Face
-
ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!
మనసు ప్రశాంతంగా ఉంటే.. ముఖం కూడా అందంగా మరిసిపోతూ ఉంటుంది. కానీ పెరుగుతున్నకాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం తదితర కారణాలతో ముఖం వెలవెలబోతూ ఉంటుంది. అలాంటిపుడే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే, సహజసిద్ధంగా ఫేషియల్ గ్లో(Facial Glow) పొందవచ్చు. సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాలు తెలుసుకుందాం పదండి. సమతుల ఆహారం, వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, రోజులో కనీసం 7 గంటల నిద్రతోపాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో ఆశ్చర్యపోయే బ్యూటీని సొంతం చేసుకోవచ్చు.స్ట్రాబెర్రీ , ఎగ్అరకప్పు స్ట్రాబెర్రీ గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన రెండు చెంచాలు, ఒక చెంచాడు నిమ్మరసం, వేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే జిడ్డు తగ్గి, ముఖం మిలమిలలాడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రంగా చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.పప్పాయి, కలబందబాగా పండిన తాజా బొప్పాయి ముక్కలు,( Papaya) తాజా కలబంద (Aloevera)లో కొద్ది నిమ్మరసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం పిండి, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కీరా ఎగ్సగం కీరకాయ, ఒక కోడిగుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పాలమీగడ పావు కప్పు ఆయిల్ (వీట్జెర్మ్, ఆలివ్, అవొకాడోలలో ఏదో ఒకటి) తీసుకోవాలి. కీరకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా ముక్కలు చేయాలి. ఈ ముక్కలను, మిగిలిన అన్నింటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత తుడిచేయాలి. ఇలా ఉదయం, రాత్రి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టి మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. (ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు)ముఖం మీద మురికి, ఆయిల్, మలినాలను తొలగించడానికి రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) ముఖాన్ని కడగాలి.సహజ నూనెలను తొలగించకుండా ఉండటానికి మీ చర్మ రకానికి సరిపోయే తేలికపాటి క్లెన్సర్ను ఉపయోగించండి.విటమిన్ సీ లభించే పండ్లను బాగా తీసుకోవాలివిటమిన్ సి పిగ్మెంటేషన్, సన్ టాన్ మచ్చలు, వయసు మచ్చలను తగ్గిస్తుంది.కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈవెన్ టోన్డ్ ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలిచర్మ ఆరోగ్య రక్షణలో హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. మెరిసే చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్ను ఎంచుకోవాలి.కెమికల్స్ లేని సన్ స్క్రీన్ వాడాలి. అవసరాన్ని బట్టి రోజులు మూడు, నాలుగు సార్లు దీన్ని అప్లయ్ చేయాలి.తాజా పళ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే, విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాగే ఫేస్ ప్యాక్ వేసుకున్నపుడు, లేదా ఎక్స్ఫోలియేట్ చేసేటపుడు చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా, మృదువుగా చేయాలి.ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన జుట్టుకు ,మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి.ప్రోబయోటిక్ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.యాంటీఆక్సిడెంట్లు (బెర్రీలు, ఆకుకూరలు ,గింజలు వంటివి),ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు (సాల్మన్ , అవకాడోలు వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.వేడినీటితో ఈ ముప్పుఆవిరిస్నానం, ఎక్కువ వేడి నీటి స్నానానికి దూరంగా ఉండాలి. లేదా సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు వేడి నీటిని ప్రవహించడం వల్ల చర్మంలోని సహజనూనెలు దెబ్బతిని స్తేజంగా కనిపిస్తుంది. ఇదీ చదవండి: లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్కు లడ్డూ లంచమా?! -
అందమైన ముఖాకృతి కోసం..!
చక్కటి ముఖాకృతితోనే అందం ఇనుమడిస్తుంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. చిత్రంలోని ఈఎమ్ఎస్ మైక్రోకరెంట్ ఫేస్ స్లిమ్మింగ్ స్కిన్కేర్ మెషిన్ ముఖకండరాలను బిగుతుగా మార్చి, ముఖాన్ని షేప్లోకి మారుస్తుంది. నిజానికి చబ్బీగా, గుండ్రటి ముఖంతో కనిపిస్తే, ఎంత అందంగా ఉన్నా, కండరాలు కాస్త పట్టు సడలగానే వయసు ఎక్కువగా కనిపిస్తారు. అదే ముఖం షేప్లో ఉంటే ఆ అందం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ డివైస్ చూడటానికి హెడ్ఫోన్స్ మాదిరిగా ఉంటుంది. దీని హెడ్స్ని బుగ్గలకు ఆనించి పెట్టుకుని, బటన్ ఆన్ చేస్తే, వైబ్రేట్ అవుతూ ట్రీట్మెంట్ అందిస్తుంది. ముఖంపై పేరుకున్న అదనపు కొవ్వును క్రమంగా కరిగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంతో తొణికిసలాడేలా చేస్తుంది. దవడ ప్రాంతంలో సడలిన కండరాలను, గడ్డం కింద డబుల్ చిన్ను తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. ఈ పరికరం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అయాన్లు వేగంగా చర్మం లోతుల్లోకి చొచ్చుకునిపోతాయి. దీనివల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఈ పరికరం చాలా మోడల్స్లో, చాలా రంగుల్లో లభిస్తోంది. ఫేస్ మాస్క్ వేసుకుని కూడా ఈ పరికరంతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ మైక్రోకరెంట్ రోలింగ్ను ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,374 రూపాయలు. (చదవండి: న్యూయార్క్లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్లో..) -
మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు! బ్యూటీ టిప్స్స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.ఓట్మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. -
శిల్పంలాంటి ముఖాకృతి కోసం..!
సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు కామన్గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు. ఎలా చేయాలంటే.. ఫిష్ ఫేస్:ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.'O' మాదిరిగా నోరు తెరవడం..మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.ది ఐ ఓపెనర్కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది. కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.ప్రయోజనాలు..వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారంచర్మపు స్థితిస్థాపకతను పెంచుతుందిముడతలను తగ్గిస్తుందిధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది. ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుందికను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుందిఅలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్తో చెక్పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
క్యారెట్తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!
క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్లోని విటమిన్ సి కొల్లాజెన్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం!క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది. -
యవ్వనం కోసం మిలియనీర్ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్స్టాలో వివరించాడు.యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. View this post on Instagram A post shared by Bryan Johnson (@bryanjohnson_) కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్గా శోభిత పెళ్లి చీర -
Beauty Tips: హార్మోన్ల అల్లరిది గిల్లకండి!
యువతుల లుక్స్ను ప్రభావితం చేసి వారిని బాధపెట్టేవాటిల్లో మొటిమలు ముఖ్యమైనవి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వారు బాల్యం వీడి కౌమారంలోకి వచ్చే దశలో ఈ మొటిమలు మొదలవుతుంటాయి. ఆ టైమ్లో దేహంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి మొదలవడం, ఆ టైమ్లో చర్మం మీద ఉండే గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంటుంది. ఆ నూనె వంటి పదార్థం గ్రంథుల చివర్లలో పేరుకుపోవడం వల్ల మృతిచెందిన కణాలను బయటకు రాకుండా ఆపడం... దాంతో నూనె గ్రంథి మూసుకుపోవడం వల్ల మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలను అమితంగా బాధించే ఈ మొటిమలూ... అవి వచ్చేందుకు కారణాలూ, వాటి నివారణా, చికిత్స వంటి అనేక విషయాలను తెలిపే కథనమిది.సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపిస్తాయని అనుకుంటారు. గానీ అవి ముఖం మీద చెంపలూ, ముక్కు అలాగే భుజాలు, వీపు ఇలా అనేక భాగాల్లో వస్తుంటాయి. మొటిమలు... లక్షణాలు:మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి. అవి... గ్రేడ్ – 1 : (కొమెడోజెనిక్) : ఈ తరహా మొటిమను వైట్ హెడ్ లేదా బ్లీచ్ హెడ్ అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం మూసుకుపోవడం వల్ల అక్కడ ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. బాల్పాయింట్ పెన్ చివరి టిప్ సైజ్లో ఈ వైట్హెడ్ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్హెడ్గా అభివర్ణిస్తారు. గ్రేడ్ – 2 : (పాపులర్ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కనిపిస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కనిపించే దశను పాపులర్ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా మరి ఉబ్బినట్లుగా బయటికి తన్నుకొని వచ్చి కనిపిస్తుంది. గ్రేడ్ – 3 : (పుస్టులార్ ఆక్నే): ఈ దశలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ. పైగా ఈ దశలో ్రపాపియోనిక్ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్ఫ్లమేషన్కు తోడు చీము చేరుతుంది. దాంతో ఎర్రగా ఉబ్బుకుని వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ – 4 : (సిస్టిక్ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లగా కనిపిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తీవ్రంగా మారుతుంది. కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు.కారణాలు : 1. బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశిస్తుంటారు. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్గా పేర్కొంటారు. టీనేజీ యువతుల్లో అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుండటం, వాటి మధ్య సమతౌల్యత లోపించడం మొదలైతే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్ ఒవేరియస్ డిజార్డర్’ లేదా పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ. 2. ఆహారం : చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే (హై గ్లూకోజ్) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాల్ని ఎక్కువగా తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ తరహా ఆహారాన్ని తగ్గించగానే మొటిమలూ తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరగకపోవచ్చు. మొటిమలకూ, ఇన్సులిన్ మెటబాలిజమ్ (ఇన్సులిన్ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. 3. జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కేవలం జన్యుసంబంధమైన కారణాలతోనూ మొటిమలు రావచ్చు. 4. ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 5. ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ్రపోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్ ఆరియస్, డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు.మొటిమలు మరింత తీవ్రంగా వచ్చేదిలా... 1. మురికి సెల్ఫోన్లు : టీనేజీ పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్ఫోన్లు వాడుతున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్ఫోన్ను, స్క్రీన్ను శుభ్రంగా తుడిచి వాడాలి. 2. హెయిర్ స్ప్రే లు వాడటం : టీనేజీ అమ్మాయిలూ, యువతులు హెయిర్ స్ప్రేలు, హెయిర్ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్లు, జెల్లు, క్రీములు వంటి వాటి వాడకం ఎక్కువ. వీటి వల్ల కూడా సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలా వచ్చే మొటిమలు నుదురు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 3. రకరకాల కాస్మటిక్స్ వాడటం : కొందరు తాము వాడే కాస్మటిక్స్లో కొమిడొజెనిక్ ఏజెంట్స్ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యూటల్ స్ట్రియటైట్, లారిల్ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్ వాడుతుంటారు. అవి తీవ్రపరిణామాలతో పాటు మొటిమలకు కారణమవుతుంటాయి. అందుకే కొనేముందు అవి ‘నాన్ కొమిడోజెనిక్ కాస్మటిక్స్’ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయడం మేలు. 4. ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్), ఫేషియల్స్ అతిగా ఉపయోగించడం వంటి పనుల వల్ల మొటిమలు రావడంతో పాటు ముఖానికి నష్టం జరుగుతుంది. 5. మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. ముఖపై చిన్నచిన్న గుంటల్లా పడే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ వస్తే ముఖం మరింత అందవికారంగా మారవచ్చు. అందుకే మొటిమలు గిల్లడం వంటివి చేయకూడదు. నివారణ / చికిత్సలు : ముఖాన్ని మృదువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. పొడిగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్తో రుద్దుకోవడం, మాటిమాటికీ కడుక్కోవడం చేయకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. ఒకవేళ కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్–కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. ఈ చర్యలతో మొటిమలు తగ్గకపోతే అప్పుడు మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు లేదా పైపొరను దెబ్బతీయవచ్చు. దాంతో ముఖంపై చర్మం ఎర్రబారిపోవచ్చు. ఆహారపరమైన జాగ్రత్తలు టీనేజ్ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి... చాక్లెట్లు / కాఫీలు : మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్ చాలా ప్రధానమైనవి. వాటిని పరిమితంగా తీసుకుంటూ ఆహారంలో కొవ్వులు, చక్కెర తగ్గించాలి ∙ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకోవడం అన్నది మొటిమలను చాలావరకు నివారిస్తుంది. ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు డర్మటాలజిస్ట్ను కలవాలి. -
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్ను ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్లో ముంచిన కాటన్ బాల్స్ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్ప్యాక్లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్లుక్ వస్తుంది. -
అలియా లాంటి మెరిసే చర్మం కోసం..!
బాలీవుడ్ నటి అలియా భట్ ఎంత గ్లామరస్గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అలియా కాశ్మీర్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్ లుక్లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్తరుచుగా మాయిశ్చరైజర్ చేయడం..సెరామైడ్లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.హైడ్రేటింగ్ క్లెన్సర్లకు మారండిచలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్వాష్లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్వాష్ని ఉపయోగించండి.వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులుకఠినమైన స్క్రబ్లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండికఠినమైన స్క్రబ్లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్లు ఉపయోగించండి.హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి..శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..) -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై, హెచ్వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్ప్యాక్ పెట్టడం. ఐస్క్యూబ్స్ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
ఈగను చంపడంతో ..ఏకంగా కన్నేపోగొట్టుకున్నాడు..!
వర్షాకాలం, లేదా తీపి వంటకాల ఘుమఘమలకు ఈగలు ముసురుతుంటాయి. వాటితో సమస్య అంత ఇంత కాదు. ఈగల వల్లే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయని మనందరికీ తెలిసిందే. వాటి నివారణ కోసం పలు క్రిమి సంహరక నివారణలు వాడుతుంటాం కూడా. అయినా ఎక్కడొక చోట ఒక్క ఈగ అయినా ఉంటూనే ఉంటుంది. ఉన్న ఒక్క ఈగ ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ముఖంపై వాలుతూ విసిగిస్తూ ఉంటుంది. చిర్రెత్తుకొస్తే చంపందేకు యత్నిస్తాం. ఇలానే ఓ వ్యక్తి చేసి ఏకంగా కంటినే పోగొట్టుకున్నాడు. ఎలాగంటే..వివరాల్లోకెళ్తే..చైనాలో ఈ దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చైనాలోని గ్వాంగ్డాంగ్లోని దక్షిణ ప్రావిన్స్లోని షెన్జెన్లో నివశిస్తున్న వ్యక్తికి ఒకరోజు ఈగ అతడి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది. దీంతో విసుగొచ్చి దాన్ని చంపాడు. అంతే ఒక గంట తర్వాత ఎడమ కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చేసింది. ఆ తర్వాత ఒకటే నొప్పిపుట్టడంతో తాళ్లలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు మందుల ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగవ్వకపోగ, పరిస్థితి మరింత దిగజారింది. వైద్య పరీక్షల్లో అతడికి కండ్లకలక వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అంతేగాదు అతడి కంటి చుట్టూ ఉన్న ప్రాంతం వ్రణాలు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మెదడుకు వ్యాపించే అవకాశం ఉందని భావించి ఎడమ కనుబొమ్మను మొత్తం తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈగలాంటి కీటకాలు బాత్రూమ్లు, బాత్టబ్లు, సింక్లు, కిచెన్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తడిప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ కీటకాలు కళ్ల దగ్గరే తచ్చాడుతున్నప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. దాని వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. బదులుగా అది తాకిన ప్రాంతాన్ని పరిశుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావణంతో కడగాలని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చైనా ప్రజలందర్నీ కలవరపాటుకి గురిచేసింది. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది చాలా భయనకంగా ఉంది. తాము కూడా తరుచు బాత్రూంలలో ఇలాంటివి చూస్తామని, దేవుడు దయ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: అనంత్ పెళ్లిలో హైలెట్గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!) -
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్ భామకు బిగ్బాస్తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. ఉర్ఫీ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
చివరి విడతలో అఖిలేష్కు షాక్
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు, అతని కుమారుడు అఖిలేష్కు అతి సన్నిహితునిగా పేరొందారు.నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్ ఒక ట్వీట్లో తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్ యాదవ్ నా టికెట్ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.యూపీలోని సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్వాదీ పార్టీలోనే ఉంటున్నారు.ఇటీవల బల్లియా లోక్సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే నాడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్ రాయ్ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. -
Beauty Tips: ఇలా చేశారో.. మీ చర్మం కాంతివంతమే!
టీ డికాషన్ని ఉపయోగించడం వల్ల వేసవి తాపం నుంచి చర్మాన్ని, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఇందుకు తేయాకులను మాత్రమే ఉపయోగిస్తే సరైన ఫలితం లభిస్తుంది.చల్లారిన అరకప్పు టీ డికాషన్లో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రపరుచుకోవడానికి ముందు కొన్ని నీళ్లు ముఖం మీద చల్లి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి.టీ డికాషన్లో ఐస్ క్యూబ్ వేసి, ఆ నీటిని ముఖానికి స్ప్రే చేసుకొని, కాసేపు సేదతీరాలి.ఎండ బారిన పడి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది.టబ్ బాత్ చేసేటప్పుడు కొన్ని తేయాకులు నీటిలో వేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవల్ల కలిగిన అలసట నుంచి చర్మం విశ్రాంతి పొందుతుంది.జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే తలస్నానం చేసిన తర్వాత టీ డికాషన్తో కడగాలి. కండిషనర్లా ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ తనకు సొంతం! -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. -
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్ చిన్ వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది వి షేప్ ఫేస్ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్.ఈ ఎర్గోనామిక్ ఫేస్ లిఫ్టింగ్ మసాజర్.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్ చిన్ రెడ్యూసర్ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్తో పాటు సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ కోర్డ్ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్ ని చేత్తో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్ను చెవులకు బిగించుకుంటే చాలు.. గడ్డం కింద మెషిన్ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్మెంట్ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
క్షణాల్లో ముఖాన్నీ క్లీన్ చేసి మెరిసేలా చేసే డివైజ్!
ఫౌండేషన్స్, గ్లాసీ లోషన్స్తో ముఖాన్ని తాత్కాలికంగా మెరిపించడం ఈజీయే! కష్టమల్లా తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవడమే! అందుకే ఈ బ్రష్ని మీ మేకప్ కిట్లో పెట్టేసుకోండి. మేకప్ను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3–ఇన్–1 ఎలక్ట్రిక్ మసాజ్ టూల్.. చర్మాన్ని శుభ్రపరచడమే కాక మృదువుగానూ మారుస్తుంది. ముఖం, మెడ, వీపు ఇలా ప్రతిభాగాన్నీ క్లీన్ చేస్తుంది. స్కిన్ మసాజర్లా పనిచేసి స్కిన్ టోన్ను మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను మాయం చేస్తుంది. ఒత్తిడిని.. అలసటను దూరం చేస్తుంది. ఈ డివైస్.. అన్ని వయసుల వారికీ అనువైనది. అలాగే స్త్రీ, పురుషులనే భేదం లేకుండా దీన్ని అందరూ వాడుకోవచ్చు. నచ్చినవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. మసాజర్ను అవసరమైన విధంగా స్లో లేదా ఫాస్ట్ మోడ్లో ఉపయోగించుకోవచ్చు. యూజ్ చేసిన ప్రతిసారీ నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ గాడ్జెటే అయినా .. వాటర్ ప్రూఫ్ కావడంతో స్నానంచేసేటప్పుడూ వాడుకోవచ్చు. ఇందులో మూడు వేరువేరు బ్రష్లు ఉంటాయి. ఒకటి సెన్సిటివ్ ఫేస్ బ్రష్.. ఇది సున్నితమైన చర్మం కోసం మృదువుగా, సౌకర్యవంతంగా పని చేస్తుంది. రెండవది డీప్ క్లెన్సింగ్ బ్రష్.. ఇది రంధ్రాలను శుభ్రపరచి.. చర్మాన్ని నీట్గా మారుస్తుంది. మూడవది సిలికాన్ బ్రష్.. ఇది అన్ని చర్మతత్వాలకూ ఉపయోగపడుతుంది. ఈ బ్రష్లను స్కిన్ టైప్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ మెషిన్కి చార్జింగ్ పెట్టుకుని.. వైర్ లెస్గానూ వాడుకోవచ్చు. ఇందులో పింక్, బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!) -
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
పెదవులు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!
ముఖం అందంగా ఉండాలంటే పార్లర్ల వద్దకే వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కటి నిగారింపును సొంతం చేసుకోవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకోసం ముఖంపై కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లో ఉంటే సహజసిద్ధమైన వాటిని అప్లై చేసి మచ్చలేని చందమామలా ఉండే ముఖాన్ని సొంతం చేసుకుండి. అందకు ఈ సింపుల్ రెమిడీస్ని ఫాలోకండి. రోజూ పెదవులకు కాస్తంత మీగడ రాసి సున్నితంగా మర్దన చేస్తే పెదవులు పగలకుండా గులాబీ రేకుల్లా మెరుస్తాయి. ముఖాన్ని రోజుకు రెండు మూడుసార్లు గోరువెచ్చటి నీటితో కడుక్కుని పొడి టవల్తో చక్కగా తుడిచేస్తే మొటిమల వంటివి రావు. లేతకొబ్బరిని మెత్తగా మెదిపి ముఖానికి ప్యాక్లా వేసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే ముఖం చక్కగా అందంగా కనబడుతుంది. రకరకాల షాంపూల బదులు కుంకుడు కాయ రసం లేదా సీకాయ పొడితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు, కేశ సంబంధమైన సమస్యలు రాకుండా జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. తల స్నానం పూర్తయిన తర్వాత, చివరి మగ్గు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తలమీద పోసుకుంటే జుట్టు, చర్మ సమస్యలు రావు. (చదవండి: ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!) -
ముఖం ముత్యంలా కాంతిగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
పార్లర్కి వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని ముత్యంలా మెరిసేలా చెయ్యొచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇంతకీ ఆ హెర్బల్ ఫేస్ప్యాక్లు ఏంటో చూద్దామా!. ఇంట్లో రోజూ వాడే వాటితోనే చేసుకోగలిగిన ట్రీట్మెంట్లు. ఇక్కడ ఇచ్చినవన్నీ ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేని హెర్బల్ ఫేస్ప్యాక్లు. చందనం ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంతోపాటు మొటిమలు, యాక్నేతోపాటు వేడితో చర్మం పొంగినప్పుడు వచ్చిన ఎర్రటి మచ్చలను కూడా తొలగిస్తుంది. చందనంలో పన్నీరు కలిపి ప్యాక్ వేస్తుంటే మంచి ఫలితాన్నిస్తుంది. ఎండకాలంలో ఈ ప్యాక్ వేస్తుంటే శరీరానికి చల్లదనాన్నిస్తుంది. బొప్పాయి చెక్కు, అరటి తొక్కలు కూడా సౌందర్య సాధనాలే. వీటిని లోపలి వైపు (గుజ్జు ఉండే వైపు) చర్మానికి అంటేలా రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా ముఖం స్వచ్ఛంగా ముత్యంలా మెరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ పాలపొడి కాని తాజా పాలు కాని కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తుంటే రెండు వారాలకు ఇనుమడించిన చర్మకాంతి స్పష్టంగా కనిపిస్తుంది. చర్మాన్ని నునుపుగా కాంతివంతంగా చేయడంలో కమలా, బత్తాయిపండ్లు బాగా పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రసాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ముఖానికి రాసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇవి ముఖాన్ని క్లియర్గా చేయడంతోపాటు స్కిన్ టోనర్గా కూడా పనిచేస్తాయి. (చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?) -
Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్బీర్కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా కనిపించిన వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ స్టార్ కపుల్కు రాహా అనే కూతురు జన్మించింది. అయితే ఇప్పటివరకు తమ గారాల పట్టి మొహాన్ని అభిమానులకు పరిచయం లేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రాహా చాలా క్యూట్గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అచ్చం రణ్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ లానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రణ్బీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు అలియాభట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. Rishi kapoor + Raj kapoor + Ranbir kapoor genes won for me😭♥️ https://t.co/0mX7C4xwAL — Susmita✨ (@SSusmita0319) December 25, 2023 Raha baby dito assemble of rishi kapoor 💏 God bless her#RanbirKapoor pic.twitter.com/Q0gY0AQ14S — r (@rajkbest) December 25, 2023 Raha is so beautiful , so elegant just looking like a Wow❤️🔥 Glimpse of Rishi Kapoor😍#AliaBhatt#RanbirKapoor#rahakapoorpic.twitter.com/ZxXiEKARwe — India's Elon Musk (@EshhanMusk) December 25, 2023 -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
ఈ మాస్క్ వేసుకుంటే..వయసును చూపించే సంకేతాలన్నీ మాయం!
ఎంత మేకప్ వేసినా.. కళ్లు.. పెరుగుతున్న వయసును దాచలేవు. కళ్ల చుట్టు ఏర్పడే ముడతలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివన్నీ వయసును బయటపెట్టడమే కాదు ముఖాన్నీ కళావిహీనంగానూ మారుస్తాయి. చిత్రంలోని ఈ మాస్క్ను రోజుకు పది నిమిషాలు ఉపయోగిస్తే చాలు.. వయసును చూపిస్తున్న లక్షణాలన్నీ మాయమై ముఖం మిలమిలా మెరుస్తుంది. ఈ ‘మెడి లిఫ్ట్ ఐ ఈఎమ్ఎస్ మాస్క్’ వృద్ధాప్య సంకేతాలతో పోరాడేందుకు కళ్ల కోసం రూపొందింది. దీన్ని రోజుకు పది నిమిషాలు ధరిస్తే చాలు మంచి ఫలితం వస్తుంది. ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ మాస్క్(EMS) నుంచి మంచి ప్రయోజనాలను అందుకోవచ్చు. దీనికి రెండున్నర గంటలు చార్జింగ్ పెడితే సుమారు 3 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. ఈ మాస్క్ ధర దాదాపుగా 226 డాలర్లు ఉంది. అంటే 18,855 రూపాయలు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టీవీ చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, వాకింగ్కి వెళ్లినప్పుడు, ల్యాప్టాప్లో వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగించుకోవచ్చు. (చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!) -
సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!
మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే కూరగాయాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇవే గుర్తోస్తాయి. కానీ వీటితోపాటు ఆరోగ్యానికి మంచివి, కొన్ని వ్యాధుల తీవ్రం కాకుండా నిరోధించే మంచి ఔషధగుణాలు కలిగినవి కూడా ఉన్నాయి. వాటిలో ఈ సబ్జగింజలు ఒకటి. వీటిని బేసిల్ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి, కాదు ముఖ సౌందర్యాన్ని ఇమనుడింప చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జా గింజలు ఆరోగ్య పరంగానూ, ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!. ఆరోగ్యపరంగా.. మధుమేహన్ని నియంత్రిస్తాయి. ప్రతీరోజు రెండు స్పూన్ల సబ్జాగింజలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినాలన్న కోరికను నియంత్రిస్తుంది భోజనానికి ముందు సబ్జా గింజలను పెరుగులో కలిపి, కొన్ని కూరగాయ ముక్కలను జోడించి తీసుకుంటే మనకు తెలియకుండానే తక్కువగా ఆహారం తీసుకుంటాం. నానాబెట్టిన సబ్జాగింజలను నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఏదోరకంగా సబ్జాగింజలను తీసుకుంటుంటే కడుపు మంటను నియంత్రించడమే గాక శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మారకుండా నియంత్రిస్తుంది సబ్జాతో మరింత కాంతిమంతం సబ్జాగింజలను నీటిలో నానబెట్టి , పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా రాయాలి. పదినిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖం కాంతిమంతంగా, ఫ్రెష్గా కనిపిస్తుంది. పంటికి జామ నాలుగు జామ ఆకులని నీటిలో వేసి మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి..గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల రసం పళ్లను మరింత దృఢంగా మారుస్తుంది. (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్ఫుల్ అంటున్న వైద్యులు!) -
బౌల్ మసాజ్తో మెరిసిపోండి!
కొబ్బరి నూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్... వీటిలో ఏదైనా ఒకటి ముఖానికి రాయాలి. ఇప్పుడు చిన్న స్టీల్గిన్నెను తీసుకుని ముఖమంతా మర్దన చేయాలి. నుదురు, కనుబొమ్మలు, బుగ్గలు, మెడ భాగంలో గిన్నెను గుండ్రంగా తిప్పుతూ ముఖానికి రాసిన నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మర్దన చేయాలి. ఇలా చేస్తే... ముఖం మీద ముడతలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. కండరాల మీద ఒత్తిడి తగ్గి చర్మానికి విశ్రాంతి దొరుకుతుంది. ఈ బౌల్ మసాజ్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు కూడా. దీంతో కేవలం ముఖం మాత్రమే కాకుండా పాదాలు దగ్గర నుంచి బాడీ అంతా మసాజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇత్తడి వంటి బౌల్తో మసాజ్ చేస్తారు. ఇది అలసట, వాపును తగ్గిస్తుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలసటతో ఉన్న పాదాలను ఈ బౌల్తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్గా ఉండటమే గాక రక్తప్రసర సంక్రమంగా జరిగి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి పనితీరుకి ఈ మసాజ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బౌల్ మసాజ్ విధానం వల్ల శరీరీ పనితీరుని నియంత్రించే వాతపిత్త కఫా దోషాలను సమతుల్యం చేస్తుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ బౌల్ మసాజ్ ట్రై చేయండి. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్కి వెళ్లాల్సిన పని ఉండదు!) -
ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్కి వెళ్లాల్సిన పని ఉండదు!
ఎల్లవేళలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అందం.. కలకాలం నిలచి ఉండాలంటే చర్మానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ అవసరం. అందుకోసమే ఈ కిట్! ప్రతి ఒక్కరికీ యూజ్ అవుతుంది. సహజమైన సౌందర్యాన్ని పొందాలనుకునే వాళ్లు ఇలాంటి మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్ను వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మెషిన్ శరీరంపైనున్న మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. మేకప్తో పాడైన చర్మాన్ని నిమిషాల్లో సరిచేస్తుంది. వయసుతో వచ్చే ముడతల్ని ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతిమంతంగా మార్చి.. సరికొత్త అందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఈ డివైస్ ఉంటే.. ప్రత్యేక మెరుగుల కోసం పార్లర్కి వెళ్లాల్సిన పనిలేదు. ఈ టూల్.. చర్మానికి ఎక్స్ఫోలియేటర్ స్క్రబ్ను అందిస్తుంది. సెన్సిటివ్, ఆటో, మాన్యువల్ అనే పలు మోడ్స్ ఇందులో ఉంటాయి. సిస్టమ్కి అటాచ్ అయి ఉన్న పొడవాటి ప్లాస్టిక్ ట్యూబ్తోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ పోర్ ఎక్స్ట్రాక్షన్ టిప్, గ్రేడ్ డైమండ్ టిప్, మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ ఇలా ఆ ట్యూబ్కి అటాచ్ చేసుకోవాల్సిన వేరువేరు పార్ట్స్.. మెషిన్తో పాటు లభిస్తాయి. పోర్ ఎక్స్ట్రాక్షన్ సాయంతో చర్మంపైనున్న చిన్న చిన్న గుంతలు, రంధ్రాలను తగ్గించుకోవచ్చు. డైమండ్ టిప్ సాయంతో ముడతలు, గీతలను పోగొట్టుకోవచ్చు. మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ సాయంతో చర్మం లోతుల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగించుకోవచ్చు. ప్లాస్టిక్ ట్యూబ్ని సులభంగా పెన్ పట్టుకున్నట్లుగా పట్టుకుని, చర్మం మీద పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ మెషిన్ చూడటానికి మినీ టాయిలెట్ బాక్స్లా కనిపిస్తుంది. ఈ సిస్టమ్కి ఒకవైపునున్న పవర్ బటన్, స్టార్ట్ బటన్, లెవెల్స్.. అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుని సులభంగా వినియోగించుకోవచ్చు. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా?
కొందరూ రాత్రి పడుకునేటప్పుడూ చక్కగా ముఖం కడుక్కుని పడుకుంటారు. ఇలా చేయడం మంచిదా? కాదా? . మరికొందరూ మాత్రం రాత్రిపూట ముఖం కడిగితే ఎక్కడ నిద్రపట్టదనో అస్సలు కడగరు. ఫ్రెష్నెస్ ఉంటే ఇంక నిద్ర ఏం వస్తుందని అనే వారు ఉన్నారు. అసులు ఇది ఎంతవరకు మంచిది. అలాగే కొందరు దగ్గర దుర్గంధం వస్తుంది. ఎన్ని ఫెరఫ్యూమ్లు వాడిన ఆ దుర్వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటి వాళ్లు ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదో తెలుసుకుందాం. రాత్రి సమయంలో ముఖం కడగొచ్చా.. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం మరింత కాంతిమంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి. సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, కాటన్ వస్త్రంతో తడిలేకుండా తుడిచి ఆ తరువాత పడుకోవాలి. రోజూ పడుకునేముందు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన మురికి, మట్టి వదిలి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ఉండే సూక్ష్మ రంధ్రాలు చక్కగా శ్వాసిస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గి చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది మొటిమల ముప్పు తగ్గుతుంది. పడుకునే ముందు ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారకుండా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వారు రోజూ పడుకునేముందు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చర్మం మీద ముడతలు, కాలిన గాయాలు, మొటిమలు, బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్,గీతలు, మచ్చలు తగ్గాలంటే పచ్చి బంగాళాదుంపను తురిమి ముఖం మీద ప్యాక్వేయాలి లేదా మర్దన చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెల రోజులుచేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరం దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలంటే.. స్నానం చేసే నీటిలో పటికముక్కలను వేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం తరువాత శరీరాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా స్నానం చేస్తే రోజంతా దుర్వాసన లేకుండా తాజాగా ఉంటారు. వీలైతే రాత్రంతా పటికను నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే మరీ మంచిది. అరటిపండు, బ్రకోలి, సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో అధికంగా చేర్చుకుంటే... చర్మం జిడ్డుతనం తగ్గి ఆరోగ్యంగా తయారవుతుంది. (చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్తో పాదాల పగుళ్లు మాయం!) -
అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం బాధితుడే!
అత్యంత అరుదైన వ్యాధి. దీని బారినపడితే ఆ వ్యక్తి అత్యంత నరకయాతన అనుభవిస్తాడు. చివరికి ఆ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారట. అందుకే దీన్ని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ వ్యాధి? ఎలా సోకుతుంది తదితరాల గురించే ఈ కథనం.! ఈ వ్యాధి పేరు ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరల్జియా అంటారు. వ్యవహారికంలో ఫాంటమ్ ఫేస్ పెయిన్ అని పిలుస్తారు. ఇది ముఖంలోని నరాలకు సంబంధించిన వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రెజిమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీంతో ఆ వ్యక్తి ముఖంలో ఎడమ లేదా కుడివైపు విపరితమైన నొప్పి వస్తుంది. అది ఒక తిమ్మిరి మాదిరిగా, ఎవ్వరైన కొడితే దిమ్మతిరిగినట్లుగా పెయిన్ వస్తుందట. అలా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన నొప్పి ఉంటుందట. దీంతో నోరు లేదా దవడలను కదపడం చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎంతసేపు ఉంటుందనేది చెప్పలేం. తగ్గాక కూడా మళ్లీ ఎప్పుడూ వస్తుందో కూడా చెప్పలేం. దీని ప్రభావం దైనందిన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడూ కనీసం బ్రెష్ కూడా చేయలేరు. ఆ నొప్పికి తాళలేక ముఖాన్ని మాటి మాటికి రాపిడికి గురి చేస్తారు రోగులు. దీంతో ముఖం పుండ్లుగా ఏర్పడి ఒక విధమైన చర్మవ్యాధికి దాదితీస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు నుంచి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను క్రికెటర్ల దగ్గర నుంచి ఎందరో ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఫేస్ చేశారట. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాధి బారినే పడ్డారు. దీని కోసం యూఎస్ వెళ్లి మరీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐతే ఈ చికిత్స అత్యంత ఖర్చుతో కూడినది. పైగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు. ఎలా వస్తుందంటే.. ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రిజెమినల్ డిఫెరెంటేషన్ నొప్పి అనేది కపాలం నుంచి ముఖానికి వెళ్లే త్రిభుజాకారంలోని నరాలు దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది. ఈ నొప్పి తొమ్మిరితో కూడిన ఒక విధమైన భరించేలేనిదిగా ఉంటుంది. మైగ్రైన్ నొప్పిలా అనిపిస్తుంది. దీనికి చికిత్స కూడా చాల కష్టం. ప్రస్తుతం తాజాగా పోలాండ్కి చెందిన 70 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధిని బారినపడింది. దీని కారణంగా ఆమె కుడివైపు నాసికా రంధ్రం గాయమవ్వటమే కాకుండా కన్ను కుడవైపు ముఖ ప్రాంతమంతా పుండుగా మారిపోయింది. ఆ నొప్పికి తాళ్లలేక ముఖాన్ని రుద్దడంతో పుండ్లు వచ్చి చర్మవ్యాధికి దారితీసింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రితో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ట్రైజెమినల్ ట్రోఫిక్ సిండ్రోమ్(టీటీస్)తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎదురయ్యే సమస్యలు.. దీని కారణంగా దవడ, దంతాలు లేదా చిగుళ్ళలో విద్యుత్ షాక్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముఖంలో ఆకస్మిక నొప్పికి కారణమయ్యే నరాల నష్టం అని అన్నారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చు గానీ కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయని అంటున్నారు. దాదాపు నూరు కేసుల్లో 70 శాతం సక్సెస్ అయితే 30 శాతం ఫెయిల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయని అన్నారు. దీనికి పవర్ఫుల్ యాంటి బయోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. వృద్ధులు వాటిని తట్టుకునే స్థితిలో ఉండలేరు కాబట్టి వారికి చికిత్స చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి భారినపడ్డవారు చేతికి గ్లౌజ్లు ధరించి ముఖాన్ని రాపిడికి గురిచేయకుండా ఉండేలా క్లాత్ని చుట్టి ఉంచుకుంటే..కొద్ది మోతాదు మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య మొదటి పోటీగా ఈ పోలింగ్ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. Bypolls: Voting begins in six states for 7 assembly seats Read @ANI Story | https://t.co/6U9T1V6j1l#bypolls #UP #Tripura #Jharkhand #WestBengal pic.twitter.com/rlxhf6bo5k — ANI Digital (@ani_digital) September 5, 2023 జార్ఖండ్లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మధన్పూర్, ఉత్తరప్రదేశ్లోని ఘోసి, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్లోని ఘోసిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉపఎన్నికలకు ఎస్పీ సుధాకర్ సింగ్పై బీజేపీ దారా సింగ్ చౌహాన్ను రంగంలోకి దింపింది.దారా సింగ్ చౌహాన్ ఘోసీ నుంచి 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతునిస్తోంది. త్రిపురలోని ధన్పూర్లో బీజేపీ అభ్యర్థి ప్రతిమా భూమిక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో సీటు ఖాలీ అయింది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై ప్రతిమా భూమిక్ సోదరుడు బిందు దేబ్నాథ్ను భాజపా బరిలోకి దింపుతోంది. అటు.. ఉమెన్ చాందీ మరణంతో పుతుపల్లి సీటు ఖాళీ కావడంతో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ సీనియర్ నేత తనయుడు చాందీ ఉమెన్ను బరిలోకి దింపింది. ఇదీ చదవండి: కుల విభేదాల్ని మాత్రమే ఖండించా.. ఉదయ్నిధి స్టాలిన్ తాజా ప్రకటన -
ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!
ఆభరణాలు ఎన్ని ఉన్నా ఆ ఒక్క అలంకారం తక్కువైతే అందానికి పరిపూర్ణత చేకూరదు. ఆ ఒక్కటే ముక్కుపుడక లేదా ముక్కెర. వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోతూ నోస్పిన్గా స్టైల్లో తనదైన శైలిని చూపుతూ మురిపెంగా మెరిసిపోయే ముక్కున సింగారపు వేడుకలకు ప్రత్యేకం. వ్యక్తిగత శైలికి బలమైన ప్రతిబింబంగా నిలిచే ముక్కెర ఎంపిక కోసం కొన్ని కసరత్తులు చేయాల్సిందే. గుండ్రని ముఖం ఉన్న మహిళలు పొడవుగా ఉండే నోస్రింగ్ ఎంచుకోవడం మంచిది. అలాగే, ముఖం కోలగా ఉండేవారు గుండ్రని నోస్పిన్ డిజైన్స్ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. సంప్రదాయంలో మెరుపు బ్రైడల్ కలెక్షన్లో భాగంగా స్వచ్ఛమైన బంగారు, డైమండ్ ముక్కు ఆభరణాలను ఎంచుకుంటుంటారు. అయితే గ్రాండ్గా ఉండేందుకు బంగారం, డైమండ్, ముత్యాలు, ఇతర రత్నాలతో ఉండే ముక్కెరలను ఎంచుకోవచ్చు. ఇటీవల బ్రైడల్ నోస్ రింగ్స్లో డిజైన్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉంటున్నాయి. ఆధునిక శైలి వృత్తి, ఉద్యోగాలలో ఉంటున్న మహిళలైతే ఎలాంటి హంగులూ లేని సింపుల్ డిజైన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో డ్రెస్సులకు తగినట్టు మార్చుకోగలిగే ట్రెండింగ్ డిజైన్స్ను ఎంచుకుంటున్నారు. వీటిలో అన్ని రకాల స్టోన్స్కు మాత్రమే కాదు సిల్వర్, స్టీల్ నోస్రింగ్స్కు ఓటేస్తున్నారు. వీటిలో సెంట్రల్ నోస్ రింగ్స్ మరింత ట్రెండీగా మారాయి. రాష్ట్రాల వారీగా... మహారాష్ట్రీయుల ముక్కెర చంద్రవంక లేదా జీడిపప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది. ముత్యాలూ, వజ్రాలు, రాళ్లు, పూసలు జత చేసి ఉంటాయి. మహారాష్ట్ర పెళ్లికూతురు కేవలం ముక్కెర కోసమే వధువు కావాలని కోరుకునేంత అందంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల మహిళలు బులక్ అనే పేరున్న వెడల్పాటి నోస్ రింగ్స్ను ఎంచుకుంటారు. పంజాబీయుల నథ్ అనే పేరు గల ముక్కు ఉంగరాలు చాలా తేలికగా ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్ మహిళల నోస్ రింగ్స్ కూడా నథ్ లేదా నాథూరి అని పిలిచే నోస్ రింగ్స్ను పోలి ఉంటాయి. ఇవి బంగారం లేదా వెండితో ఉంగరంలా తయారుచేస్తారు. వీటిలో విలువైన రత్నాలను పొదుగుతారు. వేడుకలలో ధరించేవి పెద్దవిగా ఉంటాయి. ముక్కు నుంచి జుట్టుకు జత చేసే గొలుసు ఉన్న నోస్ రింగ్స్ను కూడా వాడుతుంటారు. ఇవి బ్రైడల్, ప్రత్యేక సంప్రదాయ వేడుకల అలంకారాలలో కనిపిస్తుంటాయి. ప్రాచీన భారతీయ రాజకుటుంబీకులు వీటిని ధరించేవారు. ఆ తర్వాతి కాలాల్లో పెళ్లి కూతురు అలంకరణలో భాగమైంది. ఉత్తరాఖండ్ మహిళల ఆభరణాల్లో నోస్ రింగ్ను టెహ్రీ నథ్ అని పిలుస్తారు. దీని అలంకారం అద్భుతంగా చెప్పుకుంటారు. ఈ నోస్ రింగ్లో విలువైన కెంపులు, ముత్యాలతో పొదిగిన వెడల్పాటి బంగారు తీగ ఉంటుంది. నెమలి డిజైన్స్ కూడా ఇందులో చూస్తాం. ఇక్కడి వివాహిత మహిళలు ఈ నోస్ రింగ్ను శుభప్రదంగా భావిస్తారు. ఆభరణాల కళాత్మకతలో ఈ నోస్ రింగ్ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తామర పువ్వు, హంస ఆకారంలో ఉన్న ముక్కెరలు గోవా, కోంకణ్ ప్రాంతాల వధువులు ఎంపిక చేసుకుంటారు. ఈ డిజైన్స్ కర్నాటక, కేరళలో కూడా ధరిస్తారు. దక్షిణాన శాశ్వతం తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ముక్కు ఉంగరాల కన్నా స్టడ్స్కే ప్రాధాన్యత. డైమండ్స్, కెంపులు, బంగారంతో తయారుచేసినవి ఉంటాయి. దక్షిణ భారత దేశాన ముక్కుపుడక ఒక శాశ్వత ఎంపికగా ఉంటుంది. ముక్కుపుడక అందం వారి అనుభవంతో కలిసి ప్రకాశిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. (చదవండి: అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!) -
కాంతి వంతమైన ముఖం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!
మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కటి మేని సౌందర్యాన్ని, కురులు అందాన్ని పెంపొందించుకోవచ్చు. వాటి ముందు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా పనికిరావనే చెప్పాలి. కాస్త ఓపికతో చేసుకుంటే ఇంట్లో వంటి వాటితోటే సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం! అందులో ముందుగా మనం జ్యూస్గానూ, కూరగాను ఉపయోగించే కాయగూర అయిన బీట్రూట్ ముఖ్య సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బీట్రూట్లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందం దృష్ట్యా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మంచి యాంజీ ఏజింగ్గా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహయపడుతుంది కూడా చర్మానికి రోజీ గ్లో ఇస్తుంది. మెరిసే మేని కాంతి కోసం బీట్రూట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం! తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పదినిమిషాలు నానబెట్టాలి. పదినిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈనీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. (చదవండి: మీ ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే..జీలకర్రతో..) -
ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది?
మొన్న మొన్నటి వరకు చైనా కరోనాతో భయానక నరకాన్ని చవి చూసింది. అన్ని దేశాలు బయటపడ్డా చైనా మాత్రం అంతా తేలిగ్గా ఆ మహమ్మారి నుంచి బయటపడలేకపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న వేళా! మళ్లా చైనీయులకు ఏమైందో గానీ మొత్తం ముఖం కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తున్నారు. కరోనా టైంలో కేవలం ముక్కుకి మాత్రమే మాస్క్ వేస్తే ఇప్పుడు ఏకంగా మొత్తం ముఖానికి మాస్క్ ఏంటి? బాబోయ్!.. మళ్లీ చైనాలో ఏం మహమ్మారి వచ్చింది అని అన్ని దేశాలు ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే.. చైనాలో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. ఆ వేడికి అక్కడ ప్రజలు తాళ్లలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే..దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారట. ఈ ఎండ నుంచి రక్షించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ఇలా ఫేస్మొత్తం కవర్ చేసేలా 'ఫేస్కినిక్' అనే మాస్క్లు వేస్తున్నారట. చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో నివాసుతులు దగ్గర్నుంచి, పర్యాటకులు వరకు అందరూ కూడా పోర్టబుల్ ఫ్యాన్లను కూడా తీసుకువెళ్తున్నారట. ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, వివిధ రకాల మొత్తటి దుస్తులను ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలు. అదీగాక అక్కడ మహిళలు ఫెయిర్ స్కిన్నే ఇష్టపడతారు అందువల్ల ఈ ఎండ నుంచి తమ మేను కాంతి తగ్గకుండా ఉండేందుకు వారంతా ఇలా ముఖమంతా కవర్ అయ్యేలా మాస్క్లు వేసుకుంటున్నారు. ఇవి చాలా తేలిగ్గా, సింథటిక్ ఉండటంతో చర్మం కమిలిపోకుండా ఉంటుందట. అంతేకాదు ఈ ఎండలు ఎలా ఉన్నా ఈ 'పేస్కినిక్' మాస్క్లు మాత్రం హాట్కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం!
పచ్చిపాలు, రోజ్ వాటర్ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వలయాకారంగా మర్దన చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్తో తుడిచేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాలు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. పచ్చిపాలు ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తేమ కోల్పోయిన చర్మానికి తేమనందిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా ఈ వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తే ముఖం మీద మొటిమలు వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది. -
మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
సాక్షి, తిరువనంతపురం: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల అదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా చిన్నారి ముఖంపైనే పేలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారి స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ ఫోన్ పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు) -
స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం..!
ఒక మహిళకు గోల్డెన్ టెంపుల్ చేదు అనుభవం ఎదురైంది. ముఖంపై జాతీయ జెండాను పెయింట్ వేసుకున్నందుకు పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో ఆ మహిళ ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించింది. గార్డు అంతటితో ఆగకుండా ఇది పంజాబ్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. గార్డు మాటలు విని మహిళ కంగుతింది. ఈ ఘటనను సదరు బాధితురాలు ఫోన్లో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత గార్డు మహిల ఫోన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. కాగా ఈ ఘటనపైపై గోల్డెన్ టెంపుల్ని నిర్వహించే శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ స్పందించి గార్డు దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే ఆ మహిళ ముఖంపై ఉన్న జెండాపై ఆశోక చక్రం లేనందున అది రాజకీయ పార్టీ జెండా అయి ఉంటుందని భావించి ఉంటాడని వివరణ ఇచ్చింది. ఈ మేరకు దేవాలయ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. ప్రతి మత స్థలానికి దానికంటూ ఒక పత్యేక విధివిధానాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాం. ఆ అధికారి ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరతున్నాం అని చెప్పారు. Woman denied entry to Golden Temple because she had a India 🇮🇳 flag painted on her face! The man who denied her entry into Golden Temple said this is Punjab, not India@AmitShah @PMOIndia @narendramodi @GoldenTempleInd @ArvindKejriwal Is bande ko Pakistan ke Punjab bhejo pic.twitter.com/nSgbOxVkoN — HARSH KESHRI (@HarshKeshri2209) April 17, 2023 (చదవండి: దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్) -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్ని పోశాడు. రెండు గ్లాస్ల వాటర్ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!
ముఖ నిగారింపుని మరింతగా పెంచుకునేందుకు కొరియన్లు స్లాప్ థెరపీని వాడతారు. స్లాప్ థెరపీ అంటే చెంప మీద పెళ్లున కొట్టడం.రెండు చేతులతో ముఖానికి ఇరువైపులా కొట్టడం వల్ల ముఖచర్మం గ్లోగా కనిపిస్తుంది. ►ముందుగా ముఖాన్ని వేడినీటితో కడిగి, తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇప్పుడు మెల్లగా కొట్టడం ప్రాంభించి క్రమంగా పెద్దగా కొట్టాలి. ఇలా ఏడు నిమిషాలు పాటు చేస్తే స్లాప్ థెరపీ అయిపోయినట్లే. ►రోజూ క్రమం తప్పకుండా ఈ స్లాప్ థెరపీ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, సహజసిద్ధంగానే చర్మం రేడియంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ►ఈ థెరపీతో నిగారింపే కాకుండా చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. అందుకే దీనిని యాంటీఏజింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ►రక్తప్రసరణ పెరగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోయి ముఖం మీద మొటిమలు కూడా రావు. ఇంకెందుకాలస్యం... ఏ మాత్రం శ్రమలేని స్లాప్ థెరపీతో మీ ముఖాన్ని మెరిపించండి. -
పాపం పసిపాప.. నవ్వు ముఖంతోనే పుట్టింది!
పిల్లలు అన్నాక.. పుట్టిన సమయంలోనైనా ఏడ్వాలి కదా!. కానీ, ఇక్కడో పసికందు నవ్వుతూనే పుట్టింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ముఖంలో అలాంటి లోపం ఏర్పడింది. అదీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఈ స్థితి ఏర్పడింది ఆ పసిపాపకు!. బైలేటరల్ మాక్రోస్టోమియా.. అరుదైన పరిస్థితి ఇది. పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏడో వారంలో.. కణజాలాల వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో ఇప్పటికి ఇలాంటి పరిస్థితితో కేవలం 14 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అందులో 14వ కేసు.. ఎయిలా సమ్మర్ ముచా. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్(21), బ్లేజియా ముచా(20) సంతానం ఈ ఎయిలా. డిసెంబర్ 2021లో జన్మించింది ఈ చిన్నారి. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడ్వలేదు. పైగా పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. డాక్టర్లు పరిశీలించి.. అది బైలెటరల్ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. తద్వారా పెదాలు సాగిపోయినట్లు ఉంటుంది. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడ్వలేకుండా ఉంది. ఈ పరిస్థితి గురించి ఆరాతీయగా.. తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తేలింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని తేలింది. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడొచ్చనే వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియా ద్వారా బిడ్డ స్థితిని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియజేసేందుకు పోస్టులు చేస్తోంది. అయితే బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆ పసికందు తల్లి స్పందిస్తూ.. మనిషికి ఏడుపు ఒక శాపం.. నా బిడ్డకు నవ్వు ఒక వరం.. నవ్వే వాళ్లను నవ్వనివ్వండి అంటోంది. -
ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!
Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది. అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా ఛానెల్స్తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్మాస్క్లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. చదవండి: షూట్ ఎట్ సైట్ ఆదేశాలపై శ్రీలంక ప్రధాని స్పందన -
సమ్మర్ కేర్.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
శివరాత్రికి శివ.. శివా... అంటూ చలి అలా వెళ్లిందో లేదో ఎండలు, ఉక్కపోత ఇలా వచ్చేసాయి. రానున్న కాలంలో ఎండలు మరింత ముదిరి మండించడం ఖాయం. మరి ఈ టైమ్లో అందాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది టీనేజర్లకు బెంగ. ముఖ్యంగా ముఖం, జుట్టు, అందమైన చర్మం కోసం వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. ఎండాకాలంలోనూ మన స్కిన్ కోమలంగా మెరిసిపోవాలంటే పాటించాల్సిన సింపుల్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండలు భయపెడుతున్నాయి.సాధారణంగా చర్మ రక్షణ కోసం మనం ఏడాది పొడవునా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సమ్మర్లో మాత్రం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే వేడికి స్కిన్ ట్యాన్ అయిపోయి, కాంతి విహీనంగా మారిపోతుంది. సమ్మర్ కేర్లో అన్నింటికంటే ముఖ్యమైంది సన్స్క్రీన్ క్రీమ్ లేదా లోషన్. అందుకే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడు కోవడం చాలా ముఖ్యం. అందుకే బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వారు, సన్స్క్రీన్ ప్రతి రోజూ ఉదయం రాయాలి. దీంతోపాటు యాంటీ టానింగ్ క్రీమ్స్ వాడాలి. . తద్వారా చర్మం టాన్ అవ్వకుండా మెరుస్తూ ఉంటుంది. యూవిఎ/యూవిబి లేబుల్, ఎస్ఎఫ్ ఫి + ఉన్న లోషన్ లేదా క్రీమ్ సెలక్ట్ చేసుకోవడం చాలా మంచిది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్న నలుగు పిండితో స్నానం చేయడం, లేదా ఆర్గానిక్ స్క్రబ్ని ఉపయోగించడం అవసరం. వేసవిలో హాలీడే ట్రిప్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చాలాకామన్. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్త పడాలి. వేసవిలో చర్మంతో పాటు జుట్టు కూడా పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో చికాకు పెట్టే చెమటలు కురులను కూడా వేధిస్తాయి. మండేఎండలు, చెమటకు జుట్టు కాంతి విహీనంగామారడంతోపాటు దుమ్ము,ధూళితో చుండ్రు సమస్య పీడిస్తుంది.సో..ఎండలో వెళ్లేటపుడు జుట్టును కవర్ చేసుకునేలా స్కార్ఫ్ లాంటివి రక్షణగా వినియోగించుకోవాలి. ప్రతీరోజూ కాకపోయినా, ఎండకు, డస్ట్కు ఎక్స్పోజ్ అయ్యాం అనిపించినపుడు మంచి షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే తలస్నానానికి ముందుకు ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం ఇంకా మంచిది. నెలలో రెండుసార్లు తలలోని చర్మం కూల్గా ఉండేలా ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకోవాలి. తద్వారా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారకుండా నిగనిగలాడుతుంది. వేసవికాలంలో పెదాలు సహజ కోమలత్వాన్ని కోల్పోవడం, పగలిపోవడం మరో సమస్య. సెన్సిటివ్ స్కిన్తో ఉండే లిప్స్ ఎండ వేడికిమికి త్వరగా పొడిబారతాయి. సో.. ఎండలోకి వెళ్లేముందు లిప్బామ్ అప్ల్ చేయాలి. అది ఇంట్లో తయారుచేసుకున్నదైతే మరీ మంచింది. అలాగే రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యిని రాసుకుని మృదువుగా మాసాజ్ చేసుకుంటే పెదాలు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఇక భరించలేని ఎండలకు ప్రభావితమయ్యేవి కళ్లు. కళ్లను రక్షించుకునేందుకు కూలింగ్ గ్లాసులు వాడటం అలవాటు చేసుకోవాలి..వీటన్నింటికంటే కీలకమైంది శరీరానికి ఏంతో మేలు చేసే మంచినీళ్లు తాగడం చాలా చాలా ముఖ్యం. వీటితోపాటు, పల్చటి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, బార్లీ గంజి, సబ్జా గింజల నీళ్లు లాంటి ద్రవపదార్థాలు విరివిగా తీసుకోవాలి. అలాగే ఎండలోనుంచి వచ్చిన వెంటనే కాకుండా.. ముఖాన్ని, కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. -
బాబ్బాబు.. మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లిస్తాం..!
ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! ఫేస్ వాల్యూ.. ఫేస్ వాల్యూ అంటుంటారు కదా..మన ఫేస్కీ వాల్యూ ఇచ్చే రోజు వచ్చేసింది.‘మీ వయసు 25లోపు ఉందా? అందమైన ముఖవర్చస్సు మీ సొంతమా?అయితే మీలాంటి వారి కోసమే వెతుకున్నాం. కాస్త మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లలో భారీ నజరానా ఇస్తాం.’ అంటూ ‘నెట్టిం'ట్లో తాజాగా చక్కర్లు కొట్టిన ప్రకటన ఇది. ఈ విచిత్రమైన యాడ్కు ఔత్సాహికుల నుంచి స్పందన సైతం అనూహ్యంగానే వచ్చింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికిపైగా తమ ‘ముఖాలను’ ఇచ్చేందుకు సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్ఈస్ట్లోని వివిధ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది!! హ్యూమనాయిడ్ అసిస్టెంట్గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట! అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించడంలో నెలకొన్న చట్టపరమైన జాప్యాన్ని అధిగమించేందుకు తమ క్లయింట్లు సరికొత్త రోబో రూపాన్ని కోరుకున్నారని, అందుకే ఈ వెరైటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు కంపెనీ వివరించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదట. ఈ రోబో తయారీ కోసం ముందుగా మనిషి ముఖంతోపాటు శరీర 3డీ నమూనాను తీసుకొని కొలతలు తీసుకుంటారట. ఆపై ఆ వ్యక్తి 100 గంటలకు సమానమైన సంభాషణలను రికార్డు చేసి ఇవ్వాలట. చివరగా అపరిమిత కాలానికి తన ముఖాన్ని ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఆ సంస్థ వాడుకునేలా నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలట. ఇవన్నీ సవ్యంగా సాగితే 2023లో ఈ సరికొత్త రోబో ప్రపంచానికి తన ‘ముఖం’ చూపించనుంది. -
అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు కదూ.. నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులను చూస్తుంటే.. ఎవరో అనుమానాస్పదుల్లా కనిపిస్తున్నారు కదూ? ఎందుకు వారు ముఖాన్ని దాచుకుంటున్నారు? ఏదైనా ల్యాబ్లో పనిచేస్తూ .. మరిచిపోయి డైరెక్ట్గా రోడ్డు మీదకు వచ్చేశారా? లేదా.. మనుషులను పోలి ఉండే గ్రహంతర వాసులా? ఇలాంటి వింత ఆలోచనలు అనుమానాలన్నీ మీ బుర్రను తొలిచేయడం మొదలుపెట్టే ఉంటాయి. (చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత) అసలు నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు. మాస్కును మించి ముఖాన్ని కవర్ చేసేసేలా వీరు ధరించినవి కొత్తరకం గాగుల్స్. నిజం.. ఇవి సరికొత్త కళ్లజోళ్లు. సాధారణంగా ఎండ నుంచి కళ్లను రక్షించే సన్గ్లాసెన్ను మాత్రమే ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ, ఈ సన్గ్లాసెస్ మాత్రం మీ ముఖం మొత్తాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుతాయి. జపాన్కు చెందిన ఓ కంపెనీ అధిక నాణ్యత గల పాలికార్బొనేట్తో వీటిని రూపొందించింది. సాధారణ సన్ గ్లాసెస్లాగే వీటిని కూడా చెవుల పైభాగం నుంచి ధరించొచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ గాగుల్స్ ఎండ నుంచే కాదు, కరోనా వంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా వీటిని ధరించొచ్చు. ఆన్లైన్ మార్కెట్లో వివిధ పరిమాణాలు, ధరల్లో ఇవి లభిస్తున్నాయి. (చదవండి: కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!) -
గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై..
ముంబై: రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలని ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తిదాడికి గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం థానే జిల్లాలోని ఉల్హసన్నగర్ పట్టణానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే నరేష్ లెఫ్టీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోవటంతో సంజయ్ను డబ్బులు త్వరగా ఇవ్వాలని నరేష్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరేష్, సంజయ్లు తమ మిత్రులతో ఉల్హసన్నగర్లో 4లో కలుసుకున్నారు. సంజయ్ తనతో పాటు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అవినాష్ను తీసుకువచ్చాడు. అతడు మరో మూడు నెలలు ఆగాల్సిందిగా నరేష్కు చెప్పాడు. దీంతో ఇంకా ఎన్ని నెలలు ఆగాలంటూ కోపంతో నరేష్ కత్తితో అవినాష్, సంజయ్పై దాడి చేశాడు. గొడవ గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు కానిస్టేబుల్ గణేష్ దమాలే, ఒక సహోద్యోగితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. గణేష్ దమాలే ఈ గొడవను ఆపడానికి జోక్యం చేసుకున్నప్పుడు, నరేష్ అతని ముఖంపై కూడా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. తరువాత, మరి కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నరేష్, శశి చిక్నా అలియాస్ సుఖీ, ఓమీలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..
సాక్షి, అమరావతి: విజయవాడ విమానాశ్రయంలోకి అత్యాధునిక వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలో విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఎయిర్పోర్టు డైరెక్టర్ మధుసూదన్రావు ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని.. కియోస్క్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నెల రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ వ్యవస్థ వల్ల బోర్డింగ్ పాస్ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుంది. కేవలం ముఖం చూపించడం ద్వారా ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా నేరుగా విమానం ఎక్కవచ్చు. ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్, చెక్ ఇన్, బోర్డింగ్ అన్నీ కూడా కేవలం ముఖం చూపించడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మీ కదలికలను ఎప్పటికప్పుడు విమానాశ్రయ సిబ్బంది గమనిస్తుంటారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేశారు. ఇప్పుడు విజయవాడ, వారణాసి, పుణె, కోల్కతా విమానాశ్రయాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ నాలుగు విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను ఎన్ఈసీ కార్పొరేషన్ ఇండియా అందుబాటులోకి తీసుకువస్తోంది. -
Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్ జర్నీ
ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్ ఫేస్ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం. ‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్ ప్రార్థన ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్ ఫేస్’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు. ‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన. స్నేహితులంతా జాంబీ ఫేస్ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన. 2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్ చేయటం ప్రారంభించి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, తనను సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ కావడమే కాదు, ఇంజినీరింగ్లో డిగ్రీ కూడా సాధించింది. తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్లో అప్లోడ్ చేసింది. బొల్లి గురించి తన చానెల్లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్ మీడియా. -
కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం..
రాజాం: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్సు అదిరిపోతుంది. ప్రత్యేకించి స్టెప్పులంటూ ఏమీ ఉండవు.. కానీ నృత్యం మాత్రం లయబద్ధంగానే సాగుతుంది. ఉన్న చోట నుంచి మనిషి కదలడు.. అయితేనేం దరువుకు తగ్గట్టు నాట్యం రక్తి కడుతుంది. రాజాంకి చెందిన సూర్యప్రకాష్ ప్రత్యేకత ఇది. కేవలం కళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, గొంతుతో అతను చేసే అభినయానికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఒక్కసారి సూర్య డ్యాన్సు చూశారంటే వారెవ్వా ఏమి ఫేసు అనకుండా ఉండలేరు. తాజాగా ఓ జాతీయ చానెల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో కూడా ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. నా పేరు అలుగోలు సూర్యప్రకాష్. మాది రాజాం పట్టణ పరిధిలోని మల్లిఖార్జున కాలనీ. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు ముగ్గురు అన్నదమ్ములతో పాటు ఒక సోదరి ఉన్నారు. అందరిలో నా పెద్ద సోదరుడు మాత్రమే ఉన్నత చదువులు చదవగలిగాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సెక్టారులో పనిచేస్తున్నాడు. మిగిలిన సోదరులమంతా కార్పెంటర్లుగా పనిచేసుకుంటున్నాం. నేను రాజాం బజార్లోని ప్రభుత్వ యూపీ స్కూల్లో 5వ తరగతి వరకూ మాత్రమే చదివాను. నాకు భార్య శ్రావణికుమారితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం మాకు వివాహం జరిగింది. ఆసక్తితోనే ఫేస్ డ్యాన్సర్గా.. నాకు చిన్నప్పటి నుంచి స్టేజీపై నటించాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. 1996 నుంచి నాలుగేళ్ల పాటు విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడే రైన్కింగ్ కరాటే డోస్ శిక్షణ కేంద్రంలో చేరాను. కరాటేతో పాటు కర్రసాము నేర్చుకున్నాను. 30 సార్లు కరాటే పోటీల్లో పాల్గొనడమే కాకుండా బహుమతులు కూడా సాధించాను. అనంతరం వివాహం జరగడం, ఇతర కారణాలతో కొన్నేళ్లు సాధారణంగా గడిచిపోయాయి. పిల్లలు కొద్దిగా పెద్దవారు కావడంతో పాటు ఆ మధ్య వచ్చిన టిక్ టాక్లో ఏదో ప్రదర్శన ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒక అమెరికా టిక్టాకర్ తన కళ్లతో అభినయం చేయడం చూశాను. నేను కూడా కష్టపడి కళ్లు, తర్వాత కను బొమ్మలు, ముక్కు, చెవులు, గొంతు వంటి శరీర భాగాలను కదుపుతూ డ్యాన్స్ చేయడం ప్రారంభించాను. హిందీ చానెల్లో ప్రదర్శన.. ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేది. రానురానూ పట్టు సాధించడంతో ఏ పాటకైనా మ్యూజిక్కు అనుగుణంగా ముఖంలోని ఏ భాగాన్నై నా కదిలించే సామర్థ్యం వచ్చింది. టిక్టాక్లో ఈ ప్రదర్శనకు ఎన్నో లైక్లు వచ్చాయి. దేశవిదేశాల్లో 1.70 మిలియన్ల నెటిజెన్లు నాకు ఫాలోవర్లుగా మారారు. ఇందులో నా స్నేహితులు నన్ను గుర్తించి టిక్టాక్ అవార్డు ఇచ్చారు. అనంతరం నన్ను గుర్తించిన పలు యూట్యూబ్ చానెల్స్తో పాటు కొన్ని పెద్ద చానల్లు కూడా నా ఫేస్ డ్యాన్స్పై ఆసక్తి చూపినా గురించి ప్రపంచానికి పరిచయం చేశాయి. నటనపై మక్కువతోనే... నాకు నటన అంటే చాలా ఇష్టం. ఏ దో ఒక సినిమాలో చేయాలని ఉంది. గతంలో కన్నడ మూవీలో చేస్తావా అని ఒక కన్నడ నిర్మాత నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ ఏడాది మేలో అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకా ఆ అవకాశం రాలేదు. తెలుగు సినిమాలో ఒక్క సారైనా నటించి నా ప్రతిభ ను చాటుకోవాలని ఉంది. ప్రతిభకు చదువుతో పనిలేదు. పేదరికం అడ్డు కాదు అని నిరూపించడంతో పాటు నేను సొంతంగా నేర్చుకున్న ఫేస్ డ్యాన్స్ కళను పది మందికి తెలియజేయాలని చూస్తున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపు... నెల రోజుల క్రితం ముంబై నుంచి నాకు కలర్స్ చానల్ నుంచి పిలుపు వచ్చింది. వారు ఏర్పాటుచేసిన డ్యాన్స్ డివైన్ షో–3లో నన్ను పాల్గొనాలని కోరారు. నేను అక్కడకు వెళ్లిన తర్వాత జాతీయ స్థాయిలోని ఎంతో మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇస్తుంటే నా ఫేస్ డ్యాన్స్ ఏమంత గుర్తింపు రాదులే అనుకున్నా. నేను స్టేజ్ ఎక్కి ఫేస్ డ్యాన్స్ చేస్తే ఒకటే ఈలలు. నా చిన్ననాటి అభిమాన హీరోయిన్ మాధురీదీక్షిత్తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె అప్పట్లో తన కళ్లతో అభిన యం చేసేది. అంతే కాకుండా అక్కడ షోకు న్యాయ నిర్ణేతలుగా, నిర్వాహకులుగా వ్యవహరించిన తుషార్కాలియా, ధర్మేష్, రాఘవ తదితరులుతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది. చదవండి: ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
ఫేషియల్ పెరాలసిస్..కారణాలివే!
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్ పెరాలసిస్. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే.... కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్పాల్సీ’ అని అంటారు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది..
చర్మ సౌందర్యానికి అతివలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ముడతలు రాకుండా ఉండటానికి ఫేస్మాస్కులు వేసుకోవడం, క్రీములు, లోషన్లు పూసుకోవడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు అంత కసరత్తు అవసరం లేదు. ప్రత్యామ్నాయ పరిష్కారంగా సరికొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఈ ‘క్లినికల్ మైక్రోడెర్మాబ్రేషన్ మెషిన్’. క్లినికల్ పరీక్షల్లో ఈ గాడ్జెట్ పనితీరు సమర్థంగా నిరూపితమైంది. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, టోనింగ్ చేస్తుంది. ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ‘స్పా’ చేసినట్లుగా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులోని మైక్రోడెర్మ్ గ్లో సిస్టమ్ ముఖ చర్మానికి అధునాతన హోమ్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అత్యంత సులభంగా మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసి, వయసు ప్రభావాన్ని వెనక్కు నెట్టేస్తుంది. త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ గాడ్జెట్ అన్ని రకాల చర్మాలకూ సురక్షితమైనదే. ఇది పూర్తిగా వైర్లెస్,రీఛార్జబుల్. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒకసారి నాలుగు నిమిషాలసేపు ముఖానికి దీంతో ట్రీట్మెంట్ ఇస్తే, మంచి ఫలితం ఉంటుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలోని డిస్ప్లేలో స్పీడ్, మోడ్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్ప్లే కింద పవర్ బటన్, స్పీడ్ పెంచుకునే బటన్, స్పీడ్ తగ్గించుకునే బటన్ వరుసగా ఉంటాయి. దీనిని ముఖంతో పాటు మెడ, చేతులు, కాళ్లు వంటి ఇతర భాగాలలోనూ ఉపయోగించుకోవచ్చు. దీని ధర 200 డాలర్లు (సుమారు రూ.15,000). -
ఎన్నిసార్లు ముఖాన్ని తాకుతామో తెలిస్తే..
యావత్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) నివారణకు ప్రస్తుతానికి కచ్చితమైన మందు ఏదీ అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే మాస్క్ లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వుంటూ ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలని కోరుతున్నారు. ముఖంలోని ముక్కు, కళ్లు, చెవులు, నోటిని తాకడం ద్వారా మాత్రమే ప్రాణాంతకమైన ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందని, అప్రతమత్తంగా వుండాలని చెబుతున్నారు. అయితే మనం రోజులో ఎన్నిసార్లు మన ముఖాన్ని చేతితో తాకుతామో తెలుసా? పోనీ గంటలో ఎన్నిసార్లు ముఖాన్ని, ముఖంలో ఇతర భాగాలను ముట్టుకుంటామో తెలుసా? కొన్ని అధ్యయనాలు తేల్చిన విషయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అంశంపై పరిమితమైన రచనలు, చాలా తక్కువ పరిశోధనలు ఉన్న క్రమంలో, సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నపుడు, ఇతర సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నిరోధించే క్రమంలో దీనిపై గతంలో జరిగిన అధ్యయన ఫలితాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 2015లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 26 మంది వైద్య విద్యార్థులపై ఈ స్టడీ నిర్వహించారు. వీడియో టేప్ రికార్డింగ్ ద్వారా ముఖాన్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారనే దాన్ని విశ్లేషించారు. 26 మంది విద్యార్థులలో అందరూ ప్రతి గంటకు సగటున 23 సార్లు వారి ముఖాన్ని తాకారు. ఇందులో దాదాపు సగానికిపైగా సార్లు ముక్కు, కళ్లు, నోటిని తాకారట. 2008లో నిర్వహించిన మరో స్టడీలో ఇంకోఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆఫీసు వాతావరణంలో ఉద్యోగులు గంటకు 16 సార్లు ముఖాన్ని టచ్ చేస్తారని హ్యాండ్ టూ ఫేస్ సంబంధంపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10 మందిని మూడు గంటలపై నిర్వహించిన స్టడీలో గంటకు సగటున 16 సార్లు ముఖంలోని భాగాలను తాకారని అధ్యయనం తెలిపింది. 2014లో నిర్వహించిన మరో అధ్యయనం ఏం చెబుతోంటే.. వైద్య వృత్తిలో ఉన్నవారు గంటకు 19 సార్లు ముఖాన్ని ముట్టుకున్నారట. అంటే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారో ఆయా భాగాలనే ఎక్కువగా తాకారన్న మాట. అందుకే ముఖాన్ని, ముఖంలోని ఈ ముఖ్య భాగాలను స్పర్శించే ముందు తప్పకుండా చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ పరిశుభ్రత, నియంత్రణ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే సైకిల్ ను విచ్ఛిన్నం చేయాలి. ఇదే అతి సులువైన, చవకైన నివారణ పద్ధతి. లేదంటే భారీ మూల్యం తప్పదు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం గంటకు మూడుసార్లు కంటిని, ఒకసారి చెవిని, నోటిని నాలుగుసార్లు తాకుతాం. ప్రతీ గంటకు నాలుగుసార్లు జుట్టుని ముట్టుకుంటాం. అలాగే బుగ్గల్ని నాలుగుసార్లు, మెడను ఒకసారి, గడ్డాన్ని నాలుగు సార్లు తాకుతాం. ఈ విషయాలను నమ్మబుద్ధి కావడంలేదా.. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ఉన్న మీలో ఎవరైనా సరదాకా ఈ స్టడీ చేయండి. మీ అమ్మా నాన్న, తోబుట్టువులు, లేదంటే పెద్ద, చిన్న, ఇలా వారు గంటలో ఎన్నిసార్లు, ముక్కును తాకుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.. కళ్లను నులుముకుంటున్నారో పరిశీలించండి. -
మొటిమలు పోవడం లేదా?
►ముఖం జిడ్డుగా ఉంటే మొటిమల సమస్య పెరుగుతుంది. ఆపిల్ స్లైస్తో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపైన జిడ్డు తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది. ►మొటిమల సమస్య బాధిస్తుంటే వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే బ్లాక్హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. ►వెనిగర్లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ►తేనెలో దాల్చినచెక్క పొడి కలపాలి. పడుకునేముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే మొటిమలు తగ్గుతాయి. -
ముఖంపై ముడతలు పోవాలంటే...
అరటిపండు సగ భాగం తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, క్యాబేజీ ఆకులు రెండు లేదా మూడు తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు గుజ్జు, క్యాబేజీ ఆకుల పేస్ట్ రెండింటిని కలిపి ఆ మిశ్రమంలో ఒక గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలుపుకోవాలి. ఉదయం ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకుని, తయారుచేసుకున్న ప్యాక్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు ప్యాక్ను ఆరనిచ్చి, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు ప్రతిరోజూ చేస్తే ముఖంపై ఉన్న ముడతలు పోతాయి. తర్వాత ఇదే ప్యాక్ను నెలకు రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది. -
నిగారింపు ఇలా సొంతం
చర్మ సంరక్షణకు ఏ సౌందర్య ఉత్పాదనలు వాడాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇంట్లో రోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే చర్మం నిగారింపును కాపాడుకోవచ్చు. ►కళ్ల కింద ఉబ్బు, వలయాలు ఏర్పడటం వంటివి గమనిస్తే.. రాత్రి పడుకునే ముందు వేలితో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తేనె మరీ జిడ్డుగా అనిపిస్తే టీ స్పూన్ నీళ్లు కలిపి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. ►రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్ చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ డస్ట్ సులువుగా వదిలిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్వాష్తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం నిగారింపు పెరుగుతుంది. -
ముఖంలోనే జబ్బుల లక్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్ మ్యాపింగ్’ ద్వారా ఎప్పుడో తేల్చి చెప్పారు. కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్కు చెందిన డ్యాన్ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు. 1. కనుబొమ్మలుపైన: మొటిమలు వస్తే గాల్ బ్లాడర్, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నట్లు లెక్క. కొవ్వు పదార్థాలు, శుద్ధి చేసిన ఆహారం తగ్గిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ డ్యాన్ సూచించారు. 2. రెండు కనుబొమ్మల మధ్య: మొటిమలు వస్తే ఎక్కువగా మద్యం, ధూమపానం సేవిస్తున్నట్లు సూచనట. 3. ముక్కుమీద మొటిమలు వస్తే: హృదయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అంటే ఉప్పు, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండమే కాకుండా బీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. 4. ఇక ఎడమ బుగ్గ నేరుగా కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అక్కడ మొటిమలు వస్తే చల్లటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలట. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలట. 5. ఇక నోరు మనలోని జీర్ణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందట. నోటి దగ్గర మొటిమలు లేదా కురుపులు కనిపిస్తే ఫైబర్, కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలట. 6. ముఖం మీది చర్మం శీరరంలోని హార్మోన్లను సూచిస్తుందట. ఒమెగా 3 తీసుకుంటే సమతౌల్యం అవుతాయట. చైనా ఆయుర్వేద వైద్యులు ముఖంలోని మార్పులనుబట్టి శరీరంలోని లోపాలను లేదా జబ్బులను చెప్పి ఉండవచ్చు. న్యూయార్క్లోని ఈ డాక్టర్ మాత్రం శరీరంలోని లోపాల వల్ల మొటిమలు వస్తాయని, వాటిని ఎలా నివారించవచ్చో సూచిస్తున్నారు. -
గంధపు చెక్క... పన్నీటి చుక్క
ఎండలో తిరగడం వల్ల కాంతిహీనంగా తయారైన ముఖానికి ఎన్ని క్రీములు వాడినా ఒక్కోసారి ఏమంత ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు ప్రకృతి సహజంగా లభించే మూలికలను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే సరి. ఇందుకు గంధం చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే గంధంలో మేని ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం, సుగంధ పరిమళాలు వెదజల్లడం వంటి చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. ఇంతకీ గంధాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామా మరి! ►పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. ►పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే ముఖం మిలమిలలాడుతుంది. -
లూపస్ అంటే?
లూపస్ అనే ఈ వ్యాధిని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని కూడా అంటారు. ఇది ప్రతి వెయ్యిమందిలో ఒకరికి వస్తుంది. ఇది ఆఫ్రికన్–అమెరికన్స్తో పాటు ఆసియా వాసుల్లో ఎక్కువ. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే వ్యాధిగ్రస్తుల్లో మహిళలు–పురుషుల నిష్పత్తి 9:1గా ఉంటుంది. ఇది 15 నుంచి 45 ఏళ్ల మధ్యవయసు వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా వ్యాధి వస్తుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధినిర్ధారణకూ, చికిత్సకూ సుమారు మూడేళ్లపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో ప్రజలతోపాటు చాలామంది వైద్యుల్లోనూ ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, రుమటాలజిస్టుల కొరత వల్ల వ్యాధి ముదిరాక మాత్రమే చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లూపస్ అంటే గ్రీకు భాషలో తోడేలు (వూల్ఫ్) అని అర్థం. ఒకప్పుడు వైద్యం అందుబాటులో లేని సమయంలో వ్యాధిగ్రస్తుల ముఖం తోడేలును తలపించేది. కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. లక్షణాలు: ►జుట్టు ఎక్కువగా రాలడం ►ముఖం మీద సీతాకోకచిలుక ఆకృతితో ముక్కుకు ఇరువైపులా ఎర్రటి మచ్చలు రావడం ►నోట్లో పుండ్లు పడటం ∙కీళ్లనొప్పులు ►కీళ్లవాపులు ∙విపరీతమైన అలసట ►జ్వరం వస్తూ, తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు వ్యాధిగ్రస్తుల్లో ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ కాకుండా చికిత్స అలస్యం అయితే... క్రమేణా ఈ వ్యాధి శరీరంలోని ఇతర ►అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది. లూపస్ వ్యాధి వల్ల మన రక్తకణాలు బాగా తగ్గిపోవచ్చు. (ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాలు, హీమోగ్లోబిన్ కౌంట్ తగ్గవచ్చు). ఇతర కీలక అవయవాలపై వ్యాధి దుష్ప్రభావాలు ఇలా... మూత్రపిండాలు ప్రభావితమైతే లూపస్ నెఫ్రైటిస్ అనే సమస్య, మెదడు ప్రభావితమైతే ఫిట్ ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం (ప్లూరల్ ఎఫ్యూజన్), ఊపిరితిత్తుల్లో కొబ్బరిపీచు వంటి పదార్థం వృద్ధి కావడం (లంగ్ ఫైబ్రోసిస్/ఐఎల్డీ), గుండె ప్రభావితమైతే దానిచుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్ ఎఫ్యూజన్), గుండె వేగంగా కొట్టుకోవడం (మయోకారై్డటిస్), హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. లూపస్లో రకాలు 1. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్: ఇది సాధారణంగా మనం ఎక్కువగా చూసే లూపస్. శరీరంలోని ఏ భాగమైనా దీనివల్ల ప్రభావితం కావచ్చు. 2. డిస్కాయిడ్ లూపస్: ఇది ముఖం మీద, తలపైన, మెడమీది చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చర్మంపై మందమైన పొరల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. 3. సబ్ ఎక్యూట్ క్యుటేనియస్ లూపస్: చర్మంపై సూర్మరశ్మి సోకిన ప్రాంతంలో తీవ్రమైన ఎర్రని మచ్చలు వస్తాయి. 4. నవజాత శిశువుల లూపస్ (నియోనేటల్ లూపస్): లూపస్ ఉన్న తల్లులకు పుట్టిన నవజాత శిశువులకు వచ్చే అరుదైన లూపస్ ఇది. ఈ శిశువుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చి, కొద్దివారాల్లోనే పూర్తిగా నయమవుతాయి. చాలా కొద్దిమందిలో హార్ట్ బ్లాక్ రావచ్చు. 5. మందులతో వచ్చే లూపస్ (డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్): చాలా అరుదుగా కొన్నిరకాలపై మందుల వల్ల లూపస్ లక్షణాలు రావచ్చు. కానీ ఆ మందులు ఆపేసిన తర్వాత లక్షణాలూ పూర్తిగా తగ్గిపోతాయి. హైడ్రాలజైన్, ప్రొకైనమైడ్, ఐసోనియాజిడ్ వంటి మందుల వల్ల అరుదుగా ఇలా జరగవచ్చు. వ్యాధినిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ►క్రియాటినిన్ ►లివర్ ఎంజైమ్ల పరీక్షలు ►ఈఎస్ఆర్ ►సీఆర్పీ ►మూత్రపరీక్ష ►ఏఎన్ఏ టెస్ట్ ►డీఎస్–డీఎన్ఏ టెస్ట్ ►ఏఎన్ఏ ప్రొఫైల్ ►ఛాతీ ఎక్స్రే ►స్కానింగ్ వంటి పరీక్షలు చేసి డాక్టర్లు లూపస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇంకొన్ని ముఖ్యమైన పరీక్షలు ►యాంటీస్మిత్ యాంటీబాడీస్ ►యాంటీఫా ►స్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ►యాంటీ రో–యాంటీబాడీ ►యాంటీ లా–యాంటీబాడీ ►సీరమ్ కాంప్లిమెంట్స్ ∙24 గంటల మూత్రపరీక్ష లూపస్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో సమతౌల్యం లోపించినప్పుడు మనల్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధకత మన శరీరంపైనే దాడి చేయడం వల్ల లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. జన్యువులు, పరిసరాలు, హార్మోన్ల వంటి అంశాలు ఈ వ్యాధికి కారణం అవుతుంటాయి. ఒక్కోసారి సూర్మరశ్మి అధికంగా సోకడం వల్ల, వైరస్–బ్యాక్టీరియాల వల్ల కూడా లూపస్ వ్యాధి తీవ్రతరం కావచ్చు. చికిత్స ఆధునిక చికిత్సతో లూపస్ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మందులు మొదలుపెడితే, వారు పూర్తిగా కోలుకొని, సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. ఇక మందులు వాడేవారు ఒక్కసారిగా లూపస్ మందులు ఆపితే చాలా ప్రమాదం. రుమటాలజిస్టుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మందుల మోతాదు తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా రుమటాలజిస్టులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. లూపస్ వ్యాధిలో వాడే సాధారణ మందులు ►హైడ్రాక్సి క్లోరోక్విన్ ►ఎజథయోప్రిన్ ►మిథోట్రెక్సేట్ ►కార్టికోస్టెరాయిడ్స్ ►సైక్లోఫాస్ఫమైడ్స్ ►మైకోఫినొలేట్ ►టాక్రోలిమస్లతో పాటు సన్స్క్రీన్ ఆయింట్మెంట్లు వాడాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ చికిత్సలు: ►ఐఆర్ఐజీ థెరపీ ►పాస్మాఫెరిసిస్ ►రిటాక్సిమాబ్ ►ఎక్మోథెరపీ లూపస్ వ్యాధి... కొన్ని ముఖ్యమైన విషయాలు : ►లూపస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు, సోకదు ►లూపస్ వ్యాధిని త్వరగా గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చు ►లూపస్ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ పూర్తిస్థాయి సాధారణ జీవితం గడపవచ్చు ►క్రమంతప్పకుండా రుమటాలజిస్టులను సంప్రదించి మందులు వాడాలి ►ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది. శరీరం, ►మనసుపైన ఒత్తిడి తగ్గించి, మనసును ఉల్లాసంగా ఉంచే పనులు చేయాలి. లూపస్ వ్యాధిని ఎదిరించి పోరాడిన కొందరు ప్రముఖులు ►సెలీనా గోమేజ్ ►లేడీ గాగా (సింగర్, నటి) ►టోనీ బ్రాక్స్టన్ (గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్) ►నిక్ కేనన్ (రేపర్, నటుడు) ►సీల్ (బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్) ►క్రిస్టెన్ జాన్స్టన్ (మోడల్) డాక్టర్ వి. శరత్ చంద్రమౌళి క్లినికల్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ లూపస్ రోగుల్లో గర్భధారణ అసాధ్యంకాదు లూపస్ వ్యాధిగ్రస్తుల్లో గర్భధారణ జరగడం, ఆ గర్భాన్ని కాపాడటం అటు రోగికీ ఇటు రుమటాలజిస్ట్కీ ఒక పెద్ద సవాలు. ఈ వ్యాధి ప్రభావం తల్లి మీదనే కాకుండా శిశువుపైన కూడా ఉంటుంది. చాలా మంది అపోహ పడే విధంగా ఈ రోగులు గర్భం దాల్చకూడదనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే గర్భం దాల్చడానికి ముందు జబ్బు తీవ్రత, మూత్రపిండాల మీద, గుండెపైన, మెదడుమీద దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి, దాని దుష్ప్రభావాలు మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి కీలకమై అవయవాల మీద ఉన్నట్లయితే... తాత్కాలికంగా గర్భధారణను (ప్రెగ్నెన్సీని) ప్లాన్ చేసుకోకూడదు. అయితే ఇది కేవలం ‘‘తాత్కాలికంగా మాత్రమే’’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఉంది. జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం నిలబడకపోవచ్చు. అంతేగాక వారిలో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనే ప్రతికూల కణాల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల మాయలో రక్తం గడ్డకట్టి శిశువుకి ప్రాణవాయువు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. గర్భధారణ సమయంలో జబ్బు తీవ్రత పెరగడం, అధిక రక్తపోటు, తరచూ గర్భస్రావాలు, ప్రీ–ఎక్లాంప్షియా (గర్భవతిగా ఉన్న సమయంలో రక్తపోటు పెరగడం, మూత్రంలో ప్రోటీన్లు వృథాగా పోవడం), మూర్చ (ఫిట్స్), నెలలు నిండకుండానే ప్రసవం కావడం (ప్రీమెచ్యుర్ డెలివరీ) లాంటి ప్రసూతి సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, గర్భాశయంలోనే మరణించడం, నియోనేటల్ లూపస్ వంటి సమస్యతో పుట్టుకతోనే బిడ్డ వ్యాధిని కలిగి ఉండటం వంటి సమస్యలూ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ రోగుల్లోని 20 నుంచి 40 శాతం గర్భిణుల్లో ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కాన్పు తర్వాతా జబ్బు తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు చాలావరకు అవకాశాలు తక్కువ అనే చెనప్పాలి. కొన్నిసార్లు జబ్బు లక్షణాలు సాధారణ గర్భిణుల్లో కనిపించే లక్షణాలనూ అనుకరిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ద్వారా రుమటాలజిస్టులు మందుల మోతాదులను అవసరం మేరకు మారుస్తారు. దీనివల్ల పిండం మీద ప్రతికూల ప్రభావాలు సాధ్యమైనంతవరకు పడకుండా రుమటాలజిస్టులు జాగ్రత్తపడతారు. అలాగే ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చినంతకాలం కూడా మందుల విషయంలో రుమటాలజిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటారు . పుట్టిన శిశువుపైన కూడా లూపస్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టిన బిడ్డకు వచ్చే సమస్యను ‘నియోనేటల్ లూపస్ అంటారు. తల్లి ద్వారా పిండంలోకి వెళ్లే యాంటీబాడీస్ వల్ల తాత్కాలికంగా ఈ సమస్య ఎదురవుతుంది. చర్మం మీద ఎర్రని మచ్చలు రావడం అన్నది అతి సాధారణంగా కనిపించే లక్షణం. కామెర్లు, రక్తహీనత, రక్తకణాలు తగ్గడం లాంటివి కూడా సంభవించే అవకాశాలుంటాయి. గుండె, కాలేయం మీద కూడా దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కలిగే సమస్యలు. రుమటాలజిస్టులు, ప్రసూతి వైద్యనిపుణల మేరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విజయవంతమైన ఫలితాలు లభిస్తాయి. ఎస్ఎల్ఈ జబ్బు నిర్ధారణ అయ్యాక, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోదలచుకుంటే రుమటాలజిస్టులతో తప్పక చర్చించాలి. ఈ విషయంలో సరైన ప్లానింగ్ అన్నది అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. జబ్బుతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కీలకమైన అవయవాల మీద జబ్బు దుష్ప్రభావాలు ఉన్నప్పుడు గర్భందాల్చే ప్రయత్నాలు చేయకూడదు. జబ్బు తీవ్రతను పూర్తిగా నియంత్రించిన ఆర్నెల్ల తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. తరచూ రక్తపరీక్ష, మూత్రపరీక్ష, రక్తపోటు తనిఖీ చేసుకోవడం వంటి పరీక్షలను నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే శిశువు గుండె మీద ప్రభావం ఉందా, లేదా అన్న విషయాలను ఇప్పుడు కొన్ని ఆధునిక పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఆధునిక వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉండే ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల శిశువు ఏ రకమైన ఇబ్బందితో పుట్టినా సులభంగా వైద్యం అందించడం తేలికవుతుంది, సాధ్యమవుతుంది. లూపస్ రోగులకు గర్భధారణ అన్నది ఒక సవాల్ మాత్రమే. అంతేతప్ప అది అసాధ్యం కానేకాదు. రుమటాలజిస్టుల సలహా మేరకు, సరైన ప్లానింగ్ చేసుకొని, వ్యాధి మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో అందివచ్చిన మెరుగైన ఆధునిక వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
పీసీవోడీ సమస్య తగ్గుతుందా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగక పోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఏడీహెచ్డీ అంటున్నారు... చికిత్స ఉందా? మా బాబు వయసు ఏడేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? ఏడీహెచ్డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ ( ఏడీహెచ్డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు : ►జన్యుపరమైన కారణాలు ►తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ►తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు : ►మతిమరపు, తలనొప్పి ►ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ►మానసిక స్థితి చక్కగా లేకపోవడం ►ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం. ►ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స : హోమియోలో ఏడీహెచ్డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పైల్స్కు శాశ్వత పరిష్కారం ఉందా? నా వయసు 57 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు : ► గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. ►గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. ►గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. ►గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు : ►మలబద్దకం ►మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి. ►సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ►స్థూలకాయం (ఒబేసిటీ) ►చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ►మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ►మంచి పోషకాహారం తీసుకోకపోవడం ►నీరు తక్కువగా తాగడం ►ఎక్కువగా ప్రయాణాలు చేయడం ►అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ►మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాఉల : ►నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ►మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ : ►మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ►సమయానికి భోజనం చేయడం ముఖ్యం ►ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ►నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ►మసాలాలు, జంక్ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ►మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఎండ నుంచి మేనికి రక్షణ
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►చర్మం తాజాగా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, 5 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►చలికాలానికి మాయిశ్చరైజర్లు మాదిరి ఈ కాలం సన్ప్రొటెక్షన్ లోషన్లు వాడుతుంటారు. అయితే, వీటిని బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు రాసుకుంటే చాలు ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఈ కాలం శిరోజాలు పొడిబారడం సమస్య ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి అరటిపండు గుజ్జును తలకు అంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
అవాంఛిత రోమాలు తొలగాలంటే...
పసుపును సంప్రదాయకంగా ముఖానికి రాసుకుంటారు. ఇది మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవు. చక్కెర మిశ్రమంతో... ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖంపై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ తో తొలగించాలి. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ఎగ్ మాస్క్ గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి అందులో చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తీసివేస్తే దానితోపాటు ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది కానీ కొద్దిగా నొప్పి ఉండచ్చు. -
బ్యూటిప్స్
జిడ్డు పోవాలంటే.. వేసవిలో చర్మం త్వరగా జిడ్డు అవుతుంది. దీని కోసం పదే పదే ముఖం కడుగుతుంటారు. సబ్బుల వాడకం పెరిగితే చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. అందుకని.. ►స్పూన్ తేనె, పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు–మూడు నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, రోజ్వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. -
బ్యూటిప్స్
►ఎండలో కమిలిన ముఖానికి... ►వేసవి ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ ఎండల్లో కాసేపలా బయటకి వెళ్లి రాగానే ముఖం నల్లబడిపోవడం లేదా కమిలిపోవడం... ఆ తర్వాత ముఖం చూసుకుని ఉష్షోమని నిట్టూర్చడం సహజం. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరిపాలలో దూది ముంచి, దానితో ముఖమంతా సున్నితంగా మర్దనా చేసుకుని ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే తిరిగి ముఖం ఎప్పటిలా కాంతులీనుతుంది. ►బయటినుంచి వచ్చాక కొబ్బరినీళ్లతో ముఖం కడుక్కున్నా కొబ్బరినీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడుక్కున్నా ముఖం తాజాగా కళ కళలాడుతుంది. -
చర్మంపై ముడతలు పోవాలంటే..
►చర్మం వదులైతే ముడతలు పడు తుంది. చిన్న చిన్న చిట్కాలతో చర్మం బిగుతుగా ఉండేలా చూసుకోవచ్చు. ►ఆరు స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకుని కొద్దిగా వేడి చేసి అందులో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ భాగం వదిలేసి ముఖానికి అప్లై చేయాలి. 10–15 నిమిషాలపాటు చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. -
బ్యూటిప్స్
నాచురల్ ఫేస్ మాస్క్ పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి కాని ఒక టేబుల్ స్పూన్ తాజా పాలు కాని తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మం బాల్యపు సుకుమారాన్ని సంతరించుకుంటుంది. ఇది నాచురల్ స్కిన్కూ పొడిచర్మానికీ కూడా చక్కగా పని చేస్తుంది.ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. మెరిసే కేశాలకోసం.. తలస్నానం పూర్తయ్యాక చివరగా ఒక లీటరునీటిలో ఒక నిమ్మకాయను పిండి, రెండు టీ స్పూన్ల తేనె కలిపి జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద పోసి కనీసం రెండు నిమిషాల సేపు అలాగే ఉంచిన తర్వాత చన్నీటిని పోసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా పట్టించి జుట్టును ముడి చుట్టేసి క్యాప్ పెట్టేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో లేదా షీకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మెరుస్తూ, గాలికి అలల్లా ఎగిరిపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే అవసరాన్ని బట్టి తేనె మోతాదును పెంచుకోవచ్చు.తేనె, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కేశాలను ఆరోగ్యంగా ఉంచి మెరుపులీనేటట్లు చేస్తుంది. పావు కప్పు తేనెలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది డీప్ కండిషనర్గా పనిచేసి పోషణ లేక నిర్జీవంగా, పాలిపోయినట్లున్న జుట్టును అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. -
సూపర్ షైనింగ్
రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం బారినపడి.. ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతోందా? మచ్చలు, మొటిమలు పెరిగి అందాన్ని పాడుచేస్తున్నాయా? అయితే ఈ సహజ చిట్కాలను మీరూ పాటించండి. సూపర్ షైనింగ్ని పొందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు, పెసరపిండి – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు మాస్క్: బీట్రూట్ రసం – 2 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా చిక్కటిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి... పెసరపిండి, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి, ఆ మిశ్రమంతో ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ రసం, ముల్తానీ మట్టి, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల ముఖానికి మంచి షైనింగ్ వస్తుంది. -
ముఖ కాంతికి...
►కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది. ►అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. ►తెల్ల ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీయాలి. దీంట్లో పావు టీ స్పూన్ తేనె, చిటికెడు రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి చన్నీటితో కడిగేయాలి. మొటిమలు తగ్గుతాయి. ►దాల్చిన చెక్కను పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్లా కలపాలి. మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తరవాత కడిగేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. ►టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. ►సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. -
ఫ్రూటీ బ్యూటీ
ఆయిలీ స్కిన్... ►నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్కు చక్కటి ఫేస్ ప్యాక్. ►రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. డ్రైస్కిన్ అయితే... ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్ఫ్లవర్... ఆయిల్ వాడవచ్చు. ►ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నార్మల్ స్కిన్కి... ►ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కçప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే çకనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ►ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది. -
బ్యూటిప్స్
ఒక్కోసారి బ్యూటీపార్లర్కి వెళ్లే టైమ్ దొరకనప్పుడు ఇంట్లో లభించే సాధనాలతోనే తేలిగ్గా పదినిమిషాల్లో తాజాగా కనిపించవచ్చు ఇలా... ►ఒక టొమాటోని తీసుకుని గుండ్రగా కట్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని తరిగిన టొమాటొ ముక్కలతో ముఖాన్నంతా వలయాకారంలో సుతిమెత్తగా అయిదు నిమిషాల పాటు మర్ధనా చేయాలి. ►తరవాత ఒక టీ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, చిటికెడు గంధం, రెండు మూడు చుక్కల తేనె ఒకదారి తరవాత ఒకటి వేసి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరవాత కడిగేస్తే తాజాగా నిగనిగలాడే అందం మీ సొంతం! సౌందర్య పోషణలో నిమ్మరసం ప్రత్యేకత ఎంతో ఉంది. ముఖంపై బ్లాక్హెడ్స్, వైట్ హెడ్స్తో చర్మరంధ్రాలు మూసుకుపోయినా, మొటిమల నివారణకయినా నిమ్మరసం చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. ►టీ స్పూ నిమ్మరసంలో కాటన్ ముంచి ముఖానికంతా అప్లై చేసి, 10 నిమిషాల తరువాత చన్నీటితో కడిగేయాలి. ►నిమ్మరసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా నిగనిగలాడుతుంది. -
చర్మకాంతి కోసం...
ఎలాంటి చర్మ తత్వం వాళ్లయినా రాత్రి పడుకునేముందు తప్పని సరిగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. పదిచుక్కల సన్ఫ్లవర్ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో రెండు టేబుల్స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడిచర్మం గల వారికి బాగా పనిచేస్తుంది. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో బాగా మగ్గిన అరటిపండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్లా పట్టించి అరగంట తరువాత కడుక్కోవాలి.పుదీనా పేస్ట్లో బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. రెండు టీస్పూన్ల పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి బ్లాక్హెడ్స్ ఉన్న చోట ప్యాక్లా వేసుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో వేళ్లతో వలయాలుగా చుడుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఎక్కువ మసాజ్చేస్తే చర్మం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. వారంలో 3 సార్లు ఈ విధంగా చేస్తే బ్లాక్హెడ్స్ తగ్గిపోతాయి. -
బ్యూటిప్స్
ఆపిల్స్ – 2 తేనె – ఒక టేబుల్ స్పూన్ఆపిల్స్ని చెక్కు తీసి, గ్రైండ్ చేసుకోవాలి. తేనెలో గ్రైండ్ చేసిపెట్టుకున్న ఆపిల్ పేస్ట్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. లెమన్ మాస్క్ నిమ్మకాయ – 1 ఓట్మీల్ – అర కప్పు, కోడిగుడ్డు – 1(తెల్లసొన)ఒక పాత్రలో పై పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు లెనోవో తన నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్లో మిడ్రేంజ్లో 'జెడ్5' పేరుతో మంగళవారం బీజింగ్లో విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్స్లో ఇవి లభ్యంకానుంది. 64జీబీ వెర్షన్ 1399 యువాన్ (రూ .14,670 సుమారు) 128 జీబీ వెర్షన్ 1799 యువాన్ (రూ .18,870)గా నిర్ణయించింది. ఇది ప్రీబుకింగ్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులో వుండగా, జూన్ 12 నుండి విక్రయానికి లభ్యం కానుంది. ఆకట్టుకునే రంగులతోపాటు అద్భుత డిజైన్తోప్రీమియం లుక్ వచ్చేలా ఈ డివైస్ను డిజూన్ చేసింది. దీనికి ఫేస్ అన్లాక్ సదుపాయాన్ని కూడా జోడించింది. లెనోవో జెడ్5 ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2246 x 1080 స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: వృద్ధాప్యంతో వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వారికి ఆధార్ ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సమాయత్తమవుతోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. తెల్లోడి ముందు దుస్తులు విప్పగా లేనిది... కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆధార్ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆదివారం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి కూడా సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు. ‘ అమెరికా వీసా కోసం నేను కూడా 10 పేజీల దరఖాస్తును నింపా. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు. కానీ మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. -
బ్యూటిప్
బాగా పండిన తాజా టమోటా గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖంపై ఉన్న మృతకణాలు, జిడ్డు తొలగి ముఖం కాంతివంతంగా కనపడుతుంది. -
తళతళా మెరవాలంటే...
మృదువైన మోము కోసం మగువలు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎలాగైనా మచ్చలులేని మృదువైన చర్మం కావాలని మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్క్రీమ్స్, లోషన్స్ కొనేందుకు సిద్ధపడతారు. ఎంత ఖరీదైనా కొని వాడేస్తుంటారు. కానీ నిజానికి మార్కెట్లో దొరికే ఫేస్క్రీమ్స్లో హానికరమైన కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే అన్నివిధాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి! కావలసినవి: ముల్తానీ మట్టి – 1 టేబుల్ స్పూన్, కీరదోస గుజ్జు – 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, ఆర్గన్ ఆయిల్ – అర టీ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది) తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మట్టి, కీరదోస గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో రోజ్ వాటర్, ఆర్గన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని, 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్స్
కొబ్బరి పాలలో అరటిపండు గుజ్జుని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఒక స్పూను తేనెలో కొద్దిగా పెసరపిండి, అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం తేమగా, కాంతివంతంగా ఉంటుంది. -
వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంకండి
–ఇరిగేషన్ యంత్రాంగానికి సీఈ పిలుపు ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఇరిగేషన్ యంత్రాంగానికి గోదావరి డెల్టా సీఈ వారా వీర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ధవళేశ్వరం సీఈఆర్పీ గెస్ట్హౌస్లో ఫ్లడ్ మీటింగ్ను హెడ్వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వీర్రాజు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈ వీర్రాజు మాట్లాడుతూ వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు మాట్లాడుతూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాటన్బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీచేసినప్పుడు ముంపునకు గురిఅయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలన్నారు. హెడ్వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు మాట్లాడుతూ బలహీనంగా ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలను చేపడతామన్నారు. కూళ్ళ, సుందరపల్లి, ప్రాంతాల్లో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్లడ్స్టోర్స్కు సంబంధించి మెటిరీయల్స్కు ఇప్పటికే టెండర్స్ను ఖరారు చేశామని ఈ నెలాఖరు నాటికి అన్ని ఫ్లడ్స్టోర్స్లోను సామగ్రిని పూర్తిస్థాయిలో ఉంచుతామన్నారు. షట్టర్ల నిర్మాణం జరగాల్సిన ఉన్నచోట్ల తాత్కాలిక రక్షణచర్యలను చేపడతామన్నారు. కార్యక్రమంలో తూర్పు డివిజన్ఈఈ అప్పలనాయుడు, సెంట్రల్ డివిజన్ ఈఈ సుధాకర్, పలువురు డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
విమానంలో హెడ్ఫోన్ పేలితే..
గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తిన వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళ...ఇయర్ ఫోన్స్ లో సంగీతం వింటుండంగా సడన్ గా పేలిపోవడం ఆందోళకు దారి తీసింది. విమానాల్లో బ్యాటరీతో పనిచేసే పరికరాల ప్రమాదాల గురించి తరచూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ ఈ సంఘటన చోటు చేసుకుందని బుధవారం అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 19న బీజింగ్ నుంచి మెల్బోర్న్ వస్తుండగా ఓ మహిళ ఆ హెడ్ ఫోన్స్ అకస్మాత్తుగా పెద్ద శద్దంతో పేలిపోయాయి. మ్యూజిక్ వింటుండగా సడెన్ పేలిపోయాయయనీ, చిన్న చిన్న నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని దీంతో నా ముఖమంతా కాలిపోతున్న అనుభూతి కలిగిందని తెలిపింది. తన మెడచుట్టూ ఉన్న హెడ్ ఫోన్ ఒక్క ఉదుటున విసిరికొట్టానంటూ తన భయంకర అనుభవాలను ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో కి నివేదించింది. దీంతో పాటు నల్లబడిన ముఖం , చేతులు, మెడపైన బొబ్బల్ని అధికారులకు చూపించిందా మహిళ. విమాన సహాయకులు వచ్చి బకెట్ నీళ్లు గుమ్మరించినా, అప్పటికే బ్యాటరీ, దాని కవరు మొత్తం కరిగిపోయి ఫ్లోర్కు అతుక్కుపోయిందని చెప్పింది. అలాగేకరిగిన ప్లాస్టిక్, కాలిన ఎలక్ట్రానిక్స్, కాలిన జుట్టు లాంటి వాసనను తోటి ప్రయాణికులు భరించలేకపోయారని తెలిపింది. మొత్తం అక్కడున్నవారంతా దగ్గుతూ ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారని చెప్పింది. కాగా విమానాల్లో ఇటీవల ఇలాంటి పేలుళ్ల ఘటనలు బాగా పెరిగాయి. విమాన ప్రయాణాల్లో బ్యాటరీలతో పనిచేసే డివైస్ లను సంబంధిత లగేజ్ ఏరియాలలో దాచి పెట్టడం లేదా వాడకుండా ఉండడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విచారణలో లిథియం బ్యాటరీ మూలంగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తేల్చారు. -
ఎస్వీయులో హాస్టల్ గదుల కోసం విద్యార్థుల పాట్లు
-
నిమిషాల్లో ఏటిఎంలల్లో డబ్బు అయిపో్తుంది
-
చిల్లర కోసం జనం ఇక్కట్లు