diamond
-
వజ్రాల పరిశ్రమ పునరుజ్జీవం
న్యూఢిల్లీ: కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.తాజా పథకం ఈ ధోరణికి చెక్పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్కు సవాళ్లు25 క్యారట్ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. -
రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్
ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, వార్షిక ‘డ్రీమ్ డైమండ్ సేల్’ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టైల్కి, సందర్భానికి త గినట్టుగా డైమండ్ ఆభరణాలను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.ఈ ప్రత్యేకమైన ఆఫర్ కస్టమర్లకు డైమండ్ విలువ మరియు మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. వివిధ వజ్రాభరణాలతో, ఈ సంవత్సరం డ్రీమ్ డైమండ్ సేల్ కొనుగోలుదారుల జీవితాల్లోని ప్రతీ సందర్బంలో విలువైన క్షణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్టేట్మెంట్ బ్రైడల్ సెట్స్, ఉంగరాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్ , గ్రాండ్ నెక్లెస్ల ఉంటాయని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 180+ స్వతంత్ర షోరూమ్లలో డైమండ్ కలెక్షన్ను దుకాణదారులు పొందవచ్చన్నారు. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్కూలర్లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్ని గమ్తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐజ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు. -
ల్యాబ్లో తయారైన డైమండ్ అచ్చమైన వజ్రమేనా?!
ఆభరణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ హవా మొదలైంది. ఆభరణాల్లో పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్ ట్రీట్మెంట్, ఎయిర్΄ోర్ట్ రన్వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్డ్ డైమండ్స్ గురించి మాత్రమే. ఇవి భూమిలోపలి పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్ ఓర్ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది. వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్ డైమండ్ని, మైన్డ్ డైమండ్ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్ కండక్టివిటీ పెన్ టెస్ట్ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్డ్ యూవీ కార్బన్ డాటింగ్ టెస్ట్ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది. క్లారిటీ వర్గీకరణ, కలర్ గ్రేడింగ్, సర్టిఫికేషన్లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్లో పోల్కీలు కూడా వస్తున్నాయి. సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్ డైమండ్స్ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్. అంటే క్యూబిక్ జెరకాన్స్. సాంకేతిక నామం సీజెడ్స్ అయితే వాటిని మార్కెట్లోకి తెచ్చిన బ్రాండ్ పేరు అమెరికన్ డైమండ్స్. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్ పేర్లతో వ్యవహరిస్తారు. ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్ డైమండ్స్ పొదిగిన ఆభరణాలకు కూడా మైన్డ్ డైమండ్స్ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన సందేహం రీసేల్ వాల్యూ గురించి. ల్యాబ్ డైమండ్స్కి కూడా నూటికి నూరుశాతం ఎక్సేంజ్ వాల్యూ, 80 శాతం రీసేల్ వాల్యూ ఉంటుంది.– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ -
వజ్రం మరో వజ్రాన్ని కోస్తుంది!
ఆభరణం చాలా రోజులు బీరువాలో ఉంచితే కొద్దిగా మసకబారినట్లు అనిపిస్తుంది. ఆభరణం ధగధగలాడాలంటే ధరించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ధరించిన తర్వాత తిరిగి భద్రపరిచేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. 👉ఆభరణాన్ని (బంగారు ఆభరణం, వజ్రాల ఆభరణం ఏదైనా) ధరించే ముందు వెల్వెట్ క్లాత్ లేదా మెత్తని నూలు వస్త్రంతో సున్నితంగా తుడవాలి. 👉దుమ్ము పట్టేసినట్లనిపిస్తే వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇది చాలా అరుదుగా మాత్రమే చేయాలి. ఓపెన్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని వేడి నీటిలో ఒకసారి ముంచి తీసి వెంటనే టిష్యూ పేపర్తో తేమ వదిలే వరకు సున్నితంగా తుడవాలి. ఇది ఇతర రంగు రాళ్లేవే లేకుండా అన్నీ వజ్రాలే ఉన్న ఆభరణానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలను వేడి నీటిలో ముంచరాదు. 👉క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని నీటిలో ముంచకూడదు. నీటిలో ముంచినట్లయితే కొంతనీరు వజ్రానికి బంగారానికి మధ్యలో చేరుతుంది. ఆ నీటిని తొలగించడం కష్టం. మరీ ఎక్కువగా నీరు పట్టినప్పుడు వజ్రాన్ని తీసి మళ్లీ చేయించుకోవడమే మార్గం. కాబట్టి క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణం మీద పట్టిన దుమ్మును వదిలించాలంటే టిష్యూ పేపర్ లేదా వెల్వెట్ క్లాత్తో తుడవాలి. అంతేకాదు, ఆభరణాలను తరచూ నీటితో శుభ్రం చేస్తుంటే బంగారం కరిగిపోతుంది. 👉ఏ ఆభరణాన్నయినా (పూర్తి బంగారు ఆభరణాలు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు) తెల్లటి ప్లాస్టిక్ బాక్సుల్లోనే పెట్టాలి. 👉 వెల్వెట్ క్లాత్కి రంగును వదిలే స్వభావం ఉంటుంది. దీర్ఘకాలం వెల్వెట్ క్లాత్ మధ్య ఉంచితే వెల్వెట్ క్లాత్ రంగు ప్రభావం ఆభరణం మీద పడుతుంది. 👉వజ్రాల ఆభరణాలు ఒక బాక్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. వజ్రం గట్టిగా ఉంటుంది. కోసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్ కారణంగా మరొక స్టోన్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. -
వజ్రాల ధగధగలపై చీకట్ల ముసురు!
సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. ▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.▸ల్యాబ్లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు. -
11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్లోని సూరత్కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్లలో పలువురు షేర్ చేస్తున్నారు. सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్ -
కనకదుర్గమ్మకు వజ్ర కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు (ఫొటోలు)
-
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
బొట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం
గబొరోన్(బొట్స్వానా): ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది.3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది. -
ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్ తెలిస్తే..
దేశ వజ్రాల పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో దని పేర్కొంటూ సూరత్కు చెందిన ఒక ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజులపాటు 'సెలవు' ప్రకటించింది.ప్రపంచంలో అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారైన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆగస్టు 17 నుంచి 27 వరకు 10 రోజులు 'సెలవు' ప్రకటించింది. "మా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించాం. దీని కోసం కొంత మొత్తం కోత విధించినప్పటికీ, ఉద్యోగులందరికీ ఈ కాలానికి జీతం చెల్లిస్తాం. మాంద్యం కారణంగా ఈ సెలవులను ప్రకటించవలసి వచ్చింది'' అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభాయ్ లఖానీ వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.ప్రపంచంలోని దాదాపు 90 శాతం వజ్రాలను ప్రాసెస్ చేసే స్థానిక వజ్రాల పరిశ్రమను మాంద్యం దెబ్బతీసిందన్న లఖానీ అభిప్రాయాలతో సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ ఏకీభవించారు. "కిరణ్ జెమ్స్ ఇలా సెలవు ప్రకటించడం (ఉద్యోగులకు) ఇదే మొదటిసారి. ఇంతవరకు మరే ఇతర సంస్థ కూడా ఇటువంటి చర్య తీసుకోనప్పటికీ, మాంద్యం పాలిష్ చేసిన వజ్రాల అమ్మకాలను తగ్గించింది" అని ఖుంట్ అన్నారు.పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికం ఎగుమతి చేస్తున్నందున అంతర్జాతీయ కారకాలు వజ్రాల అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలను కొన్ని కారకాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కారకాలతో 2022లో దాదాపు రూ. 2,25,000 కోట్లున్న వజ్రాల పరిశ్రమ టర్నోవర్ నేడు రూ. 1,50,000 కోట్లకు తగ్గిందన్నారు. సూరత్లో దాదాపు 4,000 డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్టాపిక్గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
ది డైమండ్.. ఇకపై అందరి నేస్తం..
‘వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన ప్రేమ కూడా అలాగే’ అంటూ ఒక ప్రకటనలో ప్రియురాలి వేలికి ఉంగరం తొడుగుతూ ప్రియుడు చెప్పిన డైలాగ్ ఒక తరం మహిళలందరినీ కట్టి పడేసింది. ఆ ప్రకటనలో మహిళ ధరించిన వజ్రపుటుంగరం మహిళాలోకం మదిని దోచుకుంది. ‘వజ్రపుటుంగరం, పైగా అంతపెద్ద వజ్రంతో’ అని ఆ ప్రకటన మగవాళ్ల హార్ట్బీట్ పెంచింది కూడా... అదంతా ఒకప్పుడు. భూగర్భం నుంచి తవ్వి తీస్తే తప్ప వజ్రం దొరకని రోజుల్లో. ఇప్పుడు మ్యాన్మేడ్ డైమండ్స్ నగరంలోని ఆభరణాల మార్కెట్ను శాసిస్తున్నాయి. ఎల్జీడీ, ఎకో ఫ్రెండ్లీ డైమండ్, మ్యాన్మేడ్ డైమండ్... పిలిచే పేరు ఏదైనా అది వజ్రమే. సిటీ ఆఫ్ పెరల్స్గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరం... ఇప్పుడు మ్యాన్మేడ్ డైమండ్ ఆభరణాల హబ్గా మారుతోంది. ఇప్పుడు నగరంలో జరిగే వేడుకల్లో ఎంగేజ్మెంట్ రింగ్, చెవి దిద్దులు, గాజుల్లోనూ ప్రధానంగా ఈ వజ్రాలే ఉంటున్నాయి. నగరంలో మ్యాన్మేడ్ వజ్రాల శకం మొదలైంది. ఈ వజ్రాలు హైదరాబాద్ ఆభరణాల మార్కెట్ని ముంచెత్తబోతున్నాయి.– వాకా మంజులారెడ్డిఇది మేధో వజ్రం..ల్యాబ్ గ్రోన్ డైమండ్స్... హై ప్రెజర్ హై టెంపరేచర్ (హెచ్పీహెచ్టీ), కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడీ) అనే రెండు ప్రక్రియల్లో తయారవుతాయి. చిన్న ఉదాహరణ ఏమిటంటే... కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి కోడి 21 రోజులు గుడ్డు మీద పొదగడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. కోడి గుడ్లను కరెంటు బల్బు వేడితో పొదిగించడం మనిషి సాంకేతికతతో కనిపెట్టిన ప్రత్యామ్నాయ మార్గం. ఈ ప్రక్రియలో కోడితో పని ఉండదు, కోడి గుడ్డు ఉంటే చాలు. ఇలాంటిదే లాబ్లో పెరిగే వజ్రం కూడా. కార్బన్ సీడ్ ద్వారా లాబ్లో వజ్రాన్ని తయారు చేయగలిగిన సాంకేతికత మనిషి సొంతమైంది. సైంటిస్ట్లు, జెమ్మాలజిస్ట్ల సంయుక్త పర్యవేక్షణలో డైమండ్ గ్రోయింగ్ గ్రీన్హౌస్లో ఈ వజ్రాలు తయారవుతాయి. అదే వేడి– అంతే ఒత్తిడికార్బన్.. వజ్రంగా మారే ప్రక్రియ అంతా భూగర్భంలోనే జరుగుతుంది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన వజ్రం పుట్టుక ఇది. కార్బన్ సీడ్ని లోహపు పలకం మీద ఉంచి ఐదు వేల డిగ్రీల ఫారన్హీట్తోపాటు తగినంత ఒత్తిడిని కలిగించడం, మీథేన్ వాయువుతో వ్యాక్యూమ్ చాంబర్లో కెమికల్ వేపర్ అందించడం ద్వారా పది – పన్నెండు వారాల్లో అచ్చమైన అసలు సిసలైన వజ్రం తయారవుతుంది. భూగర్భం నుంచి తవ్వి తీసిన డైమండ్ని మైన్డ్ డైమండ్ అని, డైమండ్ గ్రోయింగ్ గ్రీన్హౌస్లో రూపొందిన డైమండ్ని మ్యాన్మేడ్ డైమండ్ అని వర్గీకరించవచ్చు. వజ్రం పుట్టుకలో ఉన్న రెండు రకాలివి. వజ్రం చేతికి వచి్చన తర్వాత గ్రేడింగ్, కటింగ్ వంటి ప్రక్రియలన్నీ రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయని చెబుతున్నారు హైదరాబాద్కు చెందిన జెమ్మాలజిస్ట్ జియా.సామాన్యుల చెంతకు...వజ్రాల పరిశ్రమలు థర్మల్ కండక్టివిటీ, కటింగ్ టూల్స్, హీట్ సింక్స్ వంటి తమ పారిశ్రామిక అవసరాలకు కూడా మ్యాన్మేడ్ డైమండ్స్ మీదనే ఆధారపడుతున్నాయి. వజ్రాల పరిశ్రమ కూడా మనుషుల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు వాటిల్లని నైతికమార్గంలో తయారవుతున్న వజ్రంగా మ్యాన్మేడ్ డైమండ్నే గుర్తిస్తోంది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన వజ్రం ఇకపై సామాన్యుల చెంతకు చేరనుంది. హైదరాబాద్ నగరవాసుల్లో కొనుగోలు శక్తి పెరిగింది. మ్యాన్మేడ్ డైమండ్ కాంతులు యువకుల వేళ్లను మెరిపిస్తున్నాయి, యువతుల చెవులకు సప్తవర్ణ కాంతులను అద్దుతున్నాయి.ఈకో ఫ్రెండ్లీ..భూగర్భంలో రూపుదిద్దుకున్న వజ్రాన్ని సేకరించే క్రమంలో వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. గనుల పరిసరాల్లోని వాళ్ల ఆరోగ్యం మీద కూడా దు్రష్పభావాన్ని చూపిస్తాయి. మైనింగ్ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తుల ప్రాణాలను కూడా ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ్యాన్మేడ్ డైమండ్స్ని ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్గా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్నే ప్రోత్సహిస్తున్నారు.ఫోర్ సీలే ప్రామాణికం..కట్, క్లారిటీ, కలర్, క్యారట్... ఇవి నాలుగూ డైమండ్కి ప్రామాణికాలు. ఈ నాలుగు ప్రామాణికతల పట్టిక ల్యాబ్ డైమండ్లోనూ ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని వజ్రాలకు యూఎస్, యూకేలు ఇప్పటికే అధికారిక ఆమోదాన్నిచ్చాయి. గతేడాది భారత ప్రభుత్వం కూడా తన ఆమోదాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. పర్యావరణహితమైన జీవనశైలిని కోరుకునే వాళ్లు ఈ డైమండ్స్కే ప్రాధాన్యం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. విదేశాల నుంచి దిగుమతులను నిలువరిస్తూ దేశీయ అవసరాలకు తగినంత ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరను అందుబాటులోకి తీసుకురావడంతో దేశీయ నిపుణులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారామె. ఫ్లాలెస్ వజ్రాలివి! క్వాలిఫైడ్ జెమ్మాలజిస్టుగా నా పాతికేళ్ల అనుభవంలో నేను గుర్తించిదేమిటంటే... ఫ్లాలెస్ డైమండ్స్ మ్యాన్మేడ్లోనే వస్తున్నాయి. భూగర్భంలో కార్బన్ వజ్రంగా మారే క్రమంలో వజ్రంలో ఇన్క్లూజన్స్(ధూళి రేణువులు చేరి చుక్కలు, సన్నని గీతలుగా కనిపించడం) ఏర్పడుతుంటాయి. వందలో ఒకటి – రెండు మాత్రమే ఫ్లాలెస్ వజ్రాలుంటాయి. మ్యాన్మేడ్ డైమండ్స్లో సగానికి పైగా ఫ్లాలెస్ క్వాలిటీతో ఉంటున్నాయి. కార్బన్ వజ్రంగా మారడానికి ఏర్పాటు చేసిన గ్రీన్హౌస్లు స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగి ఉండడం కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఒకప్పుడు వజ్రం అంటే భూగర్భం నుంచి తవ్వి తీసినది మాత్రమే కావడంతో లభ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడు మార్కెట్ అవసరాలకు తగినన్ని వజ్రాలు తయారవుతున్నాయి. ధర విషయానికి వస్తే... మైనింగ్ ఖర్చులు కలుపుకుని ధర నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి మైన్డ్ డైమండ్ ధర ఎక్కువగా ఉంటుంది. మైనింగ్ ఖర్చులు లేకపోవడంతో మ్యాన్మేడ్ డైమండ్స్ ధర మైన్డ్ డైమండ్తో పోలిస్తే తక్కువగా ఉంటోంది. అదే క్వాలిటీతో ధర తక్కువలో లభిస్తుండడంతో వజ్రాన్ని ధరించాలనే వారి కల సులువుగా నెరవేరుతోంది. – జియా, జెమ్మాలజిస్ట్, హైదరాబాద్ -
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూర్లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
Kurnool Diamond: కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
Vajrakarur: వజ్రాల వేట ప్రారంభం
వజ్రకరూరు మండల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమయ్యింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూల్, కడప, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి శనివారం వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలు వెతకడం ప్రారంభించారు. పలువురు కార్లలో వచ్చి వజ్రాలు వెతకడం కనిపించింది. చంటి బిడ్డలనుసైతం ఎత్తుకుని వచ్చి వజ్రాలు వెతకడం విశేషం. దీంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా రూ. లక్షల్లో విలువ చేస్తుంది. ఏటా ఈ ప్రాంతంలో 20 నుంచి 40 దాకా వజ్రాలు లభ్యమవుతాయని సమాచారం. -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్లోని పలు పోలింగ్ బూత్లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం..
యూరప్లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్ వాచీలు, పాలిష్ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉపయోగాలివే.. దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్ కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్ను బేస్గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్ ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది. మారనివి ఇవే.. డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్ అండ్ స్టీమ్ కోల్ (380 మి.డాలర్లు), ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్ అప్లియెన్సెస్ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్ ఆయిల్ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. -
ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!
మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం. అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది. ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్! కాదు.. అదొక 'హిల్థ్రిల్'!! -
వజ్రాలు వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..అంబానీ కూతురుగా ఆ మాత్రం ఉండాల్సిందే (ఫొటోలు)
-
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..
వజ్రం అంటే దాదాపు అందరికీ కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది. వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది. సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. అలాంటి సహజ వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. తాజాగా యాంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మార్కెట్ వాటా 2016లో 1% నుంచి 2024లో 20%కి పెరిగినట్లు తేలింది. 2030లో అది భారీ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారంటే.. న్యూయార్క్లోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్ను సృష్టించారు. తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అందులో ఒకటి అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్పీహెచ్టీ) రెండోది రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్లోని కొంత భాగం సీడ్గా పని చేస్తుంది. అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్, స్వచ్ఛమైన గ్రాఫైట్ కార్బన్ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా రూపాంతరం చెందుతుంది. రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్ రిచ్ గ్యాస్ నింపిన ఛాంబర్లో సీడ్ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా మారుతుంది. నాణ్యత ఎలా ఉంటుందంటే.. భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్ వజ్రాలను డైమండ్ టెస్టర్తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు పడవు. కిందపడినా పగిలిపోవు. సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలనే వాడుతున్నారు. కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్ లేజర్ డయోడ్స్లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు. డిమాండ్ ఎలా ఉందంటే.. సహజంగా అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారణమైంది. దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదీ చదవండి: త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. సూరత్ ఎయిర్పోర్టు టెర్మినల్ను కూడా ప్రారంభించారు. సూరత్లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv — ANI (@ANI) December 17, 2023 సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ భవనం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్లో 4500 ఆఫీస్లు ఉన్నాయి. ఇదీ చదవండి: షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ -
రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..!
సూరత్లోని అత్యంత ధనవంతుడిగా ఉన్న సావ్జీ ధంజీ ధోలాకియా.. ‘ఏదీ మన చెంతకురాదు.. శోధించి.. సాధించాలి’ అని నమ్మారేమో. సులభంగా సంపద వస్తే దాన్ని నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ఆయన తన కుమారుడిని స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించారు. దాంతో ఆయన కుమారుడు ఏకంగా బేకరీలో పనిచేసేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం. రైతు కుటుంబంలో జన్మించిన సావ్జీ ధంజీ ధోలాకియా హరికృష్ట ఎక్స్పోర్ట్స్ పేరుతో కంపెనీ స్థాపించి వజ్రాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎగుమతి చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. సావ్జీ ధోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్లోని దుధాలా గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఆర్థికస్థోమత లేకపోవటంతో సావ్జీ నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత తన మామతో కలిసి సూరత్కు వచ్చి అక్కడే పనిచేశారు. మామయ్యకు చెందిన వజ్రాల వ్యాపారంలో సావ్జీ తన సోదరులు హిమ్మత్, తులసితో కలిసి పనిచేశారు. అలా 1992లో సావ్జీ తన ముగ్గురు సోదరులతో కలిసి హరి కృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ను సూరత్లో ఏర్పాటు చేశారు. ముంబైలో ఎగుమతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 నాటికి కంపెనీ ఎంతో వృద్ధి సాధించింది. అప్పటికే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,500కు చేరింది. ఆ తర్వాత 2005లో 'కిస్నా' పేరుతో ఆభరణాల బ్రాండ్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 6,250 అవుట్లెట్లతో అతిపెద్ద వజ్రాభరణాల బ్రాండ్గా కొనసాగుతోంది. ధోలాకియా తరచూ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్గా కార్లు, ఫ్లాట్లు, ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అంతేకాదు కుటుంబం సావ్జీకు గిఫ్ట్గా ఇచ్చిన హెలికాప్టర్ను సూరత్లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం గతంలో రూ.50 కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్ని విరాళంగా అందించాలని నిర్ణయించడం విశేషం. అలాగే గుజరాత్లోని అమ్రేలి జిల్లా, లాఠీ తాలూకా తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగా మొక్కల్ని నాటారు. అయితే సులభంగా సంపదను పొందితే దాన్ని నిర్వహించటం వారసులకు అంత సులువు కాదు. అయితే మనుగడ కోసం మనుషులు చేసే పోరాటం గురించి తెలుసుకుంటేనే.. ప్రతి రూపాయినీ ఎలా ఖర్చు చేయాలి అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. ఇదే నియమాన్ని పాటించాలని ఆ వజ్రాల వ్యాపారి తన కుమారుడికి చెప్పారు. అయితే సంపాదన కోసం లేదా పనికోసం తన పేరును ఎక్కడా వాడకూడదని సావ్జీ కండిషన్ పెట్టారు. ఇదీ చదవండి: కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..! దాంతో సావ్జీ ధంజీ ధోలాకియా కుమారుడు ద్రవ్యను ఇంటి పేరును ఉపయోగించకుండా స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించాడు. కేవలం రూ.7 వేలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ద్రవ్య.. షూ స్టోర్, మెక్డొనాల్డ్స్, కాల్ సెంటర్తో సహా అనేక ఉద్యోగాలు చేశాడు. చివరికి ఒక బేకరీలో రోజుకు రూ.200 జీతానికి ఉద్యోగం సంపాదించాడు. కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు ద్రవ్య చెప్పాడు. అలా సదరు వ్యాపారి తన పిల్లలకు అసలైన జీవిత పాఠాలను నేర్పించారు. 27 ఏళ్ల ద్రవ్య కంపెనీనీ టేకోవర్ చేశారు. 2016 లెక్కల ప్రకారం హరికృష్ణ డైమండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ రూ.12000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది. దాదాపు 71 దేశాల్లో వ్యాపారం సాగిస్తోంది. -
నెట్టింట హల్చల్: అరుదైన యాపిల్స్, ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ యాపిల్ ప్రత్యేకతే వేరు కాదా. యాపిల్ పండు లాంటి బుగ్గలు, ఎర్రటి యాపిల్ ఇలాంటివి ఇప్పటి దాకా విన్నాం. బొద్దుగా ఎర్రగా ఉన్న పిల్లల్ని ముద్దుగా ‘యాపిల్’ అని పిలుచుకోవడం కూడా తెలుసు. ఆ తరువాతి కాలంలో గ్రీన్ యాపిల్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడు బ్లాక్ యాపిల్స్ కూడా వచ్చాయి. మీరు ఎపుడైనా చూశారా? చదువుతూ ఉంటేనో నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? మరి వీటి ధర ఎంత తెలుసా? నెట్టింట తెగ వైరల్ లవుతున్న ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ వివరాలన్నీ తెలుసు కోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. డాక్టర్ అవసరం లేకుండా జీవించాలంటే రోజుకు ఒక యాపిల్ అయినా తినాలనేది. అలా విటమిన్లు, ఫైబర్, పోషకాలు ఇతర శ్రేష్టమైన గుణాలు ఇందులో మెండు. అందుకే యాపిల్ అంటే అంత ప్రత్యేకత. రెడ్ యాపిల్లోని లక్షణలతో పోలిస్తే బ్లాక్ రంగులో ఉండే యాపిల్స్ అసాధారణమైన తీపి, అధిక సహజ గ్లూకోజ్ కంటెంట్ను కలిగి ఉంటాయి. మందమైన చర్మంతో నిగనిగలాడే ఈ యాపిల్స్ చైనాలోని ఉన్నత స్థాయి రిటైలర్లు మాత్రమే విక్రయిస్తారు. అయితే ధర మాత్రం ఒక్కో పండుకు రూ.500 వరకూ ఉంటుంది. ఇవి కేవలం చైనా, టిబెట్లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అంతేకాదు సాధారణంగా యాపిల్ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడితే, బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల సమయం పడుతుందట. అందులోనూ నిటారుగా ఉన్న పర్వత సానువుల్లో వీటిని పండిస్తారు. ఈ నేపథ్యంలోనే రైతులు వీటి సాగులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారట. వీటిని పెద్ద ఎత్తున సాగు చేయడం కూడా కష్టమే అవుతుంది. హార్వెస్టింగ్ సీజన్ కేవలం రెండు నెలలు మాత్రమే. అందులోనూ 30 శాతం పండ్లు మాత్రమే మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి మార్కెట్లోకి వస్తాయి. అందుకే వీటికి అంత డిమాండ్. Apples are generally red, green, yellow, but if the right geographical conditions are met, they can apparently grow dark purple, almost black, as well. These rare apples are called Black Diamond and they are currently only grown in the mountains of Tibet. pic.twitter.com/j4XXrDlS4X — Massimo (@Rainmaker1973) November 16, 2023 -
బై‘స్కిల్’లుడు
సైకిల్ను మధ్యలోకి మడిచి కారు డిక్కీలో పెట్టుకోవచ్చా? ‘బేషుగ్గా’ అంటున్నాడు ఆనంద్ మహీంద్రా. ఎక్కడ ‘స్కిల్’ కనిపించినా ఆ విశేషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది మామూలు సైకిల్ కాదు. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ–బైసికిల్. ఐఐటీ బాంబే స్టూడెంట్స్ ఈ బైసికిల్ను తయారు చేశారు. ‘మరోసారి మనం గర్వించేలా ఐఐటీ బాంబే స్టూడెంట్స్ సృష్టించిన వాహనం ఇది’ అని కాప్షన్ పెట్టాడు మహీంద్రా. ‘ఇంప్రెసివ్ ఇనోవేషన్... రివల్యూషన్ ఆన్ వీల్స్’ అంటూ యూజర్లు స్పందించారు. -
భారీగా తగ్గిన డైమండ్ ధరలు!
గతేడాది నవరాత్రి-దసరా కాలంతో పోలిస్తే ఈసారి పాలిష్ చేసిన వజ్రాల ధరలు గణనీయంగా 35 శాతం తగ్గాయి. కొన్ని కేటగిరీలకు చెందిన వజ్రాల ధరలు 2004లో ఉన్న ధరలతో సమానమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్, చైనాలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంతోపాటు ల్యాబ్లో తయారుచేసిన వజ్రాలకు పెరుగుతున్న ఆదరణ వల్ల ధరలు క్షీణిస్తున్నట్లు సమాచారం. పాలిష్ చేసే వజ్రాల్లో ప్రపంచంలోనే 90 శాతం భారత్లోనే తయారవుతాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీలు దేశీయ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించాలని చూస్తున్నాయి. డైమండ్ ధరలు తగ్గడం వల్ల దేశంలోని స్టోర్ల్లో దసరా సందర్భంగా 20 శాతం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో ముడి వజ్రాల ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని, దాంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మూడు నెలలుగా పాలిష్ చేసిన వజ్రాల కొనుగోలుదారుగా ఉన్న యూఎస్లో డిమాండ్ తగ్గడంతో కూడా వజ్రాలు సరసంగా లభిస్తున్నాయి. -
వజ్రాల వేటకు వచ్చి వ్యక్తి మృతి
నందిగామ(చందర్లపాడు): పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చి ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్కు చెందిన ఇస్రం రాంబాబు (40) ఆటో డ్రైవర్గా పని చేస్తాడు. చందర్లపాడు మండలం గుడిమెట్ల అటవీ ప్రాంతంలో కొంతకాలంగా వజ్రాల వేట పేట కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ క్రమంలో రాంబాబు కూడా వజ్రాలు అన్వేషించేందుకు గత మూడు రోజుల క్రితం గుడిమెట్ల వచ్చాడు. బుధవారం వజ్రాల వేటకు వచ్చిన కొందరు రాంబాబు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో చందర్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.వజ్రాల వేటకు వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడా? లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
స్విచ్బోర్డ్లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్ను పిస్తోల్తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?
పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు. తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
బాబోయ్ ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
వజ్రాల వేట.. కొందరికే ‘అదృష్టం’.. ఇక్కడే ఎందుకంటే?
తొలకరి పలకరించగానే వారిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని పొలాల బాట పడతారు. నేలలో అణువణువూ శోధిస్తారు. ప్రతి రాయి కదుపుతారు. మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకెళ్లి ఏజెంట్లకు చూపుతారు. అది వజ్రమైతే వారి పంట పండినట్లే! లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా... మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోయారు. అనంతపురం డెస్క్: వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే ఊరు వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే కవులూరు గ్రామం కాస్తా కాలక్రమేణా కరూరుగా.. వజ్రకరూరుగా రూపాంతరం చెందింది. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటీష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వపరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు కానీ.. సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వజ్రకరూరు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఎర్రనేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి. ఒక్కో పొలంలో 30–40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య వందకు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి.. దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతవాసుల రాక 15 ఏళ్లుగా ఎక్కువైంది. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. రూ.లక్ష మొదలుకుని రూ.50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. వజ్రకరూరు, రాగులపాడు, కమలపాడు, బోడిసానిపల్లి, పొట్టిపాడు గ్రామాల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేíÙంచే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని గుత్తి, కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్టజెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషుల (ఏజెంట్లు)ను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. వజ్రకరూరుతో పాటు ఈ ప్రాంతానికి 50 కి.మీ.లోపే దూరం ఉన్న కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతాల్లోనూ వజ్రాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని గనులు, భూగర్భశాఖ అధికారులు చెబుతున్నారు. దానికితోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన ఐదువేల సంవత్సరాల్లో దాదాపు అర కిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాన్వేషణకు 1934 సంవత్సరంలోనే బ్రిటీష్ వారు ‘ది న్యూ వజ్రకరూరు డైమండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్’ స్థాపించారు. వజ్రాలు లభించే పొలాలను సేకరించారు. ఈ కంపెనీని స్వాతంత్య్రం వచ్చాక 1970లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పరిధిలోకి తెచ్చారు. 1974 నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వజ్రాన్వేషణ చేపడుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వజ్రకరూరులోని వజ్రాల ప్రక్రమణ కేంద్రం (డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్) నడుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ కార్యకలాపాలు చురుగ్గా జరిగేవి. వివిధ కారణాలతో ప్రస్తుతం మందగించాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాంతంలోని వజ్ర నిక్షేపాలపై దృష్టి సారించినప్పటికీ మైనింగ్కు మాత్రం ముందుకు రాలేదు. -
సింకో గోల్డ్, డైమండ్ షోరుమ్ ను ప్రారంభించిన సంయుక్త మీనన్
-
బ్లాక్స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ
ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ)ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 525 మిలియన్ డాలర్లని సంస్థ తెలిపింది. 80 శాతం వాటాను షాంఘై యుయువాన్ టూరిస్ట్ మార్ట్ (గ్రూప్) నుంచి, మిగతా మొత్తాన్ని ఐజీఐ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రోలాండ్ లోరీ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించింది. ఐజీఐ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని యాంట్వెర్ప్లో ఉన్నప్పటికీ సంస్థ ఆదాయం, లాభాల్లో సింహ భాగం భారత్ నుంచే ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్ పాలిషింగ్ భారత్లోనే జరుగుతుండటం ఇందుకు కారణం. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు సర్టిఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. వివిధ దేశాల్లో 29 ల్యాబరేటరీలు (భారత్లో 18), 18 జెమాలజీ స్కూల్స్ నిర్వహిస్తోంది. కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఐజీఐ సీనియర్ ఎండీ ముకేష్ మెహతా తెలిపారు. ఇదీ చదవండి: ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్లు -
వజ్రంలో వజ్రం..బీటింగ్ హార్ట్గా పేరు.. అమూల్యమైన విలువ!
సూరత్: వజ్రాన్ని చూస్తేనే కళ్లు చెదురుతాయి. ధగధగలాడుతూ చూపరుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పాలా. కళ్లు కూడా తిప్పుకోలేం. అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లో సూరత్లో వి.డి. గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా లోపల అటూఇటూ ఎంచక్కా కదులుతోందని ఆ కంపెనీ వెల్లడించింది. 0.329 క్యారట్ల ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారు. వజ్రాల గనుల తవ్వకాల్లో గత ఏడాది అక్టోబర్లో ఈ వజ్రం లభించింది. అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దానిపై మరింత అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిదే బీటింగ్ హార్ట్ కూడానని తేల్చింది. అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల కిందటిదని, విలువ అమూల్యమని చెప్పుకున్నారు. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. రష్యాలో తయారు చేసే ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే చెక్క బొమ్మల్ని మత్రోష్కా అని పిలుస్తారు. ఇప్పుడు అచ్చంగా అదే మాదిరి వజ్రం మన దేశంలో కూడా లభించడం విశేషం. ఈ వజ్రం లోపలి వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయనం చేసే ‘డి బీర్స్’గ్రూప్కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్ హార్ట్లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. -
తమ్ముడికి ఆకాష్ అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. రాధిక మర్చంట్ మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవలే అనంత్-రాధికల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ నివాసం అంటీలియాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అనంత్ అంబానీకి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంత్ ఎంగేజ్మెంట్ రోజున సోదరుడు ఆకాష్ అంబానీ అత్యంత ఖరీదైన ఓ వస్తువును తమ్ముడికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంబానీ ఫ్యాన్ పేజ్ సోషల్ మీడియాలో పంచుకుంది. అనంత్ తన సోదరుడు ఆకాష్ నుంచి కార్టియర్ నుంచి కస్టమైజ్ చేసిన పాంథర్ బ్రూచ్ను(విలువైన స్టోన్స్, డైమెండ్స్తో తయారు చేయబడి సూట్పై అలంకరించే పిన్) గిఫ్ట్గా పొందినట్లు సమాచారం. చిరుతపులి ఆకారంలో ఉంటే ఈ బ్రూచ్ను 51 నీలమణి, 2 పచ్చలతో పొదిగిన 18 క్యారెట్ల తెల్ల బంగారంతో ప్రత్యేకంగా రూపొందించారట. అంతేగాక ఇందులో 604 అన్కట్ డైమండ్స్ను పొందిపరిచారు. అయితే తెల్లని చిరుతపులిలా కనిపించే బ్రూచ్ ధర అక్షరాల 162,000 డాలర్లు అట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.3 కోట్లు. అయితే దీని విలువ ఇంత కంటే ఎక్కువే ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. కాగా అనంత్ పెళ్లాడబోయే యువతి ఎన్కోర్ హెల్త్కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కూతురు. వీరు గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రాధిక క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఎనిమిదేళ్లుగా ఆమె భరత న్యాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ముఖేష్ అంబానీకి ముగ్గురు సంతానం కాగా.. ఆకాష్, ఇషా కవలలు, అనంత్ చిన్న కుమారుడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే -
పదేళ్లలో 17 బిలియన్ డాలర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ వజ్రాల పరిశ్రమ 2030 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయని డైమండ్ మైనింగ్ దిగ్గజం డిబీర్స్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ తొరాంజ్ మెహతా తెలిపారు. ప్రస్తుతం ఇది 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని వివరించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద మార్కెట్గా ఉన్న భారత్ ఇప్పుడిప్పుడే గణనీయంగా వృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు. ‘‘మెచ్యూరిటీని బట్టి చూస్తే జపాన్ పూర్తి స్థాయిని దాటేసింది. అమెరికా ప్రస్తుతం దగ్గర్లో ఉంది. చైనా వృద్ధి దశలోనూ, భారత్ వర్ధమాన స్థాయిలోనూ ఉంది’’ అని మెహతా వివరించారు. మధ్య ప్రాచ్యం, యూరప్ మొదలైన ప్రాంతాల మార్కెట్ వాటా సుమారు చెరో 7 శాతం స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సూరత్లోని డిబీర్స్ అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ సందర్శన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘‘భారత ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. మధ్యతరగతి జనాభా పెరగనుంది. డైమండ్స్ కొనుగోలు చేసే సంపన్న వర్గాల సంఖ్య మరింత ఎక్కువగా 25 శాతం మేర పెరగవచ్చని అంచనా. అలాగే వయస్సు రీత్యా చూస్తే కూడా వజ్రాల వైపు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో దేశీయంగా పరిశ్రమ వృద్ధికి తోడ్పడనున్నాయి’’ అని మెహతా వివరించారు. ఫరెవర్ మార్క్ అనే తమ బ్రాండ్ విషయానికొస్తే అమ్మకాలపరంగా భారత్ అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమకు 60 నగరాల్లో 270 పైచిలుకు రిటైల్ అవుట్లెట్స్, 14 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయని మెహతా వివరించారు. కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో ఈ నెలాఖరు నాటికి ఇండోర్, మంగళూరులో కొత్తగా రెండు ఎక్స్క్లూజివ్ స్టోర్స్ను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు. దక్షిణాదిలో నాణ్యత .. ఉత్తరాదిలో పరిమాణం.. దక్షిణాది, ఉత్తరాది మార్కెట్లలో డిజైన్ల ప్రాధాన్యాలు చాలావరకు భిన్నంగా ఉంటాయని మెహతా తెలిపారు. దక్షిణాదిలో డైమండ్ పరిమాణం చిన్నదిగా ఉన్నా మంచి రంగు, అత్యుత్తమ క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారని, అదే ఉత్తరాదిలో డైమండ్ పరిమాణానికి కొంత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని పేర్కొన్నారు. తమకు దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు అత్యధికంగా ఉండగా, ఉత్తరాదిలో పుంజుకుంటున్నాయని మెహతా చెప్పారు. అతి పెద్ద కేంద్రం.. డిబీర్స్కు ప్రపంచవ్యాప్తంగా మూడు (బ్రిటన్, బెల్జియం, భారత్) డైమండ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా సూరత్లోని ఇనిస్టిట్యూట్ అతి పెద్దది. దీని ద్వారా డిబీర్స్ అధునాతన యంత్రాలు, నిపుణులతో డైమండ్ గ్రేడింగ్, టెస్టింగ్, ఇన్స్క్రిప్షన్ సేవలు అందిస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ కేంద్రంపై దాదాపు 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడాదికి దాదాపు 10 లక్షల సర్టిఫికెషన్లు చేసే సామర్థ్యాలతో ఇది ఏర్పాటైంది. -
షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలో ఒకరు. ఇక ముంబైలోని ఆయన నివాసం ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. అక్కడ చూడదగిన ప్లేస్లో షారుఖ్ నివాసం మన్నత్ ఒకటి. సుమారు రూ. 200 కోట్లతో అన్ని హంగులతో షారుక్ తనకు నచ్చినట్టుగా మన్నత్నని నిర్మించుకున్నాడు. ఇందులో షారుక్ ఇంటి నెంబర్ ప్లేటు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన్నత్కు మరింత మెరుపు తీసుకువచ్చేందుకు గతంలో వజ్రాలతో ఉన్న నెంబర్ ప్లేట్ని చేపించాడు షారుక్. పూర్తిగా వజ్రాలతో పొదిగిన ఈ ప్లేట్పై మన్నత్ అని నల్లటి అక్షరాలతో రాసి ఉంటుంది. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? అయితే భద్రత దృష్ట్యా ఈ నేమ్ ప్లేట్ తీసేశారు. తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్ పెట్టించాడు. దాదాపు 35 లక్షలతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్ తయారు చేయించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్ని చూసేందుకు మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. మన్నత్ను సందర్శించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఇంటి డైమండ్ నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. After 2 months #Mannat new gate design is unveiled and it's super awesome. What do you think guys? 😍#GauriKhan #ShahRukhKhan pic.twitter.com/w2VcF2AEl9 — Team Shah Rukh Khan Fan Club (@teamsrkfc) November 19, 2022 -
ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ!
దీపావళి.. భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే సంస్థలు తమ ఉద్యోగులకు బహామతులు ,బోనస్లు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఓ యజమాని మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్ని తన ఉద్యోగులకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్లోని శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి. దీని యజమాని గోవింద్ ధోలాకియా. ఆయన గతంలో కార్లు, ఇళ్లు అంటూ తన ఉద్యోగులకు అనేక బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బహామతులను ఇవ్వదలచుకున్నాడు. అయితే అది జీవితాంతం గుర్తుండడంతో పాటు వాళ్లకు ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారి కంపెనీలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లను అందించారు. దీని ద్వారా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించాలనుకున్నాడు. ఇప్పటికే 550 మంది ఉద్యోగులకు ఈ గిఫ్ట్ అందించినట్లు మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలో అందజేయనన్నారు. పర్యావరణానికి కూడా ఇది బోనస్! ధోలికియా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగుతంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
‘గోల్డెన్ కనరీ’ వజ్రం.. ధర రూ.123 కోట్లు.. అంచనా మాత్రమే!
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్ద పసుపు రంగు ‘గోల్డెన్ కనరీ’ వజ్రం ఇది. దుబాయ్లోని సోత్బేస్ ప్రదర్శనలో ఉంచారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్లో న్యూయార్క్లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించినపుడు దీని బరువు 890 క్యారెట్లు. తర్వాత పలుమార్లు సానబట్టి ముక్కలుగా మారింది. చివరకు 303.10 క్యారెట్లకు తగ్గించారు. అదే ఈ వజ్రం. డిసెంబర్ 7న న్యూయార్క్లో ఇది రూ.123 కోట్ల ధర పలకొచ్చని ఒక అంచనా. ఇదీ చదవండి: పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం -
హైదరాబాద్ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమకు శంకుస్థాపన
-
రికార్డ్ ధర పలికిన అరుదైన ‘పింక్’ వజ్రం.. ఎంతంటే?
హాంకాంగ్: అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర 21 మిలియన్ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదీ చదవండి: 15 నిమిషాల రైడ్కు రూ.32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్ -
అదృష్టమంటే మీదే సామీ.. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులయ్యారు!
అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో ఎవరిని వరిస్తుందో చెప్పులేము. దశ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు.. అలాగే బిక్షగాడు కూడా అయ్యే అవకాశమూ లేకపోలేదు. తాజాగా ఓ రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో పన్నా జిల్లాలోని బ్రిజ్పుర్కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు స్నేహితులతో కలిసి కొంత కాలం క్రితం.. లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. అనంతరం, వజ్రాల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో ముందుకుసాగాడు. ఈ క్రమంలో గురువారం వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. Madhya Pradesh News: पन्ना में एक साथ चार लोगों को अलग-अलग खदानों में मिले बेशकीमती हीरे#siamond #mpnews #pannanewshttps://t.co/2QnRAKyMeZ pic.twitter.com/HuPYudd62j — NaiDunia (@Nai_Dunia) September 22, 2022 -
పండుగ ఆఫర్లు.. బంగారంపై భారీ తగ్గింపు!
హైదరాబాద్: టాటా గ్రూప్ ఆభరణాల రిటై ల్ బ్రాండ్ తనిష్క్.. శుభప్రదమైన వరమహాలక్ష్మీ వేడుకల్లో భాగంగా అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించింది. బంగారం ఆభరణాలపై గ్రాముకు రూ.200 వరకూ తగ్గింపు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకూ రాయితీ ఇందులో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల అన్ని తని‹Ù్క షోరూమ్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. జోయాలుక్కాస్.. అనుగ్రహ హైదరాబాద్: వివాహ సంబరాలకుగాను జోయాలుక్కాస్ ‘అనుగ్రహ’ బ్రాండ్ పేరుతో కొత్త జ్యువెలరీ కలెక్షన్ను ఆవిష్కరించింది. కాబోయే పెండ్లి కుమార్తెల కోసం రూపొందించిన ఈ ప్రత్యేక ఆభరణాలు దేశవ్యాప్తంగా తమ అన్ని షోరూమ్లలో లభ్యం అవుతాయని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. సంస్థ డైమండ్ జ్యువెలరీపై 25 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లూ ప్రకటన పేర్కొంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
అత్యద్భుతమైన డిజైన్లతో ఆభరణాల ప్రదర్శన (ఫోటోలు)
-
అదృష్టం: పేదమహిళ సుడితిరిగి లక్షాధికారిగా!
భోపాల్: అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కంటపడని అదృష్టం.. ఆమెకు అనుకోకుండా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే ఆమె నసీబ్ను మార్చేసింది. కట్టెల కోసం వెళ్లిన ఓ పేద గిరిజన మహిళకు.. అక్కడ దొరికిన వస్తువు ఒకటి లక్షాధికారిని చేసేసింది. మధ్యప్రదేశ్ వజ్రాల జోన్ అయిన పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే బుధవారం రోజున పొయ్యి కట్టెల కోసం అడవికి బయలుదేరింది జెందా బాయి. అక్కడ ఆమె మట్టిలో కూరుకుపోయి మెరుస్తున్న ఓ రాయి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. అయితే దాని మెరుపు ఆయనకు అనుమానంగా అనిపించి.. అధికారులను సంప్రదించాడు. వాళ్లు పరీక్షించి అదొక 4.39 క్యారట్ వజ్రమని, చెప్పడంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్.. డైమండ్ డిపాజిట్ ఫార్మాలిటీస్ను పూర్తి చేశారు. వేలంలో అది ఫలానా ధర దక్కించుకోవడమే తరువాయి. కనీసం దాని విలువ రూ.20 లక్షల దాకా పలకవచ్చని అనుపమ్ సింగ్ అంటున్నారు. వచ్చేదాంట్లో ప్రభుత్వం తరపున రాయల్టీ, ట్యాక్సుల రూపంలో 12.5 శాతం మినహాంచుకుని.. మిగతాది జెందా బాయి కుటుంబానికి ఇచ్చేస్తారు. పన్నా జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తంపూర్ గ్రామం.. జెండా బాయి కుటుంబం ఉంటోంది. భర్త కూలీపనులు.. జెందా బాయి రోజూ కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో వజ్రం రూపంలో ఆ పేద కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. వచ్చిన డబ్బుతో సొంతగా ఒక ఇల్లు కట్టించుకోవడంతో పాటు కూతుళ్ల పెళ్లిలకు కొంత డబ్బును డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు ఆ భార్యభర్తలు. Video: A tribal woman, out gathering firewood in a forest in MP’s #Panna , found a diamond worth at least Rs 20 lakh. #MadhyaPradesh pic.twitter.com/x0dLlBYXMJ — TOI Bhopal (@TOIBhopalNews) July 29, 2022 -
అతిపెద్ద వజ్రం..
లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ రాయిని చూశారా. అది మామూలు రాయి కాదు. అరుదైన పింక్ డైమండ్. దాని ఖరీదు వందలు లేదా వేల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రం అంగోలాలో బయటపడింది. లులో గనుల్లోని తవ్వకాల్లో బయటపడ్డ ఈ 170 క్యారట్ల పింక్ డైమండ్ ‘ద ల్యూలో రోస్’300 ఏళ్లలో దొరికిన అతిపెద్ద వజ్రంగా లుకాపా డైమండ్ కంపెనీ చెబుతోంది. చారిత్రాత్మకమైన టైప్ ఐఐఏకు చెందిన ఈ వజ్రం అరుదైనది, అత్యంత సహజమైనది కూడా. ఇది అంగోలాను ప్రపంచవేదిక మీద ప్రత్యేకస్థానంలో నిలబెడుతుందని లులో గనుల్లో భాగస్వామి అయిన అంగోలన్ ప్రభుత్వం చెబుతోంది. దాన్ని కట్ చేసి, పాలిష్ చేస్తే.. సగం రాయి పోయినా సగం వజ్రం ఉంటుందని, అది రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2017లో హాంగ్కాంగ్ ప్రభుత్వం 59.6 కేరెట్ల పింక్స్టార్ వజ్రాన్ని 71.2 మిలియన్ డాలర్లు అంటే... దాదాపు రూ.570 కోట్ల రూపాయలకు అమ్మింది. అదే అత్యంత ఖరీదైన వజ్రంగా చర్రితలో మిగిలిపోయింది. ఇక 170 కేరెట్ల ‘లులో రోస్’వందలు కాదు.. వేల కోట్లు పలుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
దశాబ్ద కాలంలో ఇదే రికార్డ్.. ఆ వజ్రాలకు భారీ డిమాండ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వజ్రాల పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం తగ్గుతుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘డిమాండ్ పడిపోవడం, ముడి వజ్రాల ధర అంతర్జాతీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2022–23లో పరిశ్రమ ఆదాయం రూ.1,52,000–1,60,000 కోట్లు నమోదు కావొచ్చు. సహజ వజ్రాలకు కొరత, అంతకంతకూ ఇవి ప్రియం కావడంతో వినియోగదార్లు 50–60 శాతం తక్కువ ధర కలిగిన కృత్రిమ వజ్రాల వైపు మళ్లుతున్నారు. మొత్తం పరిశ్రమలో కృత్రిమ వజ్రాల వాటా రెండేళ్ల క్రితం 3 శాతం నమోదైంది. ప్రస్తుతం ఇది ఏకంగా 8 శాతానికి చేరింది. 2021–22లో పరిశ్రమ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే భారీ రికార్డ్. ఇక పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 48 శాతం, ముడి వజ్రాల దిగుమతులు 74 శాతం దూసుకెళ్లాయి. ముడి వజ్రాలకు అనుగుణంగా పాలిష్ చేసిన వజ్రాల ధరలు నిర్ణయిస్తారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలను పరిశ్రమ పెంచలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ముడి వజ్రాల ధర దాదాపు 30 శాతం అధికమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వజ్రాల పాలిషింగ్ కంపెనీల నిర్వహణ లాభదాయకత 75–100 బేసిస్ పాయింట్లు తగ్గి 4–4.25 శాతానికి చేరవచ్చు. ద్రవ్యోల్బణం, మరోవైపు యాత్రలు, ఆతిథ్యంలో కస్టమర్లు ఖర్చు చేస్తుండడంతో యూఎస్, యూరప్లో సమీప కాలంలో డిమాండ్ తగ్గుతుంది’ అని క్రిసిల్ వివరించింది. చదవండి: ఉక్రెయిన్ వార్.. భారత్కు అలా కలిసోచ్చిందా! -
ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు..
Tamannaah Bhatia Has Expensive Diamond: 'హ్యపీ డేస్' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తన అందం, అభినయంతో యూత్ను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్ల అవుతున్నా ఈ ముంబై భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'ఎఫ్-3' మూవీతో సూపర్ హిట్ కొట్టింది. త్వరలో 'గుర్తుందా శీతకాలం'తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 50కిపైగా చిత్రాల్లో నటించిన తమన్నా పర్సనల్ లైఫ్ను కూడా లగ్జరీతో ఎంజాయ్ చేస్తోంది. సుమారు రూ. 150 కోట్లకుపైగా ఆస్తిని కూడగట్టిన ఈ మిల్కీ బ్యూటీ వద్ద ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు వంటి తదితర విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అయితే తమన్నా వద్ద ఉన్న ఒక వస్తువు గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండటం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వజ్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని టాక్. రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ. 43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల మిత్సుబిషి పేజర్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని సమాచారం. -
పేద రైతు అదృష్టం.. లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది
అదృష్టం మెరిసి.. ఓ రైతు జీవితం రాత్రికి రాత్రే వెలుగులతో నిండిపోయింది. పేద రైతు కాస్త లక్షాధికారి హోదా దక్కించుకున్నాడు. కానీ, దాని వెనుక మూడు నెలల కష్టం దాగుంది. లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది ఆయనకి. వేలంలో ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతాప్ సింగ్ అనే రైతు ఓ భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకి 11.88 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ తెలిపారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని అధికారులు.. ప్రతాప్కు శుభవార్త చెప్పారు. వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో జరిగిందీ ఘటన. మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో అయినా సరే ప్రయత్నిస్తే.. విజయం దక్కుతుంది అనడానికి తన ప్రయత్నమే ఉదాహరణ అని అంటున్నాడాయన. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేయనుంది. చదవండి: చీకట్లు కమ్మేశాయి.. అయినా ఆమే గెలిచింది -
రూ. 371 కోట్లు పలికిన డైమండ్ .. ఎందుకో తెలుసా!
వజ్రం అంటేనే వ్యాల్యూ ఎక్కువ. అలాంటిది ఇది నీలం రంగు(వివిడ్ బ్లూ) వజ్రం.. పైగా.. 15.10 క్యారెట్లది. దీంతో రికార్డు స్థాయిలో రూ.371 కోట్లు ధర పలికింది. సదబీస్ సంస్థ బుధవారం హాంకాంగ్లో దీని వేలాన్ని నిర్వహించింది. రూ.350 కోట్ల దాకా పలుకుతుందని తొలుత అనుకున్నారు. అయితే.. అంతకుమించిన ధర వచ్చింది. 2021లో దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం దొరికింది. దీన్ని రూ.308 కోట్లకు డిబీర్స్, డయాకోర్ సంస్థలు కొనుగోలు చేసి.. పాలిషింగ్ అనంతరం అమ్మకానికి పెట్టాయి. చదవండి: International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు.. -
ఇటుక బట్టీ ఓనర్ అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!
ప్రయత్నమే కాదు.. అప్పుడప్పుడూ అదృష్టమూ తోడవ్వావలంటారు పెద్దలు. అలా ఓ కుటుంబం శ్రమకు అదృష్టం కలిసొచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో సుశీల్ శుక్లా కుటుంబం ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్పూర్ ఏరియా నుంచి మట్టిని సేకరిస్తుంటుంది ఈ కుటుంబం. ఈ క్రమంలో సోమవారం సుశీల్ పేరెంట్స్.. మట్టి తీస్తుండగా అందులోంచి వజ్రం బయటపడింది. అది 26.11 క్యారట్ల డైమండ్. దానిని నిజాయితీగా అధికారులకు అప్పగించగా.. దాని విలువ కోటిన్నర రూపాయల దాకా ఉండొచ్చని, వేలం వేసినా కనీసం ఒక కోటి 20 లక్షల రూపాయల దాకా రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేసి.. ప్రభుత్వ రాయలిటీ, ట్యాక్సులు పోనూ మిగతాది అది దొరికిన శుక్లాకు అప్పగిస్తామని వెల్లడించారు. విశేషం ఏంటంటే.. శుక్లా ఫ్యామిలీ వజ్రాల కోసం రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోయిండట. దీంతో నిస్సారమైన ఆ ప్రాంతాన్ని ఇటుకల తయారీకి మైన్ రూపంలో మట్టి కోసం లీజుకు తీసుకుంది. కానీ, ఇరవై ఏళ్ల తర్వాత అనుకోకుండా ఇలా ఒక రేంజ్లో అదృష్టం తగలడంతో ఆ కుటుంబం ఖుషీగా ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిన శుక్లా కుటుంబం.. వచ్చే దాంట్లోనూ మొత్తం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే.. ఆ భూమిని మరో ఐదుగురితో కలిసి లీజ్కు తీసుకున్నారట. అందుకే వచ్చేదాంట్లో వాళ్లకూ భాగం పంచాలని ఫిక్సయ్యాడు శుక్లా. ఏదేమైనా వచ్చిన డబ్బుతో కొత్త బిజినెస్ మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు శుక్లా. మధ్యప్రదేశ్ రాజధాని బోఫాల్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పన్నా. 12 లక్షల క్యారెట్ల వజ్రాలకు ఈ ప్రాంతం నెలవై ఉందని అధికారులు చెప్తున్నారు. పైగా గతంలోనూ శుక్లాకు తగిలినట్లే జాక్పాట్ ఎందరికో తగిలింది కూడా. -
బంగారంపై బంపరాఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘‘ప్రతి మహిళా ఒక వజ్రమే’’ పేరుతో నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వజ్రాభరణాలపై 20శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని తనిష్క్ షోరూంలలో ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు ఉంటుందని పేర్కొంది. -
అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !
అనంతమైన నక్షత్రాలకు, కోట్ల కొలది గ్రహాలను నెలవు ఈ విశ్వం. అందులో మరో గ్రహానికి చెందిన ఓ అరుదైన వజ్రం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వజ్రం కొనుగోలు చేయాలంటే రూపాయలు, డాలర్లలోనే కాదు క్రిప్టో కరెన్సీలో కూడా చెల్లింపులు చేయవచ్చు. ఇంతకీ ఈ వజ్రం ఎక్కడిది? ఎవరు అమ్మకానికి పెట్టారు ? ధర ఎంత అనే వివరాలు మీ కోసం.. ఫిబ్రవరిలో ఖగోళంలో మరో గ్రహానికి చెందినదిగా చెప్పబడుతున్న అరుదైన వజ్రాన్ని సోత్బే సంస్థ వేలానికి పెడుతోంది. 2022 ఫిబ్రవరిలో ఈ వజ్రాన్ని లండన్లో వేలం వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వజ్రం విశేషాలను దుబాయ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోత్బే సంస్థ ప్రదర్శించింది. అన్నింటా 5 భూమికి చెందని ఈ అరుదైన వజ్రాన్ని ది ఎనిగ్మా అని పిలుస్తున్నారను. ఈ వజ్రం 555.55 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉంది. అంతేకాదు ఈ వజ్రానికి 55 ముఖాలు ఉన్నాయి. న్యూమరాలజీ పరంగా ఇలా అనేక 5 అంకె కలిసి రావడం చాలా అరుదని వజ్రాల నిపుణులు అంటున్నారు. కార్బనాడోగా పేర్కొనే నల్లని వజ్రాలు చాలా అరుదుగా లభిస్తుంటాయని.. ఇప్పటి వరకు భూమ్మిద నల్లని వజ్రాలు కేవలం బ్రెజిల్, సెంట్రల్ ఆఫ్రికాలోనే దొరికాయని సోత్బే తెలిపింది. గ్రహ శకలం నుంచి ది ఎనిగ్మా వజ్రం భూమ్మిద లభించే మెటీరియల్తో రూపొందలేదని, గ్రహ శకలాలు భూమిని తాకినప్పుడు ఇక్కడి వాతవారణ పరిస్థితుల కారణంగా ఘనీభవించి, వేడేక్కి, ఆవిరై ఇలా పలు రకాలైన రసాయన మార్పులకు లోనై ఈ నల్లని వజ్రం ఏర్పడిందని సోత్బే పేర్కొంది. అయితే ఈ వజ్రం భూమ్మిది ఏ ప్రాంతంలో లభించిందనే వివరాలు ఆ సంస్థ వెల్లడించలేదు. రూ. 50 కోట్లు ది ఎనిగ్మా డైమండ్ వజ్రం వేలంలో ప్రారంభ ధర 5 మిలియన్ పౌండ్లు నిర్ణయించారు. డాలర్లలో ఈ వజ్రం 6.8 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.50 కోట్లు)గా ఉంది. వజ్రాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న వారు సాధారణ నగదుతో పాటు క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసినా అంగీకరిస్తామని సోత్బే చెబుతోంది. దండిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఈ అరుదైన వజ్రాన్ని సొంతం చేసుకోవచ్చు! -
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..!
న్యూఢిల్లీ: ప్రతి మనిషి జీవితంలో తాను కోరుకున్న రంగంలో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తాడు. అందుకు తగ్గట్టే ప్రయత్నాలు చేస్తాడు. కొందరికి వెంటనే అవకాశాలు లభిస్తాయి.. ఇక కొందరికేమో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లభించదు. నిరాశవాదులైతే.. మాకింతే ప్రాప్తం అనుకుని వదిలేస్తారు. మరికొందరు ఉంటారు.. అపజయాలు ఎదురైన కొద్ది.. వారిలో కసి పెరుగుతుంది. తమకు ఎదురైన అడ్డంకులునే సోపానాలుగా మార్చుకుని విజయం సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే యూట్యూబర్ పంకజ్ శర్మ. పేరు గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ‘బక్లోల్ వీడియో’ అని యూట్యూబ్ చానెల్ పేరు చెప్తే టక్కున గుర్తుపడతారు చాలా మంది. అతడి సక్సెస్ స్టోరీ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఆవివరాలు.. ఢిల్లీకి చెందిన పంకజ్ శర్మ గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ నుంచి బీసీఏ, ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత 15 వేల రూపాయల జీతానికి గురగావ్లో ఉద్యోగంలో చేరాడు. కానీ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. సినిమాల్లోకి వెళ్లాలనేది పంకజ్ కోరిక. (చదవండి: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్) ఆ ఆలోచన మార్చింది... ఈ క్రమంలో ఉద్యోగం వదిలిపెట్టి.. అవకాశాల కోసం సినీ కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. కానీ వెళ్లిన ప్రతి చోటా నిరాదరణే. ఇవేవీ పంకజ్ని కుంగదీయలేదు. మరింత పట్టుదలగా ప్రయత్ం చేశాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. అవకాశాల కోసం తిరిగేబదులు.. తనకు తానే అవకాశాలు సృష్టించుకోవడం మంచిది అనుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ప్రారంభం... దానిలో భాగంగా బక్లోల్ వీడియో అనే యూట్యూబ్ చానెల్ని ప్రారంభించాడు. మొదటి సంపాదన 9800 రూపాయలు. రెండేళ్లు పట్టు వదలకుండా ప్రయత్నించడంతో చానెల్కి సబ్స్ర్కైబర్లు పెరిగారు. వ్యూస్ కూడా పెరిగాయి. ఈ క్రమంలో పంకజ్ తీసిన దేశీ బచ్చే వర్సెస్ ఆంగ్రేజ్ మీడియం వీడియో ఏకంగా 78 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. (చదవండి: యూట్యూబ్ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్) డైమండ్ బటన్... 10 మిలియన్ల సబ్స్క్రైబర్స్ దాటితే.. ఆ చానెల్కి డైమండ్ బటన్ ఇస్తారు. పంకజ్ యూట్యూబ్ చానెల్ కూడా డైమండ్ బటన్ పొందింది. ప్రసుత్తం పంకజ్ చానెల్కి 10.2మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇతడి చానెల్కి 305కే, ఫేస్బుక్లో 4.1మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఒకప్పుడు నిరాదరణను ఎదుర్కొన్న పంకజ్ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. చదవండి: జాబ్ వదిలేసి పాత డ్రమ్ములతో వ్యాపారం.. అతని జీవితాన్నే మార్చేసింది -
మార్నింగ్ వాక్కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపుతడుతుందో చెప్పలేం! ఒక్కొసారి వారి జీవితం అనూహ్య మలుపు తిరగడం కూడా జరుగుతుంది. అలాంటి అనూహ్య సంఘటనే జరిగింది. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్కి వెళ్లిన ఓ మహిళకు అదృష్టం 4 క్యారెట్ల డైమండ్ రూపంలో కలిసిసొచ్చింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నొరీన్ రిడ్ బెర్గ్ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే సమీపంలోని అర్కన్సాస్ స్టేట్ పార్క్కు మార్నింగ్ వాక్కు వెళ్లింది. సడెన్గా ఆమెకు పసుపు రంగులో ఉన్న 4.38 క్యారెట్ డైమండ్ దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు 2 వేల నుంచి 20,000 డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) ఉంటుందట. పసుపు రంగులో తళతళ మెరిసిపోతున్న డైమండ్ ఆమె జీవితాన్ని అనూహ్యమలుపు తిప్పింది. 1972 తర్వాత ఇటువంటి డైమండ్ మళ్లీ ఇన్నాళ్లకి దొరికిందని పార్క్ నిర్వాహకులు తెలిపారు. 1972 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 75 వేల డైమాండ్లు దొరికాయట. ఈ యేడాది 258 వజ్రాలు అక్కడి ప్రజలకు దొరికాయని స్థానిక మీడియా తెల్పింది. ఈ పార్కును సందర్శించే వారికి రోజుకు కనీసం ఒకటి రెండైన వజ్రాలు దొరకుతాయట. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! కాగా ప్రపంచవ్యాప్తంగా అర్కన్సాస్ స్టేట్ పార్క్ డైమండ్లకు ఫేమస్. ఈ పార్క్ ఉన్న ప్రదేశంలో అగ్నిపర్వతం నుంచి పైకి ఉబికి వచ్చిన శిలాద్రవం అంతా విస్తరించి ఉంటుంది.అందువల్ల ఈ పబ్లిక్ పార్కులో తరచుగా విలువైన వజ్రాలు దొకుతాయట. ఇక్కడ ఎవరైనా డైమండ్ల కోసం వెతకొచ్చట. అంతేకాకుండా దొరికిన డైమండ్ వాళ్లదగ్గరే ఉంచుకోవచ్చు లేదా అమ్ముకొవచ్చు. ప్రపంచంలోనే వజ్రాలు దొరికే ఏకైక పబ్లిక్ పార్క్ ఇదేనట..!! చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! -
15 ఏళ్ల నుంచి తవ్వకాలు.. విలువైన వజ్రం లభ్యం
భోపాల్: రత్నాలు కోసం తవ్వకాలు జరుపుతున్న నలుగురు మైనింగ్ కార్మికులకు వజ్రం లభ్యమైంది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో గత కొన్నేళ్లుగా రత్నాల కోసం పలు ప్రాంతాల్లో గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే హీరాపూర్ తపారియన్ ప్రాంతంలో రతన్ లాల్ ప్రజాపతి లీజుకు తీసుకున్న భూమిలో 8.22 క్యారెట్స్ వజ్రం దొరికినట్లు పన్నా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. అదే విధంగా లభ్యమైన వజ్రాన్ని, మరికొన్ని రత్నాలను ఈ నెలలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వజ్రం వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పన్నులు మినహాయించిన తర్వాత సదరు గనులు లీజ్కు తీసుకున్నవారికి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి సెప్టెంబర్ 21 లభ్యమైన వజ్రం, కొన్ని రత్నాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తాజాగా లభ్యమైన వజ్రానికి సుమారు రూ. 40 లక్షలు వేలం పలుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ‘గత 15 ఏళ్ల నుంచి పలు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నామని కానీ, ఎక్కడా వజ్రాలు లభ్యం కాలేదు. అయితే హిరాపూర్లో ఆరు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో తమకు వజ్రం లభ్యమైంది’ అని మైనింగ్ కార్మికల్లో ఒకరైన రాఘువీర్ ప్రజాపతి తెలిపారు. గని భాగస్వాములతో కలిసి వేలంలో వచ్చిన డబ్బును తమ పిల్లల చదువులకు ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు -
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట
-
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్క్రీమ్గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
కర్నూలు జిల్లాలో మహిళా కూలీకి వజ్రం లభ్యం
తుగ్గలి: పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైనట్లు సమాచారం. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) -
వజ్రాల కోసం ఎగబడ్డ జనం.. తలలు పట్టుకున్న అధికారులు
అది దక్షిణాఫ్రికా తీరం వెంట ఉండే ఓ చిన్న ఊరు. వారం క్రితం వరకు ఆ ఊరి గురించి.. పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఓ పశువుల కాపరి ప్రకటన తర్వాత ఆ ఊరి పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. దేశం నలమూలల నుంచి అక్కడికి ‘క్యూ’ కడుతున్నారు. ఎందుకోసం అనుకుంటున్నారు వజ్రాల వేట కోసం.. ప్రిటోరియా: క్వాహ్లాతి.. సౌతాఫ్రికాలో ఓ చిన్న కుగ్రామం. ఆ ఊరి శివారులో ఉన్న భూముల్లో వారం క్రితం ఓ గొర్రెల కాపరికి మెరిసే రాళ్లు దొరికాయి. అవి వజ్రాలేనని ప్రచారం మొదలుకావడంతో జనాలు ఎగబడి మరీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పదులు.. వందలు.. వేల మంది అక్కడికి చేరుకున్నారు. తమ దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రంగు రంగుల రాళ్లు వాళ్లకు దొరుకుతున్నాయి. అధికారులకు కరోనా భయం కాగా, తవ్వకాల్ని కట్టడి చేయడంలో అక్కడి అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది ఒకేసారి తవ్వకాలు చేపడుతుండడంతో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వాళ్లలో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. ‘మీకు చేతులెత్తి మొక్కుతాం. తవ్వకాలు ఆపండి. మాకు సహకరించండి. ఆశతో ప్రాణల మీదకు తెచ్చుకోవద్దు’ అని మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆశచావని ప్రజలు కరోనా ఎఫెక్ట్తో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం అయ్యింది. లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. ఈ తరుణంలో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు ప్రజలు. అయితే వారం గడుస్తున్నా అవి వజ్రాలేనా? అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమయ్యారు. అయినప్పటికీ ఆశ చావని ప్రజలు.. వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం
ప్రపంచంలో మూడో అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం. ఆంగ్లో అమెరికన్(ఎఎఎల్), బీర్స్, స్థానిక ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో జరిపిన తవ్వకాలలో ఇది దొరికింది. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ స్టోన్ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల "లెసెడి లా రోనా" అనే రెండవ అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది. గత 50 సంవత్సరాల చరిత్రలో డెబ్స్వానా స్వాధీనం చేసుకున్న అతిపెద్ద వజ్రం ఇది అని ఆర్మ్ స్ట్రాంగ్ చెప్పారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వజ్రం అని పేర్కొన్నారు. 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 27 మి.మీ మందం కలిగిన ఈ వజ్రానిక్ ఇంకా పేరు పెట్టలేదు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల వజ్రాల అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు ఈ వజ్రం దొరకడంతో మళ్లీ మంచి రోజు వచ్చినట్లు ఖనిజాల శాఖ మంత్రి లెఫోకో మోగి తెలిపారు. డివిడెండ్లు, రాయల్టీలు, పన్నుల ద్వారా డెబ్స్వానా అమ్మకాల రూపంలో ప్రభుత్వం 80 శాతం ఆదాయాన్ని అందుకుంటుంది. ఉత్పత్తి 2020లో డెబ్స్వానా 29 శాతం పడిపోయి 16.6 మిలియన్ క్యారెట్లకు పడిపోయింది. ఈ మహమ్మారి ప్రభావం ఉత్పత్తి, డిమాండ్ రెండింటి మీద పడటంతో అమ్మకాలు 2.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. 2021లో ప్రపంచ వజ్రాల మార్కెట్ కోలుకోవడంతో 38 శాతం ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట! -
జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో తాజాగా మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలిసింది. పొలం పనులకు వెళ్లిన ఓ కూలీకి దొరికిన ఒక వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేయగా, ఇంకో వ్యక్తికి దొరికిన మరో వజ్రాన్ని మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గురువారం ఇదే గ్రామంలోని ఓ రైతుకు పొలంలో రూ.1.2 కోట్ల విలువైన వజ్రం దొరికినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండ్రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు లభ్యమవడంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోతున్నారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్నా పెద్దా 50 దాకా వజ్రాలు లభ్యమవుతుంటాయి. దొరికేది ఇక్కడే.. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, గిరిజన తండాలు, పగిడిరాయి, బొల్లవానిపల్లి, ఉప్పర్లపల్లి, పి.కొత్తూరు, చెన్నంపల్లి, గిరిగెట్ల, తుగ్గలి, ఉసేనాపురం, రాంపల్లి, రామలింగాయపల్లితో పాటు మద్దికెర మండలంలో పెరవలి, బసినేపల్లి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఇదీ చరిత్ర.. రాయల కాలంలో ఇక్కడ రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలిచే వారని చెబుతారు. అశోకుడు జొన్నగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండలో పెద్ద బండరాళ్లపై శాసనాలను చెక్కించారు. ఏటా వజ్రాలు లభ్యం.. ప్రతి ఏటా తొలకరి వానలు కురవగానే ఈ ప్రాంతంలో వజ్రాన్వేషణ కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా నుంచి జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. కొందరు రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉంటూ వెతుకుతారు. పొలం పనులు చేసే సమయంలోనూ కూలీలు, రైతులకు వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె వర్ణం వంటి రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. రూ.2వేల నుంచి లక్షల విలువ చేసే వజ్రాలు ఏటా దాదాపు 20 నుంచి 50కి పైగా దొరుకుతుంటాయి. ఆధారాలు ఉండవని అధికారులు పట్టించుకోరు.. వజ్రం దొరికినట్లు ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికినట్లు తెలుస్తుందే తప్ప అమ్మకం తర్వాత దొరకలేదని, వజ్రం కాదన్నారని చెబుతుండడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికితే పోలీసులు, రెవెన్యూ అధికారులకు వ్యాపారుల నుంచి కమీషన్ అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గుట్టుగా విక్రయం.. దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారు. మరికొందరు ధర నచ్చక పోతే టెండరు పద్ధతిలో అమ్ముతారు. తుగ్గలి మండల జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. వీరు సీజన్లో వజ్రాల సమాచారం తెలుసుకునేందుకు కొందరిని నియమించుకొని వారిని అన్ని విధాలా చూసుకుంటారు. వజ్రాలను కొనుగోలు చేసిన వ్యాపారులు ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అమ్ముతారు. క్యారెట్ల రూపంలో లెక్కించి వజ్రాలను కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి వ్యాపారులు కుమ్మక్కై వజ్రాలను తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. దాని విలువ ఎవరికీ తెలియక పోవడంతో ఒక్కోసారి వజ్రం దొరికిన వారు మోస పోతుంటారు. చదవండి: ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! రహదారుల అభివృద్ధికి రూ.6,421 కోట్లు -
Kurnool: అదృష్టం అంటే ఈ రైతుదే... ఏకంగా రూ. 1.20 కోట్ల...
తుగ్గలి: అదృష్టం వజ్రం రూపంలో ఓ పేద రైతు ఇంటి తలుపుతట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలో గురువారం ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. అది వజ్రం అని తెలియడంతో వజ్రాల వ్యాపారులు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ పోటీలో 25 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.20 కోట్లకు రైతు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు. -
కరోనా వేవ్: అతిపెద్ద డైమండ్ కంపెనీ మూత
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండోదశలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద డైమండ్ కంపెనీ ‘భారత్ డైమండ్ బోర్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా ఈ నిర్ణయంతో వజ్రాల క్రయ, విక్రయాల్లో ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం అయిన భారత్ డైమండ్ బౌర్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశంలోని వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన ఈ కంపెనీలో సోమవారం రాత్రి 8 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంద్ కొనసాగనుంది. ముంబై బాంద్రాలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో భారత్ డైమండ్ బౌర్స్ ప్రధాన కేంద్రం ఉంది. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పరిమితుల నేపథ్యంలోతన కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పింది. కాగా ముంబైలో అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ఈ కేసుల 4,62,302గా ఉంది. -
‘వజ్రం’ దొరికిందని.. వేట మొదలెట్టేశారు!
కోహిమా: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగుతారని వింటుంటాం. అదే వజ్రమే దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా..? అదే జరిగితే ఒక్కరోజులోనే కోటీశ్వరులం అయిపోవచ్చని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అలాంటి ఆలోచనతోనే నాగాలాండ్ ప్రజలు ఇప్పుడో వేట మొదలు పెట్టారు. అదే వజ్రాల వేట... తాజాగా ఓ రైతుకు వజ్రాన్ని పోలిన రాయి దొరకడంతో, ఇప్పుడు కొండ ప్రాంతంలో అనేక మంది ప్రజలు చెట్టు చేమ అని చూడకుండా తవ్వడం మొదలు పెట్టారు. దొరికితే అదృష్టమే అన్నట్టుగా తవ్వుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఆ రాయి అసలు వజ్రమో కాదో కనుక్కునే పనిని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు అప్పజెప్పింది. (చదవండి: తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట) అబెంతంగ్ లోథా, లంగారికబా, కెనైలో రెగ్మా, డేవిడ్ లుఫోనియాలను త్వరగా రిపోర్ట్ అందించాలని నాగాలాండ్ జియాలజీ, మైనింగ్ డైరెక్టర్ మనేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం నుంచి వజ్రాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనందున ఆ రాయి అసలు వజ్రమని బృందం నమ్మడం లేదు. వీరు నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న అక్కడికి చేరుకొని పరిశోధనలు చేపట్టనున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను ఆపేయాలని, ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేవేయాలని బృందం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. -
నిమిషాల్లోనే వజ్రాల తయారీ!
సాక్షి, హైదరాబాద్: వజ్రాలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా..? కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపల విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగిన కర్బన పదార్థం కాస్తా ఘనీభవించినప్పుడు వజ్రమవుతుంది.. అంత పురాతనమైనవి, అతి తక్కువగా లభ్యమయ్యేవి కాబట్టే వాటికంత విలువ.. అయితే వీటిని నిమిషాల్లో తయారు చేస్తామంటున్నారు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. డైమండ్ అన్వెయిల్ సెల్ అనే ఓ పరికరం ద్వారా ఇది సాధ్యమేనని వారు చెబుతున్నారు. భూమి లోపలి ఒత్తిడి, ఉష్ణోగ్రతల పరిస్థితులను ఈ పరికరంలో కృత్రిమంగా సృష్టించవచ్చన్నారు. 640 ఆఫ్రికన్ ఏనుగులు ఒక మేజోడు కొనపై కాలు మోపితే ఎంత ఒత్తిడి ఏర్పడుతుందో అంత అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరం లోపల సృష్టించినప్పుడు దాంట్లో ఉన్న కర్బన అణువులు కాస్తా స్ఫటికాలు (వజ్రాలు) గా మారిపోయాయని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోడీ బ్రాడ్బై తెలిపారు. (చదవండి: పొలాల్లో ‘వజ్రాల పంట’) కేవలం ఒత్తిడిని సృష్టించడంతోనే వజ్రం తయారు కాలేదని, కర్బన అణువులపై షీర్ ఎఫెక్ట్ (మెలితిప్పడం, జారిపోవడం వంటివి) కూడా పడినప్పుడే స్ఫటికాలు ఏర్పడతాయని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలను ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు సాయంతో పరిశీలించామన్నారు. ఇవి సాధారణ వజ్రాలతోపాటు ఉల్కా శకలాల కారణంగా ఏర్పడ్డ వజ్రాల్లోని లక్షణాలు రెండూ కలిగి ఉన్నాయని బ్రాడ్బై వివరించారు. ఈ పరిశోధన వివరాలు స్మాల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఎక్స్పో.. నెక్ట్స్ షో..
-
పంట చేనులో కోటి విలువైన వజ్రం!
సాక్షి, కర్నూలు: జిల్లాలో విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలానికి చెందిన ఓ మహిళకు పొలంలో వేరుశెనగ తీస్తుండగా కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. అయితే వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశారు. 11 లక్షల రూపాయల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి సదురు వ్యాపారి వజ్రాన్ని కొన్నట్లు సమాచారం. కాగా.. ఈ వజ్రం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
అదృష్టం అంటే అతడిదే..
అర్కాన్సాస్ : సాధారణ బ్యాంకు మేనేజర్ నుంచి కోటీశ్వరుడిలా మారే అరుదైన అవకాశం అతని సొంతమైంది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రితంనాటి అరుదైన వజ్రం సొంతం కావడంతో అతగాడి ఆనందానికి అవధుల్లేవు. వివరాల ప్రకారం వివరాల ప్రకారం నైరుతి అర్కాన్సాస్లోని బ్యాంకు మేనేజర్ కెవిన్ కినార్డ్కి చిన్నప్పటి నుంచి స్టేట్ పార్కుకు వెళ్లడం అలవాటు. అలా ఎప్పటిలాగే క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్కి వెళ్లాడు. ఆరోజు కూడా సిఫ్టింగ్ చేస్తుండగా తళుక్కుమంటూ ఓ రాయి కనిపించింది. చూడటానికి క్రిస్టల్లా మెరుస్తుండటంతో చేతికున్న సంచిలో వేసుకున్నాడు. అలా దొరికిన రాయిని పరీక్షించి చూస్తే గానీ అసలు విషయం బయటపడలేదు. దాదాపు 48ఏళ్ల చరిత్రలో లభించిన రెండవ అరుదైన వజ్రం తన సొంతమైందని తెలిసి షాక్కి గురయ్యాడు. 9.07 క్యారెట్ల వజ్రం లభించడంతో ఒక్కసారిగా కెవిన్ కినార్డ్ పేరు మారుమ్రోగిపోయింది. -
పొలాల్లో ‘వజ్రాల పంట’
తుగ్గలి: వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. పంటలు కళకళలాడుతున్నాయి. వాటితో పాటే వజ్రాలు కూడా తళుక్కుమంటున్నాయి. అదృష్టం రూపంలోదరికి కాసుల పంట పండిస్తున్నాయి. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, చెన్నంపల్లి, బొల్లవానిపల్లి, పి.కొత్తూరు, గిరిజన తండాల్లోని ఎర్రనేలల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఏటా తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానికులతో పాటు వివిధ జిల్లాల నుంచి జనం పెద్దసంఖ్యలో వజ్రాన్వేషణకు వస్తుంటారు. ఇలా వచ్చిన వారికే కాకుండా పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలకు కూడా వజ్రాలు దొరుకుతున్నాయి. (అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే) ⇔ దీంతో పంట పొలాలకు వెళ్లినప్పుడు ఓ వైపు పని చేసుకుంటూనే..మరోవైపు వజ్రాలపై కూడా నిఘా ఉంచుతున్నారు. ⇔ ఈ ఏడాది ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 50కి పైగా వజ్రాలు లభ్యమయ్యాయి. ⇔ దొరుకుతున్న వజ్రాలను జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. ⇔ విక్రయదారులకు ధర నచ్చకపోతే టెండర్ పద్ధతిన తీసుకుంటారు. రంగు, జాతితో పాటు క్యారెట్ల రూపంలో లెక్కించి వ్యాపారులు వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. ⇔ రెండు రోజుల క్రితం జొన్నగిరిలో మహిళా కూలీకి దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.6 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.