — राष्ट्र सेवक (@frankmartynn) February 28, 2020 That smile when you know you're a bigger celeb than those not wearing a helmet! #RoadSafety #ZomatoBoy https://t.co/ZUAb1rnyRp — Maharashtra Police (@DGPMaharashtra) February 28, 2020 Dude is hiding rasgullas in his cheeks — Another introvert (@xddd_loool) February 28, 2020 -
ఫుడ్ డెలివరీబాయ్ నిజాయితీ
పశ్చిమగోదావరి,తణుకు: ఫుడ్ డెలివరీబాయ్ నిజాయితీ చాటుకున్నాడు. పట్టణంలోని వేల్పూరు రోడ్డులో ఒక మహిళ పోగొట్టుకున్న హ్యాండ్బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన ఉండవల్లి సునీత ఆదివారం ఉదయం లక్ష్మీ థియేటర్ ఎదురుగా తన బ్యాగును పోగొట్టుకున్నారు. బ్యాగులో రూ.50 వేలు విలువైన సెల్ఫోన్, రూ.10 వేలు నగదుతోపాటు విలువైన పత్రాలు ఉన్నాయి. అయితే ఫుడ్ డెలివరీబాయ్ పొన్నగంటి వెంకటనాగ ధనుంజయరావుకు బ్యాగు దొరకడంతో నిజాయితీగా పట్టణ ఎస్సై కె.రామారావుకు అప్పగించాడు. బ్యాగులోని పత్రాల ఆధారంగా పోగొట్టుకున్న మహిళ ఆచూకీ తెలుసుకుని ఆమెకు బ్యాగును పోలీసులు అప్పగించారు. నిజాయితీగా బ్యాగును పోలీసులకు అప్పగించిన ధనుంజయరావును కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, తణుకు సీఐ డి.ఎస్.చైతన్యకృష్ణ అభినందించారు. -
డెలివరీ బాయ్ వెంటపడుతున్న నెటిజన్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విశాల్. అతను స్విగ్గీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఓ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిఖిల్ డెలివరీ బాయ్ను మంచినీళ్లు కావాలా అని అడిగాడు. ఆ తర్వాత మాటలు కలుపుతూ మీరేం చేస్తారు? అని అడిగాడు. అతను ఆర్టిస్ట్ అని చెప్పాడు. అతను గీసిన చిత్రాలను చూసి ముగ్ధుడైన నిఖిల్ విశాల్ గురించి సోషల్ మీడియాలో వివరంగా చెప్పాడు. దాంతోపాటు అతను గీసిన కళాఖండాలను కూడా పోస్ట్ చేశాడు. అతను తనకు సరిపడే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు అని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది తమకు పెయింటింగ్ గీసిపెడతావా? అని ఆర్డర్లు ఇస్తూ అతని వెంటపడుతున్నారు. మరికొంతమందైతే జాబ్ ఆఫర్ కూడా చేస్తున్నారు. ఇలా ఒక్క ట్వీట్తో అతని జాతకమే తిరిగిపోయిందనుకోండి. దీనిపై విశాల్ మాట్లాడుతూ.. నా గురించి ట్వీట్ చేశారని నాకు తెలియదు. నేను మామూలుగా ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాను. అప్పుడు ఆ వ్యక్తి నా గురించి అడిగితే నేను ఆర్టిస్ట్నని చెప్పాను. నేను గీసిన చిత్రాలు చూసిన అతనికి నా పని చాలా నచ్చినట్లుంది. అందుకే ట్వీట్ చేశాడనుకుంటా’నని చెప్పుకొచ్చాడు. విశాల్ ఇన్స్టాగ్రామ్లో ‘వృత్తిరీత్యా ఆర్టిస్ట్.. తప్పని పరిస్థితుల్లో డెలివరీ బాయ్’, ‘నచ్చిన పని చేస్తూ కాస్త బ్రెడ్ ముక్క సంపాదించుకున్నా సంతోషమే’ అని రాసుకున్నాడు. -
అమెజాన్ డెలివరీ ఏజెంట్పై కేసు
బంజారాహిల్స్: సెల్ఫోన్ను డెలివరీ ఇవ్వకుండా మోసగించిన అమేజాన్ డెలివరీ ఏజెంట్పై బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన శ్రీకాంత్ గత నెల 28న అమేజాన్లో వివో యూ–10 ఫోన్ బుక్ చేశాడు. ఇందుకోసం రూ.9990 అతడి అకౌంట్లో నుంచి కట్ అయ్యాయి. గత నెల 30న ఫోన్ డెలివరీ చేసినట్లు అతడికి సమాచారం అందింది. అయితే 30న డెలివరీ బాయ్ రాకపోగా కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని ఐదు రోజులు ఆగినా ఫలితం లేకపోవడంతో అమేజాన్ కస్టమర్ కేర్ సెంటర్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన అమేజాన్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పి చేతులెత్తేశారు. దీంతో తనకు మొబైల్ డెలివరీ చేయకుండానే డబ్బులు డ్రా చేసుకొని మోసగించిన ఘటనలో డెలివరీ ఏజెంట్, సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమెజాన్ డెలివరీ బాయ్’ కేసులో కొత్త ట్విస్ట్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. తనను హిప్నటైస్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడంటూ నోయిడాకు చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడానికి సదరు మహిళ అంగీకరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫిర్యాదును కూడా ఆమె వెనక్కి తీసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా(సిటీ) ఎస్ఐ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ ...‘అమెజాన్ డెలివరీ బాయ్ను విచారించాం. తనపై వచ్చిన ఆరోపణలను అతను ఖండించాడు. వస్తువుల ఎక్చేంజ్ కోసం బాధితురాలి ప్లాట్కు వెళ్లినప్పుడు అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దాని తరువాత కూడా అక్కడే కొన్ని ఫ్లాట్లలో అతను వస్తువులను డెలివరీ చేశాడు. బాధితురాలిని వైద్యపరీక్షలు చేయించుకోమని అడిగాం. అయితే ఆవిడ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదును కూడా వెనక్కు తీసుకున్నారు’ అని తెలిపారు. దీనిపై స్పందించిన అమెజాన్ సంస్థ తమకు కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యమైన విషయమని తెలిపింది. అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు తమను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయని... విచారణకు సంబంధించి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. చదవండి: మహిళపై అమెజాన్ డెలివరీ బాయ్ అఘాయిత్యం -
హిప్నటైజ్ చేసి.. ఆపై అత్యాచారయత్నం
న్యూఢిల్లీ: అమెజాన్ డెలీవరీ బాయ్ ఒకరు తనను హిప్నటైజ్ చేసి.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ ఓ 43 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అమెజాన్లో ఓ బాక్స్ను ఆర్డర్ చేసింది. ఈ బాక్స్లో మరో ఐదు చిన్న బాక్స్లు వస్తాయి. అయితే కారణం తెలియదు కానీ ఆ వస్తువులను రిటర్న్ చేయాలని భావించింది. ఇందుకోసం అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేసి, రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమెజాన్ డెలివరీ బాయ్ రిటర్న్ పెట్టిన వస్తువులను తీసుకునేందుకు గాను బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఐదు బాక్స్లను రిటర్న్ తీసుకెళ్లలేనని.. కేవలం నాలుగు బాక్స్లను మాత్రమే తీసుకెళ్తానని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో బాధితురాలి సోదరి అమెజాన్ కస్టమర్ కేర్కు కాల్ చేసి డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసింది. దాంతో అమెజాన్ కంపెనీ, డెలివరీ బాయ్ను అక్కడి నుంచి వెళ్లి పోమ్మని చెప్పింది. ఈ నెల 9న మరో వ్యక్తి వచ్చి మొత్తం ఐదు బాక్స్లను కలెక్ట్ చేసుకుంటాడని బాధితురాలితో చెప్పింది. అనంతరం బాధితురాలి సోదరి బయటకు వెళ్లింది. ఈలోగా కిందకు వెళ్లిన డెలివరీ బాయ్ కాసేపటికే బాధితురాలి అపార్ట్మెంట్ వద్దకు వచ్చి.. ఐదు బాక్స్లను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. కస్టమర్ కేర్ చెప్పిన దాని ప్రకారం బుధవారం మరో ఏజెంట్కే వాటిని ఇస్తానని చెప్పింది. ఇలా మాట్లాడుతుండగానే.. బాధితురాలు కళ్లు తిరిగి పడిపోయింది. స్పృహ వచ్చి చూసే సరికి తాను కింద పడిపోయి ఉన్నానని.. డెలివరీ బాయ్ ప్యాంట్ విప్పి తన ఎదురుగా నిల్చున్నాడని బాధితురాలు తెలిపింది. దాంతో తాను సాయం కోసం అరిచానని.. కానీ ఆ సమయంలో తన ఇంట్లో, చుట్టుపక్కల ఎవరు లేరని పేర్కొంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి మాబ్కర్ర తీసుకువచ్చి డెలివరీ బాయ్ మీద దాడి చేశానని.. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొంది. డెలివరీ బాయ్ తనను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత ఈ విషయం గురించి తన సోదరితో చెప్పానని.. ఆమె ఎంట్రీ రిజస్టర్లో ఉన్న డెలివరీ బాయ్ నంబర్కు కాల్ చేసి అతను ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలు కనుక్కుందని చెప్పింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేశామంది. దీని గురించి అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల భద్రతమే మా ప్రథమ ప్రాధాన్యం. ఈ ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. వెంటనే సదరు డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జొమాటోకు డెలి‘వర్రీ’
కోల్కతా : ఆహారానికి మతం లేదని వ్యాఖ్యానించి సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్లో నిలిచిన జొమాటో మరో వివాదంలో కూరుకుపోయింది. తాము సరఫరా చేస్తున్న ఆహారం తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ జొమాటో డెలివరీ బాయ్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బీఫ్, ఫోర్క్ను సరఫరా చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. పే ఆర్డర్ను సవరించడంతో పాటు తమ ఉద్యోగుల మత విశ్వాసాలతో చెలగాటమాడటం మానుకోవాలని ఉద్యోగులు జొమాటోను డిమాండ్ చేస్తున్నారు. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్ డెలివరీబాయ్స్ అందరూ సోమవారం నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో యాడ్ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగి మౌసిన్ అఖ్తర్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వేతన, చెల్లింపుల సమస్యలపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు. -
ఆహారానికి మతం లేదన్నారు.. మరి ఇదేంటి..!
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్పై ఓవైపు ప్రసంశల వర్షం కురుస్తుండగా.. మరోవైపు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మతమే లేదన్నప్పుడు యాప్లో హలాల్ ట్యాగ్ ఎందుకు కొనసాగిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘హలాల్ మాంసం మాత్రమే తినేవారికి.. ప్రత్యేకంగా ఫుడ్ని అందిస్తున్నారు కదా’ అని నిలదీస్తున్నారు. జొమాటో యాప్ బాగోలేదంటూ గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో 1-స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. తమదైన శైలిలో యాప్ను ఏకిపారేస్తున్నారు. ఇక జొమాటోకు మద్దతు తెలిపిన ఊబర్ ఈట్స్ను కూడా నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #boycottUberEats అని ట్రోల్ చేస్తున్నారు. (చదవండి : ఆహారానికి మతం లేదు) కాగా, నెటిజన్ల కామెంట్లపై జోమాటో వివరణ ఇచ్చింది. ‘తమ వద్ద ఎన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయో కస్టమర్లకు తెలిసేందుకే హలాల్ ట్యాగ్ని అందుబాటులో ఉంచాం. మతపరమైన వ్యత్యాసాల్ని చూపెట్టేందుకు కాదు. హలాల్ ట్యాగ్లో ప్రత్యేక వంటకాలను అందించే రెస్టారెంట్లు ఉంటాయి. కొందరు హలాల్ మాంసం తీసుకోరు. మరికొందరు తీసుకుంటారు. కస్టమర్ల సేవల కోసమే ఆ ట్యాగ్’ అని వెల్లడించింది. ఇక బుధవారం వెలుగు చూసిన హిందూయేతర వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసిన వ్యవహారం నేపథ్యంలో.. ‘హిందూ ఓన్లి రైడర్’ అని జొమాటో ట్వీట్ చేయడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. జోమాటోకు 1 స్టార్ ఇస్తున్నామని కొందరు.. యాప్ను అన్ఇన్స్టాల్ చేస్తున్నామని మరికొందరు టీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఇతర యాప్లకు జైకొడుతున్నారు. -
ఆహారానికి మతం లేదు
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారి నెటిజన్ల మన్ననలు అందుకుంటోంది. ఈ కామెంట్ వైరల్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన పండిత్ అమిత్ శుక్లా జొమాటోలో మంగళవారం ఆహారం ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో డెలివరీ బాయ్ని మార్చాలని, లేదా ఆర్డర్ను క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మత ప్రాతిపదికన ఆహారాన్ని అందించే వ్యక్తులను మార్చబోమంటూ జొమాటో బదులిచ్చింది. తనకు రిఫండ్ కూడా వద్దని కేవలం క్యాన్సిల్ చేయండి చాలు, మిగిలింది నేను లాయర్లతో చూసుకుంటానని అతడు బదులిచ్చాడు. దీంతో జొమాటో స్థాపకుడు దీపిందర్ గోయల్ రంగంలోకి దిగారు. ‘భారతదేశం, దేశంలోని వైవిధ్యమైన మా వినియోగదారులు, భాగస్వాములు మాకు గర్వకారణం. మా విలువల పరిరక్షణలో వ్యాపారం నష్టపోయినా బాధలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్నంతా అమిత్శుక్లానే స్క్రీన్షాట్లు తీసి మరీ ట్విట్ట ర్లో ఉంచాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ఓ ఆటాడుకుంటున్నారు. తమరు ఆర్డర్ చేసిన ఫుడ్ను ముస్లిం తయారుచేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా శుక్లాని విమర్శించారు. తమరు నడిపే వాహన ఇంధనం కూడా అక్కడి ముస్లిం ఇంధనమే (ఆ దేశాల నుంచే దిగుమతి అవుతోంది) అంటూ మరోవ్యక్తి ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా చూసిన కొందరు అధి కారులు కూడా దీనిపై స్పందించారు. ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది. యాప్ను ప్రేమిస్తున్నాను’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ‘సెల్యూట్ దీపిందర్ గోయల్ ! అసలైన భారతీయుడివి నువ్వే.. నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ అన్నారు. నేను పేదవాన్ని... ఏం చేయగలను ! ‘జరిగిన ఘటనతో నేనెంతో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను, మేమంతా పేదవాళ్లం. బాధలు తప్పవు’ అంటూ అమిత్ శుక్లాకు ఆహారం డెలివరీ చేసేందుకు వెళ్లిన ఫయాజ్ అన్నారు. ‘ఆర్డర్ అందుకున్న తర్వాత లొకేషన్ కోసం ఆయనకు ఫోన్చేశాను. ఆర్డర్ కాన్సిల్ చేశాను అన్నాడు’ అని వివరించారు. -
అనుమానాస్పద స్థితిలో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
మద్యం మత్తులో గోడలు, పైపుల ఆధారంగా ఇద్దరు యువకులు ఓ అపార్ట్మెంట్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా... వారిలో ఒకరు చనిపోగా,మరొకరు గాయపడ్డారు. మరణించిన వ్యక్తి ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్ కాగా.. క్షతగాత్రుడు బైక్ చోరీ కేసుల్లో నిందితుడు. అయితే మూడో అంతస్తు నుంచి పడడంతోనే యువకుడుమరణించినట్లు పోలీసులు పేర్కొంటుండగా... అతడి స్నేహితులే పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్: మద్యం మత్తులో ఓ అపార్ట్మెంట్ పైకి ఎక్కడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో కిందపడి ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా, కొత్తకోట మండలం వడ్డవెట్ట గ్రామానికి చెందిన వేముల ప్రేమ్సాగర్ (20) ఇంటర్ చదివాడు. తండ్రి హరిబాబు, తల్లి లక్ష్మీలతో కలిసి ఫిల్మ్నగర్లోని దుర్గాభవానీనగర్లో ఉంటూ ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి అతను తన స్నేహితులైన సత్యానంద్, గణేష్, నాగరాజుతో కలిసి హైటెక్ సిటీ వైపు వెళ్లి అక్కడ మద్యం తాగారు. అనంతరం వీరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చారు. గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోగా, ప్రేమ్సాగర్, సత్యానంద్ ఫిలింనగర్ వైపు వెళ్లారు. అక్కడి వెంచర్–2లో ఉన్న ట్రెండ్ సెట్ విల్లా అపార్ట్మెంట్ వద్ద ఆగిన వీరు గోడలు, పైపులు పట్టుకుని భవనం పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. మూడో అంతస్తు వరకు వెళ్ళిన తర్వాత అదుపుతప్పి ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో సెల్లార్లో పడిన వీరిని గమనించిన అపార్ట్మెంట్ వాచ్మెన్ రోడ్డు పైకి తీసుకువచ్చి వదిలేశాడు. సోమవారం ఉదయం వీరిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమ్సాగర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన సత్యానంద్ చికిత్స పొందుతున్నాడు. మత్తులో నుంచి బయట పడిన అతను కొన్ని వివరాలు వెల్లడించాడు. ఆదివారం రాత్రి వీరితో కలిసి ఉన్న గణేష్, నాగరాజులనూ పోలీసులు విచారించగా అందరు కలిసి మద్యం తాగింది వాస్తమే అయినా సత్యానంద్, ప్రేమ్సాగర్లను వదిలి తాము ఇళ్ళకు వెళ్ళిపోయినట్లు తెలిపారు. కాగా మృతుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటం, సమీపంలోనే వీరి బైక్ ధ్వంసమై ఉండటంతో బైక్ స్కిడ్ కావడంతో కిందపడి ఇద్దరూ గాయపడి ఉంటారని, తీవ్రగాయాలు కావడంతో ప్రేమ్ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రేమ్సాగర్ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యానంద్ తదితరులు పథకం ప్రకారం ప్రేమ్సాగర్ను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ను పరిశీలించగా, వీరు ఇద్దరూ అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి కింద పడినట్లు నిర్థారించారు. ఈ విజువల్స్నే ప్రేమ్సాగర్ కుటుంబీకులకు చూపించారు. అయితే వీరిద్దరూ అసలు అపార్ట్మెంట్ పైకి అక్రమంగా ఎక్కడానికి ఎందుకు ప్రయత్నించారనే దానిపై ఆరా తీస్తున్నారు. సత్యానంద్పై చోరీ కేసులు ఉండటంతో అతడే ప్రేమ్సాగర్ను ఉసిగొల్పి చోరీ కోసం తీసుకువెళ్తున్నాడా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. వీరిని బయటికి తీసుకువచ్చి వదిలేసిన వాచ్మెన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
అమ్మా, నాన్నా.. అక్కడకొచ్చి నా శవం తీసుకెళ్లండి..!!
న్యూఢిల్లీ : స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్లిన కొడుకు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. మరికాపట్లో ఇళ్లు చేరుతానని చెప్పిన తమ కుమారుడు హర్ష్ కందేల్వాల్ (26) నుంచి ఊహించని మెసేజ్ రావడంతో ఆ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి. నా స్కూటర్, మనీ పర్స్, ఇతర వస్తువులు ఐటీవో బ్రిడ్జి దగ్గర ఉంటాయి తీసుకోండి. నా శవం బ్రిడ్జి కింద ఉంటుంది స్వాధీనం చేసుకోండి’అని వాట్సాప్లో సందేశమిచ్చాడు. ఊహించని షాక్తో తల్లిదండ్రులు హుటాహుటిన ఐటీవో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. అతను చెప్పినట్టే అక్కడ స్కూటర్, పర్స్ ఉన్నాయి. కానీ, హర్ష్ కనబడలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు పెట్టారు. వాట్సాప్ మెసేజ్ గురించి తెలుసుకున్న పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. వట్టి బెదిరింపులే కావచ్చునని అనుకున్నారు. అయితే, జూన్ 30న నుంచి కనిపించకుండా పోయిన హర్ష్ యమునా నది తీరంలో జూలై 3న శవమై తేలాడు. ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ శవం నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయన హర్ష్దే అని గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి ఫ్రెండ్ భార్య పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన తమ కొడుకు హత్యకు గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి చాందినీచౌక్లో నివాసముండే హర్ష్ ఓ ఆన్లైన్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్టు సమాచారం. హత్యేకేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
డెలివరీ బాయ్ అనుకోని డోర్ తీస్తే..
ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ అనుకొని తలుపు తీసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. అమిత్ కొచ్చార్(35) అనే వ్యాపారవేత్త ఢిల్లీలోని వికాస్పురిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి భార్య ఆఫీస్కి వెళ్లిన తర్వాత కొచ్చార్ స్నేహితులు అతని ఇంటికి వచ్చారు. దాంతో స్నేహితుల కోసం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు కొచ్చార్. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడనుకొని కొచ్చార్ తలుపు తీశాడు. కొచ్చార్ డోర్ తీయగానే దుండగులు అతన్ని లాక్కెళ్లి కారులో పడేశారు. అనంతరం గన్తో కొచ్చార్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన స్నేహితులకు అపస్మారక స్థితిలో ఉన్న కొచ్చార్ కన్పించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కొచ్చార్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. -
‘అతడి వల్ల అన్నం కూడా సహించడం లేదు’
బెంగళూరు : స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన కారణంగా మానసిక వేదన అనుభవించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదును స్వీకరించిన స్విగ్గీ యాజమాన్యం.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పడంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్ పంపింది. అయితే కేవలం క్షమాపణలే సరిపోవన్న ఆమె అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో డెలివరీ బాయ్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. వివరాలు... కర్ణాటకకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో భోజనం ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్.. డోర్ తీయగానే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తనకు సహకరించాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే తేరుకున్న సదరు మహిళ.. త్వరగా తలుపు మూసేసి లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గురువారం ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అతడి ప్రవర్తన కారణంగా తనకు ఇప్పటికీ అన్నం సహించడం లేదని.. ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. తనలాగా మరికొంత మంది మహిళలకు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని షేర్ చేశానని పేర్కొన్నారు. దీంతో దిగి వచ్చిన స్విగ్గీ యాజమాన్యం.. ఈ నేపథ్యంలో మొదట కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా జరిగి ఉంటుందని చెప్పిన స్విగ్గీ యాజమాన్యం ఎట్టకేలకు ఆమెకు క్షమాపణలు చెప్పింది. దాంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్ను ఆమెకు అందజేసింది. అలాగే ఆమె డిమాండ్ మేరకు సదరు డెలివరీ బాయ్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. -
పది మంది ప్రాణాలు కాపాడిన ఫుడ్ డెలివరీ బాయ్
ముంబై: ముంబైలోని తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం ఫుడ్ డెలివరీ బాయ్ సిద్ధు(20) అటుగా వెళ్తూ.. అగ్ని ప్రమాద దృశ్యాలను చూశారు. వెంటనే అక్కడ మంటలు ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది వద్దకు వెళ్లి తాను కూడా సహాయక చర్యల్లో పాల్గొంటానని తెలిపారు. వారి అంగీకారంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిద్ధు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి పది మంది ప్రాణాలు కాపాడారు. నాలుగో అంతస్తులోని పెషెంట్లను అగ్ని మాపక దళానికి చెందిన నిచ్చెన ద్వారా కిందకి దించడంలో కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో దట్టమైన పొగ వల్ల అనారోగ్యానికి గురైన సిద్ధు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సిద్ధు మీడియాతో మాట్లాడుతూ.. ‘తమను కాపాడామంటూ ఆస్పత్రిలో నుంచి పెషేంట్లు కేకలు వినబడటంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అగ్ని మాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాను. గొడ్డలితో బిల్డింగ్ అద్దాలను పగులగొట్టి ఆస్పత్రిలోనికి ప్రవేశించాను. అక్కడి నుంచి నిచ్చెన ద్వారా పెషెంట్లను కిందకు దించాను. ఆ సమయంలో ఓ మహిళ నా చేతుల నుంచి జారి కింద పడిపోయారు. కానీ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నార’ని తెలిపారు. -
గర్ల్ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ కోసం..
సాక్షి, న్యూఢిల్లీ: గర్ల్ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఓ బీటెక్ యువకుడు జైలు పాలయ్యాడు. ఖరీదైన వాచ్ను ఆమెకు బహుమతిగా ఇద్దామని మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో వాచ్ను ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్ని మోసం చేశాడు. పోలీసులు ఫోన్ నెంబర్ను ట్రేస్ చేయడంతో దొరికిపోయాడు. వివరాలు..ఢిల్లీ మోడల్ టౌన్లో నివాసముండే వైభవ్ ఖురాన (22) తన గర్ల్ఫ్రెండ్కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్నాడు. 90 వేల ఖరీదు గల రాడో చేతిగడియారాన్ని ఆన్లైన్లో జూలై 23న తప్పుడు అడ్రస్ పెట్టి ఆర్డర్ చేశాడు. వాచ్ పార్సిల్తో డెలివరీ బాయ్ (సాహు) రాగానే కాశ్మీరే గేట్ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. సాహుని ఓ ఇంటికి తీసుకెళ్లి.. ‘నువ్ కాలింగ్ బెల్ కొట్టు. మా వాళ్లు డబ్బులు తెచ్చిస్తారు. నేను వెనకే వస్తున్నాన’ని చెప్పాడు. అప్పటికే ఆర్డర్ చేసిన వాచ్ ప్యాకెట్ను తీసుకున్న వైభవ్ అక్కడి నుంచి తన బైక్పై పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కాల్డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి వాచ్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 90 వేల విలువగల రాడో రిస్ట్వాచ్ ఆన్లైన్లో రూ. 67 వేలకే అందుబాటులో ఉండటం విశేషం. -
వన్ప్లస్ 6 ఫోన్ ఆర్డర్ చేస్తే....
సాక్షి, న్యూఢిల్లీ : తల్లిని సర్ప్రైజ్ చేయడం కోసం ఓ టాప్ ఈ కామర్స్ సైట్లో వన్ప్లస్ 6 ఫోన్ను ఆర్డర్ చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫోన్కు బదులుగా మార్బుల్స్ రావడంతో కంగుతిన్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... దక్షిణ ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా అనే యువకుడు ఈ కామర్స్ సైట్లో వన్ప్లస్ 6 ఫోన్ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 34,999 రూపాయలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాడు. మరుసటి రోజు సాయంత్రానికల్లా ఫోన్ డెలివరీ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అయితే అడిగిన సమయాని కంటే ముందుగానే డెలివరీ బాయ్ రావడంతో సంతోష పడిన మానస్ ప్యాకింగ్ చేసి ఉన్న బాక్స్ను తీసుకున్నాడు. కొడుకు ఇచ్చిన గిఫ్ట్ను చూసేందుకు సాయంత్రం అతడి తల్లి బాక్స్ను తెరచి చూడగా అందులో ఫోన్కు బదులు మార్బుల్స్తో పాటు చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. దీంతో ఆమె సంబంధిత కామర్స్ సైట్కు ఫోన్ చేసి చేయగా... బాక్స్లో ఉన్న మార్బుల్స్ ఫొటోతో సహా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు ఫైల్ చేయమని చెప్పడంతో ఆమె అలాగే చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించిన అనంతరం తాము ఆ బాక్స్లో ఫోన్ను ఉంచి ప్యాక్ చేశామని, సీల్ తీయలేదు అంటున్నారు గనుక డెలివరీ బాయ్ తప్పు కూడా లేదంటూ బాధ్యతా రహితంగా మాట్లాడటంతో ఆమె వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డెలివరీ బాయ్స్ను ఇలా కూడా వాడుకుంటారా ?
మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. ఇలానే ఓ యువతి వినూత్నంగా తన సమస్యను పరిష్కరించుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంది. సాధారణంగా బల్లులు, సాలీడులు, బొద్దింకలు ఇంట్లో కనిపిస్తే చాలు ప్రాణాలు పోయేంత పనిచేస్తారు మహిళలు. ఇలానే డెమీ అనే యువతికి తన ఇంట్లో సాలీడులు కనిపించాయి. అవి చూస్తే ఆమెకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఇంట్లో ఎవరు లేరు.. వాటిని తీసేంత ధైర్యం లేదు. ఏం చేయాలి మరీ ఆలోచిస్తుండగా.. ఒక ఆలోచన తట్టింది. ఫుడ్ ఆర్డర్ చేస్తే.. డెలివరి బాయ్ సలహా తీసుకొవచ్చు అనుకుంది. వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ వచ్చాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చిన బాయ్ ఏమైన సాయం కావాలా మేడమ్ అని అడిగాడు. ఆ మాటకు తనలో తాను నవ్వుకున్న డెమీ తన సమస్యను వివరించి సాయం కోరింది. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ హెల్మెట్ పెట్టుకుని మరీ సాలీడులను తొలిగించాడు. ఈ తతంగాన్ని ట్విటర్లో పంచుకుంటూ డెమీ ఉబ్బితబ్బిబ్బయింది. అంతేకాదండోయ్ ఈ ట్వీట్కు సదరు డెలివరీ కంపెనీ సైతం స్పందిస్తూ ఆ బాయ్ని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ బాయ్కు మంచి టిప్ ఇచ్చావని భావిస్తున్నామని కొందరు.. డెలివరీ బాయ్స్ను ఇలా కూడా వాడుకోవచ్చా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. My fear of spiders was taken to a whole new level today in which I ordered food in a hope that the delivery driver would remove the spider.. Joe @Deliveroo @DeliverooHelp you are an actual LIFESAVER 🙌🏼 pic.twitter.com/YnkQhqhhWW — Demi (@demiswn) May 30, 2018 -
ఫోన్ డెలివరీ ఆలస్యంగా ఇచ్చాడని..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ కాలంలో మనుషులకు ఓపిక అనేది లేకుండా పోయింది. అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. లేకపోతే విచక్షణ కోల్పోతారు. ఒక్కోసారి అది ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే దేశ రాజధానిలో కలకలం రేపింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫోన్ ఆలస్యంగా డెలివరీ ఇచ్చాడని ఆగ్రహించిన మహిళ డెలివరీ బాయ్ని ఏకంగా కత్తితో 20సార్లు పొడిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ముప్పై ఏళ్ల మహిళ ఫ్లిప్కార్ట్లో స్మార్ట్పోన్ కొనుగోలు చేసింది. అయితే ఇతర డెలివరీల కారణంగా డెలివరీ బాయ్ కేశవ్ ఆమె ఫోన్ని ఆలస్యంగా అందించాడు. అయితే ఫోన్ ఆలస్యంపై కోపంగా ఉన్న సదరు మహిళ కత్తితో డెలివరీ బాయ్పై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడిన కేశవ్ను సమీపంలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్న కేశవ్ నుంచి స్థానిక పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మహిళకు సహకరించిన ఆమె సోదరుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు నిహల్ విహార్, అంబికా ఎన్క్లేవ్కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ నెల 24న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఐటీ ఇంజినీరు ‘అతి’
సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్ కన్నడలో మాట్లాడినందుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతన్ని దూషించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఢిల్లీకి చెందిన సాత్విక్ నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఐటీ ఇంజినీర్గా పనిచేస్తూ సంజయనగర్లో నివాసముంటున్నాడు. ఆన్లైన్లో పిజ్జా కోసం ఆర్డర్ చేయగా లేటుగా వచ్చావంటూ డెలివరీబాయ్ అనిల్ని అసభ్యపదజాలాలతో దూషించాడు. ఆలస్యానికి క్షమించాలంటూ అనిల్ కన్నడలో మాట్లాడారు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సాత్విక్ నా ముందు కన్నడలో మాట్లాడవద్దంటూ మరింతగా దూషించాడు. దీనిపై డెలివరీబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజయ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అసలు నిందితుడు అయ్యప్ప
-
అసలు నిందితుడు అయ్యప్ప
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడింది మొత్తం ఆరుగురు వ్యక్తులని, వాళ్లలో డెలివరీ బోయ్గా పనిచేస్తున్న అయ్యప్ప అనే వ్యక్తి ప్రధాన నిందితుడని చెప్పారు. అతడు ఐటీఐ చదువుతున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా అతడు బాధితురాలి వెంట పడుతున్నాడని, కొత్త సంవత్సరం రోజున ఆమె ఒక పార్టీ నుంచి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా వాళ్లంతా కలిసి ఆమెను వేధించారని అన్నారు. బాధితురాలికి, అయ్యప్పకు మధ్య స్నేహం కూడా ఏమీ లేదని, వాళ్లిద్దరి నివాసాలు మాత్రం దగ్గరలో ఉంటాయని చెప్పారు. స్వయంగా అతడే ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆయన వివరించారు. -
ఆ డెలివరీ బోయ్ అంటే నేరస్తులకు దడదడ!
జపాన్లో నేరస్తుల పాలిట ఓ డెలివరీ బోయ్ సింహస్వప్నంలా మారాడు. ఆయుధాలతో వచ్చిన ఇద్దరు గ్యాంగ్స్టర్లను ఉత్త చేతులతో ఎదిరించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మత్సుబా - కై క్రైం సిండికేట్కు చెందిన ఇద్దరు నిందితులు యుసుకె కొడమా (32), హిడెకజు ఒబా (35) ఇద్దరూ దోపిడీకి ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వీళ్లిద్దరూ ఒక నకిలీ తుపాకీని డెలివరీ బోయ్ (38) ముఖంపై ఆడించి.. అతడి వద్ద ఉన్న ఓ ఖరీదైన వాచీని దోచుకోడానికి ప్రయత్నించారు. దాంతో చికాకు వచ్చిన ఆ బోయ్.. వాళ్ల దగ్గర్నుంచి ఆ తుపాకి లాక్కుని, తన ప్యాకేజిని కూడా వెనక్కి తీసుకున్నాడని టోక్యో పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 5.33 లక్షల విలువచేసే రోలెక్స్ వాచీ కోసం ఒబా ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డబ్బు చెల్లించాల్సి వచ్చినప్పుడు.. డెలివరీ బోయ్ ముఖం మీద నకిలీ తుపాకి చూపించి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. భయపడటానికి బదులు ఆ డెలివరీ బోయ్ వాళ్ల నుంచి తుపాకి లాక్కుని, పోలీసులకు ఫోన్ చేశాడు. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి తమకంటే చాలా బలంగా ఉన్నాడని, అతడి ముందు తాము నిలబడలేకపోయామని పోలీసుల వద్ద ఒబా అంగీకరించాడు. ఇటీవలి కాలంలో దొంగలను కేవలం పోలీసులే కాక.. జపాన్ పౌరులు కూడా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ డెలివరీ బోయ్లాగే వాళ్లు కూడా తమ పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. -
విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన
డెలివరీబాయ్కు దేహశుద్ధి బెంగళూరు(బనశంకరి) :విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుమారస్వామి లేఔట్లోని ఓ అపార్టుమెంట్లో ఇరాన్ దేశానికి చెందిన మహిళ నివాసముంటోంది. ఈమె ఆన్లైన్లో బుక్ చేసిన షూను తీసుకొని ఈ నెల 10న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కంపెనీ కి చెందిన ఇలియాస్నగరకు చెందిన ఆబుసల్మాన్ అనే డెలివరీ బాయ్ వెళ్లాడు. షూ తీసుకుని డబ్బు ఇచ్చే సమయంలో ఆబూససల్మాన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయభ్రాంతులకు గురైన ఆమహిళ గట్టిగా కేకలు వేయడంతో డెలివరీబాయ్ అపార్టుమెంట్ నుంచి కిందికి దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇరుగుపొరుగు వారు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.