East Godavari Disrtict
-
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం.. కలెక్టర్ క్లారిటీ, ఏమన్నారంటే..
తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల కలకలంపై కలెక్టర్ ప్రశాంతి స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ కేసులు విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించామన్నారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, బలభద్రపురం గ్రామంలో 23 కేసులను గుర్తించామన్నారు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలున్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య నిపుణుల సూచనలు సలహాల మేరకు ప్రజలకు తగిన వైద్య చికిత్స అందజేస్తామని కలెక్టర్ అన్నారు. నిన్న (శనివారం) ఆమె బలభద్రపురంలోని ఇంటింటి సర్వేను క్ష్రేత స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామంలోని 2,492 గృహాల్లో సుమారు 10 వేలు జనాభా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.ఇందుకోసం ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆధ్వర్యంలో 31 బృందాలను నియమించామన్నారు. వీరు ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుల సూచనలు సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఆంకా లజిస్టుల సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. -
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
‘బాబు నన్ను మోసం చేశారు..’ ఏడ్చేసిన నల్లమిల్లి
సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన. టీడీపీ తరఫున అనపర్తి టికెట్ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
సంక్రాంతి సంబరాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకొని ఇద్దరు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పెందేలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆనందంగా జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పద్మారావు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో చోట అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్ అనే మరో వ్యక్తి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు -
గుమ్మళ్లదొడ్డిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చదవండి: (టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్) -
యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్గాట్, రీపీ బెనిఫిట్ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్ పర్సన్స్కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..) లక్ష్యాలు చేరుకునేందుకు విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. – సీహెచ్ ఉదయ్కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈఎండీపీ సద్వినియోగం చేసుకోవాలి నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా మంచి ఆలోచన విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్జెడ్లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
విజయ గీతిక.. ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్సీపీనే వరించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది. జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్గానే కొనసాగించారు. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ దివస్ అయిన గత ఏప్రిల్ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్ తృతీయ స్థానంలో నిలిచింది. డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాకారమైంది. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి, సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. అందరి సమన్వయంతో ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్ చేశాం. జిల్లాపరిషత్ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా -
నన్నయ వర్సిటీ విద్యార్థులకు టీసీఎస్లో ఇంటర్న్షిప్
రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్వేర్ టూల్స్పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్బుక్లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్లైన్లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ఆస్ట్రానమీలో అదరగొట్టింది
నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్లైన్లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది. -
బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ ఊహించలేదు: గ్రూప్–1 టాపర్ సుష్మిత
సాక్షి, హైదరాబాద్(చిక్కడపల్లి): బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదంటూ ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫస్ట్ ర్యాంకర్ రాణి సుష్మిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురానికి చెందిన ఆమె ఏపీ గ్రూప్స్ ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించారు. బుధవారం హైదరాబాద్ అశోక్ నగర్లోని ఏకేఎస్–ఐఏఎస్ అకాడమీలో సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పద్మప్రియ ఇంటి వద్దే ఉంటారు. హిందీ పండిట్ అయిన తన తాత పి.ఎల్.ఎన్.శర్మ ప్రోత్సాహంతో గ్రూప్స్ చదవి ర్యాంక్ సాధించానని సుష్మిత చెప్పారు. తన లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర ఆమోఘమైందని వెల్లడించారు. బాగా శ్రమిస్తేనే ర్యాంక్ సాధించడం సాధ్యమని గ్రూప్స్ రాసేవారికి సూచించారు. 10వ తరగతి వరకు పిఠాపురంలో చదువుకున్న సుష్మిత కాకినాడలో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. అదే హెల్త్కేర్లో డాక్టరేట్ పూర్తి చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ఈమె భర్త రవికాంత్ సివిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరికి సురవ్ కశ్యప్ అనే అబ్బాయి ఉన్నాడు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) ఏపీపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నాన్ లోకల్ కేడర్ కింద తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పవన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు యూపీఎస్సీ కోసం కష్టం పడ్డా. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు నాన్ లోకల్ కేడర్ కింద ఏపీలో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది’అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సీడీపీవోగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సింధూ ప్రియ కూడా నాన్ లోకల్ కేడర్ కింద డీఎస్పీగా ఎంపికయ్యారు. ఎంపికపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: (మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్గా..) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
నాకు దిక్కేది.. ఎలా బతకాలి
తూర్పు గోదావరి (రావులపాలెం) : నాన్న కోసం వెళ్లిన అమ్మ, అన్నయ్య, నాన్నమ్మ లేకుండా పోయారు. ఇక ఎలా బతకాలి.. నాకు దిక్కేది అంటూ ఆ కుటుంబంలో చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి పాలవ్యాన్, మోటారు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోస్టుమార్టం అనంతరం అప్పన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ మృతదేహాలను సమీప బంధువులు, స్థానికులు రెండు అంబులెన్సుల్లో ఇంటికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, బంధువులు చివరి చూపుకోసం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన దుర్గాప్రసాద్ నాన్నమ్మ సత్యవతి భర్త రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారందరికీ వివాహం అయ్యింది. సత్యవతి భర్త పోయిన నాటి నుంచి పెద్ద కుమారుడు పుల్లేశ్వరరావు, చిన్న కుమారుడు నాగేశ్వరరావుల వద్ద ఉంటుంది. అయితే చిన్న కుమారుడు నాగేశ్వరరావు కొబ్బరి లోడింగ్ కూలీ పని చేసుకుంటూ భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, దుర్గాప్రసాద్ను చదివిస్తున్నాడు. మహేష్ డిగ్రీ చదువుతుండగా దుర్గాప్రసాద్ ఇంటర్ పూర్తి చేశాడు. కొంతకాలంగా వేరే మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ కుటుబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం కొబ్బరి లోడింగ్ పనికి వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు నాగేశ్వరరావు కొత్తపేటలో ఉన్నట్టు తెలుసుకుని అతని తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, పెద్ద కుమారుడు మహేష్ అతని వద్దకు వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురయ్యారు. డిగ్రీ చదువుతున్న మహేష్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నామని సమీప బంధువులు అప్పన రామకృష్ణ, సత్యకిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తొలకరి సాగులో సరికొత్త ఒరవడి
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇవి సాగు చేయాలి ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి) ఇన్ని విత్తనాలు అవసరం ∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం ∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం ∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది. విత్తనశుద్ధి చేసుకోవాలి సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు. – సీహెచ్కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ -
‘రెండో అతిపెద్ద రిటైల్చైన్గా భారత్ మారింది’
రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తున్నారని, 2014 తర్వాత దేశంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక రాజమండ్రి నగరానికి రావడం సంతోషంగా ఉంది.చరిత్రలో రాజమండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చారు. మోదీ హయాంలోనే దేశంలో పేదరిక తగ్గింది. అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఆయుష్మాన్ భారత్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.భారత నుంచి 500 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రెండో అతిపెద్ద రిటైల్ చైన్గా భారత్ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు. భారత్ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది’ అని తెలిపారు. -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
-
ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు వాయిదా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257 మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486 కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077 -
తేనెలూరుతున్న ఉపాధి
రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ‘విశిష్ట’ బ్రాండ్ పేరుతో వ్యాపారం శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్ట్రాక్టర్) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు. 40 రోజులు పడుతుంది పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది. ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్ బీస్’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్ను కొనసాగిస్తున్నారు. దివాన్చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. రాయితీతో ప్రోత్సహిస్తున్నాం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్బీహెచ్ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి వివరాలను ‘మధుక్రాంతి’ యాప్లో అప్లోడ్ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా కృషి చేస్తున్నాం. – టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం -
విదేశీ విద్యకు వెళ్లే వేళ.. కడలి అలలకు బలి
తొండంగి: ఉజ్వల భవిష్యత్తు కోసం మరో నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్లాల్సిన ఆ యువకుడు కడలి కెరటాలకు బలైన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పైడికొండ పంచాయతీ ఆనూరుకు చెందిన త్రిపరాన కాసులు, నూకరత్నం దంపతులు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు సుబ్రహ్మణ్యం (26) విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. సముద్రంలో స్నానం చేద్దామని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామం నుంచి ఒక్కడే బైక్పై దగ్గరలోని వేమవరం పంపాదిపేట తీరానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎంతకూ రాకపోవడంతో బంధువులు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ అతడి సెల్ఫోన్, దుస్తులను గమనించారు. సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో గల్లంతయ్యాడని భావించి, మత్స్యకారుల సాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం అద్దరిపేట తీరానికి చేరింది. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్రెడ్డి తూర్పు సెంటిమెంట్గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సీఎం జగన్ అమలు చేశారని వివరించారు. మిధున్రెడ్డికి ఘన స్వాగతం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్సభలో పార్టీ ఫ్లోర్లీడర్ మిధున్రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్రెడ్డి, బోస్ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు. పథకాలపై ఫోకస్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్రెడ్డి, బోస్ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు. -
AP: సాగు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమయ్యే నాటికి గోదావరి డెల్టా రైతుల నీటి కష్టాలను కడతేర్చే దిశగా ముందస్తు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.43 కోట్లపై చిలుకు విలువైన 275 పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఏటా రబీ సీజన్ ముగియగానే కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా పంట కాలువలకు నీటిని నిలుపు చేస్తారు. తిరిగి ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాను ప్రారంభిస్తారు. కాలువలు మూసివేసి, తిరిగి తెరిచే లోగా వాటి పటిష్టత, పూడికతీత, ఔట్ఫాల్ స్లూయిజ్ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు చేపడుతుంటారు. వీటిని క్లోజర్ పనులని అంటారు. ఈ పనుల ద్వారా ఖరీఫ్ సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. గతంలో పంట కాలువలు మూసేసినప్పటికీ సకాలంలో ఆమోదించకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో క్లోజర్ పనులు పూర్తయ్యేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ అధికారులు క్లోజర్ పనులపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోనసీమ జిల్లాలో అత్యధికం ఈసారి మొత్తం క్లోజర్ పనుల్లో మూడు వంతులు పైగా కోనసీమ జిల్లాలోనే చేపట్టనున్నారు. అక్కడే ఆయకట్టు ఎక్కువగా ఉండటంతో అందుకు తగ్గట్టు పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటికీ కలిపి రూ.43,09,77,000 మంజూరు చేస్తే ఇందులో కోనసీమ జిల్లాకు అత్యధికంగా రూ.34,93,32,000 కోట్లు కేటాయించారు. మిగిలినది తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు కేటాయించారు. అమలాపురం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో బెండా కెనాల్, జనుపల్లి హెడ్ స్లూయీజ్కు నడిపూడి గ్రామ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. చెయ్యేరు చానల్ – గున్నేపల్లి బ్రాంచి కెనాల్స్, అల్లవరం చానల్, కౌశిక చానల్, అమలాపురం చానల్ నుంచి చిందాడగరువు చానల్, పి.గన్నవరం కెనాల్ నుంచి అమలాపురం కెనాల్ వరకు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పలు కాలువలను అభివృద్ధి చేయనున్నారు. కోనసీమలో అత్యధికంగా రాజోలు నియోజకవర్గంలో 52 పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు వేగవంతం చేస్తాం. – బి.రాంబాబు, ఎస్ఈ,ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రైతులకు లబ్ధి డెల్టా కాలువలకు నీటిని నిలిపివేసిన అనంతరం చేపట్టే ఓ అండ్ ఎం పనులతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికతీతతో పాటు గేట్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టడం ద్వారా శివారు ప్రాంతాలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు చేరుతుంది. ఈ పనులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. – జిన్నూరి వెంకటేశ్వరరావు,వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు గోదావరి -
సారా రహిత జిల్లాయే లక్ష్యంగా‘ఆపరేషన్ పరివర్తన 2.0
రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజారోగ్యానికి హానికరమైన సారాను నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో రెండు నెలల పాటు పోలీసు, ఎస్ఈబీ సిబ్బంది కలిసి ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్ను ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ చేపట్టారు. ‘ఆపరేషన్ పరివర్తన 2.0’లో ఇలా.. సెబ్, పోలీసు అధికారులు, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలు, అమ్మకాలు జరిపే ప్రదేశాల్లో దాడులు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు జరిపే గ్రామాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేసి, పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సారా తయారీ, అమ్మకాలు, సరఫరా చేసే వారిపై, సారా తయారీకి వాడే ముడిసరుకులు అమ్మిన వారి పైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. షరతులతో కూడిన బెయిల్ను ధిక్కరిస్తే ఆ బెయిల్ రద్దు కోరుతూ కోర్టు ఎదుట మెమో ఫైల్ చేశారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద రూ.2 లక్షల వరకూ నిందితుల బైండోవర్ చేస్తున్నారు. గత వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 698 నిందితులను బైండోవర్ చేశారు. బైండోవర్ బాండు అతిక్రమించిన వారి నుంచి సంబంధిత బాండు మొత్తాన్ని జరిమానాగా వసూలు చేశారు. బెల్లం వ్యాపారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సారా తయారీదార్లకు అమ్మకాలు జరపకూడదని హెచ్చరించారు. సారా అమ్మకాలు, తయారు చేసే 30 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచేలా చర్యలు చేపట్టారు. కేసుల విచారణలో పురోగతి, లోపాల సవరణ కోసం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ), స్టేషన్ అధికారులకు, కోర్టు కానిస్టేబుల్లతో కలిపి ఎస్పీచే స్పెషల్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసుల భాగస్వామ్యం ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ రమాదేవి జిల్లాలోని 300 మంది మహిళా పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సారా తయారీ, అమ్మకాలు లేకుండా చేసేందుకు ఎప్పటికప్పుడు పోలీసులకు, ఎస్ఈబీ అధికారులకు సమాచారం అందించి సారా రహిత గ్రామాలుగా మార్చడంలో భాగస్వాములను చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా జీవనోపాధి చూపిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో, సారా అమ్మకాన్ని జీవనోపాధిగా తీసుకున్న కుటుంబాలను గుర్తిస్తున్నారు. సారాకు బానిసైన వారిని డీ–అడిక్షన్ సెంటర్లలో చేర్చి, సారా మానేసేలా చేయాలని ఎస్ఈబీ జేడీ రమాదేవి ఆదేశించారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూము ఫోన్ నంబర్ 94932 06171కు 24 గంటలూ సారాపై ఫిర్యాదులు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఇలా అనేక విధాలుగా సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్ ప్రభావం ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 200 కేసులు నమోదు చేసి 149 మందిని అరెస్టు చేశారు. 3,639.5 లీటర్ల సారా, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 80,300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 575 మందిని బైండోవర్ చేశారు. బ్రీచ్ అయిన వారి నుంచి రూ.1.25 లక్షలు వసూలు చేశారు. సారా రహిత గ్రామాలుగా.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు సారా తయారీకి మారుపేరైన కవలగొయ్యి, పిడింగొయ్యి, రఘునాథపురం గ్రామాల్లో సారా తయారీ, అమ్మకం 80 శాతం వరకు మాని వేరే పనుల్లోకి వెళుతున్నారు. వెంకటనగరం గ్రామం మీద ప్రత్యేకించి దృష్టి సారించి గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో సారాను పారదోలేందుకు వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సారా అమ్మకాలపై కఠిన చర్యలు జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు, సారా తయారీకి అవసరమైన ముడి సరకులు (బెల్లం తదితర పదార్థాలు) అమ్మినా, పెట్టుబడి పెట్టినా, ఆర్థిక సహకారం అందించినా ఏ ఒక్కరినీ ఉపేక్షించం. అందరి మీదా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసుల్లో పలుమార్లు అరెస్టు అయిన ముద్దాయిలపై పీడీ చట్టం ప్రయోగిస్తాం. సారా రహిత గ్రామాల కోసం ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈ బృహత్తర లక్ష్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వాములు కావాలి. – ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా -
ఆ ఊరిలో.. ట్యాక్స్ ఫ్రీ
ద్వారకాతిరుమల: ఆ ఊళ్లో కుళాయి పన్ను, ఇంటి పన్ను ఎవరూ కట్టక్కర్లేదు. ఆ గ్రామ పంచాయతీ చెరువులోని చేపలు కూడా గ్రామస్తులకు ఉచితమే. ఇప్పటికే ఓ ఏడాది పాటు అందివచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామం ఏడాది క్రితం నూతన పంచాయతీగా ఏర్పడింది. సుమారు 2 వేల జనాభా, 1,418 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారు. ఫలించకపోవడంతో చివరకు పోటీ అనివార్యమైంది. దీంతో శ్రీమంతుడిగా పేరున్న వైఎస్సార్ సీపీ నేత బొండాడ వెంకన్నబాబు తన తండ్రి నాగభూషణాన్ని పోటీకి దింపారు. ఆయనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు పంచాయతీకి కుళాయి, ఇంటి పన్నులు ఎవరూ చెల్లించక్కర్లేదని హామీ ఇచ్చారు. దాంతో పాటు ప్రస్తుత బకాయిలను కూడా తానే చెల్లిస్తానన్నారు. చేపల పెంపకానికి వినియోగిస్తున్న మందులు, వ్యర్థాల కారణంగా గ్రామంలోని పంచాయతీ చెరువు దుర్వాసన వెదజల్లుతోందని.. తన తండ్రి సర్పంచ్ అయిన తరువాత చెరువులో ఎటువంటి మందులు, వ్యర్థాలు వేయకుండా చేపలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో గొల్లగూడెంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గెలిచిన వెంటనే.. త్రిముఖ పోటీలో బొండాడ నాగభూషణం ప్రత్యర్థులపై 435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఏడాది పన్నులతో పాటు, అప్పటి వరకూ ఉన్న పన్ను బకాయిల మొత్తం రూ.9.50 లక్షలు పంచాయతీకి చెల్లించారు. గ్రామంలోని చెరువును రూ.1.50 లక్షలకు బహిరంగ వేలం ద్వారా మూడేళ్ల కాల పరిమితికి దక్కించుకుని, అందులో సహజసిద్ధంగా చేపల పెంపకం చేపట్టారు. ఆ చేపలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో.. అప్పటి వరకూ ఈ ట్యాక్స్ ఫ్రీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాదికి సంబంధించిన కుళాయి, ఇంటి పన్నుల సొమ్ము రూ.5.11 లక్షలను కొద్ది రోజుల క్రితమే పంచాయతీకి చెల్లించారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. రాష్ట్రంలోనే తొలి ట్యాక్స్ ఫ్రీ గ్రామంగా గొల్లగూడెం నిలుస్తోంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం ఆదర్శం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పంచాయతీ ట్యాక్స్లు ప్రజల తరఫున మేమే చెల్లిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహాయ సహకారాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. – బొండాడ వెంకన్నబాబు, సర్పంచ్ కుమారుడు నూరు శాతం పన్ను వసూలైంది గ్రామంలోని ప్రతి ఒక్కరి కుళా యి, ఇంటి పన్నులను సర్పంచ్ నాగభూషణం, ఆయన కుమారుడు వెంకన్నబాబు చెల్లిస్తున్నా రు. దీనివల్ల మా పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలవుతున్నాయి. ప న్ను వసూలు కోసం ఇంటింటిటీ తిరిగే బాధ తప్పింది. – జక్కంపూడి రాజేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గంధం బాధ తప్పింది గతంలో పంచాయతీ చెరువులో చేపల పెంపకం కోసం మందులు, వ్యర్థాలను వాడేవారు. దాంతో చెరువు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. అటుగా నడవలేకపోయేవాళ్లం. వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం దయవల్ల చెరువు బాగుపడింది. – ఎర్ర దుర్గ, గ్రామస్తురాలు పన్నుల భారం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం గ్రామంలోని సుమారు 700 గృహాలకు కుళాయి, ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు పన్నుల భారం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. – కొడవలూరి పద్మావతి, గ్రామస్తురాలు -
‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు
రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి శుక్రవారానికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల వాంఛ మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట దీనిని ఏర్పాటు చేసేందుకు ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి. ఎట్టకేలకు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని 22–6–2016న వెలసిన ఈ యూనివర్సిటీ స్వశక్తితో అచిరకాలంలోనే అభివృద్ధిని సాధిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటోంది. కరోనా ప్రభావాన్ని అధిగమిస్తూ ... రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ ప్రభావం సమాజాన్ని ఏవిధంగా ప్రభావితం చేసినా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ దానిని కూడా ఒక అవకాశంగా మార్చుకోగలిగింది. 2020 మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతవేయవలసి రావడంతో విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ తరుణంలో విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు ఆదేశాలను అనుసరించి ఆన్లైన్ క్లాసులతోపాటు వివిధ అంశాలపై నిష్టాతులతో వెబినార్లు నిర్వహించారు. ఈ వెబినార్ల నిర్వహణలో దేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రీతిలో వంద మార్కును దాటేయడంతో ఒకేసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులోను చోటు దక్కించుకోగలిగింది. జనావళికి కరోనా వైరస్ నుంచి ఎదురవుతున్న భయాందోళనను తొలగిస్తూ, ఆత్మస్థైర్యాన్ని అందించే విధంగా సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను కూడా ‘నన్నయ’ వర్సిటీ సైకాలజీ విభాగం అధ్యాపకులు అందించారు. 11 వేల పుస్తకాలతో ‘నన్నయ’ విజ్ఞాన భారతి క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో దాతలు అందించిన 11 వేల పుస్తకాలతో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ‘నన్నయ’ భారతిని ప్రారంభించారు. జె.స్టోర్, జె.గేట్ సేవలను కొనుగోలు చేసి విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సైన్స్ జర్నల్ని కూడా ‘నన్నయ’ విజ్ఞాన భారతిలో అందుబాటులోకి తెచ్చారు. ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం. ఇందుకు అవసరమైన కసరత్తు వేగంగా జరుగుతోంది. ఎస్ఎస్ఆర్ కూడా సమర్పించాం. కరోనా వైరస్ ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే ఐఎస్ఓ, ఏఐసీటీఈ గుర్తింపులు సాధించాం. ‘ఇంటర్నేషనల్ స్టూడెంట్ పోర్టల్ ద్వారా అంతర్జాతీయంగా విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. – ఆచార్య ఎం.జగన్నాథరావు, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ -
నాన్నను తీసుకొస్తానని వెళ్లి...
తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): కారులో భీమవరం వెళ్తున్న నాన్నను వెనక్కి తీసుకువస్తానని బైక్పై వెళ్లిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కోరంగి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన చింతలపూడి చంద్రశేఖర్ అక్కడి ఆంధ్రా పాలిటెక్నిక్ వద్ద పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు మల్లికార్జున్ అలియాస్ అర్జున్ (21) అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో బీడీఎస్ (దంత వైద్యులు) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖ ర్ పని మీద ఆదివారం వేకువన కారులో భీమవరం బయలుదేరారు. ఒంటరిగా వెళ్లవద్దని, అమ్మను కూడా వెంట తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ ఒక్కరే వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆపేందుకు అర్జున్ ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ తీయకపోవడంతో ఆయన కారును ఆపాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్పై కాకినాడ నుంచి బయలుదేరాడు. జాతీయ రహదారి 216లో కోరంగి పంచాయతీ సీతారామపురం పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి అతడి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ను రోడ్ సేఫ్టీ పోలీస్ కానిస్టేబుల్ స్థానిక సీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అర్జున్ మృతి చెందాడు. విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకూ తమకు లేకుండా పోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. రోజూ తన పాదాలకు నమస్కరించాకే కళాశాలకు బయలుదేరేవాడని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ‘నన్నయినా నీతో తీసుకువెళ్లు.. లేదా అమ్మనైనా తీసుకువెళ్లు’ అని చెప్పిన కొడుకుతో ‘ఈ రోజు ఆదివారం కదా! అమ్మతో పాటు ఇంటి వద్ద ఉండు. నేను భీమవరం వెళ్లి వస్తాను’ అని చెప్పి చంద్రశేఖర్ బయలుదేరారు. అమలాపురం చేరేసరికి కొడుకు ప్రమాదానికి గురయ్యాడనే సమాచారం తెలియడంతో తల్లడిల్లిపోయారు. బీడీఎస్ ఫస్టియర్ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణుడైన అర్జున్ తమందరిలో చురుకుగా ఉండేవాడని, అతడి హఠాన్మరణం తమను కలచివేసిందని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!
అడవిని వదిలి ఒకరింట్లో ఆదరణ పొందుతున్న జింక తిరిగి వెళ్లనంటోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి అటవీ ప్రాంతానికి చేరువలోని లక్కవరప్పాడులో రెండేళ్ల క్రితం రెండు నెలల వయసున్న చుక్కల జింక దారి తప్పి వచ్చేసింది. గూనా చిన్నోడు–దేవి దంపతులు చూసి దీనిని తమ బిడ్డలా పెంచుతున్నారు. గూనా చిన్నోడు, దేవి దంపతుల ఇంటికి వచ్చిన జింక పిల్ల ఇదే (ఫైల్).. ఆ జింక ఆ కుటుంబంతోనే కాదు ఊరంతా కలియతిరుగుతూ అందరికీ చేరువైంది. ఇటీవల అటవీ అధికారులు ఈ వన్య ప్రాణిని గమనించారు. చిన్నోడు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి దానిని సమీప అడవుల్లో వదిలి వచ్చారు. అయితే ఆ జింక మర్నాడే తిరిగి వచ్చేసింది. దీంతో చిన్నోడు దంపతులు దానిని ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. –రాజవొమ్మంగి -
ఇది మీకు తెలుసా?.. పాండవులు బంగారాన్ని ఇక్కడే దాచారట!
అల్లవరం(తూర్పుగోదావరి జిల్లా): శతాబ్దాలుగా చరిత్రకు అందని అనేక విషయాలు కాలగమనంలో కలిసిపోతున్నాయి. కొత్త నీరు రాకతో పాతనీరు పోతుందనే మాదిరిగా పురాణ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ఆలయాలు, రాజులు పాలించిన నగరాలు సైతం చరిత్ర పుటల్లోకెక్కని విశేషాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే. అలాంటివి అల్లవరం మండలంలో ఓడలరేవు, దేవగుప్తం గ్రామాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట విశేష ఆదరణ పొంది నేడు ఆయా ఊర్ల పేర్లతో పిలువబడుతున్నాయి. ఆంగ్లేయులు వర్తకం పేరుతో భారతదేశ సంపదను తమ దేశానికి తరలించుకు పోవడానికి వారికి అనువైన ప్రాంతాలను ఎంచుకుని ఇక్కడ దొరికే ముడి సరుకును ఎగుమతి చేసుకునేందుకు అల్లవరం మండలం ఓడలరేవులో ఓడరేవుని ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ తెలియదు. దేవగుప్తంలో అప్పట్లో రాజుల కోట ఉన్న ప్రాంతం ఇలా.. ఆంగ్లేయులు వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఓడరేవు నేడు ఓడలరేవుగా రూపాంతరం చెందింది. ఇక్కడ తెర చాప ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహించే వారని ప్రసిద్ధి. అల్లవరం మండల పరిసర ప్రాంతాల్లో లభించే డొక్క తాడు, ధాన్యం, ఆముదాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరినార వంటి ఉత్పత్తులు రంగూన్, ఇండోనేషియా, అండమాన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. చిరు ధాన్యాలు, ఉక్కు, టేకు కలప, నూనెలు ఇక్కడ ప్రజల అవసరాలకు దిగుమతి చేసుకునేవారు. అలా ఓడల వ్యాపారంగా ప్రసిద్ధి చెందిన ఓడరేవు నేడు ఓడలరేవుగా పిలువబడుతోంది. ఇది మీకు తెలుసా? మండలంలో చరిత్రకెక్కని మరో గ్రామం దేవగుప్తం. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం గుప్తుల కాలానికి చెందిన దేవగుప్తుడు అనే రాజు ఇక్కడ నుంచి పాలన సాగించారని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని కోటమెరకగా ఇప్పటికీ పిలుస్తుంటారు. ఇక్కడ చాలా మందికి ఇళ్ల నిర్మాణ సమయాల్లో లంకె బిందెలు దొరికినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి వద్ద ఉన్న బంగారాన్ని ఈ గ్రామంలో ఓ చోట దాచిపెట్టారని, అందుకే దేవగుప్తంగా పిలుస్తున్నారని నమ్మకం. -
దుప్పలపూడి కేంద్రంగా కల్తీ టీ పొడి దందా
-
సీఎం జగన్ పాలన అద్భుతంగా ఉంది: సినీ నటుడు అలీ
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అద్భుతంగా ఉందని సినీ నటుడు అలీ అన్నారు. కేఎల్యూ డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్ జగన్ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. చదవండి: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్లో సమస్యగా మారిన ఆన్లైన్ టికెట్ల విధానం, బెనిఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, హామీ కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందన్నారు. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. -
తూర్పుగోదావరి: ఆడుకోడానికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం
సాక్షి, తూర్పుగోదావరి: కడియం మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధఙలోని బుర్రిలంకలో మైనర్ బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక నర్సరీలో పనిచేసేందుకు విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం, వీరనారాయణపురానికి చెందిన భార్యభర్తలు, తమ ఇద్దరు కుమార్తెలతో వచ్చారు. వీరు ఉండే ఇంటికి సమీపంలోనే నివాసం ఉండే మారాజు కన్నంనాయుడు వీరి అయిదేళ్ల కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకునేందుకు వెళ్లిన కుమార్తె ఇంతకీ రాకపోవడంతో ఆమెను వెతుక్కుఉంటూ వెళ్లిన తల్లి కన్నంనాయుడు ఇంట్లో గుర్తించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు గమనించిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడియం ఎస్సై షేక్ అమీనా బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ డీఎస్పీ కె. తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి తల్లిదందడ్రుతో మాట్లాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి -
జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ
సాక్షి, అమలాపురం టౌన్: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సమావేశం జరుగుతున్న సమయంలో సమనస, ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్రమై, సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి చేరింది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) కేకలు, అరుపులతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. రాజబాబుకు, నియోజకవర్గంలోని కొంత మంది మధ్య ఇటీవల దూరం పెరిగింది. పార్టీ రెండు వర్గాలుగా మారింది. మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు యాళ్ల నాగ సతీష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు కొన్ని నెలల కిందటే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికను రాజబాబు అడ్డుకుంటున్నారని సతీష్తో పాటు పార్టీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల అమలాపురం రావడంతో పార్టీ ఇన్చార్జి రాజబాబు ప్రమేయం లేకుండానే మరో వర్గంగా ఉంటున్న పార్టీ నాయకులతో కలిసి సతీష్ జనసేనలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అప్పటికే నియోజకవర్గ పార్టీలో నాయకులు రెండుగా చీలిపోవడంతో ఇన్నాళ్లూ చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం చర్చనీయాంశమైంది. -
‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్ప్రెడ్నిసోలాన్ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. వారి సాచ్యురేషన్ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్మెక్ట్ర్న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు. తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ డిసీజెస్’లో సమర్పించినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్ గ్రూప్ స్కోపస్ ఇండెక్స్ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. -
అక్కడ సినిమా తీస్తే.. బంపర్ హిట్టే..
వేకువనే నిదుర లేపుతున్న పక్షుల కిలకిల రావాలు.. మంచుపరదాల ముసుగుల్లో మసక కాంతులు.. తల్లి పాల కోసం లేగ దూడల అరుపులు.. పచ్చని పంట పొలాలు.. కొబ్బరి తోటలు.. కార్మికుల శ్రమ జీవన సౌందర్యం.. బంధాలను పెనవేసుకున్న మండువా లోగిళ్లు.. హృదయాన్ని హత్తుకుని ఊయలలూపే ఇటువంటి సౌందర్యాన్ని చూడాలంటే పల్లెల్లోకి.. అందునా కోనసీమ పల్లెల్లోకి అడుగు పెట్టాల్సిందే. ఎంతటి వారైనా అక్కడ అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మరచిపోవాల్సిందే.. ఆ పల్లె వాతావరణానికి మంత్రముగ్ధులవ్వాల్సిందే. అల్లవరం మండలంలోని కోడూరుపాడు, గూడాల అటువంటి పల్లెలే. గూడాలలో పోలిశెట్టి భాస్కరరావు మండువా లోగిలి ముందు శతమానంభవతి చిత్రం తారాగణం సాక్షి, అల్లవరం (తూర్పుగోదావరి): కోడూరుపాడు, గూడాల గ్రామాలకు.. తెలుగు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. 1962 నుంచి అనేక సినిమాలు ఈ రెండు గ్రామాల నుంచి తెరకెక్కాయి. ఇక్కడ తీసిన సినిమాలు బంపర్ హిట్టు అవుతాయనే సెంటిమెంట్ బలంగా ఉంది. కోడూరుపాడు, గూడాల గ్రామాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరించాలని నిర్మాతలు, హీరోలు కోరుకుంటారు. ఎన్టీఆర్, శోభన్బాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శర్వానంద్, ప్రకాష్రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, నాని, విజయశాంతి, జయసుధ, జీవిత, హేమ వంటి హేమాహేమీలు ఇక్కడ తీసిన అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్నే కాకుండా బాలీవుడ్ హీరోలను కూడా ఈ రెండు గ్రామాలు ఆకర్షించాయి. జీవనజ్యోతి, భానుమతి గారి మొగుడు, శివయ్య, శతమానంభవతి, అష్టాచమ్మా, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో అనేక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ఖాన్ తీస్తున్న లాల్సింగ్ చద్దా సినిమాలోని పలు సన్నివేశాలను ఇటీవల కోడూరుపాడులో చిత్రీకరించారు. దీంతో ఈ గ్రామాల ఖ్యాతి మరింత పెరిగింది. లాల్సింగ్ చద్దా చిత్రం షూటింగ్ కోసం కోడూరుపాడులో సందడి చేసిన బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ఖాన్ గూడాలలో ఎకరం విస్తీర్ణంలో వందేళ్ల క్రితం నిర్మించిన పోలిశెట్టి భాస్కరరావుకు చెందిన మండువా లోగిలిలో 2009లో తొలిసారిగా అష్టాచమ్మా సినిమా తీశారు. ఈ సినిమా నుంచే తెలుగు సినిమా రంగానికి నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా పరిచయమయ్యారు. బాలీవుడ్ నిర్మాత నితిన్ తివారీ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ యాడ్ ఇక్కడే తీశారు. నాలుగు స్తంభాలాట సీరియల్ ఇక్కడే చిత్రీకరించారు. శర్వానంద్ హీరోగా ఇక్కడి మండువా లోగిళ్లలో పల్లె వాతావరణంలో తీసిన శతమానం భవతి చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. నితిన్ హీరోగా కోడూరుపాడులో తీసిన శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా సక్సెస్ సాధించింది. ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్కృష్ణ, వేగేశ్న సతీష్తో పాటు దిల్రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ గ్రామాల్లో సినిమా తీయడం సెంటిమెంట్గా భావిస్తున్నారని పోలిశెట్టి భాస్కరరావు తెలిపారు. అష్టాచమ్మా సినిమా : కోడూరుపాడులోని పెంకుటిశాల వద్ద హీరో నాని -
ఆ అవకాశాం వస్తే ఎందుకు చేయను?: నందితా శ్వేత
సాక్షి, మలికిపురం: గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందని సినీ నటి నందితా శ్వేత అన్నారు. విజయానంద్ పిక్చర్స్ బ్యానర్పై జి.వెంకట సత్యప్రసాద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రారా.. నా పెనిమిటి’ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె ప్రస్తుతం రాజోలు దీవిలో ఉన్నారు. గోదావరి లంకల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మలికిపురంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ► ‘రారా.. నా పెనిమిటి’ సినిమా మీకు ఎన్నో చిత్రం? నందితా శ్వేత: గతంలో నితిన్తో శ్రీనివాస కళ్యాణం, ‘అక్షర’తో పాటు నిఖిల్తో ఒక సినిమా చేశారు. ఇది నాలుగో సినిమా. ► తెలుగు సినీ పరిశ్రమలో మీకు లభిస్తున్న ఆదరణ ఏవిధంగా ఉంది? నందితా శ్వేత: నా చిత్రాలతో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనంతో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తారు. ► పెద్ద హీరోలతో అవకాశాలు రావట్లేదా? నందితా శ్వేత: ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు వస్తే ఎందుకు చేయను? ► ఇంతకు ముందు ఎప్పుడైనా కోస్తా తీరానికి వచ్చారా? నందితా శ్వేత: లేదు. ఈ చిత్రం కోసమే వచ్చాను. ► ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? నందితా శ్వేత: చాలా బాగుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాం. చక్కటి వాతావరణం. గోదావరి నదీ పాయలు, కొబ్బరి తోటలు, పంట పొలాలూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ప్రజల మర్యాద, వద్దన్నా వినకుండా మరీమరీ అడిగి వడ్డించి, తినిపించే ఆత్మీయత, వారి పలకరింపులు చాలా బాగున్నాయి. కోనసీమ వంటకాలు కూడా చాలా బాగున్నాయ్. ఉల్లిపాయలు, కోడిగుడ్డుతో చేసే ఆమ్లెట్ మరీ రుచిగా ఉంది. -
చలానా కుంభకోణంలో ఒక్కరే సూత్రధారి?
సాక్షి, తూర్పుగోదావరి: అన్నీ తానయ్యాడు.. అందరినీ నమ్మించాడు.. అవకాశం చూశాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. నకిలీ చలానా కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చలానాల అవకతవకల కేసులో సూత్రధారి ఒక్కడేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చలానా కుంభకోణం బయట పడిన తరువాత జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆలమూరులో చలానా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 20 వరకూ 2,388 రిజిస్టేషన్లు జరగ్గా, వీటిలో 39 బోగస్గా నిర్ధారించి రూ.7,31,510 దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ లావాదేవీలన్నీ ఓ అనధికార ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. కుంభకోణానికి అసలు సూత్రధారి అని భావిస్తున్న ప్రైవేటు ఉద్యోగి నుంచే దుర్వినియోగమైన సొమ్మును సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది రికవరీ చేసినా, అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బోగస్ చలానా కుంభకోణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ ఉద్యోగి సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయట పడిన వెంటనే అతడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు అందరిదీ ఆ మాటే.. చలానా కుంభకోణంపై ఎట్టకేలకు ఫిర్యాదు అందడంతో ఆలమూరు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్, ఎస్సై ఎస్.శివప్రసాద్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్టార్ ఎ.సునందశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోగస్ చలానా దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేసేందుకు వచ్చిన సీఐ శివగణేష్కు దస్తావేజు లేఖర్లంతా ఆ అనధికార ఉద్యోగి పైనే ఫిర్యాదు చేశారు. బోగస్గా తేల్చిన చలానాలన్నీ రెండు బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని, వాటిల్లో పొందుపరచిన ఫోన్ నంబర్లు కూడా అతడివేనని చెప్పారు. దుర్వినియోగమైన సొమ్ము కూడా అతడి ఖాతా నుంచే రికవరీ అయ్యిందని తెలిపారు. బోగస్గా గుర్తించిన 39 చలానాల్లో అత్యధికంగా డి.దుర్గాప్రసాద్ 30, వై.శ్రీరామచంద్రమూర్తి 6, పి.భగవాన్, టి.జి.కృష్ణకు చెందిన ఒక్కొక్కటి ఉన్నాయి. పినపళ్లకు చెందిన కె.వెంకటరమణకు చెందిన బ్యాంకు డాక్యుమెంటూ బోగస్ చలానాలో ఉంది. కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ చెప్పారు. చదవండి: ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ అన్నీ అతనై.. కంప్యూటర్ వర్క్లో నిష్ణాతుడు కావడంతో అత్తిలి నవీన్కుమార్ అనే వ్యక్తిని ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అనధికారికంగా రోజువారీ వేతనంపై నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగంగా చేస్తాడనే కారణంగా కొంతమంది దస్తావేజు లేఖర్లు కూడా బ్యాంకుకు వెళ్లే పని లేకుండా నేరుగా అతడికే సొమ్ము చెల్లించి, అతడి బ్యాంకు ఖాతా ద్వారానే చలానాలు తీసుకునేవారు. ఇదే అదనుగా అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీఎఫ్ఎంఎస్ విధానంలో పీడీఎఫ్లో ఉన్న చలానాను మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి మార్చి రూ.లక్షల అక్రమాలకు పాల్పడ్డాడని సమాచారం. సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులకు నమ్మకంగా ఉంటూ ఓ ఉద్యోగి లాగిన్ నుంచే బోగస్ చలానాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, కొంతమంది దస్తావేజు లేఖర్ల స్వార్థంతో 39 చలనాల్లో అక్రమాలకు ఇతడు కారణమయ్యాడు. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయిలా.. ► ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 20 వరకూ రిజిస్ట్రేషన్లు: 2,388 ► వీటిలో బోగస్ చలానాలు : 39 ► రికవరీ చేసినది : రూ.7,31,510 -
ఒలింపిక్స్లో కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్
అమలాపురం: ఒక తండ్రి 30 ఏళ్ల కల నిజం అయ్యింది. ఒక తల్లి చేసిన పూజలు.. వ్రతాలు ఫలించాయి. ఒక యువకుడి జీవిత లక్ష్యం నెరవేరింది. ప్రతి క్రీడాకారుడు కలలుకనేది ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్, అతని తల్లిదండ్రుల కల కూడా అదే. ఒలిపింక్ క్రీడావేదికపై సాత్విక్ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే. ఆ కల శనివారం నెరవేరనుంది. విశ్వక్రీడల్లో క్రీడా యుద్ధానికి సాత్విక్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్లో తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నాడు. సాత్విక్, చిరాగ్ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సాత్విక్ తన గురువు పుల్లెల గోపీచంద్ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనాలనే కల నెరవేరింది. మనదేశం తరఫున ఆడుతున్నానే ఫీలింగ్ ఉత్సాహాన్ని నింపిందని టోక్యో వెళుతూ సాత్విక్ ‘సాక్షి’తో అన్నాడు. ట్రాక్ రికార్డు ► 2018 ఆస్ట్రేలియా కామన్వెల్త్ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ టీమ్ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్ మెడల్ ► డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి సిల్వర్ మెడల్ ► 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయిలాండ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణపతకాలు ► 2018 సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్ ► డబుల్స్లో చిరాగ్ శెట్టితో 2016లో మౌరిటీస్ ఇంటర్ నేషనల్, ఇండియన్ ఇంటర్నేషనల్ సిరీస్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజయం చాలా సంతోషంగా ఉంది నేను షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడ్ని. అందుకే నా ఇద్దరు కుమారులను ఆ క్రీడలో ప్రోత్సహించాను. ఒక్కరైనా దేశం తరఫున ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. అది నెరవేరబోతోంది. ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాయామోపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులకు ఒలింపిక్స్ గురించి గర్వంగా చెప్పేవాడిని. ఇప్పుడు నా కొడుకు ఆ క్రీడల్లో పాల్గొనడం.. చెప్పేందుకు మాటలు రావడం లేదు. – ఆర్.కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి, అమలాపురం -
రైతు భరోసా యాత్రలకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. వీటిని వివరిస్తూనే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశు సంవర్ధక శాఖల సమన్వయంతో ఈ నెల 23 వరకు యాత్రలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10,544 ఆర్బీకేల్లో ఈ యాత్రలకు శ్రీకారం చుట్టారు. వీటిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులతో మమేకమయ్యారు. రైతుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం వైఎస్సార్ రైతు భరోసా యాత్రలకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సీహెచ్సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన యాత్రల్లో తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని వినిపించారు. యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే వారి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్ సాగు సన్నద్ధత, మార్కెటింగ్కు అనువైన రకాల సాగు, యాజమాన్య పద్ధతులు, ఇతర మెళకువలపై శాస్త్రవేత్తలు వివరించారు. రైతులతో ముఖాముఖిలో వారడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సాగు పద్ధతులపై నమూనా ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేశారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్న యంత్ర పరికరాలు, వాటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి.. సాగులో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సీఎం యాప్, ఈ–క్రాపింగ్ బుకింగ్ ఆవశ్యకతపై వివరిస్తాం. శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు రైతులతో భేటీ అవుతూ క్షేత్ర స్థాయిలో వారెదుర్కొనే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
విషాదం: పెళ్లైన వారానికే నవ వధువు ఆత్మహత్య
మధురపూడి(తూర్పుగోదావరి): ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన కోరుకొండ మండలం గాదరాడలో సోమవారం సంచలనం రేపింది. ఈ నెల 29న సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన అశ్విని స్వాతి(19)కి గాదరాడకు చెందిన కనుమరెడ్డి అశోక్తో వివాహం జరిగింది. అత్తవారు కొత్తగా కట్టుకున్న ఇంటిలో రెండు రోజుల క్రితం గృహ ప్రవేశం కూడా చేసింది. ఇంతలో ఏమైందో ఏమో ఆ కొత్త ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిసరాలను పరిశీలించారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడేళ్ల క్రితమే ఈ వివాహం చేసేందుకు పెద్దలు అంగీకారం కుదుర్చుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే అశోక్ 5వ తరగతి వరకే చదువుకోగా, 7వ తరగతి వరకు చదివిన స్వాతి మైనార్టీ తీరే వరకు ఆగారు. ఈ పెళ్లి ఇష్టం లేక స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. -
బంజారాహిల్స్: ప్రియుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
బంజారాహిల్స్: మైనార్టీ తీరకున్నా పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి బెదిరింపులను భరించలేక మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) 5వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అనే యువకుడితో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామంటూ దుర్గాభవానీ తండ్రి శ్యామ్సన్ వద్దకు వెళ్లి అడగగా మందలించాడు. మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించాడు. దీంతో ఐదు రోజుల క్రితం దుర్గాభవానీ ఇంట్లోంచి చెప్పకుండా వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్.2లోని ఇందిరానగర్లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి శ్యామ్సన్కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో శనివారం ఉదయం శ్యామ్సన్ నగరానికి వచ్చాడు. కూతురు దుర్గాభవానీతో మాట్లాడి నచ్చ జెప్పాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కల్యాణ్ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగడంతో పాటు పెళ్లికి అంగీకరించకపోతే శ్యామ్సన్ను, దుర్గాభవానీని చంపేస్తానంటూ బెధిరించి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై రోజంతా కుటుంబ సభ్యులు చర్చించారు. సాయంత్రం పనిమీద శ్యామ్సన్తో పాటు మిగిలిన వారు బయటికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. ఆలోగా ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి చావుకు కల్యాణ్ బెదిరింపులే కారణమంటూ ఆదివారం మృతురాలి తండ్రి శ్యామ్సన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలిసి.. -
పకోడి బండి వద్ద వివాదం.. టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలోని వీరవరంలో దారుణం చోటుచేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. చదవండి: రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం -
సీఎం జగన్కు రుణపడి ఉంటా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు. ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా ప్రగతి పథంలో 'పల్లెలు'.. అభివృద్ధి పరుగులు -
‘కరోనా సోకిన 163 మంది విద్యార్థులకు ప్రత్యేక వైద్యం’
సాక్షి,విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఆళ్లనాని ఫోన్లో మాట్లాడారు. వెంటనే కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇతర విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 'కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులకు 24గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. తిరుమల జూనియర్ కాలేజీ లో 400మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందోస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి' అని ఆళ్లనాని తెలిపారు. చదవండి : పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి -
సర్పవరం టైకీ పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో బల్క్డ్రగ్స్ తయారీకి పైపులద్వారా గ్యాస్లైన్ రియాక్టర్కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్హైడ్రేడ్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీశబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందారు. వారి దేహాలు ఛిద్రమైపోయాయి. అక్కడికి సమీపంలో విధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, భారీగా పొగలు రావడంతో ఏం జరిగిందో తెలియక సర్పవరం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డితో డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్యం అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గౌతమ్రెడ్డి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం టైకీ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో నలుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్య తప్పిదాల వల్ల కార్మికులకు, స్థానికులకు నష్టం జరిగితే సహించబోమని, యాజమాన్య లోపం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. వచ్చేది వేసవి కాలం కావడంతో పెరిగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఫార్మా, కెమికల్స్ వంటి ప్రమాదాలు జరిగే పరిశ్రమలను గుర్తించి, ముందస్తుగా రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులను మంత్రి గౌతమ్రెడ్డి ఆదేశించారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
అదిగో అరుదైన ‘అతిథి’ ఎర్ర బొరవ!
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం ఈ రాబందులు అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్చరణ్. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్లో చరణ్పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ సైతం పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్ ప్లాన్ చేసింది ఆచార్య యూనిట్. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్లో షూటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్ మాత్రమే కాకుండా లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్కు రామ్చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల
సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! -
'దొంగ' పనిమనిషి అరెస్ట్
సాక్షి, అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): ఓ వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన రోజే రూ.8.60 లక్షల విలువైన 23 కాసుల బంగారు నగలను దోచుకెళ్లిన మాయ‘లేడీ’ని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తు అంతా ఆమె నుంచి రికవరీ చేశారు. అమలాపురం కల్వకొలనువీధిలో పక్షవాతంతో మంచంపై చికిత్స పొందుతున్న పలచర్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్దురాలికి సపర్యలు కోసం పనిమనిషిగా ఎరువ మేరీ సునీత రావడం..వచ్చిన రోజే అంటే ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారు నగలతో పరారు కావడం వంటి పరిణామాలు తెలిసిందే. పనిమనిషిగా చేరి చోరీకి పాల్పడిన 42 ఏళ్ల మేరీ సునీత గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామవాసిగా అమలాపురం పోలీసులు గుర్తించారు. చోరీ జరగగానే విజయవాడ, హైదరాబాద్కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు ఆమెను వెంటాడి అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. విజయవాడ శ్రీనివాస హోం కేర్ సర్వీస్ సెంటర్ ద్వారా మేరీ సునీతను అమలాపురంలో అనంతలక్ష్మి వద్ద పనిమనిషిగా పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకు అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద మేరీ సునీతను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న రూ.8.60 లక్షల విలువైన బంగారు నగలను డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చూపించి, వివరాలను వెల్లడించారు. (చదవండి: తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు) ప్రతిచోటా పనిమనిషి ముసుగులోనే చోరీలు గత కొన్నేళ్లుగా ధనికులైన వృద్ధుల వద్ద సపర్యలకు పనిమనిషిగా చేరి ఆ ముసుగులో చోరీ చేయడంలో మేరీ సునీత చేయి తిరిగిన నేరస్థురాలని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ తరహాలో హైదరాబాద్లో ఆమె 11 కేసులు, విశాఖపట్నంలో రెండు కేసుల్లో నిందితురాలు. ఈ 13 కేసులకు సంబంధించి మూడు కేసుల్లో జైల్లో శిక్షలు కూడా అనుభవించిందని చెప్పారు. అమలాపురం చోరీ కేసుకు సంబంధించి ఆమె ఎంత బంగారం దోచుకెళ్లిందో అంత బంగారాన్ని కేవలం రెండు రోజుల్లో సీఐ బాజీలాల్ బృందం రికవరీ చేసిందన్నారు. మేరీ సునీత సెల్ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతికత సహాయంతో ఆమె కదలికలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ కేసులో డీఎస్పీ మాధవరెడ్డి, ఇన్చార్జి డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సీఐ బాజీలాల్, పట్టణ ఎస్సైలు ఎం.ఏసుబాబు, కె.చిరంజీవి, జిల్లా ఐటీ కోర్ క్రైమ్ ఎస్సై ఎం.ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు మల్లాడి హరిబాబు, రమేష్బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం.మూర్తి, సీహెచ్ మాధవిలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అభినందించారు. -
రోజూ సైకిల్పై 18 కి.మీ. పయనం: గ్రూప్–2 విజేత
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: నాన్న చిరుద్యోగి.. ఆయన ప్రోత్సాహంతో ఎంత కష్టమైన 18 కిలోమీటర్లు రోజూ రాజమహేంద్రవరం వెళ్లి చదువుకున్నా.. ఇంటిలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు లేరని నాన్న అన్న మాట తనలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పాన్ని దృఢపరిచింది. సచివాలయ సెక్రటరీ ఉద్యోగం వచ్చినా, ఇప్పుడు గ్రూప్–2లో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా విజయం సాధించగలిగినా నాన్న మాటలే స్ఫూర్తి అని అన్నారు రాయుడుపాకలు గ్రామానికి చెందిన దాసి చిన్నబ్బులు. రాయుడుపాకలు గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసే దాసి దేవదానం, వెంకటలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నవాడైన చిన్నబ్బులు పదో తరగతి పాలచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ నుంచి ఎంఎస్సీ(ఆర్గానిక్), బీఎడ్ వరకు రాజమహేంద్రవరంలోనే చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యం 18 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లి వచ్చేవాడు. మన ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని తండ్రి దేవదానం అన్నమాట అతనికి స్ఫూర్తినిచ్చింది. దాంతో 2015 నుంచి గ్రూప్స్లో విజయం సాధించాలని కృషి చేశాడు. 2017లో జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో రెండు మార్కుల తేడాతో అర్హత కోల్పోయాడు. అప్పుడు చాలామంది నీకు ఉద్యోగం రాదులే అని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో 2019లో గ్రూప్–2, గ్రూప్–3లతో పాటు సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో నిబద్ధతతో చదివి పరీక్షలు రాసి విజయం సాధించాడు. వార్డు సచివాలయంలో శానిటేషన్ అసిస్టెంట్, గ్రేడ్–5 సచివాలయ సెక్రటరీ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో కాతేరు గ్రామ సచివాలయం–2 సెక్రటరీగా విధుల్లో చేరారు. ఆ తరువాత గ్రూప్–3లో గ్రేడ్–4 పంచాతీ కార్యదర్శిగా ఉద్యోగం వస్తే వెళ్లలేదు. ఆ తరువాత గ్రూప్–2 పరీక్షల్లోను, ప్రిలిమినరీ, ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించడంతో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా ఉద్యోగానికి నియమితుడయ్యాడు. తనకు గ్రూప్–1 సాధించడమే లక్ష్యమని దాసి చిన్నబ్బులు ఘంటాపథంగా చెబుతున్నారు. -
రౌడీ షీటర్ను చంపి, భార్య పుస్తెల తాడు లాక్కొని
సాక్షి, పెదపూడి(తూర్పు గోదావరి): జి.మామిడాడలో రౌడీషీటర్ హత్యకు గురైనట్టు కాకినాడ రూరల్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామంలో డీఆర్కే నగర్లో రౌడీషీటర్ మేడపాటి సూర్యనారాయణరెడ్డి(30) అలియాస్ యాసిడ్ సూరి అనే వ్యక్తి జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సూర్యనారాయణరెడ్డి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి గొంతుపై తీవ్రగాయలయ్యాయి. భర్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న భార్య శ్రావ్య చేతిపైనా గాయాలయ్యాయి. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని దుండగులు పరారయ్యారు. వెంటనే సూర్యనారాయణరెడ్డిని 108 వాహనంలో పెదపూడి సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావ్యకు చికిత్స అందించారు. శ్రావ్య ఫిర్యాదు పై స్థానిక ఎస్సై టి.క్రాంతికుమార్ కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కాకినాడ తరలించారు. మృతుడు గతేడాది మార్చిలో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ జి.మామిడాడలో హత్య జరిగిన స్థలాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ భీమారావు సందర్శించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులు, చుట్టు పక్కల వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో కరప, గొల్లపాలెం ఎస్సైలు డి.రామారావు, పవన్కుమార్ ఉన్నారు. పోలీసు పికెట్ కొనసాగుతుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: ఏమైంది తల్లీ...) గొంతు కోసుకొని.. బ్రిడ్జిపై నుంచి దూకి.. ఏం కష్టం వచ్చిందో తెలియదు.. జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పిఠాపురంలో మణికంఠ అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే.. అమలాపురం రూరల్ పరిధిలో బోడసకుర్రు బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వీరిద్దరినీ స్థానికులు సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ► జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం పిఠాపురం: ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మంగళవారం పిఠాపురం పక్షులమర్రి సెంటర్ వీధిలో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో తన కంఠాన్ని కోసుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని పట్టణ ఎస్సై శంకర్రావు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకున్న వ్యక్తి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం, అతడిని ఎవరూ గుర్తుపట్టక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వ్యక్తి తమవాడేనంటూ అతడి బంధవులు రావడంతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన చింతా మణికంఠగా పోలీసులు గుర్తించారు. బాధితుడు వడ్రంగి పని చేస్తుంటాడని, ఇటీవల రౌతులపూడిలో వడ్రంగి పనికి వెళ్లి అక్కడ పని చేస్తూ రెండు రోజుల క్రితం ఇంటి వచ్చేస్తున్నట్టు బంధువులకు సమాచారం ఇచ్చాడని, కానీ ఇంటికి వెళ్లలేదు. ఇంతలో మంగళవారం పిఠాపురంలో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం అంటు సోషల్ మీడియాలో కథనం రావడంతో గుర్తుపట్టిన బంధువులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. పట్టణ ఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని, అతడు అప్పుడప్పుడూ మానసికంగా బాధపడుతుంటాడని బంధువులు తెలిపారు. బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి దూకి.. అల్లవరం: అమలాపురం రూరల్ పరిధిలోని తాండవపల్లి గ్రామానికి చెందిన సత్తి శ్రీమన్నారాయణ బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి మంగళవారం సాయంత్రం వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ బ్రిడ్జిపై సైకిల్, చెప్పలు వదిలి పై నుంచి నదిలోకి దూకేశాడు. బ్రిడ్జి కింద చేపల వేట సాగిస్తున్న బొమ్మిడి ముత్యాలరావు ఇది గమనించి అతడిని కాపాడి తన బోటులో స్థానికుల సహకారంతో గట్టుకి చేర్చాడు. బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకడంతో శ్రీమన్నారాయణ నడుముకి దెబ్బ తగిలిందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై 108కి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానికుడు పరమేష్ తెలిపారు. అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక తన పేరు మాత్రమే చెప్పాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో చెప్పలేదని స్థానికులు తెలిపారు. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్.. భూమి..
సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్. బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్’ ప్రారంభించాడు. దివాన్చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్ఫోన్ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు. ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా.. తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్. -
ఏమైంది తల్లీ...
అందరికీ ప్రాణం పోసే తల్లివి నీవు.. ఏమైందమ్మా.. నవమాసాలు మోసి కన్న బిడ్డనే కాదనుకున్నావు.. ఆ బిడ్డతో నీవూ అనంత లోకాలకు వెళ్లిపోయావు.. ప్రాణం పోయే వారికీ మందులిచ్చి దేవుడిలా ఆదుకునే నువ్వే ఎందుకిలా చేశావో.. అంత కష్టం ఏమొచ్చిందో.. ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావంటూ ఆ తల్లీబిడ్డల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఓ వైద్యురాలు తన కుమారుడితో సహా బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలహాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.. చివరికి ఆత్మహత్యకు పురిగొల్పాయి.. ఈ నేపథ్యంలో తన కుమారుడితో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్ దొంతంశెట్టి లావణ్య (33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. (చదవండి: అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!) ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్ (7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లీ బిడ్డలకు అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే హత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మామ చేతిలో అల్లుడి హతం
సాక్షి, వై.రామవరం: మండలంలోని జంగాలతోట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి మామ కోండ్ల చిన్నారావు చేతిలో అల్లుడు వీరుల ప్రకాష్(34) హతమయ్యాడు. మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అటవీ ప్రాంతంలో ఆ గ్రామం ఉండడం, కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రానికి సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై గంట పృథ్వీలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మారేడు మిల్లి మండలం గుజ్జి మామిడివలస గ్రామానికి చెందిన మృతుడు వీరుల ప్రకాష్(34)కు జంగాల తోట గ్రామానికి చెందిన కోండ్ల చిన్నారావు కుమార్తె పార్వతితో వివాహమైంది. తరచూ మామ, అత్త, భార్యలను మృతుడు తప్పతాగి, వేధిస్తూ, కొడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా మృతుడు తప్ప తాగి అందరినీ కొడుతుండగా, మామ ఆగ్రహించి అల్లుడు ప్రకాష్ మెడపై గొడ్డలితో వేటు వేయగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నాడు. సీఐ, ఎస్సైలు జంగాల తోట గ్రామంలో గ్రామస్తులను, కుటుంబసభ్యులను విచారించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: (షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..) -
స్పేస్ ఎక్స్లో తొలి తెలుగమ్మాయి
పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది. ‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదివారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. విలక్షణంగా చెప్పటం వల్లనే... అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత తొలి తెలుగమ్మాయి స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలలోని అమెరికన్ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి. యుద్ధ సమయంలో ఇరాక్లోనే.. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గ్రీన్ జోన్లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి. పిల్లలు ఇద్దరు... సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ స్టేషన్ వద్ద సీత సంగీత, నాట్య ప్రదర్శనలు సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ రెలిజియన్ కాన్ఫరెన్స్లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. మానస సరోవర్ నీళ్లు – గాంధీకి అభిషేకం సీత ఒకసారి మానస్ సరోవర్కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు. పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది. – సంభాషణ: డాక్టర్ పురాణపండ వైజయంతి -
పూటుగా తాగి లైంగిక దాడి
సాక్షి, కాకినాడ సిటీ: స్థానిక ముత్తా నగర్లో గత నెల 24వ తేదీ రాత్రి ఐదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన తాడి ప్రభు అలియాస్ చిన్న అనే 29 ఏళ్ల వ్యక్తిని కత్తిపూడి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తాడి ప్రభు నవంబర్ 24న స్నేహితుడితో కలసి మద్యం తాగాడు. మత్తులో జోగుతున్న స్నేహితుడి వద్ద సెల్ఫోన్, డబ్బులు దొంగిలించాడు. అక్కడ నుంచి వెళ్లిపోతూ బాలిక తాత సెల్ ఫోన్ దొంగిలించాలని ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో నేలపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఎత్తుకుని దగ్గర్లోని శ్మశాన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఏడుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాలికను కొద్ది దూరం తీసుకొచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం కాకినాడ జ్యోతుల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని రెండు రోజులు ఉన్నాడు. రూము తాళం కూడా ఇవ్వకుండా అమలాపురం, అటు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం రౌతులపూడిలో స్నేహితుడి ఇంటికి వచ్చాడు. అక్కడ నుంచి వస్తూ కత్తిపూడిలో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నేరం చేసినట్టు అంగీకరించాడు. చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు) సెల్ఫోన్లు స్వాధీనం: నిందితుడు ప్రభు నుంచి మూడు సెల్ఫోన్లు, రూ. 7 వేలు, బస్ టికెట్, లాడ్జి రూమ్ తాళం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మి తెలిపారు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్థలంలో బాలిక గౌను, కట్ డ్రాయర్, నిందితుడి దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తునకు 13 ప్రత్యేక బృందాలను ఉపయోగించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఏఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ వి.భీమారావు, దిశ డీఎస్పీ ఎస్.మురళీమోహన్, డీఎస్పీ అంబికా ప్రసాద్, వన్టౌన్ సీఐ టి.రామమోహన్రెడ్డి, పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (తాగిన మైకంలో కూతురి హత్య) -
వేట మొదలైంది... వేటు పడింది..
అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది. టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్ ఆర్.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్ హెచ్ ఎస్ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్కుమార్ స స్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ డీవీ సూర్యం, లీగల్ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి. చదవండి: (దేవుళ్లకే శఠగోపం!) రికవరీ సవాలే.. ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్ తిప్పికొట్టారు. చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్ స్టాఫ్ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదు సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్ -
దివ్యాంగులకు జననేత ఆత్మీయ స్పర్శ
సాక్షి, కపిలేశ్వరపురం: విశాలమైన అవనిలో ఎత్తుపల్లాలు.. చల్లని సముద్రంలో ఎగిసి..పడే కెరటాలు.. నీలి ఆకాశంలో నల్లని మబ్బులు.. ప్రకృతిలో ఏదీ సక్రమంగా ఉండదు. ప్రకృతి ప్రభావిత మానవుని జీవితంలోనూ సమస్యలు, ఒడిదొడుకులు సహజం. పుట్టుకతోనైనా, విధి వంచనైనా.. కారణమేదైనా దివ్యమైన జీవితాన్ని వైకల్యం వెంటాడినా విధి రాతను ఎదిరించి నిలిచిన దివ్యాంగులెందరో చైతన్యపూరితంగా జీవిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బు లేదనో, స్థిరాస్థి లేదనో, గౌరవం ఇవ్వడం లేదనో నిత్యం సమస్యలుగా భావించే వారు ఓసారి దివ్యాంగుల జీవితాల వైపు చూస్తే ఎంతో ప్రేరణ పొందుతారు. శరీర భాగాలు సహకరించకపోయినా జీవితంలో ఎదురీదుతూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం.. అడుగడుగునా జననేత ఆత్మీయ స్పర్శ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2018 జూన్, ఆగస్టు మధ్యకాలంలో జిల్లాలో సాగింది. దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు పాదయాత్రలో తమ సమస్యలను చెప్పుకోగా వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. చూడలేకున్నా.. వెలుతురును ప్రసాదిస్తున్న శ్రీనివాస్ అంధత్వంతో తాను వెలుగును చూడలేకపోతున్నా తనలాంటి అనేక మందికి జీవితంలో వెలుతురును ప్రసాదిస్తున్నారు అమలాపురానికి చెందిన రామాయణం శ్రీనివాస్. పట్టుదలతో దూరవిద్యలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అంధుల సేవకు అంకితమై పనిచేస్తున్నారు. స్వశక్తితో 2004 అక్టోబర్ 16న లూయిస్ అంధుల పాఠశాలను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి అంధ విద్యార్థులకు తన సంస్థలో లూయీ బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపితో విద్యాబోధన చేస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఆయన సంస్థలోనే దాతల సహకారంతో అంధ విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈయన కృషిని ప్రశంసిస్తూ 2017 జనవరి 4న ప్రభుత్వం తరఫున అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత రాష్ట్ర ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. కోనసీమలోని అనేక సంస్థలు, దాతలు శ్రీనివాస్ కృషి కొనసాగింపునకు సహకరిస్తున్నారు. తెల్లవారగానే సాయం.. జిల్లాలో 1,590 సచివాలయాల ద్వారా 537 రకాల సేవలందుతున్నాయి. వాటి పరిధిలోని 26,743 మంది వలంటీర్లు శ్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ క్రమం తప్పకుండా తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు పింఛను సాయమందిస్తుంది. జిల్లాలో సుమారుగా 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. సొంత కాళ్లపై నిలబడిన శ్రీఘాకోళపు పుట్టుకతోనే వైకల్యం వెంటాడడంతో మండపేటకు చెందిన శ్రీఘాకోళపు వెంకట కృష్ణగుప్తకు తన రెండు కాళ్లు పనిచేయవు. ఈయన ఎమ్కాం వరకూ చదువుకున్నాడు. స్థానికంగా కంప్యూటర్ కోర్సు చేసి స్వయం ఉపాధికి బాట వేసుకున్నాడు. ప్రస్తుతం మండపేటలో గుప్త గ్రాఫిక్స్ను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పలువురి నిత్యావసర వస్తువులు అందజేసిఆదర్శంగానిలిచారు. చైతన్య దివిటీలు దివ్యాంగులు చైతన్య దివిటీలు. పుట్టుక వెక్కిరించినా, విధి వంచించినా సమాజంలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తమను సానుభూతితో కాదు.. సామాజిక దృక్పథంతో చూడాలంటున్నారు. గత కాలాల్లో ప్రభుత్వాలు అందజేసిన బహుళ అంతస్తుల భవనంలో దిగువ ఫ్లోర్లోనే దివ్యాంగులకు ఫ్లాట్లను కేటాయించేలా చేసుకున్నారు. నాలుగేళ్లుగా మండపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్లో మూడు శాతం నిధులను దివ్యాంగుల సంక్షేమానికి కేటాయిస్తున్నారు. మండపేటలో దివ్యాంగుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుట్టు పని, ఫినాయిల్ తయారీ తదితర జీవనాధార అంశాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ‘సమగ్ర’ సేవ భానుగుడి(కాకినాడ సిటీ): సమగ్రశిక్షా అభియాన్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పలు ప్రత్యేక పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు దివ్యాంగుల ఉన్నతి కోసం నిరంతర పర్యవేక్షిస్తూ, నెలనెలా పలువిధాలుగా నగదు ఇస్తూ విద్యోన్నతికి తోడ్పాటు అందిస్తోంది. భవిత సెంటర్ల ద్వారా చిన్నారులకు విద్య జిల్లాలో 21 భవిత సెంటర్లు, 43 నాన్ భవిత సెంటర్ల ద్వారా 1379 మంది చిన్నారులకు 18మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. గృహ ఆధారిత విద్య 128 మంది ఐఈఆర్టీల ద్వారా వారంలో 640 మంది విద్యార్థులకు వారంలో ప్రతి శనివారం హోమ్బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతినెలా రూ.200 చొప్పున అలవెన్సులను ప్రభుత్వమే అందిస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్పోర్టు అలవెన్సు ట్రాన్స్పోర్టు అలవెన్సు రూపంలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 1094 మంది వీఐ, హెచ్ఐ, ఎంఆర్ కేటగిరీల విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున అలవెన్సులు అందిస్తోంది. ఎస్కార్టు అలవెన్సు: ప్రత్యేక అవసరాల గల సెరిబ్రల్ పాల్సీ, లోకోమోటార్ డిసెబిలిటీ అండ్ మల్టీపుల్ డిసెబిలిటీ విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఎస్కార్టు అలవెన్సు, ప్రత్యేక అవసరాలు గల ఆడపిల్లలకు 6,7,8 తరగతుల విద్యార్థినులకు 398 మందికి రూ.200 చొప్పున స్టైఫండ్, ప్రత్యేక అవసరాలు గల 46 మంది విద్యార్థినులకు రీడర్ అలవెన్స్ కింద, తొమ్మిది మంది విద్యార్థులకు నెలకు రూ.200 హాస్టల్ అలవెన్సు అందిస్తున్నారు. మైనర్ కరెక్టివ్ సర్జరీలు: రాజమండ్రి యూనివర్సల్ హాస్పిటల్ 52మందికి ఎసెస్మెంట్ క్యాంపు నిర్వహించి మైనర్ కరెక్టివ్ సర్జరీలు నిర్వహించారు. పదిలో 40 మంది పాస్ పదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. స్పెషల్ ఒలంపిక్ భారత్ క్రీడలు భవిత, నాన్ భవిత సెంటర్లలో పిల్లలకు స్పెషల్ ఒలింపిక్ భారత్ నిర్వహిస్తున్న క్రీడలకు జిల్లా స్థాయిలో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్... వైకల్యాన్ని నిర్ధారించేందుకు ప్రామాణికంగా ఉన్న సదరం సర్టిఫికెట్ జారీని ప్రస్తుత ప్రభుత్వం సరళతరం చేసింది. దివ్యాంగుడు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో టైమ్స్లాట్ను బుక్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్షకు వెళ్లాల్సిన తేదీ, సమయం, ఆస్పత్రి వివరాలను స్లాట్లో పేర్కొంటారు. పరీక్ష అనంతరం వైద్యుడు అందజేసే సర్డిఫికెట్ను సచివాలయాల్లోనే పొందొచ్చు. దివ్యాంగుల అవస్థలను తొలగించేందుకు వైద్య పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్యను 18కు పెంచింది. జీజీహెచ్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీల్లో ఈ కేంద్రాలను నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా కొద్ది నెలల పాటు నిలిచిన సదరన్ శిబిరాల నిర్వహణ ప్రక్రియను పుదరుద్ధరించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిత కేంద్రాల ద్వారా సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సంక్షేమం కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. జిల్లాలో 64 భవిత కేంద్రాలుండగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 10,384 ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రబంద్పోర్టల్లో 1524 మంది బాలురు, 1283 మంది బాలికలను నమోదు చేశారు. 18 మంది ఫిజియో థెరపిస్టులు, 124 మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, 64 మంది ఆయాలు చిన్నారులకు సేవలందిస్తున్నారు. 21 రకాల వైకల్యాలతో బాధపడే చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పీచ్థెరపీ, సైకలాజికల్ థెరపీ, ఫిజియో థెరపీ సేవలందిస్తున్నారు. చిన్నారులకు, చిన్నారుల పర్యవేక్షకులకు అలవెన్స్ రూపంలో నగదును కూడా అందజేస్తుంది. వికలాంగుల చట్టం 2016 ఏం చెబుతుందంటే.. శారీరకంగా, మానసికంగా వైకల్యం కలిగిన వారిని దివ్యాంగులుగా పరిగణిస్తున్నారు. 2016 డిసెంబర్ 16న దేశంలో వికలాంగుల చట్టం (ఆర్పీడీ) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆత్మ గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ, అవకాశాల పెంపు, సామాజిక భద్రత లక్ష్యంగా ఈ చట్టం రూపొందింది. ఏడు రకాల వైకల్యాలను మాత్రమే పరిగణించే పరిస్థితుల స్థానంలో ఆ సంఖ్యను 21కు పెంచారు. వికలాంగుల రిజర్వేషన్ శాతాన్ని మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు. వికలాంగులపై దాడి చేసినా, వివక్ష చూపినా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తారు. 50 శాతం రాయితీ బస్పాస్ల జారీ దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ చార్జీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ బస్పాస్లను జారీ చేస్తోంది. జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24 వేల మందికి రాయితీ పాస్లను అందజేసింది. నూరు శాతం వైకల్యం కలిగిన దివ్యాంగుడితోపాటు వారి సహాయకుడికి కూడా 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించింది. దివ్యాంగుల సేవలో ఉమా మనోవికాస కేంద్రం అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది. అటువంటి జన్మకు సార్ధకత చేకూర్చుకునేందుకు ఒక్కక్కరూ ఒక్కో బాటను ఎంచుకుంటారు. అలా కాకినాడ రాయుడుపాలెంలోని ఉమామనో వికాస కేంద్రం నిర్వాహకులు దివ్యాంగులకు సేవ చేసే మార్గాని ఎంచుకుని తరిస్తున్నారు. పుట్టుకనే అంగవైకల్యంతో కొందరు, మానసికంగా ఎదలేని వారు కొందరూ జీవితాన్ని భారంగా మోస్తుంటారు. వారిని అక్కున చేర్చుకుని అవసరమైన ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంఘిక, సాధికార విషయాలను నేర్పుతూ 33 ఏళ్లుగా ముందుకు సాగుతోంది. కాకినాడ రూరల్/యానాం: ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ(ఉమామనోవికాస కేంద్రం) తొలుత తొమ్మిది మందితో ప్రారంభమై నేడు 1500 మందికి విద్యనందిస్తోంది. మన జిల్లాతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సేవలందిస్తోంది. యానాంలో సేవలు.. యానాంలోని జిక్రియనగర్లోని మానసిక వికలాంగ పిల్లల కోసం పదేళ్ల నుంచి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వారికి బుద్ధిమాంద్యం, సెరిబ్రల్ పాలసీ, వినికిడి, మాట సమస్య అభివృద్ధిలో ఆలస్యమైన వారికి ప్రత్యేక విద్య అందిస్తోంది. దీనిలో భాగంగా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, రోజువారీ పనులు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్బేడీ సందర్శన ఈ ఏడాది ఫిబ్రవరిలో యానాంలోని ఉమా మనోవికాస కేంద్రాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న సేవలపై ఆ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ రెడ్డిని అభినందించారు. ఆరుసార్లు జాతీయ పురస్కారాలు 33 ఏళ్లుగా దివ్యాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉమామనోవికాస కేంద్రానికి ఆరుసార్లు జాతీయ పురస్కారాలు లభించాయి. ఆ విధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ నుంచి అనేక అవార్డులను సంస్థ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి అందుకున్నారు. ఏటా డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డే ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పెర్సన్స్ (ప్రపంచ వికలాంగదినోత్సవం)ను సంస్థలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విభిన్నప్రతిభావంతుల అభివృద్ధికి కృషి విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సేవలను అందిస్తూ వారి అభివృద్ధి సేవలు అందించేందుకు ఉమామనో వికాస కేంద్రం 1988లో నెలకొల్పాం. తమ సంస్థ ద్వారా మానసిక వికలాంగుల(బుద్ధి మాంద్యత) ప్రత్యేక పాఠశాల, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, స్టేట్ సెంటర్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్, జిల్లా దివ్యాంగుల పునరావాసం, కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ యూనిట్, కృత్రిమ అవయవాల రిపేరు మొబైల్ వర్క్షాపు, ఘరోంద గ్రూపు హోమ్, సమాజ ఆధారిత పునరావాస కార్యక్రమం, ఇలా పలు కార్యక్రమాల చేపడుతున్నాం. – ఎస్పీ రెడ్డి, డైరెక్టర్, ఉమామనోవికాస కేంద్రం -
తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు -
సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలు విచారకరమని, ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. ( 'చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు' ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పాలన చేయాల్సి ఉంది. తెలంగాణ, ఢిల్లీలో ఉన్న పరిస్థితి వేరు. వారికి బీజేపీయే ప్రత్యర్థి. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా’’ మన్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి? : శివరామ సుబ్రమణ్యం ‘‘సీఎం జగన్ ప్రభుత్వంపై, చేపడుతున్న కార్యక్రమాలపై అవాకులు, చవాకులు విసురుతున్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి?. ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నిస్తున్నారా?. వైఎస్సార్ హయాంలో కేంద్రం నిధులు రాకపోయినా కాలువ పనులు పూర్తి చేయలేదా?. టీడీపీ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయి కదా!. సీఎం జగన్ కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నాం. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని కేంద్రంతో లాలూచీపడున్నాడనడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంలా చూడమంటారా?. రాష్ట్రంలో మరో మూడు దశాబ్దాల వరకు బీజేపీకి మనుగడ ఉండదు. గతంలో అరుణ్ జైట్లీ, చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని చెప్పింది మీరు కాదా?. చంద్రబాబును కలిశాక మీరు ఏం మాట్లాడుకున్నారు.. మీ మాటల్లో మీకు క్లారిటీ ఉందా? ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
పులస @ రూ.21 వేలు
సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్కు సింబల్గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్) -
ప్రయాణం చివరకు విషాదాంతం
సాక్షి, మారేడుమిల్లి: జోరుగా వానలు కురుస్తున్న వేళ.. అణువణువునా ఆకుపచ్చదనం సంతరించుకుని, కొత్త శోభతో మెరిసిపోతున్న మన్యసీమ ఒడిలో విహరిద్దామని వచ్చిన ఆ యువకులు.. చివరకు మృత్యుదేవత ఒడిలో ఒరిగిపోయారు. విజయవాడతో పాటు తెలంగాణకు చెందిన ఆ యువకులు మారేడుమిల్లి అందాలు చూద్దామని బయలుదేరారు. వారి ప్రయాణం చివరకు విషాదంతమైంది. వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వస్తూ, మారేడుమిల్లికి కిలోమీటరు దూరంలోని వుడ్ కాటేజీ వద్ద మలుపులో ఆదివారం ఓ చెట్టును ఢీకొని, అదుపు తప్పి, పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన పులి ప్రవీణ్కుమార్ (24), పూర్ణసాయి (24), తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన భరత్ (24) అక్కడికక్కడే మరణించారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నదీర్ బాషా, కొత్తగూడేనికి చెందిన షేక్ అసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. (కొట్టి చంపి.. గోతంలో వేసి..!) ట్రాఫిక్ స్తంభించడంతో బారులుతీరిన వాహనాలు ఆనందంగా గడపాలని బయలుదేరి.. ఆ ఐదుగురు యువకులూ డిగ్రీ, డిప్లమా వరకూ చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఏజెన్సీ అందాలను తిలకిస్తూ, రెండు రోజుల పాటు ఆనందంగా గడపాలని కారులో బయలుదేరి, ప్రమాదానికి గురయ్యారు. విజయవాడకు చెందిన ప్రవీణ్కుమార్, పూర్ణసాయి కొత్తగూడెంలోని స్నేహితుల వద్దకు శనివారమే బయలుదేరారు. అక్కడ ఇద్దరు స్నేహితులను కలిసి, అక్కడే రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం పాల్వంచ చేరుకుని, మరో మిత్రుడు నదీర్ బాషాను కలిశారు. అక్కడి నుంచి మారేడుమిల్లి అందాలను తిలకించేందుకు కారులో బయలుదేరారు. ఘాట్ రోడ్డులో వారి ప్రయాణం సాఫీగా సాగింది. మారేడుమిల్లి వుడ్ కాటేజీకి కొద్ది దూరంలో మలుపు ఉంది. అక్కడకు వేగంగా రావడంతో ఆ మలుపులో కారును అదుపు చేయలేకపోయారు. దీంతో ఆ కారు చెట్టును ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో చాలాసేపు ఆ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహన చోదకులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన
సాక్షి, అనపర్తి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. ► పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి. ►టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంపట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. కాగా, విషయం తెలుసుకుని రామవరం చేరుకున్న రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని విరమించాలని కోరడంతో మహిళలు అందుకు సహకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
అంతర్వేది ఘటనపై ప్రాథమిక నిర్ధారణ
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వస్త్ర వ్యాపార రారాజు బొమ్మన ఇకలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: వస్త్ర వ్యాపార రంగం రారాజు, అజాత శత్రువు, సామాజిక సేవకుడు, ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొమ్మన రాజ్కుమార్(62) ఇకలేరు. ఆయన కరోనాతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 27 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం దోసకాయలపల్లిలో జరగనున్నాయి. కల్మషం లేని మనిషి, అందరినీ చిరునవ్వుతో పలకరించే ఆయన మరణవార్త తెలియడంతో వెంటనే నగరంలో రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి సంతాపంగా పలు వ్యాపార సంస్థలు మూసివేశారు. 20వ ఏటే వ్యాపార రంగంలోకి.. బొమ్మన రాజ్కుమార్ తన 20వ ఏటే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి రామచంద్రరావుకు చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. ఎవరు సాయం కోరి వచ్చినా కాదనలేని మనసు ఆయనది. వ్యవసాయం అంటే ఎనలేని అభిమానం. తరచూ వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి వస్తుండేవారు. ఆయన వస్త్ర వ్యాపార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమానికి సారథ్యం వహించారు. 2001 నుంచి నిరంతరాయంగా 19 ఏళ్లుగా ది జాంపేట కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కల్యాణ మండపం నిర్మాణానికి çకీలక పాత్ర పోషించారు. జీవిత కాల ట్రస్టీ సభ్యుడిగా ఉన్నారు. యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించారు. మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అ«ధ్యక్షుడిగాను, రాజమహేంద్రవరం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సామాజిక సేవల్లో అందె వేసిన చెయ్యిగా పేరు పొందారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. నేడు నగరంలో వ్యాపార సంస్థల బంద్ బొమ్మన ఆకస్మిక మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ బుధవారం రాజమహేంద్రవరం నగరంలో వ్యాపార సంస్థలను బంద్ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అభిమానుల సందర్శనార్థం బొమ్మన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖుల సంతాపం రాజ్కుమార్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్రాజు, తోట త్రిమూర్తులు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కోఆర్డినేటర్లు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, చందన రమేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్, పోలు కిరణ్కుమార్ రెడ్డి పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ, మాజీ అధ్యక్షుడు అశోక్కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
పంచాయతీ కార్యదర్శి రూ.కోటి స్వాహా
సాక్షి, రాజానగరం: ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏకంగా కోటి రూపాయలకు పైగా ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో తాజాగా బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అవినీతికి అలవాటు పడిన కొంతమంది కార్యదర్శులు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను ఆయా పంచాయతీలకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకుని బొక్కేశారు. ఈ తరహాలోనే జిల్లాలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు గుట్టుగా చేసిన అక్రమం తాజాగా బయటపడింది. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు. ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 2014–15 నుంచి మొత్తం రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ రాజానగరం ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కోరుకొండ, కాతేరు పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా నియమించారు. వారు చేసిన పరిశీలనలో రూ.84,12,916 ఖర్చులకు ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో ఆ మేరకు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వరరావుకు సమాధానం చెప్పుకునేందుకు (సరి చేసుకునేందుకు) అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562లకు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 57,27,354 నికరంగా దుర్వినియోగమైందని విచారణ బృందం ఆగస్టు 20న రిపోర్టును తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసింది. ఇక్కడే ఇంత... మరి అక్కడో... నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్చెరువు పంచాయతీకి కూడా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అతను లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం, గాడాల, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా అతనిపై పలు అరోపణలున్నాయి. దీంతో ఈయనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా శిక్షార్హులే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని, అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు కూడా అందజేశామని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ తెలిపారు. అతను స్వాహా చేసిన ప్రజల సొమ్ములను రికవరీ చేయడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు. అంతేకాక అతను ఇన్చార్జిగా పనిచేసిన దివాన్చెరువు పంచాయతీలో కూడా విచారణ జరిపేందుకు రెండు మూడు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపిస్తామన్నారు. -
ఖైరతాబాద్ గణనాథునికి 100 కేజీల లడ్డూ
సాక్షి, మండపేట: వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం మడత కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ 100 కిలోల లడ్డూను కానుకగా అందజేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు. ఖైరతాబాద్ గణపయ్యకు 2010 నుంచి లడ్డూను కానుకగా మల్లిబాబు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే మల్లిబాబు, సిబ్బంది గణపతి మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో లడ్డూ తయారు చేసేవారు. 2010లో 500 కిలోల లడ్డూ తయారుచేసి పంపగా, విగ్రహ పరిమాణాన్ని బట్టి ఏటా లడ్డూ పరిమాణం పెంచుతూ వచ్చారు. 2011లో 2,400 కిలోల లడ్డూ సమర్పించగా, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6 వేల కిలోల లడ్డూను స్వామి వారికి కానుకగా అందజేశారు. లడ్డూలను గణనాథుని చేతిలో ఉంచి, ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. (ప్రేక్షకులను ఉర్రూతలుగించిన వినాయకుడి పాటలు) 2016లో కమిటీ సూచన మేరకు 500 కిలోల లడ్డూను కానుకగా పంపారు. అయితే ఎంతో నియమనిష్టలతో, తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి అందజేసిన లడ్డూ నైవేద్యానికి కమిటీ సరైన రక్షణ కల్పించకపోవడం మల్లిబాబును తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 2017 ఉత్సవాల నుంచి భారీ లడ్డూ కానుకను నిలిపివేసినా 25 కిలోల లడ్డూ కానుకగా అందజేస్తూ వచ్చారు. కాగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు ఈ ఏడాది ఉత్సవాలకు 100 కిలోల లడ్డూ తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఖైరతాబాద్లో తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. లడ్డూను శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్కు తరలించామన్నారు. -
ఏపీలో తొలిసారిగా.. 48 గంటల్లో మోడల్ హౌస్
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతితక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్ను ఆయన సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించిన మోడల్ హౌస్ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారిగా ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు మూడున్నర లక్షల లోపు ఖర్చువుతుందని ఆయన వివరించారు. -
పిఠాపురం ఎమ్మెల్యేకు పితృ వియోగం
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృ వియోగం కలిగింది. దొరబాబు తండ్రి పెండెం పెద వీర్రాఘవరావు (94) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పెద వీర్రాఘవరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వాటాల పంపకాల్లో తేడా.. బాగోతం గుట్టురట్టు
అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా వచ్చింది. కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అక్రమాల బాగోతం బయటపడింది. కరోనా పేరుతో ఓ సీనియర్ స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరి కొందరు నడిపిన వసూళ్ల తంతును పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు ఆ ఎంఎన్ఓ. తాను కిట్లు దొంగిలించింది కేవలం స్టాఫ్ నర్సుపై ప్రతీకారం తీర్చుకోవడానికేనని వారికి చెప్పుకొచ్చాడు. కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా అవినీతిపరులు మాత్రం పేట్రేగిపోతున్నారు. వైద్యసేవల మాటున కాసుల దందాకు తెరతీస్తున్నారు. కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డ బాషా వాంగ్మూలంతో కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అవినీతి బాగోతం బయటపడింది. కిట్లను పక్కదారి పట్టించి ఓ సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ అనుమానితుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కిట్లు దొంగిలించిన ఎంఎన్వో షేక్ జాన్ బాషా ఈ ఆరోపణలను నిజమేనన్నట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో.. ఇటీవల విడుదలైన జీజీహెచ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆసరాగా, సంబంధిత నర్సు అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని అక్కడ కొందరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధితులను పిలిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సమక్షంలో మాట్లాడారు. ఎవరికీ డబ్బులివ్వొద్దని వాళ్లతో చెప్పి నర్సుతో పాటు అభ్యర్థులను అక్కడి నుంచి పంపేశారే తప్ప చర్యలేవీ చేపట్టలేదు. ఆ నర్సే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆమె కష్టాన్ని పదింతలు చేసి ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు అక్కడే పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీ షియన్కు ఓ ప్రైవేటు ల్యాబ్ ఉండగా జీజీహెచ్లో వసూళ్లకు పాల్పడడమే కాక, అక్కడికి కూడా కిట్లను తరలిస్తున్నాడని వెల్లడైంది. వసూళ్ల దందాలో ఈ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని నిందితుడు బాషా పోలీసులకు వెల్లడించాడు. ఈ వసూళ్ల వ్యవహారం వెనుక వీళ్లకు దన్నుగా జీజీహెచ్ ఉన్నతాధికారి ఉన్నారన్న చర్చ సాగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కిట్లలో కొన్ని.. నిందితుడిని అరెస్టు చేశాం : పోలీసులు కాకినాడ మూడో పట్టణ పోలీసులు మాట్లాడుతూ నిందితుడు బాషా ప్రతీకార చర్యలో భాగంగానే దొంగిలించినట్టు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు చెప్పిన పేర్లను సూపరింటెండెంట్కి తెలిపి కేసును కాకినాడ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగిస్తామన్నారు. నిందితుడి నుంచి 298 కిట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ బాధితుడైన బాషా వాటిలో రెండు కిట్లను తన కోసం వినియోగించుకున్నాడన్నారు. అతడికి మంగళవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్గా నిర్ధారణ అయిందన్నారు. గత నెల 27న జీజీహెచ్ నుంచి ఇంటెండ్ తీసుకున్న బాషా డీఎంహెచ్వో కార్యాలయానికి కిట్ల కోసం వచ్చాడని, ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగాడని తెలిపారు. ఆ తర్వాత అమలాపురానికి బదిలీ కావడం, కరోనా పాజిటివ్ రావడంతో ఇంద్రపాలెంలోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నాడన్నారు. ఆ స్టాఫ్ నర్సుపై పగతో ఆమెతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్ల దందాను బయట పెట్టాలని నిర్ణయించి ఆ ఇండెంట్పై తేదీని పదిగా మార్చి, కిట్ల సంఖ్యను 200 నుంచి 300 చేసి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితుడిని బు«ధవారం ఉదయం అరెస్టు చేశామని, పరీక్షల కోసం జీజీహెచ్కి పంపామని తెలిపారు. నిందితుడితో పాటు అతడి వద్ద లభ్యమైన 298 కిట్లను న్యాయస్థానానికి అందిచనున్నట్టు తెలిపారు. ప్రతీకారం తీర్చుకుందామని.. ఎంఎన్వో బాషా కిట్లను దొంగిలించి ఇంట్లో దాచుకున్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన అతడికి లేదని పోలీసుల విచారణలో తేలింది. 300 కిట్లు దొంగిలించడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తే నివ్వెరపరిచే సమాధానమిచ్చాడు. అక్కడి నర్సుపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ పని చేశానని తేల్చి చెప్పాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే డబ్బుల పంపకంలో చోటు చేసుకున్న ఘర్షణలో తానే డబ్బులు వసూలు చేసినట్టుగా నర్సు తనపై నింద వేసి నోడల్ అధికారికి ఫిర్యాదు చేసిందన్నాడు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి బదిలీ చేశారని, అది తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. -
అల్లుడిని నరికి చంపి, తలను తీసుకొని..
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత అల్లుడినే కిరాతకంగా నరికి చంపాడో మామ. అనంతరం తలను సంచిలో తీసుకొచ్చి అన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటన రౌతులపూడి మండలం డీజేపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఇద్దరి కూతుర్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు. (చదవండి : ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి) గత రాత్రి అత్తారింటికి వచ్చిన అల్లుడు లచ్చన్న భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. పిల్లల్ని కూడా చంపేస్తానని మామను హెచ్చరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చన్న తల నరికాడు. అనంతరం ఆ తలను సంచిలో వేసుకొని అన్నవరం పోలీసులకు అప్పగించాడు. సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని అన్నవరం పోలీసులు పేర్కొన్నారు. -
అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
మంత్రి వేణును కలిసిన ఐఏఎస్ అధికారులు
సాక్షి, కాకినాడ: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను పలువురు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్అండ్బి అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి వేణును జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్–19 నియంత్రణ చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివేణు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మురళీధర్రెడ్డి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుందని మంత్రి వేణు పేర్కొన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్కు మూడో స్థానం) -
టీడీపీ అక్రమాలు.. రూ.కోటిన్నర మాయం
గతమంతా ఘన చరిత్ర...అయితే అవినీతితో అన్నట్టుగా ఉంది టీడీపీ పాలన. అన్నీ పక్కాగా సాగాల్సిన సహకార సొసైటీల్లో కూడా కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లు. తరువాత అధికారం తమదేనన్న ధీమాతో బినామీల పేరుతో...సెంటు భూమిలేని వ్యక్తుల పేరుతో నిధులను పక్కతోవ పట్టించారు. కళ్లుమూసుకొని పాలుతాగుతూ పిల్లి ఎవరూ చూడడం లేదన్న రీతిలో సొసైటీల్లో ఖజానా గుల్ల చేసేశారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంత ఉదయ భాస్కర్ ఈ అక్రమాలపై దృష్టి సారించడంతో వ్యవహారం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కంచే చేను మేసింద’నే సామెతను తలపించే రీతిలో సహకార సంఘాలను అధికారులే కొల్లగొట్టేశారు. సంఘాలలో పనిచేస్తూ ప్రగతికి పాటుపడాల్సిన సంబంధితాధికారులు, ఉద్యోగులే సంఘాలను గుల్ల చేసిపోయారు. గత తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏలుబడిలో తెలుగు తమ్ముళ్లు, అధికారులు కుమ్మక్కై గత ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఏ సంఘాన్ని కదిపినా అవినీతి, అవకతవకలే కదలాడుతున్నాయి. అప్పట్లో డీసీసీబీ పాలకవర్గం, సీఈఓ సహా అధికారుల సంఘాలు, బ్రాంచీల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను చూసీచూడనట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి డీసీసీబీ చైర్మన్గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వద్దిపర్రు సొసైటీ, ఆత్రేయపురం బ్రాంచి అధికారులు అడ్డంగా దోచేసిన రైతుల సొమ్ము అక్షరాలా రూ.1.37 కోట్లుగా లెక్క తేలింది. అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించడంతో ఈ కుంభకోణం బయటపడింది. 2019 మార్చి వరకూ జరిగిన లావాదేవీలపై ఆడిట్లో బయటపడింది కానీ లేకుంటే ఇది బయటపడేదే కాదు. ఈ కుంభకోణాన్ని వద్దిపర్రు పర్సన్ ఇన్చార్జి కొరుప్రోలు వెంకటేశ్వరరావు బయటపెట్టారు. వద్దిపర్రు సొసైటీలో... టీడీపీ ఏలుబడిలో సొసైటీలో 55 మంది బినామీ రైతుల పేర్లతో సుమారు రూ.54 లక్షలు దిగమింగేశారు. సొసైటీలో జరిపిన ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, నగదు నిల్వ రూ.23 లక్షలు కూడా మాయం చేసేశారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో అసలు సెంటు భూమంటూ లేని, నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీల పేరుతో లక్షలు రుణాలు తీసేసుకున్నారు. ఈ సొసైటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓ ఆచంట మునీశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలపై జరిపిన ఆడిట్లో ఈ కుంభకోణం వెలుగులోకి చూసింది. పేరవరం గ్రామానికి చెందిన కొండ్రు నాంచారావు సన్ఆఫ్ పల్లయ్య రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహంలో నివాసం ఉంటున్నాడు. అతని పేరున రూ.17.30 లక్షలు రుణం వద్దిపర్రు సొసైటీ రికార్డుల్లో ఉంది. సెంటు భూమి లేదు. అయినా నాంచారావు పేరున స్వల్పకాలిక రుణం రూ.3 లక్షలు, స్వల్పకాలిక ఇతర రుణం రూ.9.70 లక్షలు, దీర్ఘకాలిక రుణం రూ.4.60 లక్షలు, మొత్తంగా రూ.17.30 లక్షలు రుణం దోచేశారు. ఏవీ చూడకుండానే... ♦రుణం ఇవ్వాలంటే ముందు బ్రాంచి మేనేజర్, సూపర్వైజర్ కచ్చితంగా భూమిని పరిశీలించాలి. భూ తనఖా రిజిస్ట్రేషన్ నంబరు, అతని పేరున భూమి ఉందా లేదా, భౌతికంగా కూడా చూడాలి. అదే రూ.3 లక్షలు రుణం వరకూ బ్రాంచి స్థాయిలో పరిశీలన జరిపితే సరిపోతుంది. రూ.3 లక్షలు దాటి రుణం ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ స్థాయిలో పరిశీలన జరపాలనేది నిబంధన. కానీ ఇవేమీ చూడకుండానే కళ్లుమూసుకుని సెంటు భూమి లేని నాంచారావు పేరున రూ.17.30 లక్షలు రుణం గుటకాయ స్వాహా చేశారు. ♦వద్దిపర్రు గ్రామంలో ఉప్పే కొండయ్య సన్ ఆఫ్ పెరుమాళ్లు. ఇతనికి 0.6 సెంట్లు భూమి ఉంది. దీనిని 0.67 సెంట్లుగా రికార్డు చూపించారు. అంటే 61 సెంట్లు పెంచి చూపించారు. స్వల్పకాలిక రుణ బాండ్లో 67 సెంట్లు చూపించారు. తీరా కొండయ్య పేరున సొసైటీలో తనఖా పెట్టిన బాండును అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఆ బాండు నంబర్ 949/2012తో కరుటూరి మాధవి పేరున రిజిస్టరై ఉందని తేలింది. ఇలా ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు పీఏసీఎస్ ద్వారా 55 మందికి రూ.54 లక్షలు పంట రుణాలు ఇచ్చినట్టు రికార్డు ఉంది. రుణాలు ఇవ్వాలంటే టైటిల్ డీడ్, బాండ్ పేపర్లు సొసైటీ తరువాత బ్రాంచిలో డిపాజిట్ చేయాలి. కానీ ఇక్కడ సొసైటీ సీఈఓ సహా కొందరు బ్రాంచి అధికారులు భూమి లేని వారికి భూమి ఉన్నట్టు, భూముల విస్తీర్ణం పెంచేసి, టైటిల్ డీడ్లు లేకుండానే ఉన్నట్టు, బాండ్ పేపర్లు నకిలీవి సృష్టించడం...ఇలా రికార్డుల మాయాజాలంతో లక్షలు దారిమళ్లించి రైతుల నోట మట్టికొట్టారు. ఓ రైతుకు రుణం ఇవ్వాలంటే... స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం టైటిల్ డీడ్, బాండ్ కచ్చితంగా ఉండాలి. వీటిని రైతుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకుంటారు. సొసైటీ స్థాయిలో సీఈఓ పరిశీలన జరిపి డీసీసీబీ బ్రాంచికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బ్రాంచి మేనేజర్ రికార్డు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణం కూడా నేరుగా రైతుకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతుకు రుణం అందుకోవాలంటే ఇంతటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటే వద్దిపర్రు సొసైటీలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసినా డీసీసీబీ స్థాయిలో అప్పటి సీఈఓ సహా ఉన్నతాధికారులు, ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ ఎం.క్రాంతి కృష్ణ పర్యవేక్షణ ఏమి చేశారని ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సీఈఓ ఆచంట మునీశ్వరరావు, సూపర్వైజర్ మహలక్ష్మిరాజు(పదవీ విరమణ) అక్కడి తెలుగు తముళ్లు తెరవెనుక ఈ కథ నడిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల లావాదేవీల్లోనూ... ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, మార్చి 2019 నాటికి ఉండాల్సిన నగదు నిల్వ రూ.23 లక్షలలో మాయాజాలమే జరిగింది. తమకు తెలియకుండా తమ పేరున రుణాలు కాజేసిన వ్యవహారం ఆనోట, ఈనోటా రైతులకు చేరడం, ఇంతలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వద్దిపర్రు పర్సన్ ఇన్ఛార్జిగా కొరుప్రోలు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కుంభకోణంపై ఆడిట్ నిర్వహించడం ద్వారా స్వాహా అయిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా వసూళ్లు చేస్తామన్నారు. సొమ్ము రాబట్టి బాధ్యులను విడిచిపెట్టేస్తే ఇలాంటి కుంభకోణాలు పునరావృతం అవుతాయని, బాధ్యులపై చర్యలకు డీసీసీబీ స్థాయిలో కొందరు అధికారులు అడ్డంపడుతున్నారని తెలిసింది. ఇటీవల గోకవరం బ్రాంచిలో బంగారం, దీర్ఘకాలిక రుణాలలో అవినీతిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో బాధ్యుడైన మేనేజర్ ఎస్ఎ హుస్సేన్ నుంచి బంగారం, నగదు రికవరీ చేసి విధులకు దూరంగా ఉంచారు. వద్దిపర్రు సొసైటీ సీఈఓ మునేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్రేయపురం బ్రాంచిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు నొక్కేసింది వీరి పేర్లతోనే... పోతుల శ్రీరామ్-రూ.3 లక్షలు పోతుల ఏసుప్రభావతి-రూ.3 లక్షలు గుడే సునీత-రూ.3 లక్షలు బొజ్జా రాజేశ్వరి-రూ.3 లక్షలు బొజ్జా తులసీరావు-రూ.3లక్షలు మద్దిపోతి శ్రీనివాసరావు-రూ.13,700లు మద్దెల అర్జియ్య-రూ.2లక్షలు అత్తిలి రామాంజనేయులు-రూ.2 లక్షలు అత్తిలి గోవిందు-రూ.2 లక్షలు వరదా రాంబాబు-రూ.2.40లక్షలు మద్దిపోతు విజయలక్ష్మి-రూ.1.75 లక్షలు గన్నమేని అనసూయ-రూ.1.50 లక్షలు ఎస్ వెంకటేశ్వర్లు-రూ.లక్ష అవకతవకలు వాస్తవమే.. వద్దిపర్రు సొసైటీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. దానిపై ఆడిట్ కూడా నిర్వహించాం. బాధ్యులపై విచారణతోపాటు సొమ్ము రికవరీ చేస్తున్నాం. ఇటువంటి అవకతవకలు జరగకుండా బ్రాంచి, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారిని భవిష్యత్తులో బదిలీలు చేసేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రవీణ్కుమార్, డీసీసీబీ సీఈవో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం సొసైటీలో అవకతకవలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. ప్రతి పైసా సొసైటీకి తిరిగి వచ్చే వరకూ పోరాడతాం. సొసైటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. – కొరుప్రోలు వెంకటేశ్వరరావు, వద్దిపర్రు సొసైటీ చైర్మన్, ఆత్రేయపురం మండలం సహకార సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలను భ్రష్టుపట్టించారు. తెలుగు తమ్ముళ్లు కొందరు సహకారంతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుతిన్నారు. అటువంటిదే మా నియోజకవర్గంలో పలివెలలో జరిగింది. పలివెలలోని సహకార సంఘ పరిధిలో రెండు భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు విడుదల చేశారు. కానీ అక్కడ నిర్మించింది ఒకే భవనం. నేను స్వయంగా అక్కడ జరిగిన అవినీతిని నాడు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు తీసుకోలేదు. పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిన మీదట మొక్కుబడిగా విచారణ చేసి రూ.6 లక్షలు అవినీతి జరిగినట్టు తేల్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన సమయానికి కూడా అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయింది. – చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే -
వివాహితపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, పిఠాపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు అర్ధరాత్రి సమయంలో ఓ వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యాన్ని బయటపెడితే చంపేస్తామని నిందితులు భయపెట్టడంతో రెండు నెలల పాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించిన వివాహిత చివరకు తన తల్లిదండ్రుల సహకారంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఓ వివాహిత తన భర్త పిల్లలతో కాపురం ఉంటోంది. గతంలో తన స్థలంలో ఇల్లు కట్టుకోగా, ఇంటి నిర్మాణ సమయంలో తాపీ మేస్త్రీలుగా పని చేసిన చేశెట్టి బాలాజీ, మంతెన లచ్చ, తీడ లోవరాజు వివాహితపై కన్నేశారు. తమ కోరిక తీర్చాలంటూ బ్లాక్మెయిల్ చేసేవారు. ఇటీవల బాధితురాలి మామ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో బాధితురాలి భర్త ఆయన వెంట ఆస్పత్రిలో ఉండగా.. ఒక రోజు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు నిందితులు బలవంతంగా ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఎంత బతిమాలినా వినకుండా విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం) -
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య
అల్లారు ముద్దుగా పెంచిన కన్నకూతురు కాళ్ల పారాణి ఆరకముందే కడతేరిపోతుందని ఆ తల్లిదండ్రులు ఉహించలేదు. సంతోషం నిండాల్సిన ఆ ఇంటా విషాదం కుటుంబాన్ని కలచి వేస్తోంది. పెళ్లి ఇష్టం లేకో... లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందనో... ఏమైనా ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కూతురి మరణాని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. సాక్షి, మండపేట: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని వై. సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆమె మృతి పెళ్లి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా మృతురాలు ఇటీవల లవ్ ఫెయిల్యూర్ కథనాంశంగా రూపొందించిన హరర్ షార్ట్ ఫిలిమ్లో ప్రధాన పాత్రలో నటించినట్టు సమాచారం. మండపేట రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వై. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతోంది. రమ్య శ్రీదేవికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో బుధవారం తల్లిదండ్రులు వివాహం జరిపించారు. శనివారం ఆమెను అత్తవారి ఇంటికి పంపాల్సి ఉంది. కాగా శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్ సీహెచ్ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కాళ్ల పారాణి ఆరకముందే అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ పర్యవేక్షణలో రూరల్ హెచ్సీ మూర్తి కేసు నమోదుచేశారు. ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు ఆగిపోతుందన్న బాధతోనైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఫోన్ కాల్డేటా వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షార్ట్ ఫిల్మ్లో నటించిన రమ్య? మృతురాలు రమ్య ఇటీవల డార్క్ వేలంటైన్ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా నటించినట్టు తెలిసింది. లవ్ ఫెయిల్యూర్ ప్రధానాంశంగా రూపొందించిన ఈ హరర్ షార్ట్ ఫిల్మ్ 2వ తేదీన విడుదల కానున్నట్టు సమాచారం. కాగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
శిరోముండనం కేసు; కొత్త కోణం
సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు. విజయ్బాబు ఏమన్నాడంటే... ‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్కు సంబంధం లేదు’ అని విజయ్బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) -
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్ విలువ దిగజారిదంటూ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో’ అని నిప్పులు చెరిగారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) ‘దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారు. దళితుడు వరప్రసాద్ కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ మంత్రి విశ్వరూప్ హితవు పలికారు. (ఆ కేసు దర్యాప్తులో వేగం పెంచండి: డీజీపీ) -
ఐదు నిమిషాల్లో పరీక్ష.. ఆ వెంటనే ఫలితం
సాక్షి, అమలాపురం: కరోనా పాజిటివ్.. ఈ పదం వింటేనే చాలామందిలో వణుకు మొదలవుతుంది. అలాంటిది పరీక్షకు శాంపిల్స్ ఇచ్చాక ఫలితాల కోసం రెండు మూడు రోజుల నిరీక్షణంటే.. క్షణమొక యుగంగా గడుస్తూ.. ప్రాణభీతి వెంటాడుతుంటే.. అమ్మో.. భరించలేరు. ఏదైనా జరగొచ్చు.. చివరికి ప్రాణం కూడా తీసుకోవచ్చు. రోజులు ఇలా గడుస్తుండగా వచ్చింది సంజీవిని. ఆలోచించి పెట్టినా.. కాకతాళీయంగా పెట్టినా ‘సంజీవిని’ ఎందరి ప్రాణాలనో నిలబెడుతోంది. ఇలా శాంపిల్స్ ఇస్తే పావుగంటలో ఫలితం చెప్పేస్తోంది. దీంతో ప్రజలు సైతం అధిక సంఖ్యలో ‘సంజీవిని’ సంచార ల్యాబ్కు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీ టెస్ట్ కిట్లను బస్సుల ద్వారా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురావడంతో నిన్నటి వరకూ పదుల లెక్కలో తేలుతున్న పాజిటివ్ కేసులు నేడు వందల సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే వేగవంతమైన ఈ పరీక్షలు, ఫలితాల వల్ల పెరుగుతున్న రోగులను ఒకేసారి ఆస్పత్రులకు తీసుకువెళ్లి అత్యవసర వైద్యం అందించడం కొంచెం కష్టతరమవుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జిల్లాకు వచ్చిన మూడు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ల బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్లను తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఈ బస్సుల ద్వారా ర్యాపిడ్ టెస్ట్లను సోమవారం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. మొబైల్ ల్యాబ్ టెస్టింగ్ బస్సు వెలుపల పరీక్షల కోసం నిలబడ్డ అనుమానితులు బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్లు సాగేదిలా రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్లు వేగిరం చేసేందుకు ఆరీ్టసీకి చెందిన ఇంద్ర హైటెక్ బస్సులను కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్లకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్ ద్వారా మార్పులు చేపట్టింది. ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఒకేసారి పది మందికి ర్యాపిడ్ టెస్ట్లు చేసేలా రూపకల్పన చేశారు. బస్సులో పూర్తి ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి. బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు. బస్సులోని ఒక్కో కౌంటర్ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీíÙయన్ ఉంటారు. బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వ్యక్తి తల ఎత్తుకు అందేలా ర్యాంప్ల ఏర్పాటుచేశారు. కౌంటర్ల వద్ద ఉన్న డాక్టర్లు బస్సు బయట ఉన్న వ్యక్తి ముక్కులోంచి పరికరం పంపించి శాంపిల్స్ సేకరిస్తారు. అలా తీసిన శాంపిల్ను అక్కడికక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్తో పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ అంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. బస్సులో ఉన్న పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది పరీక్షలు, ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ బస్సు ద్వారా రోజుకు వెయ్యి వరకూ పరీక్షలు చేసే సామర్ధ్యంతో కూడిన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు. తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసి ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లకు కేటాయించిన మూడు ముబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ ల్యాబ్లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఈ బస్సుల ద్వారా గత మూడు రోజుల్లో వేలాది టెస్ట్లు చేశారు. దీంతో రోజుకు వందకు మించి లేదా వంద లోపు ఉండే పాజటివ్ కేసుల సంఖ్యం ఈ బస్సులు వచ్చాక వందల్లోకి పెరిగింది. (కొత్తగా 38,902 కేసులు, 543 మంది మృతి) సంజీవినిలో పరీక్షలు చేయించుకునేందుకు అమలాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద వేచి ఉన్న ప్రజలు (ఫైల్) 2000 పరీక్షల్లో 120 పాజిటివ్ అమలాపురం డివిజన్కు సంబంధించిన మొబైల్ కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ ల్యాబ్ బస్సు ద్వారా మూడు రోజుల్లో దాదాపు 2000 పరీక్షలు చేయగా వాటిలో 120 వరకూ పాజిటివ్ వచ్చాయి. ఈ మొబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ వల్ల పరీక్షలు, వాటి ఫలితాలు అత్యంత వేగంగా ఉంటాయి. ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే అదే చివరి ప్రామాణికంగా ఆ రోగికి వైద్య పక్రియ మొదలు పెడతారు. అదే పరీక్ష చేయించుకున్న వ్యక్తికి నెగెటివ్ వచ్చి కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ టెస్ట్ పూర్తి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్కు పంపిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుష్కరరరావు, అడిషనల్ డీఎం అండ్ హెచ్వో, అమలాపురం -
పోలవరం పునరా‘హాసం’
అందమైన వాతావరణం.. ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఇళ్లు.. అంతర్గత రహదారులు, నీటి సరఫరా లాంటి సకల సదుపాయాలతో కనిపిస్తున్న ఈ పునరావాస కాలనీ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో ఉంది. కాలనీ పనులను పర్యవేక్షిస్తున్న గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావును ‘సాక్షి’ పలకరించగా నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల పనులను పక్షం రోజుల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆయకట్టు రైతులకు చేకూరే ప్రయోజనాలకు దీటుగా, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరిలో వరద ప్రవాహం పెరిగేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస పనులను శరవేగంగా చేసేందుకు రూ.3,383.31 కోట్లు ఖర్చు చేస్తోంది. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని మిగిలిన 84,731 నిర్వాసిత కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. మొత్తమ్మీద నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికి రూ.24,249.14 కోట్లను వ్యయం చేయనుంది. నాడు అరకొర పునరావాసం.. అస్తవ్యస్తంగా పనులు పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురికావటంతో పాటు 1,05,601 కుటుంబాలు నిర్వాసితులుగా మారతారు. వారికి ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారం పునరావాసం కల్పించాలి. అయితే కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న గత సర్కార్ పునరావాస కల్పనపై దృష్టిపెట్టకుండా కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే అరకొర పునరావాసంతో సరిపెట్టింది. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సర్కారు గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా స్పిల్వేను పూర్తి చేయకుండానే ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ పనులను ఆదిలోనే వదిలేయడంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్లు అడ్డంకిగా మారి గతేడాది గోదావరి వరద ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. ఫలితంగా ముంపు గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. పునరావాసంపై నేడు ప్రత్యేక దృష్టి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిర్వాసితుల పునరావాసం, స్పిల్ వే, కాఫర్ డ్యామ్ల పనులను సమన్వయం చేసుకుంటూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లబ్ధి పొందే రైతుల కంటే మిన్నగా నిర్వాసితుల జీవన ప్రమాణాలుండేలా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► గిరిజనులకు రూ.3.59 లక్షలు. గిరిజనేతరులకు రూ.3.34 లక్షలతో 379.25 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా పక్కా ఇళ్లను కట్టి నిర్వాసితులకు ఇవ్వాలని ఆదేశించారు. పునరావాస కాలనీలకు విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలన్నీ కల్పించాలన్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించాలని ఆదేశించారు. ► గిరిజనులకు భూమికి బదులుగా రెండెకరాల సాగు భూమిని సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్దేశించారు. ► గోదావరికి వరద పెరిగేలోగా 41.15 కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మిగిలిన కుటుంబాలకు దశలవారీగా వేగంగా పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ పనుల పర్యవేక్షణకు పోలవరం అడ్మినిస్ట్రేటర్గా ఐఏఎస్ అధికారి ఓ.ఆనంద్ను నియమించారు. శరవేగంగా పనులు.. ► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపునకు గురయ్యే 69,686 ఎకరాలకుగానూ 68,087.88 ఎకరాలను సేకరించారు. మరో 1600.50 ఎకరాలను సేకరణకు కసరత్తు చేస్తున్నారు. సేకరించిన భూమికి రూ.3,304.6 కోట్లను పరిహారంగా చెల్లించారు. మిగిలిన భూసేకరణకు రూ.273.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. ► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 98 గ్రామాల్లోని 17,760 కుటుంబాల ప్రజలకు ఉభయ గోదావరి జిల్లాల్లో 47 పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. పునరావాసం కల్పించే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షలను పరిహారం ఇవ్వనున్నారు. గిరిజన కుటుంబాలకు మరో రూ.50 వేలను జత చేసి రూ.6.86 లక్షలను అందజేయనున్నారు. ► నిర్వాసితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. కష్టాలు గట్టెక్కుతున్నాయి వరద కష్టాలు గట్టెక్కే రోజు వస్తోంది. మూడేళ్లుగా ఈ రోజుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం. ఎంత కాలానికి జగనన్న పుణ్యమాని అనుకున్నది అవుతోంది. ఏటా జూలై వస్తుందంటే వరదలకు ఎక్కడ తల దాచుకోవాలా అని భయపడే వాళ్లం. మరో నెల రోజుల్లో పునరావాస కాలనీకి వెళ్లే సంతోషంలో ఉన్నాం.. – గురుగుల సుబ్బరాజు, దేవీపట్నం. కల నెరవేరుతోంది.. నిత్యం గోదావరి ఆటుపోట్ల మధ్య బతుకు దుర్భరంగా ఉండేది. కాలనీ పూర్తయిందని అధికారులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్నామధ్య వరదలు వచ్చినప్పుడు మా కష్టాలను గట్టేక్కిస్తానని చెప్పారు. మాట ప్రకారం కాలనీలు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. – కొమరం పోచమ్మ, రమణయ్యపేట, దేవీపట్నం మండలం -
హామీల అమలులో ఆయన తరువాతే ఎవరైనా..
స్వచ్ఛమైన చిరునవ్వు.. అదే నవ్వుతో భుజంపై చేయి వేసి పలకరింపు.. ఒకసారి పరిచయమైతే చాలు.. ఎన్నేళ్ల తరవాత కనపడినా పేరు పెట్టి పిలుస్తూ అక్కున చేర్చుకునే అది్వతీయమైన జ్ఞాపకశక్తి ఆయన సొంతం. తన ప్రజలకు ఏదో చేయాలన్న తపన.. ఎవరొచ్చి ఏదడిగినా కార్యాచరణపై మదిలో ప్రణాళికలు వేసుకోవడం. ఇవన్నీ ఆయనను మహానేతను చేశాయి. పాదయాత్రలు.. బస్సుయాత్రలతో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వేలవేల విన్నపాలు చిరునవ్వుతో స్వీకరించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక వాటన్నింటికీ పరిష్కారాలు చూపించారు. వ్యక్తిగతమైనవే కాకుండా సామాజిక పరమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. మౌలిక వసతుల కల్పన.. వ్యవసాయ, పారిశ్రామిక, వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎంత జ్ఞాపకంగా వ్యక్తులను, వ్యక్తిగత సమస్యలను, అభివృద్ధి సంబంధ వినతులను గుర్తు పెట్టుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించారో.. ఆయన హయాంలో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు.. వ్యక్తిగతంగా పొందిన లబ్ధి ఇక్కడి ఆయన స్మృతులుగా కలకాలం నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. అన్నదాత బాగుకోసం అహరహం తపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం రైతు దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వంనిర్ణయించింది. జిల్లాకు ఆయనతో ఉన్న అనుబంధం ఇలా.. ఎన్నెన్నో అభివృద్ధి పనులు రామచంద్రపురం: పట్టణ ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముచ్చుమిల్లి, తాళ్లపొలం వద్ద రాజీవ్ గృహకల్పలను నిర్మించి సుమారుగా 860 కుటుంబాలకు నీడనిచ్చారు. రూ.10 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించారు. వైఎస్ఆర్ హయాంలో నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. సీమాంక్ సెంటర్ నిర్మాణం.. ఏటిగట్ల అభివృద్ధి ఆయన చలవే కొత్తపేట: కొత్తపేటలో వైద్య విధాన పరిషత్ 50 పడకల కొత్తపేట కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రసవం పోసుకున్న తల్లీ, పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా 20 పడకల సీమాంక్ సెంటర్ను రూ 29.30 లక్షల వ్యయంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గోదావరి వరదల వల్ల గండ్లు పడకుండా వశిష్ట గోదావరి ఎడమ, గౌతమి గోదావరి కుడి ఏటిగట్లను సుమారు రూ.100 కోట్లతో ఆధునికీకరించారు. ఆత్రేయపురం మండలంలో రూ.11 కోట్లతో వసంతవాడ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం, రూ.11 కోట్లతో బొబ్బర్లంక మెగా రక్షిత మంచినీటి పథకం, లంక భూములు కోతకు గురికాకుండా రూ 17 కోట్లతో గ్రోయన్స్ నిర్మించారు. తాండవ ఆధునికీకరణకు రూ.57 కోట్ల కేటాయింపు తుని: అధికారంలోకి వచ్చిన తర్వాత తాండవ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.57 కోట్లు కేటాయించారు. మధ్య తరగతి కోసం రాజీవ్ గృహ కల్ప, పేదల కోసం 30.50 ఎకరాల్లో 1154 మందికి పట్టాలు ఇచ్చారు. మోడల్ మార్కెట్, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు అనేక కార్యక్రమాలను ప్రజలకు అందించారు. తాండవ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెరకు మద్దతు ధర కలి్పంచడంతో పాటు ప్రభుత్వం నుంచి రాయితీలు కలి్పంచారు. పశుజీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి.. సామర్లకోట: పశు జీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి 2005లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.10 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో అధునాతన సాంకేతిక పద్ధతిలో కోళ్లకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి, వ్యాక్సిన్ను తయారుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు అందజేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సామర్లకోటకు రూ.8.50 కోట్లు, పెద్దాపురం మున్సిపాలిటీకి రూ.7.50 కోట్లు విడుదల చేయగా వాటితో వాటర్ ట్యాంకులు, పైపు లైన్ల నిర్మాణం చేశారు. పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్టపై దళితులకు కేటాయించిన భూములు సాగు చేసుకోవడానికి 72 బోర్లు ఆయన పాలనలో ఏర్పాటు చేశారు. గురుకుల పాఠశాల, హాస్టల్ భవన నిర్మాణాలు మామిడికుదురు: పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో రూ.13 కోట్లతో గురుకుల పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించారు. ముంగండలో రూ.ఏడు కోట్ల తో తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.30 కోట్ల వ్యయంతో ఏటిగట్లను ఆధునికీకరించారు. ఎస్ఎస్ఏ నిధులు రూ.23 కోట్లతో నియోజకవర్గంలో పాఠశాలల భవనాలు నిర్మించారు. మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో రూ.5.50 కోట్లతో టీటీడీ కల్యాణ మంటపాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సుమారుగా 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ముమ్మిడివరం: నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తాళ్లరేవు మండలంలో ఉప్పంగల పంచాయతీ పరిధిలో సుమారు రూ.6కోట్లు, ఐ.పోలవరం మండలం మురమళ్ల, ముమ్మిడివరంలో సుమారు రూ.24కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో ఏటిగట్లను ఆధునికీకరించి వరదల బారినుంచి ప్రజలను కాపాడారు. దిండి రిసార్ట్స్కు శంకుస్థాపన రాజోలు: ముఖ్యమంత్రి హోదాలో 2005 ఫిబ్రవరి 25న దిండి రిసార్ట్స్కు శంకుస్థాపన చేశారు. మరోసారి 2008 ఏప్రిల్ 15వ తేదీన సఖినేటిపల్లి–నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం మలికిపురం కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్నేహశీలి కాట్రేనికోన: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహశీలి. ఆయన కంట పడితే చాలు చక్రంజీ అంటూ ఆప్యాయంగా పిలిచే వారు’’ అని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన యేడిద చక్రపాణీరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి తాను కలవగానే ‘‘చక్రంజీ బాగున్నావా?’’ అంటూ ఆప్యాయంగా పిలిచే వారన్నారు. ఆయనతో తనకున్న అనుబంధం మరపురానిదని ఆయన అంటున్నారు. ‘‘సీఎల్పీ నాయకుడి హోదాలో, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఒకసారి, ముఖ్యమంత్రి హోదాలో 2009 జనవరి 3న మరోసారి కాట్రేనికోనలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చారు. ఆ సమయంలో కందికుప్పలోని మా ఇంటికి వచ్చారు. ఆయన స్నేహానికి విలువనిచ్చే మనిíÙ. నిబద్ధత కలిగిన నాయకుడు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో రహదారులు, నదీపాయలపై వంతెనల వంటి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే వాడిని. వెంటనే ఆయన అధికారులకు ఆదేశాలిచ్చి, చక్రంజీ చెప్పిన సమస్యలపై నివేదిక ఇమ్మని చెప్పేవారు. వారం పది రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసేవారు. ఆయన జ్ఞాపకాలు జీవితాంతం మరువలేనివి’’ అని చక్రపాణీరావు గుర్తు చేసుకున్నారు. అమలాపురం అభివృద్ధిపై చెరగని ముద్ర అమలాపురం: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఆరేళ్ల పాలనాకాలంలో ప్రజల్లో చిరస్థాయిగా ఉండే పనులు చేపట్టారు. ఆయన హయాంలో అమలాపురం నియోజకవర్గం తొలుత అమలాపురం పట్టణం, రూరల్ మండలంలో కొంతభాగం, అయినవిల్లి మండలం, అంబాజీపేట మండలంలో కొన్ని గ్రామాలు ఉండేవి. తరువాత నియోజకవర్గ పునరి్వభజనలో అమలాపురం పట్టణం, మండలం పూర్తిగాను, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. పూర్వపు నియోజకవర్గంలోను, మారిన నియోజకవర్గంలోను వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి పనులు చేశారు. వైనతేయనదీ పాయ మీద అల్లవరం మండలం బోడసకుర్రు–మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక మధ్య తొలుత రూ.55 కోట్లతో అంచనాతో వంతెన మొదలు పెట్టగా, పూర్తయ్యే నాటికి రూ.65 కోట్లు అయ్యింది. ఎన్హెచ్ 216లో (అప్పట్లో ఎన్హెచ్–16)లో భాగంగా దీని నిర్మాణం జరిగింది. దీని నిర్మాణం వల్ల విశాఖ, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాల వాసులకు రాజోలు దీవితోపాటు పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం, కృష్ణా జిల్లా కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం చేరేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఆక్వా, కొబ్బరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేయడం సులభతరమైంది. రాజీవ్నగర బాటలను దివంగత వైఎస్సార్ అమలాపురంలో ఆరంభించారు. దీనిలో భాగంగా ఆయన ఏప్రిల్ ఒకటి, 2005న అల్లవరం, అమలాపురం మున్సిపాలిటీల్లో పర్యటించారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోటితో పట్టణ పరిధిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును ప్రారంభించారు. పట్టణంలో పలు డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి కోట్ల నిధులు కేటాయించారు. రూ.3 కోట్లతో పట్టణ పేదలు 240 మందికి గూడు కల్పించేందుకు పట్టణ శివారు నల్లమిల్లిలో రాజీవ్గృహ కల్ప పనులకు శంకుస్థాపన చేశారు. పాత అమలాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్న అయినవిల్లి, అంబాజీపేట, ఇప్పటి అల్లవరం మండలాల్లో వైనతేయ ఎడమ, గౌతమి కుడి, వృద్ధగౌతమి కుడి, ఎడమ ఏటిగట్లను సుమారు రూ.30 కోట్లతో పటిష్ఠం చేశారు. గోదావరి నదీ గర్భంలో కలిసిపోయే ప్రమాదమున్న కొండకుదురులంక, పొట్టిలంకల్లో నదీకోత నివారణకు రూ.3.5 కోట్లతో గ్రోయిన్ల నిర్మాణం జరిగింది. సొంతింటి కలను సాకారం చేసిన వైఎస్ మండపేట: సొంతింటిలో జీవించాలన్న పేదల కలను సాకారం చేసి వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. 2006 ఏప్రిల్ 1న కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.460 కోట్లుతో దాదాపు 4,600 ఎకరాలు సేకరించి 1.84 లక్షల మంది పేదలకు పంపిణీ చేశారు. జిల్లాలో 2,14,205 ఇళ్లు మంజూరు చేసి రూ.743.96 కోట్లు విడుదల చేశారు. అప్పటి వరకు అర్బన్ ఏరియాల్లో అందిస్తున్న రూ.30 వేల హౌసింగ్ రుణాన్ని రూ. 55 వేలకు, రూరల్లో రూ. 22,500 సాయాన్ని రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్ ఏరియాల్లో రూ.75 వేలు, రూరల్లో 65 వేలకు పెంచారు. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంతలో రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలను సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. హామీల అమలులో ఆయన తరువాతే ఎవరైనా.. మలికిపురం: ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెవిన పడిందంటే చాలు.. అది ఆయన మనస్సులో గుర్తుండి పోతుంది. ఎంపీగా, సీఎల్పీ నేతగా ఉన్నప్పటి నుంచీ వైఎస్సార్తో తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన అల్లూరు కృష్ణంరాజుకు విడదీయరాని అనుబంధం ఉండేది. వైఎస్సార్ ప్రోత్సాహంతోనే కృష్ణంరాజు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు. మాట తప్పని నాయకుడిగా ప్రజలతో కృష్ణంరాజు గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. సీఎల్పీ నేతగా 2004లో బస్సుయాత్ర చేస్తూ వైఎస్సార్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో 2005లో రాజశేఖరరెడ్డి దిండి రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో దిండి నుంచి అంతర్వేదికి రాజశేఖరరెడ్డితో పాటు కృష్ణంరాజు కూడా వెళ్లారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం ఆలయం ప్రధాన గోపురాలు అభివృద్ధి చేయాలని వైఎస్సార్ను కృష్ణంరాజు కోరగా వెంటనే రూ.కోటి విడుదల చేశారు. అదే సమయంలో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మించాలని కూడా వైఎస్సార్ను కోరారు. హెలికాప్టర్ నుంచి వంతెన నిర్మాణ ప్రాంతాన్ని చూపించారు. దీనిపై వైఎస్సార్ అధ్యయనం చేసి, సుమారు 100 ఏళ్ల నుంచి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిన వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2007లో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిధుల కొరత ఉండడంతో కేంద్రంతో వారధి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చారు. బీఓటీ పద్ధతిలో వంతెన నిర్మాణ పనులను మైటాస్ కంపెనీకి అప్పగించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ ఆకస్మిక మృతి అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం ఊసే ఎత్తలేదు. ఎంతో అభివృద్ధి.. ఆయన హయాంలోనే.. రాజమహేంద్రవరం రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల అభివృద్ధిలో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆప్తుడయ్యారు. నగరంలోని తూర్పురైల్వే బుకింగ్ కార్యాలయం, ఐఎల్టీడీ జంక్షన్ వద్ద రూ.18 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయి. విజయవాడ నుంచి విశాఖపట్టణం వైపు రాకపోకలు సాగించేందుకు దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరి నదిపై నాలుగు లైన్ల వంతెనకు శ్రీకారం చుట్టారు. ఈ వంతెన వల్ల ప్రయాణికులకు 35 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. దేవదాయశాఖ భూమిని తీసుకుని రామకృష్ణ థియేటర్ వెనుక సమగ్ర మురికివాడల అభివృద్ధి, గృహనిర్మాణ పథకంలో రూ.57.36కోట్లతో వాంబేకాలనీ నిర్మించి 1900 మందికి నీడ కలి్పంచారు. శాటిలైట్ సిటీ రాజీవ్ గృహకల్ప సముదాయం, ఐఓసిఎల్ తదితర ప్రాంతాల్లో సైతం ఇళ్లు నిర్మించారు. రూరల్ నియోజకవర్గంలో (అప్పటి కడియం) బొమ్మూరు వెంకటగిరికొండపై సుమారు రూ.20 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని నిర్మించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచాలన్న ఉద్దేశంతో రూ.20కోట్లతో నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్స్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ భవనాన్ని నిర్మించి 2009లో ప్రారంభించారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎన్ఏసి భవనం ఇదే. ఇక కడియం మండలంలో నిర్మించిన మూడు వంతెనలు మండలంలోని ప్రజల ఇబ్బందులను ఎంతగానో తీర్చాయి. కాకినాడ కెనాల్పై కడియం, జేగురుపాడు గ్రామాల వద్ద, కోటిపల్లి కెనాల్పై బుర్రిలంక వద్ద నిర్మించిన వంతెనలు ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్నంపల్లి అక్విడెక్ట్ నిర్మించారు ఐ.పోలవరం: ‘‘రైతుల సమస్యలపై తక్షణమే స్పందించే గుణం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. రైతులందరూ హైదరాబాద్ వెళ్లగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ మా సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఒక చిరునవ్వు నవ్వి ‘మీ సమస్య పరిష్కరిస్తా’నని చెప్పి నాలుగు రోజుల్లోనే నిధులు మంజూరు చేశారు. అన్నదాతల పట్ల ఆయన చూపిన ప్రేమానురాగాలే ఆయనను అన్నదాతగా నిలిపాయ’’ని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన రైతు నాయకుడు పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో ఐల్యాండ్లో 18 వేల ఎకరాలకు సాగునీరు, 65 వేల మందికి తాగునీరు అందించేలా అన్నంపల్లి అక్విడెక్టును నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో ఐల్యాండ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత ప్రజలు అప్పటి ప్రభుత్వాలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాంత రైతులం 2006 జనవరిలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్తో కలిసి హైదరాబాద్ వెళ్లాం. ఆయనకు అన్నంపల్లి అక్విడెక్టు ఆవశ్యకతను వివరించాం. వైఎస్సార్ వెంటనే స్పందించి, నిధులు సమకూర్చడమే కాకుండా త్వరలోనే భూమిపూజ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మూడు నెలల్లో రూ.19 కోట్లతో నూతన అక్విడెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐల్యాండు ప్రజలను ఆదుకొన్న అన్నదాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి’’ అని పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు. -
‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’
సాక్షి, తూర్పుగోదావరి: కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మోసం చేయడంతో ప్రజలు 151 సీట్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే 45 నుంచి 60 ఏళ్లు ఉన్న కాపు మహిళలకు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. 2.40 లక్షల మంది కాపు మహిళలకు కాపు నేస్తం అందించామని చెప్పారు. ఇంకా అర్హత ఉన్నవారు నమోదు చేసుకునేందుకు నెల సమయం కూడా ఇచ్చామని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్కళ్యాణ్ అదే చెప్పారని ఎద్దేవా చేశారు.(అవన్నీ పవన్కు కనిపించడం లేదా: అవంతి) 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి జనసేన తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని తోట త్రిముర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెపప్పారు. ముద్రగడ ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా లేని విధంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని ధ్వజమెత్తారు. కంచం కొడితే కూడా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, గాజువాకలో కూడా కాపులే ఎక్కువగా ఉన్నాపవన్ కల్యాణ్ను ఓడించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తనలోని లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కాపులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తోట త్రిముర్తులు పేర్కొన్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని కాపవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చెరువులో పడి ముగ్గురు చనిపోయినా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరామర్శించేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించడమేంటని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. కాపవరంలో పేదలకు ఇచ్చే స్థలాల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్న రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలంటూ వారంతా కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. (చదవండి: ఈఎస్ఐ స్కామ్లో ముగిసిన ఏసీబీ విచారణ) -
ఎప్పుడు.. ఎలా.. ఎవరికి..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ఎక్కడ, ఎవరికి, ఎలా సోకుతుందో తెలియనంత దారుణంగా పరిస్థితులు మారాయి. జిల్లాలో పలుచోట్ల సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెద్దాపురం, కాజులూరు, రాయవరం మండలం చెల్లూరు, కాకినాడ సిటీ, రూరల్, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలం తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వచ్చాయి. ముఖ్యంగా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల ద్వారానే కరోనా వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సాక్షి, పెద్దాపురం: కరోనా మహమ్మారి పెద్దాపురం పట్టణాన్ని వణికిస్తోంది. ఈనెల 18న మాగంటి వారివీధికి చెందిన బ్యాంక్ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతడితో కలసిన మిరపకాలయ వీధి, మాగంటి వారి వీధికి చెందిన సుమారు 80 మందికి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా సోమవారం వారిలో ఏడుగురు బ్యాంకు ఉద్యోగి కుటుంబ సభ్యులకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్తర్తిస్తున్న సామర్లకోటకు చెందిన మహిళకు, మేదరవీధికి చెందిన 26 ఏళ్ల యువకుడికి, పెద్దాపురం బొమ్మలగుడి వీధిలో ఇద్దరికి, పద్మనాభ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్గా నిర్ధారౖణెంది. దీంతో పట్టణంలో కరోనా కేసులు 18కు చేరాయి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ తుని: తునికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ బి.ప్రసాదరాజు సోమవారం తెలిపారు. లాక్డౌన్ సడలించిన తర్వాత డ్యూటీలో భాగంగా శ్రామిక రైలులో మహారాష్ట్ర వెళ్లి వచ్చాడన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడలో రక్తనమూనా సేకరించి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చిందన్నారు. తుని రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్జోన్గా ప్రకటించారు. తుని పట్టణంలో ఇది కరోనా పాజిటివ్ ఆరో కేసు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై చెల్లూరులో 85కు చేరిన పాజిటివ్ కేసులు రాయవరం: మండలంలోని చెల్లూరు శివారు సూర్యారావుపేటలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల రెండో తేదీన రెండు పాజిటివ్ కేసులు రాగా.. ఆ సంఖ్య సోమవారానికి 85కు చేరింది. ఇంకా 200 మందికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. జి.మామిడాడ టు సూర్యారావుపేట పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామం ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా ఉంది. జి.మామిడాడ తర్వాత అన్ని ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంగా ప్రస్తుతం సూర్యారావు పేట నిలిచింది. గ్రీన్జోన్లో ఉన్న రాయవరం మండలం ఒక్కసారిగా రికార్డులకెక్కింది. సూర్యారావుపేటకు చెందిన కుటుంబం జి.మామిడాడలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లడంతో అక్కడి నుంచి కాంటాక్ట్ కేసులు ఇక్కడ పెరిగాయి. పలు కుటుంబాలు పాజిటివ్ కేసుల బారిన పడ్డాయి. పుల్లేటికుర్రులో మరో మూడు పాజిటివ్ కేసులు అంబాజీపేట: పుల్లేటికుర్రులో శివారు ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి సోమవారం పాజిటివ్ వచ్చినట్టు ముక్కామల వైద్యాధికారిణి కేవై దేవికుమారి తెలిపారు. ఈ నెల 20న భార్య, భర్తలకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు వారి కుమారులిద్దరికి, కోడలికి పాజిటివ్ వచ్చిందన్నారు. అల్లవరం: మండలం ఓడలరేవులో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిలటరీపేటలో మహిళకు పాజిటివ్ కాట్రేనికోన: కందికుప్ప పంచాయతీ మిలటరీపేటలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మిలటరీపేటకు చెందిన 55 ఏళ్ల మహిళ గర్భకోశ వ్యాధితో బాధపడుతోంది. శస్త్ర చికిత్స కోసం ముమ్మిడివరంలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా పాజిటివ్గా నిర్ధారణైంది. తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి బి.మాలకొండయ్య తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం సిటీ : కాకినాడ సిటీ, రూరల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవంలో సోమవారం ఒక్క రోజే 22 కేసులు నమోదయ్యాయి. కాజులూరులో మరో 29 కేసులు కాజులూరు: మండలంలో సోమవారం కొత్తగా మరో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆర్యావటంలో గత బుధవారం తొలిసారిగా ఓ బాలింతకు కరోనా సోకింది. వైద్యాధికారులు ఆమెతో కాంటాక్ట్ అయిన వారిలో గత గురువారం 59 మందికి, శుక్రవారం 40 మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం రిపోర్టు రాగా ఇందులో తొలిరోజు పరీక్షలు నిర్వహించిన 59 మందిలో ఎనిమిది మందికి, అదే విధంగా శుక్రవారం నమూనాలు సేకరించిన 40 మందిలో 21 మందికి పాజిటివ్ వచ్చంది. దీంతో బాలింత మహిళతో కలసి ఆర్యావటంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. కాగా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు 60 ఏళ్ల వృద్ధురాలు ఉండగా మిగిలిన వారిలో అత్యధికులు ఎనిమిదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసు గల చిన్నారులు ఉండడం ఆందోళనకలిగిస్తోంది. -
‘అమ్మ’మ్మలే హతమార్చారు..
బోసినవ్వుల బుజ్జాయిలను చూస్తే.. ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో అలసటగా చిరాకుగా ఉన్న వారికి సైతం వారు కనిపిస్తే.. క్షణాల్లో అవన్నీ మాయమైపోతాయి. అభం శుభం తెలియని.. పసిపాపలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. ఇక గోదావరి వాసులైతే ఆడపిల్ల పుడితే చాలని కనిపించే దేవతలందరికీ మొక్కుతారు. లక్ష్మీదేవితో సమానమని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ ఇంట్లో సంబరం అంతా ఇంతా కాదు. బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. ఇక అత్త, మామలైతే.. మా ఇంటి కోడలు వచ్చేసిందంటూ తెగ ఆనందపడతారు. మరోవైపు ప్రభుత్వాలు సైతం ఆడపిల్లల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. బేటీ పడావో.. బేటీ బచావో అని పాలకులు సైతం నినాదాలు చేస్తున్న రోజులవి.. కానీ సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఓ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు ఆ పసిపాపను భారమనుకున్నారు. నవమాసాలు మోసి కన్న నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా కర్కశంగా చంపేశారు. చివరికి కటకటాలపాలయ్యారు. కోరుకొండ: సీతానగరం మండలంలో చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీష్, అదే గ్రామానికి చెందిన సృజన దంపతులు 2019 మేనెలలో వివాహమైంది. వీరు ఇక్కడే నివసిస్తున్నారు. భార్యకు నెలలు నిండటంతో భర్త సతీష్ ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఈనెల 4వ తేదీన ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలు సురక్షితంగా చినకొండేపూడి గ్రామం చేరుకున్నారు.. పుట్టింటికి చేరిన సృజనకు తన తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మి నుంచి నిరాదరణ ఎదురైంది. ఆడపిల్లకు జన్మనిచ్చావని అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రావులపాడు నుంచి వచ్చిన సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం కూడా ఈ విషయంపై ఆగ్రహంగానే ఉంది. (ఒడి నుంచి మాయమై.. బావిలో శవమై..) మూడు తరాలుగా వంశంలో ఆడపిల్లలు జన్మించడం సమంజసంగా లేదని, ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకుంది. నవజాత శిశువును మునిమనురాలను కడతేర్చాలని నిర్ణయించుకుంది. కనకరత్నం, మహాలక్ష్మి ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు. అనంతరం బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేశారు. దీంతో సీతానగరం ఇన్చార్జి ఎస్సై పి. విజయ్కుమార్కు ఫిర్యాదు చేయగా కోరుకొండ సర్కిల్ సీఐ పవన్కుమార్రెడ్డి కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. శుక్రవారం తెల్లవారు జామున నవజాత శిశువు కిడ్నాప్ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నారి ఆచూకీ కోసం గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ముగ్గురూ..ఇలా దొరికారు... శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. అయితే ఈ సంఘటనలో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాలను సేకరించారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ ఎం.మహాలక్షి్మ, ముత్తమ్మ జి.కనకరత్నం హత్యచేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఆదివారం కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ పి.సత్యనారాయణరావు, సీఐ పవన్కుమార్రెడ్డి, ఎస్సై విజయ్కుమార్ వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డీఎస్పీ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిపి హత్యకు పాల్పడ్డారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పవన్కుమార్రెడ్డి, ఎస్సై విజయ్కుమార్, హెడ్కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీను, గోవిందు, రాము, షేక్ వలీ, త్రిమూర్తులు, మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. -
తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు
దొంగలు.. దొంగలూ ఊళ్లు పంచుకున్నట్టు తెలుగు తమ్ముళ్లు జగ్గంపేట సొసైటీలో సొమ్మును మెక్కేశారు. నకిలీ పాస్ పుస్తకాలతో జరిగిన ఈ కుంభకోణంలో రూ.ఆరు కోట్లకు పైగా అవినీతి జరిగిందని సమాచారం. నాటి పచ్చపాలనలో విచ్చలవిడిగా సాగిన ఈ అవినీతిపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సెక్షన్ 51 ప్రకారం విచారణ జరుగుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగు తమ్ముళ్లు ఒక సహకార సంఘంపై పడి నిలువు దోపిడీ చేశారు. నేతల దోపిడీ రూ.ఆరు కోట్లపై మాటేనని ప్రాథమిక సమాచారం. నిజాలు నిగ్గు తేలితే దోపిడీ రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కింది నుంచి పై స్థాయి వరకూ అందరికీ తెలిసే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రుణాల కుంభకోణం జరిగిందని చెప్పేందుకు పలు ఆధారాలు కనిపిస్తున్నాయి. తమ్ముళ్లు వందకుపైనే నకిలీ పాస్ పుస్తకాలు కూడా తయారు చేశారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతల కనుసన్నలో ఇదంతా జరిగింది. సొసైటీలో రికార్డులనే మాయం చేసేశారు. గత సర్కార్లో అడ్డగోలుగా పచ్చ నేతలు మెక్కేసిన రైతుల సొమ్ము ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. క్షేత్ర స్థాయిలో సహకార సంఘం దగ్గర నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వరకూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ఇలా అడుగడుగునా అవినీతి జ్యోతిలా వెలిగిపోయింది. ఈ రుణాల కుంభకోణం వ్యవహారం సహకార సంఘం సీఈఓ అడ్డగళ్ల సాయిరాం ఉసురు తీసింది. రెండుసార్లు నోటీసులు అందుకున్న సీఈఓ సాయిరాం విచారణకు హాజరుకాకుండానే మృతిచెందారు. అప్పట్లో ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. చదవండి: తిరుమల శ్రీవారి దర్శనం షురూ కొనసాగుతున్న విచారణ మెట్ట ప్రాంతంలో లంపకలోవ సొసైటీలో బినామీ రుణాల బాగోతం మరిచిపోకుండానే జగ్గంపేట సొసైటీలో రుణాల కుంభకోణంపై విచారణ జరుగుతోంది. జగ్గంపేట విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్పర్సన్గా 2013 జనవరి నుంచి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి ఉన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొసైటీల్లో అవినీతి ప్రక్షాళన కోసం పాత కమిటీలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలోనే సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్గా బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు) నియమితులయ్యారు. ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సొసైటీ రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. లావాదేవీల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలున్న నేపథ్యంలో గతేడాది ఆగస్టులో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయడంతో సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణకు ఆదేశించిన సంగతి పాఠకులకు విదితమే. విచారణాధికారి శివకామేశ్వరరావు గత డిసెంబర్ 9 నుంచి విచారణ నిర్వహిస్తున్నారు. అంతా బినామీ భాగోతమే... సహజంగా ఒక మధ్యతరగతి రైతు అన్ని ధ్రువీకరణ పత్రాలతో రుణం కోసం సహకార సంఘానికి వెళితే సవాలక్ష సాకులతో నెలల తరబడి తిప్పుకుంటారు. అటువంటిది 110 మంది బినామీలు రైతుల ముసుగేసుకుని నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోట్లు కొట్టేశారు. కోనసీమలోని రాజోలు ప్రాంతంలో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పాసు పుస్తకాలు తయారుచేయడంలో చేయి తిరిగిన ముఠా ద్వారానే జగ్గంపేట సహకార సంఘంలో దాఖలు చేసిన నకిలీ పాసు పుస్తకాలు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. పాసు పుస్తకాలు, వాటి సర్వే నంబర్లు, ఆ సర్వే నంబర్లు వాస్తవమా కాదా అనేది కనీసం పరిశీలన లేకుండా సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్ కూడా చేశారు. వాటిని సొసైటీలో పెట్టినప్పుడు కనీసం సొసైటీ పరిశీలన జరపాలి. చదవండి: నవవధువు అనుమానాస్పద మృతి అక్కడంతా తెలుగు తమ్ముళ్లే ఉండటంతో పక్కా పథకం ప్రకారమే క్రెడిట్ లిమిట్ కోసం డీసీసీబీ బ్రాంచికి, అక్కడి నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కు పంపించేశారు. ఆ సమయంలో జగ్గంపేట డీసీసీబీ బ్రాంచిలో కూడా టీడీపీ ప్యానలే ఉండటంతో కనీసం పరిశీలన జరపకుండా బినామీ పాసు పుస్తకాలపై రుణాలు ముంజూరు చేసి దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకున్నట్టు జగ్గంపేట విశాల పరపతి సంఘంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. అప్పటి పాలకవర్గం కనుసన్నల్లో సుమారు 110 మంది తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగులేసి నకిలీ పాసు పుస్తకాలతో రూ.3 కోట్లు వరకు ముట్టజెప్పారని ప్రాథమిక సమాచారం. బినామీ రైతులంతా జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, ఏలేశ్వరం తదితర మండలాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా మెట్ట ప్రాంతంలో పచ్చ నేతల కొమ్ముకాసిన ద్వితీయ శ్రేణి నేతలే. రుణాలు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకూ వడ్డీలు లెక్క కట్టి చూస్తే రుణాల కుంభకోణం విలువ రెట్టింపు అయ్యే అవకాశాలే ఉన్నాయి. ప్రైవేటు ఆడిట్తో అక్రమాలు కప్పిపుచ్చిన వైనం సంఘాల్లో ఏటా ప్రభుత్వ ఆడిట్లు నిర్వహిస్తుండాలి. ఈ సంఘంలో 2014–15 నుంచి 2018–19 వరకూ జరిగిన కార్యకలాపాలపై ప్రైవేటు ఆడిట్ నిర్వహించి అక్రమాలను కప్పిపుచ్చారనే ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నింటినీ మాయం చేసేశారు.110 బినామీ రుణాల్లో 17 మంది నుంచి రుణాలు తిరిగి వసూలు చేయగలిగారు. ఈ సొసైటీలో కుంభకోణం రుణాలకే పరిమితం కాలేదు. భవన నిర్మాణాలు, నగదు లావాదేవీలు, ఎరువుల కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రస్తుత సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి సొసైటీ నుంచి అధికారికంగా రూ.40 లక్షలకు అనుమతి తీసుకుని అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో వెనుకా ముందూ చూడకుండా చేతి రసీదు పేరుతో రూ.90 లక్షలు ఖర్చు చూపించారని డీసీసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఆ మేరకు రూ.50 లక్షలు దారి మళ్లాయంటున్నారు. ఎరువుల కొనుగోలులో సుమారు రూ.16 లక్షలు, నగదు లావాదేవీల్లో సుమారు రూ.40 లక్షలు..ఇలా అవినీతి భాగోతం రూ.కోటిపైనే ఉంటుందని లేస్తున్నారు. డీసీసీబీ అధికారులకు 20శాతం కమీషన్ ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు ప్రధాన భూమిక పోషించారు. జగ్గంపేట సహకార సంఘం నుంచి రుణాల కోసం ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయాల్సి ఉంది. కానీ డీసీసీబీలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. ప్రతి రుణంపైన డీసీసీబీలో అప్పటి అధికారులు 20 శాతం కమీషన్ తీసుకొని అనుమతి ఇచ్చారని సమాచారం. చదవండి: భలే భలే.. నేనూ పోలీసునే.. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే విచారణ జిల్లా సహకార అధికారుల ఆదేశాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నెల నుంచి విచారణ చేస్తున్నాం. సంఘ«ంలో రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కొంతకాలం, సీఈఓ మృతి చెందడంతో మరి కొంతకాలం విచారణలో జాప్యం జరిగింది. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి విచారణ ముందుకు సాగలేదు. బినామీ పేర్లతో రుణాలు పొందడం, ఎరువుల అమ్మకాలు, నగదు లావాదేవీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. – జె.శివకామేశ్వరరావు, సబ్ డివిజినల్ సహకార అధికారి, విచారణాధికారి, సహకార శాఖ నిజాలు నిగ్గు తేలుస్తాం నేను త్రిసభ్య కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక గత పాలకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. బినామీ పేర్లు, నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు దారి మళ్లించారని సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే వాటిని నివృత్తి చేసి సొసైటీకి అప్పగించాలని నేను జిల్లా సహకార అధికారికి విజ్ఞప్తి చేశాను. ఆ ఫిర్యాదు తరువాతే విచారణాధికారిని నియమించారు. ఇప్పుడు 51 విచారణ జరుగుతోంది. నిజాలు నిగ్గు తేలుస్తాం. – బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు), త్రిసభ్య కమిటీ చైర్మన్, జగ్గంపేట సొసైటీ. -
‘ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి: గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆయన మంగళవారం తూర్పు మన్యంలో గిరిజన కాళ్ల వాపు వ్యాధి నివారణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పలు గిరిజన గ్రామాలను హాట్ స్పాట్లుగా గుర్తించామన్నారు. ప్రతీ ఇంటిని సర్వే చేస్తున్నామని తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి, నివేదికల ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సేకరించిన 103 మంది శాంపిల్స్లో 16 మందికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. (సీఎం సానుకూలంగా స్పందించారు : తలసాని) ఏజెన్సీలో కాళ్ళ వాపుపై రెండవ దశ సర్వే రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని ఆళ్ల నాని అన్నారు. ఎజెన్సీలో అదనంగా మరో డయాలసిస్ సెంటర్ అవసరం ఉందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తర్వలోనే మరో డయాలసీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో రక్షిత మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన గిరిజన గ్రామాల్లో యూవీ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఆళ్లనాని అన్నారు. (రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్ జగన్) తూర్పు ఏజెన్సీలో ఇప్పటికే 45 విలేజ్ క్లినిక్లు ఉన్నాయని, మరో 20 క్లినిక్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో చింతూరు ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా విస్తరిస్తామని తెలిపారు. ‘నాకు-నేడు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆస్పత్రి పరిస్థితిని సమూలంగా మారుస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పీఎచ్సీలను ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కాళ్ల వాపు వ్యాధితో 14 మంది మృతి చెందారని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. ఇక ఏజెన్సీలో మరో రెండు కొత్త పీఎచ్సీలను ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని చెప్పారు. ఈ సమీక్షలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే లు నాగులపల్లి ధనలక్ష్మీ, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి,పెండెం దొరబాబు పాల్గొన్నారు. (సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు) -
ఒకే ఒక్కడు.. ముప్పు తెచ్చాడు!
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది చెవికెక్కించుకోవడం లేదు. అవగాహనా రాహిత్యమో, ‘మనకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్యమో కానీ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో జిల్లాలోనే కరోనా తొలిసారిగా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచీ గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం పదేపదే చెబుతూనే ఉంది. కానీ ఆ మాటలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలకు వెళ్లకుండా రోగాన్ని దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు జిల్లాను భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. ఇలా రోగాన్ని దాచిపెట్టి నాడు కత్తిపూడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తాజాగా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన హోటల్ క్యాషియర్ (ఫొటోగ్రాఫర్ కూడా) ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) కత్తిపూడిలో ఉపాధ్యాయుడు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మృత్యువు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డాడు. ఆ ఉపాధ్యాయుడు కరోనా లక్షణాలపై గోప్యత పాటించి పలువురికి పాజిటివ్ రావడానికి కారణమయ్యాడు. తాజాగా తొలి కరోనా మరణం నమోదైన గొల్లల మామిడాడలో కూడా కత్తిపూడి తరహా పరిణామమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గొల్లల మామిడాడలో హోటల్ క్యాషియర్ మృతి చెందాక కరోనా పాజిటివ్గా గుర్తించారు. ఆ కేసుతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులన్నీ కలిపి గడచిన 48 గంటల్లో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకేసారి రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జి.మామిడాడ, పరిసర గ్రామాల్లో సుమారు 500 మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి ) మరింతమందికి నిర్వహిస్తోంది. జి.మామిడాడ, బిక్కవోలు, రామచంద్రపురంలో నమోదైన కేసులన్నీ మృతి చెందిన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అతడికి ఆస్తమా లక్షణాలున్నట్టు భావించి, కాకినాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసిన నలుగురు హౌస్ సర్జన్లను, పదిమంది మెడికోలను క్వారంటైన్కు తరలించారు. మరణించిన ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. మృతుడు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొంది ఉంటే ఇప్పుడు ఇంతమందికి వైరస్ వ్యాప్తి చెంది ఉండేది కాదని, వారందరికీ ముప్పు తప్పేదని వైద్యులు అంటున్నారు. (విజయవాడ ఎయిర్పోర్టులో ఏర్పాట్లు పూర్తి) ఉలిక్కిపడిన మామిడాడ కరోనా వ్యాప్తి మొదలైన తరువాత జిల్లాలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఇన్ని కేసులు వెలుగులోకి రావడంతో గొల్లల మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. సుమారు 20 వేల జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీ గొల్లల మామిడాడ. నిత్యం వందలాదిగా జనంతో రద్దీగా ఉండే మామిడాడ నాలుగు రోడ్ల కూడలిలోని గాం«దీ»ొమ్మ సెంటర్లో ఉన్న హోటల్కు మంచి పేరు ఉంది. దీంతో స్థానికులు ఎక్కువ మంది అక్కడికే వెళ్తూంటారు. ఆ హోటల్లో పని చేసే క్యాషియర్ మృతి చెందిన తరువాత కరోనా నిర్ధారణ కావడంతో మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఆ పరిసర గ్రామాల నుంచి 213 మంది పరీక్షలు చేయించుకున్నారు. (వేలి ముద్రలు పడకపోయినా రేషన్) శనివారం కూడా అదే తరహాలో సుమారు 270 మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వారిని అన్ని వసతులూ ఉంటే హోం ఐసోలేషన్ లేదా హోం క్వారంటైన్కు అవకాశం కలి్పస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. జి.మామిడాడలో మరణించిన వ్యక్తికి పాజిటివ్ అని జీజీహెచ్లో నిర్థారించినప్పటి నుంచి అతడితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల కోసం గ్రామ వలంటీర్లు, ఆశ వర్కర్లు, వైద్యులు అనపర్తి నియోజకవర్గంలో జల్లెడ పట్టారు. అనుమానితులను గుర్తించడం, వారందరినీ అప్రమత్తం చేసి వైద్య పరీక్షలకు తీసుకురావడంలో వైద్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. -
ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేటలో వెండి నాణేలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్ర ఉంపన్ తుపాన్ కారణంగా సముద్రంలోని అలల తాకిడికి కోనపాపపేట తీరంలో పలు ఇళ్లు నేల కూలిపోయాయి. అయితే ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు బుధవారం రాత్రి నుంచి తీరంలో వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం వారు చాలా ధనవంతులని, ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టి ఉన్నారేమో అని ప్రచారం కొనసాగుతోంది. బయటపడ్డ ఈ వెండి నాణేల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఉంపన్’ తీరం దాటిన విషయం తెలిసిందే. -
‘అందరికీ ఇళ్ల పథకంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి: అంఫన్ తుపాన్ వల్ల సముద్రంలో ఎగిసిపడిన అలల తీవ్రతకు నేలకొరిగి ఇళ్లకు ‘అందరికి ఇళ్లు’ పథకంలో కొత్త ఇళ్లని నిర్మిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఆయన బుధవారం తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సూరడాపేట, మాయపట్నం,ఉప్పాడలో కోతకు గురైన ప్రాంతాలను కాకినాడ ఆర్డివో చిన్నకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగు నీరు సదుపాయం అందిస్తున్నామని తెలిపారు. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?) ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో దివంగత నేత వైఎస్సార్ జియా ట్యూబ్ను నిర్మించారని ఆయన గుర్తు చేశారు. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘జియో ట్యూబ్’ పూర్తిగా శిధిలమైందన్నారు. జియో ట్యూబ్తో పాటుగా తుఫాన్కు దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ రాక్ వాల్ విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. -
కరోనా వైరస్: సేఫ్ జోన్లో గిరిజనం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19 వైరస్ మన్యం వైపు తొంగి చూసే సాహసం చేయలేకపోయింది. వ్యాధుల సీజన్ వచ్చిందంటే చాలు అందరి దృష్టీ మన్యంపైనే ఉంటుంది. మలేరియా, కాళ్లవాపు, శిశు, ప్రసూతి మరణాలు..ఇలా ఏ చిన్న రోగమైనా ముందుగా పలకరించేది రంపచోడవరం మన్యాన్నే. వ్యాధులు వచ్చినప్పుడు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాల్సిన పరిస్థితులు. ఏటా ప్రతి సీజన్లో ఇక్కడ ఇదే పరిస్థితి. అటువంటిది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా గిరిజన ప్రాంతాలను తాక లేకపోయింది. సాక్షి, రంపచోడవరం: జిల్లాలో అన్ని సదుపాయాలు, వసతులు, కమ్యూనికేషన్ కలిగిన డెల్టా, మెట్ట ప్రాంతాలను విడిచిపెట్టని కరోనా మహమ్మారి గిరి జనం దరి చేరలేకపోయింది. తొలి కరోనా పాజిటివ్ కేసు రాజమహేంద్రవరం నగరంలో నమోదైన తరువాత వరుసగా కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కొత్తపేట, కత్తిపూడి, తుని, కోనసీమలోని బండార్లంక, కొత్తపేటలోని ఏనుగులమహల్ వరకూ విస్తరించి జిల్లాలో 50కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా అన్ని ప్రాంతాలకూ పాకిన ఈ వైరస్ రంపచోడవరం మన్యం సరిహద్దులను కూడా తాకలేక పోయింది. మైదాన ప్రాంతంతో పోలిస్తే మన్యంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువనే చెప్పొచ్చు. కానీ ఈ పారంతంలో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు మండలాలున్న రంపచోడవరం మన్యంలో తెలంగాణ నుంచి వచ్చిన నాలుగు మండలాలతో కలిపి 11 మండలాలున్నాయి. రంపచోడవరంతోపాటు అదనంగా చింతూరు ఐటీడీఏ కూడా ఏర్పాటైంది. ఈ రెండు ఐటీడీఏల పరిధిలో 176 గ్రామ పంచాయతీలలో సుమారు 3.4 లక్షల మంది గిరిజనులున్నారు. మొత్తం జిల్లాలో సగానికిపైగా భూ భాగం కలిగిన ఏజెన్సీలో ఒక్క పాజిటివ్ కేసే కాకుండా అనుమానిత కేసులు కూడా నమోదు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందునా రంపచోడవరం మన్యం చుట్టూ పలు రాష్ట్రాల సరిహద్దులు కూడా ఉండటం గమనార్హం. గడచిన 48 గంటల్లో జిల్లాలో బండార్లంక, కొత్తపేట ఏనుగులమహల్ తదితర ప్రాంతాల్లో నమోదైన నాలుగు పాజిటివ్ కేసులు కూడా రాష్ట్ర సరిహద్దులు దాటి తమిళనాడులోని కోయంబేడు వెళ్లి తిరిగొచ్చిన వారి ద్వారానే వచ్చాయి. సరిహద్దులు మూసివేయడంతోనే... ఏజెన్సీ నుంచి గిరిజనులు ఉపాధి, ఇతర అవసరాల కోసం పొరుగున పశి్చమగోదావరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్తుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో గిరిజనులు జిల్లా సరిహద్దు దాటి వెళ్లకుండా స్వీయ నియంత్రణ, లాక్డౌన్ను పాటించడంతో కరోనా మన్యం దరిచేరలేదని గిరిజన నేతలు పేర్కొంటున్నారు. అక్షరాస్యత, నాగరికతలో ఇప్పటికీ మైదాన ప్రాంత ప్రజలతో ఆశించిన స్థాయిలో పోటీపడలేకున్న గిరిజనులు కోవిడ్–19 వెరస్ దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ముందున్నారని చెప్పొచ్చు. లాక్డౌన్ అనంతరం బయట ప్రాంతాలకు చెందిన ఏ ఒక్కరినీ అడుగు పెట్టనీయకుండా మన్యం చుట్టూ సరిహద్దులను మూసేయడం కూడా ఇందుకు దోహదం చేసింది. మన్యంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ ప్రవేశించి ఉంటే నియంత్రణ సవాల్గా మారేదని అక్కడి వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా మొత్తంలో సగ భాగంపైనే ఆక్రమించిన మన్యంలో యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. మూడు రాష్ట్ర సరిహద్దులు, రెండు పొరుగు జిల్లాల సరిహద్దులు బంద్ చేశారు. సరిహద్దు ఆవల నుంచి ఎవరూ రాకుండా నిరంతరం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా కలిసి వచ్చింది. విశాఖ నుంచి రాకుండా డొంకరాయి, మైదాన ప్రాంతాల నుంచి రాకుండా ఏజెన్సీ ముఖద్వారం పోక్సుపేట, పశ్చిమగోదావరి నుంచి రాకుండా దండంగి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరతంరం పర్యవేక్షించారు. తెలంగాణ, ఎటపాక, చత్తీస్గడ్, ఒడిశా సరిహద్దుగా కుంట వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అడపా దడపా వలస కూలీలు వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కి తిప్పి పంపడం లేదా, మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్కు తరలించడంతో కరోనా మన్యం దరిచేరకుండా జిల్లా యంత్రాంగం విజయాన్ని సాధించిది. సమష్టి కృషి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీఓలు నిషాంత్కుమార్, వెంకటరమణ, ఏఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్ర స్థాయిలో సమన్వయ కృషి ఫలితాన్నిచ్చింది. మన్యంలో మరణాలు 2018లో 67 మంది శిశువులు, ఐదుగురు తల్లులు (అనారోగ్యంతో) 2019లో 29 మంది శిశువులు, ఐదుగురు తల్లులు మూడేళ్లలో కాళ్లవాపు వ్యాధితో 20 మంది గిరిజనులు కరోనా పాజిటివ్ కేసులు నిల్–మరణాలు నిల్ ఆదివాసీల అప్రమత్తతే శ్రీరామరక్ష ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఏజెన్సీలోకి అడుగుపెట్టకుండా ఆదివాసీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం స్వచ్ఛందంగా రాకపోకలు నివారించి అంటువ్యాధిని తమ గ్రామాల వైపు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. గతంలోకంటే సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అయినా బయటకు రాకుండా తమ అవసరాలను స్ధానికంగా దొరికేవాటితో తీర్చుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లడం కూడా తగ్గించారు. –లండా వేణుగోపాల్, ఎస్టీయూ నాయకుడు, రంపచోడవరం -
‘చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం’
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా(కోవిడ్-19) ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా కేంద్రం నిర్ణయించగా తూర్పుగోదావరి జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 1న జిల్లాలో మళ్లీ తునిలో తొలి కేసు నమోదైందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. జిల్లాలో 12 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ఎటువంటి సడలింపులు లేవని ఆయన స్పష్టం చేశారు. (కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్ కేసులు) రాజమండ్రి, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, ప్రాంతాల్లో కంటైమెంట్ జోన్లు ఉన్నాయన్నారు. కంటైన్మెంట్ మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో 33 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు హ్యాండ్ వాష్, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఆటోల్లో ఇద్దరు, కారులో ముగ్గురు, టూ వీలర్ వాహనాల్లో ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. జిల్లాలో 12, 372 శాంపిల్స్ పరీక్షిస్తే, 45 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ప్రతీరోజు 5 నుంచి 6 వందల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. హెల్త్, శానిటేషన్ సిబ్బందికి హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో ఆరు కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కరోనా బాధితులంతా కోలుకుంటున్నారని, ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 65 చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని రేపటి (సోమవారం) నుంచి గ్రీన్జోన్లోని పరిశ్రమలు నిబంధనలు అనుసరిస్తూ కార్యకాలపాలు చేపట్టవచ్చని ఆయన వివరించారు. జిల్లాలో 2765 మంది వలస కార్మికులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వీరిలో 885 మంది ఏపిలో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారిని సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సొంత వాహనాలు ఉంటే సొంత ఊర్లు వెళ్లేందుకు అనుమతిస్తామని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. గ్రీన్జోన్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలు, సభలు సమావేశాలకు అనుమతి లేదని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. -
కరోనాపై యూట్యూబ్లో అవగాహన
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా జీవించాలో వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ పాటల రూపంలో యూట్యూబ్ లో వీడియో, కవితా సంపుటాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణ చర్యలను వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు విజయశేఖర్ స్వీయ రచనలో దీనిని రూపొందించారు. (రెడ్ జోన్లో మినహాయింపులకు నో..) వైరస్ ఎక్కడి పుట్టింది, దీని ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పొందుపరుస్తూ ఆరు నిమిషాల పాటు ఈ వీడియో రూపొందించారు. ఔషధ నియంత్రణ శాఖలో పని చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఉద్యోగులే మొత్తం దీని రూపకల్పనకు సహాయ సహకారాలు అందించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేళ ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలపై ఏడీ విజయశేఖర్ హిందీ కవితా సంపుటి రచించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. (పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ) -
‘బ్యాంక్పేటలో రెడ్జోన్ ఎత్తివేత’
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్పేటలో రెడ్జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్జోన్గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ జోన్లోకి రావడానికి సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అతని అనుచరులు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు. దుమ్ములపేటలో పోర్టు భూముల నుంచి సేకరించిన స్థలాల్లో మడఅడవులు ఉన్నాయాని అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అవి అటవీశాఖ భూములు కావని, మత్స్య సంపదకు నష్టం కలగదని అధికారులు ఇచ్చిన పత్రాలను ద్వారంపూడి మీడియాకు విడుదల చేశారు.(శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్) ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. కాకినాడలో 34 వేల మంది లబ్దిదారులకు జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. -
కరోనా పాజిటివ్ రిపోర్టు కలకలం
రాజానగరం: రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేట నుంచి రాజానగరంలోని కుమార్తె ఇంటికి వచ్చిన 53 సంవత్సరాల ముస్లిం మహిళకు కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చిందనే విషయం తెలియడంతో రాజానగరంలో కలకలం బయలుదేరింది. స్థానిక బస్టాండ్ వెనుకనున్న మార్కెట్ని ఆనుకుని ఉన్న దొమ్మరిపేటలో ఆ మహిళ రెండు రోజులపాటు ఉండటం, కుమార్తె కుటుంబ సభ్యులు మార్కెట్లో చికెన్, మటన్, చేపల వర్తకులతో కలిసిమెలసి తిరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ కుమార్తె ఇంట రెండు రోజులున్న సమయంలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల నగదు సహాయాన్ని కూడా ఆమె అందుకుంది. అనంతరం రాజమహేంద్రవరం వెళ్లిన ఆమెను, రాజానగరంలోని ఆమె కుమార్తెను, మరో ముగ్గురు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కి తరలించారు. ప్రస్తుతం ఆమెకు పాజిటివ్ రిపోర్టు రావడంతో రాజమహేంద్రవరం నుంచి రాజానగరం తీసుకువచ్చిన వ్యక్తిని, అతనితోపాటు ఉన్న మరొకరిని కూడా బుధవారం క్వారంటైన్కి తీసుకువెళ్లారు. రాజానగరం దొమ్మరిపేటలో గ్రామ వలంటీర్లతో ముమ్మరంగా సర్వే నిర్వహించారు. పంచాయతీ సిబ్బందితో ప్రతి రోజూ శానిటేషన్ చేస్తున్నామని నోడల్ అధికారి, తహసీల్దారు జి.బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవసరమైతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్గా చేస్తామన్నారు. రెడ్జోన్లో కొంతమూరు రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరు గ్రామంలో 50 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. రాజమహేంద్రవరం సబ్కలెక్టర్ డాక్టర్ ఆర్.మహే‹Ùకుమార్, డీఎల్పీవో సత్యనారాయణ, ధవళేశ్వరం సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, పోలీసు అధికారులు పర్యవేక్షించడంతో పాటు, వైద్యశిబిరంతోపాటు కంట్రోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటకు రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు. -
పిఠాపురంలో కరోనా కలకలం
పిఠాపురం: పట్టణంలోని ఒక యువకుడు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరిన 24 గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో పిఠాపురంలో అధికారులు హై ఎలర్ట్ ప్రకటించారు. పిఠాపురం తారకరామానగర్లో నివాసముంటున్న ఒక వ్యక్తి తెలంగాణలోని మంచిర్యాలలో కూలి పనికి వెళ్లి, గత నెల 22 తిరిగి పిఠాపురం చేరుకున్నాడు. ఇప్పటికే రెడ్జోన్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా మంచిర్యాల నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు ఇద్దరిని, పక్కింటిలోని ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఇంటిని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి హై ఎలర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ పర్యవేక్షణలో పిఠాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ విజయశేఖర్, సీఐ బి.అప్పారావు, ఎస్సై అబ్దుల్ నబీ పరిస్థితిని సమీక్షించారు. క్వారంటైన్కు మరో తొమ్మిది మంది పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి మంచిర్యాల పనికి వెళ్లిన గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చేబ్రోలుకు చెందిన తొమ్మిది మందిని తాటిపర్తి హైస్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్కు అధికారులు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ మంచిర్యాల వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు తదితర 75 మందికి కరోనా పరీక్షలు చేశారు. 31 మంది రక్తనమూనాల సేకరణ శంఖవరం: కత్తిపూడిలో శనివారం 31 మంది రక్తనమూనాలు సేకరించినట్లు వైద్యుడు పి.రవికుమార్ తెలిపారు. పిఠాపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి పని కోసం తెలంగాణలోని మంచిర్యాలకు కత్తిపూడికి చెందిన 30 మందితో వెళ్లాడు. దీంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కత్తిపూడిలోని రెడ్జోన్ ప్రాంతాన్ని సందర్శించారు. రాజమహేంద్రవరంలో మరో ఐదుగురికి పాజిటివ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో శనివారం రాత్రి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని మంగళవారపుపేటలో శుక్రవారం 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా వచ్చిన విషయం తెలిసిందే. ఆమెతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో శనివారం ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారిని రాజానగరం జీఎస్ఎల్ కోవిడ్–19 జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరందరూ మంగళవారపుపేట, కొత్తపేటకు చెందినవారు. కేసులు పెరగడంతో కలెక్టర్ డి.మురళీధరరెడ్డి హుటాహుటిన రాజమహేంద్రవరం చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. పాజిటివ్ కేసులు వచ్చిన మంగళవారపుపేట, కొత్తపేటలను రెడ్జోన్గా ప్రకటించారు. ఆ రెండు ప్రాంతాలకు వెళ్లే మార్గాలన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కమిషనర్, మాజీ కార్పొరేటర్ మధ్య వివాదం
కాకినాడ: నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి మధ్య చోటు చేసుకున్న సంవాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తన ఇంటి సమీపంలో గబ్బిలాలు తిరుగుతున్నాయంటూ ఫోన్ చేసిన మాజీ కార్పొరేటర్.. తనను దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించారని కమిషనర్ కె.రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ తనపై దాడి చేశారంటూ మాజీ కార్పొరేటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్కు చంద్రమౌళి ఫోన్ చేశారు. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గబ్బిలాలు తిరుగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ అసహనంతో తనను, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా దుర్భాషలాడరని కమిషనర్ చెబుతున్నారు. ఆ తరువాత కూడా రాత్రి పదేపదే చంద్రమౌళి తనకు ఫోన్లు చేశారని కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో మాజీ కార్పొరేటర్ ఇంటి వద్దకు కమిషనర్ రమేష్ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తన ఇంటికి వచ్చిన కమిషనర్, దాడి చేసి కొట్టారంటూ చంద్రమౌళి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కమిషనర్ రమేష్ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైతే మున్సిపల్ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాజీ కార్పొరేటర్ వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమౌళి మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి దాడి చేసి గాయపర్చిన కమిషనర్పై చర్య తీసుకోవాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీజీహెచ్లో మాజీ కార్పొరేటర్ను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్ పరామర్శించారు. -
కరోనా విపత్తు: కానరాని టీడీపీ నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. ఆపద వేళ ప్రజలను ఆదుకున్న వారే అసలైన నాయకులు. అటువంటి వారిని ప్రజ లు పార్టీలతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నామని, ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని తరచూ గర్వంగా చెప్పుకొంటూ కాలరెగరేసే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ చిన్న విషయాన్ని మరచినట్టున్నారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు లాక్డౌన్ విధించిన ప్రభుత్వాలు.. కూలి లేక.. కూటికి నోచుకోక అల్లాడుతున్న ప్రజలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వాలు, పలు సంస్థలతో పాటు పలువురు దాతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కూడా తమకు తోచిన రీతిలో నిత్యావసరాలు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కుల వంటివి అందిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారు. ప్రజలను వదిలేశారిలా.. టీడీపీలో నంబర్–2గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు అమరావతికే పరిమితమయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తుని నియోజకవర్గ ప్రజలు యనమల సోదరద్వయం తీరుతో విసుగెత్తిపోయి ఇంటికి సాగనంపారు. అందుకనే యనమల బ్రదర్స్ కరోనా మహమ్మారి కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో సైతం అక్కడి ప్రజలు ఎలా ఉన్నారనే వాకబు కూడా చేయలేదని అంటున్నారు. అదే యువకుడైన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా రెండోసారి ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు తన వంతు చేదోడుగా ప్రజలకు విస్తృతమైన సేవలందిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చక్రం తిప్పిన నిమ్మకాయల చినరాజప్ప కరోనా భయంతో ఉన్న ప్రజలకు ధైర్యం కల్పించడంలో నామ్కే వాస్తే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. స్థానికేతరుడని కూడా చూడకుండా పెద్దాపురం ప్రజలు రెండోసారి ఆయనను ఎమ్మెల్యేను చేశారు. ప్రస్తుత ఆపత్కాలంలో రాజప్ప తమకు భరోసా అందిస్తారని ఆ నియోజకవర్గ వాసులు ఎదురుచూశారు. తీరా ఏదో ఒకటీ అరా అదీ కూడా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల్లోనో.. అధికారులతో మొక్కుబడి సమీక్షల్లోనో ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులిపేసుకున్నారని పెద్దాపురం ప్రజలు ఆక్షేపిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ ప్రజలు ఆదిరెడ్డి భవానీని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆమె కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నగర ప్రజలను కనీసంగా కూడా కలుసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. భవానీ చారిటబుల్ ట్రస్టు పేరుతో చేసిన ఒకటీ అరా సేవా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్గా పని చేసిన ఆమె అత్త వీరరాఘవమ్మ, మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల్లో ఏ ఒక్కరూ కనిపించలేదు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీలో 100 మంది కార్మికులకు మొక్కుబడిగా బియ్యం, మాసు్కలు ఇచ్చి ఊరుకున్నారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారని ఆ నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రెండుసార్లు గెలిపించినందుకు ఆయన తమ కు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మండపేటలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావు కూడా ఇదే దారిలో ఉన్నారు. ఈ నెల 6న మండపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి మాసు్కలు, శానిటైజర్లు అందజేశారు. అంతే.. ఆ తరువాత ఆయన అడ్రస్ లేరని పలువురు ఆక్షేపిస్తున్నారు. కరోనా భయం సర్వత్రా నెలకొన్న వేళ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ వర్మ (పిఠాపురం), దాట్ల బుచ్చిబాబు (ముమ్మిడివరం) తదితరులు ప్రజలను కనీసంగా కూడా పలకరించడం లేదు. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట) కొద్దోగొప్పో కార్యక్రమాలు చేస్తున్నా, గొల్లపల్లి సూర్యారావు (రాజోలు), బండారు సత్యానందరావు (కొత్తపేట), వనమాడి కొండబాబు (కాకినాడ సిటీ).. ఇలా దాదాపు మాజీలంతా ప్రజలతో పని లేదన్నట్టుగా కనీసం ముఖం కూడా చూపించడం లేదు. ‘ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ప్రస్తుత కరోనా విపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దీనిని అక్షరాలా ఆచరిస్తున్న వారు ఎందరో కనిపిస్తున్నారు. స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగినట్టు ‘బాధాసర్పదషు్టల’కు మనసారా సాయం అందిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు కదులుతున్నారు. ఇటువంటి ఆపద సమయంలో ప్రజలకు అన్నివిధాలా అండగా ఉండాల్సిన ‘పచ్చ’ నేతలు మాత్రం దాదాపు పత్తా లేకుండా పోయారు. మానవాళిని కబళించేందుకు వేయి తలల విషనాగులా బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. ఇళ్లల్లోనే ‘లాక్’ అయ్యి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో కృషి చేస్తూంటే.. దానిని చూడలేక.. మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒడ్డున కూర్చుని విమర్శల రాళ్లు విసురుతున్నారు. తద్వారా తమకు దూషించే నోళ్లే తప్ప.. సాయం చేసే చేతులు లేవన్న విషయాన్ని నిరూపించుకుంటున్నారు. దోచుకుని.. దాచుకుని.. గత ప్రభుత్వ హయాంలో ఇటు తుని నుంచి అటు రాజోలు వరకూ.. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణా, వివిధ పనుల్లో పర్సంటేజీలు నొక్కేసి వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ములను ఓట్ల కోసం ఎన్నికల్లో కుమ్మరించి, ప్రలోభాలతో కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. నిరంతరం ‘ప్రజలే దేవుళ్లు’ అని చెప్పుకొనే టీడీపీ నాయకులు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతను వారు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి ఓటేస్తే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనీసం సాంత్వన కల్పించలేని నాయకులు భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని వస్తారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు టీడీపీ నేతల తీరుకు పూర్తి భిన్నంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ వేళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 14 లక్షల పై చిలుకు కుటుంబాలకు వెయ్యి రూపాయలు, బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసి భరోసా కల్పించింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులూ ప్రజలకు ధైర్యం చెబుతూ, దగ్గరుండి మరీ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మం్రత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ యంత్రాంగం యావత్తూ నిత్యం ప్రజలతోనే ఉంటూ వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, యువత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్టయినా చలించని టీడీపీ నేతల తీరును జిల్లా ప్రజలు ఆక్షేపిస్తున్నారు. -
24 గంటల్లో కరోనా పరీక్షల నివేదికలు
కరోనా పరీక్షల రిపోర్టుల కోసం ఇన్నాళ్లూ వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఫలితం త్వరితగతిన రోగి చెంతకు చేరి సాంత్వన చేకూరుస్తోంది. విశాఖలో కొత్తగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కాకినాడలోని పరీక్ష కేంద్రంపై ఒత్తిడి తగ్గడంతో ఈ వెసులుబాటు వచ్చింది. సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా మహమ్మారిని 24 గంటల్లో పసిగట్టేస్తారు. ఇంతవరకూ కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో వందల శాంపిళ్లు వచ్చిపడుతున్నా నివేదికలు రావడానికి రోజులు తరబడి పట్టేది. కనీసంగా ఒక నివేదిక కోసం నాలుగైదు రోజులు నిరీక్షించే పరిస్థితి. మన జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి శాంపిళ్లు కాకినాడ లే»ొరేటరీకే వచ్చేవి. నాలుగు జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లలో అనుమానం ఉంటే ఒకటికి, రెండుసార్లు అవసరమైతే మూడు పర్యాయాలు పరీక్షలు చేసి నిర్థారించుకున్నాకనే ఫలితాన్ని ప్రకటించే వారు. రోజువారీగా నాలుగు జిల్లాల నుంచి 500 పైబడే శాంపిళ్లు కాకినాడ జీజీహెచ్కు పరీక్షల కోసం వచ్చేవి. దీనివల్ల జరిగే జాప్యాన్ని నివారించి పరీక్షలు, నివేదికలు వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విశాఖపట్నంలో ప్రత్యేకంగా లేబొరేటరీ ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకినాడకు కరోనా శాంపిల్స్ సోమవారం నుంచి పంపడం ఆపేశారు. ఫలితంగా కాకినాడలో ప్రయోగశాల ఈ జిల్లా వరకే పరిమితం కావడంతో ఇక్కడి నివేదికలు ఒక్క రోజులోనే చేతికివచ్చే సానుకూలత ఏర్పడింది. రెడ్జోన్లపై నిరంతర నిఘా ఓ పక్క శాంపిల్స్ పరీక్షలను వేగవంతంచేస్తూ.. మరోపక్క ఆ మహమ్మారిని బయట ప్రాంతాల నుంచి అడుగుపెట్టకుండా జిల్లాలో దారులన్నీ మూసేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిని రెడ్ జోన్లుగా ప్రకటించారు. కత్తిపూడిలో పాజిటివ్గా నమోదైన ఒక ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం మరో ఐదుగురికి వ్యాధి సోకడంతో రెడ్ జోన్లపై జిల్లా యంత్రాంగం నిరంతర నిఘాలో పెట్టింది. రెడ్జోన్ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకూ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా పేర్కొని కంటోన్మెంట్గా డిక్లేర్ చేశారు. అటువంటి ప్రాంతాలన్నింటినీ జిల్లా యంత్రాంగం పూర్తి అజమాయిషిలో పెట్టుకుని ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. జిల్లాలో ఉన్న ఎనిమిది రెడ్జోన్ల పరిధిలో ఉన్న 32,194 కుటుంబాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఈ జోన్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజు నిశితంగా పరిశీలించి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించేలా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా సమాచారాన్ని సేకరించి కోవిడ్ జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్–2 రాజకుమారి జిల్లా కలెక్టర్కు నివేదిస్తున్నారు. దీనివల్ల రెడ్జోన్లలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ ఎనిమిది జోన్లలో ప్రతి రోజు ర్యాండమ్గా 40 శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 80, పెద్దాపురం, పిఠాపురం, కత్తిపూడి, కొత్తపేట రెడ్జోన్ల నుంచి 30 వంతున మొత్తంగా ప్రతి రోజు 200 నమూనాలు ప్రత్యేక ఐసోలేటెడ్ అంబులెన్స్లో విజయవాడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ నుంచి జిల్లాకు ఆదేశాలు వచ్చాయి. వీటితో సంబంధం లేకుండా కాకినాడ కరోనా లేబరేటరీలో ప్రతి రోజూ 170 శాంపిళ్లు పరీక్షించనున్నారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 25 వంతున, జిల్లాలో పీహెచ్సీలు, సీహెచ్సీలు, వలంటీర్లు, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసే కేసుల్లో 120తో కలిపి మొత్తం 170 శాంపిళ్లు రోజూ పరీక్షించి నివేదికలు రూపొందించాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడకు శాంపిల్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో పరీక్షలు ఎక్కువ చేయడం కంటే నివేదికలు త్వరగా రావడానికి మార్గం సుగమం కానుంది. సోమవారం ఒక్క రోజే 141 శాంపిల్స్ సేకరించారు. జిల్లాలో మొత్తంగా 1638 శాంపిళ్లు సేకరించగా 1309 నివేదికలు రాగా, మరో 329 నివేదికలు రావాల్సి ఉంది. 3,442 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘ఇక వేగవంతంగా నివేదికలు’ కరోనా పరీక్షలు, నివేదికలు త్వరగా బయటకు రానున్నాయి. కేవలం 24 గంటల్లోనే నివేదికలు అందజేసే వెసలుబాటు కూడా మన జిల్లాకు లభించింది. ఇంతవరకూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా కాకినాడ లే»ొరేటరీకి శాంపిళ్లు వస్తుండేవి. ఈ కారణంగా మన జిల్లాలో వచ్చే శాంపిళ్లు పరీక్షలు జరిపి నివేదికలు బయటకు రావడానికి రోజులు పట్టేది. ఇక ముందు ఆ పరిస్థితి లేదు. కాకినాడ జీజీహెచ్లో జిల్లాలో సేకరించే శాంపిళ్లు మాత్రమే ఇక్కడ పరీక్షించనుండటంతో నివేదికలు వెంటవెంటనే వచ్చేస్తాయి. డి.రాజకుమారి, జేసీ–2. కోవిడ్–19 నోడల్ అధికారి -
లాక్డౌన్: అక్క, తమ్ముళ్లను 13ఏళ్ల తర్వాత కలిపింది
సాక్షి, తూర్పుగోదావరి: లాక్ డౌన్ నేపథ్యంలో రాజమహేంద్రవరం బీసీ బాయ్స్ హాస్టల్ను ప్రస్తుతం వలస కూలీలు, నిరాశ్రయులకు వసతి గృహంగా మార్చారు. అందులో ఆశ్రయం పొందుతున్న కేరళకు చెందిన రామేశం (41) అనే వ్యక్తి 2003 లో స్కిజోఫ్రీనియా అనే వ్యాధితో బాధపడుతూ ఇంటి నుండి తప్పిపోయి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అయితే ఆదివారం జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం వైద్యులు వలస కార్మికులు, నిరాశ్రయులు ఉన్న వసతి గృహాలను సందర్శించి వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందులో భాగంగా వారు రామేశంతో మాట్లాడగా ఆయన చెప్పిన వివరాల ఆధారంగా కేరళలోని త్రుసూర్ మానసిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా బాధితుడి అక్క వీడియో కాల్లో మాట్లాడి ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతమైంది. 13 సంవత్సరాల క్రితం దూరమైన అక్క తమ్ముళ్లను లాక్ డౌన్ కలపడం విశేషం. -
కత్తిపూడిలో హై అలర్ట్..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కత్తిపూడిలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి నుంచి మరో ఐదుగురికి వైరస్ వ్యాపించడంతో ఆ గ్రామాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. శుక్రవారం వచ్చిన రిపోర్ట్స్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గత రెండు రోజుల్లో కత్తిపూడిలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 17కు చేరుకుంది. కత్తిపూడిని రెడ్జోన్గా ప్రకటించడంతో అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. -
లాక్డౌన్: 50 శాతం కూలి అదనం
సాక్షి, కాకినాడ: ఆక్వా పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ‘కోవిడ్–19’ వైరస్ దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. లాక్డౌన్ కారణంగా పది రోజులుగా స్తంభించిన రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనుమతులు మంజూరు చేసింది. కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళుతోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చించారు. ప్రస్తుతం కూలీలకు ఇస్తున్న కూలి కంటే 50 శాతం అదనంగా అందించాలని సూచించారు. అందుకు ఆయా యూనిట్ల యాజమాన్యాలు అంగీకరించాయి. పనులు చేస్తున్న చోటే కూలీలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చూపిన చొరవతో ఐదు రోజులుగా ఆక్వా ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. వాటిని ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు కొనుగోలు చేసి భద్రపరుస్తున్నాయి. ప్రొసెసింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎగుమతులు ప్రారంభిస్తారు. ఏం జరిగిందంటే.. కరోనా ప్రకంపనలు జిల్లాలోని ఆక్వా ఉత్పత్తులకు తాకడంతో నెలన్నర రోజులుగా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో పది రోజులుగా మరింత దారుణంగా మారింది. డిసెంబర్లో వచ్చే పంటతో లాభాలు ఆర్జించవచ్చని గంపెడాశలు పెట్టుకున్న సాగుదారులకు ఈ సంక్షోభం కన్నీళ్లు మిగిల్చింది. ధరల పతనానికి తోడు.. ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడడంతో చెరువుల్లోని రొయ్యల పట్టుబడి చేయలేని స్థితి నెలకొంది. దీనికితోడు దళారులు దీన్ని బూచిగా చూపిస్తూ మరింత ప్రతిష్టంభన సృష్టించారు. దీంతో ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య కొట్టుమిట్టాడింది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దాదాపు 25 వేల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. ప్రాసెసింగ్ కంపెనీల నుంచి కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. భారతదేశం నుంచి యూఎస్ఏ, ఈయూ, చైనా, జపాన్ వంటి దేశాలకు లక్షల మెట్రిక్ టన్నుల్లో సరుకు ఎగుమతి అవుతోంది. ఇందులో అత్యధికంగా యూఎస్ఏకు 41 శాతం ఉండగా.. తర్వాత చైనా దేశానికి 23 శాతం మేర సరుకు రవాణా అవుతోంది. తర్వాత జపాన్ 16, ఈయూకు 10 శాతం ఎగుమతి అవుతోంది. జిల్లా నుంచి ఏటా 1.20 లక్షల నుంచి రూ.1.35 మెట్రిక్ టన్నుల వరకూ సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. రూ.3,900 కోట్ల వ్యాపారం సాగుతోంది. నెల రోజులుగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షల మెట్రిక్ టన్నుల సరుకు గోదాములకే పరిమితమైంది. స్థానికంగా గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడుతుంటే.. ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులకు ఆశించిన ధర చెల్లించలేని పరిస్థితిలో ఎగుమతిదారులు ఉన్నారు. ఎకరాకు రూ.7 లక్షలకు పైనే పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. మంత్రి కన్నబాబు చొరవతో.. ఆక్వా రైతుల దీనావస్థను స్వయంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. సీఎం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం స్పందించారు. ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ కరప మండలంలో ఉన్న రొయ్యల ప్రొసెసింగ్ యూనిట్లను సందర్శించారు. యూనిట్లు తెరచి పనులు చేపట్టాలని సూచించారు. కూలీల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆక్వా కేంద్రం వద్ద ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. పనులు చేసే ప్రాంతంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం పాటించాలని, కారి్మకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. -
ధాన్యం కోనుగోలుకు సన్నద్ధం
సాక్షి, కాకినాడ: జిల్లాలో ధాన్యం సేకరణకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలుకు చేయనున్నట్లు జేసీ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కలి్పంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించడంతో కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 1,64,882 హెక్టార్లు పంట సాగైంది. 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 14.10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా.. ఈ ఏడాది సకాలంలో పంటలకు ప్రభుత్వం నీరు అందించడంతో 40 వేల మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఎకరానికి 40 నుంచి 45, 50 బస్తాల వరకు దిగుబడి అందుతుందన్న ఆశాభావం రైతుల నుంచి వ్యక్త మవుతోంది. జిల్లా పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 246, డీసీఎంఎస్ 6, డ్వాక్రా సంఘాల ద్వారా 20 కొనుగోలు కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కలాల్లోనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిల్లుల యజమానులు సీఎంఆర్ ఆడించి ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రబీ సాగులో 35 శాతం బొండాలు పండించారు. దీంతో అయిదు లక్షల టన్నుల వరకూ బొండాలు రకం ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా వీటన్నింటినీ కొనుగోలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11,69,549 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1815 ఎంఎస్పీ ఉంది. ఏ గ్రేడ్ రకానికి రూ.1835గా ప్రకటించారు. 35.03 లక్షల గోనె సంచులను సిద్ధం చేస్తున్నారు. కలాల్లోనే పాత విధానంలోనే ధాన్యం సేకరించనున్నారు. ఈ మేరకు యంత్ర సామగ్రిని కూడా సిద్ధం చేశారు. నిబంధనలు సడలింపు ‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. అన్ని రకాల ఉత్పత్తులు, రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించింది. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ పనులు, ధాన్యం ఎగుమతులు, దిగుమతులకు, నూరి్పళ్లకు లాక్డౌన్ నుంచి వెసులుబాటు కలి్పస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవాణాకు అవరోధం లేకుండా చూస్తాం ధాన్యం సేకరణకు సన్నద్ధం అవుతున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే సింహభాగం పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో ప్రక్రియ ప్రారంభిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటాం. ధాన్యం రవాణాలో ఎటువంటి అవరోధం లేకుండా చూస్తాం. వ్యవసాయ పనులు యథావిధిగా జరుపుకునేలా చూస్తున్నాం. అయితే పొలాల్లో సైతం సామాజిక దూరం పాటించాల్సి ఉంది. – డాక్టర్ జి.లక్ష్మీశ, జేసీ -
కరోనా భయం వీడండి
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు.. ఇలా అనేక కార్యకలాపాల్లో నిత్యం తలమునకలైన వారందరూ పక్షం రోజులుగా కరోనా బంధనాల్లో చిక్కి ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి జారిపోయారు. అప్పటి వరకూ రోజూ ఎంతో బిజీగా ఉన్న వారందరూ లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా ఇళ్లకే పరిమితమైపోయారు. కొంతమంది ఈ అవకాశాన్ని రకరకాల పనులు చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమంది ‘ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్’ (ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల కొంపవంటిది) అని అన్నట్టుగా.. ఊహించని ఈ ఆపత్కాలంలో కొంతమంది తమకు ఏదో అయిపోతుందని మానసిక ఆందోళనకు గురవుతున్నారు. యథాస్థితికి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులను ఊహించుకొని భయపడుతున్నారు. మందుబాబులు చుక్క దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలందరినీ కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో పలువిధాలుగా మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారికోసం ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కర్రి రామారెడ్డితో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి తమ సమస్యలు నివృత్తి చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైన కొన్ని.. కృష్ణ, లూధర్గిరి, రాజమహేంద్రవరం : ఎవ్వరూ లేరు, ఒంటరిననే ఫీల్ వస్తోంది. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ని. కరోనా లాక్డౌన్తో దిక్కు తోచడం లేదు. అభద్రతా భావం పెరిగిపోయి భయాందోళనకు లోనవుతున్నాను. డాక్టర్ రామారెడ్డి : మొదట ‘నేను ఒంటరి’ అనే భావం వీడండి. మీ చుట్టూ ఎంతో ప్రపంచం ఉంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరని చెబుతున్నారు కాబట్టి ఏదో పని పెట్టుకుని అందులో బిజీగా ఉండాలి. ఒత్తిడి తగ్గేందుకు యోగా చేయండి. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆ కోవలో ఉండే చిత్రలేఖనం వంటివి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. శరీర వ్యాయామానికి కొంత, జ్ఞానం పెంపొందించేందుకు కొంత, ఇంట్లో పనికి కొంత చొప్పున సమయం కేటాయించుకుంటే అసలు ఖాళీ అనేదే కనిపించదు. శ్రీనివాసరావు, రామచంద్రపురం : కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటి నుంచీ రోజులు చాలా భయంగా గడుస్తున్నాయి. ఏవో ఆలోచనలు. నిద్ర పోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ నా చేతికి అంటుకుందేమో, నాకు వచ్చేసిందేమోననే భయం ఎక్కువైపోయింది. డాక్టర్ రామారెడ్డి : చీకట్లో భయపడుతూ వెళ్తే తాడు కూడా పాములానే కనిపిస్తుంది. మీ సమస్య అలాంటిదే. కరోనా గురించి భయపడనక్కర్లేదు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, అవి పూర్తయ్యాక స్నానం చేసి, పిల్లలతో సరదాగా గడపడం వంటివి చేయండి. శ్రీనివాసరెడ్డి, మాచవరం : టెన్షన్ ఎక్కువగా ఉంది. రాత్రుళ్లు కలలు ఎక్కువగా వస్తున్నాయి. బయటికి వెళ్లకపోవడంతో తెలియని ఏదో ఫీల్. డాక్టర్ రామారెడ్డి : మీరు ప్రాణాయామం చేయాలి. ఇందులో అనులోమ, వినులోమ ప్రక్రియలు ఉంటాయి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుని, కుడి ముక్కుతో వదలడం, కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో వదలడం చేయాలి. దీంతో మెదడు బ్యాలన్స్లో ఉంటుంది. విపరీతమైన ఆలోచనలుంటే మందులు వాడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ తాత్కాలిక ఉపశమనానికి దగ్గరలోని డాక్టర్ను సంప్రదించవచ్చు. రామకృష్ణ, అమలాపురం : ఇంట్లో ఉంటే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. దీనికి మందులేమైనా ఉంటాయా? డాక్టర్ రామారెడ్డి : ఒత్తిడితో శరీరంలో పలు మార్పులు చేసుకుంటాయి. ప్రాణాయామం, ధ్యానం చేయాలి. యూట్యూబ్లో దీనికి సంబంధించినవి లభిస్తాయి. ఒత్తిడి తగ్గడానికి మందులుంటాయి. వీటిని డాక్టర్ సలహా మేరకే వాడాలి. (ఫోన్లో మందులు సూచించారు) రాఘవాచారి, రాజమహేంద్రవరం : లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు పైల్స్ సమస్య ఉంది. ఇలా కూర్చోవడంతో సమస్య ఎక్కువైంది. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : ఇంట్లో కూర్చుంటే పైల్స్ రావడానికి అవకాశం ఉంది. దగ్గరలోని జనరల్ సర్జన్, ఎంఎస్ దగ్గరకు వెళితే తగు పరీక్షలు చేసి సమస్య పరిష్కరిస్తారు. మందులతో కొన్ని, ఆపరేషన్తో కొన్ని పరిష్కారమవుతాయి. రామారావు, రాజమహేంద్రవరం : మా ఇంటి పక్కనే ఇద్దరు పెద్ద వయస్సు వాళ్లు ఉన్నారు. వారి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రాత్రుళ్లు నాకు ఫోన్ చేసి ఆందోళనకరంగా మాట్లాడుతున్నారు. వాళ్లను చూస్తే నాకు భయమేస్తోంది. డాక్టర్ రామారెడ్డి : మీ భయం కరెక్టే. పిల్లలు ఇంట్లో ఉండరు. ఒంటరిగా ఉంటున్నారు. ఈ సమయంలో అనేక ఆలోచనలు వారిని చుట్టుముడతాయి. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. దీనిని మీరు కనిపెట్టాలి. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సంగీతం వినడం, చిన్న పిల్లలతో ఆటలు ఆడించడం, బొమ్మలు వేయించడం వంటివి చేయాలి. మనవళ్లతోను, వారి పిల్లలతోను మాట్లాడిస్తూ ఉండాలి. పార్వతిదేవీ, మందపల్లి : లాక్డౌన్ కారణంగా మానసిక సమస్యకు వాడే మందులు ఆపేశాను. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : లాక్డౌన్ కారణంగా ఆస్పత్రుల సేవలు ఆపిన మాట వాస్తవం. అయితే రోగులు ఆస్పత్రికి ఫోన్ చేసి సమస్యలు చెప్తే ఏం చేయాలో సూచిస్తారు. మీరు వాడే మందులు దగ్గరలోని మందుల దుకాణంలో ఉంటే తీసుకుని లాక్డౌన్ పూర్తయ్యే వరకూ వాడొచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు ఈవిధంగా చేయవచ్చు. లావణ్య, కాకినాడ : మా వారికి మందు అలవాటు ఉంది. అది దొరక్క నిద్ర పట్టడం లేదు. ఇంట్లో ఉంటున్నారే కానీ ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? డాక్టర్ రామారెడ్డి : మందు తాగడం అనేది ఒక్కసారిగా మానకూడదు. దానివల్ల పలు సమస్యలు తలెత్తుతాయి. లాక్డౌన్ కారణంగా మందు తాగడం ఆగిపోయింది. దీంతో వారికి నిద్రపట్టకపోవడం, ఆందోళనగా ఉండడం, విపరీతమైన షేకింగ్, భ్రమలకు లోనవడం వంటివి చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వారు దీనికి చికిత్సనందిస్తారు. శశికళ, బొమ్మూరు : గతంలో లేదు. ఇప్పుడో సమస్య వచ్చింది. ముఖం మీద దురద ఎక్కువగా వస్తోంది. చేతులతో ఎక్కువగా ముఖం మీద తాకవద్దంటున్నారు. కరోనా నాకు వచ్చేస్తుందోమోనని ఒక్కోసారి భయమేస్తోంది. ఏ జబ్బు గురించి విన్నా ఆ జబ్బు లక్షణాలు నాకే ఉన్నట్టు అనిపిస్తోంది. డాక్టర్ రామారెడ్డి : మీ సమస్యను హైపోకాండ్రియాసిస్ అంటారు. అప్పటి వరకూ ఏమీ ఉండదు. ఊరు వెళ్తూ మంచినీటి బాటిల్ మర్చిపోయారు. ఇక అదే ఆలోచనతో దాహం వేస్తూ ఉంటుంది. అదే బాటిల్ కూడా తీసుకువెళ్తే సాయంత్రం అయినా దాని పట్టించుకోరు. మీకు వచ్చిన సమస్య ఇలాంటిదే. చేతులు ముఖాన్ని తాకకూడదని చెప్పిన నాటి నుంచి మీకీ సమస్య ప్రారంభమైంది. ఆ భ్రమలోంచి బయటకు రండి. లక్ష్మణరావు, కోరుకొండ : దిక్కు తోచడం లేదు. ఇన్ని రోజులు పని లేకపోవడంతో రోజు భారంగా గడుస్తోంది. అనేక ఆలోచనలు మెదడులో తిరిగేస్తున్నాయి. డాక్టర్ రామారెడ్డి : ఏకంగా 21 రోజులు ఇంట్లోనే ఉండడం అనేది చాలా ఇబ్బందికర విషయమే. పని చేసేవారు ఖాళీగా కూర్చోవడం వలన ఏమీ తోచక మెదడు అనేక ఆలోచనలకు తావిస్తుంది. వాటి ద్వారా ఆందోళనలకు లోనవుతూంటాం. దీనిని అధిగమించడానికి యోగా, ప్రాణాయామం చేయాలి. ‘నేను చేసే పని ఎక్కడికీ పోలేదు. నాకు ఏ భయం లేదు. నేనొక్కడినే కాదు కదా ఇంట్లో ఉండేది. ప్రపంచ మొత్తం ఇలాగే ఉంది కదా’ అనే పాజిటివ్ ఆలోచనలు ఏర్పరచుకోవాలి. భయం వద్దు.. ధైర్యంగా ఉండండి రాజానగరం: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన 14 రోజుల ఇంక్యుబేషన్ కాలం పూర్తి కావస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్న మొదటి బ్యాచ్ వారికి టెస్టులు జరుగుతాయని స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. దీనివలన పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఈ అంకెలను చూసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకు ఎన్నో రెట్లు నెగెటివ్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి చేసిన టెస్టింగ్ ఫలితాలు ఆందోళనకరంగా లేవని, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ట్రేసింగ్ పూర్తి కావచ్చిందని, పరిస్థితి అదుపు తప్పలేదని వివరించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపర్చుకుంటూ ఓర్పు, సహనంతో వ్యవహరించాలని సూచించారు. కరోనాపై అపోహలొద్దు : మాజీ ఎంపీ పండుల కాకినాడ రూరల్: కరోనా బారిన పడితే మనిషి మరణిస్తాడని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఇటువంటి అపోహలు వద్దని... కరోనా బారిన పడినా కోలుకోవచ్చని అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, డాక్టరు పండుల రవీంద్రబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా ప్రకటనలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారన్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందన్నారు. ఆపదవేళ పేదలకు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. -
కోవిడ్: వారిలో 89 మందికి నెగిటివ్
సాక్షి, కాకినాడ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడ వైరస్ అనుమానితులను క్వారంటైన్కు తరలించడం, నమూనాలు సేకరించడం పాజిటివ్గా తేలితే వారిని ప్రత్యేక ఐసొలేషన్ గదిలో పెట్టి వైద్యం చేయడం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన లండన్ యువకుడికి తొలిసారిగా జిల్లాలో పాజిటివ్ కేసుగా నమోదవడంతో యంత్రాంగంలో మరింత స్ఫూర్తిని నింపింది. (ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి.. ) ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 89 మందికి నెగిటివ్ మతపరమైన ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టయిన 163 మందిని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు క్వారంటైన్కు తరలించారు. ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారితో కలిసిన వారుగా వైద్యులు వీరిని నిర్ధారించారు. వీరిలో 89 మందికి నెగిటివ్ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఇంకా నలుగురు మాత్రమే క్వారంటైన్లో ఉన్నారు. వీరికి కూడా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. బొమ్మూరు క్వారంటైన్లో 14 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నవారితోపాటు, మూడు రోజుల కిందట కరోనా నెగిటివ్ వచ్చిన వారికి చేతిపై స్టాంప్ వేసి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సరిత తెలిపారు.(పోర్టబుల్ వెంటిలేటర్) ప్రత్యేక పర్యవేక్షణ కరోనా నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కోవిడ్–19 వైరస్ అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కలి్పంచారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5000 ఐసోలేషన్ పడకలు, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 15,000 సామర్థ్యం కలిగిన క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిపై సర్వే జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి డేటా స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన జాబితాలతోపాటు వలంటీర్లు, ఆశ, ఏఎన్ఎంల సర్వేలలో గుర్తించిన ప్రకారం 3,441 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరిలో ఢిల్లీ నిజామొద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన వారు 33 మందిగా గుర్తించారు. వీరిని క్వారంటైన్లకు తరలించారు. రోజుకు సగటున 90 నమూనాల పరీశీలన జిల్లాలో ప్రతి రోజూ సగటును ‘కోవిడ్–19’ అనుమానితులకు సంబంధించిన 90 నమూనాలు సేకరిస్తున్నారు. అందులో 70 వరకు నెగిటివ్గా నిర్ధారణవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు 267 నమూనాలు పరీక్షించగా..9 పాజిటివ్ (శుక్రవారం ఒకరు డిశ్చార్జి), 23 ఫలితాలు తేలాల్సి ఉంది. అంటే 10 శాతానికి తక్కువే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి -
కరకట్ట వదిలి హైదరాబాద్కు పలాయనం..
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోను రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకూ సరైనదో టీడీపీ నేత యనమల రామకృష్ణుడి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సహాయ చర్యల కోసం మీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్కు ఒక మెసెజ్ అయిన ఇవ్వగలిగారా? అని ప్రశ్నించారు. మీ అధినేత ఓటుకు నోటు కేసులో హైదరాబాదు వదిలి కరకట్ట మీదకు పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం) అయితే ఇప్పుడు కరోనా వచ్చిందని కరకట్ట వదిలి హైదరాబాదుకు పారిపోయి ఇంట్లో దాక్కున్నారని ఆయన విమర్శించారు. ముందు తమ వెనకాల ఉన్న మచ్చలు చూసుకుని ఎదుటి వారిని మిమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. కరోనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చంద్రబాబును వచ్చి చాడమనండి అని ధ్వజమెత్తారు. కాగా దేశ మొత్తం మీద కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఏపీకి తండ్రిలాంటి వారని ప్రజలకు తండ్రిలా ధైర్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
కరోనా వైరస్: తేరుకోకపోతే ముప్పే..
సాక్షి, కాకినాడ: కరోనా మహమ్మారి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో బుధవారం నాటికి ఆరుగురిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో 97 మందిని వైరాలజీ టెస్టులు చేసేందుకు కాకినాడ జీజీహెచ్కు తరలించి చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడ, పెద్దాపురాల్లోని ఇద్దరు వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించింది. (కరోనా : అమెరికాలో ఒక్క రోజులోనే 884 మంది మృతి) దీంతో కాకినాడలోని కొంత భాగాన్ని జిల్లా యంత్రాంగం రెడ్ జోన్గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టింది. వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, కాకినాడకు చెందిన ఇద్దరు, పెద్దాపురానికి చెందిన ఒకరు, పిఠాపురానికి చెందిన ఒకరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం శాంతినగర్లో పాజిటివ్ వచ్చిన రోగి కోడలు (36), మనవడు (18), మనుమరాలు (16)కు సైతం పాజిటివ్గా తేలింది. తేరుకోకపోతే ముప్పే.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు నిర్ధారించిన 25 మంది ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే విషయాలు రాబట్టడంలో అధికారులు తలమునకలయ్యారు. ఢిల్లీతోపాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఉచిత వైద్య నిర్ధారణతో పాటు చికిత్స కూడా అందజేస్తామన్నారు. (కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు ) రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులతో ర్యాపిడ్ యాక్షన్, జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి అధికారుల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను గురించి ఈ కమిటీలు అధికారులకు నివేదికలిస్తున్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలను తెలిపేలా కలెక్టరేట్లో ప్రత్యేక అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ గార్డెన్స్ ప్రాంతంలో హై అలర్ట్ పిఠాపురం: ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానిక వైఎస్సార్ గార్డెన్స్ ఏరియాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఆ వ్యక్తి గత 20వ తేదీన పిఠాపురం వచ్చి ఇక్కడ ఒక విశ్రాంత పోలీసు అధికారి, సహకార సంఘం నాయకుడు తదితర 20 మంది వ్యక్తులతో గడిపినట్టు తేలింది. వారందరినీ గుర్తించిన అధికారులు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వారిలో పిఠాపురం వైఎస్సార్ గార్డెన్స్లో నివాసముంటున్న ఒక 20 ఏళ్ల యువకుడికి పాజిటివ్ రిపోర్టులు రావడంతో అంతటా అప్రమత్తమైంది. బుధవారం ఇలా.. జిల్లాలో బుధవారం ఒక్క రోజే 90 నమూనాలు పరీక్షించగా.. 69 నెగిటివ్, 5 పాజిటివ్, 16 ఫలితాలు రావాల్సి ఉంది. కేసులపై నిరంతర నిఘా... జిల్లా కరోనా అనుమానిత కేసులపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 17,658 మందిపై పర్యవేక్షణ కొనసాగుతోంది. 165 క్వారంటైన్ కేంద్రాలు: జిల్లా వ్యాప్తంగా ‘కోవిడ్–19’ వైరస్ అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు 165 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 6509 పడకలు సిద్ధంగా ఉంచారు. 3441 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. 351 మంది క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. -
తూర్పుగోదావరిలో ఢిల్లీ కలకలం
నీడతో యుద్ధం చేయడమంటే అదో హాస్యాస్పద పదం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా నీడతోనే యుద్ధం చేస్తోంది. శత్రువు ఎక్కడ ఉన్నాడో ... ఎలా ఉన్నాడో తెలియకపోయినా జిల్లా యంత్రాంగం, పాలకులంతా ఒక్కటై నిరంతర పోరు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు గత రెండు రోజులుగా నమోదుకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం తాజా పరిణామంతో అప్రమత్తమైంది. సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో కరోనా కల్లోలం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. బుధవారం జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు నాలుగుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం కవాడీవీధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం అనుమానిత కేసుగా కాకినాడ జీజీహెచ్కు తీసుకురాగా బుధవారం పాజిటివ్గా నిర్థారించారు. ఈ క్రమంలో ఆ వీధిలో జిల్లా యంత్రాంగం విస్తృతమైన చర్యలు తీసుకుంది. కోవిడ్–19 జిల్లా ప్రత్యేకాధికారి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఎస్పీ నయీం అస్మి పరిస్థితిని సమీక్షించి పటిష్టమైన చర్యలకు ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో నమోదైన మూడు పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడంతో జిల్లా వాసుల దృష్టంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపైనే పడింది. లండన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడితో తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రస్తుతం కోలుకుని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగొచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కలెక్టరేట్లో గుబులు.. ఈ అంశంపై వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, సామాజిక మాధ్యమాల సమాచారాన్ని క్రోడీకరించి పరిశీలిస్తే రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాకినాడ బ్యాంకు పేటలోని పాజిటివ్ కేసు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు తిరిగొచ్చాక ఎక్కడెక్కడకు తిరిగారు. ఎవరెవరిని కలిశారనేది ఆరా తీసిన యంత్రాంగానికి గుండెలు గుభేల్మన్నాయి. రవాణా అనుమతి పనిపై కాకినాడ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్ సహా పలు సెక్షన్లతోపాటు కోవిడ్–19 అత్యవసర విభాగంలో కూడా కలియ తిరిగినట్టు కలెక్టరేట్ సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి డీఎంహెచ్ఒ కార్యాలయంలో కోవిడ్–19 పర్యవేక్షిస్తున్న డాక్టర్ మల్లిక్ సూచనలతో కలెక్టరేట్లో పలు సెక్షన్లను ఐసోలేషన్ చేయడంతో కలెక్టరేట్ యంత్రాంగం కాస్త ఊపిరిపీల్చుకుంది. ఆ వ్యక్తితోపాటు రాజమహేంద్రవరం పాజిటివ్ కేసు వ్యక్తి కూడా రాజమహేంద్రవరంలోని జాంపేటలో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లడం, ఇటు కాకినాడ వ్యక్తి పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో ప్రార్థనలకు వెళ్లడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. పెద్దాపురంలో పాజిటివ్గా నమోదైన 65 సంవత్సరాల వ్యక్తి ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి ఈ నెల 18న జిల్లాకు తిరిగొచ్చాడు. జిల్లా అంతటా జల్లెడ.. మూడు పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికే సోకడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా జల్లెడ పడుతోంది. జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన 27 మందితోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల కోసం వలంటీర్లు ద్వారా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి జిల్లాకు తిరిగొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారితోపాటు కలిసిన వారెవరు అనేది ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. జిల్లావ్యాప్తంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని ప్రాథమికంగా గుర్తించి 108 శాంపిళ్లను సేకరించారు. వారందర్నీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. కొత్తపేట, గోకవరం, మండపేట, కాజులూరు, రామచంద్రాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన వారిని ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నారనే కారణంతో ఆస్పత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. వచ్చే రెండు వారాలు స్వీయ నిర్బంధంలో ఉంటే భయమేమీ లేదని కలెక్టర్ భరోసానిస్తున్నారు. కాతేరు శాంతినగర్లో రెడ్జోన్ రాజమహేంద్రవరం రూరల్: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివశిస్తున్న కాతేరు గ్రామంలోని శాంతినగర్ ప్రాంతంలో కిలోమీటరు మేర రెడ్ అలర్ట్ ప్రకటించారు. శాంతినగర్ మొత్తాన్ని ఆధీనంలోనికి తీసుకున్న అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాజమహేంద్రవరం సబ్కలెక్టర్ డాక్టర్ ఆర్.మహే‹Ùకుమార్ నేతృత్వంలో డీఎల్పీవో జె.సత్యనారాయణ, ధవళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. శాంతినగర్లో కరోనా బాధితుడి ఇంటి నుంచి కిలో మీటర్ మేర బ్లీచింగ్, హైపోక్లోరైట్ను స్ప్రే చేయించారు. వైద్యసిబ్బంది, గ్రామ వలంటీర్లు తొమ్మిది బృందాలుగా ఏర్పడి ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. ఐసోలేషన్లో కవాడీ ప్రాంతం పెద్దాపురం: జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో కరోనా కలవరపెడుతోంది. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినప్పటికీ సుమారు 67 ఏళ్ల వద్ధుడికి కరోనా లక్షణాలున్నాయని తెలియడంతో మంగళవారం అధికార యంత్రంగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఐసోలెటేడ్ ప్రాంతంగా ప్రకటించారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించాలని ఆర్డీఓ మల్లిబాబుకు çకలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. అనంతరం స్థానిక బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతిగహం, వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. పట్టణంలోని 16.17 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి.శేఖర్ ఆ«ధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక శానిటేషషన్ డ్రైవ్ను నిర్వహింపజేశారు. కలెక్టర్ వెంట డీఎంఅండ్హెచ్ఓ బి.సత్యసుశీల, డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. -
కరోనా వైరస్: ఎవరినీ వదలొద్దు..
కాకినాడ సిటీ: నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వలంటీర్లు పరిశీలన చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీమ్స్ బాగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత ఉందన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు వివరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్తో మాట్లాడుతూ యువ అధికారుల నుంచి ప్రభుత్వం మరింత సేవలను ఆశిస్తుందన్నారు. దానికి అనుగుణంగా పని చేయాలన్నారు. (దారుణం: కరోనా అంటూ కొట్టిచంపారు) కోవిడ్–19 కేసుల కోసం జిల్లాలో కిమ్స్ ఆసుపత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 730 నుంచి 800లకు, ఐసీయూ బెడ్లు 52 నుంచి 70కి పెంచుతున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, జేసీ–2 రాజకుమారి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి బి రాజశేఖర్ విద్యాశాఖాధికారులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించి నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన పనులను పూర్తి చేసేలా చూడాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24 వరకు కావల్సిన రేషన్ ఉంచి, మిగతా వాటిని జిల్లా యంత్రాంగానికి ఇచ్చేయాలని ఆదేశించారు. రైతు బజారుల్లో వ్యాయామ ఉపాధ్యాయులను కరోనా నియంత్రణలో భాగంగా వారి సేవలను వినియోగించాలన్నారు. కలెక్టరేట్లో టెలీహబ్ ఏర్పాటు కాకినాడ: స్థానిక కలెక్టరేట్లోని అబ్జర్వేషన్ సెంటర్లో టెలీహబ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆరుగురు వైద్యులతో ఈ హబ్ 24 గంటలు పని చే స్తుందన్నారు. జలుబు, దగ్గుతో బాధపడే వారు ఏ సమయంలోనైనా ఫోన్ ద్వారా ఈ వైద్యుల సలహాల కోసం 0886 2333466, 0884 2333488 నంబర్లను సంప్రదించాలనిఆయన సూచించారు. (కరోనా విలయానికి కారకులెవరు?) కోవిడ్–19 కాల్ సెంటర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్–19 కాల్ సెంటర్కు వ్యక్తిగతంగా ఎవరినీ అనుమతించమని కలెక్టర్ తెలిపారు. వైద్య, రవాణా, పౌర సరఫరాలు, పోలీస్ తదితర అత్యవసర సమస్యలున్న వారు కంట్రోల్ రూమ్లోని కాల్ సెంటర్లను 1800 425 3077, 0884 2356196, 93923 24287కు ఫోన్ చేసి సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
కరోనా ఎఫెక్ట్: నిత్యావసర వస్తువుగా గుర్తించాలి
సాక్షి, అమలాపురం: కరోనా దెబ్బకు ఆక్వా మరింత కుదైలేంది. గత మూడు నెలలు నుంచి ఎగుమతులు నిలిచిపోయి. ధరలు పడిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు..తాజా లాక్డౌన్తో ప్రొసెసింగ్ ప్లాంట్లు కూడా మూతపడడంతో కొనేవారు కూడా లేక లబోదిబోమంటున్నారు. ఒకవైపు చెరువుల్లో పలు రకాల వైరెస్ విజృంభిస్తుండడంతో పట్టుబడులు చేస్తున్నా...కొనేవారు లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూడనున్నారు. కరోనా ప్రభావంతో చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వనామీ రొయ్యల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో గడిచిన మూడు నెలలుగా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దగా పట్టుబడులు జరగకున్నా మార్చి నెల నుంచి జోరందుకున్నాయి. కౌంట్ రాకున్నా వైట్ స్పాట్తోపాటు ఇతర వైరెస్ల కారణంగా కౌంట్తో సంబంధం లేకుండా పట్టుబడులు చేస్తున్నారు. అయితే వీటిని కొనేవారు లేకుండా పోయారు. జిల్లాలో అధికారికంగాను, అనధికారికంగాను కలిపి సుమారు 62 వేల ఎకరాల్లో వెనామీ సాగు జరుగుతోంది. ఇప్పుడు 80 శాతం విస్తర్ణంలో సాగు జరుగుతుండగా, ఎకరాకు కనీసం 2 టన్నులకుపైగా దిగుబడిగా వస్తుంది. పట్టుబడులు జోరుగా సాగుతున్నందున ఒక్క మార్చి నెల 15 నుంచి ఏప్రిల్ 20 మధ్యన సుమారు 74 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలు మార్కెట్కు రానున్నాయని అంచనా. వైరెస్ల కారణంగా అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో పట్టుబడులు జోరుగా సాగుతున్నాయి. రొయ్యలు కొనేవారు లేకుండా పోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోకుండా పోయింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకుండా పోవడంతో ఎగుమతిదారులు కొనుగోలు పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు స్థానికంగా నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్లను ఆదివారం జనతా కర్ఫ్యూ, సోమవారం నుంచి మార్చి 31 వరకు లాక్ డౌన్ కారణంగా మొత్తం వీటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వీటిలో పనిచేసే కారి్మకులు ఇళ్లకు పరిమితం కావడం, అక్కడక్కడా వస్తున్నా పోలీసులు అడ్డుకోవడంతో కొనుగోలు మొత్తం నిలిచిపోయింది. జిల్లాలో ప్రధాన ఎగుమతి కంపెనీలకు చెందిన కోల్డ్స్టోరేజ్లు సుమారు 54 వరకు ఉన్నాయని అంచనా. సామర్థ్యాన్ని బట్టి 5 వేలు నుంచి పది వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం ఉంది. సుమారు రెండు లక్షల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. కారి్మకులు ప్లాంట్లకు రాకపోవడానికి తోడు, మూడు నెలలుగా ఎగుమతులు నిలిచిపోయి కోల్డ్స్టోరేజ్లు నిండుకున్నాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు పట్టుబడుగా వస్తున్న రొయ్యలను కొనుగోలు చేయలేమని వారు చేతులు ఎత్తివేస్తున్నారు. అంతర్జాతీయంగా కాకుండా జాతీయ, స్థానిక మార్కెట్కు సైతం రొయ్యలు వెళ్లే పరిస్థితి లేదు. అమలాపురం, మలికిపురం, ఉప్పాడ, తొండంగి, తాళ్లరేవు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో చిన్నచిన్నగా కొనుగోలు చేసే రొయ్యల కేంద్రాలు సైతం లాక్డౌన్తో మూతపడ్డాయి. వీటి ద్వారా రోజుకు కనీసం 5 టన్నుల వరకు రొయ్యలు కొనుగోలు చేస్తారు. అంతరాష్ట్రాల రవాణా బంద్ కావడం, బస్సులు, లారీలు తిరగకపోవడంతో వీరు కొనుగోలు చేసినా సరుకు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చండి: మంత్రులను కోరిన ఆక్వా రైతులు రొయ్యలను నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని కోనసీమ ఆక్వా రైతులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా ఇన్చార్జిమంత్రి, మత్స్యశాఖమంత్రి మోపిదేవి వెంకటరమణ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్లను విజ్ఞప్తి చేశారు. కోనసీమ ఆక్వా రైతులు అమలాపురంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతులు విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకున్నారు. దీనిపై మంత్రులు విశ్వరూప్, మోపిదేవి, ఎమ్మెల్యే పొన్నాడలకు ఫోన్లు చేసి తమ సమస్యలను ఏకరువుపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి రొయ్యల రవాణా వరకు అనుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని కోనసీన ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్రాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే వారు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉత్పన్నమవుతుందని అల్లవరానికి చెందిన ఆక్వారైతు గుండెపూడి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాను నిత్యావసర వస్తువుగా పరిగణించి స్థానికంగా కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆక్వా ఎగుమతులు, కొనుగోలు, రవాణాకు ప్రభుత్వం అంగీకారం లాక్డౌన్ నుంచి మినహాయింపునిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆక్వా ఎగుమతులు కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఆక్వా ఉత్పత్తులను ఒకచోట నుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతిని తాజాగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. వీటిని లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్, యానిమల్ హజ్బెండరీ, డెయిరీ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జీవో 209ని విడుదల చేశారు. వీటిని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు పంపించారు. ప్రస్తుతం ఆక్వాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హేచరీలు, ప్రాసెసింగ్ సెంటర్లు, ఆక్వా మేత, మందుల దుకాణాలు, హేచరీల నుంచి పిల్ల రవాణా, రొయ్యల రవాణాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రౌడీషీట్లు ఉన్నవారిని బైండోవర్ చేస్తున్నాం
-
కరోనా అలర్ట్: ‘రిపోర్టు వస్తేనే చెప్పగలం’
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యటించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి బుధవారం ఉదయం కలెక్టర్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. కోవిడ్-19పై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. (చదవండి : తూర్పుగోదావరిలో కరోనా కలకలం!) అనుమానిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపించాం. రిపోర్టు వచ్చాకే అతనికి కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయం చెప్పగలం. అనుమానితుడు తిరిగిన ఇంటిని కూడా డొమెస్టిక్ ఐసోలేషన్లో పెట్టాం. కరోనా వైరస్పై సాఫ్ట్వేర్ ఉద్యోగి బంధువులకు అవగాహన కల్పించాం. చికిత్సకు సంబంధించి అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం’అని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్) -
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బాధితుడు?
-
తూర్పుగోదావరిలో కరోనా కలకలం!
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా వైరస్ (కోవిడ్-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వివరాలు.. విధుల్లో భాగంగా దక్షిణకొరియా వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వారం క్రితం సొంతూరు వాడపాలెం చేరుకున్నాడు. మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకి ఉండొచ్చని హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి కలెక్టర్కు అధికారులు సమాచారం అందించారు. (చదవండి: 'కోవిడ్' కేర్) దీంతో అర్థరాత్రి వాడపాలెం చేరుకున్న ప్రభుత్వ యంత్రాంగం సాఫ్ట్వేర్ ఉద్యోగి గురించి ఆరా తీయగా.. అతను వాడపాలెం నుంచి అత్తగారిల్లు గోదాశివారిపాలెంకు వెళ్లినట్లు తెలిసింది. హుటాహుటిన ముమ్మిడివరం మండలం గోదాశివారిపాలెంకు చేరుకున్న అధికారులు సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకిందా? లేదా? అని నిర్ధారించేందుకు అతన్ని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అతని భార్య, అత్తగారింట్లోనివారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు చర్యలు తీసుకున్నాం.. వాడపాలెం సాఫ్ట్వేర్ ఉద్యోగి కరోనా అనుమానిత కేసు వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తూర్పు గోదావరి జిల్లా వైద్య అధికారులను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. (చదవండి: కోవిడ్పై ఆందోళన వద్దు) బస్సులో ఉన్నప్పుడు వైరస్ లేదు! -
ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట!
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత వందేళ్లలో దాదాపు 320 ఎకరాల భూమి కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. అలాగే 410 ఎకరాల్లో పంట భూములు, సరుగుడు తోటలు ఉండేవి. ఇందులో 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని కోనపాపపేట గ్రామంలో గత పదేళ్లలో దాదాపు 20 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుపాను వచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతోంది. 8వ ఏషియన్ అండ్ పసిఫిక్ కోస్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1990–2000 మధ్యకాలంలో 57.92 చదరపు కిలోమీటర్లు, 2000–2006 మధ్యకాలంలో 102.88 చదరపు కిలోమీటర్లు, 2006–2012 మధ్యకాలంలో 77.58 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది. కాకినాడ నుంచి తుని వరకూ తీర ప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటిదాకా 28 సార్లు సముద్రపు కోతకు గురైంది. నాలుగుసార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోగా, దాని పక్కనే కొత్త రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు. తుపాన్లకు ఛిద్రమవుతున్న బీచ్ రోడ్డు రక్షణ, మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా. సాక్షి, తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్ నిర్మాణానికి నిర్దేశించిన స్థలం హోప్ ఐలాండే కారణం! ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. నివారణకు ప్రతిపాదనలు కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్ ఎరోజన్ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది. తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్సీఎస్సీఎం) డైరెక్టర్ డాక్టర్ రమేష్ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్ఎస్ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్ రాజన్ తదితరులు ఇటీవల కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు. ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు. సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం (ఫైల్) వైఎస్సార్ హయాంలో రూ.12 కోట్లతో రక్షణ గోడ 1,000 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణ వ్యయం 1994–95 నాటికి రూ.1.25 కోట్లకు చేరింది. మరో ఏడాదిలోనే రూ.2.25 కోట్లకు పెరిగింది. 2008 నాటికి రూ.12 కోట్లకు చేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఉప్పాడలో సముద్రపు కోత నివారణకు రూ.12 కోట్లతో జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మించారు. పదేళ్ల క్రితం నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ నిర్వహణను తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇది శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. ఉప్పాడ వద్ద నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ సముద్రపు కెరటాల ఉధృతిని అడ్డుకోవడంతో కోత ప్రభావం ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనపాపపేట గ్రామంపై పడింది. నూతన టెక్నాలజీతో కెరటాల ఉధృతికి బ్రేకులు ‘‘సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కొత్త టెక్నాలజీ ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చు. వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంతం కోతకు గురి కాకుండా ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు’’ – డాక్టర్ రమేష్ రామచంద్రన్, డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ -
కాకినాడలో లారీ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుడారిగుంటలో లారీ డ్రైవర్ బ్రహ్మానందం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బ్రహ్మానందం ఇంట్లోకి చొరబడి కత్తులతో అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్లు ధరించిన దుండగులు బ్రహ్మానందం భార్య కళ్లముందే ఈ దారణానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకన్నారు. ఈ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
సెక్షన్ 30.. సెక్షన్ 144 పెట్టినప్పుడు ఏమయ్యారు?
సాక్షి, అమలాపురం: ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడాది పొడువునా సెక్షన్ 30 పెట్టారు. రైతుల సమావేశం అంటే 144 సెక్షన్ ఉందని హెచ్చరించేవారు. సమావేశం పెట్టుకుంటే పోలీసులు వచ్చి మైకులు విరగ్గొట్టారు. సాగు సమ్మె చేయమని పిలుపునిస్తే చూస్తూ ఊరుకోబోమని సాక్షాత్తూ నాటి హోంశాఖ మంత్రి హెచ్చరించారు. అప్పుడెందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. మాకెందుకు మద్దతుగా నిలవలేదు. ఇప్పుడెందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు?’ అంటూ కొంతమంది రైతు సంఘం నాయకులు నిలదీయడంతో టీడీపీ అనుకూల రైతు సంఘం నాయకులకు నోరు పెగల్లేదు. అమరావతి రైతులకు అనుకూలంగా తీర్మానం చేయించాలనే ఉద్దేశంతో టీడీపీ అనుకూల రైతులు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించగా వారికి ఝలక్ తగిలింది. స్థానిక విద్యుత్ నగర్లో బుధవారం కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తీర్మానంతోపాటు ధాన్యం సొమ్ములు రావడం లేదని, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామనే తీర్మానాలు చేయాలని టీడీపీ అనుకూల రైతులు తలపోశారు. ఈ విషయాలు తెలుసుకున్న రైతు సంఘం నాయకులు కొంతమంది స్పందించారు. స్థానిక సమస్యలపై చర్చిద్దాం.. ‘ఎక్కడో రైతుల సమస్యలు తరువాత.. ముందు ఇక్కడ విషయాలు మాట్లాడదాం?’ అని బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల జమ్మి అన్నారు. కొంతమంది రైతులు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు రాలేదని ప్రస్తావించగా ‘ధాన్యం బాగానే పండింది. ప్రభుత్వం మంచిగానే కొనుగోలు చేసింది. సొమ్ములు రేపో, ఎల్లుండో వస్తాయి. 2011 సాగు సమ్మె తరువాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాల నుంచి మనకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ సొమ్ములు పూర్తిగా అందలేదు. పనిలో పని వాటి మీద కూడా చర్చిస్తే మంచిది’ అని జమ్మి తేల్చిచెప్పారు. విజయవాడలో రైతులకు కాని, రైతు కూలీలకు కాని నష్టం జరిగితే మాట్లాడదాం, అంతేకాని రాజధాని మార్పు విషయం గురించి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు’ అని తెగేసి చెప్పాడు. ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), డీసీసీబీ మాజీ డైరెక్టర్ గోదాశి నాగేశ్వరరావు తదితరులు దన్నుగా నిలిచారు. గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కేసుల నమోదు, అప్పటి ఆర్డీవో కార్యాలయంలో రైతులతో జరిగిన చర్చలో రైతు సంఘం నాయకుడు రంబాల బోస్కు జరిగిన అవమానం గుర్తు చేయడంతో కొంతమంది టీడీపీ అనూకూల రైతులు అభ్యంతరం చెప్పారు. జరిగిన విషయం చెప్పుకుంటే మీకు ఉలికెందుకని కొంతమంది ప్రశ్నించడంతో టీడీపీ అనుకూల రైతులు మిన్నకుండా ఉండిపోయారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర వివిధ కారణాలతో ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలంటూ ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు సొమ్ములు విడుదల చేయాలని, రబీకి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రంబాల బోస్, బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘం నాయకులు రాయుపురెడ్డి జానకీరామయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. -
అనధికార మద్యాన్ని పట్టించిన మహిళా పోలీసు
తూర్పుగోదావరి, మామిడికుదురు: సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారి ఆట కట్టించారు సచివాలయ మహిళా పోలీసు. సహచర సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆమె మద్యం విక్రయిస్తున్న రేకాడి వెంకటసూర్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇంటి పంచన సంచిలో రహస్యంగా దాచి ఉంచిన మద్యం సీసాలను ధన్యశ్రీ స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న ధన్యశ్రీని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని లెక్క చేయకుండా 22 మద్యం బాటిళ్లతో ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సహచర సచివాలయ ఉద్యోగులు మహిళా పోలీసుకు అండగా నిలిచారు. అనంతరం సమాచారాన్ని నగరం పోలీసుకు అందించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను నగరం పోలీసులకు స్వాధీనం చేశామని పంచాయతీ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో తెగువ చూపిన మహిళా పోలీసుతో పాటు సచివాలయ ఉద్యోగులను స్థానికులు అభినందించారు. -
‘చంద్రబాబు, లోకేష్ పాస్పోర్టులను సీజ్ చేయాలి’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు) -
‘పచ్చ’ పెత్తనానికి ముకుతాడు
గత టీడీపీ సర్కారు హయాంలో జిల్లాలో కన్నీరు పెట్టిన పల్లెలు ప్రగతిబాట పట్టనున్నాయి. జన్మభూమి కమిటీల సభ్యుల కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్య పట్టాలు ఎక్కనుంది. ఎన్నికలు నిర్వహించడమే కాకుండా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం: పల్లెల్లో సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలైన గ్రామ స్వరాజ్యం సాకారం కానుంది. మొన్నటి వరకూ గ్రామ సచివాలయాల్లో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థతతో పాలన ప్రజల ముందుకు తీసుకువెళ్లగా.. తాజాగా సర్పంచి పదవులకు జవజీవాలు ఇవ్వనుండడంతో పల్లె మోములో చిరునవ్వు కనిపించబోతోంది. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సర్పంచులను డమ్మీలుగా మార్చేసి జన్మభూమి కమిటీల ముసుగులో పచ్చ నేతలు పెత్తనం కొనసాగించారు. పెన్షన్ ఇవ్వాలన్నా...రేషన్కార్డు మంజూరు చేయాలన్నా.. ఏ పథకంలో లబి్ధదారుడిగా ఎంపిక కావాలన్నా పేదరికం అర్హత కానేకాదు. టీడీపీ నేతలు సిఫార్సులు చేస్తే సరి అన్నట్టుగా సాగింది గడిచిన ఐదేళ్ల పాలన. గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంజూరైన నిధులు మరో కార్యక్రమాలకు మళ్లించడం ద్వారా గ్రామ పరిపాలన జన్మభూమి కమిటీల కన్నుసన్నల్లోనే నడిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గత పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు గ్రామ పంచాయతీల్లో తలుపులు బార్లా తెరిచారు. గాం«దీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో గ్రామ పంచాయతీలు, సర్పంచుల విధి విధానాల్లో అనూహ్య సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఇంతకాలం ఎన్నికలు లేకండా చేసి నిరీ్వర్యం చేసిన జన్మభూమి కమిటీల ప్రభావానికి దూరంగా ప్రజలతో ఎన్నుకోబడే ప్రతినిధిని వపవర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నారు. టీడీపీ హయాంలో అన్నీ నష్టాలే... జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలున్నాయి. ఇన్ని పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంటుంది. జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఏడాదిలో ఆరు నెలలకు ఒక పర్యాయం విడుదలయ్యే ఈ ని«ధులు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. ఏడాదికి రూ.180 కోట్లు విడుదలవుతుంటాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏలుబడిలో 2018 ఆగస్టు నెలతో గ్రామ పంచాయతీ సర్పంచులు, పాలకవర్గాల పదవీ కాలం ముగిసిపోయాయి. ఆ తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టీడీపీ సర్కార్ నిర్వాకంతో జిల్లాలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.270 కోట్లు అందకుండా పోయాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు కొద్దోగొప్పో పన్నులు, అద్దెలు రూపంలో వచ్చే నిధులుంటాయి. అటువంటి చోట గుడ్డిలో మెల్ల సామెత చందంగా ప్రజల కనీస అవసరాలు తీర్చేవారు. ఎటొచ్చీ జిల్లాలో 687 మైనర్ గ్రామ పంచాయతీలకు కేవలం ఆర్థిక సంఘం నిధులే దిక్కు... మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నిధులు విడుదల కాకపోవడంతో ఆ పంచాయతీల్లో కనీసం పారిశుద్ధ్యం, మంచినీటి పైపులైన్ల మరమ్మతులు చేయించలేక ప్రత్యేకాధికారులు చేతులెత్తేసిన పరిస్థితులున్నాయి. పాలకవర్గాలు ఉండి ఉంటే నిధులు విడుదల కాకున్నా స్థానికంగా ఉన్న పలుకుబడిని వినియోగించి ప్రజల కనీస సౌకర్యాలు కల్పించే వారు. 2018 ఆగస్టు నుంచి జిల్లాలో కుంటుపడింది. ప్రజాసంకల్ప యాత్రలో స్వయంగా చూసి... వీటన్నింటినీ పాదయాత్రలో స్వయంగా పరిశీలించిన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు కూడా తిరగకుండానే పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయించి రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పల్లెలు స్వాగతిస్తున్నాయి. పాలనా పరంగా విధి విధానాలే కాకుండా సర్పంచి పదవులకు పోటీచేసే వారికి కొన్ని అర్హతలతో కూడిన బాధ్యతలను కూడా నిర్థారించడం మేధావి వర్గాన్ని కూడా ఆలోచనలో పడేసింది. ప్రజలచే ఎన్నికైన సర్పంచి కచ్చితంగా ప్రజల మధ్యే స్థానికంగానే నివాసం ఉండాలనే నిర్ణయం సాహసోపేతమైందిగా అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. సొంతూరులో ఉండకుండా వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు స్థిరపడి పంచాయతీ ఎన్నిల సమయాన సొంతూరు వచ్చి రూ.లక్షలు కుమ్మరించి సర్పంచిగా ఎన్నికై పట్టణాల్లో ఉంటానంటే ఇక కుదరదు. పట్టణాల్లో ఉంటూ పల్లె పాలన సాగదనే ముందుచూపుతో మంచి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారంటున్నారు. ఎన్నికల్లో డబ్బు సంచులతో పల్లె ఓటర్లను అడ్డగోలుగా ప్రలోభాలకు గురిచేసి సర్పంచి పదవులు కొట్టేయాలనే కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా సీఎం ఆలోచన ఆదర్శప్రాయమంటున్నారు. సర్పంచులు ఇక ముందు 24 గంటలూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేస్తూ సొమ్ములతో పట్టుబడితే ఆ సర్పంచి అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. జైలుకు పంపించే చట్టం కూడా రాబోతోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల వ్యవస్థతో స్థానిక పాలన ప్రజల ఇళ్ల ముంగిటకే కాదు, ఇంటి తలుపులు తట్టేలా చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ద్వారా కొత్త సంస్కరణలతో సర్పంచి పదవి గ్రామ స్వరాజ్యానికి రాజును చేసేలా పంచాయతీల చిత్రం మారబోతోంది. పంచాయతీ అంటే రాష్ట్రం మొత్తానికి సచివాలయం (సెక్రటేరియట్) ఏ స్థాయిలో... ఎన్ని అధికారాలతో పనిచేస్తుందో గ్రామ స్థాయిలో కూడా గ్రామ సచివాలయాలు అదే అధికారాలతో..అదే విభాగాల పని విభజనతో పనిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పటికే సచివాలయాల ద్వారా 50 శాతం విజయవంతమయ్యాయి. గ్రామ సర్పంచుల ఎన్నికల విధానాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో ఆ మిగిలిన 50 శాతం లక్ష్యం సాకారమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం పెంకే గోవిందరాజు మాజీ సర్పంచి, మాజీ సర్పంచుల సమైఖ్య మండల అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సర్పంచులకే అన్ని అధికారాలు ఇవ్వడంతోపాటు ఓటుకు డబ్బులు ఇవ్వకుండా తగిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి నుంచి గ్రామ పరిపాలన మార్పు చెందుతుంది. గతంలో ఓటుకు డబ్బులు ఇవ్వడం వల్ల గ్రామాల అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు స్వార్థం కోసం కాకుండా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. – పెంకే గోవిందరాజు నూతన శకానికి నాంది స్థానిక సంస్థల ఎన్నికలు మద్యం, ధన ప్రవాహానికి తావులేకుండా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ద్వారా నూతన శకానికి నాంది పలికారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా చర్యలు తీసుకోవడం, గ్రామ స్థాయిలో సర్పంచ్లకు మరిన్ని అధికారాలు కలి్పంచడం ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాట వేశారు. – మట్టపర్తి వెంకట్రావు, మాజీ సర్పంచ్, గంటి, కొత్తపేట మండలం స్థానికంగా ఉండాలనడం హర్షణీయం సర్పంచ్ ఎన్నికలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం హ ర్షించదగ్గ విషయం. అత్యంత కీలకమైన చెక్ పవర్, గ్రామ అభివృద్ధికి తీసుకునే నిర్ణయం సర్పంచ్కే ఉంటుంది. బాధ్యతతో చేయాల్సిన పదవి సర్పంచ్. ప్రభుత్వం మరింత బాధ్యతను పెంచుతూ సర్పంచ్లు స్థానికంగా ఉండాలని చట్టాలను సవరించడం ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం కీలకం. – కుంచే రాజా, మాజీ సర్పంచ్, సూరంపాలెం -
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి బాగోతం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి బాగోతం వెలుగు చూసింది. గత టీడీపీ పాలనలో మంజూరయిన రూ.50 లక్షలు నిధులను డిఎంఅండ్హెచ్ కార్యాలయం ఉద్యోగులు గోల్మాల్ చేశారు. అవినీతి బాగోతంపై వైద్య ఆరోగ్య శాఖ అదనపు కమిషనర్ డా.సావిత్రి విచారణ చేపట్టారు. నిధులు ఖర్చుపై గతంలో డిఎంఅండ్హెచ్వో కార్యాలయం ఏవోగా పనిచేసిన సుమతి తో పాటుగా, గొల్లకోటి మూర్తి అనే ఉద్యోగికి నోటీసులు జారీ చేశారు. -
అర్హులెవరికీ అన్యాయం జరగదు
సాక్షి, రాజమహేంద్రవరం: అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఏ పథకంలోనూ అన్యాయం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జిల్లా వాసులకు సరిపడా బియ్యం అందించడమే కాకుండా మరో రెండు జిల్లాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటంత సామర్థ్యం జిల్లాకు ఉందన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజానగరం ‘సాక్షి’ ప్రచురణ కార్యాలయానికి విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’తో జరిపిన చిట్చాట్.. సాక్షి : రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేయడంపై మీ అభిప్రాయం. జేసీ: తూర్పుగోదావరి పెద్ద జిల్లా. అన్ని రంగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షి :ఈ జిల్లాలో పనిచేసే అధికారులు ఎలా ఫీలవుతుంటారు. జేసీ: ఏ ఉద్యోగి అయినా ఈ జిల్లాలో పని చేస్తే దేశంలో ఏ జిల్లాలోనైనా అత్యంత సమర్థంగా, ఏ రంగంలోనైనా మంచి అనుభవంతో పని చేయవచ్చు. సాక్షి ఎడిటోరియల్ విభాగంలో జరిగే కార్యకలాపాలను జేసీ లక్ష్మీశకు వివరిస్తున్న ఎడిషన్ ఇన్చార్జ్ కృష్ణారావు, బ్యూరో చీఫ్ ఎల్.శీనివాస్ సాక్షి : ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఈ జిల్లాలో పనిచేయాలనుకుంటారు. మీరేమనుకుంటున్నారు. జేసీ: పెద్ద జిల్లా కావడంతో పాటు భౌగోళికంగా అన్ని ప్రాంతాలు ఉండడంతో ఎక్కువ అవగాహన కోసం ఉపయోగపడుతుంది. తీర, గిరిజన ప్రాంతాలు మంచి ఆహ్లాదకరంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేవిగా ఉండడంతో జిల్లాను మంచి అభివృద్ధి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. సాక్షి :ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటి? జేసీ: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, నవరత్న పథకాల అమలుకు జిల్లా నలుమూలల పర్యటించి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కృషి చేస్తున్నాం. సాక్షి :గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ప్రచురణ యంత్రాల వివరాలు జేసీకి వివరిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ రామకృష్ణ, చిత్రంలో బ్రాంచి మేనేజర్ రమేష్ రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: జిల్లాలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. అవనీతికి తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరి కొద్ది రోజులు నడిస్తే అన్నింటికీ వలంటీర్ల వ్య వస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి : రాష్ట్రానికి అన్నపూర్ణగా పిలిచే జిల్లా నుంచి బియ్యం జిల్లా వాసులందరికీ సరిపోతుందంటారా? జేసీ: జిల్లాలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో బియ్యం ఇక్కడి కుటుంబాలందరికీ సరిపోగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రారంభించారు. అక్కడి అవసరానికి తగ్గట్టుగా మన జిల్లా నుంచే బియ్యం సార్టెక్స్ చేసి ప్యాకింగ్ల్లో 13 వేల టన్నుల బియ్యాన్ని పంపించే ఏర్పాటు చేశా సాక్షి : నాణ్యమైన బియ్యానికి, ఇప్పుడు ఇస్తున్న బియ్యానికి తేడా ఏమిటి? సాక్షి ముద్రణ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: ఇప్పుడు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పరిశీలిద్దాం, ఆ బియ్యాన్ని నిల్వ చేయడానికి సాంకేతికంగా చేసే ఏర్పాటుతో కొంత పౌడర్లా బియ్యానికి పట్టి ఉంటుంది. దాని వల్ల ఇప్పుడిస్తున్న బియ్యం వాసన కూడా వస్తుంటాయి.అదే త్వరలో పంపిణీ చేసే బియ్యం పూర్తి నాణ్యతతో కూడుకుని ఉంటుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. సాక్షి : నాణ్యమైన బియ్యం ఎలా వస్తుంది? అందుకు కారణమేమిటి? జేసీ: బియ్యం బజార్లో కిలో రూ.60 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాపుల వద్ద నుంచి అందించే బియ్యాన్ని దగ్గర పెట్టి పరిశీలిస్తే బజార్లో దొరికే బియ్యం కన్నా రేషన్ షాపుల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని సార్టెక్స్ చేసి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి ప్రింటింగ్ యూనిట్లో పేపరు నాణ్యతను ఆసక్తిగా గమనిస్తున్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సాక్షి : కొత్తగా రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నారు. వారికి ఎంత మేరకు బియ్యం అవసరమవుతాయంటారు. జేసీ: జిల్లాలో 16.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి స్థానే త్వరలో బియ్యం కార్డులు అందజేస్తాం. లక్ష కొత్తకార్డులు వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ 25 వేల టన్నులు బియ్యం అవసరమని అంచనా వేస్తున్నాం. రేషన్ కార్డు ఇది వరకు బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడేది. ఇప్పుడు రైస్ కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ కార్డుపై బియ్యం మాత్రమే ఇస్తారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ఒక కార్డు ఇవ్వనున్నారు. కనుక బియ్యం అవసరం ఉంటేనే బియ్యం కార్డు ఇస్తారు. సాక్షి : ఇంటింటా బియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనుకుంటున్నారు. జేసీ: ఏప్రిల్ నుంచి జిల్లాలో ఇంటింటా బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
సూర్య గడియారం.. సమయం చూసేదెలా?
సాక్షి, అన్నవరం: హిందువులతో పూజించబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన లేనిదే మానవ మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి సూర్యభగవానుడు కొలువైన క్షేత్రాలు అతి తక్కువ. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన కూడా సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. విష్ణు పంచాయతనం కలిగిన సత్యదేవుని ఆలయం దిగువన యంత్రాలయంలో ఆగ్నేయంలో సూర్యభగవానుడు కొలువు తీరారు. అంతే కాదు సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయం తెలిపే సూర్యగడియారం కూడా రత్నగిరిపై దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. సూర్య కిరణాల ఆధారంగా.. సత్యదేవుని ఆలయానికి ఈశాన్యభాగాన, స్వామి వారి నిత్య కల్యాణ మండపం వద్ద గల సూర్యగడియారం (సన్డయిల్)లో సూర్యకాంతి ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారం ఈ గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించారు. నిర్మాణం ఇలా.. 12 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలకపై త్రికోణం ఆకారంలో తూర్పునకు అభిముఖంగా మరో చిన్న పలక అమర్చారు. సూర్యకాంతి ఆ చిన్న పలక మీద పడి దాని నీడ పెద్ద పలకపై పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో ఉన్నట్టుగా అంకెలు ఉంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలు అనుసరించి కొంత సమయాన్ని కలపడం లేదా తీసివేయడం చేయాలి. అలా చేయడం వల్ల మనకి కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే దానిపై అక్కడ గల సూచనల పట్టికలో వివరంగా లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆ పలక నీడ 10–20 అంకెల మధ్య పడితే అక్కడ ఉన్న పట్టిక ప్రకారం ఆ తేదీకి పది నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం 10.30 అయినట్టు. విశేషమేమిటంటే ఈ సమయం కచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్కు సరిపోతుంది. నిర్వహణ పట్టించుకోని దేవస్థానం ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్యగడియారం ఆలనా పాలనా లేకపోవడంతో సమయం ఎలా తెలుసుకోవాలో తెలియక భక్తులు ఏదో నిర్మాణాన్ని చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు తప్ప, ఆ గడియారంలో సమయం తెలుసుకునే విధానం తెలుసుకోలేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడ పలక మీద వేసిన అంకెలు, సూచనల పట్టికలోని సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించాలి. అదే విదంగా ఈ సూర్య గడియారం ప్రాముఖ్యతను భక్తులకు వివరించేందుకు అక్కడొక గైడ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. -
‘మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు’
సాక్షి, తూర్పుగోదావరి: దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి 18 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దిశ పోలీసు స్టేషన్లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, 38 కానిస్టేబుళ్లతో సహా పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండే విధంగా చూస్తున్నామని తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లు మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తాయని అన్నారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రారంభం కానుందని.. దీని ద్వారా బయట ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని డీజీపీ గౌతంమ్ సవాంగ్ తెలిపారు. -
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు. -
‘శాసన మండలి రద్దు చేసింది టీడీపీనే’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో శాసనమండలిని రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో శాసనమండలి ఏమాత్రం అవసరంలేదని చెప్పిన వారిలో ముఖ్యుడు చంద్రబాబు నాయడు అని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న శాసన మండలి ఉండటం శుద్ధ దండగ అనే భావం ప్రజల్లో కలిగిందని రవీంద్రబాబు గుర్తు చేశారు. శాసన మండలి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో రాజకీయ ప్రయోజనం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం శాసన మండలి రద్దు చేశారని అయన అన్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం.. సీఎం జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన ఏ ప్రయత్నంలో ఆయినా ప్రజలందరూ.. అయన వెంటే ఉన్నారని రవీంద్రబాబు గుర్తు చేశారు. -
అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్లో వచ్చిన గ్రోత్ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్ మాల్కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు. -
రూ.10 కోట్లకు టోకరా
సాక్షి, రాజానగరం: జీడిపిక్కల వ్యాపారం కోసం అప్పు ఇచ్చిన బ్యాంకు అధికారులు కొన్ని రోజుల తరువాత తనిఖీ కోసం గోడౌన్కు వెళ్తే జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్ దర్శనమిచ్చింది. దీంతో నివ్వెరపోయిన ఆ బ్యాంకు అధికారులు తరువాత తేరుకొని సంబంధిత వ్యాపారులతోపాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాలిలావున్నాయి. అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు గోడౌన్లో నిల్వ ఉంచిన జీడిపిక్కలను చూపించి, వాటిపై రాజమహేంద్రవరంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి వారి నుంచి చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు తనిఖీకి గోడౌన్కి రావడంతో జీడిపిక్కల బస్తాలు లేవు. ఖాళీ గోడౌన్ కనపడింది. దీంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితోపాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
బ్రేకింగ్ : మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి : విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను, ప్రభుత్వోద్యోగులను బెదిరించిన కేసులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైల్కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఉన్న రెడ్క్రాస్ భవనంలోని షాపులను జిల్లా కలెక్టర్, సిబ్బంది కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయిస్తున్నారు. హర్షకుమార్ వచ్చి న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించి, మహిళా ఉద్యోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కోర్టు సిబ్బందిని చంపుతానంటూ బెదిరించారని జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హర్షకుమార్ శుక్రవారం ఇంటికి రావడంతో పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసును జారీచేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో హర్షకుమార్, ఆయన అనుచరులు స్టేషన్కు వచ్చారు. హర్షకుమార్ విచారణకు సహకరించక పోవడంతో అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాజమహేంద్రవరం ఐదో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వాలని చెప్పినప్పటికీ అన్యాయంగా అరెస్ట్ చేశారని హర్షకుమార్ పేర్కొన్నారు. -
మీ వల్లే నేను ఓడిపోయా: పవన్
సాక్షి, మండపేట: ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో నిన్న (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు. దీంతో పవన్ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజుల్లోగా ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. -
లొట్టలేయించే రొట్టెలు!
భోజన ప్రియులను విభిన్న రుచులతో నోరూరిస్తుంది తూర్పు గోదావరి జిల్లా. కాకినాడ కోటయ్య కాజా, తాపేశ్వరం మడత కాజా, ఆత్రేయపురం పూత రేకులు, పెరుమాళ్లపురం పాకం గారెలు... అటువంటిదే ముక్కామల మినపరొట్టె. ఈ రొట్టెను ఏభైఏళ్లుగా లొట్టలేసుకుని తింటున్నారు. అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు ముక్కామల. తయారీ, రుచి, అన్నింటిలో అక్కడ వండే మినపరొట్టె అద్భుతంగా ఉంటుంది. ముక్కామల పంట కాల్వ గట్టుపై ఓ పూరి పాక... అందులో ఓ చెక్క పెట్టె. కూర్చునేందుకు ఇటుకలపై అమర్చిన రెండు నాపరాతి బల్లలు... పట్టుమని పది మంది కూడా కూర్చునేందుకు జాగా లేని ఆ పూరి పాకలో ఏడు పదుల నిండిన వృద్ధుడు ఇటుకల పొయ్యిపై మినప రొట్టెలు కాల్చుతూ ఉంటాడు. రోజూ సాయంత్రం మూడు గంటలైతే చాలు ఎక్కడికెక్కడి నుంచో ఈ కాకా హోటల్కు వచ్చేస్తారు. ఇక్కడి రొట్లెను అరిటాకులోనే అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో అబ్బిరెడ్డి సత్యనారాయణ (తాత) కాకా హోటల్ అంటే కోనసీమ వ్యాప్తంగానే కాదు జిల్లాలోని పలు నగరాలు, పట్టణాలకు చెందిన వారికి కూడా సుపరిచితమే. అన్నీ ప్రత్యేకతలే తాత వేసే మినపరొట్టె చూసేందుకు సాదాసీదాగా ఉంటుంది. అయితే ఆ రొట్టెకు అన్నీ ప్రత్యేకతలే. దాని రుచి అమోఘం. కమ్మని వాసనతో ఆవిర్లు కక్కుతుంది. కొబ్బరి చట్నీ, సెనగ చట్నీలను నంజుకుంటూ రొట్టెను తింటుంటే మెత్తని కేక్ ముక్క నోట్లోకి జారుతున్నట్లే ఉంటుంది. మన కళ్ల ముందే సంప్రదాయ కట్టెల పొయ్యి మీద బాణలిలో కాల్చి వేడివేడి పొగలు కక్కుతున్న రొట్టెను అరటి ఆకులో ఇస్తారు. ఆరోగ్యం, అతి«థి మర్యాదలకు వేదికగా ఉంటుంది ఈ కాకా హోటల్. తాత వేసే రొట్టె తినేందుకు అంతస్తు, హోదా చూసుకోరు. రొట్టెలను కాల్చేందుకు... నేలపై కొన్ని ఇటుకలు పేర్చి దాని మీద ఓ రేకు, దాని మీద ఇటుకలతో రెండు పొయ్యిలు ఉంటాయి. ఆ రెండింటి మీద రెండు బాణలులు ఉంటాయి. వాటిలో రొట్టె పిండి వేస్తారు. పొయ్యిని కొబ్బరి డొక్కలతో మండిస్తారు. మొదటి పొయ్యి మీద ఉన్న బాణలిలో ఓ రొట్టె కాస్త దోరగా కాలిన తర్వాత, అదే రొట్టెను పక్కనున్న మరో పొయ్యిపై ఉన్న మూకుడులో వేసి, దాని మీద ఇనుప రేకు ఉంచి దాని మీద నిప్పుల సెగ ఉంచుతారు. కింద, పైన నిప్పులతో రొట్టె సమాంతరంగా కాలి కమ్మగా తయారవుతుంది. తాత వేసే రొట్టె రుచి వెనుక రహస్యం ఇదే. ఈ కాకా హోటల్ రోజూ మధ్యాన్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఉంటుంది. ప్రతిరోజూ దాదాపు 150 నుంచి 200 మంది ఈ కమ్మటి రొట్టె రుచి చూస్తారు. ఒకసారి ఈ రుచి చూసినవారు మళ్లీ ఇటుగా వచ్చినప్పుడు రొట్టె తినకుండా వెళ్లరు. పావలాతో మొదలైన ప్రస్థానం అబ్బిరెడ్డి తాత సొంతూరు ముక్కామల పక్కనే ఉన్న ఇరుసుమండ. రోజూ అక్కడ నుంచి ముక్కామల కాల్వ గట్టుకు వచ్చి, ఈ పాకలో కాకా హోటల్ నిర్వహిస్తున్నారు. 1969లో జీవనాధారం కోసం మినప రొట్టెలు వేయడం ప్రారంభించారు. పావలాతో ప్రారంభమైన రొట్టె ధర ఇప్పుడు ఇరవై రూపాయలు మాత్రమే. కస్టమర్ను తాత చిరునవ్వుతో ఆహ్వానించడంలో మర్యాద కనిపిస్తుంది. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, రాజమహేంద్రవరం ఫోటోలు: సుబ్బారావు పరసా తిన్న ప్రతి ఒక్కరూ బాగుందంటారు... నా హోటల్కు వచ్చి మినపరొట్టె తిని వెళ్లే వారంతా ‘రొట్టె చాలా బాగుంది, చట్నీల కాంబినేషన్ బాగుంది’ అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. 50 ఏళ్లుగా రుచి అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పిండి, ఉప్పు సమపాళ్లలో కలపడం, రొట్టెను కాల్చేటప్పుడు దోరగా ఉండేలా చూసుకోవటం వంటి కొన్ని కిటుకులు పాటించడం కారణంగానే ఇంత పేరు వచ్చిందనుకుంటాను. – అబ్బిరెడ్డి తాత -
కళ్లల్లో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో..
సాక్షి, తూర్పుగోదావరి : అమలాపురంలో కోడిపుంజులకై నెలకొన్న వివాదం కలకలం రేపింది. రోళ్లపాలెంలో కోడిపుంజుల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై మహిళలు కారం కొట్టారు. మరికొందరు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలు కాగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఎమ్మెల్యేలుగా గర్వంగా తిరగ్గలుగుతున్నాం’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలను ఆరు నెలల్లో తీర్చారు. లక్షా నలభై వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. నాలుగు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. మత్స్యకార భరోసాతో గంగపుత్రుల కష్టాలు తీరనున్నాయి. వీక్లీ ఆఫ్ అమలుతో పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ.. అరవై ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలా సీఎం జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మాదిగానే సీఎం జగన్ పాలనలో ప్రకృతి సహకరించిందని పోల్చి చెప్పారు. ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్ పాలన చూసి ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకుంటున్నాయని ప్రశంసించారు. జగన్ గారి విధివిధానాల వల్ల ఎమ్మెల్యేలుగా ప్రజల్లో సగర్వంగా తిరగగలుగుతున్నామని వెల్లడించారు. రాజకీయ అవగాహన లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్కల్యాణ్ చదువుతున్నారని దొరబాబు విమర్శించారు. -
కచ్చలూరు ప్రమాదం : మత్స్యకారులకు ప్రోత్సాహం అందజేత
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది టూరిస్టులను రక్షించిన మత్స్యకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. 20 మందికి రూ. 25 వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నజరానా ప్రకటించగా, శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ నగదు ప్రోత్సహాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్, ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్లు పాల్గొన్నారు. -
‘ఇంగ్లిష్’ను వద్దంటున్నది కుహనా రాజకీయ నేతలే
సాక్షి, అమలాపురం : ఆంగ్ల బోధనను అడ్డుకుంటోంది కుహనా రాజకీయ నేతలేనని, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ బోధన అమలును మేధావులందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం మేధావుల సమావేశానికి సూర్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నీట్, ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసేందుకు కొంత కాలంగా ఓ కుట్ర జరుగుతోందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రతి విద్యార్థి జాతీయ పోటీ పరీక్షలను ఇంగ్లిష్ పరంగా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ఆ బోధనను అందుబాటులో తీసుకువస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ పేరుకే అమలు చేసి డీమ్డ్ యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిక ఫీజుల వసూళ్లకు మరింత కళ్లాలు ఇచ్చిందని ఆరోపించారు. ఆ విద్యా సంస్థలకే ఫీజుల దోపిడీకి పెద్ద పీట వేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ వస్తున్న సందర్భంగా అక్కడ జరిగే సభకు శెట్టిబలిజ సామాజిక వర్గీయులు తరలిరావాలని సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. జగన్కు శెట్టిబలిజలు భారీ ఎత్తున స్వాగతం పలకాలని ఆయన సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, గుత్తుల శ్రీనివాసరావు, చప్పడి శోభన్బాబు, ఖాదర్, చీకురుమిల్లి కిరణ్కుమార్, అడపా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నాయకులను తయారు చేసిన వారికి బుద్దొచ్చేలా..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రిలో పార్టీని పటిష్టపరచడంలో భాగంగా అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. 42 వార్డుల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికుల పేరుతో నిరసనలు చేసి, నకిలీ నాయకులను తయారు చేసిన టీడీపీ నేతలకు బుద్దొచ్చేలా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లను పటిష్టం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మరోవైపు రాజమండ్రిలో తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారితో సమావేశమవుతామని సుబ్రమణ్యం వివరించారు. -
ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు!
గొల్లప్రోలు పోలీసు స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సైను అరెస్ట్ చేయడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలం ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ స్టేషన్ ఏర్పడిన తరువాత మొదటిసారి ఏసీబీ దాడి చేసిందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. ఈ ఎస్సైపై ఇప్పుడు పలు ఆరోపణలు, వివాదాలు బయటపడుతున్నాయి. సాక్షి, గొల్లప్రోలు (పిఠాపురం): స్థానిక ఎస్సైగా బి.రామకృష్ణ 2014 బ్యాచ్లో ఎస్సైగా ఉద్యోగం పొందారు. పెద్దాపురం, కాకినాడ పోర్టు స్టేషన్లలో పనిచేసిన ఆయన.. 2017 జనవరి 17న గొల్లప్రోలుకు బదిలీపై వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈయనను ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రోద్భలంతో ఇక్కడికి చేయించారు. ఈయన అన్నిట్లోనూ బేరసారాలకు దిగేవారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి పేకాట, రోడ్డు ప్రమాదాలు వరకు ప్రతి కేసులోనూ చేతులు తడపాల్సివచ్చేదట. చివరకు కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివారాల్లో కూడా తలదూర్చి వసూళ్లకు పాల్పడేవాడని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఇటీవల చెందుర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో భార్యాభర్తలు, ప్రేమ వ్యవహారాల్లో నమోదైన కేసులో ఇరువర్గాలను రాజీ పెట్టి మామూళ్లు వసూళ్లు చేసినట్లు బాధితులు తెలిపారు. వన్నెపూడిలో పురుగు మందు తాగిన కేసులో రూ.30 వేల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రత్తిపాడు జంక్షన్లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బస్సు విడుదల చేయడానికి రూ.30 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణ వచ్చింది. పేకాడుతున్న వారి వద్ద దొరికిన మొత్తం సొమ్ములో నామమాత్రపు మొత్తం చూపుతూ నమోదు చేసిన సంఘటనలు నిత్యకృత్యం. గొల్లప్రోలులో రెండు పేకాట శిబిరాలు, మల్లవరంలో కోడిపందేల నిర్వహణకు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీపావళి పండగకు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇవ్వడానికి రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తాజాగా వెల్లడైంది. హైవేపై చీకటి వ్యాపారాల నుంచి ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణ. స్థానిక కొత్తపేటలో గోడ తగాదా విషయంలో కేసు రాజీకి రూ.20 వేలు, ఎస్సీపేటలో ఒక కేసుకు రూ.10 వేలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. స్టేషను బెయిల్ విషయంలో కేసును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేసేవారట. ఇటీవల గొల్లప్రోలులోని కొత్తపేటలో పేకాట కేసులో పట్టుబడ్డ 9 మంది నుంచి రూ.27 వేలు వసూలు చేసి, దానిని పెట్టీ కేసుగా మార్చారన్న ఆరోపణ ఉంది. గ్రావెల్ తరలింపులో.. పక్క నియోజకవర్గం నుంచి గ్రావెల్, మట్టి ఇక్కడకు తరలించడానికి ముందుగా స్టేషను మామూళ్లు వసూలు చేసేవారు. స్థానిక రెవెన్యూ అధికారులకు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కళ్లు గప్పి మరీ గ్రావెల్ దందా సాగించేవారని ఆరోపణలు ఉన్నాయి. పట్టుకున్న వాహనాలను విడుదల చేయించుకోవడానికి భారీ ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. బాస్ ఇన్స్పెక్షన్ కోసం రూ.5 లక్షల వసూలు! డివిజినల్ స్థాయి పోలీసు అధికారి ఇన్స్పెక్షన్ పేరిట పలువురి నుంచి సుమారు రూ.5 లక్షల వరకు వసూలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. వ్యాపారులు, మిల్లర్లు, పారిశ్రామిక వేత్తలు, చివరికి వైఎస్సార్ సీపీ నేతల నుంచి కూడా వసూళ్లు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రూ.2 లక్షలని చెప్పి.. రూ.5 లక్షలు వసూలు చేశారని పోలీసులే చెబుతున్నారు. కానిస్టేబుల్తో వసూళ్లు.. ఇటీవల గొల్లప్రోలు నుంచి కాకినాడ టూటౌన్ బదిలీ అయిన కానిస్టేబుల్ సింహాచలం గతంలో మామూళ్ల దందా నడిపేవాడు. అయితే అక్కడ నుంచి సింహాచలంను మ్యూచువల్ అండర్ స్టాండింగ్పై అసిస్టెంట్ రైటర్గా రికార్డులు రాయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. స్టేషన్లో మామూళ్లు విషయంలో అతడిని సంప్రదించా ల్సిందేనని పలువురు చెబుతున్నారు. ఏసీబీ దాడిలో ఈ కానిస్టేబుల్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. బాధితులు అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డు పెద్ద సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లో కింద నుంచి పైవరకు చేతులు తడపాలని....ఇందులో మాకు ఎంతో రాదంటూ అతడు మాటలును బట్టి అవినీతి సొమ్ము ఎవరెవరికి అందుతున్నాయో అర్ధమవుతోందని పలువురు అంటున్నారు. ఎస్సై, కానిస్టేబుల్కు రిమాండ్ ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన గొల్లప్రోలు ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలానికి ఈ నెల 29వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. బెయిల్ మంజూరు విషయంలో రూ.10 వేలు తీసుకుంటూ గురువారం రాత్రి ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలం ఏసీబీకు దొరికిన విషయం విదితమే. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను రాజమండ్రి ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరిచారు. వారిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. దీంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఆయన తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో... త్రినేత్రం
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలుస్వీకరించిన వెంటనే ‘అవినీతి రహిత పాలన’తో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ తన చుట్టూ ఉన్నవారిచే అడుగులు వేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి దూరంగా పలువురు ఉద్యోగులు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సబ్ రిజస్ట్రార్ కార్యాలయం అంటేనే నెల,నెలా వసూళ్లకు కేరాఫ్గా మారిపోయింది. కానీ ఆ కార్యాలయంలో ఆ తరహా వసూళ్లను కొంతమేర తగ్గించినట్టున్నారు. కానీ అవినీతిని అడ్డుకోవలి్సన అవినీతి నిరోధక అధికారులే ‘అలా అయితే ఎలా’ అంటూ దందాకు దిగారు. మీరు అవినీతి చేస్తేనే కదా మా ‘పై జేబులు’ నిండేదంటూ హడావుడి చేశారు. అయినాసరే ‘ససేవిురా’ అనేసరికి ఓ రోజు నేరుగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి సిబ్బంది ఫైల్లో డబ్బులు పెట్టేసి ... వారే అవినీతికి పాల్పడినట్టు తప్పుడు కేసులు పెట్టడానికి యత్నించారు. అయితే సీసీ ఫుటేజీలో మొత్తం రికార్డు అవడంతో కంగుతిన్నారు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. 1986వ సంవత్సరంలో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా రిలీజైంది. ఆర్. నారాయణమూర్తి తొలి పరిచయంతోపాటు ఆయన తొలి దర్శకత్వం వహించిన సినిమా కూడా అదే. ఆ సినిమాలో ఓ సన్నివేశం ఇక్కడ ప్రస్తావించుకుందాం. తన భార్య కన్నీళ్లకు కరిగి ఓ జేబు దొంగ దొంగతనాలు మానేసి చక్కగా రిక్షా తొక్కుకొని వచ్చిన ఆదాయంతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ ఆ మాజీ దొంగ ఇంటికి వస్తాడు. ఏమిరా...నాకు రావల్సిన వాటా ఇవ్వడం మానేసినావని గద్దించగా దొంగతనాలు మానేసి రిక్షా తొక్కుతూ బతుకుతున్నాను...నన్ను వదిలేయమంటూ ఆ కానిస్టేబుల్ కాళ్లా,వేళ్లా పడి బతిమాలుతాడు. నువ్వు మానేస్తే నా బతుకెలా సాగేది. పెద్ద కూతురు పురిటికొచి్చంది, చిన్న కూతురికి పెళ్లి చేయాలి...వీురంతా మంచోళ్లుగా మారితే ఎలారా అంటూ లాఠీకి పని చెప్పి ‘పద దొంగతనం కేసులో నిన్ను బొక్కలేస్తే గానీ నీ పాత జీవితంలోకి పోయేటట్టు లేవంటూ’ కొట్టుకుంటూ తీసుకుపోతాడు. ఈ దృశ్యం దూరం నుంచి చూసిన మాజీ దొంగగారి పెళ్లాం...‘వీడు దొంగతనాలు ఇంకా మానలేదా’ అని మనస్థాపానికి గురై బిడ్డతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఈ సీన్ కట్ చేసి...2019లోకి వచ్చి వాస్తవ ఘటనలోకి వద్దాం. సాక్షి, కాకినాడ: సీసీ కెమెరా (త్రినేత్రం)...అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లోనే కాదు...వీరి బలహీనతలను ఆసరా చేసుకొని బ్లాక్మెయిల్ చేసే వారి గుట్టును కూడా బట్టబయలు చేసే దమ్మున్న కన్ను ... గురిపెట్టే గన్నే ఈ త్రినేత్రం. మనిషి కన్ను చూడగలదు ... చూసింది నోటితో విడమరచి చెప్పగలదు ... కానీ అవతలవారి నోరు పెద్దదైతే .. గట్టిగా దబాయిస్తే గమ్మున ఉండిపోవల్సిందే. కానీ ఈ త్రినేత్రం మాత్రం చాలా గట్టిందండోయ్. నోరేసుకొని మీద పడిపోయేవారికి ‘సాక్ష్యాల’తో స‘చిత్రం’గా చూపించి ఇప్పుడేమంటావో చెప్పంటూ కాలర్ పట్టుకొని నిలదీసి ముచ్చెమటలెక్కించగలదు. ఇటీవల రాష్ట్రంలోని ఓ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో రుబాబులకు దిగిన ఏసీబీ అధికారులనే పట్టించి ఖబడ్దార్ అని హెచ్చరించి సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం జగన్ మోహన్రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు కావాలని ఇరికించేందుకు వెళ్లి సంబంధిత రికార్డుల్లో డబ్బులు పెట్టి బ్లాక్ మెయిల్కు దిగిన వైనం సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయింది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్పై వ్యవహరించిన తీరును సీరియస్గా తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ధైర్యంగా విధులు నిర్వహంచేందుకు ఎంతో తోడ్పడుతుందని ఆనందిస్తుండగా, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల సగానికి సగం అవినీతిని అరికట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు. గతమంతా అవినీతిమయమే.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండదండలతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతిచోటు చేసుకున్న విషయం జగమెరిగిన సత్యం. ఆ శాఖల్లో అక్రమాలు తారాస్థాయికి చేరుకుంటుండడంతో ప్రతి మూడేళ్లకు ఒకసారి సబ్ రిజిస్ట్రార్లను తప్పనిసరిగా బదిలీలు చేస్తుంటారు. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క బదిలీ కూడా జరగలేదంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి బాబు ప్రభుత్వం అండతో అధికారులు ఇష్టారాజ్యంగా దోచుకొని అవినీతికి కేరాఫ్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మార్చేశారు. ఈ దందాను నిరోధించాలి్సనవారే బ్లాక్ మెయిల్ చేసి నెలనెలా మామూళ్లకు అలవాటుపడిపోయారంటే ఆక్కడ పని చేస్తున్న అధికారుల జేబులు ఏ మేరకు అక్రమ సొమ్ముతో నిండిపోమాయో ఊహించుకోవచ్చు. సీఎం జగన్ కన్నెర్ర.. ప్రస్తుతం సీఎం అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఏళ్ల తరబడి బదిలీకాకుండా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే...అంటే జూలై నెలలోనే రిజస్ట్రార్ కార్యాలయాల్లో బదిలీలకు శ్రీకారం చుట్టారు. అవినీతి అధికంగా జరిగే ప్రధానమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజస్ట్రార్లపై బదిలీ వేటు వేసి గ్రూప్ –2లో ఎంపికైన వారిని డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్లుగా నియమించి ‘చెక్’ పెట్టడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు ఆ కార్యాలయం నుంచి నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన అధికారులకు ‘బ్రేక్’ పడింది. అయినా సరే వెనుకటి బుద్ధి ఏల మారుతుందన్నట్టుగా మామూళ్లకు అలవాటుపడిన కొంతమంది అధికారులు బ్లాక్ మెయిల్కు దిగడం గమనార్హం. నెల మామూళ్లు ఇవ్వకపోతే మేమే మిమ్మల్ని ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగడం ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో 12 ‘ ఏ’ కేటగిరీ కార్యాలయాలు జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, చిట్ కార్యాలయం, ఆడిట్ కార్యాలయం, డీఐజీ కార్యాలయంతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో సబ్ రిజిస్ట్రార్లు కేటగిరి విభజన ఈ విధంగా ఉంది. సబ్ రిజిస్ట్రార్లు ఏ– కేటగిరీ కార్యాలయాలు 12 ఉండగా, బి–కేటగిరీ కార్యాలయాలు 14 , సి–కేటగిరీ కార్యాలయాలు 8 ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటును దశలవారీగా ముందుగా ఏ– కేటగిరీ కార్యాలయాల్లో, డీఐజీ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అనంతరం బి–కేటగిరీ, సి–కేటగిరీల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అంతమవుతుందని భావిస్తున్నారు. ఆదేశాలు అందిన వెంటనే అమలు చేస్తాం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు కారణంగా ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రికార్డులు భద్రత వలయంలో ఉంటాయి. రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉండదు. – టి.సరోజ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ), స్టాంప్ అండ్రిజిస్ట్రేషన్ శాఖ -
ఆ ధర్నాలతో మాకు సంబంధం లేదు
పెదపూడి (అనపర్తి): సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు, 20వ తేదీన చలో విజయవాడలో భాగంగా నిర్వహించే ధర్నాకు ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేషన్కు ఎటువంటి సంబంధం లేదని ఆ అసోసియేషన్ రాష్ట్ర కనీ్వనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని నవరత్నాల ఉద్యోగుల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు చేయడం లేదని, ఆ ధర్నాలకు దూరంగా ఉందని ఆయన తెలిపారు. -
రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి : ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ, అలాంటి ఘటనే కాకినాడ రూరల్ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది. రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్షాఫ్ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు. అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈక్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...
చిన్ననాటి నుంచి కష్టాలే జీవితంగా గడిపిన ఆ అభాగ్యునికి భార్య రాక కొత్త జీవితం వచ్చినట్లైంది. భర్తకు ఆమె చేదోడువాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించింది. వారి అన్యోన్య దాంపత్యంలో చిన్నారి శ్రీయోషితకు జన్మనిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తీరి సాఫిగా సాగిపోతున్న వారి జీవితాన్ని విధి ఒక్కసారిగా వంచించింది. డెంగీ లక్షణాలతో భార్య మృతి చెందగా అప్పటి నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తను మరో పెళ్లి చేసుకున్నా తన చిన్నారికి తల్లి ప్రేమ దక్కదని, తాను పడ్డ కష్టాలు తన కుమార్తె పడకూదని భావించాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక, ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేక, భార్య ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరమంటూ తమ మూడేళ్ల చిన్నారిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేటలో గురువారం సంచలనం కలిగించిన ఈ ఘోరం అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తను లేని దగ్గర నుంచి నాకు ప్రతి క్షణం నరకంలాగే ఉంది. మా పెళ్లయిన దగ్గర నుంచి తల్లిలా, స్నేహితురాలిలా, భార్యలా అన్ని విషయాల్లో సహకరించేది. ఇప్పుడు ఒకేసారి ఆ ముగ్గురు (తల్లి, స్నేహితుడు, భార్య) దూరం కావడంతో నాకు బతుకు ఎందుకు అనిపిస్తుంది. నాతో ఉన్నది నాలుగేళ్లు కానీ తను రాకముందు నా జీవితంలో ఏం జరిగిందో మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు తనతో ఉన్న క్షణాల్లో తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంకో భార్య వస్తే ఇవన్నీ మర్చిపోయి ఉండవచ్చు అంటారు. కానీ నాకు భార్య వస్తే నా కూతురుకి తల్లి రాదు. నాకు పిల్లలు పుడితే నా కూతురు మరో నవ్యలా తయారవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం. తను ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరం. ఎన్నో చెప్పాలని ఉంది, ఎన్నో పంచుకోవాలని ఉంది. కాని నా ప్రాణానికి ప్రాణం నాతో లేకపోయేసరికి ఏమీ తెలీట్లేదు. ఏమీ అర్ధం కావడం లేదు. నా కోసం కష్టపడిన నా స్నేహితులు అందరికీ నా క్షమాపణలు. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. – చందు మండపేటలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలో కూతురిని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన చందు తన సూసైడ్ నోట్లో రాసిన వేదన. సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన బాదం చందనకుమార్ (చందు) తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోగా పదేళ్ల వయస్సులోనే తన చెల్లెలు పుష్పలతను తీసుకుని చందు మండపేటలోని దగ్గర బంధువుల ఇంటికి వచ్చేశాడు. బంధువుల సహకారంతో చదువు ప్రారంభించారు. కొంతకాలానికి దగ్గరి బంధువు మృతి చెందగా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ చెల్లెలకి అన్నీ తానయ్యాడు. పెంచి పెద్దిచేసి కోరుకొండ మండలానికి చెందిన యువకునితో వివాహం జరిపించాడు. తాను స్థానిక నాళం వారి వీధిలో ఫ్లెక్సీ ఫ్రింటింగ్ ప్రారంభించి వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 2015లో జిల్లాలోని రావులపాలెం శివారు కొమరాజులంకకు చెందిన కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. పేద కుటుంబానికి చెందిన శ్రీనవ్య తండ్రి చిన్నతనంలో మృతిచెందగా ఆమె దాతల సహకారంతో ఎంటెక్ చదువుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చందు, పక్కనే చిన్నారి మృతదేహం వ్యాపార నిర్వహణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మూడేళ్ల కుమార్తె శ్రీయోషిత ఉంది. చిన్ననాటి నుంచి పడ్డ కష్టాలు మరిచి పోయి ఆనందంగా సాగిపోతోంది. కుటుంబంతో కలిసి పట్టణంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న చందు మండపేట రూరల్లో ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేసుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీనవ్య కన్నుమూసింది. ఆమె ఆశయం మేరకు చందు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేని జీవితం ఊహించుకోలేకపోయాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని, చిన్నతనంలో తాము పడ్డ ఇబ్బందులు తన కుమార్తె పడాల్సి వస్తుందని భావించి ఈ ఘెరానికి పాల్పడ్డాడు. నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నామంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో భార్య చీరను ముఖానికి కట్టుకుని మెడకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కోరుకొండలో నివాసముంటున్న సోదరి పుష్పలత ఉదయం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా చందు ఫోన్ ఎత్తకపోవడంతో పక్క వ్యాపారికి చెప్పగా అతను ఇంటికి వచ్చి చూసే సరికి ఈ ఘోరం వెలుగుచూసింది. చందు ఉరివేసుకుని ఉండటం, పక్కనే అభంశుభం తెలీని చిన్నారి శ్రీయోíÙత విగతజీవిగా పడి ఉండటం చూపరుల హృదయాలను కలచివేసింది. తమ అన్యోన్య దాంపత్య, తాను పడుతున్న ఆవేదన, తనకు సంబంధించిన స్థలం, వ్యాపారంలోని సామగ్రి, ఎల్ఐసీ ఇన్సూరెన్స్ సొమ్ములు తన తండ్రి, సోదరి, తన భార్య తల్లికి చెందాలనే విషయాలను వివరిస్తూ చందు రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్ను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందు రాసిన సూసైడ్ నోట్ భార్యకు మాట ఇచ్చినట్టుగానే... నేను ముందు పోతే ఏం చేస్తావు అని తన భార్య అన్నప్పుడు... నీ వెంటే నేను వచ్చేస్తానని చెబితే అలా కాదు కనీసం నా దినం కూడా చేయవా అని అడిగేది. చేశాక రా అనేది. అది సరదాకో నిజంగానో తెలీదు కానీ ఇప్పుడు తనే ముందు వెళ్లిపోయింది. అందుకే తన కోరిక ప్రకారం నా శక్తి మేర ఆమె కార్యక్రమాన్ని పూర్తి చేసి అప్పగించాల్సిన వన్ని అప్పగించేసి నేను తన వద్దకి వెళ్లిపోతున్నానంటూ చందు లేఖలో పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది. సచివాలయ ఉద్యోగినిగా... ఇటీవల మృతి చెందిన శ్రీనవ్య సెప్టెంబరులో జరిగిన సచివాలయ ఉద్యోగుల పరీక్షకు హాజరైంది. సెకెండ్ లిస్ట్లో తన భార్య పేరు వచ్చినట్టు బుధవారం చందు చెప్పాడని స్థానికులు అంటున్నారు. తన భార్య జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నానని, మండపేటలో వ్యాపారం మానేసి కుమార్తెను తీసుకుని కోరుకొండలోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయి ఏదో పనిచేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని అంటున్నారు. కాగా ఇంతలోనే ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. మండపేట సీఐ నాగ మురళీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..