East Godavari Disrtict
-
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
‘బాబు నన్ను మోసం చేశారు..’ ఏడ్చేసిన నల్లమిల్లి
సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన. టీడీపీ తరఫున అనపర్తి టికెట్ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
సంక్రాంతి సంబరాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకొని ఇద్దరు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పెందేలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆనందంగా జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పద్మారావు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో చోట అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్ అనే మరో వ్యక్తి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు -
గుమ్మళ్లదొడ్డిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చదవండి: (టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్) -
యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్గాట్, రీపీ బెనిఫిట్ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్ పర్సన్స్కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..) లక్ష్యాలు చేరుకునేందుకు విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. – సీహెచ్ ఉదయ్కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈఎండీపీ సద్వినియోగం చేసుకోవాలి నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా మంచి ఆలోచన విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్జెడ్లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
విజయ గీతిక.. ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్సీపీనే వరించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది. జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్గానే కొనసాగించారు. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ దివస్ అయిన గత ఏప్రిల్ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్ తృతీయ స్థానంలో నిలిచింది. డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాకారమైంది. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి, సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. అందరి సమన్వయంతో ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్ చేశాం. జిల్లాపరిషత్ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా -
నన్నయ వర్సిటీ విద్యార్థులకు టీసీఎస్లో ఇంటర్న్షిప్
రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్వేర్ టూల్స్పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్బుక్లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్లైన్లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ఆస్ట్రానమీలో అదరగొట్టింది
నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్లైన్లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది. -
బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ ఊహించలేదు: గ్రూప్–1 టాపర్ సుష్మిత
సాక్షి, హైదరాబాద్(చిక్కడపల్లి): బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదంటూ ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫస్ట్ ర్యాంకర్ రాణి సుష్మిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురానికి చెందిన ఆమె ఏపీ గ్రూప్స్ ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించారు. బుధవారం హైదరాబాద్ అశోక్ నగర్లోని ఏకేఎస్–ఐఏఎస్ అకాడమీలో సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పద్మప్రియ ఇంటి వద్దే ఉంటారు. హిందీ పండిట్ అయిన తన తాత పి.ఎల్.ఎన్.శర్మ ప్రోత్సాహంతో గ్రూప్స్ చదవి ర్యాంక్ సాధించానని సుష్మిత చెప్పారు. తన లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర ఆమోఘమైందని వెల్లడించారు. బాగా శ్రమిస్తేనే ర్యాంక్ సాధించడం సాధ్యమని గ్రూప్స్ రాసేవారికి సూచించారు. 10వ తరగతి వరకు పిఠాపురంలో చదువుకున్న సుష్మిత కాకినాడలో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. అదే హెల్త్కేర్లో డాక్టరేట్ పూర్తి చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ఈమె భర్త రవికాంత్ సివిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరికి సురవ్ కశ్యప్ అనే అబ్బాయి ఉన్నాడు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) ఏపీపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నాన్ లోకల్ కేడర్ కింద తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పవన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు యూపీఎస్సీ కోసం కష్టం పడ్డా. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు నాన్ లోకల్ కేడర్ కింద ఏపీలో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది’అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సీడీపీవోగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సింధూ ప్రియ కూడా నాన్ లోకల్ కేడర్ కింద డీఎస్పీగా ఎంపికయ్యారు. ఎంపికపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: (మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్గా..) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
నాకు దిక్కేది.. ఎలా బతకాలి
తూర్పు గోదావరి (రావులపాలెం) : నాన్న కోసం వెళ్లిన అమ్మ, అన్నయ్య, నాన్నమ్మ లేకుండా పోయారు. ఇక ఎలా బతకాలి.. నాకు దిక్కేది అంటూ ఆ కుటుంబంలో చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి పాలవ్యాన్, మోటారు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోస్టుమార్టం అనంతరం అప్పన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ మృతదేహాలను సమీప బంధువులు, స్థానికులు రెండు అంబులెన్సుల్లో ఇంటికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, బంధువులు చివరి చూపుకోసం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన దుర్గాప్రసాద్ నాన్నమ్మ సత్యవతి భర్త రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారందరికీ వివాహం అయ్యింది. సత్యవతి భర్త పోయిన నాటి నుంచి పెద్ద కుమారుడు పుల్లేశ్వరరావు, చిన్న కుమారుడు నాగేశ్వరరావుల వద్ద ఉంటుంది. అయితే చిన్న కుమారుడు నాగేశ్వరరావు కొబ్బరి లోడింగ్ కూలీ పని చేసుకుంటూ భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, దుర్గాప్రసాద్ను చదివిస్తున్నాడు. మహేష్ డిగ్రీ చదువుతుండగా దుర్గాప్రసాద్ ఇంటర్ పూర్తి చేశాడు. కొంతకాలంగా వేరే మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ కుటుబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం కొబ్బరి లోడింగ్ పనికి వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు నాగేశ్వరరావు కొత్తపేటలో ఉన్నట్టు తెలుసుకుని అతని తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, పెద్ద కుమారుడు మహేష్ అతని వద్దకు వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురయ్యారు. డిగ్రీ చదువుతున్న మహేష్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నామని సమీప బంధువులు అప్పన రామకృష్ణ, సత్యకిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తొలకరి సాగులో సరికొత్త ఒరవడి
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇవి సాగు చేయాలి ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి) ఇన్ని విత్తనాలు అవసరం ∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం ∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం ∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది. విత్తనశుద్ధి చేసుకోవాలి సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు. – సీహెచ్కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ -
‘రెండో అతిపెద్ద రిటైల్చైన్గా భారత్ మారింది’
రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తున్నారని, 2014 తర్వాత దేశంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక రాజమండ్రి నగరానికి రావడం సంతోషంగా ఉంది.చరిత్రలో రాజమండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చారు. మోదీ హయాంలోనే దేశంలో పేదరిక తగ్గింది. అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఆయుష్మాన్ భారత్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.భారత నుంచి 500 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రెండో అతిపెద్ద రిటైల్ చైన్గా భారత్ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు. భారత్ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది’ అని తెలిపారు. -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
-
ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు వాయిదా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257 మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486 కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077 -
తేనెలూరుతున్న ఉపాధి
రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ‘విశిష్ట’ బ్రాండ్ పేరుతో వ్యాపారం శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్ట్రాక్టర్) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు. 40 రోజులు పడుతుంది పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది. ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్ బీస్’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్ను కొనసాగిస్తున్నారు. దివాన్చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. రాయితీతో ప్రోత్సహిస్తున్నాం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్బీహెచ్ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి వివరాలను ‘మధుక్రాంతి’ యాప్లో అప్లోడ్ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా కృషి చేస్తున్నాం. – టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం -
విదేశీ విద్యకు వెళ్లే వేళ.. కడలి అలలకు బలి
తొండంగి: ఉజ్వల భవిష్యత్తు కోసం మరో నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్లాల్సిన ఆ యువకుడు కడలి కెరటాలకు బలైన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పైడికొండ పంచాయతీ ఆనూరుకు చెందిన త్రిపరాన కాసులు, నూకరత్నం దంపతులు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు సుబ్రహ్మణ్యం (26) విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. సముద్రంలో స్నానం చేద్దామని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామం నుంచి ఒక్కడే బైక్పై దగ్గరలోని వేమవరం పంపాదిపేట తీరానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎంతకూ రాకపోవడంతో బంధువులు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ అతడి సెల్ఫోన్, దుస్తులను గమనించారు. సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో గల్లంతయ్యాడని భావించి, మత్స్యకారుల సాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం అద్దరిపేట తీరానికి చేరింది. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్రెడ్డి తూర్పు సెంటిమెంట్గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సీఎం జగన్ అమలు చేశారని వివరించారు. మిధున్రెడ్డికి ఘన స్వాగతం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్సభలో పార్టీ ఫ్లోర్లీడర్ మిధున్రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్రెడ్డి, బోస్ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు. పథకాలపై ఫోకస్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్రెడ్డి, బోస్ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు. -
AP: సాగు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమయ్యే నాటికి గోదావరి డెల్టా రైతుల నీటి కష్టాలను కడతేర్చే దిశగా ముందస్తు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.43 కోట్లపై చిలుకు విలువైన 275 పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఏటా రబీ సీజన్ ముగియగానే కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా పంట కాలువలకు నీటిని నిలుపు చేస్తారు. తిరిగి ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాను ప్రారంభిస్తారు. కాలువలు మూసివేసి, తిరిగి తెరిచే లోగా వాటి పటిష్టత, పూడికతీత, ఔట్ఫాల్ స్లూయిజ్ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు చేపడుతుంటారు. వీటిని క్లోజర్ పనులని అంటారు. ఈ పనుల ద్వారా ఖరీఫ్ సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. గతంలో పంట కాలువలు మూసేసినప్పటికీ సకాలంలో ఆమోదించకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో క్లోజర్ పనులు పూర్తయ్యేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ అధికారులు క్లోజర్ పనులపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోనసీమ జిల్లాలో అత్యధికం ఈసారి మొత్తం క్లోజర్ పనుల్లో మూడు వంతులు పైగా కోనసీమ జిల్లాలోనే చేపట్టనున్నారు. అక్కడే ఆయకట్టు ఎక్కువగా ఉండటంతో అందుకు తగ్గట్టు పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటికీ కలిపి రూ.43,09,77,000 మంజూరు చేస్తే ఇందులో కోనసీమ జిల్లాకు అత్యధికంగా రూ.34,93,32,000 కోట్లు కేటాయించారు. మిగిలినది తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు కేటాయించారు. అమలాపురం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో బెండా కెనాల్, జనుపల్లి హెడ్ స్లూయీజ్కు నడిపూడి గ్రామ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. చెయ్యేరు చానల్ – గున్నేపల్లి బ్రాంచి కెనాల్స్, అల్లవరం చానల్, కౌశిక చానల్, అమలాపురం చానల్ నుంచి చిందాడగరువు చానల్, పి.గన్నవరం కెనాల్ నుంచి అమలాపురం కెనాల్ వరకు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పలు కాలువలను అభివృద్ధి చేయనున్నారు. కోనసీమలో అత్యధికంగా రాజోలు నియోజకవర్గంలో 52 పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు వేగవంతం చేస్తాం. – బి.రాంబాబు, ఎస్ఈ,ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రైతులకు లబ్ధి డెల్టా కాలువలకు నీటిని నిలిపివేసిన అనంతరం చేపట్టే ఓ అండ్ ఎం పనులతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికతీతతో పాటు గేట్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టడం ద్వారా శివారు ప్రాంతాలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు చేరుతుంది. ఈ పనులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. – జిన్నూరి వెంకటేశ్వరరావు,వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు గోదావరి -
సారా రహిత జిల్లాయే లక్ష్యంగా‘ఆపరేషన్ పరివర్తన 2.0
రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజారోగ్యానికి హానికరమైన సారాను నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో రెండు నెలల పాటు పోలీసు, ఎస్ఈబీ సిబ్బంది కలిసి ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్ను ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ చేపట్టారు. ‘ఆపరేషన్ పరివర్తన 2.0’లో ఇలా.. సెబ్, పోలీసు అధికారులు, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలు, అమ్మకాలు జరిపే ప్రదేశాల్లో దాడులు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు జరిపే గ్రామాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేసి, పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సారా తయారీ, అమ్మకాలు, సరఫరా చేసే వారిపై, సారా తయారీకి వాడే ముడిసరుకులు అమ్మిన వారి పైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. షరతులతో కూడిన బెయిల్ను ధిక్కరిస్తే ఆ బెయిల్ రద్దు కోరుతూ కోర్టు ఎదుట మెమో ఫైల్ చేశారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద రూ.2 లక్షల వరకూ నిందితుల బైండోవర్ చేస్తున్నారు. గత వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 698 నిందితులను బైండోవర్ చేశారు. బైండోవర్ బాండు అతిక్రమించిన వారి నుంచి సంబంధిత బాండు మొత్తాన్ని జరిమానాగా వసూలు చేశారు. బెల్లం వ్యాపారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సారా తయారీదార్లకు అమ్మకాలు జరపకూడదని హెచ్చరించారు. సారా అమ్మకాలు, తయారు చేసే 30 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచేలా చర్యలు చేపట్టారు. కేసుల విచారణలో పురోగతి, లోపాల సవరణ కోసం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ), స్టేషన్ అధికారులకు, కోర్టు కానిస్టేబుల్లతో కలిపి ఎస్పీచే స్పెషల్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసుల భాగస్వామ్యం ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ రమాదేవి జిల్లాలోని 300 మంది మహిళా పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సారా తయారీ, అమ్మకాలు లేకుండా చేసేందుకు ఎప్పటికప్పుడు పోలీసులకు, ఎస్ఈబీ అధికారులకు సమాచారం అందించి సారా రహిత గ్రామాలుగా మార్చడంలో భాగస్వాములను చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా జీవనోపాధి చూపిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో, సారా అమ్మకాన్ని జీవనోపాధిగా తీసుకున్న కుటుంబాలను గుర్తిస్తున్నారు. సారాకు బానిసైన వారిని డీ–అడిక్షన్ సెంటర్లలో చేర్చి, సారా మానేసేలా చేయాలని ఎస్ఈబీ జేడీ రమాదేవి ఆదేశించారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూము ఫోన్ నంబర్ 94932 06171కు 24 గంటలూ సారాపై ఫిర్యాదులు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఇలా అనేక విధాలుగా సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్ ప్రభావం ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 200 కేసులు నమోదు చేసి 149 మందిని అరెస్టు చేశారు. 3,639.5 లీటర్ల సారా, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 80,300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 575 మందిని బైండోవర్ చేశారు. బ్రీచ్ అయిన వారి నుంచి రూ.1.25 లక్షలు వసూలు చేశారు. సారా రహిత గ్రామాలుగా.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు సారా తయారీకి మారుపేరైన కవలగొయ్యి, పిడింగొయ్యి, రఘునాథపురం గ్రామాల్లో సారా తయారీ, అమ్మకం 80 శాతం వరకు మాని వేరే పనుల్లోకి వెళుతున్నారు. వెంకటనగరం గ్రామం మీద ప్రత్యేకించి దృష్టి సారించి గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో సారాను పారదోలేందుకు వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సారా అమ్మకాలపై కఠిన చర్యలు జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు, సారా తయారీకి అవసరమైన ముడి సరకులు (బెల్లం తదితర పదార్థాలు) అమ్మినా, పెట్టుబడి పెట్టినా, ఆర్థిక సహకారం అందించినా ఏ ఒక్కరినీ ఉపేక్షించం. అందరి మీదా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసుల్లో పలుమార్లు అరెస్టు అయిన ముద్దాయిలపై పీడీ చట్టం ప్రయోగిస్తాం. సారా రహిత గ్రామాల కోసం ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈ బృహత్తర లక్ష్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వాములు కావాలి. – ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా -
ఆ ఊరిలో.. ట్యాక్స్ ఫ్రీ
ద్వారకాతిరుమల: ఆ ఊళ్లో కుళాయి పన్ను, ఇంటి పన్ను ఎవరూ కట్టక్కర్లేదు. ఆ గ్రామ పంచాయతీ చెరువులోని చేపలు కూడా గ్రామస్తులకు ఉచితమే. ఇప్పటికే ఓ ఏడాది పాటు అందివచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామం ఏడాది క్రితం నూతన పంచాయతీగా ఏర్పడింది. సుమారు 2 వేల జనాభా, 1,418 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారు. ఫలించకపోవడంతో చివరకు పోటీ అనివార్యమైంది. దీంతో శ్రీమంతుడిగా పేరున్న వైఎస్సార్ సీపీ నేత బొండాడ వెంకన్నబాబు తన తండ్రి నాగభూషణాన్ని పోటీకి దింపారు. ఆయనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు పంచాయతీకి కుళాయి, ఇంటి పన్నులు ఎవరూ చెల్లించక్కర్లేదని హామీ ఇచ్చారు. దాంతో పాటు ప్రస్తుత బకాయిలను కూడా తానే చెల్లిస్తానన్నారు. చేపల పెంపకానికి వినియోగిస్తున్న మందులు, వ్యర్థాల కారణంగా గ్రామంలోని పంచాయతీ చెరువు దుర్వాసన వెదజల్లుతోందని.. తన తండ్రి సర్పంచ్ అయిన తరువాత చెరువులో ఎటువంటి మందులు, వ్యర్థాలు వేయకుండా చేపలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో గొల్లగూడెంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గెలిచిన వెంటనే.. త్రిముఖ పోటీలో బొండాడ నాగభూషణం ప్రత్యర్థులపై 435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఏడాది పన్నులతో పాటు, అప్పటి వరకూ ఉన్న పన్ను బకాయిల మొత్తం రూ.9.50 లక్షలు పంచాయతీకి చెల్లించారు. గ్రామంలోని చెరువును రూ.1.50 లక్షలకు బహిరంగ వేలం ద్వారా మూడేళ్ల కాల పరిమితికి దక్కించుకుని, అందులో సహజసిద్ధంగా చేపల పెంపకం చేపట్టారు. ఆ చేపలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో.. అప్పటి వరకూ ఈ ట్యాక్స్ ఫ్రీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాదికి సంబంధించిన కుళాయి, ఇంటి పన్నుల సొమ్ము రూ.5.11 లక్షలను కొద్ది రోజుల క్రితమే పంచాయతీకి చెల్లించారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. రాష్ట్రంలోనే తొలి ట్యాక్స్ ఫ్రీ గ్రామంగా గొల్లగూడెం నిలుస్తోంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం ఆదర్శం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పంచాయతీ ట్యాక్స్లు ప్రజల తరఫున మేమే చెల్లిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహాయ సహకారాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. – బొండాడ వెంకన్నబాబు, సర్పంచ్ కుమారుడు నూరు శాతం పన్ను వసూలైంది గ్రామంలోని ప్రతి ఒక్కరి కుళా యి, ఇంటి పన్నులను సర్పంచ్ నాగభూషణం, ఆయన కుమారుడు వెంకన్నబాబు చెల్లిస్తున్నా రు. దీనివల్ల మా పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలవుతున్నాయి. ప న్ను వసూలు కోసం ఇంటింటిటీ తిరిగే బాధ తప్పింది. – జక్కంపూడి రాజేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గంధం బాధ తప్పింది గతంలో పంచాయతీ చెరువులో చేపల పెంపకం కోసం మందులు, వ్యర్థాలను వాడేవారు. దాంతో చెరువు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. అటుగా నడవలేకపోయేవాళ్లం. వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం దయవల్ల చెరువు బాగుపడింది. – ఎర్ర దుర్గ, గ్రామస్తురాలు పన్నుల భారం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం గ్రామంలోని సుమారు 700 గృహాలకు కుళాయి, ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు పన్నుల భారం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. – కొడవలూరి పద్మావతి, గ్రామస్తురాలు -
‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు
రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి శుక్రవారానికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల వాంఛ మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట దీనిని ఏర్పాటు చేసేందుకు ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి. ఎట్టకేలకు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని 22–6–2016న వెలసిన ఈ యూనివర్సిటీ స్వశక్తితో అచిరకాలంలోనే అభివృద్ధిని సాధిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటోంది. కరోనా ప్రభావాన్ని అధిగమిస్తూ ... రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ ప్రభావం సమాజాన్ని ఏవిధంగా ప్రభావితం చేసినా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ దానిని కూడా ఒక అవకాశంగా మార్చుకోగలిగింది. 2020 మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతవేయవలసి రావడంతో విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ తరుణంలో విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు ఆదేశాలను అనుసరించి ఆన్లైన్ క్లాసులతోపాటు వివిధ అంశాలపై నిష్టాతులతో వెబినార్లు నిర్వహించారు. ఈ వెబినార్ల నిర్వహణలో దేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రీతిలో వంద మార్కును దాటేయడంతో ఒకేసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులోను చోటు దక్కించుకోగలిగింది. జనావళికి కరోనా వైరస్ నుంచి ఎదురవుతున్న భయాందోళనను తొలగిస్తూ, ఆత్మస్థైర్యాన్ని అందించే విధంగా సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను కూడా ‘నన్నయ’ వర్సిటీ సైకాలజీ విభాగం అధ్యాపకులు అందించారు. 11 వేల పుస్తకాలతో ‘నన్నయ’ విజ్ఞాన భారతి క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో దాతలు అందించిన 11 వేల పుస్తకాలతో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ‘నన్నయ’ భారతిని ప్రారంభించారు. జె.స్టోర్, జె.గేట్ సేవలను కొనుగోలు చేసి విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సైన్స్ జర్నల్ని కూడా ‘నన్నయ’ విజ్ఞాన భారతిలో అందుబాటులోకి తెచ్చారు. ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం. ఇందుకు అవసరమైన కసరత్తు వేగంగా జరుగుతోంది. ఎస్ఎస్ఆర్ కూడా సమర్పించాం. కరోనా వైరస్ ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే ఐఎస్ఓ, ఏఐసీటీఈ గుర్తింపులు సాధించాం. ‘ఇంటర్నేషనల్ స్టూడెంట్ పోర్టల్ ద్వారా అంతర్జాతీయంగా విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. – ఆచార్య ఎం.జగన్నాథరావు, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ -
నాన్నను తీసుకొస్తానని వెళ్లి...
తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): కారులో భీమవరం వెళ్తున్న నాన్నను వెనక్కి తీసుకువస్తానని బైక్పై వెళ్లిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కోరంగి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన చింతలపూడి చంద్రశేఖర్ అక్కడి ఆంధ్రా పాలిటెక్నిక్ వద్ద పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు మల్లికార్జున్ అలియాస్ అర్జున్ (21) అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో బీడీఎస్ (దంత వైద్యులు) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖ ర్ పని మీద ఆదివారం వేకువన కారులో భీమవరం బయలుదేరారు. ఒంటరిగా వెళ్లవద్దని, అమ్మను కూడా వెంట తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ ఒక్కరే వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆపేందుకు అర్జున్ ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ తీయకపోవడంతో ఆయన కారును ఆపాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్పై కాకినాడ నుంచి బయలుదేరాడు. జాతీయ రహదారి 216లో కోరంగి పంచాయతీ సీతారామపురం పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి అతడి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ను రోడ్ సేఫ్టీ పోలీస్ కానిస్టేబుల్ స్థానిక సీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అర్జున్ మృతి చెందాడు. విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకూ తమకు లేకుండా పోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. రోజూ తన పాదాలకు నమస్కరించాకే కళాశాలకు బయలుదేరేవాడని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ‘నన్నయినా నీతో తీసుకువెళ్లు.. లేదా అమ్మనైనా తీసుకువెళ్లు’ అని చెప్పిన కొడుకుతో ‘ఈ రోజు ఆదివారం కదా! అమ్మతో పాటు ఇంటి వద్ద ఉండు. నేను భీమవరం వెళ్లి వస్తాను’ అని చెప్పి చంద్రశేఖర్ బయలుదేరారు. అమలాపురం చేరేసరికి కొడుకు ప్రమాదానికి గురయ్యాడనే సమాచారం తెలియడంతో తల్లడిల్లిపోయారు. బీడీఎస్ ఫస్టియర్ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణుడైన అర్జున్ తమందరిలో చురుకుగా ఉండేవాడని, అతడి హఠాన్మరణం తమను కలచివేసిందని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!
అడవిని వదిలి ఒకరింట్లో ఆదరణ పొందుతున్న జింక తిరిగి వెళ్లనంటోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి అటవీ ప్రాంతానికి చేరువలోని లక్కవరప్పాడులో రెండేళ్ల క్రితం రెండు నెలల వయసున్న చుక్కల జింక దారి తప్పి వచ్చేసింది. గూనా చిన్నోడు–దేవి దంపతులు చూసి దీనిని తమ బిడ్డలా పెంచుతున్నారు. గూనా చిన్నోడు, దేవి దంపతుల ఇంటికి వచ్చిన జింక పిల్ల ఇదే (ఫైల్).. ఆ జింక ఆ కుటుంబంతోనే కాదు ఊరంతా కలియతిరుగుతూ అందరికీ చేరువైంది. ఇటీవల అటవీ అధికారులు ఈ వన్య ప్రాణిని గమనించారు. చిన్నోడు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి దానిని సమీప అడవుల్లో వదిలి వచ్చారు. అయితే ఆ జింక మర్నాడే తిరిగి వచ్చేసింది. దీంతో చిన్నోడు దంపతులు దానిని ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. –రాజవొమ్మంగి -
ఇది మీకు తెలుసా?.. పాండవులు బంగారాన్ని ఇక్కడే దాచారట!
అల్లవరం(తూర్పుగోదావరి జిల్లా): శతాబ్దాలుగా చరిత్రకు అందని అనేక విషయాలు కాలగమనంలో కలిసిపోతున్నాయి. కొత్త నీరు రాకతో పాతనీరు పోతుందనే మాదిరిగా పురాణ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ఆలయాలు, రాజులు పాలించిన నగరాలు సైతం చరిత్ర పుటల్లోకెక్కని విశేషాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే. అలాంటివి అల్లవరం మండలంలో ఓడలరేవు, దేవగుప్తం గ్రామాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట విశేష ఆదరణ పొంది నేడు ఆయా ఊర్ల పేర్లతో పిలువబడుతున్నాయి. ఆంగ్లేయులు వర్తకం పేరుతో భారతదేశ సంపదను తమ దేశానికి తరలించుకు పోవడానికి వారికి అనువైన ప్రాంతాలను ఎంచుకుని ఇక్కడ దొరికే ముడి సరుకును ఎగుమతి చేసుకునేందుకు అల్లవరం మండలం ఓడలరేవులో ఓడరేవుని ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ తెలియదు. దేవగుప్తంలో అప్పట్లో రాజుల కోట ఉన్న ప్రాంతం ఇలా.. ఆంగ్లేయులు వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఓడరేవు నేడు ఓడలరేవుగా రూపాంతరం చెందింది. ఇక్కడ తెర చాప ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహించే వారని ప్రసిద్ధి. అల్లవరం మండల పరిసర ప్రాంతాల్లో లభించే డొక్క తాడు, ధాన్యం, ఆముదాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరినార వంటి ఉత్పత్తులు రంగూన్, ఇండోనేషియా, అండమాన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. చిరు ధాన్యాలు, ఉక్కు, టేకు కలప, నూనెలు ఇక్కడ ప్రజల అవసరాలకు దిగుమతి చేసుకునేవారు. అలా ఓడల వ్యాపారంగా ప్రసిద్ధి చెందిన ఓడరేవు నేడు ఓడలరేవుగా పిలువబడుతోంది. ఇది మీకు తెలుసా? మండలంలో చరిత్రకెక్కని మరో గ్రామం దేవగుప్తం. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం గుప్తుల కాలానికి చెందిన దేవగుప్తుడు అనే రాజు ఇక్కడ నుంచి పాలన సాగించారని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని కోటమెరకగా ఇప్పటికీ పిలుస్తుంటారు. ఇక్కడ చాలా మందికి ఇళ్ల నిర్మాణ సమయాల్లో లంకె బిందెలు దొరికినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి వద్ద ఉన్న బంగారాన్ని ఈ గ్రామంలో ఓ చోట దాచిపెట్టారని, అందుకే దేవగుప్తంగా పిలుస్తున్నారని నమ్మకం. -
దుప్పలపూడి కేంద్రంగా కల్తీ టీ పొడి దందా
-
సీఎం జగన్ పాలన అద్భుతంగా ఉంది: సినీ నటుడు అలీ
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అద్భుతంగా ఉందని సినీ నటుడు అలీ అన్నారు. కేఎల్యూ డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్ జగన్ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. చదవండి: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్లో సమస్యగా మారిన ఆన్లైన్ టికెట్ల విధానం, బెనిఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, హామీ కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందన్నారు. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. -
తూర్పుగోదావరి: ఆడుకోడానికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం
సాక్షి, తూర్పుగోదావరి: కడియం మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధఙలోని బుర్రిలంకలో మైనర్ బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక నర్సరీలో పనిచేసేందుకు విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం, వీరనారాయణపురానికి చెందిన భార్యభర్తలు, తమ ఇద్దరు కుమార్తెలతో వచ్చారు. వీరు ఉండే ఇంటికి సమీపంలోనే నివాసం ఉండే మారాజు కన్నంనాయుడు వీరి అయిదేళ్ల కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకునేందుకు వెళ్లిన కుమార్తె ఇంతకీ రాకపోవడంతో ఆమెను వెతుక్కుఉంటూ వెళ్లిన తల్లి కన్నంనాయుడు ఇంట్లో గుర్తించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు గమనించిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడియం ఎస్సై షేక్ అమీనా బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ డీఎస్పీ కె. తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి తల్లిదందడ్రుతో మాట్లాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి -
జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ
సాక్షి, అమలాపురం టౌన్: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సమావేశం జరుగుతున్న సమయంలో సమనస, ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్రమై, సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి చేరింది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) కేకలు, అరుపులతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. రాజబాబుకు, నియోజకవర్గంలోని కొంత మంది మధ్య ఇటీవల దూరం పెరిగింది. పార్టీ రెండు వర్గాలుగా మారింది. మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు యాళ్ల నాగ సతీష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు కొన్ని నెలల కిందటే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికను రాజబాబు అడ్డుకుంటున్నారని సతీష్తో పాటు పార్టీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల అమలాపురం రావడంతో పార్టీ ఇన్చార్జి రాజబాబు ప్రమేయం లేకుండానే మరో వర్గంగా ఉంటున్న పార్టీ నాయకులతో కలిసి సతీష్ జనసేనలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అప్పటికే నియోజకవర్గ పార్టీలో నాయకులు రెండుగా చీలిపోవడంతో ఇన్నాళ్లూ చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం చర్చనీయాంశమైంది. -
‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్ప్రెడ్నిసోలాన్ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. వారి సాచ్యురేషన్ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్మెక్ట్ర్న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు. తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ డిసీజెస్’లో సమర్పించినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్ గ్రూప్ స్కోపస్ ఇండెక్స్ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. -
అక్కడ సినిమా తీస్తే.. బంపర్ హిట్టే..
వేకువనే నిదుర లేపుతున్న పక్షుల కిలకిల రావాలు.. మంచుపరదాల ముసుగుల్లో మసక కాంతులు.. తల్లి పాల కోసం లేగ దూడల అరుపులు.. పచ్చని పంట పొలాలు.. కొబ్బరి తోటలు.. కార్మికుల శ్రమ జీవన సౌందర్యం.. బంధాలను పెనవేసుకున్న మండువా లోగిళ్లు.. హృదయాన్ని హత్తుకుని ఊయలలూపే ఇటువంటి సౌందర్యాన్ని చూడాలంటే పల్లెల్లోకి.. అందునా కోనసీమ పల్లెల్లోకి అడుగు పెట్టాల్సిందే. ఎంతటి వారైనా అక్కడ అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మరచిపోవాల్సిందే.. ఆ పల్లె వాతావరణానికి మంత్రముగ్ధులవ్వాల్సిందే. అల్లవరం మండలంలోని కోడూరుపాడు, గూడాల అటువంటి పల్లెలే. గూడాలలో పోలిశెట్టి భాస్కరరావు మండువా లోగిలి ముందు శతమానంభవతి చిత్రం తారాగణం సాక్షి, అల్లవరం (తూర్పుగోదావరి): కోడూరుపాడు, గూడాల గ్రామాలకు.. తెలుగు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. 1962 నుంచి అనేక సినిమాలు ఈ రెండు గ్రామాల నుంచి తెరకెక్కాయి. ఇక్కడ తీసిన సినిమాలు బంపర్ హిట్టు అవుతాయనే సెంటిమెంట్ బలంగా ఉంది. కోడూరుపాడు, గూడాల గ్రామాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరించాలని నిర్మాతలు, హీరోలు కోరుకుంటారు. ఎన్టీఆర్, శోభన్బాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శర్వానంద్, ప్రకాష్రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, నాని, విజయశాంతి, జయసుధ, జీవిత, హేమ వంటి హేమాహేమీలు ఇక్కడ తీసిన అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్నే కాకుండా బాలీవుడ్ హీరోలను కూడా ఈ రెండు గ్రామాలు ఆకర్షించాయి. జీవనజ్యోతి, భానుమతి గారి మొగుడు, శివయ్య, శతమానంభవతి, అష్టాచమ్మా, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో అనేక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ఖాన్ తీస్తున్న లాల్సింగ్ చద్దా సినిమాలోని పలు సన్నివేశాలను ఇటీవల కోడూరుపాడులో చిత్రీకరించారు. దీంతో ఈ గ్రామాల ఖ్యాతి మరింత పెరిగింది. లాల్సింగ్ చద్దా చిత్రం షూటింగ్ కోసం కోడూరుపాడులో సందడి చేసిన బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ఖాన్ గూడాలలో ఎకరం విస్తీర్ణంలో వందేళ్ల క్రితం నిర్మించిన పోలిశెట్టి భాస్కరరావుకు చెందిన మండువా లోగిలిలో 2009లో తొలిసారిగా అష్టాచమ్మా సినిమా తీశారు. ఈ సినిమా నుంచే తెలుగు సినిమా రంగానికి నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా పరిచయమయ్యారు. బాలీవుడ్ నిర్మాత నితిన్ తివారీ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ యాడ్ ఇక్కడే తీశారు. నాలుగు స్తంభాలాట సీరియల్ ఇక్కడే చిత్రీకరించారు. శర్వానంద్ హీరోగా ఇక్కడి మండువా లోగిళ్లలో పల్లె వాతావరణంలో తీసిన శతమానం భవతి చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. నితిన్ హీరోగా కోడూరుపాడులో తీసిన శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా సక్సెస్ సాధించింది. ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్కృష్ణ, వేగేశ్న సతీష్తో పాటు దిల్రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ గ్రామాల్లో సినిమా తీయడం సెంటిమెంట్గా భావిస్తున్నారని పోలిశెట్టి భాస్కరరావు తెలిపారు. అష్టాచమ్మా సినిమా : కోడూరుపాడులోని పెంకుటిశాల వద్ద హీరో నాని -
ఆ అవకాశాం వస్తే ఎందుకు చేయను?: నందితా శ్వేత
సాక్షి, మలికిపురం: గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందని సినీ నటి నందితా శ్వేత అన్నారు. విజయానంద్ పిక్చర్స్ బ్యానర్పై జి.వెంకట సత్యప్రసాద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రారా.. నా పెనిమిటి’ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె ప్రస్తుతం రాజోలు దీవిలో ఉన్నారు. గోదావరి లంకల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మలికిపురంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ► ‘రారా.. నా పెనిమిటి’ సినిమా మీకు ఎన్నో చిత్రం? నందితా శ్వేత: గతంలో నితిన్తో శ్రీనివాస కళ్యాణం, ‘అక్షర’తో పాటు నిఖిల్తో ఒక సినిమా చేశారు. ఇది నాలుగో సినిమా. ► తెలుగు సినీ పరిశ్రమలో మీకు లభిస్తున్న ఆదరణ ఏవిధంగా ఉంది? నందితా శ్వేత: నా చిత్రాలతో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనంతో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తారు. ► పెద్ద హీరోలతో అవకాశాలు రావట్లేదా? నందితా శ్వేత: ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు వస్తే ఎందుకు చేయను? ► ఇంతకు ముందు ఎప్పుడైనా కోస్తా తీరానికి వచ్చారా? నందితా శ్వేత: లేదు. ఈ చిత్రం కోసమే వచ్చాను. ► ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? నందితా శ్వేత: చాలా బాగుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాం. చక్కటి వాతావరణం. గోదావరి నదీ పాయలు, కొబ్బరి తోటలు, పంట పొలాలూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ప్రజల మర్యాద, వద్దన్నా వినకుండా మరీమరీ అడిగి వడ్డించి, తినిపించే ఆత్మీయత, వారి పలకరింపులు చాలా బాగున్నాయి. కోనసీమ వంటకాలు కూడా చాలా బాగున్నాయ్. ఉల్లిపాయలు, కోడిగుడ్డుతో చేసే ఆమ్లెట్ మరీ రుచిగా ఉంది. -
చలానా కుంభకోణంలో ఒక్కరే సూత్రధారి?
సాక్షి, తూర్పుగోదావరి: అన్నీ తానయ్యాడు.. అందరినీ నమ్మించాడు.. అవకాశం చూశాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. నకిలీ చలానా కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చలానాల అవకతవకల కేసులో సూత్రధారి ఒక్కడేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చలానా కుంభకోణం బయట పడిన తరువాత జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆలమూరులో చలానా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 20 వరకూ 2,388 రిజిస్టేషన్లు జరగ్గా, వీటిలో 39 బోగస్గా నిర్ధారించి రూ.7,31,510 దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ లావాదేవీలన్నీ ఓ అనధికార ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. కుంభకోణానికి అసలు సూత్రధారి అని భావిస్తున్న ప్రైవేటు ఉద్యోగి నుంచే దుర్వినియోగమైన సొమ్మును సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది రికవరీ చేసినా, అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బోగస్ చలానా కుంభకోణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ ఉద్యోగి సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయట పడిన వెంటనే అతడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు అందరిదీ ఆ మాటే.. చలానా కుంభకోణంపై ఎట్టకేలకు ఫిర్యాదు అందడంతో ఆలమూరు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్, ఎస్సై ఎస్.శివప్రసాద్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్టార్ ఎ.సునందశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోగస్ చలానా దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేసేందుకు వచ్చిన సీఐ శివగణేష్కు దస్తావేజు లేఖర్లంతా ఆ అనధికార ఉద్యోగి పైనే ఫిర్యాదు చేశారు. బోగస్గా తేల్చిన చలానాలన్నీ రెండు బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని, వాటిల్లో పొందుపరచిన ఫోన్ నంబర్లు కూడా అతడివేనని చెప్పారు. దుర్వినియోగమైన సొమ్ము కూడా అతడి ఖాతా నుంచే రికవరీ అయ్యిందని తెలిపారు. బోగస్గా గుర్తించిన 39 చలానాల్లో అత్యధికంగా డి.దుర్గాప్రసాద్ 30, వై.శ్రీరామచంద్రమూర్తి 6, పి.భగవాన్, టి.జి.కృష్ణకు చెందిన ఒక్కొక్కటి ఉన్నాయి. పినపళ్లకు చెందిన కె.వెంకటరమణకు చెందిన బ్యాంకు డాక్యుమెంటూ బోగస్ చలానాలో ఉంది. కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ చెప్పారు. చదవండి: ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ అన్నీ అతనై.. కంప్యూటర్ వర్క్లో నిష్ణాతుడు కావడంతో అత్తిలి నవీన్కుమార్ అనే వ్యక్తిని ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అనధికారికంగా రోజువారీ వేతనంపై నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగంగా చేస్తాడనే కారణంగా కొంతమంది దస్తావేజు లేఖర్లు కూడా బ్యాంకుకు వెళ్లే పని లేకుండా నేరుగా అతడికే సొమ్ము చెల్లించి, అతడి బ్యాంకు ఖాతా ద్వారానే చలానాలు తీసుకునేవారు. ఇదే అదనుగా అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీఎఫ్ఎంఎస్ విధానంలో పీడీఎఫ్లో ఉన్న చలానాను మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి మార్చి రూ.లక్షల అక్రమాలకు పాల్పడ్డాడని సమాచారం. సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులకు నమ్మకంగా ఉంటూ ఓ ఉద్యోగి లాగిన్ నుంచే బోగస్ చలానాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, కొంతమంది దస్తావేజు లేఖర్ల స్వార్థంతో 39 చలనాల్లో అక్రమాలకు ఇతడు కారణమయ్యాడు. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయిలా.. ► ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 20 వరకూ రిజిస్ట్రేషన్లు: 2,388 ► వీటిలో బోగస్ చలానాలు : 39 ► రికవరీ చేసినది : రూ.7,31,510 -
ఒలింపిక్స్లో కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్
అమలాపురం: ఒక తండ్రి 30 ఏళ్ల కల నిజం అయ్యింది. ఒక తల్లి చేసిన పూజలు.. వ్రతాలు ఫలించాయి. ఒక యువకుడి జీవిత లక్ష్యం నెరవేరింది. ప్రతి క్రీడాకారుడు కలలుకనేది ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్, అతని తల్లిదండ్రుల కల కూడా అదే. ఒలిపింక్ క్రీడావేదికపై సాత్విక్ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే. ఆ కల శనివారం నెరవేరనుంది. విశ్వక్రీడల్లో క్రీడా యుద్ధానికి సాత్విక్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్లో తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నాడు. సాత్విక్, చిరాగ్ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సాత్విక్ తన గురువు పుల్లెల గోపీచంద్ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనాలనే కల నెరవేరింది. మనదేశం తరఫున ఆడుతున్నానే ఫీలింగ్ ఉత్సాహాన్ని నింపిందని టోక్యో వెళుతూ సాత్విక్ ‘సాక్షి’తో అన్నాడు. ట్రాక్ రికార్డు ► 2018 ఆస్ట్రేలియా కామన్వెల్త్ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ టీమ్ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్ మెడల్ ► డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి సిల్వర్ మెడల్ ► 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయిలాండ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణపతకాలు ► 2018 సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్ ► డబుల్స్లో చిరాగ్ శెట్టితో 2016లో మౌరిటీస్ ఇంటర్ నేషనల్, ఇండియన్ ఇంటర్నేషనల్ సిరీస్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజయం చాలా సంతోషంగా ఉంది నేను షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడ్ని. అందుకే నా ఇద్దరు కుమారులను ఆ క్రీడలో ప్రోత్సహించాను. ఒక్కరైనా దేశం తరఫున ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. అది నెరవేరబోతోంది. ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాయామోపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులకు ఒలింపిక్స్ గురించి గర్వంగా చెప్పేవాడిని. ఇప్పుడు నా కొడుకు ఆ క్రీడల్లో పాల్గొనడం.. చెప్పేందుకు మాటలు రావడం లేదు. – ఆర్.కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి, అమలాపురం -
రైతు భరోసా యాత్రలకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. వీటిని వివరిస్తూనే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశు సంవర్ధక శాఖల సమన్వయంతో ఈ నెల 23 వరకు యాత్రలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10,544 ఆర్బీకేల్లో ఈ యాత్రలకు శ్రీకారం చుట్టారు. వీటిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులతో మమేకమయ్యారు. రైతుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సీహెచ్సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన యాత్రల్లో తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని వినిపించారు. యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే వారి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్ సాగు సన్నద్ధత, మార్కెటింగ్కు అనువైన రకాల సాగు, యాజమాన్య పద్ధతులు, ఇతర మెళకువలపై శాస్త్రవేత్తలు వివరించారు. రైతులతో ముఖాముఖిలో వారడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సాగు పద్ధతులపై నమూనా ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేశారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్న యంత్ర పరికరాలు, వాటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి.. సాగులో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సీఎం యాప్, ఈ–క్రాపింగ్ బుకింగ్ ఆవశ్యకతపై వివరిస్తాం. శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు రైతులతో భేటీ అవుతూ క్షేత్ర స్థాయిలో వారెదుర్కొనే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
విషాదం: పెళ్లైన వారానికే నవ వధువు ఆత్మహత్య
మధురపూడి(తూర్పుగోదావరి): ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన కోరుకొండ మండలం గాదరాడలో సోమవారం సంచలనం రేపింది. ఈ నెల 29న సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన అశ్విని స్వాతి(19)కి గాదరాడకు చెందిన కనుమరెడ్డి అశోక్తో వివాహం జరిగింది. అత్తవారు కొత్తగా కట్టుకున్న ఇంటిలో రెండు రోజుల క్రితం గృహ ప్రవేశం కూడా చేసింది. ఇంతలో ఏమైందో ఏమో ఆ కొత్త ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిసరాలను పరిశీలించారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడేళ్ల క్రితమే ఈ వివాహం చేసేందుకు పెద్దలు అంగీకారం కుదుర్చుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే అశోక్ 5వ తరగతి వరకే చదువుకోగా, 7వ తరగతి వరకు చదివిన స్వాతి మైనార్టీ తీరే వరకు ఆగారు. ఈ పెళ్లి ఇష్టం లేక స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. -
బంజారాహిల్స్: ప్రియుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
బంజారాహిల్స్: మైనార్టీ తీరకున్నా పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి బెదిరింపులను భరించలేక మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) 5వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అనే యువకుడితో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామంటూ దుర్గాభవానీ తండ్రి శ్యామ్సన్ వద్దకు వెళ్లి అడగగా మందలించాడు. మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించాడు. దీంతో ఐదు రోజుల క్రితం దుర్గాభవానీ ఇంట్లోంచి చెప్పకుండా వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్.2లోని ఇందిరానగర్లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి శ్యామ్సన్కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో శనివారం ఉదయం శ్యామ్సన్ నగరానికి వచ్చాడు. కూతురు దుర్గాభవానీతో మాట్లాడి నచ్చ జెప్పాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కల్యాణ్ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగడంతో పాటు పెళ్లికి అంగీకరించకపోతే శ్యామ్సన్ను, దుర్గాభవానీని చంపేస్తానంటూ బెధిరించి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై రోజంతా కుటుంబ సభ్యులు చర్చించారు. సాయంత్రం పనిమీద శ్యామ్సన్తో పాటు మిగిలిన వారు బయటికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. ఆలోగా ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి చావుకు కల్యాణ్ బెదిరింపులే కారణమంటూ ఆదివారం మృతురాలి తండ్రి శ్యామ్సన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలిసి.. -
పకోడి బండి వద్ద వివాదం.. టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలోని వీరవరంలో దారుణం చోటుచేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. చదవండి: రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం -
సీఎం జగన్కు రుణపడి ఉంటా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు. ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా ప్రగతి పథంలో 'పల్లెలు'.. అభివృద్ధి పరుగులు -
‘కరోనా సోకిన 163 మంది విద్యార్థులకు ప్రత్యేక వైద్యం’
సాక్షి,విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఆళ్లనాని ఫోన్లో మాట్లాడారు. వెంటనే కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇతర విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 'కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులకు 24గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. తిరుమల జూనియర్ కాలేజీ లో 400మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందోస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి' అని ఆళ్లనాని తెలిపారు. చదవండి : పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి -
సర్పవరం టైకీ పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో బల్క్డ్రగ్స్ తయారీకి పైపులద్వారా గ్యాస్లైన్ రియాక్టర్కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్హైడ్రేడ్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీశబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందారు. వారి దేహాలు ఛిద్రమైపోయాయి. అక్కడికి సమీపంలో విధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, భారీగా పొగలు రావడంతో ఏం జరిగిందో తెలియక సర్పవరం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డితో డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్యం అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గౌతమ్రెడ్డి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం టైకీ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో నలుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్య తప్పిదాల వల్ల కార్మికులకు, స్థానికులకు నష్టం జరిగితే సహించబోమని, యాజమాన్య లోపం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. వచ్చేది వేసవి కాలం కావడంతో పెరిగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఫార్మా, కెమికల్స్ వంటి ప్రమాదాలు జరిగే పరిశ్రమలను గుర్తించి, ముందస్తుగా రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులను మంత్రి గౌతమ్రెడ్డి ఆదేశించారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
అదిగో అరుదైన ‘అతిథి’ ఎర్ర బొరవ!
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం ఈ రాబందులు అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్చరణ్. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్లో చరణ్పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ సైతం పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్ ప్లాన్ చేసింది ఆచార్య యూనిట్. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్లో షూటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్ మాత్రమే కాకుండా లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్కు రామ్చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల
సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! -
'దొంగ' పనిమనిషి అరెస్ట్
సాక్షి, అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): ఓ వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన రోజే రూ.8.60 లక్షల విలువైన 23 కాసుల బంగారు నగలను దోచుకెళ్లిన మాయ‘లేడీ’ని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తు అంతా ఆమె నుంచి రికవరీ చేశారు. అమలాపురం కల్వకొలనువీధిలో పక్షవాతంతో మంచంపై చికిత్స పొందుతున్న పలచర్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్దురాలికి సపర్యలు కోసం పనిమనిషిగా ఎరువ మేరీ సునీత రావడం..వచ్చిన రోజే అంటే ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారు నగలతో పరారు కావడం వంటి పరిణామాలు తెలిసిందే. పనిమనిషిగా చేరి చోరీకి పాల్పడిన 42 ఏళ్ల మేరీ సునీత గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామవాసిగా అమలాపురం పోలీసులు గుర్తించారు. చోరీ జరగగానే విజయవాడ, హైదరాబాద్కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు ఆమెను వెంటాడి అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. విజయవాడ శ్రీనివాస హోం కేర్ సర్వీస్ సెంటర్ ద్వారా మేరీ సునీతను అమలాపురంలో అనంతలక్ష్మి వద్ద పనిమనిషిగా పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకు అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద మేరీ సునీతను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న రూ.8.60 లక్షల విలువైన బంగారు నగలను డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చూపించి, వివరాలను వెల్లడించారు. (చదవండి: తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు) ప్రతిచోటా పనిమనిషి ముసుగులోనే చోరీలు గత కొన్నేళ్లుగా ధనికులైన వృద్ధుల వద్ద సపర్యలకు పనిమనిషిగా చేరి ఆ ముసుగులో చోరీ చేయడంలో మేరీ సునీత చేయి తిరిగిన నేరస్థురాలని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ తరహాలో హైదరాబాద్లో ఆమె 11 కేసులు, విశాఖపట్నంలో రెండు కేసుల్లో నిందితురాలు. ఈ 13 కేసులకు సంబంధించి మూడు కేసుల్లో జైల్లో శిక్షలు కూడా అనుభవించిందని చెప్పారు. అమలాపురం చోరీ కేసుకు సంబంధించి ఆమె ఎంత బంగారం దోచుకెళ్లిందో అంత బంగారాన్ని కేవలం రెండు రోజుల్లో సీఐ బాజీలాల్ బృందం రికవరీ చేసిందన్నారు. మేరీ సునీత సెల్ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతికత సహాయంతో ఆమె కదలికలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ కేసులో డీఎస్పీ మాధవరెడ్డి, ఇన్చార్జి డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సీఐ బాజీలాల్, పట్టణ ఎస్సైలు ఎం.ఏసుబాబు, కె.చిరంజీవి, జిల్లా ఐటీ కోర్ క్రైమ్ ఎస్సై ఎం.ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు మల్లాడి హరిబాబు, రమేష్బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం.మూర్తి, సీహెచ్ మాధవిలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అభినందించారు. -
రోజూ సైకిల్పై 18 కి.మీ. పయనం: గ్రూప్–2 విజేత
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: నాన్న చిరుద్యోగి.. ఆయన ప్రోత్సాహంతో ఎంత కష్టమైన 18 కిలోమీటర్లు రోజూ రాజమహేంద్రవరం వెళ్లి చదువుకున్నా.. ఇంటిలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు లేరని నాన్న అన్న మాట తనలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పాన్ని దృఢపరిచింది. సచివాలయ సెక్రటరీ ఉద్యోగం వచ్చినా, ఇప్పుడు గ్రూప్–2లో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా విజయం సాధించగలిగినా నాన్న మాటలే స్ఫూర్తి అని అన్నారు రాయుడుపాకలు గ్రామానికి చెందిన దాసి చిన్నబ్బులు. రాయుడుపాకలు గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసే దాసి దేవదానం, వెంకటలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నవాడైన చిన్నబ్బులు పదో తరగతి పాలచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ నుంచి ఎంఎస్సీ(ఆర్గానిక్), బీఎడ్ వరకు రాజమహేంద్రవరంలోనే చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యం 18 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లి వచ్చేవాడు. మన ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని తండ్రి దేవదానం అన్నమాట అతనికి స్ఫూర్తినిచ్చింది. దాంతో 2015 నుంచి గ్రూప్స్లో విజయం సాధించాలని కృషి చేశాడు. 2017లో జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో రెండు మార్కుల తేడాతో అర్హత కోల్పోయాడు. అప్పుడు చాలామంది నీకు ఉద్యోగం రాదులే అని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో 2019లో గ్రూప్–2, గ్రూప్–3లతో పాటు సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో నిబద్ధతతో చదివి పరీక్షలు రాసి విజయం సాధించాడు. వార్డు సచివాలయంలో శానిటేషన్ అసిస్టెంట్, గ్రేడ్–5 సచివాలయ సెక్రటరీ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో కాతేరు గ్రామ సచివాలయం–2 సెక్రటరీగా విధుల్లో చేరారు. ఆ తరువాత గ్రూప్–3లో గ్రేడ్–4 పంచాతీ కార్యదర్శిగా ఉద్యోగం వస్తే వెళ్లలేదు. ఆ తరువాత గ్రూప్–2 పరీక్షల్లోను, ప్రిలిమినరీ, ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించడంతో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా ఉద్యోగానికి నియమితుడయ్యాడు. తనకు గ్రూప్–1 సాధించడమే లక్ష్యమని దాసి చిన్నబ్బులు ఘంటాపథంగా చెబుతున్నారు. -
రౌడీ షీటర్ను చంపి, భార్య పుస్తెల తాడు లాక్కొని
సాక్షి, పెదపూడి(తూర్పు గోదావరి): జి.మామిడాడలో రౌడీషీటర్ హత్యకు గురైనట్టు కాకినాడ రూరల్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామంలో డీఆర్కే నగర్లో రౌడీషీటర్ మేడపాటి సూర్యనారాయణరెడ్డి(30) అలియాస్ యాసిడ్ సూరి అనే వ్యక్తి జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సూర్యనారాయణరెడ్డి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి గొంతుపై తీవ్రగాయలయ్యాయి. భర్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న భార్య శ్రావ్య చేతిపైనా గాయాలయ్యాయి. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని దుండగులు పరారయ్యారు. వెంటనే సూర్యనారాయణరెడ్డిని 108 వాహనంలో పెదపూడి సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావ్యకు చికిత్స అందించారు. శ్రావ్య ఫిర్యాదు పై స్థానిక ఎస్సై టి.క్రాంతికుమార్ కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కాకినాడ తరలించారు. మృతుడు గతేడాది మార్చిలో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ జి.మామిడాడలో హత్య జరిగిన స్థలాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ భీమారావు సందర్శించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులు, చుట్టు పక్కల వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో కరప, గొల్లపాలెం ఎస్సైలు డి.రామారావు, పవన్కుమార్ ఉన్నారు. పోలీసు పికెట్ కొనసాగుతుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: ఏమైంది తల్లీ...) గొంతు కోసుకొని.. బ్రిడ్జిపై నుంచి దూకి.. ఏం కష్టం వచ్చిందో తెలియదు.. జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పిఠాపురంలో మణికంఠ అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే.. అమలాపురం రూరల్ పరిధిలో బోడసకుర్రు బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వీరిద్దరినీ స్థానికులు సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ► జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం పిఠాపురం: ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మంగళవారం పిఠాపురం పక్షులమర్రి సెంటర్ వీధిలో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో తన కంఠాన్ని కోసుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని పట్టణ ఎస్సై శంకర్రావు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకున్న వ్యక్తి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం, అతడిని ఎవరూ గుర్తుపట్టక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వ్యక్తి తమవాడేనంటూ అతడి బంధవులు రావడంతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన చింతా మణికంఠగా పోలీసులు గుర్తించారు. బాధితుడు వడ్రంగి పని చేస్తుంటాడని, ఇటీవల రౌతులపూడిలో వడ్రంగి పనికి వెళ్లి అక్కడ పని చేస్తూ రెండు రోజుల క్రితం ఇంటి వచ్చేస్తున్నట్టు బంధువులకు సమాచారం ఇచ్చాడని, కానీ ఇంటికి వెళ్లలేదు. ఇంతలో మంగళవారం పిఠాపురంలో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం అంటు సోషల్ మీడియాలో కథనం రావడంతో గుర్తుపట్టిన బంధువులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. పట్టణ ఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని, అతడు అప్పుడప్పుడూ మానసికంగా బాధపడుతుంటాడని బంధువులు తెలిపారు. బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి దూకి.. అల్లవరం: అమలాపురం రూరల్ పరిధిలోని తాండవపల్లి గ్రామానికి చెందిన సత్తి శ్రీమన్నారాయణ బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి మంగళవారం సాయంత్రం వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ బ్రిడ్జిపై సైకిల్, చెప్పలు వదిలి పై నుంచి నదిలోకి దూకేశాడు. బ్రిడ్జి కింద చేపల వేట సాగిస్తున్న బొమ్మిడి ముత్యాలరావు ఇది గమనించి అతడిని కాపాడి తన బోటులో స్థానికుల సహకారంతో గట్టుకి చేర్చాడు. బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకడంతో శ్రీమన్నారాయణ నడుముకి దెబ్బ తగిలిందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై 108కి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానికుడు పరమేష్ తెలిపారు. అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక తన పేరు మాత్రమే చెప్పాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో చెప్పలేదని స్థానికులు తెలిపారు. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్.. భూమి..
సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్. బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్’ ప్రారంభించాడు. దివాన్చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్ఫోన్ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు. ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా.. తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్. -
ఏమైంది తల్లీ...
అందరికీ ప్రాణం పోసే తల్లివి నీవు.. ఏమైందమ్మా.. నవమాసాలు మోసి కన్న బిడ్డనే కాదనుకున్నావు.. ఆ బిడ్డతో నీవూ అనంత లోకాలకు వెళ్లిపోయావు.. ప్రాణం పోయే వారికీ మందులిచ్చి దేవుడిలా ఆదుకునే నువ్వే ఎందుకిలా చేశావో.. అంత కష్టం ఏమొచ్చిందో.. ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావంటూ ఆ తల్లీబిడ్డల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఓ వైద్యురాలు తన కుమారుడితో సహా బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలహాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.. చివరికి ఆత్మహత్యకు పురిగొల్పాయి.. ఈ నేపథ్యంలో తన కుమారుడితో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్ దొంతంశెట్టి లావణ్య (33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. (చదవండి: అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!) ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్ (7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లీ బిడ్డలకు అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే హత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మామ చేతిలో అల్లుడి హతం
సాక్షి, వై.రామవరం: మండలంలోని జంగాలతోట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి మామ కోండ్ల చిన్నారావు చేతిలో అల్లుడు వీరుల ప్రకాష్(34) హతమయ్యాడు. మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అటవీ ప్రాంతంలో ఆ గ్రామం ఉండడం, కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రానికి సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై గంట పృథ్వీలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మారేడు మిల్లి మండలం గుజ్జి మామిడివలస గ్రామానికి చెందిన మృతుడు వీరుల ప్రకాష్(34)కు జంగాల తోట గ్రామానికి చెందిన కోండ్ల చిన్నారావు కుమార్తె పార్వతితో వివాహమైంది. తరచూ మామ, అత్త, భార్యలను మృతుడు తప్పతాగి, వేధిస్తూ, కొడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా మృతుడు తప్ప తాగి అందరినీ కొడుతుండగా, మామ ఆగ్రహించి అల్లుడు ప్రకాష్ మెడపై గొడ్డలితో వేటు వేయగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నాడు. సీఐ, ఎస్సైలు జంగాల తోట గ్రామంలో గ్రామస్తులను, కుటుంబసభ్యులను విచారించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: (షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..) -
స్పేస్ ఎక్స్లో తొలి తెలుగమ్మాయి
పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది. ‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదివారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. విలక్షణంగా చెప్పటం వల్లనే... అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత తొలి తెలుగమ్మాయి స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలలోని అమెరికన్ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి. యుద్ధ సమయంలో ఇరాక్లోనే.. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గ్రీన్ జోన్లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి. పిల్లలు ఇద్దరు... సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ స్టేషన్ వద్ద సీత సంగీత, నాట్య ప్రదర్శనలు సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ రెలిజియన్ కాన్ఫరెన్స్లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. మానస సరోవర్ నీళ్లు – గాంధీకి అభిషేకం సీత ఒకసారి మానస్ సరోవర్కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు. పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది. – సంభాషణ: డాక్టర్ పురాణపండ వైజయంతి -
పూటుగా తాగి లైంగిక దాడి
సాక్షి, కాకినాడ సిటీ: స్థానిక ముత్తా నగర్లో గత నెల 24వ తేదీ రాత్రి ఐదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన తాడి ప్రభు అలియాస్ చిన్న అనే 29 ఏళ్ల వ్యక్తిని కత్తిపూడి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తాడి ప్రభు నవంబర్ 24న స్నేహితుడితో కలసి మద్యం తాగాడు. మత్తులో జోగుతున్న స్నేహితుడి వద్ద సెల్ఫోన్, డబ్బులు దొంగిలించాడు. అక్కడ నుంచి వెళ్లిపోతూ బాలిక తాత సెల్ ఫోన్ దొంగిలించాలని ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో నేలపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఎత్తుకుని దగ్గర్లోని శ్మశాన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఏడుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాలికను కొద్ది దూరం తీసుకొచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం కాకినాడ జ్యోతుల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని రెండు రోజులు ఉన్నాడు. రూము తాళం కూడా ఇవ్వకుండా అమలాపురం, అటు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం రౌతులపూడిలో స్నేహితుడి ఇంటికి వచ్చాడు. అక్కడ నుంచి వస్తూ కత్తిపూడిలో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నేరం చేసినట్టు అంగీకరించాడు. చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు) సెల్ఫోన్లు స్వాధీనం: నిందితుడు ప్రభు నుంచి మూడు సెల్ఫోన్లు, రూ. 7 వేలు, బస్ టికెట్, లాడ్జి రూమ్ తాళం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మి తెలిపారు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్థలంలో బాలిక గౌను, కట్ డ్రాయర్, నిందితుడి దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తునకు 13 ప్రత్యేక బృందాలను ఉపయోగించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఏఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ వి.భీమారావు, దిశ డీఎస్పీ ఎస్.మురళీమోహన్, డీఎస్పీ అంబికా ప్రసాద్, వన్టౌన్ సీఐ టి.రామమోహన్రెడ్డి, పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (తాగిన మైకంలో కూతురి హత్య) -
వేట మొదలైంది... వేటు పడింది..
అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది. టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్ ఆర్.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్ హెచ్ ఎస్ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్కుమార్ స స్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ డీవీ సూర్యం, లీగల్ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి. చదవండి: (దేవుళ్లకే శఠగోపం!) రికవరీ సవాలే.. ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్ తిప్పికొట్టారు. చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్ స్టాఫ్ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదు సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్ -
దివ్యాంగులకు జననేత ఆత్మీయ స్పర్శ
సాక్షి, కపిలేశ్వరపురం: విశాలమైన అవనిలో ఎత్తుపల్లాలు.. చల్లని సముద్రంలో ఎగిసి..పడే కెరటాలు.. నీలి ఆకాశంలో నల్లని మబ్బులు.. ప్రకృతిలో ఏదీ సక్రమంగా ఉండదు. ప్రకృతి ప్రభావిత మానవుని జీవితంలోనూ సమస్యలు, ఒడిదొడుకులు సహజం. పుట్టుకతోనైనా, విధి వంచనైనా.. కారణమేదైనా దివ్యమైన జీవితాన్ని వైకల్యం వెంటాడినా విధి రాతను ఎదిరించి నిలిచిన దివ్యాంగులెందరో చైతన్యపూరితంగా జీవిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బు లేదనో, స్థిరాస్థి లేదనో, గౌరవం ఇవ్వడం లేదనో నిత్యం సమస్యలుగా భావించే వారు ఓసారి దివ్యాంగుల జీవితాల వైపు చూస్తే ఎంతో ప్రేరణ పొందుతారు. శరీర భాగాలు సహకరించకపోయినా జీవితంలో ఎదురీదుతూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం.. అడుగడుగునా జననేత ఆత్మీయ స్పర్శ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2018 జూన్, ఆగస్టు మధ్యకాలంలో జిల్లాలో సాగింది. దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు పాదయాత్రలో తమ సమస్యలను చెప్పుకోగా వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. చూడలేకున్నా.. వెలుతురును ప్రసాదిస్తున్న శ్రీనివాస్ అంధత్వంతో తాను వెలుగును చూడలేకపోతున్నా తనలాంటి అనేక మందికి జీవితంలో వెలుతురును ప్రసాదిస్తున్నారు అమలాపురానికి చెందిన రామాయణం శ్రీనివాస్. పట్టుదలతో దూరవిద్యలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అంధుల సేవకు అంకితమై పనిచేస్తున్నారు. స్వశక్తితో 2004 అక్టోబర్ 16న లూయిస్ అంధుల పాఠశాలను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి అంధ విద్యార్థులకు తన సంస్థలో లూయీ బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపితో విద్యాబోధన చేస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఆయన సంస్థలోనే దాతల సహకారంతో అంధ విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈయన కృషిని ప్రశంసిస్తూ 2017 జనవరి 4న ప్రభుత్వం తరఫున అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత రాష్ట్ర ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. కోనసీమలోని అనేక సంస్థలు, దాతలు శ్రీనివాస్ కృషి కొనసాగింపునకు సహకరిస్తున్నారు. తెల్లవారగానే సాయం.. జిల్లాలో 1,590 సచివాలయాల ద్వారా 537 రకాల సేవలందుతున్నాయి. వాటి పరిధిలోని 26,743 మంది వలంటీర్లు శ్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ క్రమం తప్పకుండా తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు పింఛను సాయమందిస్తుంది. జిల్లాలో సుమారుగా 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. సొంత కాళ్లపై నిలబడిన శ్రీఘాకోళపు పుట్టుకతోనే వైకల్యం వెంటాడడంతో మండపేటకు చెందిన శ్రీఘాకోళపు వెంకట కృష్ణగుప్తకు తన రెండు కాళ్లు పనిచేయవు. ఈయన ఎమ్కాం వరకూ చదువుకున్నాడు. స్థానికంగా కంప్యూటర్ కోర్సు చేసి స్వయం ఉపాధికి బాట వేసుకున్నాడు. ప్రస్తుతం మండపేటలో గుప్త గ్రాఫిక్స్ను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పలువురి నిత్యావసర వస్తువులు అందజేసిఆదర్శంగానిలిచారు. చైతన్య దివిటీలు దివ్యాంగులు చైతన్య దివిటీలు. పుట్టుక వెక్కిరించినా, విధి వంచించినా సమాజంలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తమను సానుభూతితో కాదు.. సామాజిక దృక్పథంతో చూడాలంటున్నారు. గత కాలాల్లో ప్రభుత్వాలు అందజేసిన బహుళ అంతస్తుల భవనంలో దిగువ ఫ్లోర్లోనే దివ్యాంగులకు ఫ్లాట్లను కేటాయించేలా చేసుకున్నారు. నాలుగేళ్లుగా మండపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్లో మూడు శాతం నిధులను దివ్యాంగుల సంక్షేమానికి కేటాయిస్తున్నారు. మండపేటలో దివ్యాంగుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుట్టు పని, ఫినాయిల్ తయారీ తదితర జీవనాధార అంశాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ‘సమగ్ర’ సేవ భానుగుడి(కాకినాడ సిటీ): సమగ్రశిక్షా అభియాన్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పలు ప్రత్యేక పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు దివ్యాంగుల ఉన్నతి కోసం నిరంతర పర్యవేక్షిస్తూ, నెలనెలా పలువిధాలుగా నగదు ఇస్తూ విద్యోన్నతికి తోడ్పాటు అందిస్తోంది. భవిత సెంటర్ల ద్వారా చిన్నారులకు విద్య జిల్లాలో 21 భవిత సెంటర్లు, 43 నాన్ భవిత సెంటర్ల ద్వారా 1379 మంది చిన్నారులకు 18మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. గృహ ఆధారిత విద్య 128 మంది ఐఈఆర్టీల ద్వారా వారంలో 640 మంది విద్యార్థులకు వారంలో ప్రతి శనివారం హోమ్బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతినెలా రూ.200 చొప్పున అలవెన్సులను ప్రభుత్వమే అందిస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్పోర్టు అలవెన్సు ట్రాన్స్పోర్టు అలవెన్సు రూపంలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 1094 మంది వీఐ, హెచ్ఐ, ఎంఆర్ కేటగిరీల విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున అలవెన్సులు అందిస్తోంది. ఎస్కార్టు అలవెన్సు: ప్రత్యేక అవసరాల గల సెరిబ్రల్ పాల్సీ, లోకోమోటార్ డిసెబిలిటీ అండ్ మల్టీపుల్ డిసెబిలిటీ విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఎస్కార్టు అలవెన్సు, ప్రత్యేక అవసరాలు గల ఆడపిల్లలకు 6,7,8 తరగతుల విద్యార్థినులకు 398 మందికి రూ.200 చొప్పున స్టైఫండ్, ప్రత్యేక అవసరాలు గల 46 మంది విద్యార్థినులకు రీడర్ అలవెన్స్ కింద, తొమ్మిది మంది విద్యార్థులకు నెలకు రూ.200 హాస్టల్ అలవెన్సు అందిస్తున్నారు. మైనర్ కరెక్టివ్ సర్జరీలు: రాజమండ్రి యూనివర్సల్ హాస్పిటల్ 52మందికి ఎసెస్మెంట్ క్యాంపు నిర్వహించి మైనర్ కరెక్టివ్ సర్జరీలు నిర్వహించారు. పదిలో 40 మంది పాస్ పదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. స్పెషల్ ఒలంపిక్ భారత్ క్రీడలు భవిత, నాన్ భవిత సెంటర్లలో పిల్లలకు స్పెషల్ ఒలింపిక్ భారత్ నిర్వహిస్తున్న క్రీడలకు జిల్లా స్థాయిలో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్... వైకల్యాన్ని నిర్ధారించేందుకు ప్రామాణికంగా ఉన్న సదరం సర్టిఫికెట్ జారీని ప్రస్తుత ప్రభుత్వం సరళతరం చేసింది. దివ్యాంగుడు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో టైమ్స్లాట్ను బుక్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్షకు వెళ్లాల్సిన తేదీ, సమయం, ఆస్పత్రి వివరాలను స్లాట్లో పేర్కొంటారు. పరీక్ష అనంతరం వైద్యుడు అందజేసే సర్డిఫికెట్ను సచివాలయాల్లోనే పొందొచ్చు. దివ్యాంగుల అవస్థలను తొలగించేందుకు వైద్య పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్యను 18కు పెంచింది. జీజీహెచ్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీల్లో ఈ కేంద్రాలను నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా కొద్ది నెలల పాటు నిలిచిన సదరన్ శిబిరాల నిర్వహణ ప్రక్రియను పుదరుద్ధరించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిత కేంద్రాల ద్వారా సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సంక్షేమం కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. జిల్లాలో 64 భవిత కేంద్రాలుండగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 10,384 ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రబంద్పోర్టల్లో 1524 మంది బాలురు, 1283 మంది బాలికలను నమోదు చేశారు. 18 మంది ఫిజియో థెరపిస్టులు, 124 మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, 64 మంది ఆయాలు చిన్నారులకు సేవలందిస్తున్నారు. 21 రకాల వైకల్యాలతో బాధపడే చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పీచ్థెరపీ, సైకలాజికల్ థెరపీ, ఫిజియో థెరపీ సేవలందిస్తున్నారు. చిన్నారులకు, చిన్నారుల పర్యవేక్షకులకు అలవెన్స్ రూపంలో నగదును కూడా అందజేస్తుంది. వికలాంగుల చట్టం 2016 ఏం చెబుతుందంటే.. శారీరకంగా, మానసికంగా వైకల్యం కలిగిన వారిని దివ్యాంగులుగా పరిగణిస్తున్నారు. 2016 డిసెంబర్ 16న దేశంలో వికలాంగుల చట్టం (ఆర్పీడీ) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆత్మ గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ, అవకాశాల పెంపు, సామాజిక భద్రత లక్ష్యంగా ఈ చట్టం రూపొందింది. ఏడు రకాల వైకల్యాలను మాత్రమే పరిగణించే పరిస్థితుల స్థానంలో ఆ సంఖ్యను 21కు పెంచారు. వికలాంగుల రిజర్వేషన్ శాతాన్ని మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు. వికలాంగులపై దాడి చేసినా, వివక్ష చూపినా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తారు. 50 శాతం రాయితీ బస్పాస్ల జారీ దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ చార్జీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ బస్పాస్లను జారీ చేస్తోంది. జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24 వేల మందికి రాయితీ పాస్లను అందజేసింది. నూరు శాతం వైకల్యం కలిగిన దివ్యాంగుడితోపాటు వారి సహాయకుడికి కూడా 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించింది. దివ్యాంగుల సేవలో ఉమా మనోవికాస కేంద్రం అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది. అటువంటి జన్మకు సార్ధకత చేకూర్చుకునేందుకు ఒక్కక్కరూ ఒక్కో బాటను ఎంచుకుంటారు. అలా కాకినాడ రాయుడుపాలెంలోని ఉమామనో వికాస కేంద్రం నిర్వాహకులు దివ్యాంగులకు సేవ చేసే మార్గాని ఎంచుకుని తరిస్తున్నారు. పుట్టుకనే అంగవైకల్యంతో కొందరు, మానసికంగా ఎదలేని వారు కొందరూ జీవితాన్ని భారంగా మోస్తుంటారు. వారిని అక్కున చేర్చుకుని అవసరమైన ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంఘిక, సాధికార విషయాలను నేర్పుతూ 33 ఏళ్లుగా ముందుకు సాగుతోంది. కాకినాడ రూరల్/యానాం: ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ(ఉమామనోవికాస కేంద్రం) తొలుత తొమ్మిది మందితో ప్రారంభమై నేడు 1500 మందికి విద్యనందిస్తోంది. మన జిల్లాతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సేవలందిస్తోంది. యానాంలో సేవలు.. యానాంలోని జిక్రియనగర్లోని మానసిక వికలాంగ పిల్లల కోసం పదేళ్ల నుంచి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వారికి బుద్ధిమాంద్యం, సెరిబ్రల్ పాలసీ, వినికిడి, మాట సమస్య అభివృద్ధిలో ఆలస్యమైన వారికి ప్రత్యేక విద్య అందిస్తోంది. దీనిలో భాగంగా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, రోజువారీ పనులు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్బేడీ సందర్శన ఈ ఏడాది ఫిబ్రవరిలో యానాంలోని ఉమా మనోవికాస కేంద్రాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న సేవలపై ఆ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ రెడ్డిని అభినందించారు. ఆరుసార్లు జాతీయ పురస్కారాలు 33 ఏళ్లుగా దివ్యాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉమామనోవికాస కేంద్రానికి ఆరుసార్లు జాతీయ పురస్కారాలు లభించాయి. ఆ విధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ నుంచి అనేక అవార్డులను సంస్థ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి అందుకున్నారు. ఏటా డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డే ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పెర్సన్స్ (ప్రపంచ వికలాంగదినోత్సవం)ను సంస్థలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విభిన్నప్రతిభావంతుల అభివృద్ధికి కృషి విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సేవలను అందిస్తూ వారి అభివృద్ధి సేవలు అందించేందుకు ఉమామనో వికాస కేంద్రం 1988లో నెలకొల్పాం. తమ సంస్థ ద్వారా మానసిక వికలాంగుల(బుద్ధి మాంద్యత) ప్రత్యేక పాఠశాల, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, స్టేట్ సెంటర్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్, జిల్లా దివ్యాంగుల పునరావాసం, కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ యూనిట్, కృత్రిమ అవయవాల రిపేరు మొబైల్ వర్క్షాపు, ఘరోంద గ్రూపు హోమ్, సమాజ ఆధారిత పునరావాస కార్యక్రమం, ఇలా పలు కార్యక్రమాల చేపడుతున్నాం. – ఎస్పీ రెడ్డి, డైరెక్టర్, ఉమామనోవికాస కేంద్రం -
తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు -
సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలు విచారకరమని, ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. ( 'చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు' ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పాలన చేయాల్సి ఉంది. తెలంగాణ, ఢిల్లీలో ఉన్న పరిస్థితి వేరు. వారికి బీజేపీయే ప్రత్యర్థి. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా’’ మన్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి? : శివరామ సుబ్రమణ్యం ‘‘సీఎం జగన్ ప్రభుత్వంపై, చేపడుతున్న కార్యక్రమాలపై అవాకులు, చవాకులు విసురుతున్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి?. ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నిస్తున్నారా?. వైఎస్సార్ హయాంలో కేంద్రం నిధులు రాకపోయినా కాలువ పనులు పూర్తి చేయలేదా?. టీడీపీ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయి కదా!. సీఎం జగన్ కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నాం. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని కేంద్రంతో లాలూచీపడున్నాడనడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంలా చూడమంటారా?. రాష్ట్రంలో మరో మూడు దశాబ్దాల వరకు బీజేపీకి మనుగడ ఉండదు. గతంలో అరుణ్ జైట్లీ, చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని చెప్పింది మీరు కాదా?. చంద్రబాబును కలిశాక మీరు ఏం మాట్లాడుకున్నారు.. మీ మాటల్లో మీకు క్లారిటీ ఉందా? ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
పులస @ రూ.21 వేలు
సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్కు సింబల్గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్) -
ప్రయాణం చివరకు విషాదాంతం
సాక్షి, మారేడుమిల్లి: జోరుగా వానలు కురుస్తున్న వేళ.. అణువణువునా ఆకుపచ్చదనం సంతరించుకుని, కొత్త శోభతో మెరిసిపోతున్న మన్యసీమ ఒడిలో విహరిద్దామని వచ్చిన ఆ యువకులు.. చివరకు మృత్యుదేవత ఒడిలో ఒరిగిపోయారు. విజయవాడతో పాటు తెలంగాణకు చెందిన ఆ యువకులు మారేడుమిల్లి అందాలు చూద్దామని బయలుదేరారు. వారి ప్రయాణం చివరకు విషాదంతమైంది. వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వస్తూ, మారేడుమిల్లికి కిలోమీటరు దూరంలోని వుడ్ కాటేజీ వద్ద మలుపులో ఆదివారం ఓ చెట్టును ఢీకొని, అదుపు తప్పి, పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన పులి ప్రవీణ్కుమార్ (24), పూర్ణసాయి (24), తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన భరత్ (24) అక్కడికక్కడే మరణించారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నదీర్ బాషా, కొత్తగూడేనికి చెందిన షేక్ అసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. (కొట్టి చంపి.. గోతంలో వేసి..!) ట్రాఫిక్ స్తంభించడంతో బారులుతీరిన వాహనాలు ఆనందంగా గడపాలని బయలుదేరి.. ఆ ఐదుగురు యువకులూ డిగ్రీ, డిప్లమా వరకూ చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఏజెన్సీ అందాలను తిలకిస్తూ, రెండు రోజుల పాటు ఆనందంగా గడపాలని కారులో బయలుదేరి, ప్రమాదానికి గురయ్యారు. విజయవాడకు చెందిన ప్రవీణ్కుమార్, పూర్ణసాయి కొత్తగూడెంలోని స్నేహితుల వద్దకు శనివారమే బయలుదేరారు. అక్కడ ఇద్దరు స్నేహితులను కలిసి, అక్కడే రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం పాల్వంచ చేరుకుని, మరో మిత్రుడు నదీర్ బాషాను కలిశారు. అక్కడి నుంచి మారేడుమిల్లి అందాలను తిలకించేందుకు కారులో బయలుదేరారు. ఘాట్ రోడ్డులో వారి ప్రయాణం సాఫీగా సాగింది. మారేడుమిల్లి వుడ్ కాటేజీకి కొద్ది దూరంలో మలుపు ఉంది. అక్కడకు వేగంగా రావడంతో ఆ మలుపులో కారును అదుపు చేయలేకపోయారు. దీంతో ఆ కారు చెట్టును ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో చాలాసేపు ఆ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహన చోదకులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన
సాక్షి, అనపర్తి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. ► పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి. ►టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంపట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. కాగా, విషయం తెలుసుకుని రామవరం చేరుకున్న రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని విరమించాలని కోరడంతో మహిళలు అందుకు సహకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
అంతర్వేది ఘటనపై ప్రాథమిక నిర్ధారణ
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వస్త్ర వ్యాపార రారాజు బొమ్మన ఇకలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: వస్త్ర వ్యాపార రంగం రారాజు, అజాత శత్రువు, సామాజిక సేవకుడు, ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొమ్మన రాజ్కుమార్(62) ఇకలేరు. ఆయన కరోనాతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 27 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం దోసకాయలపల్లిలో జరగనున్నాయి. కల్మషం లేని మనిషి, అందరినీ చిరునవ్వుతో పలకరించే ఆయన మరణవార్త తెలియడంతో వెంటనే నగరంలో రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి సంతాపంగా పలు వ్యాపార సంస్థలు మూసివేశారు. 20వ ఏటే వ్యాపార రంగంలోకి.. బొమ్మన రాజ్కుమార్ తన 20వ ఏటే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి రామచంద్రరావుకు చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. ఎవరు సాయం కోరి వచ్చినా కాదనలేని మనసు ఆయనది. వ్యవసాయం అంటే ఎనలేని అభిమానం. తరచూ వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి వస్తుండేవారు. ఆయన వస్త్ర వ్యాపార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమానికి సారథ్యం వహించారు. 2001 నుంచి నిరంతరాయంగా 19 ఏళ్లుగా ది జాంపేట కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కల్యాణ మండపం నిర్మాణానికి çకీలక పాత్ర పోషించారు. జీవిత కాల ట్రస్టీ సభ్యుడిగా ఉన్నారు. యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించారు. మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అ«ధ్యక్షుడిగాను, రాజమహేంద్రవరం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సామాజిక సేవల్లో అందె వేసిన చెయ్యిగా పేరు పొందారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. నేడు నగరంలో వ్యాపార సంస్థల బంద్ బొమ్మన ఆకస్మిక మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ బుధవారం రాజమహేంద్రవరం నగరంలో వ్యాపార సంస్థలను బంద్ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అభిమానుల సందర్శనార్థం బొమ్మన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖుల సంతాపం రాజ్కుమార్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్రాజు, తోట త్రిమూర్తులు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కోఆర్డినేటర్లు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, చందన రమేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్, పోలు కిరణ్కుమార్ రెడ్డి పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ, మాజీ అధ్యక్షుడు అశోక్కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
పంచాయతీ కార్యదర్శి రూ.కోటి స్వాహా
సాక్షి, రాజానగరం: ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏకంగా కోటి రూపాయలకు పైగా ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో తాజాగా బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అవినీతికి అలవాటు పడిన కొంతమంది కార్యదర్శులు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను ఆయా పంచాయతీలకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకుని బొక్కేశారు. ఈ తరహాలోనే జిల్లాలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు గుట్టుగా చేసిన అక్రమం తాజాగా బయటపడింది. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు. ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 2014–15 నుంచి మొత్తం రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ రాజానగరం ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కోరుకొండ, కాతేరు పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా నియమించారు. వారు చేసిన పరిశీలనలో రూ.84,12,916 ఖర్చులకు ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో ఆ మేరకు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వరరావుకు సమాధానం చెప్పుకునేందుకు (సరి చేసుకునేందుకు) అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562లకు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 57,27,354 నికరంగా దుర్వినియోగమైందని విచారణ బృందం ఆగస్టు 20న రిపోర్టును తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసింది. ఇక్కడే ఇంత... మరి అక్కడో... నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్చెరువు పంచాయతీకి కూడా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అతను లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం, గాడాల, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా అతనిపై పలు అరోపణలున్నాయి. దీంతో ఈయనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా శిక్షార్హులే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని, అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు కూడా అందజేశామని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ తెలిపారు. అతను స్వాహా చేసిన ప్రజల సొమ్ములను రికవరీ చేయడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు. అంతేకాక అతను ఇన్చార్జిగా పనిచేసిన దివాన్చెరువు పంచాయతీలో కూడా విచారణ జరిపేందుకు రెండు మూడు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపిస్తామన్నారు. -
ఖైరతాబాద్ గణనాథునికి 100 కేజీల లడ్డూ
సాక్షి, మండపేట: వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం మడత కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ 100 కిలోల లడ్డూను కానుకగా అందజేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు. ఖైరతాబాద్ గణపయ్యకు 2010 నుంచి లడ్డూను కానుకగా మల్లిబాబు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే మల్లిబాబు, సిబ్బంది గణపతి మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో లడ్డూ తయారు చేసేవారు. 2010లో 500 కిలోల లడ్డూ తయారుచేసి పంపగా, విగ్రహ పరిమాణాన్ని బట్టి ఏటా లడ్డూ పరిమాణం పెంచుతూ వచ్చారు. 2011లో 2,400 కిలోల లడ్డూ సమర్పించగా, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6 వేల కిలోల లడ్డూను స్వామి వారికి కానుకగా అందజేశారు. లడ్డూలను గణనాథుని చేతిలో ఉంచి, ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. (ప్రేక్షకులను ఉర్రూతలుగించిన వినాయకుడి పాటలు) 2016లో కమిటీ సూచన మేరకు 500 కిలోల లడ్డూను కానుకగా పంపారు. అయితే ఎంతో నియమనిష్టలతో, తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి అందజేసిన లడ్డూ నైవేద్యానికి కమిటీ సరైన రక్షణ కల్పించకపోవడం మల్లిబాబును తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 2017 ఉత్సవాల నుంచి భారీ లడ్డూ కానుకను నిలిపివేసినా 25 కిలోల లడ్డూ కానుకగా అందజేస్తూ వచ్చారు. కాగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు ఈ ఏడాది ఉత్సవాలకు 100 కిలోల లడ్డూ తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఖైరతాబాద్లో తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. లడ్డూను శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్కు తరలించామన్నారు. -
ఏపీలో తొలిసారిగా.. 48 గంటల్లో మోడల్ హౌస్
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతితక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్ను ఆయన సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించిన మోడల్ హౌస్ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారిగా ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు మూడున్నర లక్షల లోపు ఖర్చువుతుందని ఆయన వివరించారు. -
పిఠాపురం ఎమ్మెల్యేకు పితృ వియోగం
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృ వియోగం కలిగింది. దొరబాబు తండ్రి పెండెం పెద వీర్రాఘవరావు (94) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పెద వీర్రాఘవరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వాటాల పంపకాల్లో తేడా.. బాగోతం గుట్టురట్టు
అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా వచ్చింది. కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అక్రమాల బాగోతం బయటపడింది. కరోనా పేరుతో ఓ సీనియర్ స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరి కొందరు నడిపిన వసూళ్ల తంతును పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు ఆ ఎంఎన్ఓ. తాను కిట్లు దొంగిలించింది కేవలం స్టాఫ్ నర్సుపై ప్రతీకారం తీర్చుకోవడానికేనని వారికి చెప్పుకొచ్చాడు. కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా అవినీతిపరులు మాత్రం పేట్రేగిపోతున్నారు. వైద్యసేవల మాటున కాసుల దందాకు తెరతీస్తున్నారు. కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డ బాషా వాంగ్మూలంతో కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అవినీతి బాగోతం బయటపడింది. కిట్లను పక్కదారి పట్టించి ఓ సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ అనుమానితుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కిట్లు దొంగిలించిన ఎంఎన్వో షేక్ జాన్ బాషా ఈ ఆరోపణలను నిజమేనన్నట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో.. ఇటీవల విడుదలైన జీజీహెచ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆసరాగా, సంబంధిత నర్సు అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని అక్కడ కొందరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధితులను పిలిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సమక్షంలో మాట్లాడారు. ఎవరికీ డబ్బులివ్వొద్దని వాళ్లతో చెప్పి నర్సుతో పాటు అభ్యర్థులను అక్కడి నుంచి పంపేశారే తప్ప చర్యలేవీ చేపట్టలేదు. ఆ నర్సే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆమె కష్టాన్ని పదింతలు చేసి ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు అక్కడే పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీ షియన్కు ఓ ప్రైవేటు ల్యాబ్ ఉండగా జీజీహెచ్లో వసూళ్లకు పాల్పడడమే కాక, అక్కడికి కూడా కిట్లను తరలిస్తున్నాడని వెల్లడైంది. వసూళ్ల దందాలో ఈ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని నిందితుడు బాషా పోలీసులకు వెల్లడించాడు. ఈ వసూళ్ల వ్యవహారం వెనుక వీళ్లకు దన్నుగా జీజీహెచ్ ఉన్నతాధికారి ఉన్నారన్న చర్చ సాగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కిట్లలో కొన్ని.. నిందితుడిని అరెస్టు చేశాం : పోలీసులు కాకినాడ మూడో పట్టణ పోలీసులు మాట్లాడుతూ నిందితుడు బాషా ప్రతీకార చర్యలో భాగంగానే దొంగిలించినట్టు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు చెప్పిన పేర్లను సూపరింటెండెంట్కి తెలిపి కేసును కాకినాడ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగిస్తామన్నారు. నిందితుడి నుంచి 298 కిట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ బాధితుడైన బాషా వాటిలో రెండు కిట్లను తన కోసం వినియోగించుకున్నాడన్నారు. అతడికి మంగళవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్గా నిర్ధారణ అయిందన్నారు. గత నెల 27న జీజీహెచ్ నుంచి ఇంటెండ్ తీసుకున్న బాషా డీఎంహెచ్వో కార్యాలయానికి కిట్ల కోసం వచ్చాడని, ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగాడని తెలిపారు. ఆ తర్వాత అమలాపురానికి బదిలీ కావడం, కరోనా పాజిటివ్ రావడంతో ఇంద్రపాలెంలోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నాడన్నారు. ఆ స్టాఫ్ నర్సుపై పగతో ఆమెతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్ల దందాను బయట పెట్టాలని నిర్ణయించి ఆ ఇండెంట్పై తేదీని పదిగా మార్చి, కిట్ల సంఖ్యను 200 నుంచి 300 చేసి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితుడిని బు«ధవారం ఉదయం అరెస్టు చేశామని, పరీక్షల కోసం జీజీహెచ్కి పంపామని తెలిపారు. నిందితుడితో పాటు అతడి వద్ద లభ్యమైన 298 కిట్లను న్యాయస్థానానికి అందిచనున్నట్టు తెలిపారు. ప్రతీకారం తీర్చుకుందామని.. ఎంఎన్వో బాషా కిట్లను దొంగిలించి ఇంట్లో దాచుకున్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన అతడికి లేదని పోలీసుల విచారణలో తేలింది. 300 కిట్లు దొంగిలించడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తే నివ్వెరపరిచే సమాధానమిచ్చాడు. అక్కడి నర్సుపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ పని చేశానని తేల్చి చెప్పాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే డబ్బుల పంపకంలో చోటు చేసుకున్న ఘర్షణలో తానే డబ్బులు వసూలు చేసినట్టుగా నర్సు తనపై నింద వేసి నోడల్ అధికారికి ఫిర్యాదు చేసిందన్నాడు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి బదిలీ చేశారని, అది తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. -
అల్లుడిని నరికి చంపి, తలను తీసుకొని..
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత అల్లుడినే కిరాతకంగా నరికి చంపాడో మామ. అనంతరం తలను సంచిలో తీసుకొచ్చి అన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటన రౌతులపూడి మండలం డీజేపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఇద్దరి కూతుర్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు. (చదవండి : ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి) గత రాత్రి అత్తారింటికి వచ్చిన అల్లుడు లచ్చన్న భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. పిల్లల్ని కూడా చంపేస్తానని మామను హెచ్చరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చన్న తల నరికాడు. అనంతరం ఆ తలను సంచిలో వేసుకొని అన్నవరం పోలీసులకు అప్పగించాడు. సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని అన్నవరం పోలీసులు పేర్కొన్నారు. -
అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
మంత్రి వేణును కలిసిన ఐఏఎస్ అధికారులు
సాక్షి, కాకినాడ: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను పలువురు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్అండ్బి అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి వేణును జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్–19 నియంత్రణ చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివేణు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మురళీధర్రెడ్డి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుందని మంత్రి వేణు పేర్కొన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్కు మూడో స్థానం) -
టీడీపీ అక్రమాలు.. రూ.కోటిన్నర మాయం
గతమంతా ఘన చరిత్ర...అయితే అవినీతితో అన్నట్టుగా ఉంది టీడీపీ పాలన. అన్నీ పక్కాగా సాగాల్సిన సహకార సొసైటీల్లో కూడా కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లు. తరువాత అధికారం తమదేనన్న ధీమాతో బినామీల పేరుతో...సెంటు భూమిలేని వ్యక్తుల పేరుతో నిధులను పక్కతోవ పట్టించారు. కళ్లుమూసుకొని పాలుతాగుతూ పిల్లి ఎవరూ చూడడం లేదన్న రీతిలో సొసైటీల్లో ఖజానా గుల్ల చేసేశారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంత ఉదయ భాస్కర్ ఈ అక్రమాలపై దృష్టి సారించడంతో వ్యవహారం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కంచే చేను మేసింద’నే సామెతను తలపించే రీతిలో సహకార సంఘాలను అధికారులే కొల్లగొట్టేశారు. సంఘాలలో పనిచేస్తూ ప్రగతికి పాటుపడాల్సిన సంబంధితాధికారులు, ఉద్యోగులే సంఘాలను గుల్ల చేసిపోయారు. గత తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏలుబడిలో తెలుగు తమ్ముళ్లు, అధికారులు కుమ్మక్కై గత ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఏ సంఘాన్ని కదిపినా అవినీతి, అవకతవకలే కదలాడుతున్నాయి. అప్పట్లో డీసీసీబీ పాలకవర్గం, సీఈఓ సహా అధికారుల సంఘాలు, బ్రాంచీల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను చూసీచూడనట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి డీసీసీబీ చైర్మన్గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వద్దిపర్రు సొసైటీ, ఆత్రేయపురం బ్రాంచి అధికారులు అడ్డంగా దోచేసిన రైతుల సొమ్ము అక్షరాలా రూ.1.37 కోట్లుగా లెక్క తేలింది. అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించడంతో ఈ కుంభకోణం బయటపడింది. 2019 మార్చి వరకూ జరిగిన లావాదేవీలపై ఆడిట్లో బయటపడింది కానీ లేకుంటే ఇది బయటపడేదే కాదు. ఈ కుంభకోణాన్ని వద్దిపర్రు పర్సన్ ఇన్చార్జి కొరుప్రోలు వెంకటేశ్వరరావు బయటపెట్టారు. వద్దిపర్రు సొసైటీలో... టీడీపీ ఏలుబడిలో సొసైటీలో 55 మంది బినామీ రైతుల పేర్లతో సుమారు రూ.54 లక్షలు దిగమింగేశారు. సొసైటీలో జరిపిన ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, నగదు నిల్వ రూ.23 లక్షలు కూడా మాయం చేసేశారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో అసలు సెంటు భూమంటూ లేని, నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీల పేరుతో లక్షలు రుణాలు తీసేసుకున్నారు. ఈ సొసైటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓ ఆచంట మునీశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలపై జరిపిన ఆడిట్లో ఈ కుంభకోణం వెలుగులోకి చూసింది. పేరవరం గ్రామానికి చెందిన కొండ్రు నాంచారావు సన్ఆఫ్ పల్లయ్య రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహంలో నివాసం ఉంటున్నాడు. అతని పేరున రూ.17.30 లక్షలు రుణం వద్దిపర్రు సొసైటీ రికార్డుల్లో ఉంది. సెంటు భూమి లేదు. అయినా నాంచారావు పేరున స్వల్పకాలిక రుణం రూ.3 లక్షలు, స్వల్పకాలిక ఇతర రుణం రూ.9.70 లక్షలు, దీర్ఘకాలిక రుణం రూ.4.60 లక్షలు, మొత్తంగా రూ.17.30 లక్షలు రుణం దోచేశారు. ఏవీ చూడకుండానే... ♦రుణం ఇవ్వాలంటే ముందు బ్రాంచి మేనేజర్, సూపర్వైజర్ కచ్చితంగా భూమిని పరిశీలించాలి. భూ తనఖా రిజిస్ట్రేషన్ నంబరు, అతని పేరున భూమి ఉందా లేదా, భౌతికంగా కూడా చూడాలి. అదే రూ.3 లక్షలు రుణం వరకూ బ్రాంచి స్థాయిలో పరిశీలన జరిపితే సరిపోతుంది. రూ.3 లక్షలు దాటి రుణం ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ స్థాయిలో పరిశీలన జరపాలనేది నిబంధన. కానీ ఇవేమీ చూడకుండానే కళ్లుమూసుకుని సెంటు భూమి లేని నాంచారావు పేరున రూ.17.30 లక్షలు రుణం గుటకాయ స్వాహా చేశారు. ♦వద్దిపర్రు గ్రామంలో ఉప్పే కొండయ్య సన్ ఆఫ్ పెరుమాళ్లు. ఇతనికి 0.6 సెంట్లు భూమి ఉంది. దీనిని 0.67 సెంట్లుగా రికార్డు చూపించారు. అంటే 61 సెంట్లు పెంచి చూపించారు. స్వల్పకాలిక రుణ బాండ్లో 67 సెంట్లు చూపించారు. తీరా కొండయ్య పేరున సొసైటీలో తనఖా పెట్టిన బాండును అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఆ బాండు నంబర్ 949/2012తో కరుటూరి మాధవి పేరున రిజిస్టరై ఉందని తేలింది. ఇలా ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు పీఏసీఎస్ ద్వారా 55 మందికి రూ.54 లక్షలు పంట రుణాలు ఇచ్చినట్టు రికార్డు ఉంది. రుణాలు ఇవ్వాలంటే టైటిల్ డీడ్, బాండ్ పేపర్లు సొసైటీ తరువాత బ్రాంచిలో డిపాజిట్ చేయాలి. కానీ ఇక్కడ సొసైటీ సీఈఓ సహా కొందరు బ్రాంచి అధికారులు భూమి లేని వారికి భూమి ఉన్నట్టు, భూముల విస్తీర్ణం పెంచేసి, టైటిల్ డీడ్లు లేకుండానే ఉన్నట్టు, బాండ్ పేపర్లు నకిలీవి సృష్టించడం...ఇలా రికార్డుల మాయాజాలంతో లక్షలు దారిమళ్లించి రైతుల నోట మట్టికొట్టారు. ఓ రైతుకు రుణం ఇవ్వాలంటే... స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం టైటిల్ డీడ్, బాండ్ కచ్చితంగా ఉండాలి. వీటిని రైతుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకుంటారు. సొసైటీ స్థాయిలో సీఈఓ పరిశీలన జరిపి డీసీసీబీ బ్రాంచికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బ్రాంచి మేనేజర్ రికార్డు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణం కూడా నేరుగా రైతుకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతుకు రుణం అందుకోవాలంటే ఇంతటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటే వద్దిపర్రు సొసైటీలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసినా డీసీసీబీ స్థాయిలో అప్పటి సీఈఓ సహా ఉన్నతాధికారులు, ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ ఎం.క్రాంతి కృష్ణ పర్యవేక్షణ ఏమి చేశారని ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సీఈఓ ఆచంట మునీశ్వరరావు, సూపర్వైజర్ మహలక్ష్మిరాజు(పదవీ విరమణ) అక్కడి తెలుగు తముళ్లు తెరవెనుక ఈ కథ నడిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల లావాదేవీల్లోనూ... ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, మార్చి 2019 నాటికి ఉండాల్సిన నగదు నిల్వ రూ.23 లక్షలలో మాయాజాలమే జరిగింది. తమకు తెలియకుండా తమ పేరున రుణాలు కాజేసిన వ్యవహారం ఆనోట, ఈనోటా రైతులకు చేరడం, ఇంతలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వద్దిపర్రు పర్సన్ ఇన్ఛార్జిగా కొరుప్రోలు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కుంభకోణంపై ఆడిట్ నిర్వహించడం ద్వారా స్వాహా అయిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా వసూళ్లు చేస్తామన్నారు. సొమ్ము రాబట్టి బాధ్యులను విడిచిపెట్టేస్తే ఇలాంటి కుంభకోణాలు పునరావృతం అవుతాయని, బాధ్యులపై చర్యలకు డీసీసీబీ స్థాయిలో కొందరు అధికారులు అడ్డంపడుతున్నారని తెలిసింది. ఇటీవల గోకవరం బ్రాంచిలో బంగారం, దీర్ఘకాలిక రుణాలలో అవినీతిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో బాధ్యుడైన మేనేజర్ ఎస్ఎ హుస్సేన్ నుంచి బంగారం, నగదు రికవరీ చేసి విధులకు దూరంగా ఉంచారు. వద్దిపర్రు సొసైటీ సీఈఓ మునేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్రేయపురం బ్రాంచిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు నొక్కేసింది వీరి పేర్లతోనే... పోతుల శ్రీరామ్-రూ.3 లక్షలు పోతుల ఏసుప్రభావతి-రూ.3 లక్షలు గుడే సునీత-రూ.3 లక్షలు బొజ్జా రాజేశ్వరి-రూ.3 లక్షలు బొజ్జా తులసీరావు-రూ.3లక్షలు మద్దిపోతి శ్రీనివాసరావు-రూ.13,700లు మద్దెల అర్జియ్య-రూ.2లక్షలు అత్తిలి రామాంజనేయులు-రూ.2 లక్షలు అత్తిలి గోవిందు-రూ.2 లక్షలు వరదా రాంబాబు-రూ.2.40లక్షలు మద్దిపోతు విజయలక్ష్మి-రూ.1.75 లక్షలు గన్నమేని అనసూయ-రూ.1.50 లక్షలు ఎస్ వెంకటేశ్వర్లు-రూ.లక్ష అవకతవకలు వాస్తవమే.. వద్దిపర్రు సొసైటీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. దానిపై ఆడిట్ కూడా నిర్వహించాం. బాధ్యులపై విచారణతోపాటు సొమ్ము రికవరీ చేస్తున్నాం. ఇటువంటి అవకతవకలు జరగకుండా బ్రాంచి, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారిని భవిష్యత్తులో బదిలీలు చేసేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రవీణ్కుమార్, డీసీసీబీ సీఈవో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం సొసైటీలో అవకతకవలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. ప్రతి పైసా సొసైటీకి తిరిగి వచ్చే వరకూ పోరాడతాం. సొసైటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. – కొరుప్రోలు వెంకటేశ్వరరావు, వద్దిపర్రు సొసైటీ చైర్మన్, ఆత్రేయపురం మండలం సహకార సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలను భ్రష్టుపట్టించారు. తెలుగు తమ్ముళ్లు కొందరు సహకారంతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుతిన్నారు. అటువంటిదే మా నియోజకవర్గంలో పలివెలలో జరిగింది. పలివెలలోని సహకార సంఘ పరిధిలో రెండు భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు విడుదల చేశారు. కానీ అక్కడ నిర్మించింది ఒకే భవనం. నేను స్వయంగా అక్కడ జరిగిన అవినీతిని నాడు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు తీసుకోలేదు. పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిన మీదట మొక్కుబడిగా విచారణ చేసి రూ.6 లక్షలు అవినీతి జరిగినట్టు తేల్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన సమయానికి కూడా అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయింది. – చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే -
వివాహితపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, పిఠాపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు అర్ధరాత్రి సమయంలో ఓ వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యాన్ని బయటపెడితే చంపేస్తామని నిందితులు భయపెట్టడంతో రెండు నెలల పాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించిన వివాహిత చివరకు తన తల్లిదండ్రుల సహకారంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఓ వివాహిత తన భర్త పిల్లలతో కాపురం ఉంటోంది. గతంలో తన స్థలంలో ఇల్లు కట్టుకోగా, ఇంటి నిర్మాణ సమయంలో తాపీ మేస్త్రీలుగా పని చేసిన చేశెట్టి బాలాజీ, మంతెన లచ్చ, తీడ లోవరాజు వివాహితపై కన్నేశారు. తమ కోరిక తీర్చాలంటూ బ్లాక్మెయిల్ చేసేవారు. ఇటీవల బాధితురాలి మామ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో బాధితురాలి భర్త ఆయన వెంట ఆస్పత్రిలో ఉండగా.. ఒక రోజు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు నిందితులు బలవంతంగా ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఎంత బతిమాలినా వినకుండా విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం)